breaking news
Palnadu District Latest News
-
తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్గా శ్రీనివాస్
తెనాలి: తెనాలి ఇన్ఛార్జి సబ్కలెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ బాధ్య తలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతు చేపట్టారు. దీనితో ఇన్ఛార్జి సబ్కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. క్వారీ తిరునాళ్లపై సమీక్ష స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డివిజనులోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ ఈవో హాజరయ్యారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్తో కో–ఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
క్షీణించిన శాంతిభద్రతలు
తిరుమల లడ్డూ విషయమై టీడీపీ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు తెర లేపారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి ఉదాహరణ అంబటి ఇంటిపై దాడే. పోలీసులు దగ్గర ఉండి దాడులను ప్రోత్సహించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు. కొన్ని గంటలపాటు గుంటూరులో అశాంతిని నెలకొల్పారు. దాడులను పూర్తిగా ఖండిస్తున్నా. వెంటనే అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసులు అండతో ఇలాంటి హింసలకు పాల్పడటం సరికాదు. రాంబాబుకు ప్రాణహాని ఉంది. ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్సార్సీపీ ఆయనకు అండగా నిలుస్తుంది. – నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే -
పల్నాడు
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3500, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇసప్పాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి రామయ్య, జయశ్రీ దంపతులు రూ.1,11,116 విరాళంగా అందజేశారు. -
దర్శి కమిషనర్ గృహాలపై ఏసీబీ దాడులు
● ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు గుర్తింపు ● 729 గ్రాములు బంగారం, 9 కిలోల వెండి స్వాధీనం నరసరావుపేట: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో ప్రకాశం జిల్లా దర్శి ధర్డ్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ యడల మహేశ్వరరావు నివాస గృహాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు...ఈ దాడుల్లో అతను ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లుగా గుర్తించామన్నారు. దర్శిలోని అతని కార్యాలయం, నరసరావుపేట, సత్తెనపల్లిలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులకు సంబంధించి తొమ్మిది ఇళ్ల స్థలాలు, రెండు నివాస గృహాలు, 89 సెంట్ల వ్యవసాయ భూమిని గుర్తించారు. చరాస్తులకు సంబంధించి రూ.2.60 లక్షల నగదు, రూ.55వేల బ్యాంకు బాలెన్స్, 729 గ్రాముల బంగారు ఆభరణాలు, 9.275 కేజీల వెండి, ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. తన అక్రమ ఆస్తులను భార్య, కుమారుడు, తల్లి పేరిట కొనుగోలు చేశాడు. ● సత్తెనపల్లిరోడ్డులోని సాయినగర్లో గల రామా డ్రీమ్ హోమ్స్ అపార్టుమెంట్ 101 ప్లాట్లో మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటుంది. దాడి సమయంలో మహేశ్వరరావు ఇంటిలో లేరు. ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమారు 10మంది సభ్యులు గల ఏసీబీ బృందం ఇంటి మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ● దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడి కోడలు వ్యవహరిస్తూ ఇక్కడే నివాసం ఉంటుండగా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిపై ఏసీబీ దాడి జరగటం గమనార్హం.. ● మహేశ్వరరావు 1998లో కారుణ్య నియామకంపై బిల్లు కలెక్టర్గా సత్తెనపల్లిలో పనిచేశారు. 2014–19 మధ్యకాలంలో నరసరావుపేట పురపాలక సంఘంలో ఆర్ఐగా పనిచేస్తూ ఆర్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లి, వినుకొండ పురపాలక సంఘాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. రెవెన్యూ ఆఫీసర్గా వినుకొండలో పనిచేస్తూ పదోన్నతిపై దర్శి మున్సిపాల్టీకి ఇన్చార్జి కమిషనర్గా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. -
ప్రశ్నిస్తే చంపేస్తారా?
టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే చంపేస్తారా? టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ విచారణలో వెల్లడిస్తే టీడీపీ నాయకుల తీరు దారుణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తే ఇంత దారుణంగా దాడులు చేస్తారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గతంలో వంగవీటి మోహన రంగను ఏ విధంగా పొట్టన పెట్టుకుందో... ఆ విధంగా అంబటి రాంబాబును చేయాలనే ఆలోచనతో ఉంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – కాసు మహేష్ రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం
నరసరావుపేట టౌన్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన డి.మల్లికార్జునరావు(35) మార్కెట్ సెంటర్ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ రాజమోహనరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 15వ వర్థంతి సభలో వక్తల నివాళి నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ తదితరులు మాట్లాడారు. -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
సబ్ జూనియర్ విభాగంలో గుంటూరు ఎడ్లకు ప్రథమస్థానం రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరిగాయి. సబ్ జూనియర్ విభాగంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎద్దులు 3,606 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ. 90 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 3,300 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 70 వేలు, తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన పెదకొత్తపల్లికు చెందిన వి.శ్రావన్కుమార్, చంద్రకళ ఎడ్లు 3,080.8 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 50 వేలు, వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యామిని మోహన్ శ్రీ కంబైన్డ్ ఎడ్లు 3,057.2 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 35 వేలు, హైదరాబాద్కు చెందిన డి.రోహన్బాబు ఎడ్లు 3,008.9 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బొడపాటి రామకృష్ణ, జడ్డు రాజేష్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు. -
జిల్లా మత్స్యశాఖ అధికారిగా ప్రసాద్
నరసరావుపేట: మత్స్యశాఖ పల్నాడు జిల్లా అధికారిగా బి.ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ రామశంకరనాయక్ ఉప జిల్లా అధికారిగా ఉన్న ప్రసాద్కు జిల్లా పూర్తి బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంజీవరావును కోర్టు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన విషయం విధితమే. నియమ నిబంధనలు పాటించకుండా విధులు నిర్వహించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జిల్లా అధికారి సంజీవరావుతోపాటు ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి భాగ్యలత, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కూడా సస్పెండ్ అయినట్లు జిల్లా అధికారి ప్రసాదు వెల్లడించారు. -
రైతులే స్వయంగా సాగు వివరాలు నమోదు చేయాలి
పెదకాకాని: రైతులు వారి మొబైల్ ఫోన్ ద్వారా సాగు వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ అన్నారు. పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఏపీ ఎయిమ్స్ (ఏపిఎఐఎంఎస్) అనే యాప్ని రైతులు వారి మొబైల్ ఫోన్లో స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. యాప్లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు పండించిన పంటను తనంతట తానే నమోదు చేసుకునే విధానాన్ని బోయపాటి రమేష్ ద్వారా చేయించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి కలుపు మందుల పిచికారి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుగుమందుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కలుపును తీయిస్తే అయ్యే ఖర్చు, పురుగుమందుల ద్వారా కలుపు నివారణకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నారు. సబ్సిడీపై ఆయిల్ ఇంజన్లు, పైపులు ఇప్పించాలని రైతులు కోరారు. అనంతరం వెనిగండ్ల గ్రామాన్ని సందర్శించి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా మట్టి నమూనాలను సేకరించటం, ఆన్లైన్ అప్లోడ్ చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామ రైతు పులగం రామిరెడ్డితోపాటు పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, పైపులు, నల్ల పట్టాలు, సిర్పాలిన్ పట్టాలు సబ్సిడీపై అందించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఐ.నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ మోహన్రావు, ఏఓ కె రమణకుమార్ పాల్గొన్నారు. -
చంద్రబాబువి నీచ రాజకీయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేరాఫ్గా నిలుస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు దాడికి యత్నించడమే కాకుండా ఆయన నివాసంపై దాడికి దిగడం దుర్మార్గం. దీనిని ఖండిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. సీబీఐ నివేదిక చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినప్పటికీ పదేపదే దుష్ప్రచారం చేయడం, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించడం దారుణం సార్వత్రిక ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు ఎందుకు దాడికి యత్నించాయి? ఈ దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుస్తోంది. ప్రత్యర్థులపై బురదచల్లడం చంద్రబాబు మానుకొని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలి. మాజీ మంత్రి అంబటి నివాసంపై దాడి ప్రభుత్వం చేసిన దాడిగా భావిస్తున్నాం. – డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త -
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి: అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ శనివారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి జస్టిస్ గీతామిట్టల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వేంచేసియున్న సుభద్ర బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం శ్రీరాధాకృష్ణుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కారెంపూడి: కారెంపూడి పీహెచ్సీని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మాధవీలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ ఓపీ వారికి అందుతున్న వైద్య సేవల గురించి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ జి. రమ్య, డాక్టర్ కె. లక్ష్మీమౌనికలను అడిగి తెలుసుకున్నారు. స్పర్శ కార్యక్రమం కింద కుష్ఠువ్యాధి లేని సమాజాన్ని చూసేందుకు సంబంధిత శాఖ ఉద్యోగులు అందరూ కృషి చేయాలని కోరారు. సీహెచ్ఎ మల్లయ్య, ఉద్యోగులతో అడిషినల్ డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. బాపట్ల: బాపట్ల జిల్లా గనులు–భూగర్భ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా గనులు–భూగర్భ విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన శనివారం బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
తిరుమల ప్రసాదానికి బాబు చేసింది ఘోర అపచారం
గుంటూరు రూరల్: తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అబద్ధం చెబితే దానిని నిజం చేసేందుకు పవన్కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మం పేరుతో మరిన్ని అబద్దాలను పలికాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మండలంలోని గోరంట్ల గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై చంద్రబాబు, పవన్కల్యాణ్లు చేసిన అబద్దపు ప్రచారానికి పాప పరిహారంగా బాబుకు బుద్ధి రావాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందన్నారు. సీబీఐ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని తేలిందన్నారు. లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి అబద్దపు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు నేడు సీబీఐ విచారణ తరువాత నోరు మెదపటంలేదన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీశామని గుర్తించి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ, మరలా అబద్దపు ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా వేంకటేశ్వరస్వామి పవన్కల్యాణ్కు, చంద్రబాబుకు బుద్ది ప్రసాదించాలని కోరారు. దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబి, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు పరీక్షలు చేసి చంద్రబాబు ఆరోపించిన ఎటువంటి కొవ్వు గానీ, గొడ్డు కొవ్వుకానీ, పంది కొవ్వుకానీ తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని నివేదికను ఇచ్చాయన్నారు. దీంతో తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు మరో డ్రామా అబద్దాల డ్రామా మొదలుపెట్టాడన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
పిడుగురాళ్లలో ఖాకీచకం!
పిడుగురాళ్ల రూరల్: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మాబును పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో మాబు తన టైర్ల దుకాణంలో ఉండగా పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ మోహన్ తన సిబ్బందితో కలిసి మఫ్టీలో వచ్చి మాబును స్టేషన్కు రావాలని పిలవగా ఎందుకు రావాలని.. తనపై ఎవరు, ఏం కేసు పెట్టారని, వారెంట్ చూపించాలని కోరాడు. తమ మా వెంట వస్తే పద్ధతిగా ఉంటుందని చెప్పి పోలీసులు మాబుని లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎంతసేపటికీ మాబు రాకపోవటంతో పోలీసులు అందరు చూస్తుండగానే మాబుపై దాడికి దిగారు. వెంటనే మాబు వాళ్ల అన్న షేక్ నన్నె సైదా మా తమ్ముడిని ఎందుకు తీసుకొని వెళ్తు న్నారని పోలీసులను ప్రశ్నించగా నిన్ను కూడా లోపల వేస్తాం, అప్పుడు తెలుస్తుంది.. ఎందుకు తీసుకొని వెళ్తున్నామో అని అన్నదమ్ములను బలవంతంగా అక్కడే ఉన్న సీఐ కారులోకి ఎక్కించారు. బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి మాబు, మాబు వాళ్ల అన్న నన్నె సైదాను పోలీసులు తీసుకొని వెళ్లారు. వెంటనే మాబు తమ్ముడు జానీ సీఐకి ఫోన్ చేసి మా అన్నలను ఎందుకు అరెస్టు చేశారని ఫోన్లో వివరాలు అడగ్గా.. మీ అన్నయ్యలను అక్కడే దించామని వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టాశాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఐ, ఎస్ఐలకు ఫోన్ చేయగా.. స్పందించలేదు. హైకోర్టులో హెబియస్కార్పస్ పిటిషన్.. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాబు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తమ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మాబు, అతని సోదరుడు నన్నె సైదాలను పోలీసులు మఫ్టీలో వచ్చి కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్లారని, వారు ఏమయ్యారో తెలియజేయాలని హైకోర్టులో హెబియస్కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యాంబాబు నరసరావుపేట టౌన్ : జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యామ్బాబు తెలిపారు. మార్చి 14న నిర్వహించే అదాలత్ను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక న్యాయాధికారులతో కోర్టు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, ఫైనాన్స్ రికవరీ కేసులు, చెక్కు బౌన్న్స్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువ మంది కక్షిదారులకు లబ్ధి చేకూర్చేలా చొరవ చూపాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా కాకుండా ఉభయ పక్షాల అంగీకారంతో వివాదాలను సామరస్యంగా ముగించుకోవడానికి ఈ లోక్ అదాలత్ ఒక చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు కె. మధుస్వామి, ఆశీర్వాదం పాల్, ఏ.సలోమి తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తెనాలిటౌన్: పట్టణ షరాఫ్బజార్లోని శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్కుమార్లు మాట్లాడుతూ ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి సువర్చలా హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ, తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవం దాచేపల్లి: లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక చాపలగడ్డ బజారులో జరిగిన అమ్మవారి కల్యాణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అభిషేకాలు చేసి అమ్మవారి గీతాలను మాలధారులు అలపించారు. అమ్మవారి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులు, మాలధారులకు అందించారు. కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సైదులు, గురుస్వామి బ్రహ్మయ్య, మౌలాలీ, గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు స్వామివారి తెప్పోత్సవం మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థనంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు స్వామివారి దేవస్థానం నుంచి బయలు దేరి సీతానగరం ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకుని, శ్రీ స్వామి వారి అమ్మవార్ల తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
మహిళ ముక్కు కోసిన ఇద్దరు అరెస్టు
పిడుగురాళ్ల: కోడి కత్తితో మహిళ ముక్కు కోసి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని లెనిన్ నగర్లో ఈ నెల 22వ తేదీన మహిళ ముక్కు కోసి పరారైన వ్యక్తులను పట్టణ ఎస్ఐ శివనాగరాజు తన సిబ్బందితో పట్టుకున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన కంపా వెంకట్రావుకు చెరుకూరి మరియమ్మతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల మనస్పర్థలు ఏర్పడి నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. మరియమ్మను చంపేందుకు బంధువైన కంపా నగేష్తో కలిసి వెంకట్రావు కోడికత్తి తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. మరియమ్మను నగేష్ రెండు చేతులు వెనక్కి పట్టుకోగా గొంతుపై కత్తితో కోసేందుకు వెంకట్రావు ప్రయత్నించాడు. తోపులాటలో మరియమ్మ ముక్కు తెగింది. దీంతో వారు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ శివనాగరాజు, మోహన్, సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాలు.. సత్తెనపల్లి మండలం కంటేపూడి సమీపంలోని కళాశాలలో చిత్తూరు జిల్లా ఎన్జీ గూడెంకు చెందిన వి.భరణి (19) బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. తన స్నేహితుడు దాచేపల్లికి చెందిన దాసరి గణేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని కొమెరపూడి వైపు వెళుతుండగా అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. భరణి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గణేష్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలి పథకం ప్రకారమే దోపిడీ
పిడుగురాళ్ల: స్నేహితురాలే దోపిడీకి పథకం రచించి అమలు చేసినట్లు తేలిందని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించామని తెలిపారు. దాచేపల్లి నుంచి వీరాపురం గ్రామానికి కూలి పనుల నిమిత్తం వెళ్తున్న సీతమ్మను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి బంగారు గెలుసుతోపాటు ఆమె పక్కనే స్నేహితురాలు కొల్లి శిరీష ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో శిరీషను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తనతోపాటు పొలానికి వచ్చే సీతమ్మ మెడలో బంగారు గొలుసు చూసి దోపిడీకి పథకం రచింంచింది. అందులోభాగంగా తెల్లవారుజామున ఐదు గంటలకు సీతమ్మను తన వెంట పొలానికి తీసుకొని వెళ్లింది. స్నేహితుడు వినుకొండ సురేష్, వినుకొండ అశోక్ల సహకారంతో సీతమ్మ నోరుమూసి బంగారు గెలుసు దోచుకెళేల్లా పథకం అమలు చేసింది. అనుమానం రాకుండా శిరీషకు చెందిన్ సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు మోహన్, శివనాగరాజు, సిబ్బంది సమావేశంలో ఉన్నారు. -
టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
నరసరావుపేట: తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు అబద్ధమని దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో నిరూపతమైన దృష్ట్యా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్లానలిస్టు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి మాట్లాడారు. ● శనివారం బరంపేటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పార్టీ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయ కొట్టి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు వేసిన నిందను పూర్తిగా తొలగించమని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తామని పేర్కొన్నారు. -
కొండవీడు ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
యడ్లపాడు: ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చెప్పారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు విషయంపై శుక్రవారం చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయి సందర్శన చేశారు. కోటలోని చారిత్రక కట్టడాలు, చెరువులు, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం కొండవీడు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలను తనిఖీ చేశారు. రద్దీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ కొండవీడు ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పల్నాడు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాల రద్దీ పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రించి, పార్కింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన మలుపులు, లోతైన చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ, పర్యాటక తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోటను సందర్శించిన పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు -
పల్నాడు
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 36.8230 టీఎంసీలు. అమ్మవారికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):పొన్నెకల్లుకు చెందిన ఎనకొల్లు శివాజీ కుటుంబం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి నిత్యాన్నదానాని కి రూ.1,11,111 విరాళాన్ని అందజేశారునిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3200, గరిష్ట ధర రూ.3800, మోడల్ ధర రూ.3400 వరకు పలికింది. 7 -
అప్పుల కుప్ప!
సత్తెనపల్లి: జిల్లాలో 28 మండలాలు ఉండగా 520 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో కేవలం దాచేపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, మాచవరం మండలాలు మాత్రమే పన్ను వసూళ్లలో ముందు వరుసలో ఉన్నట్లు ఈ నెల 29 నాటి గణాంకాలు చెబుతున్నాయి. బొల్లాపల్లి, అచ్చంపేట, ఈపూరు మండలాలు పన్ను వసూలులో చివరి వరుసలో ఉన్నాయి. ఈ మండలాల్లో ఆశించిన మేర వసూళ్లు కనిపించడం లేదు. ఏటా రూ. కోట్లల్లో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తాయి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నారు. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం వాటి ద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికి తోడు వసూలు చేయాల్సిన ఇంటి పన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది. వసూళ్లలో దాచేపల్లి అగ్రస్థానం .. బొల్లాపల్లి చివరి స్థానం .... పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధుల తోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకట లాడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేని కోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది. కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్ను ల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.డివిజన్ అసెస్మెంట్లు ఏరియర్స్ లక్షల్లో కరెంట్ లక్షల్లో మొత్తం లక్షల్లో గురజాల 1,22,952 రూ. 209.36 రూ. 561.87 రూ. 771.23 నరసరావుపేట 1,41,482 రూ. 323.39 రూ. 601.66 రూ. 925.05 సత్తెనపల్లి 1,33984 రూ. 456.54 రూ. 604.55 రూ.1061.69 మొత్తం 3,98,418 రూ. 989.29 రూ.1768.08 రూ.2757.37 -
ఒడిశా కార్మికుడి బలవన్మరణం
నాదెండ్ల: ఒడిశా కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశాకు చెందిన కార్మికుడు రణబిడఅరుణ్ (36) నాలుగు నెలలుగా స్థానిక ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 28న తనకు ఆరోగ్యం బాగాలేదని, మీరు ఇక్కడకు వచ్చి తనను తీసుకెళ్ళాలని ఫోన్లో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేరోజు తాను ఒడిశాకు వెళ్తున్నట్లు కంపెనీ అధికారులకు తెలియపరిచి బయటకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న పాత గోల్డెన్ టుబాకో కంపెనీలోకి వెళ్లి ఐరన్రాడ్కు వైరుతో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున 5.30 గంటలకు కంపెనీ వాచ్మెన్ నాగరాజు విద్యుత్ లైట్లు ఆపేందుకు వెళ్ళగా మృతదేహాన్ని చూసి కంపెనీ యాజమాన్యానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురు నాయకుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టూడెంట్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాచర్లకు చెందిన పొట్టిపోగు రూత్బాబు, ఐటీ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గురజాలకు చెందిన బొడ్డపాటి రాజశేఖరరెడ్డి, మహిళా విభాగ జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా గురజాలకు చెందిన వజ్రాల భ్రమరాంబ, సత్తెనపల్లి నియోజకవర్గ వాలంటీర్ల వింగ్ అధ్యక్షులుగా సత్తెనపల్లికి చెందిన యడలపురపు శ్రీనాథ్ నియమితులయ్యారు. రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం భీమవరం రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని సంఘం బజార్కు చెందిన పెయింటర్ గైక్వాడ గోపీనాథ్ (29) మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యం మానేసినప్పటికీ తిరిగి రావడం లేదని, మానసిక పరిస్థితి బాగాలేక పోవటంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వెళ్తూ అత్త మృతి సత్తెనపల్లి: అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వస్తూ అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ నుంచి పాకాలపాడు శివారు మార్గంలో శుక్రవారం జరిగింది. వివరాలు... క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన సిద్దిల మరియమ్మ అలియాస్ మేరమ్మ (50)కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. కుమార్తెను సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. పెద్దకర్మకు సంబంధించిన సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తన వరుసకు చెల్లి, మరిది అయిన ఇరువురితో కలిసి మరియమ్మ ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తోంది. అదే సమయంలో మట్టి ట్రాక్టర్ పాకాలపాడు శివారు వద్ద ఢీకొంది. మరియమ్మ తలపై నుంచి ట్రాక్టరు టైర్ వెళ్లడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఉపాధి’లో కాసుల పంట
నకరికల్లు:తప్పుల మీద తప్పులుచేస్తున్నారు... స్పృహలో ఉండి చేస్తున్నారా.. లేక ఎవరూ కనిపెట్టలేరని చేస్తున్నారా... ఉపాధి లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారంటూ డ్వామా పీడీ ఎం.సిద్ద లింగమూర్తి ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. నకరికల్లులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.7.28 కోట్ల విలువైన ఉపాధి పనులపై నెలరోజులపాటు సామాజిక తనిఖీ చేపట్టి గుర్తించి అంశాలపై ప్రజావేదిక నిర్వహించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలివే.. సామాజిక తనిఖీ బృందాలు తన తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కుంకలగుంటలో ఎర్రనల్ల చెరువులో ఒకే వర్క్ ఐడీతో పనిచేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆరు వర్క్ ఐడీలు సృష్టించి సుమారు రూ.27 లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల్లో క్షేత్రస్థాయి లో పనులు జరిగిన ఆనవాళ్లు లేకుండానే బిల్లు ల చెల్లింపులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. లేని పనులకు ఎంబుక్లు కొలతలు నమోదు చేయడంపై టెక్నికల్, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా చెల్లింపులు చేసినట్లు బహిర్గతమైంది. కొలతల్లో భారీ తేడాలు, చేయని పనులు చేసి నట్లు సృష్టించడం, పనిదినాల కన్నా తక్కువ లేదా ఎక్కువరోజులకు చెల్లింపులు, ఒకేరకమైన సంతకాలతో చెల్లింపులు, ఉద్యోగుల పేరి ట కూలి చెల్లింపులు, రైతుల సంతకాలు లేకుండా, చేపట్టిన పనులకు ఫొటోలు కూడా లేకుండా పంటకాలువ పనులకు బిల్లులు, ఊళ్లలో లేకుండా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పేరిట బిల్లుల చెల్లింపులు చేపట్టడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు.ప్రధానంగా మట్టిరోడ్ల నిర్మాణంలో వందల మీటర్ల మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా తే డాలు, నిధులు స్వాహా, దుర్వినియోగంపై రికవరీ, విచారణ, శాఖాపరమైన కఠినచర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఓఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తిపేరుతో కూడా ఉపాధికూలీ చెల్లింపులు చేసినట్లు తేల్చడం, మరో పాఠశాలలో ఉపా ధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు తో కూడా చెల్లింపులు జరిగినట్లు తేల్చారు. కొన్నిపనుల కు మస్టర్లు మాయమైనట్లు తేలింది. డిస్ట్రిక్స్ విజిలెన్స్ అధికారి హీరాలాల్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి విజయకుమారి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రభాకర్, ఎస్ఆర్పి తులసీనాయక్, ఏపీడీ పి.వి.నారాయణ పాల్గొన్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.7.28 కోట్ల మేర పనులపై ప్రజావేదిక నిర్వహిస్తుంటే వేదిక ముందు కుర్చీలు ప్రజలు లేక వెలవెలబోయాయి. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు లేక నకరికల్లులోని ప్రజావేదిక నీరుగారింది. ఉపాధిహామీ సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. -
దిగజారుడు రాజకీయం చంద్రబాబుకే సాధ్యం
పిడుగురాళ్ల: దేశంలోనే దిగజారుడు రాజకీయం చేయటం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, సాక్షాత్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలతో తప్పుడు ఫ్లెక్సీలను వేసి ఆ విషయాన్ని నిరూపించుకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీస్స్టేషన్ సెంటర్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో దిగజారుడుతనం చూస్తున్నాంగానీ, ఇంతటి చిల్లర రాజకీయం దేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు తాను అన్ని విధాలుగా విఫలం అయ్యానని తెలుసుకుని సాక్షాత్తూ ఆ దేవదేవుడు వెంకన్న స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారని మండిపడ్డారు. ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అన్నారు, చెప్పరాని పదాలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పద్ధతి మారలేదన్నారు. మాట మార్చిన కూటమి నేతలు ఇప్పుడు కొత్తగా ఇది కాదని, కెమికల్స్ ఉన్నాయని... ఏది పడితే అది మాట్లాడటం కూటమి నేతల దిగజారుడు రాజకీయానికి అద్దం పట్టిందన్నారు. ఏ పార్టీ నాయకులైనా ఆ పార్టీ అధిష్టానం, వారు నిర్వహించిన అభివృద్ధి గురించి బ్యానర్లు వేసుకుంటారని గుర్తుచేశారు. గత 20 నెలలుగా చేసిందేమీ లేక చివరికి లడ్డూలో ఏదో కలిసిందని తప్పుడు ప్రచారంతో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచార ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఎవరు వేశారో తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ పార్టీ కార్యకర్తలే వాటిని తొలగించారని తెలిపారు. బాధ్యులపై తమ ప్రభుత్వం రాగానే నాన్బెయిల్బుల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేశారో ఫ్లెక్సీలలో వేయాలని, లడ్డూ చూపించి ఫ్లెక్సీలను వేసుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగటం దారుణం వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
వినుకొండ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు, అత్యున్నత ర్యాంకులు లక్ష్యంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో పీవీజే రామారావు పాల్గొని మాట్లాడుతూ పరీక్షలకు మిగిలి ఉన్న 45 రోజుల సమయాన్ని విద్యార్థులు అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. లక్ష్యంతో, సరైన ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవోలు జఫ్రుల్లా, కె.పార్వతి, జి.చిన్నపరెడ్డి, ఎం.సాంబశివరావు, ఎన్. రవిచంద్ర, ఎ.లలిత కుమారి, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఈవో రామారావు -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
