breaking news
Palnadu District Latest News
-
స్వర్ణం సాధించిన కేఎల్యూ విద్యార్థి ముఖేష్
తాడేపల్లి రూరల్:ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కేఎల్యూ విద్యార్థి స్వర్ణపతకం సాధించినట్లు వర్సిటీ స్పోర్ట్స్ విభాగ డీన్ హరికిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయని, రాజస్థాన్ స్టేట్ షూటింగ్ రేంజ్లో ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కేఎల్యూకి ప్రాతినిధ్యం వహించిన నేలవల్లి ముఖేష్ స్వర్ణ పతకం సాధించాడని తెలిపారు. తమ యూనివర్సిటీ నుంచి తనిష్క్ మురళీధర్ నాయుడు, నాగసాయి తరుణ్ కూడిన బృందం రజత పతకాలు సాధించారని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన ముఖేష్ను రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి. రాజకుమార్, వర్సిటీ పీడీలు గౌతమ్,శ్రీహరి పాల్గొన్నారు. -
ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని హైద్రాబాద్ విల్ టూ కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ప్రేరణ తరగతులను ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి 200మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ట్రైనర్గా హాజరైన రామేశ్వర్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా చేయడమే కార్యక్రమ ఉదేశమని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో 53 వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తిచేసినట్టు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, అన్నమయ్య జిలాల్లో పూర్తిచేసామని వివరించారు. ఏపీలో 16జిల్లాల్లో 25వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి రోజూ దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమానికి అవకాశం కల్పించిన డీఈవో చంద్రకళకు ఽకృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వేమూరి శ్రీనివాస్, సుందర్రావు, షేక్ కరీముల్లా, కొండం రాజులు పర్యవేక్షించారు. -
విజేతలకు పతకాలు ప్రదానోత్సవం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏడాది జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2025 ఏపీ విజేతలకు ఆదివారం స్థానిక వెల్కమ్ హోటల్లో పతకాల బహుకరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సలాలిత్ తొట్టెంపూడి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపి నుంచి మొత్తం 520 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో 204 పతకాలు సాధించారన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మల్లిఖార్జున నాయక్, కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, రోడిక్ కన్సల్టెంట్ ఎండీ రాజ్కుమార్లు క్రీడాకారులకు అందజేశారన్నారు. -
తప్పుడు కేసులపై సీబీఐ విచారణ జరపాలి
●పిన్నెల్లి సోదరులపై బనాయించినవి అక్రమ కేసులు ●ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు ●న్యాయం ఎప్పటికై నా గెలుస్తుంది ●గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిపిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై బనాయించిన తప్పుడు కేసుపై దమ్ముంటే అధికార పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్చేశారు. పిన్నెల్లి సోదరులపై బనాయించినవి తప్పుడు కేసులనే విషయం జిల్లాలో ఎవరిని అడిగిన వెంటనే చెబుతారని అన్నారు. నరసరావుపేటలోని తన నివాసంలో మహేష్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులకు పాపం పండింది.. జైలుకు పోతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, ప్రత్యర్థితో రాజకీయంగా పోటీపడాలే గాని తప్పుడు కేసులు బనాయించి జైలు పంపాలని చూడడం చేతకానితనం అని పేర్కొన్నారు. పోలీసుల వల్ల కాక చివరికి కోర్టులను ప్రభావితం చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డితో పాటు జిల్లాలోని ప్రతి కార్యకర్తా వెన్నంటి ఉంటారని తెలిపారు. వెల్దుర్తి మండలం గొల్లపాడులో నాలుగైదు నెలల క్రితం జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు, చంపించిన వాళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ప్రధాన నాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయటం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విలువ ఇస్తామని, తప్పకుండా రామకృష్ణారెడ్డి హాజరవుతారని, న్యాయం కోసం తమ వంతు గట్టిగా పోరాడుతామని మహేష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ సీపీదే ! మాచర్ల నుంచి శ్రీశైలం వరకు, మళ్లీ అక్కడ నుంచి బాచిపల్లి వరకు జాతీయ రహదారి సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మహేష్రెడ్డి అన్నారు. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒరికెపూడిశెల ప్రాజెక్టును కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొచ్చింది.. రూ.3000 కోట్లు బడ్జెట్ మంజూరు చేయించింది రామకృష్ణారెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. పల్నాడు అభివృద్ధిలో దూసుకుపోయిందని, ఇలా అభివృద్ధి చేయడమేనా? రామకృష్ణారెడ్డి చేసిన పాపం అని బ్రహ్మారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికలు నాలుగు నెలలు ఉందనంగా జంగమహేశ్వరంలో వైఎస్సార్ సీపీ నాయకుడిని, టీడీపీ నాయకులు చంపారని అంతమాత్రాన తాము శ్రీనివాసరావు మీద తప్పుడు కేసులు పెట్టలేదు కదా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి విషయాలను ఎప్పుడూ రాజకీయంగా ఉపయోగించుకోలేదని తెలిపారు. తాము ఎప్పటికీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రామకృష్ణారెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారని, జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడేందుకు తామంతా కష్టపడతామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. -
గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకుల అరెస్టు
మాచర్ల రూరల్: గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి బాటిల్స్లో నింపి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 494 గ్రాముల 260 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువకులలో ఒకడైన మచిలీపట్నానికి చెందిన రమణీ అరవింద్, షేక్ నాగూర్ షరీఫ్, షేక్ నజీర్, షేక్ పఠాన్ సిరాన్ ఖాన్, షేక్ సలీం అనే యువకులు ఒడిస్సాలోని చిత్రకొండ పరిసరాలలో గంజాయితో తయారు చేసే హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తెచ్చి మాచర్ల పట్టణ, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నారు. రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా నేతృత్వంలో వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్ తనకు వచ్చిన సమాచారంతో మండాదిలోని కానాగు వాగు దగ్గరకు సిబ్బందితో వెళ్లారు.అక్కడ గంజాయి ఆయిల్ను 5ఎం.ఎల్. బాటిళ్లలో నింపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువకులు సులభమార్గంలో డబ్బులు సంపాదించేందుకు విద్యార్థులు, యువకులను టార్గెట్గా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలేజీలలో అవగాహన కార్యక్రమాలతో పాటు యాజమాన్యంతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ షేక్ నసీబ్ బాషా, వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్, సిబ్బందిలను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. వీరికి రివార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. 494 గ్రాముల లిక్విడ్ స్వాధీనం -
బాలోత్సవంలో సందడే.. సందడి
●ఆకట్టుకున్న దేశభక్తి, జానపద గీతాలు ●కోలాటంతో కదం తొక్కిన బాలలు నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆకట్టుకుంది. చిన్నారులు సృజనాత్మకత, నైపుణ్యాలు వారిలో ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చాయి. పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మూడవ పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజు ఆదివారం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగాయి. చిన్నారులు జానపద వేషధారణలతో మైమరిపించారు. కళాశాల ప్రాంగణం బాలల కేరింతలు, చిన్నారుల నవ్వులతో నిండిపోయింది. ముఖ్య అతిథులుగా ఎంఏఎం కళాశాలల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, ఎస్ఎస్ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామినేని వినోద్కుమార్రెడ్డి హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కోలాటం, లఘు నాటికలు, జానపద నృత్యం–గ్రూపు, పాటలు, స్పెల్ బీ, ప్రాజెక్ట్ పని, రంగ వల్లులు, బుర్రకథ, కథ చెప్పడం, తెలుగు పద్యాలు, అభినయ గేయాలు, దేశభక్తి గేయాలు, రైమ్స్, విచిత్ర వేషధారణ, మెమరీ టెస్ట్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, వక్తృత్వం, మ్యాథ్స్ క్విజ్, మట్టితో బొమ్మలు తయారీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటికలు, పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయాల్లోనూ ప్రతిభ కనబరిచారు. నృత్య ప్రదర్శనల్లో బాలలు -
కుక్కలు తిన్నాకే తినాలా?
నూజండ్ల: మండల పరిధిలోని ఉప్పలపాడు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అందించాల్సిన మజ్జిగను కుక్క తాగుతూ పలువురికి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు తిన్న ఆహారం తింటే రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు ఉందని భయపడ్డారు. అయితే, ఎటువంటి ఇబ్బంది కలగక పోవటంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేర్టేకర్ను వివరణ కోరగా అప్పటికే విద్యార్థులు భోజనాలు ముగించారని, కుక్క తిన్న ఆహారాన్ని పారవేశామన్నారు. పాఠశాలలో కుక్కల,కోతుల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ప్రిన్సిపాల్ స్థానికంగా ఉండరని విమర్శలున్నాయి. 600 పైగా విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. కానీ అలా జరగటం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. -
13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా క్ట్రెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
డాక్టర్ జున్ను సాహెబ్కు డబుల్ ధమాకా
●కొండవీడు హైస్కూల్ టీచర్కు రెండు అవార్డులు ●రెండురోజులు రెండు సంస్థల నుంచి అందుకున్న జాతీయ పురస్కారాలు యడ్లపాడు: కొండవీడులోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ షేక్ జున్ను సాహెబ్కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయస్థాయి పురస్కారాలను అందించాయి. విద్య, మానవ సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు ఆమె అందుకున్నారు. ఇందులో విద్యార్థులకు వినూత్న బోధన, చేతిరాత నైపుణ్యాలు, గ్రీన్ వారియర్స్ పేరిటా అందించిన సేవలకు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘జాతీయ ఉపాధ్యాయ ప్రేరణ అవార్డ్స్–2025’ శనివారం అందుకున్నారు. పేదలకు నిస్వార్థ సహాయం, విద్యార్థులకు కాలిగ్రఫీ ఉచిత శిక్షణ ఉద్యమం, జీవ వైవిధ్య అవగాహన రంగాలలో చేసిన విశేష కృషికి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో ‘ఉత్తమ్ భారత్ పురస్కార్ 2025’ను ఆదివారం అందించింది. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కుమార్, ఎంపీ మల్లు రవి, బయో డైవర్సిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమల మనోహర్, జీహెచ్ఆర్టీ వ్యవస్థాపకులు షేక్ రెహమాన్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు. అతిథులు జున్నుసాహెబ్ నిబద్ధత, సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. అవార్డు గ్రహీత జున్నుసాహెబ్ మాట్లాడుతూ ఈ పురస్కారాలతో బాధ్యత మరింత పెరిగిందని, తన సంకల్పాన్ని మరింత విస్తరింపజేస్తానని చెప్పారు. పలువురు విద్యవేత్తలు, ప్రముఖులు, సహోపాధ్యాయులు జున్ను మాస్టారుకు అభినందనలు తెలిపారు. -
దయచేసి ధాన్యం కొనండి !
రైతుల వేడుకోలు కారెంపూడి: మండలంలో వరి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, పంట చేతికొచ్చినా రైతుల మొహంలో నవ్వులేదు. ధాన్యం కొనే దిక్కు లేదు. బీపీటీ, కేఎన్ఎం రకాలను వ్యాపారులు అసలు అడగడం లేదు. ఒక వేళ అడిగినా రూ.1,200లోపు 75 కేజీల బస్తా అడుగుతున్నారు. నిల్వ చేసుకునే అవకాశం, ఆర్థిక వెసులుబాటు లేని రైతులు ఆ ధరకే తెగనమ్ముతున్నారు. ఇంత తక్కువ రేటుకు అమ్మితే మిగులు ఉండదని దిగులు చెందుతున్నారు. ఎకరానికి సగటు దిగుబడి 35 బస్తాలు వస్తున్నాయి. ఎరువుల కొట్లలో బాకీలుంటే మాత్రం వారు ఏదో ఒక రేటుకు కొంటున్నారు. కాని మిగిలిన రైతులు వ్యాపారులను బతిమిలాడుకుని అమ్ముకుంటున్న పరిస్ధితులు కూడా తలెత్తుతున్నాయి. దిగుబడి ఉన్నా ధర లేదు మండలంలో 18 వేల ఎకరాలలో ఖరీఫ్లో వరి సాగైంది. ప్రస్తుతం మండలంలో సగం దాకా వరి నూర్పిళ్లు పూర్తయ్యాయి. అయినా కూడా ధర మాత్రం పెరగడం లేదు. చిట్టిపొట్టి రకం ధాన్యం మాత్రం బస్తా రూ.1,650 దాకా పలుకుతోంది. ఆరబెట్టకుండా ఉన్న బస్తా కనీసం రూ.1,500 లేకపోతే గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధర అయినా కల్పించాలని వేడుకుంటున్నారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని తాము గతంలో చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం బాధను బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్ధితి కన్పిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్ఎస్పీ కాలనీ గురుకుల పాఠశాల వద్ద ఒక చిన్నకారు రైతు బస్తా రూ. 1,300కు అమ్మానని వాపోయాడు. ఎకరాకు 35 బస్తాలయ్యాయని ఈ రేటుకు రెక్కల కష్టం కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగైతే వ్యవసాయం చేయడం కంటే కూలికి పోవడం మేలని సాటి రైతుకు చెప్పి వాపోయాడు. ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు. గ్రామాల్లో ధాన్యం రాసుల కళకళలతో ఆనందంగా ఉండాల్సిన రైతులు ధాన్యం కొనే దిక్కు లేరని బాధపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. మద్దతు ధర కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
కష్టాల ‘ప్లాజా’ !
● బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లు ● ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేయించిన అధికారులు ● అంబులెన్సులు సైతం క్యూలో రావల్సిందేనంటూ హుకుంమార్టూరు: జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు, సిబ్బంది తీరుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి సంవత్సరానికి రూ.కోట్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నా.. వారి అవసరాలకు సరిపడా సౌకర్యాలను సమకూర్చడం లేదని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మరో కొత్త సమస్యకు తెర లేపడం గమనార్హం. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఫ్రీ లెఫ్ట్ పేరుతో రెండు మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో వీవీఐపీల వాహనాలు, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కలెక్టర్, కేంద్ర, రాష్ట్రస్థాయి అధికారుల వంటి అత్యవసర వాహనాలు టోల్ ఫీజుతో సంబంధం లేకుండా వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు టోల్ ప్లాజా పరిసర గ్రామాలకు చెందిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం లోకల్ పాస్తో ఈ మార్గాల్లోనే వెళ్లి పోతుంటాయి. ఈ కారణంగా ఈ అత్యవసర వాహనాలు ఆలస్యం లేకుండా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదు. ● అదే రోజు అర్ధరాత్రి మార్టూరు వైపు నుంచి ఒంగోలుకు రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ ఫ్రీ లెఫ్ట్ మార్గం మూసి వేసి ఉండటంతో మిగిలిన వాహనాలతో పాటు క్యూలోనే ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధులే అంబులెన్సకు దారి వదులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బొల్లాపల్లి టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇందుకు మినహాయింపులాగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఈ విషయమై సిబ్బందిని వివరణ కోరగా.. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఆదేశాలతో తాము ఫ్రీ లెఫ్ట్ మార్గాలను మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా టోల్ ప్లాజా ఉన్నతాధికారులు స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది సైతం కోరటం విశేషం. -
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శని, ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. దీంతో లాంచీ స్టేషన్కు లక్షా 20 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె మస్తాన్బాబు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. -
స్వాహా..!
పల్నాడుసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అసైన్డ్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల్లో ఎవరి భూములు ఎక్కడ అనే దానిపై రైతులకు స్పష్టత లేదు. భూ ఆక్రమణదారులు మాత్రం ప్రధాన రహదారికి ఒక పక్కన ఉన్న చెరువులను మొత్తం ఆక్రమించి చెరువు కట్టలను ధ్వంసం చేయడంపై పలువురు రైతులు ప్రశ్నించారు. దీంతో ఈ ముఠా సభ్యులు వారిపై బెదిరింపులకు దిగారు. అధికారం మాది.. మేం చెప్పినట్టు వింటే డబ్బులు వస్తాయి లేకుంటే మీ భూమి కూడా మీకు ఉండదు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. భూముల ఆక్రమణ వెనుక పెద్దల హస్తం ఉందని భావించిన రైతులు దీనిపై మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. నరసరావుపేట రూరల్: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములపై అధికారపార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. మాయమాటలతో పేదలను లోబర్చుకుని నామమాత్రంగా డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. 20 ఎకరాలకు పైగా ఇప్పటికే భూ బకాసురుల చేతుల్లోకి వెళ్లగా భూములు ఇవ్వని రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. మండలంలోని పమిడిమర్రు గ్రామంలోని వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో గ్రామంలోని పేదలకు ఈ భూములను కేటాయించారు. సర్వే నెంబరు 44, 45లో దాదాపు 92 మంది రైతులకు 82 ఎకరాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆధీనంలోనే భూములు ఉన్నాయి. రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ఎవరి భూమి ఎక్కడ అనేది అధికారులు చూపలేదు. దీంతో రైతులు ఉమ్మడిగా చేపల చెరువుల నిర్వాహకులకు కౌలుకు ఇచ్చి ప్రతి ఏడాది కౌలు పొందుతున్నారు. పేదలకు కేటాయించిన భూముల్లో ఉన్న చేపల చెరువులను ఆక్రమణదారులు పొక్లెయిన్లతో పూడ్చివేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా గ్రామంలో భూ ఆక్రమణదారుల హడావుడి నెలకుంది. ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో చెరువు కట్టలను పగులకొట్టి భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఇదే విధంగా చదును చేశారు. పమిడిమర్రులో ఆక్రమణకు గురవుతున్న భూములు విలువ ఎకరం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణదారులు రైతులకు ప్రస్తుతం ఎకరానికి రూ.50వేలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. విడతల వారీగా ఎకరానికి రూ.2లక్షలు చెల్లిస్తామని నమ్మించి భూములను ఆక్రమిస్తున్నారు. పొక్లెయిన్తో చేపల చెరువు కట్టలను ధ్వంసం చేస్తున్న దృశ్యం 7పమిడిమర్రు నుంచి కాకాని జేఎన్టీయూఎన్కు వెళ్లే దారిలో ఉన్న ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కళ్లు పడ్డాయి. వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఒక్క చోటే ఉండటంతో దీనిని సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. గ్రామంలోని టీడీపీ నాయకుడిని రంగంలోకి దింపి పేదలకు డబ్బు ఆశ చూపి భూములను సొంతం చేసుకుంటున్నారు. గ్రామంలోని టీడీపీ నాయకుడితో పాటు పట్టణానికి చెందిన దళిత సంఘం నాయకుడు ఇందులో కీలకపాత్ర పొషిస్తున్నారు. దళితులకు చెందిన భూములు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తెరమీదకు తెచ్చి ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికి 20 మందికి పైగా రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు కేటాయించిన భూములు కొనుగోలు చేసిన వారికి ఆ భూములపై ఎటువంటి హక్కు ఉండదు. అసైన్డ్ భూముల విక్రయాలు జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాలరావు, తహసీల్దార్ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం. -
నవోదయ మోడల్ టెస్టుకు 150 మంది హాజరు
నరసరావుపేట: జిల్లాలోని విద్యార్థులు ప్రతిభ, విద్యానైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆదివారం కేర్ పబ్లిక్ స్కూలులో జవహర్ నవోదయ విద్యాసంస్థల ఆరో తరగతి ప్రవేశానికి మోడల్ టెస్ట్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 150 మందికిపైగా విద్యార్థులు హాజరై మోడల్ పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ షేక్ నాగూర్వలి పేర్కొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్య ప్రాముఖ్యత వివరిస్తూ ఒక వ్యక్తి జీవితం సమూలంగా మార్చే ఆయుధం విద్యకు ఉందన్నారు. మోడల్ టెస్టులో ప్రథమ విజేతగా నిల్చిన రొంపిచర్లకు చెందిన ఎన్ హర్షిణికి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు సాధించిన ఒంగోలుకు చెందిన డి.అశ్రీత్, మూడవ బహుమతి రూ.3వేలును బొగ్గవరానికి చెందిన జి.సహస్రకు శాసనసభ్యులు అందజేశారు. ఛైర్మన్ కె.కోటిరెడ్డి, కరస్పాండెంట్ కె.జ్ఞానసుందరి, డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, రిటైర్డు అధ్యాపకులు కె.రాజారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గన్నవరం: జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్ జిల్లాల రగ్బీ అండర్–14 చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్కు చేరాయి. -
అత్యవసర వాహనాలు సైతం క్యూలోనే..