13 వాహనాలు స్వాధీనం నకరికల్లు : వాహన దొంగలను అరెస్ట్ చేసి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కె.సతీష్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నకరికల్లులోని సినిమాహాలు వీఽధిలో ద్విచక్రవాహనం చోరీ జరిగిందని వచ్చిన ఫిర్యా దు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో ఇద్దరు మైనర్లతో పాటు నరసరావుపేటకు చెందిన ఉద య్, గోపిలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి 13 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. పేకాట స్థావరంపై దాడి 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పిడుగురాళ్ల: పేకాట ఆడుతున్న స్థావరంపై పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్గేట్ సమీపంలో ఉన్న హోటల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల పట్టణ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు పేకాట రాయుళ్లు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. దీంతో పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్లు ఒక్కసారిగా దాడులు నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,40,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హోటల్ కేంద్రంగా నిర్వాహకులే పేకాట ఆడిస్తున్నట్లు కొంత మేరకు సమాచారం ఉందని, ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎన్యూ లైబ్రరీకి వేటూరి పుస్తకాలు బహూకరణ ఏఎన్యూ(పెదకాకాని): సినీ సినీయేతర సాహిత్య రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్య పుస్తకాలను ఆయన కుమారులు శనివారం వర్సిటీలోని గ్రంథాలయానికి బహూకరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన వేటూరి సుందర రామమూర్తి రచించిన సాహిత్య పుస్తకాలు దొరకునా ఇటువంటి సేవ, మానసవీణ మధుగీతం, నవమి నాటి వెన్నెల, ఎడారిలో కోయిల, ఝుమ్మంది నాదం, ఎరక్కపోయి వచ్చాను వంటి పుస్తకాలను వేటూరి కుమారులు వేటూరి రవి ప్రకాష్, వేటూరి చంద్రశేఖరరావులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీకి స్వయంగా విచ్చేసి బహూకరించారు. గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ కోడెల వెంకట్రావు నేటి యువతకు ఈ సాహిత్య పుస్తకాలు, సాహిత్య పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిడుగురాళ్ల: పిచ్చి కుక్క స్వైర విహారంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతల శృతి అనే చిన్నారి స్థానిక హైస్కూల్ సమీపంలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖంపై గాయపరిచింది. మరో చిన్నారిని వీపుపై గాయం చేసింది. ఇద్దరు చిన్నారులకే కాకుండా అటుగా వెళ్లే ఇద్దరు మహిళలతోపాటు ఎస్సీ కాలనీకి చెందిన వంగపూరి హారిక మెడ బాగాన, వీపు బాగాన గాయపరిచింది. వీరితోపాటు బీసీ కాలనీకి చెందిన మరో ఇద్దరిపై దాడి చేసి కలవర పరిచింది. మొత్తం ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఆరుగురికి గాయాలు -
రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల విజేత వేటపాలెం
పిడుగురాళ్ల: మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి 70వ తిరునాళ్లను పురస్కరించుకొని గురువారం రెండు పళ్ల విభాగం ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఎడ్ల బలప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరిషాచౌదరి, శివకృష్ణ చౌదరికి చెందిన ఎడ్లు 3800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. మోర్జంపాడుకు చెందిన తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మొదటి బహుమతి అందించారు. మాచవరం మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గంటా రమ్యానాయుడుకు చెందిన ఎడ్లు 3593 అడుగులు లాగగా.. చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుట్ల గ్రామానికి చెందిన మౌలా త్రివేణి నాయుడుకి చెందిన ఎడ్లు 3305 అడుగులు దూరం లాగాయి. ఈ రెండీటికి కలిపి ద్వితీయ బహుమతిని కేటాయించారు. వీరికి రూ. 20 వేల నగదును నీలం శ్రీనివాసరావు, బడిగుంచ్చల వెంకట నర్సయ్య, కొరముట్ల వెంకట నర్సయ్య, కొలిశెట్టి శ్రీనివాసరావులు అందించారు. అలాగే చిలకలూరిపేట మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గుత్తా వెంకాయమ్మలకు చెందిన ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి మూడవ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. వీరికి గాను రూ.15 వేల నగదును బడిగుచ్చల వెంకటేశ్వర్లు అందించారు. తాటికొండ మండలం ముక్కాముళ్ల గ్రామానికి చెందిన కొర్ర వెంకయ్య ఎడ్ల జత 2800 అడుగుల దూరం లాగి నాల్గొ స్థానంలో కై వసం చేసుకున్నాయి. రూ. 10 వేలను జోకా అమరలింగేశ్వరరావు, నరేష్లు అందించారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన నల్లూరి నరసింహారావుకి చెందిన ఎడ్ల జత 2270 అడుగుల దూరం లాగి 5వ స్థానం సాధించాయి. వీరికి గాను రూ.8 వేలను బొమ్మళ్ల నాగరాజు, నవీన్లు అందించారు. అదేవిధంగా ఏడోస్థానం వరకు నిలిచిన ఎడ్లకు బహుమతులు లభించాయి. ఎడ్ల ప్రదర్శన తిలకించేందుకు రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
మట్టిలో మాణిక్యం సుకేష్
పెదకాకాని: తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం. తోడబుట్టిన వాడు పెయింటర్. ఉన్నత ఆశయం, పట్టుదల, నిరంతర కృషితో 43 రోజుల కిందట కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ట్రైనింగ్లో ఉండగానే ఈనెల 28న ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఉత్తీర్ణత డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం సాధించాడు. పెదకాకాని మండలం తంగెళ్లమూడికి చెందిన బద్దెపూడి సుకేష్. గ్రామంలోనే మొట్టమొదట గ్రూపు–2 ఉద్యోగం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. రెండు నెలల వ్యవధిలో రెండు ఉద్యోగాలు.. మండలంలోని తంగెళ్లమూడి గ్రామానికి చెందిన బద్దెపూడి మోషే, సునీత దంపతులకు ఇద్దరు సంతానం. మోషే వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా తల్లి సునీత స్థానిక నర్సరీలో కూలి పనులకు వెళుతుంది. వారిలో పెద్దవాడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. రెండవ సంతానం సుకేష్ బీఎస్సీ పూర్తి చేసి కాకినాడలో మూడేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. 2025 డిసెంబరు 16వ తేదీన కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ తీసుకుని 21వ తేదీన ట్రైనింగ్ నిమిత్తం తిరుపతి వెళ్లాడు. ఈనెల 28వ తేదీన విడుదలైన గ్రూపు–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వరించింది. తంగెళ్ళమూడి గ్రామంలోనే మొట్ట మొదటిసారిగా సుకేష్ గ్రూపు 2 ఉద్యోగం రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ ఈ విజయం తన తల్లిదండ్రులు, అన్నయ్య, మామయ్యలకు అంకితమన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్గా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. -
పచ్చ మార్క్ పోస్టింగులు
గుంటూరు ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తీ చేయడంలో టీడీపీ సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పాఠశాలలకు శాపంగా మారింది. రెగ్యులర్ ఎంఈవో పోస్టుల్లో సీనియార్టీ ప్రాతిపదికన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ)పై నియమించాల్సి ఉండగా, విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవోలపై పని భారాన్ని తగ్గిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మండలానికి కొత్తగా ఎంఈవో–2 పోస్టును మంజూరు చేశారు. ఈ విధంగా ఎంఈవోల విధులను విభజించి, బండెడు చాకిరీ నుంచి వారికి ఉపశమనం కలిగించారు.గుంటూరు జోన్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 147 మండలాల్లో ఎంఈవో–1, 2 పోస్టుల్లో పని చేస్తున్న వారు ఎవరి బాధ్యతలు వారు నిర్వరిస్తున్నారు. అయితే ఉద్యోగ విరమణతో ఖాళీగా మారిన ఎంఈవో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడంతో ఆయా ఖాళీల్లో హైస్కూల్ హెచ్ఎంలను ఎఫ్ఏసీలుగా నియమించడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఎంఈవో–1లుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన సమయంలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎంఈవోలుగా వేర్వేరు మండలాలకు వెళ్లిపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించడంతో ఆయా పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు కరువయ్యారు. రాజకీయ సిఫార్సులతో గుంటూరులోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ద్వారా కొనసాగుతున్న ఈ వ్యవహారం ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టదాయకంగా మారింది. గుంటూరు జోన్ పరిధిలోని 147 ఎంఈవో–1 పోస్టుల్లో రెగ్యులర్ ఎంఈవోలు 30 మంది ఉండగా, మిగిలిన వారిలో హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి వివిధ మండలాలకు ఎంఈవో–1లుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదు. వేతన బిల్లుల డ్రాయింగ్తో పాటు పాఠశాలల పర్యవేక్షణ విధులను నిర్వర్తిస్తున్న ఎంఈవోలు వారంలో రెండు, మూడు రోజులు తమ సొంత పాఠశాలలకు వెళ్లి, కనీసం టెన్త్ విద్యార్థులకై నా విద్యాబోధన చేసేందుకు అవకాశమున్నా, విద్యార్థులను గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. గెజిటెడ్గా ఉన్న ఎంఈవో పోస్టుల్లో నిబంధనల ప్రకారం అదే కేడర్కు చెందిన హెచ్ఎంలను నియమించాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంఈవో–1, 2 పోస్టుల భర్తీలో సీనియార్టీకి పాతర వేశారు. ఎంఈవో–1 పోస్టుల్లో ప్రభుత్వ, ఎంఈవో–2 పోస్టుల్లో జెడ్పీ యాజమాన్యంలోని హెచ్ఎంలు కొనసాగుతున్నారు. అయితే టీడీపీ సర్కారు పాలనలో సీనియార్టీకి పాతర వేసి హెచ్ఎంల కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించిన కారణంగా తమ కన్నా తక్కువ కేడర్లో ఉన్న వారితో కలసి విధులను సమానంగా పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల జీత, భత్యాల బిల్లుల డ్రాయింగ్ అధికారులుగా ఉన్న ఎంఈవో–1లు పాఠశాలల పర్యవేక్షణ సైతం వారి చేతుల్లో ఉంది. దీంతో గెజిటెడ్ అధికారులుగా ఉన్న హెచ్ఎంల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎంఈవోలతో సమాన కేడర్ కలిగిన హెచ్ఎంలను ఎంఈవోలుగా నియమించాల్సిన పరిస్థితులకు భిన్నంగా స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంతో విద్యాబోధన కుంటుపడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎంలనే నియమించాలిప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులనే ఎంఈవో–1 పోస్టుల్లో నియమించాలి. గెజిటెడ్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధులను స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరికాదు. ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్ఎంలను ఎంఈవోలుగా నియమించి, స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలి. -– కె.మాల్యాద్రిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుపాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఇబ్బందులుహైస్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవో–2 పోస్టుల్లో సీనియర్ హెచ్ఎంలు ఉండటం, వారి కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1 పోస్టుల్లో నియమించడం వల్ల గందరగోళం నెలకొంది. హెచ్ఎం కేడర్లో ఉన్న వారినే ఎంఈవో పోస్టుల్లో నియమించాలి. – కె.బసవ లింగారావు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు -
నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ మృతి
పిడుగురాళ్ల: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ అకురాజుపల్లి మేజర్ కాలువ దోనెలో ఇరుక్కొని మృతి చెందాడు. వివరాల ప్రకారం...మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తమ పంట పొలాలకు నీళ్లను మళ్లించుకునేందుకు బ్రాహ్మణపల్లి వద్ద గల అకురాజుపల్లి మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. మేజర్ కాలువలో నీళ్లను కొత్తగణేశునిపాడు గ్రామానికి మరల్చే ప్రయత్నంలో ఆకురాజుపల్లి మేజర్కాలువ, కొత్త గణేశునిపాడు గ్రామ కాలువకు మధ్యలో ఉన్న దోనెలో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు కూలీ మల్లెల ధనుంజయరావు (43) వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికి రావటం లేదని చూడగా, దోనె లోపల ధనుంజయరావు మృతి చెంది కనిపించాడు. వెంటనే రైతులు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావుకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు పోటీపోటీగా జరిగాయి. ఆరు పళ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరు రామకోటయ్య గిత్తలు 4,532.8 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ.70 వేలను కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీ మధు ఎద్దులు 4,519.7 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 50 వేలను దక్కించుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి గిత్తలు 4,500 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 40 వేలు గెలుచుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి ఎడ్లు 4,244.1 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 30 వేలు, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన అక్కినేని శాన్వి చౌదరి, బాపట్ల జిల్లా మండల కేంద్రమైన వేటపాలెంకు చెందిన దేవరవల్లి జాన్వికారెడ్డి, అన్వితా రెడ్డిల కంబైన్డ్ గిత్తలు 3,999.10 అడుగుల దూరంలాగి 5వ బహుమతి రూ. 20 వేలను గెలుచుకున్నాయి. ఇలా తొమ్మిదోస్థానం వరకు ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 14 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం. చిన్నశౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావులు వ్యవహరించారు. -
భీష్మ ఏకాదశి లక్ష తులసి దళార్చన
సత్తెనపల్లి: స్థానిక వడ్డవల్లి రామాలయం, వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 21వ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా మాతృమూర్తులు, లక్ష్మీనారాయణ సమాజం వారిచే విష్ణు సహస్రనామ పారాయణంతోపాటు లక్ష తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. శుక్రవారం విశేష నవ కలశ స్నపన (అభిషేకం) జరుగుతుందని, భక్తులు అభిషేక ద్రవ్యాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ల ఏర్పాట్లను రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన రవ్వవరం గ్రామ సమీపంలో కొండ గురునాథస్వామి తిరునాళ్ల జరగనుంది. దీనికి పల్నాడు జిల్లాతోపాటు ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. గత ఏడాది మూడు ప్రభలు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఎనిమిదికి పైగా ప్రభలు నిర్మిస్తున్నారు. వేముల, కమ్మవారిపాలెం, గాంధీనగర్, శేషవారిపాలెం తదితర గ్రామాల నుంచి ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. తిరునాళ్ల ముందు రోజు మెట్ల పూజలో మహిళలు పొంగళ్లు పొంగించుకుంటారు. సోమవారం ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభల నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అందుకూరి శేషా చలపతి, మేనక మీనాక్షి దంపతులు, వారి కుమార్తె ప్రీతి మానస, కుమారుడు భార్గవ రామశాస్త్రిలు రూ.3 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో గురువారం ఈవో నలబోతు మాధవీదేవిని కలిసి ఈ విరాళం అందించారు. రేపల్లె: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలోని 36 కేంద్రాలలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో టైపు రైటింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్ల ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు చెప్పారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల మంది వరకు హాజరవుతున్నట్లు చెప్పారు. రేపల్లె కేంద్రంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న పరీక్షలకు 45 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా షార్ట్ హ్యాండ్ పరీక్షలు ఈ నెల 30, 31 తేదీలలో ఏడు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. -
రిస్క్ తీసుకోం..!
పురిటి నొప్పులతో నిండు శూలాలు విలవిలలాడుతుంటే భయపడొద్దని ధైర్యం చెప్పాల్సిన వైద్యుల చేయి.. నో రిస్క్ అంటూ వెనక్కు లాగుతోంది. అమ్మా.. ఊరుకో డాక్టర్ దగ్గరకొచ్చామని నిండు గర్భిణికి ధైర్యం చెప్పేలోగా.. మా వల్ల కాదు.. పెద్దాస్పత్రికి వెళ్లండంటూ ప్రభుత్వాస్పత్రి గెంటేస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణులకు శాపంగా మారుతోంది. కేవలం నెలల కాలంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పడిపోయిన డెలివరీల సంఖ్య ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపాన్ని కళ్లకు కడుతోంది. డెలివరీల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. అయితే అందులో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే సహించేది లేదు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేస్తున్న కేసులపై దృష్టి పెడతా. గర్భిణులకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సురేష్ కుమార్, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, నరసరావుపేట నరసరావుపేట టౌన్: నవమాసాలు మోసి బిడ్డను కని ఆనందించాల్సిన గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు పురిటినొప్పితో ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న గర్భిణులకు గడపలోనే వైద్యసేవల నిరాకరణ జరుగుతోంది. ప్రధానంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో గర్భిణుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇక మారుమూల ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలకు పల్నాడు జిల్లాలోని ప్రజలతో పాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వైద్యసేవల కోసం గర్భిణులు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 100 వరకు ఓపీ నమోదు అవుతుండగా.. నెలకు 300 పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆనుభవజ్ఞులైన వైద్యులు, నాణ్యమైన వైద్యం అందుతాయన్న నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి పేదలు వస్తుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఓపీ, ప్రసవాల సంఖ్య సగానికి పడిపోయింది. ఓపీ 60 వరకు నమోదు అవుతుండగా, నెలకు డెలివరీలు 140 వరకు గత రెండు నెలలుగా జరుగుతుండటం వైద్యసేవల్లో లోపాన్ని చాటుతుంది. రిస్క్ చేయని వైద్యులు.. ఒకప్పుడు వైద్యశాలకు వచ్చిన హైరిస్క్ గర్భిణి కేసులను చాలెంజ్గా తీసుకొని తమ అనుభవంతో వైద్యులు, సిబ్బంది శ్రమించి ప్రసవాలు చేసేవారు. అయితే ప్రస్తుతం హైరిస్క్ కేసుల జోలికి వెళ్లటం లేదు. డెలివరీలలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తర్వాత నరసరావుపేట ఏరియా వైద్యశాల రెండు లేక మూడవ స్థానంలో ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న ఏరియా వైద్యశాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. సిఫార్సుతో ప్రాణ నష్టం.. మాచర్లకు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ఈ నెల 17న 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగి ఉండటాన్ని గమనించిన ఇక్కడి వైద్యులు ప్రథమ చికిత్స కూడా అందించకుండా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. అక్కడ శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం బాలింత మృతి చెందింది. నరసరావుపేటలో సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె మృతి చెంది ఉండేది కాదని మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీవీపీ జాయింట్ కమిషనర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. సగానికి పడిపోయిన ప్రసవాల సంఖ్య నరసరావుపేట ఏరియా వైద్యశాలలో బాలింత మృతితో వైద్యుల్లో భయం ఏర్పడింది. హైరిస్క్ కేసుల జోలికి వెళ్లేందుకు వైద్యులు ధైర్యం చేయటం లేదు. వచ్చిన కేసులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్స్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రసవం కోసం 2 నెలల క్రితం మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటుకు చెందిన సాగరమ్మ వచ్చి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందింది. గర్భిణికి రక్తం ఎక్కించే విషయంలో ఒక గ్రూప్నకు బదులు మరో గ్రూప్ ఎక్కించటంతో ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారాన్ని రూ.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేశారు. -
ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మధులత హెచ్చరించారు. ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేస్తామన్నారు. ఏ ప్రభ వద్దనైనా సరే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఆయా ప్రభ నిర్వాహకులను బాధ్యులను చేస్తామన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రభలపై నృత్యాలు చేసుకోవాలన్నారు. ప్రభలపై కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా పాటలు పాడటం నిషేధమన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట తహసీల్దార్లు వేణుగోపాల్, హుస్సేన్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆర్డీవో మధులత -
ఏఆర్ విధులే అత్యంత కీలకం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం నిర్వర్తించే విధులు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో జిల్లా ఏఆర్ వార్షిక మోబిలైజేషన్ (శిక్షణ) నిర్వహించారు. అనంతరం పోలీస్ కవాతు మైదానంలో పరేడ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీవీఐపీ, వీఐపీల నివాసాలు, ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ, వీఐపీల వద్ద వ్యక్తిగత భద్రత విధులు నిర్వర్తించే వారి ప్రవర్తన శైలి, విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. పర్యటనల వేళల్లో భద్రతా తనిఖీలపై అప్రమత్తత అవసరమని అన్నారు. క్రమశిక్షణతోపాటు శారీరక ధృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ రెండు వారాలపాటు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయిలో శాంతి, భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి, సురేష్, ఆర్ఎ్స్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ.రవికుమార్ అన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా గురువారం పోలీస్ కవాతు మైదానంలో బందోబస్త్ సిబ్బందికి జిల్లా ఏఎస్పీ బ్రీఫింగ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వీవీఐపీ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ మార్గాల్లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా చూడాలని చెప్పారు. పోలీస్ అధికార, సిబ్బంది అనుసరించాల్సిన బందోబస్త్పై వివరించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బీడీ బృందంతో తనిఖీలు చేయించాలని సూచించారు. తూర్పు డీఎస్పీ అజీజ్ మాట్లాడుతూ వీవీఐపీల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్య, ఎస్ఐ డి.రమేష్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
పల్నాడు
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 545.90 అడుగులకు చేరింది. ఇది 200.8378 టీఎంసీలకు సమానం.7జగ్గయ్యపేట: స్థానిక రంగుల మండపం నుంచి పెనుగంచిప్రోలుకు పయనమైన గోపయ్య సమేత తిరుపతమ్మ వారు, సహదేవతలు తిరుగు పయనమయ్యారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.0503 టీఎంసీలు. -
కృష్ణానదిలో రసాయనాలు కలవలేదు
దాచేపల్లి: కృష్ణానదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవలేదని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారిణి షేక్ నజీరాబేగం పేర్కొన్నారు. మండలంలోని తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణానదిలోని నీళ్లను బుధవారం పరిశీలన చేశారు. నదిలో రసాయనాలు, విష పదార్థాలు కలవటం వలన నీళ్లు రంగుమారాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో నజీరాబేగం నదిలోని నీటిని పరిశీలన చేసి నీటి నమూనాలు సేకరించారు. ఈ సందర్భం మీడియాతో మాట్లాడారు.. కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి గత 20 రోజుల క్రితం జోనల్ ల్యాబ్రేటరీ, హైదరాబాద్ ల్యాబ్లకు పంపించామని, ల్యాబ్లలో పరీక్షలు చేసిన తరువాత నీటిలో రసాయనాలు, విష పదార్ధాలు కలవలేదని తేలిందని చెప్పారు. నదిలో గుర్రపు డెక్క, నాచు ఎక్కువగా పెరగటం వలన సహజసిద్ధంగా నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారినట్లుగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారన్నారు. ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగునీరు ఎక్కువగా నదిలో కలవటం వలన కూడా నీళ్లు రంగుమారతాయని, గ్రామ పంచాయతీగా ఉన్న తంగెడలో ఎక్కువమొత్తంలో మురుగు వచ్చే అవకాశం లేదన్నారు. తంగెడకు సమీపంలోని వాడపల్లి వద్ద మూసినది నుంచి ఎక్కువగా మురికినీరు వస్తుందనే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు. కృష్ణానదిలోని నీటిని ఫిల్టర్ చేసిన తరువాతనే ఉపయోగించాలని ఆమె సూచించారు. మరోసారి కృష్ణానదిలో నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కి పంపించి పరీక్షలు చేయిస్తామని, ప్రజలు ఆందోళన చెందకుండా సురక్షితమైన పద్ధతుల్లో నీటిని వినియోగించాలని రీజనల్ అధికారిణి నజీరాబేగం చెప్పారు. ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి గుండ్రెడ్డి కోటేశ్వరరావు, షేక్ హస్సన్ అహ్మాద్, జానపాటి సీతారామశర్మ తదితరులున్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి షేక్ నజీరాబేగం -
‘ఉపాధి’ పనుల్లో అవినీతిపై జనాగ్రహం
నకరికల్లు: ఉపాధి హామీ పథకంలో చేయకుండా చేసినట్లు రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయలు బిల్లులు చేసుకున్నారని పలువురు ఉపాధి కూలీలు ఆరోపించారు. గతేడాది పనులపై సామాజిక తనిఖీ అనంతరం బుధవారం నకరికల్లులో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలతో ఉపాధి కూలీలు విస్తుపోయారు. ఏడాది కాలంలో 267 పనులకు వేతనాల రూపంలో రూ.61,60 లక్షలు, మెటీరియల్ రూపంలో రూ.51.92 లక్షలు మొత్తం రూ.1.13 కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పూర్తి కాని ఇళ్లకు.. ప్రధానంగా పూర్తికాని ఇళ్లకు 90 రోజుల పనిదినాలు చూపుతూ బినామీ మస్టర్లతో 165 మంది పేరిట బిల్లుల మంజూరు చేసినట్లు, క్షేత్రస్థాయిలో చేపట్టని పనులకు రికార్డుల్లో నమోదు చేసి బిల్లులు మంజూరు చేసినట్లు, కాలువల్లో పూడికతీత పేరిట సంబంధిత ఫొటోలు కూడా లేకుండా రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేసినట్లు వెల్లడి కావడంతో ఉపాధికూలీలు మండిపడ్డారు. విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పేరిట.. ఫిలిఫైన్ దేశంలో, ఇతర రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు, కిరాణా దుకాణదారులు, ఇతర జిల్లాల్లో ఉన్నవారి పేరిట, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి పని కల్పించినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీఆర్పీ రవి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు నమోదు చేసుకొని ప్రజావేదికలో వెల్లడిస్తామన్నారు. ఈ నేపఽథ్యంలో ఈనెల 30న జరగునున్న ప్రజావేదిక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా జిల్లా అధికారులు ఇప్పటికే నకరికల్లు మండలంలో జరిగిన ఉపాధి పనుల తీరుపై ప్రత్యేక నిఘాతో నిధుల గోల్మాల్కు పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామసభలో పీడీఓ కొమ్మవరపు అప్పారావు, సర్పంచి పరసా అంజమ్మ, ఏపీఓ ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకట్రావు పాల్గొన్నారు. -
కరుణామయురాలు తల్లి లూర్దుమాత
రెంటచింతల: కరుణామయురాలు తల్లి లూర్దుమాత అని దాచేపల్లి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా బుధవారం లూర్దుమాత మందిరంలో నిర్వహించిన నవదిన ప్రార్థనలలో సమష్టి దివ్యపూజాబలిని సమర్పించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లూర్దు మాత దేవుని తల్లిగా కొనియాడబడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసిన వారు ఆ తల్లి ఆశీస్సులు కోసం తప్పకుండా పొందుతారన్నారు. కానుకమాత చర్చి సహాయక గురువులు రెవ. ఫాదర్ ప్రసన్నకుమార్, కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన వేడుకలు బుధవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులు రాజశ్యామల హోమం చేశారు. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: పట్టణానికి చెందిన విద్యార్ధి జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికై య్యాడు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ మహమ్మద్ నజీర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనభర్చి జాతీయ స్ధాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై య్యాడు. ఈనెల 30వ తేదీ నుంచి ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో పోటీలు జరుగునున్నాయి. పోటీలో పాల్గొనేందుకు నజీర్ బయలుదేరి వెళ్లాడు. గతంలో రెండుసార్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో నజీర్ పాల్గొన్నాడు. అండర్–14,అండర్–17 విభాగాలలో జాతీయస్థాయిలో ఆడాడు. బాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 పోటీలలో రాష్ట్ర జట్టుకు నజీర్ ప్రాతినద్యం వహించాడు. సోలార్ మోడల్ విలేజ్గా అత్తలూరు అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్గా పల్నాడు కలెక్టర్ ఎంపిక చేసినందున బుధవా రం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ఇంజినీర్ పి.రవి కిరణ్ సోలార్ విద్యుత్ వల్ల ఉపయోగాలు, లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, సోలార్ విద్యుత్ ప్యానెల్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవా ల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ● కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ● మృతుడు స్వర్ణ వాసిగా గుర్తింపు
మెడికల్ వ్యాపారికి జైలు నరసరావుపేట టౌన్: పట్టణానికి చెందిన ప్రముఖ మెడికల్ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులుకు చెల్లని చెక్కు కేసులో 6 నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పట్టణానికి చెందిన తూనుగుంట్ల సుబ్బారావు వద్ద వాసవీ మెడికల్ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులు 2019 సంవత్సరంలో రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపులో భాగంగా చెక్కు అందజేశాడు. ఖాతాలో నగదు లేకపోవటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఫిర్యాదు దారుడికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. అందుబాటులో ఎండీటీ మందులు నరసరావుపేట: కుష్ఠువ్యాధిని ఎండీటీ (బహుళ ఔషధ చికిత్స) మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని, ఈ మందులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తారని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్పై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది వివక్షత అంతం చేయటం, గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు. వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి చికిత్స అందజేస్తే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు. యువకుడి హత్య! చీరాల: చీరాల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆర్వోబీ కింద రైలు పట్టాల మధ్య రక్తమడుగులో ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాంపై కత్తి పోట్లు, తీవ్ర గాయాలు ఉండటంతో దారుణంగా కొట్టి హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతిపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మృతుడి వివరాలు లభించాయి. మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాఽథ్(17)గా గుర్తించారు. మృతుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. దీంతో మృతుడి బంధువులు చీరాల వచ్చి గుర్తించారు. అనంతరం మృతుడు వినియోగించిన బైక్ ఘటనా స్థలానికి దగ్గరలో కనుగొన్నారు. మంగళవారం రాత్రి పనికి వెళుతున్నానని చెప్పి బైక్పై చీరాల వచ్చాడు. అయితే రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఉదయం చీరాల ఆర్వోబీ కింద శవమై కనిపించాడు. మృతి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తలపై, శరీరంపై ఉన్న గాయాలను బట్టి దుండగులు రైల్వే వంతెన దగ్గకు తీసుకువచ్చి రాళ్ళతో కొట్టి చంపి పడవేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
లారీ ఢీకొని బాలుడు మృతి