గత నెల రోజులుగా ఫ్రీ లెఫ్ట్ మార్గాలను రెండు వైపులా అధికారులు సిబ్బందితో మూసి వేయించారు. దీనివలన అత్యవసరంగా వెళ్లవలసిన వాహనాలతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతుల వాహనాలు సైతం మిగిలిన వాహనాలతో పాటు ప్లాజా రూటులోనే ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణంలో జాప్యం పెరిగి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటిలాగే ఫ్రీ లెఫ్ట్ మార్గంలోనే వెళ్తామంటూ సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు గత గురువారం ట్రాక్టర్తో ఆ మార్గానికి అడ్డుగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రైతులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ఆ మార్గంలో ఉంచిన అడ్డంకులను తొలగించకపోవడం గమనార్హం. -
పల్నాడు
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు లో ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,334 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. డీఈఓ చంద్రకళ నరసరావుపేటఈస్ట్: క్రీడలలో పల్నాడు జిల్లాను ముందుంచేందుకు అన్ని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా ఉపాధ్యాయుల క్రీడా పోటీలను డీఈఓ శనివా రం ప్రారంభించారు. లూథరన్ హైస్కూల్లో ఉపాధ్యాయుల క్రికెట్, శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయినిల త్రోబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలలో పాల్గొనే ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులను సమన్వయ పరుచుకొని ఎంచుకున్న క్రీడలో నైపుణ్యం సాధించాలన్నారు. అనంతరం లింగంగుంట్ల పీడబ్ల్యూడీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. గురజాలరూరల్: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి ప్రియదర్శిని తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి ప్రియదర్శిని అధ్యక్షతన కోర్టులో పోలీసులతో అవగాహన కార్యక్రమం శనివా రం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధిక కేసులు పరిష్కరించే విధంగా చూడాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీ సత్యనారాయణ, డీఎస్పీ జగదీష్, సీఐలు ఆవుల భాస్కర్, భాస్కర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : ఉండవల్లి మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో శనివారం గుడ్షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక దాడులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ విద్య మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు చిన్నారులు తమ బాధకు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అన్నారు. బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ సిబ్బంది పోతురాజు, అనూష, నాగమణి, అనిల్ కుమార్, బాబు జగజ్జీవన్రావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్ సీడ్ యాక్సెస్ రోడ్లో వీవీఐపీలు పర్యటిస్తుండడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కల్వర్టులు, ముళ్ల పొదలు, ఇతర పైపులైన్లు, చెక్ పోస్టులతో పాటు ఇతర బ్రిడ్జిల వద్ద బాంబ్ స్క్వాడ్, ఇతర బృందాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ఏఆర్ ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీవీఐపీలు, వీఐపీలు నివాసం ఉంటున్నారని, వారి భద్రత దృష్ట్యా మొత్తం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించార ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్జీ డీఎస్పీ రామకృష్ణ, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ ఆర్ఐలు నరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మంచికల్లు(రెంటచింతల): పలనాటి కోనసీమగా పేరొందిన మంచికల్లు గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు ప్రారంభమైనట్లు కారంపూడి వెంకటాచార్యులు శనివారం తెలిపారు. తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం కుంకుమ బండ్లు, శనివారం దీనబండారంతో ఈ వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. మార్గశిర ఏకాదశి మొదలు బహుళపాడ్యమి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంగళగిరిటౌన్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి విద్యార్థి ప్రతిభ చాటి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. మంగళగిరిలోని సాయినగర్కు చెందిన పాపన జితేంద్ర ఆర్థోపెడిక్ విభాగంలో 800 మార్కులకు 568 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏలూరు జిల్లా ఆశ్రమ వైద్య కళాశాలలో జితేంద్ర వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ చేబ్రోలు శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి జితేంద్రను అభినందించారు. తమ కుమారుడు కష్టపడి చదివి పీజీ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని జితేంద్ర తల్లిదండ్రులు శివరామ్ ప్రసాద్, ధనలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.చిలకలూరిపేట: అంగట్లో అన్నీ ఉన్నా... అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందంగా ఉంది చిలకలూరిపేట 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి. విశాలమైన అధునాతన భవనాల నిర్మాణం, ఆపరేషన్ థియేటర్లు, ఎన్బీఎస్యూ (న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్), స్పెషలిస్టు వైద్యుల నియామకం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే సంతరించుకున్నాయి. అయితే నేటి పాలకుల నిర్లక్ష్యం ఈ ఆసుపత్రి పాలిట శాపంగా మారింది. ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలు...అత్యాధునిక పరికరాలకు గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరై, పనులు సైతం ప్రారంభమైనా అవి నేటికీ పూర్తి కాకపోవడం ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు శాపంగా మారింది. అదనపు సౌకర్యాల కోసం... ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలైన ప్రహరీ నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, కొత్త జనరేటర్, అదనపు శస్త్ర చికిత్స పరికరాలు వంటి వాటి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.9.45 కోట్లు మంజూరయ్యాయి. నాటి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని 2023 ఆగస్టు మూడో తేదీన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఆ తదుపరి ప్రభుత్వం మారినా నేటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. జాతీయ రహదారిపై విస్తరించి ఉన్న చిలకలూరిపేట ఆసుపత్రికి నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురైన కేసులు వస్తుంటాయి. ఇక్కడ ఆర్థోఫెడిక్ సర్జన్ ఉన్నా సదరం క్యాంపుల కోసం ఇతర ప్రాంతాలకు డ్యూటీ వేస్తున్నారు. దీంతో ప్రమాద బాధితులు ఎవరు వచ్చినా గుంటూరు పంపుతున్నారు. ఇక్కడ ఉన్న ముగ్గురు గైనకాలజిస్టుల్లో సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ కేవీ లక్ష్మీకుమారిని డిప్యుటేషన్పై డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరియేట్కు పంపటంతో ఆ విభాగంలో కొరత ఏర్పడింది. ఇక రేడియాలజీ విభాగానికి చెందిన వైశాలి చైల్డ్ కేర్ లీవులో ఉండటంతో ప్రస్తుతానికి ఆ విభాగం సేవలు కుంటుపడ్డాయి. జనరేటర్ లేక... ఎప్పటిదో 30 పడకల ఆసుపత్రి నాటి పాత జనరేటర్ పూర్తిగా పనికిరాకుండా పోయింది. 