దాచేపల్లి: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టటంతో గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రూవ్వ మహేష్(7) దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గోపి, నందిని దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు మహేష్ సంతానం. తెలంగాణలోని అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న గోపి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమార్తె, కుమారుడిని తల్లిదండ్రుల స్వగ్రామమైన దైదలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో నారాయణపురంలోని ఓ లాడ్జిలో పనిచేస్తూ నందిని దాచేపల్లిలో ఉంటోంది. మహేష్కి జ్వరం వస్తుండటంతో అమ్మమ్మ పురం భూలక్ష్మి దాచేపల్లిలో ఉంటున్న కుమార్తె వద్దకు తీసుకువచ్చింది. హస్పిటల్లో చికిత్స అనంతరం తల్లి, అమ్మమ్మలతో కలిసి లాడ్జి వద్దకు మహేష్ వచ్చాడు. ఈక్రమంలో తెలిసిన వ్యక్తి మహేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బస్టాండ్ సెంటర్ వద్దకు వచ్చాడు. మహేష్ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న నందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటివరకు తనతో ఉన్న కుమారుడు మృత్యువాతపడటంతో బోరున విలపించింది. మృతిచెందిన కుమారుడిని ఒడిలోకి తీసుకుని నందిని ఏడుస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. మహేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిసాన్ సభ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయండి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ లక్ష్మీపురం: అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి దేవి ప్రారంభిస్తారని తెలిపారు, అనంతరం వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ ఎంపీ మధు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రిటైర్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, ఆర్.వీర రాఘవయ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రజా కళాకారుడు వంగపండు దుష్యంత్ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే వేమన సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాడరేవు తీరంలో మృతదేహం లభ్యం చీరాల: వాడరేవు సముద్రతీరంలో బుధవారం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడంతో వృద్ధుడి వివరాలు లభించాయి. మృతుడు గ్రంధి గణపతిరావు (70) రామకృష్ణాపురం పంచాయతీ కొత్తపాలెం వాసిగా గుర్తించారు. -
7 నుంచి కొండవీడు ఫెస్ట్
● తుది ప్రణాళిక ఖరారు ● కోటను సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే యడ్లపాడు: కొండవీడు కోట గొప్ప పర్యాటక కేంద్రంగా, అలాగే భావితరాలకు ఈ ప్రాంత చరిత్ర తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో కొండవీడు ఫెస్ట్ – 2026 నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి బుధవారం కొండవీడుకోటను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణపై శాఖలవారీగా చేపట్టాల్సిన విధులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు కొండపైనే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఆయా కార్యక్రమాలను వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సందర్శకులు తమ వాహనాలను కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపి, అక్కడి నుంచి ఘాట్రోడ్డుపైగా ఏర్పాటు చేసిన 10 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాలరీత్యా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కొండవీడు కోట పూర్వవైభవాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ‘కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రకటించారు. తొలిరోజు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొంటారన్నారు. ఉత్సవాల ముందు ఫిబ్రవరి 5న ప్రచార కార్యక్రమం, కొండవీడు చరిత్ర తెలిపే ప్రత్యేక గీతం ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు కొండపై పర్యాటకుల కోసం నైట్ క్యాంపెయిన్, భోజన వసతులు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. రూ.220 కోట్లతో చౌడవరం నుంచి కోటకు 5 కి.మీ. టన్నెల్ నిర్మాణాన్ని 2026కల్లా పూర్తి చేసేలా చర్యలు, అలాగే కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు పురావస్తుశాఖ అనుమతులతో మరమ్మతులు చేపడతామని తెలిపారు. వీటితో పాటు జంతు ప్రదర్శనశాల, సఫారి రైడింగ్ ఏర్పాటు చేసేదిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా జనవరి 18–23 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు, ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో కొండవీడు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జీవీ సంతోష్, డీఎఫ్వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, టూరిజం శాఖ మేనేజర్ నాయుడమ్మ, పలు శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటి, సొసైటీ చైర్మన్ సుబ్బారావు, సర్పంచ్లు మానం సాంబయ్య, ఎంపీటీసీ మద్దూరి శ్రీనివాసరెడ్డి, మండలస్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మూడోసారి జరిగే కొండవీడు ఉత్సవాలు గతానికి భిన్నంగా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ... ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 7 గంటలకు యోగా ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆహ్లాదకర వాతావరణంలో యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, 10 గంటలకు అధికారికంగా కొండవీడు ఫెస్ట్ ప్రారంభిస్తామని తెలిపారు. కొండపై ఉత్సవాల్లో భాగంగా బోటింగ్, ట్రెక్కింగ్, రాప్లింగ్, రాక్ క్లైంబింగ్, ఆర్చరీ, హార్స్ రైడింగ్, హెలికాప్టర్ రైడింగ్ వంటి అడ్వంచర్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాండ్ అండ్ ఆర్ట్, ఫ్లవర్, లేజర్, క్రాకర్స్ షో, సినీగాయని గీతామాధురితో సంగీత విభావరి, వెస్ట్రన్స్ డాన్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జబర్దస్త్ కళాకారులు, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. కొండ దిగువన ఎమ్యూజ్మెంట్ పార్కు, వెహికల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు, ఇందులో జాయింట్ వీల్, ఎగ్జిబిషన్ వంటివి ఉంటాయి. కొండవీడు సమీప పాఠశాలల విద్యార్థులకు గానం, నృత్యం, అభినయం విభాగాల్లో పోటీలు నిర్వహించి వారి ప్రతిభను ప్రోత్సహించనున్నారు. ముందుగా కొండదిగువన ఉన్న గులాబీతోటను కలెక్టర్ సందర్శించారు. -
పీఆర్టీయూ(డెమోక్రటిక్) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వరరావు
సత్తెనపల్లి: డెమోక్రటిక్ పీఆర్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జువ్వా జ్ఞానేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక అంజీ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను అధ్యక్షత వహించారు. గౌరవ అధ్యక్షుడిగా నర్రా సుధాకరరావు, ప్రధాన కార్యదర్శిగా చొప్పర కమలాకరరావు, ఆర్థిక కార్యదర్శిగా దేవిరెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు బుల్లా రామారావు, జిల్లా కార్యదర్శిగా యు.సుబ్బారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వి.మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా బంకా వాసుబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, లాకు పిచ్చయ్య ఎంపికయ్యారు. జిల్లా శాఖ మహిళా కార్యదర్శులుగా ఎస్.నాగమణి, కె.శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో హిందీ పండిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో రెండు గ్రేడ్–2 హిందీ పండిట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్పేట 10వ లైనులోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీనివాసరావుపేటలోని శ్రీరవీంద్రనాద్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిపై మూడేళ్లు పని చేసేందుకు హిందీ పండిట్ శిక్షణతో పాటు టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లకు వ్యక్తిగతంగా, లేదా సీఎస్ఈ.ఏపీ.ఇన్/ఎయిడెడ్రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు జీవోఎంఎస్ 58 ప్రకారం ఏకీకృత జాబితాను డీఈఓ పోర్టల్లో ప్రచురించి, నియామక పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటల నుంచి అవబృధ స్నానం, చక్రతీర్థం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, ఋత్విక్ సమ్మానం, వేదాశీర్వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. -
వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం
పిడుగురాళ్ల: శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి వారి కల్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న స్వామి వారి దేవాలయంలో ఈ వేడుక నిర్వహించారు. రథోత్సవం, తిరునాళ్ల మహోత్సవం ఘనంగా చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి ఇదే పెద్ద పండుగ. కులమతాలకు అతీతంగా స్వామవారి తిరునాళ్లకు భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మహా అన్నదానం చేశారు. మధ్యాహ్న సమయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యువకులు భారీ సంఖ్యలో హాజరై జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ రథం లాగుతూ ముందుకు సాగారు. పోలీస్ స్టేషన్ నుంచి ఐలాండ్ సెంటర్ మీదుగా అడితీల సెంటర్ వరకు రథం నడిపించారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి తీసుకొచ్చారు. తిరునాళ్ల వాతావరణం సందడిగా కనిపించింది. పలువురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామి వారి కల్యాణాన్ని చేయించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు -
జిల్లాలో 22 బార్లకు రీనోటిఫికేషన్
● ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 5న లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు నరసరావుపేట టౌన్: జిల్లాలో 22 బార్ అండ్ రెస్టారెంట్లకు రీ–నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 22 బార్ల భర్తీకి రీ–నోటిఫికేషన్ జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 7, చిలకలూరిపేట మున్సిపాలిటీలో 5, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 4, మాచర్లలో 3, వినుకొండలో 3 ఉన్నట్లు తెలిపారు. నేటి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 మొత్తం రూ.5,10,000 నాన్ రిఫండబుల్ అని తెలిపారు. ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే ఆ దుకాణానికి లాటరీ పద్దతిన టెండర్ పిలవటం జరుగుతుందన్నారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి కేటాయించటం జరుతుతుందని తెలిపారు. సమావేశంలో సీఐ సోమయ్య పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగు పళ్ల సైజ్ విభాగంలో బుధవారం జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన కొప్పుల గోవర్ధన్రెడ్డి, ప్రవలీష్రెడ్డిల గిత్తలు 4,391.6 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 60 వేలను కై వసం చేసుకున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామానికి చెందిన కంబైన్డ్ ఎడ్లు 4,379.3 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 40 వేలను దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామా నికి చెందిన వెంకటగిరి హేమలతనాయుడు గిత్తలు 4,208.9 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 35 వేలను, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన గిత్తలు 4,066 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను, వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన కె. వెంకట హేమలతారెడ్డి గిత్తలు 3,964 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 18 వేలను గెలుచుకున్నాయి. ఇలా 9వ స్థానం వరకు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 12 జతలు పాల్గొనగా మిగిలిన 3 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులు అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలు రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. ప్రథమస్థానం సాధించిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతి అందజేస్తున్న దృశ్యం ప్రథమ బహుమతి కై వసం చేసుకున్న మేళ్లచెరువు ఎడ్ల జత నాలుగు పళ్ల విభాగంలో మేళ్లచెరువు ఎడ్లకు ప్రథమస్థానం -
మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అన్నిశాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక అమరేశ్వరాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి ఏర్పాట్ల సమన్వయ కమీటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్నానఘాట్ల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను చేయాలన్నారు. అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఆయన ఎకై ్సజ్శాఖాధికారులను ఆదేశించారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా అధికారులంతా సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలపరంగా పూర్తిస్థాయి ప్రణాళికలను అనుసరించి వారి అవసరాలను కూడా వచ్చే సమావేశంలో వివరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ డానియేల్, సీఐ అచ్చియ్య, ఆలయ ఈవో రేఖ, డీడీవో రాజగోపాల్, ఎంపీడీవో పార్వతిలతోపాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మందా సాల్మన్ది రాజకీయ హత్యే
పిడుగురాళ్ల: మందా సాల్మన్ది రాజకీయ హత్యనేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మందా సాల్మన్ కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ, నాయకులు పరామర్శించారు. హత్య వివరాలు, సంఘటనకు సంబంధించిన వాస్తవాలు, కుటుంబ సభ్యులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం సాల్మన్ కుటుంబాన్ని ఆర్థికంగా అదుకోవాలని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగం ఇచ్చి, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. హత్య జరుగుతుందని ముందుగా తెలిసినా నిర్లక్ష్యంగా వహించిన సంబంధిత సీఐ, ఎస్ఐలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని సహాయ, సహకారాలు అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీని కలిసిన నేతలు.. సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగా సంజయ్ మాదిగ కలిశారు. సాల్మన్ హత్య అనంతరం కొందరు వారి ఇంటిపైకి రాళ్లు విసురుతూ, దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందివుడుగుల టీఎం రమేష్ మాదిగ, ఎమ్మార్పీస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంగి సుధాకర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిద్దయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా శ్రీనివాసులు, కోనసీమ జిల్లా సోషల్ మీడియా కన్వినర్ శీలి దశరధ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ -
ప్రజలపై మరింత భారం
భూముల విలువ పెంపు పేరిట అదనపు రాబడికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలుచంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రియల్ వ్యాపారం ఢమాల్ అంటూ పడిపోయింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రజలపై రెండోసారి భారం మోపేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లు విలువ చేసే ప్లాట్లు, భూములను కొనుగోలు చేసేవారు లేక అప్పులకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నారు. కొంత ధర తగ్గించి నష్టాలకై నా వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నా కొనేవారే లేరు. ప్రస్తుతం అరకొరగా రియల్ వ్యాపారం చేస్తున్న వారికి పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అదనపు భారం కానున్నాయి. సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజలపై బాదుడే బాదుడు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు... ఇప్పుడు భూముల ధరలు మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను సవరించనున్నారు. దీనిపై ప్రజలు తమ సలహాలు, అభ్యంతరాలు తెలపాలని జిల్లా యంత్రాంగం కోరింది. సవరణలు ఇలా... ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల సవరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చేపడతారు. సదరు భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్ పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయిస్తారు. సవరించిన విలువలకు రివిజన్ కమిటీ ఆమోదముద్ర వేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా .. ఈ నెల 25వ తేదీ నుంచి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రతిపాదిత ధరల వివరాలు పొందుపరిచారు. వీటిపై ఈ నెల 29వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, డేటా ఎంట్రీ పూర్తి చేసి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం ఒకటి – 1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, ఫిబ్రవరి 1వ తేదీన పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసింది. నివాస స్థలాలపై సైతం... కమర్షియల్ స్థలాలు కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీని వలన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్, సినిమా హాళ్లు, పూరిల్లు, తదితర నిర్మాణాల విలువలను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం చదరపు అడుగుకు 10 నుంచి 30 శాతం వరకు వాటి మార్కెట్ విలువ పెంచనున్నారు. ఫలితంగా సామాన్యులు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడనుంది. 10 నుంచి 30 శాతం వరకు పెంపు... జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. సగటున 10 నుంచి 30 శాతం వరకూ పెంపుదల చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుకూలంగా జిల్లాలో భూముల ధరలు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీగా పెరగనున్న భూముల ధరలు సంక్షోభంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేటి వరకు సలహాలు, సూచనలకు అవకాశం ఫిబ్రవరి నుంచి పెంచిన ధరలు అమలు గెజిట్ విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం 10 నుంచి 30 శాతం పెంచేందుకు అవకాశం ప్రాంతాన్ని బట్టి మారనున్న ధరలు చంద్రబాబు 18 నెలల పాలనలో రెండోసారి పెంపు జిల్లాలో క్రయవిక్ర యాలకు సంబంధించి తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు ప్రస్తుత భూముల రిజిస్ట్రేషన్లకు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ. లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ. 7,500 చెల్లించాలి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది. అంటే మార్కెట్ ధర రూ. 1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ. 9 వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1,500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సవరణ కోసం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ ఆమోదంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతాం. –బి.అశోక్కుమార్, సబ్ రిజిస్ట్రార్, సత్తెనపల్లి -
హౌసింగ్ లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్స్లో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి హౌసింగ్ లేఅవుట్స్, పీఎంఎవై ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు అందించాలన్నారు. గతంలో వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించిన నిధుల వివరాలను అందించాలన్నారు. లే అవుట్స్ వారీగా లబ్ధిదారులకు కేటాయించినవి, కేటాయించిన వాటిలో నిర్మాణాలు ప్రారంభించినవి, పూర్తి అయినవి, కేటాయించకుండా ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలను మ్యాప్లతో సహా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆప్షన్–3లో నిర్మించిన ఇళ్లలో స్టేజ్, క్వాలిటీ డివియేషనన్స్ను కాంట్రాక్టర్లతో వెంటనే సరిచేసేలా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో కె.శ్రీనివాసులు, తెనాలి కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై దశలవారీ ఆందోళన
ఎస్టీయూ నాయకులు నరసరావుపేట ఈస్ట్: ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ తెలిపారు. మూడు దశల ఆందోళన కార్యక్రమం కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. సీపీఎస్ రద్దు రోడ్మ్యాప్, రూ.34వేల కోట్లు బకాయిలు చెల్లింపులు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీ ఆందోళనలో భాగంగా ఈనెల 30న మండల కేంద్రాలలో వినతిపత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న ఛలో విజయవాడ రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. దశల వారీ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు కోలా యేసయ్య, జిల్లా ఆర్ధిక కార్యదర్శి షేక్ సుభానీ, కార్యదర్శి ఈ.రామకోటయ్య పాల్గొన్నారు. -
మేజర్ కాలువలో పడి లస్కర్ మృతి
రొంపిచర్ల: మేజర్ కాలువలో పడి లస్కర్ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని మాచవరం మేజర్ వద్ద చోటుచేసుకుంది. సంతగుడిపాడు గ్రామానికి చెందిన ఎనుముల శ్రీనివాసరెడి (55) ఎన్ఎస్పీ కెనాల్స్లో లస్కర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా మాచవరం మేజర్ కాలువపై డ్రాప్ వద్ద సాగునీటిని లెవల్స్ పరిశీలిస్తున్నాడు. ఇంతలో తూలుడు వచ్చి కాలువలో పడిపోయాడు. నీటిలో మునిగిన శ్రీనివాసరెడ్డి బయటకు రాలేకపోయాడు. అక్కడే సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే శ్రీనివాసరెడ్డిని కాలువ నుంచి బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వై.సీహెచ్.అశోకవాణి వాదనలు వినిపించారు. లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్లోని జంపని టవర్స్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: వివిధ మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్బాషాను డీఈవో కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్డేట్ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్లు, బకాయిలు, మెడికల్ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.కేదార్నాధ్, కాలేషావలి ఉన్నారు. -
దళితులపై దమనకాండ దారుణం
మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు, గ్రామ బహిష్కరణలు ఎక్కువైపోయాయని, ఆఖరికి వారిని హత్యలు కూడా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సి సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావులు అన్నారు. మంగళవారం మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంటున్న దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగికదాడులు ఎక్కువయ్యాయన్నారు. మొదటి నుంచి దళితులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే భావనతోనే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగంతో వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఈక్రమంలో ఆదోనిలో గోవిందమ్మ, అద్దంకిలో చింతల శ్రీను, పిన్నెల్లిలో మందా సాల్మన్లపై దాడులు జరిపారన్నారు. వారిలో సాల్మన్ను హతమార్చారన్నారు. నంద్యాల ప్రాంతంలో దళిత మహిళ పై లైంగికదాడి చేశారన్నారు. అనేక గ్రామాల్లో సాంఘిక బహిష్కరణ చేస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ భారత రాజ్యాంగం కాదని తమ సొంత రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేసి దళితులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం దారుణమన్నారు. – రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎస్సీ అయివుండి కూడా దళితుల పై జరుగుతున్న దాడులు అరికట్టలేకపోవటం బాధాకరమన్నారు. దళితుల పై దాడులు అరికట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని, జిల్లాలో జరిగిస్తున్న దమన కాండను ఆపివేయాలన్నారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మందా సంతోష్, వేల్పుల గురవయ్య, ఎస్సి సెల్ నేత కందుకూరి మధు, జిల్లా నాయకులు కొమ్ము బొంగురు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పవన్, కోటా రాజేష్ తదితరులున్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన రసవత్తరంగా జరిగాయి. రెండు పళ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరిల గిత్తలు 4,082.10 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 50 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన చాగంటి శ్రీనివాస చౌదరి, ప్రకాశం జిల్లా నాగుల్పుడు మండలం ఉప్పుగుడూరు గ్రామానికి చెందిన బెల్లం రిత్వీక్ చౌదరి, యువాన్ చౌదరి కంబైన్డ్ గిత్తలు 3,880.2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.35 వేలను దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ గిత్తలు 3,603.1 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 30 వేలను కై వశం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన ఉమ్మారెడ్డి ప్రభుకుమారి, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన నుసుముల రామకృష్ణామాచారి కంబైన్డ్ గిత్తలు 3,361.5 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను దక్కించుకున్నాయి. తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ గిత్తలు 3,258.2 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ. 17 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవ స్థానం వరకు బహుమతులు పంపిణీ చేశారు. బలప్రదర్శనలో మొత్తం 15 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందజేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, వై.జోజిరెడ్డి, జి.సుమంత్రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్రెడ్డి, జి. కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఓ.ఇన్నారెడ్డి, జె.రాజేష్రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, ఎం.రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావులు వ్యవహరించారు. రెండు పళ్ల విభాగంలో ప్రథమస్థానంలో నిలిచిన బాపట్ల జిల్లా ఎడ్లు -
మోతడక చలపతిలో ‘ఉద్ఘోష్ –2026’
తాడికొండ: మోతడక చలపతిలో ఫిబ్రవరి 20–21 తేదీలలో ఉద్ఘోష్– 2026 పేరిట సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఈ మేరకు కళాశాలలో ఉద్ఘోష్ – 2026 బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ సంబరంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ అడ్మిషన్స్, ఆపరేషన్స్ డాక్టర్ కె.కిరణ్ కుమార్, డీన్లు డాక్టర్ పి.బాల మురళీకృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వీవీ సుబ్బారావు, కన్వీనర్లు డాక్టర్ పి.రత్నబాబు, జి.రామచంద్రరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేసిన టీవీ విజయలక్ష్మీని నెల రోజుల కిందట సెర్ప్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆమెను ఏలూరు డీఆర్డీఏ పీడీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాడేపల్లి పోలీసులకు మంగళవారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్ఐ అపర్ణ కృష్ణానది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని, ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు నిలువు చారలు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉందని, చేతికి దారాలు ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు. గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) చేపట్టిన పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో పోరాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సీపీఎస్కు ప్రత్యామ్నాయంగా రోడ్మ్యాప్ ప్రకటించి, రూ.34 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. అందుకే దశల వారీ ఉద్యమానికి ఎస్టీయూ పిలుపు ఇచ్చిందన్నారు. ఈనెల 30న మండల స్థాయిలో తహసీల్దార్లకు మెమొరాండం సమర్పించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుంచి వ్యవసాయ ప్రదర్శన, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. నాలుగు రోజులు పాటు 14 అంశాలపై సదస్సులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పాల్గొన్నారు. -
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: మార్చి 14న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో జిల్లా న్యాయమూర్తులు వై.నాగరాజు, సీహెచ్వీఎన్ శ్రీనివాసరావు, వి. శరత్బాబు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్లు మంగళవారం 13వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఇరుపక్షాల వారిని కోర్టుకు రప్పించినట్లయితే న్యాయాధికారులు చట్టపరంగా అన్ని అంశాలను వారికి వివరించి కేసు రాజీమార్గం ద్వారా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తారన్నారు. సివిల్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు తమ క్లైంట్లకు తగు సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. అనంతరం నరసరావుపేట సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి పోలీస్ అధికారులు లేవనెత్తిన సాంకేతికపరమైన పలు అంశాలను న్యాయాధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో న్యాయధికారులు కె.మధుస్వామి, ఎన్. వణ్య, రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్, ఆవుల సలోమి, ఏపీపీ నల్లమోతు కల్పన, డీఎస్పీ ఎం హనుమంతరావు, సీఐలు ఫిరోజ్, ఎం.వి.సుబ్బారావు, లోకనాథం, ఎస్సైలు, న్యాయవాదులు, వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్షించిన న్యాయమూర్తులు -
ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’
నరసరావుపేట: జిల్లాలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సామాజిక భాగస్వామ్యంతో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా మొదటి గురువారం ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్లో కార్యక్రమ రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజారోగ్యం, పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక భాగస్వామ్య ఆరోగ్య నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొదటి ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో గ్రామ ఆరోగ్య దర్శిని కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్, పేరెంట్స్ కమిటీ ప్రతినిథి, డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి నెల రోజుల కాలంలో అమలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. -
భవతీ బిక్షాం దేహీ
అప్పుల్లో జెడ్పీ గుంటూరుఎడ్యుకేషన్:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ అప్పుల్లో కూరుకుపోతోంది. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పనులకు అనుమతులు ఇచ్చేస్తున్న కారణంగా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి అంగీకారం లే కుండా చైర్పర్సన్ ఏకపక్షంగా ఇస్తున్న అనుమతు లతో జెడ్పీ ఖజానా దివాళాకు చేరువైంది. జెడ్పీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాలు, సొంత అవసరాలకు వాడుకోవడంతో జెడ్పీ పరిస్థితి దారుణంగా మారుతోంది. బడ్జెట్ కేటాయింపులకు మించి మంజూరు చేస్తున్న కారణంగా బిల్లులు చెల్లించే సమయంలో నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం సొంతంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమవుతున్న జెడ్పీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. పాలకురాలి వ్యవహారశైలి కారణంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలను పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పాలకుల వైఖరి కారణంగా జెడ్పీని ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు పను లు చేయలేక, ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నా రు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండా ఆమోదానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ మండలాల్లో తమను సంప్రదించకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధ్యానం ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను అడ్డుకుంటున్నారు. నిధుల లభ్యత, పనుల కేటాయింపుల్లో పొంతన శూన్యం జెడ్పీలో నిధుల లభ్యత, కేటాయించిన పనులకు పొంతన ఉండటం లేదు. 15వ ఆర్థిక సంఘం సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి జెడ్పీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19.51 కోట్లు కేటాయించింది. అయితే సీపీడబ్ల్యూఎస్ టైడ్, అన్టైడ్ కింద రూ.34.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా వచ్చే నిధులకు, మంజూరు చేసిన పనులకు పొంతన లేకపోవడం జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8.84 కోట్లు కాగా, రూ.14.61 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో సంబంధిత పనులకు చెల్లింపులు జరపడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే జెడ్పీ సాధారణ నిధుల్లో సైతం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధుల లభ్యత కేవలం రూ.2.90 కోట్లుగా ఉండగా, రూ.11.27 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. జెడ్పీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మరింత ఆందోళనకరంగా ఉంది. జెడ్పీకి స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి న తరువాత కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతో పా టు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సై తం పనులు కేటాయించేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీటీసీలతో చర్చించకుండా చైర్పర్సన్ ముందస్తుగా అనుమతులు ఇచ్చేయడంతో జెడ్పీలో ఆర్థిక ప్రణాళిక దిగజారింది. -
పల్నాడు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.1406 టీఎంసీలు. ఎస్పీకి డైరీ అందజేత నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు మంగళవారం పోలీస్ అసోసియేషన్ డైరీ (2026)ని జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు.నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.3,800, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. 7 -
పొట్ట చేతపట్టుకుని..!
పెదకూరపాడు : చేతినిండా పని లేదు..... పూట గడవడం లేదు... పిల్లలను సాకడం ఎలా.....నెల నెలా తీసుకున్న అప్పులు కట్టేది ఎలా.. బతుకు బండిని నడిపించేది ఎలా... దూరమైనా పని దొరికిన కాడకే పోదామంటూ పల్లె జనం వలస బాట పట్టారు. రాజధాని ప్రాంతంగా చెప్పుకునే పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామాలలోని ప్రజలు వ్యవసాయ పనులు లేక పొట్టకూటి కోసం కోనసీమ వైపు పరుగులు పెడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్లు, వందల సంఖ్యలో కుటుంబాలు వలస వెళుతున్నాయి... ఫలితంగా పల్లెలు బోసి పోతున్నాయి. పలు గ్రామాల్లో ఏ ఇల్లు చూసినా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా దర్శనమిస్తున్నారు. ఉపాధి లేకపోవటం, ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముంచేసిన పత్తి పంట... పెదకూరపాడు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వాణిజ్య పంటలైన పత్తి, మిరప ఎక్కువ సాగు చేస్తుంటారు. ఆరు నెలలు మాత్రమే ఖరీఫ్ పంటలు సాగు చేస్తుంటారు. ఎక్కువగా వ్యవసాయ పనులు జులై నుంచి మార్చి వరకు ఉంటాయి. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పత్తి దిగుబడులు లేక నవంబర్ నెలలోనే రైతులు దున్నేశారు. మిరప పంట ఫిబ్రవరి నెలాఖరు నుంచి దిగుబడులు వస్తాయి. ఈ ప్రాంత వ్యవసాయ కూలీలు నవంబర్ నెల నుంచి వ్యవసాయ పనులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వలస బాట పట్టారు. ఉపాధి పనులు కొందరికే... నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి పనులు జరుగుతున్నా కొందరికి మాత్రమే ఉపాధి సిబ్బంది పనులు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే పిలిచి పనులిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంగా గొప్పలు చెప్పుకుంటున్న పెదకూరపాడు నియోజకవర్గంలో వ్యవసాయ కూలీలకు, సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేదా ఉపాధి భృతి ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. పాటిబండ్ల గ్రామంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధి -
బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
వారానికి ఐదురోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ నరసరావుపేట: వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ), యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయు), నరసరావుపేట లోకల్ బ్రాంచెస్కు చెందిన బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అరండల్పేటలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ నరసరావుపేట రీజనల్ సెక్రటరీ పీఎంయూ రామకృష్ణ మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయ న్నారు. వారంలో ఐదురోజుల పనిదినాలు అమలు చేయటానికి ప్రభుత్వ అనుమతి కోరుతున్నామన్నారు. ప్రస్తుతం రెండు, నాలుగు శనివారాల్లోనే సెలవులు అమలౌతున్నాయన్నారు. మిగిలిన శనివారాలను సైతం సెలవులుగా ప్రకటించాలని కోరగా స్పందన లేకపోవటంతో 2025 మార్చి 24, 25 రెండురోజుల పాటు సమ్మెకు పిలుపుఇవ్వటం జరిగిందన్నారు. ప్రభుత్వం కోరిన మీదట సమ్మె వాయిదా వేశామన్నారు. ఫైనాన్షియల్ రంగంలో అన్నీ సంస్థలు వారానికి కేవలం ఐదురోజులే పనిదినాలుగా అమలు చేస్తున్నందున యూఎఫ్బీయు మళ్లీ సమ్మెకు పిలుపు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఐబీఓసీ రీజనల్ సెక్రటరీ రాముడు, నరసరావుపేట రీజియన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ బి.చిన్నపరెడ్డి, ఎన్సీబీసీ రీజినల్ సెక్రట రీ బి.కుమార్నాయక్, సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, నకరికల్లు, కారుమంచి, బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, మండలా ప్రభు త్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో నిర్బంధం
నెల్లూరు రూరల్: అక్రమ కేసులతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడ్ని జైల్లో నిర్బంధించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్రెడ్డి, బ్రహ్మనాయుడు మంగళవారం ములాఖత్ అయ్యా రు. ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఆరాధించే వ్యక్తి పిన్నెల్లి అని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి అని చెప్పారు. రెడ్బుక్లో భాగంగా వీరిని అక్రమ కేసు లో జైలుకు పంపారని ఆరోపించారు. మాచర్లలో ఇటీవల రెండు హత్యలు జరిగాయని, వారు గానీ బయట ఉంటే ఆ కేసులను సైతం వీరిపై మోపే వారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కక్షగట్టి తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. అరాచకాలు తప్ప.. అభివృద్ధి ఏదీ..? టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో అరాచకాలు అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని, సంబంధం లేని కేసులో పిన్నెల్లి సోదరులను జైలుకు పంపారని వెంకటరెడ్డి ఆరోపించారు. టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడి ఒకర్నొకరు చంపుకొంటే ఆ హత్యను పిన్నెల్లి సోదరులకు ఆపాదించారని చెప్పారు. సంబంధం లేని కేసులో 48 రోజులుగా జైల్లో గడుపుతున్నారని తెలిపారు. అనంతరం అశోక్బాబు మాట్లాడారు. ఎలాంటి సంబంధం లేని కేసుల్లో పిన్నెల్లి సోదరులను ఇరికించడం దారుణమన్నారు. ఇలా చేస్తే రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటాననే ఆ పార్టీ శ్రేణులే ఆలోచిస్తున్నారని చెప్పారు. -
ప్రశాంతంగా ప్రారంభమైన ఒకేషనల్ ప్రాక్టికల్స్
తొలిరోజు 186 మంది గైర్హాజరు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో 1,334 మంది విద్యార్థులకుగాను 1,148 మంది హాజరు కాగా మరో 186 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం 734 మందికి గాను 606 మంది హాజరు కాగా 128 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం 600 మందికి గాను 542 మంది విద్యార్థులు హాజరు కాగా, మరో 58 మంది గైర్హాజరయ్యారు. సతైనపల్లిలోని వేద ఒకేషనల్ జూనియర్ కళాశాల, డాక్టర్ సీఎస్జీఎల్ఎం కళాశాల పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు సౌజన్య సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి మాచర్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పకడ్భందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. -
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
చిలకలూరిపేట: పట్టణంలోని పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి హనుమంత వాహన సేవ గ్రామోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అగ్నిధ్యానం, నిత్యహోమం, బలిహరణ, మహాశాంతి హోమం వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై 9వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హయగ్రీవ హోమం, హనుమద్వామన సేవ ఘనంగా జరిగాయని, స్వామి వారు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారని తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు అశ్వవాహన సేవ నిర్వహించామ ని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదా లు స్వీకరించారని వెంకటాచార్యులు తెలిపా రు. 2న బుద్ధునితో నా ప్రయాణం నాటిక ప్రదర్శన రేపల్లె:పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్న బుద్ధినితో నా ప్రయాణం, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ దృశ్య రూపకాన్ని ప్రతిఒక్కరూ తిలకించాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దారం సాంబశివరావు, ది ఆది ఆంధ్ర నవ బుద్ధిస్ట్ సొసైటీ కార్యదర్శి దోవా రమేష్ రాంజీలు కోరారు. వీటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. రేపల్లె ప్రాంతానికి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ సహకారంతో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ దృశ్య రూపకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడు ఆలూరి బిక్షాలు, నాయకులు బేతపూడి భాస్కరరావు, కూచిపూడి రవీంద్ర, కనపర్తి రవికిరణ్, బేతపూడి వెంకటేశ్వరరావు, రెబ్బా కోదండరాం, చెరుకూరి లక్ష్మణరావు, కర్రా బాబురావు, నలుకుర్తి శశి కుమార్, నీలా రాజ్ కుమార్, చందోలు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు తాడేపల్లి రూరల్: ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఓ కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు ప్రకటించడంతో తోటి కళాకారులు మంగళవారం అతడిని అభినందించారు. ఉండవల్లికి చెందిన దర్శకుడు గాదె నాగభూషణం రూపొందించిన జీవనధార లఘు చిత్రంలో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు లభించింది. ఈనెల 31వ తేదీన హైదరాబాద్లో ఈ అవార్డును అందుకోవాలని సూచిస్తూ లేఖ అందడంతో ఉండవల్లిలో కళాకారుల్లో నూతన ఉత్తేజం పెరిగింది. ఈ సందర్భంగా గాదె నాగభూషణం మాట్లాడుతూ త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జీవనధార అనే లఘు చిత్రాన్ని రూపొందించామని అందులో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని, రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలలో ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు. -
ఏ ఏ గ్రామాల నుంచి ఎంతమంది
వ్యవసాయ పనులు లేకపోవడంతో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలలో పొగాకు బేరన్లలో పనులకు పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి కోపూరు రాజు, నీసు నాగయ్య, గేరా పెద్దోడు, కట్ట సౌరీలు, దారా లాజరు ముఠాల ద్వారా సుమారు 100 మంది పనులకు వలస వెళ్లారు. కాశిపాడు గ్రామం నుంచి 25 కుటుంబాలు, లగడపాడు గ్రామం నుంచి 60 మంది, పొడపాడు, కనిగండ్ల, 75 తాళ్లూరు, ఖమ్మంపాడు, బలుసుపాడు గ్రామాల నుంచి కూడా పలువురు వలస బాట పట్టారు. అమరావతి మండలం జూపూడి గ్రామంలోని 300 మందికి పైగా కూలీలు వలస వెళ్లారు. దొడ్లేరు, మునగోడు, పెద్దపాలెం పలు గ్రామాలు నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీలు పనులు కోసం తరలి వెళ్లారు. -
కక్షతోనే జోగి రమేష్పై అక్రమ కేసు
మాజీ మంత్రులు రాంబాబు, రజిని ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి జోగి రమేష్ మీద సీఎం చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికి అన్యాయంగా కేసులో ఇరికించారని, అయితే దీని వల్ల జోగి రమేష్కి క్రేజ్ పెరిగిందే కాని ఎక్కడా తగ్గలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన జోగి రమేష్, ఆయన సోదరుడు రామును మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని సోమవారం వేరువేరుగా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు. జోగి రమేష్తో పాటు ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ, కుమారుడు రాజీవ్ తదితరులకు ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుకున్నారు. భయపడే ప్రసక్తే లేదు.. అంబటి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష పూరితంగా కేసులు పెడితే పార్టీ బలహీన పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ నాయకులు భయపడకుండా పట్టుదలతో వైఎస్సార్ సీపీని బలపేతం చేస్తామని తెలిపారు. హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్లిన ఆయన సతీమణిపై కూడా కేసు పెట్టడం దారుణమన్నారు. అధికార మదం చూపిస్తే భవిష్యత్తులో వారికి సరైన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వ పతనం కనిపిస్తోందన్నారు. కార్యకర్తలు రెడ్బుక్ను సైతం లెక్కచేయడం లేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగరవేస్తుందన్నారు. లోకేష్ సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నారని, టీడీపీ పతనానికి అతనే నాంది పలుకుతున్నారని జోస్యం చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తెలిపిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయటానికి హిందూ మతాన్ని చంద్రబాబు అడ్డు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్న ఎన్టీఆర్ విగ్రహం ప్రజాధనంతో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు. మరింత బలంగా పోరాడతాం.. విడదల రజిని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులను కేసుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. బీసీ నాయకుడైన రమేష్ను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపినప్పటికీ, గతం కంటే బలంగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పారు. 20 నెలల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంపైనా రాని వ్యతిరేకత చంద్రబాబు సర్కారుపై వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలకలూరుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
భక్రిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య హవనం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరపరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్థానిక పుష్కరణిలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక పల్లకీలో స్వామివారిని ద్వాదశ ప్రదక్షిణలు జరిపించారు. అంతకుముందు రోజు ఆదివారం రాత్రి శమీవృక్ష పూజ నిర్వహించి, మయూర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ఎం. హరనాథ్ టెంకాయలు కొట్టి ప్రారంభించారు. డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్ఐ గౌతమ్కుమార్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివసూర్యనారాయణ, జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ గూడూరి అశోక్కుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఐజీ మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో కార్యాలయపు మేనేజర్ హిమంత్రావు, సీఐ (ఎల్/ఓ) వినోద్కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి: తెనాలి రూరల్ మండలం నంది వెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల వెంకట నాగపవన్ కుమార్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అవార్డును అందుకున్నారు. నందివెలుగు గ్రామ అభివృద్ధికి చేసిన కృషికిగాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. పురస్కార స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న నాగపవన్కుమార్, సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలలో అవార్డు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతా నగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం హంసవాహన సేవ, పెరుమాళ్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం త్రిదండి చిన్నజీయర్స్వామి, అహోబిల రామానుజ జీయర్స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గరుడ వాహనంపై విజయ కీలాద్రి గిరి పరిక్రమణను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడుగురాళ్ల: మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహాస్వామి 70వ కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణను ఆలయ అధ్యక్షుడు హంసావత్తు రామునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామిని ఉగ్రనరసింహునిగా అలకరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందంచే పౌలు సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
పల్నాడుమంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026ప్రశంసాపత్రాల ప్రదానంగణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 547.30 అడుగులకు చేరింది. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 7,601 క్యూసెక్కులు వదిలారు. సాక్షి, నరసరావుపేట: జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులకు జోహార్లు... పెద్దల స్ఫూర్తితో జిల్లాలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నుంచి రెవెన్యూ క్లినిక్లు ప్రతి సోమవారం నిర్వస్తున్నట్లు వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 9 వేల ఎకరాలు సేకరించున్నామని కలెక్టర్ తెలిపారు. రాజుపాలెం నుంచి అమరావతి వరకు 45 కిలోమీటర్లు మేర రెండు లైన్ల రహదారి అభివృద్ధి పరిచేందుకు రూ.143 కోట్ల నాబార్డు నిధులతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. జిల్లాలో ప్రధాన మంత్రి నగరవనం స్కీం ద్వారా కోటప్పకొండ, వినుకొండ, మాచర్ల, దేవరంపాడు అటవీ ప్రాంతంలో యోగశాల, పిల్లల పార్కులు ఏర్పాటు చేశామన్నారు. సమరయోధుల వారసులకు సన్మానం నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ వేదికగా సోమవారం గణతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. తొలుత జిల్లా డాక్టర్ కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజన సింహతో కలిసి పోలీసు, ఎన్సీసీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తొలుత వారు ఆహ్వానితులకు అభివాదం తెలిపారు. ప్రత్యేక వాహనంలో పరేడ్గ్రౌండ్ కలయ తిరిగారు. జిల్లా నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి హనుమంతును స్మరించుకున్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు సయ్యద్ జీనత్ బేగం, ఎం.వీరమ్మ (వీరమాత), పి.సావిత్రిరెడ్డి, డి.రామకృష్ణారెడ్డిలను కలెక్టర్ సన్మానించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, డ్వామా, ఏపీఎస్ఆర్టీసీ, గ్రామీణాభివృద్ధి, విద్య, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, గృహనిర్మాణ సంస్థ, వైద్యారోగ్యం, సాంఘిక సంక్షేమం, అటవీ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. డీఆర్డీఏ, ఉద్యాన, పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖల శకటాలు తొలి మూడు స్థానాలు పొందాయి. దేశభక్తి గీతాలకు పాఠశాలల విద్యార్థులు నృత్యాలు చేశారు. 7ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు, స్టాళ్లు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 203 ఉద్యోగులు, ఎన్జీఓ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చివరిగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, ఎల్డీఎం, ప్రకృతి వ్యవసాయం, అటవీ శాఖ, రహదారి భద్రత, అగ్నిమాపకం, మత్స్య, విద్యుత్, పశు సంవర్థక శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ప్రకృతి వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖల స్టాళ్లు తొలి మూడు బహుమతులు దక్కించుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి నరసరావుపేట గిరిజన సంక్షేమ బాలిక వసతి గృహం, వినుకొండ గీతాంజలి ఉన్నత పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా ప్రథమ బహుమతి పొందారు. స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్, శంకర భారతీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల సంయుక్తంగా ద్వితీయ బహుమతి, స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీలు సంయుక్తంగా తృతీయ బహుమతులు పొందాయి. జాతీయ గీతంతో వేడుకలకు ముగింపు పలికారు. -
దేవుని సహవాసమే శాంతి మార్గం
పెదకాకాని: దేవుని సహవాసమే శాంతి మార్గమని బైబిల్ మిషన్ అధ్యక్షుడు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యేల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాసుకు దేవుడు బయలపరిచిన 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జె. శామ్యేల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను ధార్మిక జీవన మార్గంలో ప్రోత్సహించాలన్నారు. మారు మనసే స్వస్థతకు మొదటి మెట్టు అని, ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత లభిస్తుందని బోధించారు. దేవుని చిత్తానుసారంగా ప్రయాణిస్తూ విధేయత, విశ్వాసం, సేవాభావంతో ముందుకు సాగితేనే క్రైస్తవ సమాజం బలంగా నిలబడుతుందని బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు అన్నారు. దైవ నిర్ణయం ప్రకారం ప్రతి విశ్వాసి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగితేనే జీవితం సార్థకం అవుతుందని రెవరెండ్ బి. ప్రసాద్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంగీత బృందం ప్రత్యేక గీతాలు ఆలపించింది. పెరిగిన భక్తుల తాకిడి బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని స్వస్తిశాలకు తరలి వెళ్లడంతో అక్కడ తాకిడి పెరిగింది. భక్తిశ్రద్ధలతో స్వస్తిశాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. మహోత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరు పెదకాకాని తోటకు వెళ్లడం, దేవునికి ప్రార్థించుట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. బైబిల్ మిషన్ మహోత్సవాలకు సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కర్ణాటక చెందిన ఐపీఎస్ అధికారిణి సంగీత, ఐఎఫ్ఎస్ అధికారిని రాధ, ఐఆర్ఎస్ అధికారి వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఆశీర్వాద వచనాలు అందజేశారు. మహోత్సవాలు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనున్నాయి. తెల్లవారుజామున ధ్యానం, ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు క్రైస్తవ కీర్తనల ఆలాపన, దైవ సందేశాలు, మహోత్సవాల కన్వీనర్ నివేదిక సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
యువకుడి అవయవాల దానంతో ఆరుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాల దానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ కుమారుడైన ఇంజినీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు(22) నిడుముక్కల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలిలో చికిత్స కోసం చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు బంధువులు తీసుకొచ్చారు. అమర్బాబు చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. జీవన్దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో అవయవాల దానానికి బాధిత కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయవాలను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా ‘గుండె’ను తిరుపతికి తరలించారు. కళ్లను తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్కు తరలించారు. లివర్, కిడ్నీలు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లోనే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాలను ప్రసాదించారు. అమర్ బాబు తల్లి కోటేశ్వరమ్మను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పరామర్శించారు. హాస్పిటల్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, ఏపీ బిజినెస్ హెడ్, ట్రాన్స్ప్లాంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్చౌదరి, జీవన్దాన్ కో ఆర్డినేటర్లు కొడాలి అనూష, అఖిలేష్ చింతమనేని తదితరులు కూడా కోటేశ్వరమ్మను అభినందించారు. -
ఉత్తమ సేవకు పురస్కారాలు
షేక్ మహబూబ్ సుభాని, ఉప విద్యాశాఖాధికారి, నరసరావుపేట ఆర్.వెంకటేశ్వరరావు, గ్రేడ్–2 ఈఓ, నరసరావుపేట ఎం.సురేష్బాబు, ఏఎంవీఐ, నరసరావుపేట వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వండి సత్తెనపల్లి: వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లి వడ్డెర కాలనీలో సోమవారం ఆయన పర్యటించి వడ్డెర్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను స్థానిక వడ్డెరలను కలిసి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటికీ 90 మంది వడ్డెర్లు బేల్దారి పని చేసుకుంటూ, రిక్షాలు తొక్కుకుంటూ దీన స్థితిలో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్లు, రాయితీలు తెలియడం లేదని, ఎలా తెచ్చుకోవాలని తనను నేటికీ అడుగుతున్నారన్నారు. ఇప్పటికీ రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో వడ్డెర్లు కొనసాగుతున్నారంటే ఈ ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓట్లు కలిగిన వడ్డెర్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి విద్యకు గాని, సామాజిక అభివృద్ధికి గాని, ఆర్థిక అభివృద్ధికి గానీ ప్రభుత్వాలు తోడ్పాటు ఇవ్వడం లేదని వాపోయారు. వడ్డెర్లలో చాలామందికి పెన్షన్లు కూడా అందడం లేదన్నారు. వడ్డెర్లు తమ పిల్లలను బాగా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా మేడికొండూరు కోపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సంజీవరావు, వడ్డెర సంఘ నాయకులు ఒంటి పులి వీరరాజు, పసుపులేటి బాలయ్య, బురుసు అంకేశ్వరరావు, ప్రసాద్, శ్రీకాంత్, శ్రీను పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి నిందితుడిపై పోక్సో కేసు నమోదు వినుకొండ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వినుకొండ సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన షేక్ బాజీతో సహజీవనం చేస్తుంది. తల్లిలేని సమయంలో ఆమె కుమార్తైపె బాజీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో మహిళ బంధువులు బాజీపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ కృతికశుక్లా సేవా పురస్కారాలు అందజేశారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, డీఎఫ్ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు. – నరసరావుపేట రూరల్ వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు నరసరావుపేట రూరల్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల: స్కూటీని లారీ ఢీకొనటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కొండమోడు జంక్షన్ వద్ద సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... రెంటాల గ్రామానికి చెందిన ఫరీద్(60) తన బంధువైన సుందరయ్య కాలనీకి చెందిన మహిళను స్కూటీపై ఎక్కించుకొని వస్తుండగా కొండమోడు జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా ఐచర్ లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫరీద్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి దగ్గరి బంధువైన మహిళకు తలకు గాయం కావటంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలోచికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నేడు పెదకూరపాడు జెడ్పీ హైస్కూల్ 80వ వార్షికోత్సవం
పెదకూరపాడు: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 80 వసంతాల వేడుకకు సిద్ధమైంది. మంగళవారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ విద్యార్థులు పూర్వ విద్యార్థుల, తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. 1946 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే దర్శి లక్ష్మయ్య దాతృత్వం, సహకారంతో పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చి నిత్య నూతనంగా శోభిల్లుతుంది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దేశరక్షణ, రాజకీయ, వ్యాపార, వైద్య, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. హాజరుకానున్న ప్రముఖులు .. పాఠశాల 80 వసంతాల వేడుకలకు ఇక్కడ విద్యను అభ్యసించి అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. మాజీ ఎకై ్సజ్ శాఖ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అతోటి మురళి ముకుంద్, ప్రాఫిట్ షూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివ కోటేశ్వరరావు తోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. హాజరై.. ఆశీర్వదించండి పాఠశాల 80 వసంతాల వేడుకకు విద్యార్థులు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గతంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు అందరూ హాజరై విద్యార్థులను ఆశీర్వదించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకాని వెంకటరమణ కోరారు. దాతల సహకారంతో ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులకు సన్మానం, గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హాజరుకానున్న పాఠశాల పూర్వ విద్యార్థులు, రాజకీయ నేతలు -
పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
కారెంపూడి: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు కారెంపూడిలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులంతా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వియ్ వాంట్ జస్టిస్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, వియ్ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర రైతు విభాగం అదనపు కార్యదర్శి కొమ్మిరెడ్డి నల్ల గురవారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిన అల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీటీసీ షేక్ షఫీ, వివిధ హోదాల నాయకులు షేక్ ఆరీఫ్, షేక్ మొహమ్మద్, కిల్లా రత్నకుమారి, జాన్పాల్ నాయక్, జిలానీ, మస్తాన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డివిజన్, సిటీ యూనిట్ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని అమరావతి, నూజెండ్ల తహసీల్దార్లు డేనియల్, జి.రమేష్కుమార్, డెప్యూటీ తహసీల్దార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో ముందుగా ఎటువంటి ప్రకటనలు, పబ్లికేషన్లు, ఓటరు జాబితా ప్రకటించకుండానే ఎన్నికలు నిర్వహించినట్లుగా సూచిస్తూ జిల్లా ఎన్నికలు వచ్చే పిభ్రవరి రెండో తేదీన నిర్వహిస్తామని ఏపీఆర్ఎస్ఎ పల్నాడు వాట్స్ప్ గ్రూపులో కొందరు పోస్టు చేశారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఓటరు జాబితాలను పబ్లికేషన్ చేశామని పేర్కొన్నారన్నారు. కాని ఆ జాబితా ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్, కలెక్టరేట్ ఆఫీసుల్లో పొందుపర్చలేదన్నారు. జిల్లా ఎన్నికల గురించి ఎటువంటి పత్రికా ప్రకటన ముందుస్తుగా ఇవ్వలేదన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు సక్రమంగా జరగనందున ఆ ఎన్నికలు రద్దుచేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఓటరు జాబితా ప్రకటించి బైలాస్ మేరకు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి: గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి యువనర్తకి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యకు అరుదైన అవకాశం లభించింది. రిపబ్లిక్ పెరేడ్లో అన్ని రాష్ట్ర సంప్రదాయ నృత్యవిభాగంగా తెలుగురాష్ట్రాల నుండి పాల్గొన్నవారిలో తేజస్వి ప్రఖ్య ఒకరు వందేమాతరం గీతంకు చేసిన బృందనాట్యంలో పాల్గొన్నారు. దూరదర్శన్ ’బి’ గ్రేడ్తో పాటు కూచిపూడి నృత్యం ఎంఏ చేసిన ప్రఖ్య, ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటూ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఆచా ర్య పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద కూచిపూడిలో ‘నట్టువాంగం‘లోననూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం పీహెచ్డీకి ఎన్ఈటీ, దూరదర్శన్ బీహై ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని సోమవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరిగా జరిగాయి. టచ్ పండ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన శావల గోపికృష్ణ, నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన ముక్కపాటి లింగయ్య చౌదరి కంబైన్డ్ గిత్తలు 4,200 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 40 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన కాసుల ఆంజనేయులు గిత్తలు 4,122.10 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.30 వేలను, ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన గొర్ల శివన్నారాయణకు చెందిన గిత్తలు 4,108.4 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.25 వేలను, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన డా. కాకాని వెంకట సురేంద్ర గిత్తలు 4,081.10 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.20 వేలను, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన పులగం త్రిషగ్నా రెడ్డి, జెసితారెడ్డిలకు చెందిన గిత్తలు 3,970.2 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 16 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవస్థానం వరకు బహుమతులు ఇచ్చారు. మిగిలిన 17 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, జి.సుమంత్రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్రెడ్డి, జి.కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. -
కళాకారుడు రవికుమార్కు జాతీయ పురస్కారం
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన రంగస్థల, పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక గ్రేటర్ వరంగల్లో ఈనెల 25న నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో సత్తెనపల్లికి చెందిన బెజగం కుమార్ 2015 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాపరిషత్ల్లో విభిన్న, వైవిద్య పౌరాణిక పాత్రలలో ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను రంజింప జేసి నందుకుగాను ఈ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. జాతీయ పురస్కారం అందుకుంన్న రవికుమార్ను సత్తెనపల్లిలోని వివిధ కళా సంస్థల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం..