50కేవీ జనరేటర్ అవసరం ఉన్నా నేటికి సమకూరలేదు. మరోవైపు పారిశుధ్యం పూర్తిగా పడకవేసింది. వాహనాలు మితిమీరిన వేగంతో పాఠశాల ముందుగా వెళుతున్నాయి. ప్రధానంగా అధిక లోడుతో వెళ్లే లారీలను ఒక్కసారిగా నియంత్రించటం కష్టసాధ్యం. వేగాన్ని నియంత్రించేలా రహదారిపై పాఠశాలకు కొద్ది దూరం వరకు స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. – బత్తుల శ్రీనివాసరావు, ఎస్ఎంసీ మాజీ చైర్మన్, చాగంటివారిపాలెం ప్రధాన రహదారి కావటంతో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. పాఠశాల ఉంది అని తెలియజేసేలా రహదారి వెంబడి సూచికలు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు. కొంత మేర వేగాన్ని నియంత్రించవచ్చు. వాహనాలను తప్పించుకొని వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. – బొరిగర్ల వెంకట్రావు, చాగంటివారిపాలెం 7 నిర్మాణం పూర్తి చేసుకున్న ఏరియా ఆసుపత్రి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అదనపు శస్త్ర చికిత్స పరికరాలు, జనరేటర్లను త్వరలోనే సమకూర్చుకుంటాం. ఈ విషయాలను ఇప్పటికే పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రహరీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ టి శ్రీనివాసరావు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం నిర్మించాలంటూ ఆందోళన
రొంపిచర్ల: రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం నిర్మించాలంటూ శనివారం బీసీ సంక్షేమ సంఘం, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం వల్ల కేంద్రియ విద్యాలయం నిర్మాణ పనులు జరగలేదని అన్నారు. రొంపిచర్లలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే కేంద్రియ విద్యాలయం నిర్మించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. తొలుత స్థానిక చెరువు కట్ట సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ బి.నిర్మల కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్ పాల్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బూదాల బాబూరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, సీఐటీయూ మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గాలి సాంబశివరావు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సరికొండ తిమ్మరాజు, బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు సుతారం విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు కోనేటి నరసింహారావు, భగత్ సింగ్ భవన్ నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్.రామకష్ణంరాజు, శేషంరాజు, మస్తాన్ వలి, సీపీఐ మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, మండల నాయకులు మధుసూదనరావు, పిడెం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
చౌక దుకాణాల్లో ఈజీ మార్ట్లు ఏర్పాటుకు సన్నాహాలు
సత్తెనపల్లి: దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేదలకు రేషన్ బియ్యంతోపాటు తక్కువ ధరలకు అన్ని రకాల నిత్యావసరాలు ఒకేచోట చౌక ధరల దుకాణాల్లోనే అందించాలనే ఉద్దేశంతో చౌక దుకాణాల్లో ఈజీ మార్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాద్ చెప్పారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శనివారం సత్తెనపల్లి చౌక ధరల దుకాణాల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్ఓ మాట్లాడుతూ ఔత్సాహికులైన డీలర్లు ముందుకు వస్తే ఆ నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఏఏ సరుకులు ఈజీ మార్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచాలి? వాటి వల్లన అటు పేదలకు కలిగే మేలు? ఇటు డీలర్లకు ఒనగూరే ఉపాధి గురించి ఈజీ మార్ట్ ప్రతినిధి బోస్ వివరించారు. సమావేశంలో డీఏఓ చంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నెల్లూరు రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బోస్బాబు, చౌక ధరల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. రేషన్ షాపులకు సకాలంలో అందించాలి రాజుపాలెం: మండలంలోని అన్ని రేషన్ షాపులకు సకాలంలో బియ్యం, పంచదార పంపించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎంవీ ప్రసాద్ తెలిపారు. రాజుపాలెంలోని ప్రభుత్వ పౌరసరఫరాల గోదామును ఆయన శనివారం పరిశీలించారు. ఉన్న స్టాక్ మొత్తాన్ని తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు గమనించారు. ఆయన వెంట తహసీల్దారు ఎన్ సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, గోదాం సిబ్బంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎంవీ ప్రసాద్ -
రోడ్డు దాటాలంటే వణుకు..
ముప్పాళ్ల: ముప్పాళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు నిత్యం భయం భయంగా పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలను ఆనుకునే సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారి ఉండటంతో రోడ్డు దాటాలంటే వణికిపోతున్నారు. రహదారిపై ప్రమాద సూచికలు కూడా లేకపోవటం ముప్పుగా మారింది. ఇక్కడ సుమారు 430 మందికి పైగా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు సమీప గ్రామాలైన ముప్పాళ్ల, గోళ్లపాడు, కుందురువారిపాలెం, లంకెలకూరపాడు, నరసరావుపేట మండలంలోని ములకలూరు, ఇస్సపాలెం, రెడ్డిపాలెం గ్రామాల నుంచి వచ్చి వెళుతుంటారు. పాఠశాలకు వచ్చే సమయంలో, ఇంటికి వెళ్లే సమయంతో పాటుగా ముప్పాళ్లకు చెందిన పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వెవెళ్లే సమయంలో రహదారి దాటడం సవాల్గా మారింది. నిత్యం వందలాది వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. పాఠశాల ఉందనే కనీస అవగాహన లేక, అదే వేగంతో వెళుతున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాల సమీపంలో రహదారిపై హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదు. రహదారిపై వేసిన స్పీడు బ్రేకర్ కూడా కనిపించకపోవటంతో వాహనాల వేగానికి నియంత్రణే కరువైంది. -
పల్నాటి మాత... పాతపాటేశ్వరమ్మ
గురజాల: పట్టణంలో వందలాది సంవత్సరాల కిందట పాతపాటేశ్వరి అమ్మవారిదేవిగా అవతరించి పలనాటి మాతగా భక్తుల పూజలను అందుకుంటుంది. దుగ్గరాజు వంశం వారిచే ప్రతిష్టించబడినట్లు దేవాలయంలో ఏర్పాటుచేసిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. పల్నాడు నడిబొడ్డున అమ్మవారి ఆలయం ఉండటం పల్నాడు ప్రాంత వాసులకు గర్వకారణం. అమ్మవారి మహిమలు కోకొల్లలు. పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాలు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ పల్నాటి మాతగా పేరుగాంచిన గురజాల పాతపాటేశ్వరి అమ్మవారి చరిత్ర మాత్రమే ప్రసిద్ధి పొందింది. నేటి నుంచి తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభం ఆదివారం నుంచి అమ్మవారి బియ్యం కొలత, డిసెంబర్ 1వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 2వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, 3వ తేదీ అమ్మవారి బియ్యం విడుపు కొలత, 4వ తేది అమ్మవారి పొంగళ్ల సమర్పణ, 5వ తేదీన అమ్మవారి వసంతోత్సవం కార్యక్రమంతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాం. అమ్మవారి దేవాలయం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులుకాగలరు. – చీతిరాల సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యుడు -
రైతులు సొంత వాహనాల్లో ధాన్యం రవాణా చేసుకోవచ్చు
కొల్లిపర: ఇకనుంచి ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి జీపీఎస్ అనుసంధానం లేకుండానే వారి సొంత వాహనాల ద్వారా కూడా మిల్లర్ల వద్దకు ధాన్యం తరలించుకొనే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిందని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ రైతులతో అన్నారు. మండల పరిధిలోని హనుమాన్పాలెం, తూములూరు, చివలూరు గ్రామాల్లో రోడ్డు వెంట ఆరబోసిన ధాన్యం రాశులను శనివారం తహసీల్దార్ జి.సిద్ధార్ధతో కలసి ఆయన పరిశీలించి, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెండు రోజుల్లో దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి నూర్పిళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో జీపీఎస్తో సంబంధం లేకుండా రైతులు తమ సొంత ట్రాక్టర్లు లేకపోతే ఇతర వాహనాల ద్వారా వారి ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకొని, కేటాయించిన మిల్లర్లు వద్దకు వారే నేరుగా రవాణా చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేసీ వెంట ఇన్చార్జి ఎంపీడీఓ భార్గవ్, ఏఓ శ్రీనివాసరెడ్డి, రైతులు అవుతు సుధాకరరెడ్డి, ఎ.శివారెడ్డి, అడపా నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
రేషన్పై ఈ–కేవైసీ కత్తి
సత్తెనపల్లి: రేషన్ కార్డుదారులపై ఈ–కేవైసీ పిడుగు పడింది. పేదల గుర్తింపునకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ తరుణంలో ఇందులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ నెలాఖరులోపు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా చేయించు కోలేకపోతే వారికి ఇతర సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. చేయించుకోలేదా .. సరుకులు బంద్ ఈ–కేవైసీ చేయించుకోకపోతే డిసెంబర్ ఒకటి నుంచి సరుకులను పంపిణీ చేయరనే చర్చ నడుస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ తమ వేలి ముద్రవేసే ఈ–కేవైసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఇది లేకపోయినా, సరుకులు సజావుగా అందేవి. ఇక నుంచి అలా కుదరదని, ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కార్డుతో అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేసి, డీలర్లకు ఆ సమాచారాన్ని అందజేశారు. ఈ మేరకు జిల్లాలో దీన్ని చేయించుకోని ఐదేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు రేషన్ షాపులకు వెళ్లి ఈ–పాస్ యంత్రంపై వేలిముద్ర వేసి డీలర్ లాగిన్లో ఈ– కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ .. ఈ–కేవైసీ కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న చిరుద్యోగులు, కూలి పనులు చేసుకునేవారు దీనికి దూరమవుతున్నారు. ఈ కసరత్తుతో రేషన్ కార్డులకు భారీగా కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఈ– కేవైసీ ప్రక్రియను దాదాపు పూర్తి చేశాం. ఇంకా 3.62 శాతం మాత్రమే మిగిలి ఉంది. వారు స్థానికంగా లేకపోవడం కారణంగా ఈ–కేవైసీ కాలేదు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ఈరోజుతో ఆఖరు. ఎవరైనా ఉంటే ఈరోజు తప్పనిసరిగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందాలి. మిగిలి పోయిన వారి సమాచారాన్ని నివేదిక తయారు చేసి నివేదికతోపాటు స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వానికి అందచేయనున్నాం. – ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పల్నాడు జిల్లాలో 1,289 చౌకధరల దుకాణాల పరిధిలో 6,30,347 మంది రేషన్ కార్డుదారుల్లో 18,57,768 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 17,44,739 మంది సభ్యులు ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇంకా 62,066 మంది ఈ– కేవైసీ పెండింగ్లో ఉంది. వీరికి ఈ ఒక్కరోజే అవకాశం ఉండడంతో ఎలా సాధ్యమవుతుందని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా నరసరావుపేటలో 4,765 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉండగా, అత్యల్పంగా శావల్యాపురం కనమర్లపూడిలో 948 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉంది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులను పరిశీలిస్తే, జిల్లాలో 6,30,347 మంది స్మార్ట్ రేషన్ కార్డు దారులకుగాను ఇప్పటివరకు 5,71,387 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా 58,960 మందికి సంబంధించిన స్మార్రేషన్ కార్డులు పొందక పోవడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఈ రోజు అందుకోకపోతే స్మార్ట్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. -
ఆటో బోల్తాపడి ఒకరు మృతి
ఇద్దరికి తీవ్రగాయాలు రెంటచింతల: రెంటచింతల గ్రామ శివారులో ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన ఆడేపు మరియదాసు(34) గురజాలలో ఓ హోటల్లో పనిచేస్తూ సాయంత్రం తిరిగి ఇంటికి ఆటోలో వస్తున్న నేపథ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనం రావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరియదాసుకు తీవ్ర గాయాలు కాగా వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెంటాలకు చెందిన కొర్రా హనిమి, రెంటచింతలకు చెందిన మణికుమార్లకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య దుర్గమ్మ, కార్తీక్, నాగరాజు కుమారులు ఉన్నారు. గుంటూరు లీగల్: గుంటూరు ఈస్ట్, వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ 14 మందికి జరిమానా విధించారు. కొద్ది సమయం కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని సూచించారు. ఆల్కహాల్ సేవించిన పర్సంటేజ్ని బట్టి ఆయా వ్యక్తులకు రూ. 5వేలు, రూ. 7వేలు న్యాయమూర్తి జరిమానా విధించారు. చీరాల రూరల్: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ గూడ్స్రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్.కొండయ్య తెలిపిన వివరాల మేరకు సుమారు.. 50 సంవత్సరాలు వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైల్వేస్టేషన్లోని నాలుగో నంబర్ ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న గూడ్స్రైలు అతడిని ఢీకొట్టడంతో మృత్యువాత పడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నేలబావిలో యువకుడి మృతదేహం
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెం పెనుమాక రోడ్డు శివారులో పెనుమాక టిడ్కో గృహాలకు వెళ్లే మార్గంలో ఓ నేలబావిలో మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి కొత్తపేటకు చెందిన శంకర్, వీరకుమారి దంపతుల రెండవ కుమారుడు పిన్నిక ఆనంద్ (24) చదువు అనంతరం ఫొటోగ్రఫీ చేస్తు హైదరాబాద్లో నివాసముంటూ ఖాళీ సమయాల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీ నాయనమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం 27వ తేదీ ఉదయం అన్నయ్య, మరో స్నేహితుడితో కలసి వెళ్లి మద్యం సేవించి సాయంత్రం 4 గంటల సమయంలో అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆనంద్ ద్విచక్రవాహనంపై ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికిరాలేదు. 28వ తేదీ మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన కుమారుడు కనిపించడం లేదంటూ శంకర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేయకుండానే బంధువులు చుట్టుపక్కలప్రాంతాల్లో వెతుకుతుండగా యర్రబాలెంకు చెందిన ఓ వ్యక్తి డొంకరోడ్డులో మీ అబ్బాయి ద్విచక్రవాహనం ఉందని తెలియజేయడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా పంటపొలంలో పాడైపోయిన బావిలో ఆనంద్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంలో కంటి కింద, తల వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయని, హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు అని, పోస్ట్మార్టం రిపోర్టు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెనుమాకలో ఓ యువతిని ఆనంద్ ప్రేమించినట్లు వదంతులు వినిపిస్తున్నా యి. ఆనంద్ను హత్యచేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. -