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలను దోపిడీ, దుర్మార్గాల వైపు నడిపిస్తున్నాడు. శాంతిభద్రతలను కాపాడటం చేతకాని పోలీసులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ అమాయకులైన దళితులను టీడీపీ కక్షలకు బలిపెట్టడం మంచిదికాదు. కూటమి ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం. భయపడటానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. వైఎస్ జగన్ నాయకత్వలో అక్రమాలపై తిరుగుబాటు చేస్తాం. ఊరు బాగుంటే చాలు, ఇదే చివరి హత్య కావాలని చెప్పిన సాల్మన్ బిడ్డల పెద్ద మనసుని అభినందిస్తున్నా. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
దళితులను బలిగొంటున్న చంద్రబాబు సర్కార్
దాచేపల్లి, పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దళితులను బలితీసుకుంటోందని, ఎర్రబుక్ పాలన పేరిట ఎర్రి పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మన్ను ఇటీవల టీడీపీ గూండాలు హత్య చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన సాల్మన్ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గూండా రాజ్యం సాగుతోందని, నియోజకవర్గాన్ని రక్తమయం చేస్తూ దళితలను అణచివేయడంతోపాటు మరణకాండకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ చంద్రబాబు పరిపాలనలో దళితులు, బలహీనవర్గాల వారిని హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వీటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ తెలుగుదేశం నాయకుల ద్వారా చేయిస్తోందని మండిపడ్డారు. పొన్నూరులో టీ స్టాల్ వద్ద ఉన్న ఎస్సీ సర్పంచ్పై రాడ్ తీసుకుని దాడి చేస్తే నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ని టీడీపీ గూండాలు హత్య చేసినా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు చేయిస్తున్న నరమేధం అని ఆరోపించారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎర్రబుక్ పాలన పేరిట ఎర్రి పరిపాలన వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
దేవాలయ నిర్మాణానికి బిట్రా విరాళం
పెదకూరపాడు : లగడపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భద్రావతి సమేత భావనా రుషి స్వామి దేవాలయానికి రథసప్తమి పండుగను పురస్కరించుకొని సత్తనపల్లికి చెందిన వైద్యులు బిట్రా నాగరాజు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభను నెలకొల్పేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ అనుముల వెంకట్రావు, సభ్యులు పాపారావు, రామారావు, నాగేశ్వరరావు, బండారు నాగరాజు, తిరుపతిరావులు నాగరాజును సత్కరించారు. తెనాలి: పట్టణ షరాఫ్బజారులోని భద్రావతి సమేత భావనాఋషిస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథసప్తమి పర్వదినమైన ఆదివారం వసంతోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఉంచి, పట్టణంలో ఊరేగిస్తూ వివిధ రంగులతో వసంతోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పలు ప్రాంతాల్లో స్వామివారికి ప్రసాద నివేదనలు జరిపారు. పద్మశాలీయ సంఘీయులందరూ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్టులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, దేవాలయ కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్ పాల్గొన్నారు. రూ.18.43 లక్షల విలువైన సిగరెట్లు సీజ్ తెనాలిరూరల్: తెనాలిలో అక్రమంగా నిల్వ చేసిన సిగరెట్లను విజిలెన్స్, జీఎస్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. సుమారు రూ.18, 43,200 విలువైన ఎటువంటి బిల్లులు లేని సిగరెట్లను అధికారులు గుర్తించారు. పట్టణంలో ఆదివారం జీఎస్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా వివిధ గోడౌన్లపై దాడులు చేశారు. మార్కెట్ ప్రాంతంలోని అంజయ్య వీధిలో కౌతరపు నమ్మయ్య నిర్వహిస్తున్న గోడౌన్లో రూ. 6.40 లక్షల విలువైన బిల్లులు లేని సిగరెట్లు, అలానే నందులపేట దేవినేని వారి వీధిలో వేములపల్లి మురళీకృష్ణ, ఉయ్యూరు సుబ్బారావుగుప్తాలకు చెందిన రూ. 12,03,200 విలువ గల సిగరెట్లను గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. -
సూర్యభగవానునికి ప్రత్యేకపూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయంలో ఉన్న సూర్యదేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యభగవానునికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాలనా సూర్యభగవానుడికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారికి సహస్రనామ పూజ చేశా రు. సూర్యదేవాలయ అర్చకుడు సప్తగిరి వరప్రసాద్ మాట్లాడుతూ అమరేశ్వరాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పడమర ముఖంగా సూర్యభగవానుడు ప్రతిష్టించటం ప్రత్యేకమన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరువెస్ట్): గుంటూరులో ని శ్రీనగర్ ఆరో వీధిలో కొలువైన త్రిశక్తి పీఠం శ్రీరేణుకమ్మ పెద్దఅంకమ్మ నాగేంద్రస్వామి వార్ల నలభైవ వార్షిక కొలుపుల మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. నిత్య పూజలు అనంతరం భక్తి ప్రపత్తుల నడుమ దేవతమూర్తులను వాహనంపై అలంకరించి, మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలు, కనకతప్పట్లతో ఊరేగింపుగా నగరోత్సవం కొనసాగింది. ప్రధానవీధుల్లో మహిళలు వారు పోసి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి హారతి పట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో త్రిశక్తి పీఠం నిర్వాహకులు కస్తూరి యలమంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నాదెండ్ల: పల్నాడు జిల్లా చిరుమామిళ్ల గ్రామానికి చెందిన గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి గుంటూరులోని రెడ్డి లేడీస్ హాస్టల్ బ్లాకు నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళాన్ని అందించారు. హాస్టల్ వ్యవస్థాపకురాలు ఉడుముల కోటిరత్నమ్మ ఆధ్వర్యంలో గుంటూరు స్తంభాల గరువులోని రెడ్డి లేడీస్ హాస్టల్ పదేళ్లుగా సేవలందిస్తుంది. ఇందులో ఒక బ్లాక్ నిర్మాణానికయ్యే ఖర్చు రూ.25 లక్షలను హాస్టల్ అధ్యక్ష కార్యదర్శు లు ఉడుముల శ్రీనివాసరెడ్డి, వణుకూరి సూరారెడ్డికి అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాస్టల్ నిర్వాహకులు ఆయన్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యక్షుడు భీమవరపు పిచ్చిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ రాజేశ్వరరావు, యన్నం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి రూ.2 లక్షల విరాళం... గొరిజవోలు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న గంగా భ్రమరాంబికా సమేత మల్లిఖార్జునస్వామి ఆలయానికి గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందించారు. విరాళాన్ని కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డికి అందించారు. కార్యదర్శి చల్లా బసివిరెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్ట్రోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ ఏడాది ‘నా భారత్ – నా ఓటు‘ (మై ఓట్, మై ఇండియా) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి అవార్డు లభించింది. -
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షునిగా కె.ఎస్.కె.షరీఫా, ప్రధాన కార్యదర్శిగా బాళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కె.కృష్ణారావు, ఎస్కె.ఎండి.ఇబ్రహీం, టి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాసరావు, షాహినా సుల్తానా, కార్యదర్శులుగా దమ్మాటి శ్రీనివాసరావు, యు.శివానంద్కుమార్, బి.ప్రజామూర్తి, సాని శ్రీనివాసరావు, వి.హైందవకృష్ణ, మీసాల గోపి, రాష్ట్ర కౌన్సిలర్లుగా సయ్యద్ కరిముల్లా, వి.వి.రవికుమార్, బండి రమేష్బాబు, ఎస్ఎస్ఎన్ మూర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా జి.ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, పరిశీలకునిగా ఈ.వి.రామారావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు, గుంటూరుజిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా షరీఫా, కార్యదర్శిగా శ్రీనివాసరావు -
రాతియుగంవైపు రాష్ట్రం
గత ప్రభుత్వంలో పల్నాడులో శాంతిభద్రతలు నెలకొనేలా కృషిచేశాం. గ్రామాల నుంచి వెళ్లి బయట నివసిస్తున్న వారిని పోలీసుల సాయంతో వెనక్కి రప్పించి కుటుంబంతో ప్రశాంతంగా బతికే వాతావరణం తీసుకొచ్చాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం విజనరీనని చెప్పుకుంటూనే రాష్ట్రాన్ని మళ్లీ రాతి యుగంవైపుకి నడిపిస్తున్నాడు. రెడ్బుక్ పాలనతో కక్ష రాజకీయాలకు తెరలేపాడు. గ్రామానికి ఎందుకొచ్చావ్ అని ప్రశ్నిస్తున్న పోలీసులు పనిచేయడం చేతకాని అసమర్థుల కిందే లెక్క. అలాంటి వారు ఉద్యోగాలకు పనికిరారు. తక్షణమే రాజీనామా చేయాలి. బాధితులకు భరోసా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థతే అవుతుంది. – మేకతోటి సుచరిత, మాజీ హోంమంత్రి -
అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి
సాల్మన్ను ప్రత్యర్థులు దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి దాడి చేస్తే, అపస్మారక స్థితిలో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో పోలీసులు ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, నిందితులకు అండగా ఉండి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన 300 కుటుంబాలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గం. బయటకెళ్లిన వారు ఎవరైనా మరణిస్తే పోలీసుల రక్షణ లేకుండా గ్రామస్తుడి అంత్యక్రియలు చేసుకోలేని దుస్థితి. పోలీసుల రక్షణలో అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని భయపెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం మారిన నాటి నుంచి పల్నాడులో ఫ్యాక్షన్ వాతావరణం తీసుకొచ్చారు. – గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రెండేళ్లుగా 400 కుటుంబాలు ఒక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయంటే శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. సాల్మన్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అందుకు కారణమైన పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి. ఈ దారుణ హత్యపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోగా... కేసును నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నారు. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలి. – కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెనుబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఏడాది పాలన పూర్తి కాకుండానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 20 నెలల్లో చంద్రబాబు పాలన మీద ప్రజా వ్యతిరేకత పతాకస్థాయికి చేరింది. పిన్నెల్లి మాదిరిగానే బొల్లాపల్లి నియోజకవర్గం పలుకూరులో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. గ్రామంలో భూములన్నీ బీడు బారిపోయాయి. ఇలాంటి దుస్థితిని సృష్టించిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది. – బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే ● -
పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం
ఎమ్మెల్యే యరపతినేని డైరెక్షన్లో సీఐ భాస్కరరావు సారథ్యంలో సాల్మన్ని దారుణంగా హతమార్చారు. దాదాపు రెండేళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటూ భార్యను చూడటానికి వచ్చిన సాల్మన్ని చంపడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. గూండాలు, దోపిడీదారులకు అండగా పోలీసులు పనిచేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేయడం చేతకాక దాడులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి. మెడికల్ కాలేజీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. – టీజేఆర్ సుధాకర్బాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
టీడీపీ క్షుద్ర రాజకీయాలు
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీకి అండగా నిలిచే వారి మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే నీచ సంస్కృతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాబలాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ దేహాన్ని ఖననం చేయడానికి కూడా హైడ్రామా చేశారు. కడసారి చూపుకి కూడా నోచుకోనీయకుండా కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను అడ్డుకున్నారు. కనీస మానవత్వం లేకుండా అడుగడుగునా క్షుద్ర రాజకీయాలు చేశారు. – పూనూరు గౌతమ్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి -
నీట్ ఎస్ఎస్లో సాతులూరు వైద్యుడి ప్రతిభ
నాదెండ్ల: జాతీయస్ధాయిలో నిర్వహించిన నీట్ సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్ నార్నె సాయివెంకటేష్ 400వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నార్నె రామచంద్రయ్య, అపర్ణతులసి దంపతులకు ఇరువురు కుమారులుకాగా, పెద్ద కుమారుడు సాయివెంకటేష్ కజకిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి అనంతరం గన్నవరం సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్ సూపర్స్పెషాలిటీ వైద్య ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈయన సోదరుడు నాగతరుణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నరసరావుపేట: స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 1979–80లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఐఎంఏ హాల్లో ఆదివారం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత కలిసిన ఆ మిత్రులు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నాడు పాఠశాలలో చదువుకున్న, ఆడుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం తాము ఏం చేస్తున్నారో చెబుతూ కుటుంబ సభ్యుల వివరాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆత్మీయ సమావేశాన్ని పూర్వవిద్యార్థులు నిర్మాప్రసాద్, భూసా సాంబశివరావు, బేతపూడి రాధ, కాకుమాను శ్రీనివాసరావు, చల్లా నాగరాజు నిర్వహించారు. ఏటా సమావేశం ఏర్పాటు చేసుకుందామని తీర్మానించుకుని, ఆత్మీయ వీడ్కోలు పలికారు. దక్షిణ భారత సైన్స్ పోటీలో జిల్లాకు ద్వితీయ స్థానం నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన– 2026లో పల్నాడుజిల్లా సత్తా చాటినట్టు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్.రాజశేఖర్ ఆదివారం తెలిపారు. హైదరబాద్లో ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఆరు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులు రాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నకరికల్లు మండలం కండ్లగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు గవిని శ్రీనివాసరావు రూపొందించిన విద్యుదయస్కాంతత్వం ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి లభించిందని తెలిపారు. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో కఠినంగా భావించే విద్యుదయస్కాంతత్వం పాఠ్యాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా 16 నమూనాలను శ్రీనివాసరావు రూపొందించారు. టెస్టర్, బల్బుల అనుసంధానం, సమాంతర సంధానం, అయస్కాంత బలరేఖలు, ఫారడే ప్రయోగం తదితర నమూనాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. శ్రీనివాసరావును జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సైన్స్ అధికారి రాజశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. -
మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి
ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి రెంటచింతల: లోక రక్షకుడిగా ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిన కన్య మరియతల్లి మహిమాన్వితురాలిగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుందని ఫిరంగిపురం విచారణ గురువులు రెవ.ఫాదర్ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరుణాళ్ల వేడుకలను పురష్కరించుకుని నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలలో భాగంగా ఆదివారం ఆరోగ్యమాత మందిరం వద్ద విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన సమిష్టి దివ్యపూజాబలిని సహాయక గురువులు రెవ.ఫాదర్ ప్రసన్న కుమార్తో కలిసి సమర్పించి ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి మాట్లాడారు. ఆధ్యాత్మికతతో ఏర్పడిన సమాజంలో ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. ముందుగా జపమాలతో ప్రారంభించిన దివ్యపూజాబలిలో కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ‘నీట్ ఎస్ఎస్’లో 1293 ర్యాంక్ రెంటచింతల: వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికై 2025 డిసెంబర్ 27న నిర్వహించిన నీట్ ఎస్ఎస్ పరీక్షలో మండల కేంద్రమైన రెంటచింతలకు చెందిన యువ వైద్యుడు తన్నీరు దుర్గాగణేష్ 1293వ ర్యాంక్ సాధించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్లోని మెడిసిటీ హాస్పటల్లో ఎంఎస్ (జనరల్)ను గణేష్ పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. న్యూరాలజిస్టు కోర్సులో చేరాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. గణేష్ సతీమణి దీపిక కూడా ఆదిలాబాద్ గ్రామీణ పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. -
గురజాలలో యరపతినేని గూండారాజ్యం
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సాల్మన్ హత్యతో వచ్చిన ప్రజావ్యతిరేకత ద్వారా చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారిని సహకరించిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. నిందితులను చట్టపరంగా శిక్షించే దాకా న్యాయస్థానాల్లో పోరాడతాం. గురజాలలో గూండా రాజ్యం నడుపుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్కి ప్రజాస్వామ్యం బలం చూపిస్తాం. దాడిచేసి చంపారని ఫోన్ చేసిన బాధితులతో గ్రామంలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించిన సీఐ భాస్కరరావుని న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేలా చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో చూపించిన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించకతప్పదు. – కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
జగనన్నని అభిమానిస్తే చంపేస్తారా?
వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానించి అండగా ఉన్నారని దళితులను కూటమి ప్రభుత్వం హత్యలు చేయిస్తుంది. జగన్ని అభిమానిస్తే చంపేస్తారా..జగన్కి అండగా ఉంటే చంపేస్తామని సంకేతాలను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు మందా సాల్మన్ని చంపి ఆనందంగా ఉండవచ్చు..కానీ రేపు ఖచ్చితంగా ప్రతీకారాలు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకొవాలి. ప్రతికారం తీర్చుకోలేనంత దద్దమ్మలు దళితులు కాదని, ఓటు అనే ఆయుధం ద్వారా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు. సాల్మన్ హత్యని వైఎస్సార్ సీపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ -
బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాడులు, వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. అయినా అవన్నీ లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మందా సాల్మన్ హత్య జరిగింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వ్యక్తుల మీద దాడులు పరిపాటిగా మారాయి. సామాన్యుడు పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. బాధితులనే నిందితులుగా మార్చి చూపిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం నుంచి 300 కుటుంబాలు బయటకు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇది పోలీసుల చేతకానితనమే. మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. – విడదల రజని, మాజీ మంత్రి వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళితులను చంపుకుంటూ పోతున్నారు. ఇటువంటి విష సంస్కృతి టీడీపీ నేతలకు తగదు. – చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, బహిష్కరణలు, వేధింపులే దీనికి నిదర్శనం. సాల్మన్ను దారుణంగా హత్య చేసి పది రోజులవుతున్నా ఇంతవరకు ఏమాత్రం స్పందించని చంద్రబాబు... వైఎస్సార్సీపీ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలుసుకుని గ్రామంలోకి టీడీపీ నాయకులను పంపించి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. సాల్మన్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దళితుల గ్రామ బహిష్కరణ జరిగి రెండేళ్లవుతుంటే ఒక్కసారి కూడా పట్టించుకోని చంద్రబాబు కారణంగానే ఈ హత్య జరిగింది. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. గ్రామంలో శాంతియుత వాతావరణం తీసుకురావాలి. గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాలను రప్పించాలి. సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. – గోపిరెడ్డి, వైఎస్సార్సీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సాల్మన్ హత్యను ఈ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. దళితుల మీద దాడులను టీడీపీ నాయకులు ఆపకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. – నారాయణమూర్తి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ● -
17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
నరసరావుపేట: జిల్లాలో 17 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందుగానే దరఖాస్తు చేసుకుంటే 18 ఏళ్లు నిండగానే ఓటరు కార్డు పొందవచ్చన్నారు. ఆధారాలతో ఆన్లైన్లో సులభంగా ఎవరికి వారే దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ప్రజాస్వా మ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని, ఓటరుగా నమోదు చేసుకున్న వారు మాత్రమే ఓటు వేసే అవకాశం పొందుతారని తెలి పారు. ఎవరికి వారు తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో, లేదో గమనించుకుంటూ ఉండాలన్నారు. ఓటు హక్కు ఆవశ్యకత గురించి వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ అవార్డులు ప్రదా నం చేశారు. నూతనంగా ఓటరుగా గుర్తింపు పొందిన యువతకు కార్డులు అందజేశారు. సుదీర్ఘ కా లంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను సత్కరించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ఓటరు నమోదు కార్యక్రమంపై ‘నా దేశం–నా ఓటు’ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో చలో ఢిల్లీ
మందా సాల్మన్ హత్యపై నరసరావుపేట: చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని, అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీకి అండగా ఉన్న దళితులపై దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ అగ్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీ గూండాల దాడిలో మందా సాల్మన్ దారుణ హత్యకు గురై పది రోజులైన సందర్భంగా ఆదివారం నరసరావుపేటలోని కాసు మహేష్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాల్మన్ సంస్మరణలో కూటమి ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనంతరం నాయకులంతా భారీ ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాల్మన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చేతనైతే వైఎస్ జగన్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి పల్నాడు ప్రజల మనసు గెలుచుకోవాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేతకాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వారే ఎప్పటికీ అధికారంలో ఉండొచ్చనే పగటి కలలు మానుకోవాలని అన్నారు. వారి వేధింపులను లెక్కచేయకుండా పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. త్వరలోనే వైఎస్సార్సీపీ ఆధ్వరంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్లో టీడీపీపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. దళితులపై దాడులకు టీడీపీ నాయకుల శ్రీకారం -
సీబీఐతో విచారణ జరిపించాలి
అమాయక దళిత కుటుంబంపై దాడి చేసి చంపితే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీసం కలవడానికి ఇష్టపడలేదు. దళితుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి అంత లెక్కలేనితనం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా ఆయన పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, దళిత మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఒక మహిళను దారుణంగా చంపితే దళిత చట్టాల ప్రకారం వారిని ప్రభుత్వం ఆదుకుంది. కానీ చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గం. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి -
గణతంత్ర ఏర్పాట్లు పరిశీలన
నరసరావుపేట: నరసరావుపేటలో సోమవారం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదివారం పరిశీలించారు. కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించనున్నారు. చేసిన ఏర్పాట్లను గురించి ఆర్డీఓ కె.మధులత, తహసీల్దార్ కె.వేణుగోపాలరావు ఆమెకు వివరించారు. అలాగే జిల్లా అధికారులకు తేనేటి విందు ఇచ్చేందుకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం కూడా ముస్తాబైంది. అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కాగా, వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 203మంది అధికారులు, ఎన్జీఓలకు అవార్డులను అందజేయనున్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్కు సర్వం సిద్ధం
సత్తెనపల్లి: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 131 జూనియర్ కళాశాలల్లో 34,371 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీకి సంబంధించి ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు 12,604 మంది ఉన్నారు. వీరి కోసం 77 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఒకేషనల్ విద్యార్థు లకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 2,082 మంది ఉన్నారు. విద్యార్థులకు ఈసారి సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఏదైనా కళాశాలలో 50 మంది లోపు విద్యార్థులు ఉంటే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో ప్రాక్టికల్స్కు హాజరు కావలసి ఉంటుంది. సెల్ఫ్ సెంటర్లు కలిగిన ప్రైవేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా అవకతవకులకు పాల్పడుతున్నాయని ఏటా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈసారి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. కెమెరాలు నేరుగా కమిషనర్ కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి. -
నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధమైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన గరడిలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి విభాగంలో 9 బహుమతుల చొప్పున 72 మంది విజేతలకు మొత్తం రూ. 26 లక్షల నగదుతోపాటు మరో రూ.2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. బహుమతులు ఇలా.. 26వ తేదీన తొలి ముగ్గురు విజేతలకు టచ్ పళ్ల విభాగంలో రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు చొప్పున అందిస్తామన్నారు. 27న రెండు పళ్ల విభాగంలో రూ. 50 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు... 28న నాలుగు పళ్ల విభాగంలో రూ. 60 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు... 29న ఆరు పళ్ల విభాగంలో రూ. 70 వేలు, రూ. 50 వేలు, రూ. 40 వేలు... 30న న్యూ కేటగిరీలో రూ. 80 వేలు, రూ. 60 వేలు, రూ. 45 వేలు... 31న సబ్ జూనియర్ విభాగంలో రూ. 90 వేలు, రూ.70 వేలు, రూ. 50 వేలు.. ఫిబ్రవరి ఒకటో తేదీన జూనియర్స్ విభాగంలో రూ. లక్ష, రూ. 80 వేలు, రూ. 60 వేలు చొప్పున తొలి ముగ్గురు విజేతలకు అందజేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 3న సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా బుల్లెట్ బైకు, రెండో బహుమతిగా యూనికాన్ బైక్, మూడో బహుమతిగా రూ. 90 వేలు, నాగులో బహుమతిగా రూ.70 వేలు, ఐదో బహుమతిగా రూ. 50 వేలు ఆయా గిత్తల యజమానులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు వైఎల్ మర్రెడ్డి, జి.సుమంత్రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, బి.రామకృష్ణ, జి.కస్పాల్రెడ్డి, వై.జోజిరెడ్డి, వెన్నా కోటిరెడ్డి, కె.జోసఫ్రెడ్డి, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, జి.రంజిత్కుమార్ రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, పి.రాజారెడ్డి, జి.రాజేష్రెడ్డి తదితరులున్నారు. -
ఆమె కీలకం
పల్నాడుపాలకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లే దేవుళ్ళు. అలాంటి ఓటర్ల ఆవశ్యకతను తెలియజేసేందుకు గుర్తుగా ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 7తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2600, గరిష్ట ధర రూ.3800, మోడల్ ధర రూ.3200 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 548.90 అడుగులకు చేరింది. కుడికాలువకు 10,000, ఎడమకాలువకు 7,029 క్యూసెక్కులు విడుదల చేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.4116 టీఎంసీలు. -
కాలమిస్ట్ వెనిగళ్ల వెంకటరత్నం మృతి
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు, కాలమిస్ట్ వెనిగళ్ల వెంకటరత్నం (88) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో మృతి చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరత్నం స్వస్థలం తెనాలి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడ. హైస్కూలులో చదివేరోజుల్లోనే సాహిత్యంపై అనురక్తి ఏర్పడింది. తెనాలిలో డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్ వెళ్లారు. కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఉద్యోగంలో చేరారు. 1972లో రసరంజని పేరుతో నాటక సంస్థను ఏర్పాటుచేసి నాటకాలు ఆడారు. 1982 నుంచి ప్రీలాన్స్ జర్నలిస్టుగా, కాలమిస్ట్గా పదేళ్లపాటు పత్రికలకు వ్యాసాలు రాశారు. హరిత విప్లవకారుడు నార్మన్ బోర్లాగ్పై వ్యాసం ప్రముఖమైంది. రసరేఖ పేరుతో హైదరాబాద్లో ఆయన నిర్వహించిన మూడురోజుల కార్యక్రమాలు బాగా గుర్తింపు పొందాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ఉధృతంగా జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ‘సారా పోరు’ బుక్లెట్ను ప్రచురించారు. ‘ఆంధ్రాప్యారిస్ తెనాలి’ పుస్తకాన్నీ తీసుకొచ్చారు. తాను పనిచేస్తున్న కంపెనీలో మేనేజరుగా రిటైరైన వెంకటరత్నం విశ్రాంత జీవితాన్ని హైదరాబాద్లోనే గడిపారు. -
ట్రాఫిక్ చిక్కులు
నరసరావుపేట టౌన్: జిల్లా కేంద్రం నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోంది. పట్టణంలో 1.50 లక్షలకు పైగా ఉన్న జనాభాకు తోడు ప్రతిరోజు వేలాది మంది జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. ఏటికేడు వాహనాల సంఖ్య పెరుగుతున్నా ఆమేరకు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించక పోవడంతో నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో వాహనదారులు, పట్టణవాసులు కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని సమయాల్లో ఉన్నతాధికారులు, నాయకులకు సంబంధించిన వాహనాలకు తోడు ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో ప్రధాన సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని సార్లు ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కొని బయట పడటానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అంబులెన్స్లు సైతం మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్లో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. మల్లమ్మ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారటంతో ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది. సిబ్బంది లేక.. సిగ్నల్స్ పనిచేయక.. ట్రాఫిక్ నియంత్రణకు ఐదేళ్ల క్రితం ప్రైవేటు నిర్వాహకులు పట్టణంలో మూడు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అవి కొన్ని నెలలుగా పనిచేయటం లేదు. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం సిబ్బందికి సవాల్గా మారింది. ప్రధానంగా మల్లమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్, ఆర్యూబీ వద్ద నాలుగు వైపుల నుంచి వాహనాలు వస్తుంటాయి. ఇక్కడున్న సిగ్నల్స్ పనిచేయక పోవడం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తగినంత మంది లేకపోవటంతో వాహనాల నియంత్రణ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ప్రతిరోజు 80 వేలకు పైగా వాహనాల రాక నరసరావుపేట పట్టణంలో ప్రతిరోజూ 80 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కు మల్లమ్మ సెంటర్ మీదుగానే పట్టణంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవటానికి తోడు రోడ్డుకు నాలుగువైపుల ఆక్రమణలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార దుకాణ సముదాయాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో వినియోగదారుల రద్దీ అధికంగా ఉంటుంది. దుకాణాల వద్ద పార్కింగ్ ప్రదేశాలు లేకపోవటంతో వెంట తెచ్చిన వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు కష్టతరంగా మారింది. పట్టణంలో ప్రయాణించే వాహనాలకు సరిపడా పార్కింగ్ ప్రదేశాలు లేవు. దీనికితోడు సెల్లార్లు లేమి కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్నవారు పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలుపుతుండటంతో నిత్యం సమస్య తలెత్తుతోంది. ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టాం. ఉన్న సిబ్బందితో పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – లోకనాథం, ట్రాఫిక్ సీఐ. -
కలెక్టరేట్లో ఏసీబీ కలకలం
● నాలుగేళ్లలో తొలిసారి ఏసీబీకి చిక్కిన డీఆర్ఓ ● జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఇది కలెక్టరేట్కు మాయని మచ్చగా తయారైంది. శుక్రవారం రాత్రి షేక్ కరిముల్లా అనే క్యాటరింగ్ నిర్వాహకుడి నుంచి రూ.మూడు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఏకా మురళి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. 2022 ఏప్రిల్లో పల్నాడు జిల్లా ప్రకటించటం, పాత ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ భవనంలో నూతన కలెక్టరేట్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు డీఆర్ఓలు పనిచేశారు. మూడో డీఆర్ఓగా మురళి జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధి సిఫార్సుపై నియమితులైనట్లు ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడే పలువురు చర్చించుకున్నారు. ఇంతకు ముందు మురళి ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఆర్డీఓగా పనిచేయటం గమనార్హం. ఇప్పుడా ప్రజాప్రతినిధి మనుషులు డీఆర్ఓను ఎవరు పట్టించారంటూ పట్టించిన వ్యక్తి కోసం వెతుకులాడినట్లు సమాచారం. లంచాల కోసం వేధింపులు ఏసీబీ విడుదల చేసిన ప్రకటన మేరకు డీఆర్ఓ లంచాల కోసం బాగా వేధిస్తాడనే విషయం తేటతెల్లమౌతుంది. ఇప్పుడు రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడటమే కాకుండా అంతకుముందే సదరు క్యాటరింగ్ యజమాని నుంచి జనవరి ఏడున డీఆర్ఓ రూ.4 లక్షలు బలవంతంగా వసూలు చేసినట్లు సమాచారం. తొలుత రూ.5 లక్షలు ఇస్తేనే చెక్ ఇస్తానని బెదిరించటంతో బాధితుడు రూ.4 లక్షలు ఇవ్వగా పరిపాలనాధికారికి కూడా మరో రూ.50 వేలు ఇవ్వాలని అడగటంతో అవి కూడా వసూలు చేశాడు. చెక్కు ఇస్తూ పైఅధికారులకు సైతం డబ్బులు ఇవ్వాలని మరో రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బులు లేవని, తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పటంతో ఆ చెక్కు క్యాష్ కాకుండా డీఆర్ఓ అడ్డుకున్నాడని తెలుస్తోంది. బాధితుడు బ్రతిమిలాడగా డీఆర్ఓ రూ.3 లక్షలు డిమాండ్ చేయటంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి వచ్చి డీఆర్ఓను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న డీఆర్ఓ ఏసీబీకి దొరకటం మిగతా ఉద్యోగుల్లో కలవరానికి గురిచేసింది. -
నిఘా నేత్రాలతో భద్రతకు పెద్దపీట
యడ్లపాడు: జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ రీజినల్ ఆఫీసర్ ఆర్.కె. సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నేతృత్వంలోని అధికారుల బృందం పల్నాడు జిల్లాలో రూ. 1,072 కోట్ల వ్యయంతో నిర్మించిన 16.49 కిలోమీటర్ల చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అమరావతి పీడీ టి. పార్వతీశం, డీజీఎం జగదీష్, జీఎం నీరజ్ గుప్తా, ఏపీడీడీసీఎఫ్ ఎండీ కె. మురళీధర్ తదితర అధికారులు బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ జాతీయ రహదారి – 16 నిర్మాణంలో ఇప్పటికే 5 గిన్నిస్ రికార్డులను సాధించామని గుర్తుచేశారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ బైపాస్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. దీనివల్ల బెంగళూరు–విజయవాడ మధ్య సుమారు నాలుగు గంటల సమయం ఆదా అవుతుందని వివరించారు. అత్యాధునిక సాంకేతిక నిఘా.. రహదారి పొడవునా అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా 19 పీటీజెడ్, 58 సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే వెంటనే రెడ్ సిగ్నల్ ద్వారా హెచ్చరికలు జారీ అవుతాయి. కిలోమీటరుకో ఎరుపు టెలిఫోన్ బాక్సు ఉంది. ఫోన్ లేకపోయినా వీటిలోని బటన్ నొక్కితే 15 నిమిషాల్లోనే అంబులెన్సు, క్రేన్ లేదా పెట్రోలింగ్ వాహనం వస్తుంది. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా రహదారికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. 6 రకాలైన ఐదు వేల మొక్కలను పెంచామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఉంటే 1033కు కాల్ చేయాలని కోరారు. విజయవాడ మినీ వెస్ట్ హైవే ప్రారంభం నుంచి చైన్నె మార్గంలోకి ప్రవేశించే వరకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కాజ టోల్ప్లాజా వద్ద ఫుడ్ కోర్టులు, బాలింతలు పాలిచ్చేందుకు ప్రత్యేక గది, పిల్లలకు ఆట స్థలాలు వంటి వసతులు ఏర్పాటు చేశామన్నారు. -
అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత
రెంటచింతల: పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరిపై అనుగ్రహం కురిపించి వరాలిచ్చే తల్లి కానుకమాత అనుగ్రహ పరిపూర్ణురాలుగా కొనియాడబడుతుందని తాళ్లచెరువు విచారణ గురువులు రెవ.ఫాదర్ తుమ్మా మర్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం 1850 సం.లో నిర్మించిన పురాతన కానుకమాత దేవాలయంపై జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణంలో చర్చి విచారణ గురువులు రె. ఫాదర్ వైఎల్ మర్రెడ్డి నేతృత్వంలో సిల్వర్ జూబిలేరియన్స్ సిల్వర్ జూబిలేరియన్స్ రెవ. ఫాదర్లు తుమ్మా మర్రెడ్డి, పుట్టి అంతోనిరాజు, చింతపల్లి అబ్రహాం, పోతిరెడ్డి ఇన్నారెడ్డి, సహాయ గురువులు ప్రసన్నకుమార్, రె.ఫాదర్ గోవిందుబాలస్వామిలతో కలిసి నవదిన ప్రార్థనలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించి ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నవదిన ప్రార్థనలలో పాల్గొని కరుణమయురాలైన కానుకమాత దీవెనలు పొందాలని కోరారు. కథోలిక సంఘంలో ప్రతి ఒక్కరు ఏసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న పి.హేమలత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. విజయవాడలోని ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళ విభాగానికి సంబంధించిన ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఎం.గాయత్రి కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికై న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలత మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. కొరిటెపాడు(గుంటూరు): ‘కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్–గుంటూరు’, ‘కోపా–విసన్నపేట’ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలలో భాగంగా చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 247 మంది పేద విద్యార్థులకు రూ.9.50 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.4.33 లక్షలు తులసి సీడ్స్ వారు ‘కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్’ ద్వారా 114 మంది పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట లోని వికాస్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభముతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు హాజరై వితరణ చేయనున్నట్టు ఆయన వివరించారు.ఫాదర్ తుమ్మా మర్రెడ్డి -
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మహి ళా ప్రాంగణంలోని ప్రభుత్వ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వసతి గృహంలో సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ న్యాయపరమైన అవగాహన అవసరమని సూచించారు. తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణ, పల్లకీ సేవ, సంతానం కోరుకునే వారి కోసం వైనతేయ హోమం నిర్వహించామని తెలిపారు. గరుడ పటం, ధ్వజారోహణ అనంతరం శ్రీ స్వామివారి చేతుల మీదుగా దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో శనివారం లోక కల్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ద్విభాష్యం సూర్యవెంకట అవధానులు సహకారంతో అమరేశ్వరునికి లక్ష బిల్వార్చనను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు జరిపించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా గణపతి, రుద్రహోమం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ అనంతరం సహస్రనామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాల చాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): వచ్చేనెల 4, 5, 6 తేదీల్లో నంబూరు రాధా గోవింద మందిరంలో విశాల సాధుసంత్ సమాగమన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లునిర్వాహకులు ఎం.భాస్కర్రెడ్డి, నందిగల లలితలక్ష్మి తెలిపారు. శనివారం బ్రాడీపేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ భాగవత ధర్మ సమాజ్ సంస్థాపకాచార్య అనంత శ్రీవిభూషిత జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధ్వ గౌడేశ్వరాచార్య శ్రీపాద కృష్ణబలరామస్వామీజీ మహారాజ్ ప్రభుపాద (యూపీ) నంబూరు గ్రామానికి విచ్చేస్తారని తెలిపారు. వచ్చేనెల 4 ఉదయం సుదర్శనయజ్ఞం, రాత్రి భరతనాట్యం, జానపద నృత్యాలు, ఐదున నృసింహ యజ్ఞం, జగద్గురు సన్మాన సమరోహం, రాత్రి కృష్ణలీలలు, శ్రీనివాస కల్యాణం, ఆరో తేదీన ఉదయం విశేష శోభాయాత్ర (గ్రామోత్సవం) నిర్వహించనున్నట్లు చెప్పారు. -
బాలికలు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి
జాతీయ బాలికా దినోత్సవంలో జేసీ సంజన సింహ నరసరావుపేట: బాలికలు క్రీడలతోపాటు విద్యలో కూడా విజయాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి చేరాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. శనివారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవానికి జేసీ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ హక్కులపై ప్రతి బాలిక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్యవివాహాల నిరోధకానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి ఉమాదేవి మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు నమ్మకంతో ఉండేలా మెలగాలని సూచించారు. బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా వైద్య అధికారి డాక్టర్ బి.రవి మాట్లాడుతూ చిన్న వయస్సులో గర్భం దాలుస్తున్న వారి సంఖ్య పల్నాడు జిల్లాలో అధికంగా ఉందని అన్నారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న షేక్ సైదా సాహెబ్ ఎంపిక య్యారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి శివారు కొత్తపాలెం సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా ఆయన పని చేస్తున్నారు. కొత్తపాలెం పీఎస్ నెంబర్ 100 లో బూత్లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధినిర్వ హణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పల్నాడు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు ఎంపికై నట్లు నరసరావుపేట ఆర్డీఓ మధులత తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని ఈ నెల 25న విజయవాడ చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయంలో సైదాసాహెబ్ అవార్డును అందుకోనున్నారు. నరసరావుపేట టౌన్: బస్సు ఆపలేదని మహిళ కండెక్టర్పై ప్రయాణికురాలు దాడి చేసి యూటీఎఫ్ మిషన్ను బయటకు విసిరేసిన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వన్న్ టౌనన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట డిపోకు చెందిన ఏపీ 07 జెడ్ 0314 నంబర్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని నరసరావుపేట నుంచి గుంటూరుకు బయలు దేరింది. బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న షేక్ రహీమ్ మున్సిసా తమ బంధువులు వస్తున్నారని బస్సు ఆపాలని కండక్టర్ ఆవుల విష్ణు కుమారిని కోరింది. బస్సు నిలపక పోవటంతో కండక్టర్తో వాగ్వివాదానికి దిగి ఆమె చేతిలో ఉన్న టికెట్లు కొట్టే మిషన్ను కిటికీలోనుంచి బయటకు విసిరింది. అనంతరం కండక్టర్పై దౌర్జన్యానికి దిగి దాడి చేసింది. సంఘటనలో మిషన్ పాక్షికంగా దెబ్బతింది. తన విధులకు ఆటంకం కలిగించటంతో పాటు మిషనన్ను ధ్వంసం చేసిందని కండక్టర్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. -
స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సత్తెనపల్లి: స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే కన్నా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయలు ప్రమా ద బీమా కల్పిస్తుందన్నారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాల నివారణకు స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యంతో కట్టడి చేయాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ బి.మధుసూదనరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం.విజయసారధి, మున్సిపల్, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలలో వివిధ శాఖలు ప్రదర్శించనున్న శకటాల తయారీ ప్రక్రియను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ శనివారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖలు తమ శకటాల రూపకల్పన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను రూపొందిస్తున్నారు. -
రేపటి నుంచి జాతీయస్థాయి గిత్తల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి రెండున నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. పోటీల పోస్టర్లను శనివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ కానుకమాత చర్చి తిరునాళ్ల సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా రైతు సోదరులను ఉత్సహపరిచేందుకు ఈ జాతీయ స్థాయి గిత్తల ప్రదర్శన పోటీలను స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో తొమ్మిది బహుమతుల చొప్పున మొత్తం 72 మంది విజేతలైన రైతు సోదరులకు మొత్తం రూ. 26 లక్షల నగదుతోపాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క గిత్తల యజమానులకు ప్రోత్సహక బహుమతులను అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్రెడ్డి, మాజీ పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడపాటి రామకృష్ణ, ఏరువ జోజిరెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వసంత పంచమి
నరసరావుపేట ఈస్ట్: వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు ఆలయాల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమి రోజున శ్రీసరస్వతీ దేవి జన్మదినం సంద ర్భంగా శుక్రవారం తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరా భ్యా సం నిర్వహించారు. నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠంలోని శ్రీశారదాంబ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పెన్నుల తో అలంకరించి పూజలు జరిపారు. వినుకొండరోడ్డులోని త్రిశక్తి దేవాలయల సముదాయంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాలతో పాటు పాఠశాలల్లో సరస్వతీ పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు జెండా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం చర్చి ప్రాంగణంలో సిల్వర్ జూబిలేరియన్స్ రెవ.ఫాదర్ పుట్టి అంతోనిరాజు, రెవ.ఫాదర్ తుమ్మా మర్రెడ్డి, రెవ.ఫాదర్ చింతపల్లి అబ్రహాం, రెవ.ఫాదర్ పోతిరెడ్డి ఇన్నారెడ్డిలచే దివ్యపూజాబలితో పండుగ మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తెనాలి:ఆంధ్రవాల్మీకి శ్రీవాసుదాస స్వామి వా రి పరంపరపీఠం దాసకుటి, అంగలకుదురులో పీఠాధిపతి శ్రీ సీతారామదాసస్వామి వారి ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాసు స్వామి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. మూడు రోజుల వేడుకల్లో రెండవ రోజైన శుక్రవారం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. జాగర్లమూడి రఘురాం ఆచార్యులు పూజా కార్యక్రమాలను చేయించారు. ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథశాస్త్రి శ్రీ సత్యనారాయణ స్వామివ్రత కథను వివరించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి దంపతులు, పులిపాక అప్పారావు దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. తెనాలి: ఈనెల 25వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని తెనాలి బాలాజీరావుపేటలోని అయ్యప్ప దేవాలయం నిర్వాహకుడు దుర్భా హరిబాబు స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో సహస్ర దళ సూర్యయంత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రథసప్తమికి అందుబాటులోకి వస్తుందని, భక్తులందరూ దర్శించుకోవాలని సూచించారు. నాదెండ్ల: కనపర్రు గ్రామంలోని పురాత న ఆర్సీఎం చర్చిలో పునీత, జోజప్ప కల్యాణ నిశ్చితార్థ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చర్చి నిర్మించి 128 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విచారణ గురువు ఫాదర్ చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరయ్యారు. స్థానిక విచారణ గురువు బంధనాథం లూర్దురాజు ఆధ్వర్యంలో ఉదయం సమష్టి దివ్య పూజాబలి నిర్వహించా రు. కానుకలు, కొవ్వొత్తులు సమర్పించారు. రాత్రి తేరు ఊరేగింపు నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి వద్ద ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభ ఆకట్టుకుంది. -
పల్నాడు పండుగ అభయాంజనేయ స్వామి రథయాత్ర
పిడుగురాళ్ల: పల్నాడు ప్రాంతానికే పెద్ద పండుగ శ్రీ సువచర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల. నిరంతరం హోమాలతో నాలుగు రోజులపాటు స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 28వ తేదీ అంటేనే పిడుగురాళ్ల పట్టణానికి ఓ పెద్ద పండుగ రోజు, చుట్టాలు, బంధువులు, కులమతాలకు అతీతంగా పిడుగురాళ్ల పట్టణానికి చేరుకుంటారు. ఈ నెల 25వ తేదీ నుంచే ప్రత్యేక పూజలతో మొదలవుతుంది. ఈ నాలుగు రోజులు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 28వ తేదీన రథోత్సవం జరుగుతుంది. మహిళా భక్తులతో కలశ శోభాయాత్రను పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం వరకు నిర్వహిస్తారు. పలు రకాల కలశాలతో మహా కుంభాభిషేకం, ప్రధాన కలశ శోభాయాత్ర నిర్వహిస్తారు. సుమారు 3 వేల మంది మహిళలచే మహా కుంభ కలశ యాత్ర నిర్వహిస్తారు. ఒక పిడుగురాళ్ల పట్టణమే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి, జిల్లాల్లోని పలు గ్రామాల నుంచి చుట్టు పక్కల జిల్లాలు, పక్కనే ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా హాజరై స్వామివారి కల్యాణం, రథోత్సవంలో పాల్గొంటారు. 28న స్వామి వారి 19వ వార్షిక రథయాత్రకు సర్వం సిద్ధం 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పూజలు -
ఆర్ఓబీ, ఆర్యూబీలను పూర్తి చేయండి
నరసరావుపేట: జిల్లాలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద మంజూరైన ఆర్ఓబీ, ఆర్యూబీలను రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా ప్రతిపాదన దశలో ఉన్న 20 ఆర్ఓబీ, ఆర్యూబీలకు సంబంధించి సంయుక్త తనిఖీలను పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే డీపీఆర్లు పూర్తయిన 11 నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓలు కె.మధులత, మురళీకృష్ణ, తహసీల్దార్ కె.వేణుగోపాల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. పీఎం స్వానిధి క్రెడిట్ కార్డులు, రుణాల చెక్కులు పంపిణీ నరసరావుపేట: ఏ విధంగా అయితే బ్యాంకులో స్వానిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తారో అదేవిధంగా క్రెడిట్ కార్డు ద్వారా స్వీకరించిన సొమ్మును మరుసటి నెలలో చెల్లించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టౌన్ హాలులో పీఎం స్వానిధి క్రెడిట్ కార్డులు, రూ.లక్ష రుణాల చెక్కులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్తో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 995 మంది చిరు వ్యాపారులకు స్వానిధి క్రెడిట్ కార్డులు అందజేస్తున్నామన్నారు. 1000 మంది లబ్ధిదారులకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు అందించిన రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, ప్రతి మహిళ స్వయం సమృద్ధిగా ఎదగాలన్నదే ప్రభుత్వాల సంకల్పమన్నారు. మెప్మా పీడీ పాల్గొన్నారు. ప్రతినెలా మొదటి వారంలో పాస్ పుస్తకాల పంపిణీ జిల్లాలో ప్రతి నెలా మొదటి వారంలో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ అతిథి గృహంలో రీ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేపై కోర్టు కేసులు రాకుండా తగిన సూచనలు ఇప్పటికే అధికారులకు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతినెలా మరుసటి నెలకు పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాస్పుస్తకాల కోసం పనిచేయాలన్నారు. పాస్ బుక్లకు కావాల్సిన లబ్ధిదారుల సమాచారంపై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఒక అవగాహన ఉంటుందని, అందువలన ఆ సమాచారం హడావుడిగా కాకుండా ముందుగానే సేకరించి పెట్టుకోవాలన్నారు. పాస్బుక్ల రూపకల్పనలో తప్పులు లేకుండా వ్యవహరించాలన్నారు. సర్వేశాఖ జిల్లా అధికారి విష్ణుకీర్తి, ఆర్డీఓ కె.మధులత పాల్గొన్నారు. -
వెబ్సైట్లో ఇంటర్ ప్రాక్టికల్ హాల్టికెట్లు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు తమ హాల్టికెట్స్ను bie.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ 95523 00009 నెంబర్ నుంచి పొందవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి నరసరావుపేట టౌన్: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ ఎం.రాజమోహన్ శుక్రవారం తెలిపారు. గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి(30) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు తెలుపురంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగంలో ఇద్దరు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాచర్లకు చెందిన వేముల వెంకటేశ్వర్లును బీసీ సెల్ జోన్–3 వర్కింగ్ ప్రెసిడెంట్గాను, నరసరావుపేటకు చెందిన కొత్తూరి కిషోర్బాబును రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్కు 29న హాజరుకావాలి నరసరావుపేట: ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్ షిప్ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసి ధృవపత్రాల పరిశీలన పూర్తయిన పల్నాడు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 29న విజయవాడ విద్యాధరపురం, చెరువుగట్టు సెంటర్లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల వద్దకు హాజరుకావాలని ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్సైట్లో రిక్రూట్మెంట్ ట్యాబ్ నందు పొందుపర్చామని పేర్కొన్నారు. -
రక్షణ చ క్రధారి!