ప్రతిభ దివ్యం.. పోరు ఉత్కంఠం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): దివ్యాంగుల ప్రతిభాపాటవాలు సమాజానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగ క్రీడాకారులు క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇన్చార్జి దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను వివిధ అంశాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవంలోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్డ్యూటీగా పరిగణించడం జరుగుతుందన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజినీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్వీ ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు విడుదల
చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయ సమితి డిసెంబర్ 13న నిర్వహించే ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేసినట్లు మద్దిరాల జేఎన్వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 01.30 వరకు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ను వెంటనే అధికారిక వెబ్సైట్: హెచ్టీటీపీఎస్:// సీబీఎస్ఈఐటీ ఎంఎస్. ఆర్సీఐ ఎల్.జీవోవీ.ఇన్/ఎన్వీఎస్/ నుండి ఉచితంగా డౌన్న్లోడ్ చేసుకోవాలని సూచించారు. ముఖ్య సూచికలు... విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిట్ కార్డును డౌనన్లోడ్ చేయడంలో లేదా ఇతర పరీక్ష సంబంధిత విషయాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, తక్షణ సహాయం కోసం 9494676751 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలన్నారు. అడ్మిట్కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో ఉదయం 10.30 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
రేపు జిల్లాస్థాయి వెటర్న్ క్రీడా పోటీలు
గుంటూరువెస్ట్(క్రీడలు): జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదల చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాకింగ్, త్రో, రన్నింగ్, జంపింగ్ తదితర పోటీలను మహిళలకు, పురుషులకు విభాగాల వారీగా వేర్వేరుగా జరుగుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి వెటరన్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల వివరాలను 9000979056, 9949526697లో సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన క్రీడా పోస్టర్ను అసోసియేషన్ సెక్రెటరీ జి.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కిరణ్, ఈసీ మెంబర్ జి.గోపీనాథ్, ట్రెజరర్ సత్యనారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో విడుదల చేస్తామన్నారు. పశ్చిమ డెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమడెల్టాకు 3,225 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కు 196 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్కు 338 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 84, నిజాంపట్నం కాలువకు 86, కొమ్మూరు కాలువకు 1,891క్యూసెక్కులు విడుదల చేశారు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాలల్లో తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్ధులకు పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు. పోలీస్ సిబ్బంది సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. -
గణపవరం మున్సిపాలిటీనా... పంచాయతీనా!
నాదెండ్ల: పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన గణపవరం మున్సిపాలిటీలో ఉన్నదా..గ్రామ పంచాయతీగా ఉన్నది తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధికి దూరమైంది. చిలకలూరిపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 2019లో గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో అటు మున్సిపాలిటీలో విలీనం కాక, ఇటు పంచాయతీలో కొనసాగకపోవటంతో అభివృద్ధి నిలిచిపోయింది. పన్నుల రూపంలో వచ్చే నామమాత్రపు ఆదాయంతోనే గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. విలీన ప్రక్రియను త్వరగా ఓ కొలిక్కి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన నిధులు 1958లో గణపవరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. 2019లో చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన అనంతరం కొన్ని నెలలు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మున్సిపల్ నిధులతో జరిగాయి. న్యాయస్థానం విలీన ప్రక్రియపై స్టే విధించటంతో మున్సిపాలిటీ నుండి రికార్డులు తిరిగి పంచాయతీకి చేరాయి. అప్పటి నుండి పంచాయతీకి రావలసిన ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు విడుదల కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో రావలసిన నిధులు సైతం నిలిచిపోయాయి. ఆరేళ్లుగా 15వ ఆర్థికసంఘం నిధులు ఏడాదికి రూ.80 లక్షల చొప్పున, పాపులేషన్ గ్రాంట్ రూ.1.68 లక్షలు, వృత్తి పన్నులు రూ.2 లక్షలు, స్టాంపు డ్యూటీ రూ.25–30 లక్షలు నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలు కాకపోవటంతో ఆ నిధులు సైతం ఆగిపోయాయి. తగ్గిన ఆదాయం గ్రామంలో సుమారు నలభై వరకూ చిన్న, పెద్ద తరహా పరిశ్రమలున్నాయి. పత్తి, పొగాకు, ఆయిల్ తదితర పరిశ్రమలు ఉండటంతో ఏటా పంచాయతీకి ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. ఏడాదికి రూ.82 లక్షలు ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా, ఇందులో ఇంటిపన్ను రూ.27 లక్షలు, పరిశ్రమల పన్ను రూ.55 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం పలు పరిశ్రమలు మూతపడటంతో పన్నుల చెల్లింపులో ఒడిదుడుకులు నెలకొన్నాయి. రూ.55 లక్షల డిమాండ్కుగాను రూ.30లక్షలు మాత్రమే వసూలు అవుతున్నాయి. ఏడాదికి రూ.57 లక్షలు ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ఫీజు రూ.10 లక్షలు మాత్రమే పంచాయతీకి జమ అవుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి రూ.78 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీధిలైట్లు, బోరు రిపేర్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామసభల నిర్వహణ తదితర పనులకు పంచాయతీ నిధులు సరిపోవటం లేదు. నెలలు గడుస్తున్నా తేలని విలీన ప్రక్రియ ప్రభుత్వం నుంచి నిధులు బంద్ గ్రామంలో ఆగిన అభివృద్ధి -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