సత్తెనపల్లి: ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకం. ఏటా జనవరి 24న రాష్ట్ర రోడ్డు రవాణా డ్రైవర్ల దినోత్సవం జరుపుతున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో ఆరు బస్సు డిపోలు ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల డిపోల్లో 715 మంది డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజు 1.65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. నియామకాలు లేక పని భారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 12 ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదు. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్ అన్ఫిట్ పొందుతున్నారు. నియామకాలు లేకపోవడంతో ఉన్న డ్రైవర్లతోనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు సరైన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్ తక్కువ మొత్తంలో వస్తోంది. దీంతో చాలామంది డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదుకోని ప్రభుత్వాలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ప్రమాద బీమా అమలు చేయాలని ఆర్టీసీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. వాహనాలు పెరుగుతున్నంత వేగంగా రోడ్ల విస్తరణ చేపట్టడం లేదు. ఉన్న రోడ్లను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో డ్రైవర్లపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు కండిషన్ లేని బస్సులతో నడపాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి సమస్యలు పరిష్కరిస్తే మరింత భద్రంగా ప్రజల క్షేమం కోసం పాటుపడతామని డ్రైవర్లు కోరుతున్నారు. గత ఏడాది ఆదర్శ వాహన చోదక అవార్డులు పొందిన డ్రైవర్లు : 18 మంది గత ఏడాది ఒక్క ప్రమాదం కుడా చేయని డ్రైవర్లు : 70 శాతం పైనే నా డ్యూటీ సమయానికి కంటే గంట ముందుగానే వచ్చి బస్ కండిషన్ చూసుకుంటా. ఆ తర్వాత సీట్లో కూర్చుంటా. సీట్లో కూర్చున్నాక ఇక నాకు ఇతర వ్యాపకాలు ఏవీ గుర్తుకు రావు. కేవలం బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంపైనే దృష్టంతా ఉంటుంది. నేను 28 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా సర్వీసులో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా ఎరుగను. –షేక్ రషీద్, ఆర్టీసీ డ్రైవర్, సత్తెనపల్లి డ్యూటీ అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. విధి నిర్వహణలో బస్కండీషన్ ఎలా ఉందనేది ముందుగా చూసుకోవాలి. డ్రైవర్ వృత్తిలో ఆదర్శంగా ఉండాలన్నదే లక్ష్యం. నా సర్వీసులో అనేక సార్లు బెస్ట్ కేఎంపీఎల్ డ్రైవర్గా నిలిచా. డిపో ఒక లీటర్ ఆయిల్ 5.27 కిలో మీటర్లు రావాలని లక్ష్యంగా నిర్దేశిస్తే నేను 5.68 కిలో మీటర్లు తీసుకువచ్చా. – కె.కోటేశ్వరరావు, బెస్ట్ కేఎంపీఎల్ ఆర్టీసీ డ్రైవర్, సత్తెనపల్లి -
గెలుపోటముల కన్నా క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గుంటూరు రూరల్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. చౌడవరంలోని కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్బాల్ పురుషుల టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఉత్కంఠంగా సాగిన ఈ టోర్నమెంట్లో సి.ఆర్. డిగ్రీ కాలేజీ (చిలకలూరిపేట) జట్టు విజేతగా నిలిచింది. కె.హెచ్. అండ్ ఎల్.ఎస్. స్కాలర్స్ డిగ్రీ కాలేజీ (పిడుగురాళ్ల) జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. తృతీయ స్థానంలో ఆర్.వి.ఆర్.జె.సి.ఇంజినీరింగ్ కళాశాల, నాలుగో స్థానంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (నరసరావుపేట) జట్లు నిలిచాయి. మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్బాల్ జట్టును సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్.గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ అబ్జర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ ప్రీతంప్రకాష్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్షం మన జీవితంలో భాగం
చేబ్రోలు: ‘అంతరిక్షం కేవలం పరిశోధనలకే పరిమితం కాదు, అది నేడు దేశ రక్షణలో అంతర్భాగమైంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రం’ అని డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’లో భాగంగా నిర్వహించిన సౌత్ ఇండియా రాక్రెటీ ఛాలెంజ్ రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. విజ్ఞాన్ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు చేతుల మీదుగా అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ● కార్యక్రమంలో డాక్టర్ జి. సతీష్రెడ్డి మాట్లాడుతూ... స్పేస్ అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుందని దశాబ్దాల క్రితమే చెప్పారని, నేడు అది అక్షరాలా నిజమైందన్నారు. ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతికత నిలిచిపోతే మన కమ్యూనికేషన్ వ్యవస్థ, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, చివరికి టీవీ చానల్స్ కూడా మూతపడతాయన్నారు. సామాన్యుడి దైనందిన జీవితం అనేది స్తంభించిపోతుందన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అందుకు బెల్లాట్రిక్స్, దిగంతర సంస్థలు ఉదాహరణలుగా వివరించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా స్వయంగా ఒక శాటిలైట్ను తయారు చేసి ప్రయోగించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ● చాన్సలర్, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు, మాట్లాడుతూ దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందన్నారు. ఉపగ్రహాల ద్వారా హైస్పీడ్ డేటా కమ్యూనికేషన్ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ● ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల్లో అపజయాలను చూసి కుంగిపోకూడదని, వైఫల్యాలను ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడే గొప్ప విజయాలు లభిస్తాయన్నారు. విద్యార్థులు పూర్తి సామర్థ్యంతో తమ రాకెట్లను ప్రయోగించి సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. విద్యార్థులు అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారని, కెమికల్ రాకెట్ను ఏకంగా 1.5 కిలోమీటర్ల ఎత్తుకు విజయవంతంగా ప్రయోగించి ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు. ● కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ స్పేస్ టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు, సీఈవో కూరపాటి మేఘన, ఇన్చార్జి వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి విజ్ఞాన్లో రెండో రోజు ఘనంగా కొనసాగిన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ -
తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేసేందుకు రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ శుక్రవారం తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. భాష్యం రామకృష్ణతో పాటు భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. గుంటూరులో సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ ప్రారంభం నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరులో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బృందావన్గార్డెన్న్స్ మూడో వీధిలో సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ను శుక్రవారం మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అన్నిరకాల వేడుకలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉందని అన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్నవ యుగంధర్ మాట్లాడుతూ సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ను సరికొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. వెజ్, నాన్వెజ్ రెస్టారెంట్, బాంకెట్/ కాన్ఫరెన్స్ హాల్, ఫంక్షన్ హాల్, గ్రాండ్ బెడ్రూమ్, గ్రాండ్ కంఫర్ట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, గ్రాండ్ క్లబ్ సూట్ రూమ్స్ అన్ని రకాల వసతులతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
తల్లి, పిల్లలను కాపాడిన కానిస్టేబుల్
నరసరావుపేట టౌన్: కుటుంబ సమస్యలతో ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించింది. రైల్వే గేట్మ్యాన్ ఇచ్చిన సమాచారంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై వారిని రక్షించిన సంఘటన శుక్రవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ ఓబయ్య కాలనీకి చెందిన మేతే అలివేలు తన తొమ్మిది సంవత్సరాల కుమారుడు కల్యాణ్, ఏడేళ్ల కుమార్తె నిరీక్షణ, మూడు నెలల పాపను తీసుకొని శుక్రవారం నరసరావుపేట రైల్వేస్టేషన్ సమీపంలోని మొదటి రైల్వే గేటు వద్దకు వచ్చింది. రైల్వే గేట్మ్యాన్తో రైలు వచ్చే సమయం గురించి ఆరా తీసింది. దీంతో అనుమానం వచ్చిన గేట్ మ్యాన్ అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తయూబ్కు సమాచారం అందించాడు. ఆమె వైఖరిపై అనుమానం రావటంతో విషయాన్ని సీఐ లోకనాథం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో సీఐ అక్కడికి చేరుకొని అలివేలుతో పాటు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకొని వన్టౌన్ స్టేషన్కు తరలించారు. వివరాలు అడగ్గా అత్త, బావ, మరిదిలు తనను వేధిస్తూ భర్తను దూరం చేశారని ఆ మానసిక వేదన భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని పోలీసులకు వివరించింది. దీంతో ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
వేమవరంలో పట్టపగలే చోరీ
పిడుగురాళ్ల: ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలలు చోరీకి పాల్పడిన సంఘటన మాచవరం మండలంలోని వేమవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటన సంబంధించి బాధితుడు గుర్రం గురవారెడ్డి తెలిపిన వివరాల మేరకు... రోజు మాదిరిగానే పొలం పనులకు ఇంట్లో మహిళలు వెళ్లారని, తాను పిడుగురాళ్ల పట్టణంలో పనిపై వెళ్లానని చెప్పారు. మధ్యాహ్న సమయంలో దుండగులు ఇంటి వెనుకవైపు నుంచి వచ్చి బీరువా పగలగొట్టి 64 గ్రాముల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు దొంగిలించారని తెలిపారు. ఈ మేరకు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత
కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు. ఇక 26న రిపబ్లిక్ డే సందర్భగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా 27న మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పటికై తే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపాయి. -
పోలీసుల తనిఖీల్లో భారీగా సొత్తు స్వాధీనం
తెనాలిరూరల్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీ ఎత్తున సొత్తు లభించింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు వచ్చిన సమాచారంతో తెనాలి పట్టణ బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో గుంటూరు నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇక్కడి త్రీ టౌన్ పోలీసులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు ఇళ్లలో ఏకధాటిగా నాలుగు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. ఓ రేకుల షెడ్డులో నివసిస్తున్న పేరుబోయిన గురవమ్మ వద్ద 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి, రూ.5.60 లక్షల వరకు నగదు లభించింది. మహేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో అతి విలువైన పురాతన దేవతా విగ్రహాలు, పురాతన విగ్రహాలు ఉన్నట్టు ఎస్పీకి వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఇంత భారీ మొత్తంలో సొత్తు లభించడంతో పోలీసులు అవాక్కయ్యారు. గురవమ్మ అల్లుడు గురునాథం ఇతర రాష్ట్రాల నుంచి బంగారం, వెండి తెచ్చి విక్రయాలు జరుపుతుంటాడని, ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్రమంలో పోలీసులు అతని ఇంటికి తనిఖీలకు వెళ్లే సమయానికి మూట ముల్లె సర్దుకుని పరారయ్యాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ జిందాల్కు వచ్చిన సమాచారంతో మహేంద్ర కాలనీలో తనిఖీలకు ఎస్పీ ఆదేశించగా గురునాథం అత్త వద్ద ఈ సొత్తు లభించింది. గుంటూరు నుంచి పోలీసుల బృంద సభ్యులు తెనాలి పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు రైల్వేస్టేషన్ వద్దకు రావాలని సమాచారమిచ్చి హుటాహుటిన ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులను వెంటబెట్టుకుని తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసులకు కేసుకు సంబంధించిన వివరాలు చెప్పకుండానే గుంటూరు నుంచి వచ్చిన బృందం లభించిన సొత్తుతో నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లిపోయింది. గురునాథంది రైస్ పుల్లింగ్ దందా.? పోలీసులు వెతుకుతున్న గురునాథం రైస్ పుల్లింగ్ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం లభించినట్టు తెలిసింది. ఇటీవల విజయవాడలో ఖరీదైన భవంతి కొనుగోలు చేశాడని, మహేంద్ర కాలనీ కేంద్రంగా రైస్ పుల్లింగ్ వ్యవహారం నడుపుతున్నాడని ఎస్పీకి సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీలకు ఆదేశించినట్టు సమాచారం. బియ్యాన్ని ఆకర్షించే అతి పురాతన లోహపు వస్తువులు ఉన్నాయంటూ ఈ రైస్ పుల్లింగ్ ముఠా రూ.కోట్లలో దందాలకు పాల్పడుతుంటారు. ఇటువంటి కేసులోనే గురునాథం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. అతను పట్టుబడితే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఘనంగా ప్రారంభమైన ఎన్ఈసీ జుబిలేషన్
నరసరావుపేట రూరల్: దేశ అభివృద్ధికి సాంకేతిక పురోగతే కీలక ఆధారమని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి తెలిపారు. కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్, మానేజిక్స్, కల్చరల్, క్రీడా వేడుకల జుబిలేషన్ 2కే 26శుక్రవారం ప్రారంభమైంది. 42 కళాశాలల నుంచి 900మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. కళాశాల వైస్ చైర్మన్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ యుగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, స్టార్ట్అప్స్ వంటి రంగాలు యువతకు అపార అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు. ● జేఎన్టీయూఎన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, నిర్వాహాక, సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు జాతీయ స్థాయి వేడుకలు వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. ● శనివారం నిర్వహించే వేడుకలలో ప్రముఖ సినీ తార శ్రీలీల పాల్గొంటారని కళాశాల కార్యదర్శి మిట్టపల్లి రమేష్బాబు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీల్, అధ్యాపకులు పాల్గొన్నారు. 42 కళాశాలల నుంచి 900 మంది విద్యార్థులు హాజరు నేడు కల్చరల్ ఫెస్ట్ -
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక
అచ్చంపేట : పల్నాడు జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో శుక్రవారం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయి. పోటీలలో విజేతలుగా నిలచినవారు ఫిబ్రవరి 5,6,7,8 తేదీలలో చిత్తూరులో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం తెలిపారు. బాలుర విభాగంలో.... ● అండర్–15 బాలుర విభాగంలో కె.జాన్వెస్లి, ఆర్. చక్రి, పి.నాగరైతన్య, ఒ.గౌరీ ప్రతాప్రాజ్, కె.గుణశేఖర్, బి.యశ్వంత్, ఎన్.మెజెస్రత్న, సందీప్, ఐ.దేవకుమార్, టి.సుమంత్, ఆర్ ప్రణీత్లు ఎంపికయ్యారు. ● అండర్–17 విభాగంగాలో పి.నాగచైతన్య, ఒ.గౌరి ప్రతాప్రాజ్, కె.గోపయ్య, బి.ప్రసన్నకుమార్, పి.శరత్కుమార్, జి.డేనియల్రాజు, ఎస్, మోజస్ కుమార్, బి.అంజనీ కుమార్నాయక్, బి.ఒబేదు, వి.పృధ్వీ, ఎస్.మోజస్, బి.నరసింహనాయక్, జి.శ్రీనాథ్కుమార్, వి.నాగచరణ్లు ఎంపికయ్యారు. ● అండర్–20 విభాగంలో కె.గోపయ్య, పి.శరత్కుమార్, ఎల్.ఈశ్వర్ లక్ష్మీరాం, ఎం.వెంకటేశ్వర్లు, వి.పృధ్వీ, కె.గోపీచంద్ ఎంపికయ్యారు. బాలికల విభాగం... ● అండర్–15 బాలికల విభాగంలో ఎం.అనూష, ఎం.హేమ, ఎన్.సందన, సీహెచ్ శ్రీనిత్య, ఎ.పూజిత, ఎన్.స్వాహితి, సీహెచ్ ధరణి, ఎస్ మేరీ వినీల తదితరులు ఎంపికయ్యారు. ● అండర్–17 విభాగంలో కె.దీవెన, పి.మనస్విని, ఎన్. ఐశ్వర్య, ఎం.కాయని, సీహెచ్ చందు, ఆర్. అనూష తదితరులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఽకార్యదర్శి గుడిపూడి భూషణం, జాయింట్ సెక్రటర్ పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన్లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్’
సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 పోటీలుచేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్టెక్ అకాడమీ మరియు హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’ను గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ను ‘లెవరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఏపీ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో పబ్లిష్ చేసిన ‘స్పేస్ టెక్ స్పెక్ట్రమ్ జర్నల్’ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ భారత్ ‘స్పేస్ యుబిక్విటీ’ దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యాసంస్థల విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా చిన్న రాకెట్ల నమూనాలను రూపకల్పన చేసి, తయారు చేసి, లాంచ్ చేశారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించిన స్టార్టప్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు, విజ్ఞాన్ సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘన, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, మాజీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు. -
23,750 ఎకరాల్లో ప్రకృతి సాగు
డీపీఎం కె.అమలకుమారినరసరావుపేట రూరల్: జిల్లాలో ఈ ఏడాది 23,750 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసినట్టు డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్లో భాగంగా బృందావనం సమావేశ మందిరంలో ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్కు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 125 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లలో 125 ఎకరాలు చొప్పున రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించుకుండా ఈ ఏడాది సాగుచేసినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో భూమిలో కర్భన శాతం పెరిగి పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గడంతో పాటు బోరు ఆధారిత వ్యవసాయంలో కరెంటు వినియోగం కూడా తగ్గుతుందని వివరించారు. రైతులకు ట్రేసబిలిటీ క్యూఆర్ కోడ్తో కూడిన సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి
నాదెండ్ల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు చోటు చేసుకోవటంలో సుమారు రూ.28 లక్షల రికవరీ ఆదేశించినట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి చెప్పారు. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు సుమారు రూ.9 కోట్ల విలువైన పనులు జరిగాయి. గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైనందున పనులు జరగలేదు. మిగిలిన గ్రామాల్లో జరిగిన పనుల్లో లోపాలను గుర్తించి శనివారి రికవరీ వివరాలు వెల్లడించారు. అమీన్సాహెబ్పాలెంలో జరిగిన పనుల్లో రూ.2,15,044, సాతులూరులో రూ.5,43,520, జంగాలపల్లెలో రూ.1,23,730, కనపర్రులో రూ.2,41,933, గొరిజవోలులో రూ.1,05,704, అప్పాపురంలో రూ.77,365, నాదెండ్లలో రూ.5,04,553, చిరుమామిళ్లలో రూ.1,61,213, చందవరంలో రూ.80,720, బుక్కాపురంలో రూ.55,840, ఇర్లపాడులో రూ.2,84,959, సంకురాత్రిపాడులో రూ.1,52,315, ఎండుగుంపాలెంలో రూ.1,28,921, తూబాడులో రూ.91,488లు వెరశి రూ.27,67,300లు సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి హీరాలాల్ నాయక్, క్వాలిటీ కంట్రోలర్ ప్రభాకరరావు, విజిలెన్స్ ఏపీఓ విజయకుమారి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల డిమాండ్లపై స్పందన శూన్యం
సాక్షి, నరసరావుపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుడి దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన భక్తులకు నిరాశ మిగిల్చింది. తొలిసారి ఇక్కడికి వచ్చినందున ఆయన చూస్తున్న అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులపై నిర్ణయం తీసుకుంటారని భావించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చిన పవన్.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కోటప్పకొండకు చేరుకున్నారు. తొలుత కొండపై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలోని వనవిహారి పార్క్ సందర్శించారు. కోటప్పకొండ– కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చాలా కాలంగా అటవీ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న పాత కోటయ్య మెట్లమార్గం అనుమతుల విషయం పరిష్కారమవుతుందని భావించినా ఫలితం దక్కలేదు. గిరి ప్రదక్షిణ దారి బీటీ రోడ్డు గురించి పవన్ ఆరా తీసినప్పటికి ప్రకటన చేయకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. వినతిపత్రాలు ఇవ్వడానికి దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చినా వారికి అవకాశం దక్కలేదు. కారులో నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. కోటప్పకొండ నుంచి తిరుగు ప్రయాణంలో గుంటూరుకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ప్రజాప్రతినిధులు గైర్హాజరు పవన్ పర్యటనకు స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర జిల్లా అధికారులు, కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు. జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకాకపోవడంపై చర్చ జరిగింది. పంచాయతీరాజ్ అధికారులు వేసిన ఫ్లెక్సీలలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి ఫొటో లేదంటూ కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఐస్ స్కేటింగ్లో రజతం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లడఖ్లో ఈ నెల 20న జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్–2026లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జెస్సీరాజ్ విజయవాడలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని. ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, సెక్రటరీ జగరాజ్ సింగ్ సహానీ, ఫిగర్ స్కేటింగ్ హెడ్ నటాలి, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సెక్రటరీ ఖాజా, కోచ్ అబ్దుల్ హఫీజ్ వెండి పతకాన్ని సాధించిన జెస్సీరాజ్ను అభినందించారు. తెనాలి: శాలివాహన సంఘం (కుమ్మరి), తెనాలి వారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మొదటి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించనున్నారు. శాలివాహన సంఘం (కుమ్మరి) నాయకులు గురువారం చెంచుపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో జరుపపన్నుట్టు చెప్పారు. ఫిబ్రవరి 22వ తేదీన స్థానిక ఎన్జీవో కల్యాణమండపంలో జరిగే వధూవరుల పరిచయవేదిక, శాలివాహన సంఘం, తెనాలి గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, ఆర్గనైజర్ వేజండ్ల శివన్నారాయణ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం72044 95747, 92472 71344, 70135 01766 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషనుకి ఫిబ్రవరి 15వ తేదీ తుది గడువుగా వివరించారు. విలేకరుల సమావేశంలో కార్యదర్శి నిమ్మకూరి కమలాకరరావు, ఉరిటి వెంకట్రావు, ఉరిటి శివశంకరావు, ఉరిటి నాగేశ్వరరావు, వేజండ్ల శంకరరావు, వేజండ్ల కృష్ణారావు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, వేజండ్ల నాగరాజు, సాయికిషోర్ పాల్గొన్నారు. రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం ఇంకొల్లు(చినగంజాం): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల కేంద్రమైన ఇంకొల్లులోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభించింది. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. ఇంకొల్లులోని పర్చూరు రోడ్డులో ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో గల భవనంలో షేక్ ఇబ్రహీం కుటుంబం మూడో అంతస్తులో నివసిస్తోంది. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా పొగలు దట్టంగా వ్యాపించాయి. అదే భవనంలో ఉంటున్న వారిని కలిసేందుకు ఇబ్రహీం భార్య అక్తర్ కిందకు దిగి వచ్చిన సమయంలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇంటిలోని వస్తువులన్నీ పూర్తిగా ఆహుతయ్యాయి. ఇంట్లో దాచి ఉంచిన రూ 2,14,000 నగదు, బీరువా, మంచం, ఏసీ, దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయాయని, సుమారు రూ 5 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు చెప్పారు. ఇబ్రహీం దంపతులు కట్టుబట్టలతో మిగిలారు. -
‘పచ్చ’ పగకు
పల్నాడుశుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026పల్నాటి పల్లెల్లో పచ్చ ముఠాల పైశాచికత్వం నానాటికీ ఎక్కువ అవుతోంది. వారి పగకు వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తం చిందుతోంది. హత్యలు, దాడులు, బెదిరింపులతో బరితెగించిన పచ్చ బ్యాచ్కు ఖాకీలు కథలు నేర్పుతున్నారు. కేసులు ఎలా పెట్టాలి? అసలు సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఎలా ఇరికించాలో చెప్పి మరీ వెనకుండి టీడీపీ గూండాలను నడిపిస్తున్నారు. బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి శాంతిభద్రతలను దారుణంగా దిగజారుస్తున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,600, గరిష్ట ధర రూ.3,700, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.వినుకొండ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్నికల అధికారి శ్రీరాములు అవగాహన కల్పించారు. ముప్పాళ్ళ: మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో గల ధూళిపాళ్ల ఆంధ్రాబ్యాంక్ రైతు సేవ సహకార సంఘం పరిధిలోని గోదాంలో రూ.34.58 లక్షల విలువ చేసే ఎరువులు మాయం అయ్యాయి. దీనిపై సంఘ చైర్మన్ కంచేటి సుబ్బారావు ఫిర్యాదు మేర గోదాం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దమ్మాలపాడు గ్రామంలో గల గోదాంలో అల్లూరి మల్లినాథశర్మ ఎరువుల స్వీకరణ, నిల్వ, విక్రయాల ద్వారా వచ్చిన డబ్బులు జమ చేసేవారు. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 11,705 ఎరువుల బస్తాలు నిల్వ ఉన్నట్లుగా, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు 22,092 బస్తాలు సరఫరా కాగా 24,389 బస్తాలు అమ్మినట్లు రికార్డుల్లో చూపించారు. ఈ క్రమంలో 3,563 బస్తాలు మాయమైనట్లుగా నిర్ధారించారు. ఈ నెల 7వ తేదీన నిర్వాహకుడు మల్లినాథశర్మ వాటికి సంబంధించిన రూ.34.58 లక్షలు చెల్లిస్తానని రాతపూర్వకంగా తెలిపారు. కానీ చెల్లించకపోవడంతో చైర్మన్ ముప్పాళ్ళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ కేసుల పరంపరం కొనసాగుతూనే ఉంది. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని కూటమి నేతలతో పాటుగా పోలీసులు సిగ్గు విడిచి అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైనే టీడీపీ ముఠాలు హత్యలకు, దాడులకు, బెదిరింపులకు తెగబడుతున్నాయి. మళ్లీ వైఎస్సార్సీపీ వారిపైనే అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఇందుకు పోలీసులు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. బాధితులపైనే వేధింపుల పర్వం తాజాగా రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త, వైఎస్సార్సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేసినా పోలీసులకు మాత్రం అదే టీడీపీ నేతల ఫిర్యాదుతో అక్రమ కేసు నమోదు చేశారు. మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోటుమర్రి పేతురు, అతని తమ్ముడు కాంతారావు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివాదరహితుడైన సాల్మన్పైనే దాడి చేసి చివరకు ఆయనే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. చికిత్స పొందుతూ సాల్మన్ మృత్యువాత పడ్డారు. తాజాగా ఆకూరి వెంకటరెడ్డిపై పక్కా ప్రణాళికతో టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. ఇనుపరాడ్లు, సుత్తులతో ప్రణాళికతో టీడీపీ నాయకులు దాడికి తెగబడిన సమయంలో వెంకటరెడ్డి దాచేపల్లికి సాదాసీదాగా ద్విచక్రవాహనంపై వస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు తలకు, కాళ్లు, చేతులకు గాయాలైనట్లుగా ఆసుపత్రికి వెళ్లి కట్లు కట్టించుకున్నారు. దాడి చేసిన వారికెలా గాయాలు అయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వెంకటరెడ్డిపైనే దాడి చేసి, తిరిగి అతనిపైనే కేసు పెట్టటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతా పోలీసుల పనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసే విషయంలో పోలీసులే అన్ని పాత్రలు పోషిస్తున్నారు. దాడి ఘటన తరువాత ఏ విధంగా కేసులు పెట్టాలి... వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తుల్లో ఏవరెవరిపై ఏ విధంగా ఫిర్యాదులు చేయాలి... టీడీపీ నాయకులు చెప్పిన వారిని ఎలా ఇబ్బంది పెట్టాలో పోలీసులే ముందుండి నడిపిస్తున్నారు. పిన్నెల్లికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్పై జరిగిన దాడిలో కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రామాపురం ఘటనపై కూడా టీడీపీ నాయకులు చెప్పినట్లే కేసులు పెట్టి వేధించేలా దాచేపల్లి పోలీసులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు చేపట్టలేదు. టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని వేధించటం ప్రారంభించారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసేందుకు తహతహలాడుతున్నారు. ఆకూరి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన ఆరుగురికిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారని టీడీపీ నాయకుడు వేముల వెంకటరెడ్డి ఫిర్యాదు చేయటంతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల తీరులో మార్పురాకపోతే బాధితుడికి న్యాయం జరగకపోగా, బాధితుడే జైలుపాలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 7కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామాపురంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. కేసు నమోదు చేసిన వారిలో పలువురు ఊరిలోనే లేరు. పోలీసులు రామాపురం వెళ్లి వీరి ఇళ్ల వద్ద దర్యాప్తు పేరుతో వేధింపులు ప్రారంభించారు. వాస్తవానికి దాడి జరిగిన రోజున ఘటన స్థలంలో బాధితుడైన వెంకటరెడ్డి తప్ప ఇంకెవ్వరు లేరు. మిగిలిన వారంతా అక్కడే ఉంటే టీడీపీ నాయకులపై కూడా దాడి జరిగేది కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నాటి సైదారెడ్డిపై నాలుగుసార్లు టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఈ దాడిలో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి గ్రామంలోకి వారిని రానీయకుండా.. ఉద్రిక్త వాతావరణం ఉండేలా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. -
దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
కారెంపూడి: ఇటీవల మండలంలోని నరమాలపాడు గ్రామ శివారులో జరిగిన భారీ దారి దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కారెంపూడి సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసు గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. మాచర్ల నుంచి కపలవాయి నాగ సాంబశివరావు ఆదేశాల మేరకు అతని గుమస్తా కోటేశ్వరరావు అతని కుమారుడు అనిమిశెట్టి సాయి వెంకటేష్, తిరుమల వాసులు కారులో 13 కిలోల వెండి, రూ.30 లక్షల నగదుతో కారెంపూడి మీదగా పిడుగురాళ్ల చేర్చేందుకు బయలు దేరారు. మార్గ మధ్యలో వారు నరమాలపాడు శివారులో భోజనం చేసేందుకు కారును పక్కన ఆపారని ఆ సమయంలో బైక్లపై వచ్చిన దొంగలు కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న వెండి, నగదును అపహరించారని అధికారులు వివరించారు. బాధితుడు నాగ సాంబశివరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి పిడుగురాళ్లలో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. కేసులో బొమ్మినేడి శ్రీనివాసరావు, అనుములశెట్టి సాయి వెంకటేష్, కందుకూరి నాని, పెళ్లూరి ఆంజనేయులు, మోగిలి అఖిల్లను అరెస్టు చేయడం జరిగిందని సీఐ, ఎస్లు వివరించారు. వారు వాడిన మూడు బైక్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
కల్యాణ వైభోగమే..!
అమరావతి: భక్తుల పాలిట కొంగుబంగారంగా, స్వయంభూగా.. పిలిస్తే పలికే దేవుడుగా మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వెలసిన శ్రీవటవృక్షాంతర్గత వేంకటేశ్వరుని 49వ వార్షిక కల్యాణ మహోత్సవం గురువారం కనులపండువగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు వినుకొండ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేకువజామున కల్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రాతఃకాల అర్చన నిర్వహించారు. అనంతరం బిందెతీర్ధంతో స్వామివారికి పంచసూక్తాలతో పంచామృత స్నపనను సశాసీ్త్రయంగా చేశారు. అనంతరం తులసీ దళాలతో స్వామివారికి సహస్రనామ తులసీదళసేవతో స్వామివారికి విశేష అలంకారం నిర్వహించారు. మధ్యాహ్నం దేవాలయ ఉత్తరభాగంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి కల్యాణోత్సవం నిర్వహించారు వైఖానస ఆగమ ప్రకారం పరుచూరి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో సుమారు 50 మంది దంపతులచే స్వామివారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు భూదేవి, శ్రీదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు పెదశేష వాహనం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను అందజేశారు. భక్తులకు అన్న సంతర్పణ శ్రీ వటవృక్షాంతర్గత వేంకటేశ్వరస్వామి వారి 49వ వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా హాజరైన భక్తులందరికీ మల్లాది గ్రామస్తుడు బత్తినేని శంకర్ గ్రామస్తుల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్య క్రమంలో వైఎస్సార్ సీపీ ిసీఈసీ మెంబర్ వెంపా జ్వాలాలక్ష్మీనరసింహారావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు భవిరి శెట్టి హనుమంతరావులతో పాటు నాయకులు వెంపా వాసు, వెంపా శ్రీను, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. కనుల పండువగా మల్లాది వేంకటేశ్వరుని కల్యాణోత్సవం -
పవన్ పర్యటనతో భక్తులకు అవస్థలు
నరసరావుపేట రూరల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనతో భక్తులకు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచి కొండను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లోని దుకాణాలను మూసివేయించారు. రోజువారీ వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగించే వ్యాపారులు ఇబ్బందిపడ్డారు. భక్తుల రాకపైనా పోలీసుల ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కొండకు వచ్చే భక్తులను ఆపారు. నరసరావుపేట– కోటప్పకొండ మార్గంలోని ఆర్టీవో కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే ఈ రోడ్డులోకి అనుమతించారు. కోటప్పకొండ చౌరస్తాలోని ధ్యానశివుడు విగ్రహానికి కూటమి నాయకులు ఫ్లెక్సీలు కట్టడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. పవన్ కళ్యాణ్ను కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన మరియమ్మకు రెండు కాళ్లు, చేతులు లేవు. పూర్తి వైకల్యంతో ఉన్న తనకు ప్రస్తుతం వికలాంగ పెన్షన్ మాత్రమే అందుతోంది. దీనిని రూ.15 వేలకు పెంచాలని కోరుతూ పవన్ కళ్యాణ్కు వినతిపత్రం ఇచ్చేందుకు కోటప్పకొండకు వచ్చింది. ప్రధాన సెంటర్లో వేచి ఉన్న ఆమెను పోలీసులు పక్కకు పంపించేశారు. -
ఏపీ గ్రామీణ బ్యాంక్తో యూనియన్ ఎంఎఫ్ భాగస్వామ్యం
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డై–ఇచి లైఫ్ హోల్డింగ్ ఇన్ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తున్న యూనియన్ మ్యూచువల్ ఫండ్(యూనియన్ ఎంఎఫ్), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ)తో పంపిణీ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు గురువారం గుంటూరులోని ఓ హోటల్లో ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్కుమార్ రెడ్డి, యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంసీ) సీఈఓ మధు నాయర్లు ఒప్పందంపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ సీఈఓ మధు నాయర్ మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి యూనియన్ మ్యూచువల్ ఫండ్ సుమారు రూ.25,636 కోట్ల సగటు నిర్వహణలో ఉన్న ఆస్తులను నిర్వహిస్తోందని తెలిపారు. ఏపీజీబీ చైర్మన్ కె.ప్రమోద్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,351 శాఖలు, సుమారు 1.20 కోట్ల మంది ఖాతాదారులతో రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్గా ఏపీజీబీ ఉందన్నారు. -
తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీటీడీ నిత్యాన్నదానానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదాన నిమిత్తం ఈ విరాళాన్ని అందించామని తెలిపారు. రొంపిచర్ల: స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం కనపడింది. ఉదయం వేళ గర్భగుడిలో ఉన్న అమ్మవారి మూలవిరాట్ను తాకుతూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేముల బాబు శర్మ పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్: వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం కోటప్పకొండ క్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాదెండ్ల: గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఇరువురు దాతలు రూ.1.05 లక్షల విరాళాన్ని హెచ్ఎం కృష్ణానాయక్కు అందించారు. గ్రామానికి చెందిన జంపని శ్రీనివాసరావు, కాట్రు కృష్ణారావు గురువారం పాఠశాలను సందర్శించి, విరాళం అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ప్రహరీ, ప్రార్థన వేదిక, ఓపెన్ ఆడిటోరియం, తదితర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారి కన్నబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు అత్యవసర రహదారి పనుల నిమిత్తం అంజిరెడ్డి కాలనీ, కేసీసీ యార్డ్ మధ్య గల రైల్వే గేటు మీదుగా రాకపోకలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
కాల్వలో పడి సాంఘిక నాటక దర్శకుడు మృతి
దుర్గి/గురజాల: మండల పరిధిలోని అడిగొప్పల గ్రామానికి చెందిన ఆరికట్ల వెంకట్రామయ్య అలియాస్ ఏవీఆర్ చౌదరి (50) ప్రమాదవశాత్తూ కాలువలోపడి దుర్మరణం చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. వెంకట్రామయ్య తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పక్కనే ఉన్న కాల్వలోకి దిగాడు. కాల్వలో పాచి ఎక్కువగా ఉండటంతో కాలుజారి నీటి ప్రవాహంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన ప్రముఖ సాంఘిక నాటక దర్శకుడుగా పల్నాటి ప్రాంతంలో ప్రాచుర్యం పొందాడు. వందలాది సాంఘిక నాటకాలకు దర్శకత్వం వహించి కొత్తతరం యువకులను, నటనా రంగానికి పరిచయం చేశాడు. కొంతకాలం ప్రముఖ దినపత్రికలలో జర్నలిస్టుగా సేవలందించాడు. విషయం తెలుసుకున్న నాటకరంగ కళాకారులు, అభిమానులు వెంకట్రామయ్య మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్ల సత్రానికి రూ.5 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని యోగివేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్లసత్రానికి నడమర్రు గ్రామానికి చెందిన మర్రెడ్డి సంజీవరెడ్డి రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. సత్రం కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విరాళం మొత్తాన్ని సత్రం కమిటీ సభ్యులకు అందించారు. సత్రంలో నూతన గదుల నిర్మాణానికి ఈ విరాళం అందజేసినట్టు దాత సంజీవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సత్రం కమిటి కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, మాజీ అధ్యక్షుడు గాయం కృష్ణారెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు మర్రెడ్డి రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. -
ఏడాదైనా పరిహారం ఏదీ ?
●కలుషిత నీరు తాగి చనిపోయిన వారి కుటుంబాలకు మొండిచేయి ●కనీసం ఆదుకోవడానికి కూడా మనసు రాని చంద్రబాబు ప్రభుత్వం ●మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శల వేళ ఇచ్చిన హామీల అమలు శూన్యం ●సంవత్సరం దాటినా బాధిత కుటుంబాలకు పరిహారం కలే సాక్షి, టాస్క్ఫోర్స్: తాగునీరు కలుషితమై డయేరియా బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఏడాది దాటినా కనీసం పరిహారం అందించకపోవటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్నగర్, మారుతీనగర్ ప్రాంతంలో తాగునీరు కలుషితమైంది. ఫలితంగా డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో జూన్ నెలలో పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లలగడ్డల ప్రాంతంలో డయేరియా కారణంగా అప్పట్లో కందుల మాబు చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించలేదు. కనికరమే లేదు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణంలో ఐదుగురు కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడ్డారు. తర్వాత మృతి చెందారు. అలాగే దాచేపల్లి మండలంలోని అంజనీపురానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు చిన్న వీరయ్య కూడా మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను పిలిపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుటుందని, పరిహారం కచ్చితంగా అందిస్తామని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది అవుతున్నప్పటికీ మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లల గడ్డ ప్రాంతంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీరు కలుషితమైంది. ఒకరు మృతి చెందారు. మరికొంత మంది అస్వస్థతకు గురై హాస్పటల్ పాలయ్యారు. ఆ సమయంలో కూడా యరపతినేని పరామర్శ కార్యక్రమాలు చేపట్టారు. పరిహారం మాత్రం మరిచిపోయారు. మాటలకే పరిమితం డయేరియా ప్రబలిన మారుతీనగర్, లెనిన్ నగర్ ప్రాంతాల్లో పది రోజులపాటు మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు హడావుడి చేశారు. డ్రైనేజీలను బాగు చేయించటం, చెత్త తొలగిస్తామని చెప్పి మున్సిపల్ నిధులను డ్రా చేసుకున్నారు. తర్వాత అధికారులు, నాయకులు... తాగునీటి కలుషితం వలనే డయేరియా వచ్చిందని తెలుసుకొని నీటిని పరీక్షలకు పంపించారు. మున్సిపల్ నిధులతో మాత్రం తమ జేబులు నింపుకొన్నారు. ఏడాది కావస్తున్నా కార్యాలయాలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణ మినహా ప్రయోజనం లేకుండాపోయింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారే.. డయేరియా కారణంగా మరణించిన వారివి నిరుపేద కుటుంబాలు. పోషించే వారే మృతి చెందటం వలన నేడు మిగతా వారి పరిస్థితి అధ్వానంగా మారింది. పూట గడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పిల్లలు సైతం కూలి పనులు చేసుకొని జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వలన పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావని.. కనీసం కుటుంబ సభ్యులనైనా ఆదుకునేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని స్పందించాని విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిక్ ఆంజనేయులు తిరుపతమ్మ నాగమణి వెంకటేశ్వర్లు తాగునీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోయినా పట్టించుకోని అసమర్థ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. గతంలోనూ టీడీపీ హయాంలో పిడుగురాళ్ల పట్టణంలో డయేరియాతో ఒకరు చనిపోయారు. అప్పుడూ పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో ఐదుగురు, దాచేపల్లి మండలంలో ఇద్దరు డయేరియాతో చనిపోయారు. మంత్రిని పిలిపించి పరామర్శింపజేశారు. పరిహారం మాత్రం అందించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలలో శుద్ధి చేసిన తాగునీరు అందించాం. డయేరియా జాడ లేకుండా చేశాం. – కాసు మహేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట:జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్ష లు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ పరీక్షలకు సంబంధించి కాన్ఫిడెన్షియల్ మె టీరియల్ స్టోరేజ్ సెంటర్, పేపర్ల పంపిణీ విషయంలో పోలీసుల బందోబస్తు మధ్య ఏర్పాటు కు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ డీటీ స్థాయి అధికారి, పోలీస్ శాఖ ఏఎస్ఐ స్థాయి అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను మూడు టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎ లాంటి ముందస్తు అవరోధాలు కలగకుండా త గిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ, ము న్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఆర్టీసీ,విద్యుత్ సౌక ర్యం అందుబాటులో ఉంచాలని, సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురికి జైలు గుంటూరులీగల్:గుంటూరు నగరంలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగినట్లు నిర్ధారణ అయిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. నలు గు రు మద్యం తాగి వాహనాలు నడిపినట్లు నిర్ధా రణ కావడంతో ఒక్కొక్కరికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ బుధవారం తీర్పు వెలువరించారు. వీరిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక కారు డ్రైవర్, మరొకరు ద్విచక్ర వాహనం నడుపుతున్నారు. వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. -
సానుకూల పవనాలు వీచేనా !
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో పర్యటించనున్నారు. త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రూ.3.9కోట్లతో నిర్మించిన కొత్తపాలెం– కోటప్పకొండ రోడ్డును ప్రారంబిస్తారు. ఘాట్రోడ్డులోని ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. కోటప్పకొండ అభివృద్ధిలో భాగంగా పలు పనులు అటవీశాఖ అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. పాతకోటయ్య స్వామి మెట్లమార్గం, గిరిప్రదక్షిణ దారి ఇందులో ఉన్నాయి. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న అటవీశాఖ వద్ద ఈ పనులు పెండింగ్లో ఉన్నాయి. అటవీశాఖ అనుమతులు కోసం ఎదురుచూపులు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి పైభాగాన ఉన్న పాతకోటయ్య స్వామి ఆలయానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాతకోటయ్య ఆలయానికి మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని భావించారు. విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంబం కాలేదు. మెట్లమార్గం ఏర్పాటుకు అవసరమైన ఫైల్ ప్రస్తుతం అటవీ శాఖ వద్ద పెండింగ్లో ఉంది. రెండేళ్లుగా ఈ ఫైల్ ముందుకు సాగడం లేదు. గిరిప్రదక్షిణ దారికి మోక్షం ఎప్పుడూ..? కోటప్పకొండ గిరిప్రదక్షిణను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మట్టి, రాళ్లతో నిండిన రోడ్డుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 7 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణదారిలో సగానికి పైగా ఇప్పటికే బీటీ రోడ్డు ఉంది. మిగిలిన దారిలో బీటీ రోడ్డు వేసేందుకు అటవీ శాఖ అనుమతులు కావాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన డీపీఆర్ను అధికారులు పంపించారు. పవన్ కల్యాణ్ కోటప్పకొండ పర్యటనలో ఈ రోడ్డుకు శంకుస్థాపన ఉంటుందని భావించారు. అయితే చివరి నిమిషంలో దీనిని రద్దు చేశారు. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకపోవడమే వల్లనే రద్దు చేసినట్టు సమాచారం. కళతప్పిన ఘాట్రోడ్డు మార్గం.. కోటప్పకొండ ఘాట్రోడ్డు మార్గంలోకి ప్రవేశించే భక్తులకు పచ్చని చెట్లు, పూల మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపించేది. ప్రస్తుతం ఘాట్రోడ్డు మార్గం కళతప్పింది. ఎండిపోయిన చెట్లు భక్తులకు దర్శనమిస్తున్నాయి. టోల్గేట్ వద్ద నుంచి ఘాట్రోడ్డులోని పచ్చదనంతో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని అటవీ శాఖ నిర్వహిస్తుంది. కొంతకాలంగా మొక్కల సంరక్షణను ఈ శాఖ గాలికొదిలేసింది. నీరు లేక మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కాళింది మడుగులో బోట్లు మరమ్మతులకు గురికావడంతో బోటు షికారు నిలిచిపోయింది. బాలానందంలో చిన్నారుల ఆటవస్తువులు దెబ్బతిన్నాయి. పక్షుల పర్ణశాలలోని నెమళ్ల క్లోజ్డ్ ఎన్క్లోజర్కు ఎండవేడిమి తట్టుకునే విధంగా ఏర్పాటుచేసిన గ్రీన్ మేట్లు చిరిగిపోయాయి. అటవీ శాఖ అధికారుల అలసత్వంలో ఇక్కడ వన్యప్రాణులు దప్పికతో అల్లాడుతున్నాయి. మూడు నెలల పాటు నీటి మోటర్లు పనిచేయక వన్యప్రాణులు దప్పికతో అల్లాడిపోయిన ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. కోటప్పకొండలో నిలిచిన అభివృద్ధి పనులు పాత కోటయ్య స్వామి మెట్ల మార్గం, గిరి ప్రదక్షిణ దారికి అటవీ శాఖ అడ్డంకులు అటవీ శాఖ అనుమతుల కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దే అటవీ శాఖ -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కారెంపూడి: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. జగ్గారావు హెచ్చరించారు. కారెంపూడిలోని ఎరువుల దుకాణాలలో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కారెంపూడి మండలంలో సరిపడా యూరియా, ఎరువుల నిల్వలున్నాయని రైతులు తొందర పడి అధిక ధరలకు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం మండలంలో ఈ క్రాప్ బుకింగ్ నమోదు తీరును పరిశీలించారు. రబీలో వేసిన ప్రతి ఎకరా పైరును ఈ క్రాప్ చేయించాలని వ్యవసాయశాఖ సిబ్బందిని ఆదేశించారు. రైతులు కూడా గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తాము వేసిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నరసింహారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గారావు -
డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
పలుదేవర్లపాడు(ముప్పాళ్ళ): రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందిస్తున్న డ్రాఫ్ట్(ముసాయిదా) పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో జరుగుతున్న పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల్లో ఏమైనా సవరణలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకొని వచ్చి సవరణ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించటం జరుగుతుందని, ఈ లోపు ముసాయిదా పుస్తకాల్లో ఉన్న లోపాలను సవరించుకునే వీలుంటుందన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి ముసాయిదా పట్టాదారుపాస్తుకం అందించారు. తొలుత ముప్పాళ్ళలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్రెడ్డి, తహసీల్దార్ కె.నగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతూ గ్రామంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు వేముల లక్ష్మారెడ్డి, అంబటి వెంకటరెడ్డి, కోట చంద్రంపై పలుమార్లు దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి దాడులు చేసి తీవ్ర భయభ్రాంతులకు టీడీపీ నేతలు గురి చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ఊరేగింపులో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించి కారం, కర్రలతో దాడులు చేశారు. టీడీపీ నాయకులే దాడులు చేసి గాయపడిన వారి మీదే కేసులు పెట్టించి జైలుపాలు చేస్తున్నారు. -
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించారు. బీటెక్, బీఈ, బీ ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈనెల 29 వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీబీటీ విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం గుంటూరులో పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం గంటల పరీక్షకు 7 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ నిర్ధేశించడంతో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు సకాలంలో చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. -
పల్లెల్లో టెన్షన్..టెన్షన్
చంద్రబాబు ప్రభుత్వంలో మళ్లీ ఫ్యాక్షన్ సంస్కృతి సాక్షి టాస్క్ఫోర్స్: ఒకప్పుడు పల్నాడు జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలతో ఒణికిపోయింది. రక్తపుధారలతో భూమి తడిసిపోయింది. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. వైఎస్సార్ సీపీ పాలనలో ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయి. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. అభివృద్ధి బాట పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ పడగవిప్పాయి. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో అలజడి మొదలైంది. ఎప్పడు ఏ గ్రామంలో ఏం జరుగుతుందోనని పల్లె వాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. టీడీపీ నాయకుల దాడులకు భయపడి నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది కుటుంబాలు పుట్టి పెరిగిన ఊరిని, కుటుంబాలను వదిలిపెట్టి దూరంగా బతుకున్నారు. వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్య మరువక ముందే వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భర్త వెంకటరెడ్డిపై దాడిచేసి రోడ్డుపై పడేశారు. ఇలాంటి ఘటనలతో పల్లె ప్రజలు భయాందోళనతో ఉన్నారు. యరపతినేని అండతోనే దాడులు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలు, పోలీసుల సహకారంతో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై యథేచ్ఛగా దాడులు చేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వివాదరహితుడైన వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ని టీడీపీ నాయకులు మోటుమర్రి పేతురు, అతని తమ్ముడు కాంతారావు హత్య చేశారు. తాజాగా రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త ఆకూరి వెంకటరెడ్డిని కాపు కాసి టీడీపీ నాయకులు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తంగేడకి చెందిన ఉప్పుతల హరికృష్ణ, కామేపల్లికి చెందిన గోగిరెడ్డి పిచ్చిరెడ్డి, జూలకల్లుకి చెందిన దొండేటి లక్ష్మారెడ్డి, నర్రెడ్డి వెంకటరెడ్డి, చల్లా అంజిరెడ్డి, పాశం అంజిరెడ్డి, తుమ్మలచెరువుకు చెందిన బక్కిరెడ్డి, మాదినపాడులో దొండేటి ఆదిరెడ్డి ఇలా చెప్పుకుంటే ఎంతోమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. పోలీసులతో బెదిరింపులు...అక్రమ కేసులు: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ కార్యర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడటం ఒక ఎత్తయితే...దెబ్బతిన్నవారిపైనే అక్రమ కేసులు పెట్టటం మరో ఎత్తు. గురజాల నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. రామాపురం ఎంపీటీసీ ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే ఈ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు కుటీల ప్రయత్నాలు చేశారు. వెంకటరెడ్డి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించారు. ఇదేమిటని పలువురు మీడియా ప్రతినిధులు పోలీసులను అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తికి న్యాయం చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకులకు అండగా నిలిచి తిరిగి కేసులు పెట్టే విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు లొంగకపోతే నేరుగా దాడులకు తెగబడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను వేధించటమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తప్పుబట్టుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పల్లెల్లో శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
● రూ.25 వేలు ఖర్చు అయ్యే పనికి రూ.1.50 లక్షల వరకు చెల్లింపు ● జీబ్రా గుర్తుల్లో మున్సిపల్ అధికారుల చేతివాటం
ప్రజా సొమ్ము గోల్మాల్ నరసరావుపేట: పురపాలక సంఘంలో అవినీతి ఛాయలు కనిపిస్తున్నాయి. వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల పర్యవే క్షణ, ప్రశ్నించేందుకు కౌన్సిల్ లేకపోవటంతో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఇటీవలనే మెప్మాలో ఫేక్ గ్రూపులు సృష్టించి సుమారు రూ.20 కోట్లు వరకు బ్యాంకు రుణాలు దిగమింగిన ఉదంతం బయటకు రావటంతో విచారణ జరుగుతుంది. కాగా, చిన్న పనులు చేసి పెద్ద మొత్తంలో ప్రజాసొమ్ము కాజేసిన ఉదంతం మరొకటి బయటపడింది. -
అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఫిబ్రవరి 17 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారన్నారు. కల్నల్ రజత్ సువర్ణ మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17 నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి ఈ–మెయిల్కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ డైరెక్టర్ సత్య పాల్, ఆర్మీ మేజర్ అమర్దీప్ కుమార్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారిని బుధవారం పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారి ఆలయానికి వచ్చిన స్వామిజీకి ఆలయ అర్చకులు, కార్యనిర్వాహణాధికారి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా విద్యా శంకర భారతి మహాస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన అనుగ్రహణ భాషణం చేశారు. అనంతరం స్వామిజీని ఆలయ కార్య నిర్వాహణాధికారి నరసింహమూర్తి ట్రస్టుబోర్డు చైర్మన్ చక్రధర్రెడ్డి సన్మానించి అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందించి తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ ఇలా వచ్చి... అలా వెళ్లారు వినుకొండ: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ్ వినుకొండ రైల్వేస్టేషన్ సందర్శన కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరిన ఆయన నంద్యాల, దొనకొండ మీదుగా వినుకొండ చేరుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రజ ల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఎన్నో సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన స్థానికులకు ఎక్కువ సమ యం కేటాయించకపోవడంతో నిరాశ మిగిలింది. ముఖ్యంగా నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో గూడ్స్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని, 45 పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు వినుకొండ మార్గంలో నడుస్తున్నప్పటికీ ప్యాసింజర్ రైలు లేకపోవ డంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నడికుడి కాళహస్తి డబ్లింగ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని సమస్యలను అడిగేందుకు వచ్చిన ప్రయాణికులకు నిరాశ మిగిలింది. ఆయన వెంటనే గుంటూరు వెళ్లారు. ఉపాధ్యాయుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి చిలకలూరిపేట: ఉపాధ్యాయుల డీఏ బకాయి లు జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రూ.1100 కోట్లు విడదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నేటికీ చాలామంది ఖాతాల్లో మూడు విడతల డీఏ బకాయిలు జమ కాలేదని విమర్శించారు. ఎస్టీయూ నాయకులు పలువురు పాల్గొన్నారు. -
గూండాలు రాజ్యమేలుతున్నారు
దాచేపల్లి:గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే గా యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే గూండాలు రాజ్యమేలుతారని ముందు చెప్పామని, ప్రస్తుతం గూండాలు రాజ్యమేలుతున్నా రని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. దాచేపల్లి మండలం రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు దాడిచేయగా తీవ్ర గాయాలతో పిడుగురాళ్లలోని పల్నాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వెంకటరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు బుధవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ భర్తపై టీడీపీ నాయకులు నడిరోడ్డుపై దాడి చేస్తే బండి మీద నుంచి పడ్డాడని చెప్పటానికి దాచేపల్లి సీఐ పొన్నూరి భాస్కర్కు సిగ్గు ఉండాలని అన్నారు. ఇనుపరాడ్లతో కొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కూడా కలసి ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయకపోతే దాచేపల్లి పోలీస్స్టేషన్ను వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో ముట్టడిస్తామని చెప్పారు. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీసులపై హైకోర్టులో కేసులు కూడా వేస్తామన్నారు. దాచేపల్లి సీఐ భాస్కర్పై ప్రైవేట్ కంప్లిట్ కూడా కోర్టులో నమోదు చేస్తామని, తప్పు చేసిన వారు ఇంతకు పదింతలు అనుభవించే రోజులు కూడా వస్తాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాం: రామాపురం ఎంపీటీసీ ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన దాడి ఘటన గురించి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మాజీ ఎమ్మెల్యే కాసు చెప్పారు. బాధితుడు వెంకటరెడ్డికి అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ సీఎం జగన్ చెప్పారని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, వైస్ చైర్మన్లు కొమరబత్తిన విజయ్కుమార్, షేక్ ఖాదర్బాషా, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్ సత్తార్, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, చింతా సుబ్బారెడ్డి, మాదాల కిరణ్, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్నందు సమరసత సేవా ఫౌండేషన్ వారి పూజ్య ధర్మాచార్య సదస్సును మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాలలో భాగంగా మంగళవారం బగళాముఖి అమ్మవారు కళ్యాణ రాజశ్యామలాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 28వరకు అమ్మవారి ఆలయంలో రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి, చైర్మన్ చక్రధర్రెడ్డి తెలిపారు.