పిడుగురాళ్ల: అర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తున్న కాండ్రు శివప్రసాద్(69) పిడుగురాళ్ల పట్టణ సమీపానికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ సమీపంలో బస్సు ఆపి చూసే సరికి అప్పటికే పరిస్థితి విషమించటంతో అంబులెన్స్కు సమాచారం అందించి బంధువులు హుటాహుటిన పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పిడుగురాళ్ల బస్సు కాదని, మాచర్ల డిపోకు చెందిన అద్దె బస్సు గుంటూరు నుంచి మాచర్ల వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందన్నారు. జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎస్ఎస్ అండ్ ఎన్ విద్యార్థులు నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థులు కె.శివసాకేత్, కె.రుద్రపతాప్ సైదులురెడ్డి ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలో శివసాకేత్ 200 మీటర్లు బటర్ఫ్లై, రుద్రప్రతాప్ 4‘‘100 మీటర్లు విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఢిల్లీలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–19 జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు పాలకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకటఅప్పారావు, వైస్ప్రిన్సిపల్డాక్టర్ పి.శ్రీనివాససాయి అభినందించారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి రేపల్లె: ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. తోమాటి సామ్రాజ్యం (80) రుద్రవరం వద్ద పండ్లు అమ్ముకుంటూ రహదారిపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో శుక్రవారం ఢీకొంది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక వేటపాలెం: అంతర్ జిల్లాల ఫెన్సిలింగ్ పోటీలకు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకపోతుల యతిన్ శ్రీకార్తికేయ ఎంపికై నట్లు హెచ్ఎం దీప్తి శుక్రవారం తెలిపారు. కొనసీమ జిల్లాలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో కార్తికేయ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్లో జరగనున్న ఎస్జీఎఫ్ నేషనల్ ఫెన్సింగ్ టీం ఈవెంట్కు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. -
అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు
అమరావతి: లింగాపురం గ్రామానికి చెందిన కొచ్చిరి వసంతరావు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవటంపై లింగాపురం గ్రామస్తులు, స్నేహితులు, అప్పటి సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశా రు. నిరుపేద కుటుంబంలో జన్మించిన వసంతరావు శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ధరణికోట రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాలలో చదివారు. 1991లో కేంద్ర హోం శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2025 రిపబ్లిక్ డేనాడు ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపిక య్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వసంతరావు శుక్రవారం చత్తీస్గడ్లోని రాయపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు.శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో 1981–82 బ్యాచ్ పదో తరగతి విద్యార్థు లంతా తమ తోటి విద్యార్థి జాతీయ స్థాయిలో ఘనత సాధించినందుకు హర్షంవ్యక్తం చేశారు. నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్ నాయర్ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్ వైద్యులు ఆర్.మురళీబాబురావు, బీవీ.సుధీర్బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్, మాజేటి గోపి పాల్గొన్నారు. -
అనుభవం ఎంతో నేర్పింది
● మారుమూల ప్రాంతం నుంచి వచ్చి పట్టుదలతో గుర్తింపు ● బహుముఖ ప్రజ్ఞాశాలి జేఎన్వీ పీఈటీ గోవిందమ్మ ● సాదాసీదా నేపథ్యం నుంచి ఉత్తమ శిక్షకురాలిగా రాణింపు చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్షల్లో ఓ అమ్మాయి మ్యాథ్స్లో ఫెయిలైంది. ఇక విద్యకు ఫుల్స్టాప్ పడిందనే తరుణంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రకటించిన రెండు గ్రేస్ మార్కులు ఆమె విద్యాభ్యాసాన్ని మలుపు తిప్పాయి. నేడు ఆమె కృషి వందల మంది విద్యార్థినులను జాతీయ క్రీడా వేదికలకు పరిచయం చేస్తోంది. ఆవిడే చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయం వ్యాయామ ఉపాధ్యాయురాలు గుదిబెండి గోవిందమ్మ. పట్టుదలే ఆయుధం బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఎర్రవారిపాలెంకు చెందిన గోవిందమ్మది వ్యవసాయ కుటుంబం. సాగు, పాడి పనులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య అనేక అవరోధాలను ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలను దాటుతూ... డిగ్రీతోపాటు బీపీఎడ్, ఎంపీఈడీ, సీవైఈడీ, యోగా పట్టభద్రురాలుగా ప్రావీణ్యం పొందారు. ఉన్నత విద్యలో ప్రతిదీ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతను సాధించడం ఆమె పట్టుదలకు తార్కాణం. విద్యతోపాటు బుర్రకథ చెప్పడంలో దిట్ట. రేడియో గాయకురాలు, కల్చరల్ విభాగంలోనూ పాఠశాల దశలోనే ప్రవేశం ఉంది. అప్పట్లోనే ఉత్తమ విద్యార్థి అవార్డులు అందుకోవడం ఆమెలో దాగి ఉన్న బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. 32 ఏళ్ల నిబద్ధత.. 209 మందికి స్ఫూర్తి గోవిందమ్మ 32 ఏళ్లుగా పలు జేఎన్వీలలో పనిచేస్తూ, 59 ఏళ్లు వచ్చినా నేటికీ క్రీడాకారులతో సమానంగా ఉత్సాహంగా శిక్షణ ఇస్తుండటం ఆమె నిబద్ధతకు నిదర్శనం. అథ్లెటిక్స్, ఖో–ఖో, కబడ్డీ, క్రికెట్, మార్షల్ ఆర్ట్స్ వంటి బహుళ క్రీడల్లో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా భిన్నంగా నేర్పించడమే ఆమె ప్రత్యేకత. ఆమె మార్గదర్శకత్వంలో ఇప్పటివరకు 209 మంది విద్యార్థినులు జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. గ్రామీణ బాలికలకు వెన్నుదన్ను... 1994లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తండ్రి దొరైరాజు కూడా గోవిందమ్మ కృషిని మెచ్చి ఎంతో ప్రోత్సహించారు. నెల్లూరు జేఎన్వీ విద్యార్థినులను జమ్మూకశ్మీర్లో జరిగిన క్రికెట్ పోటీల్లో తొలిసారిగా ఆడించారు. కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా ఆర్చరీపై మెళకువలు నేర్చుకొని శిక్షణ ఇస్తున్నారు. నెల్లూరు జేఎన్వీలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 లక్షలు తీసుకువచ్చి, మౌలిక వసతులు కల్పించారు. ఓటమిని లెక్కచేయకుండా, తన దారిని తానే నిర్మించుకుని, ఎందరికో ఆదర్శంగా నిలిచిన గోవిందమ్మ ప్రస్థానం నేటి యువతకు గొప్ప స్ఫూర్తి. తనను తాను క్రీడలకే అంకితం చేసుకున్నారామె. సాదాసీదా గ్రామీణ ప్రాంత బాలికల కష్టాలే నావి. ఓటమి అడ్డంకి కాదు.. ఆరంభమని అనుభవం నేర్పింది. పదితోనే విద్య ఆగుతుందని నిరాశ చెందిన తరుణంలో ఒక్క అవకాశం ఎన్నో అవరోధాల్ని దాటించేసింది. అది అదృష్టమో లేక అవకాశమో స్పష్టంగా తెలీదు. కానీ, బాల్యంలో సమాజం, కష్టాలు నన్ను ఎంతో బాధించి ప్రతి అడుగును వెనక్కు లాగేందుకు ప్రయత్నించాయి. నాలో తెలియని ధైర్యం, మొండితనం, పట్టుదలే లక్ష్యాన్ని సాధించేలా చేశాయి. నాలాంటి ఎందరో బాలికలకు భరోసాగా నిలిచే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయి. – జి. గోవిందమ్మ, పీఈటీ, జేఎన్వీ– మద్దిరాల -
విద్యార్థుల భద్రత ముఖ్యం
పిడుగురాళ్ల: విద్యార్థుల భద్రత ముఖ్యమని, వారిని జాగ్రత్తగా తీసుకు వెళ్లాల్సిన బాధ్యత డ్రైవర్లు, క్లీనర్లపై ఉందని జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతపై పిడుగురాళ్ల పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవ్కుమా ర్ మాట్లాడుతూ... బస్సులు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. స్కూల్ విద్యార్థులను బస్సుల్లో ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిలబడకుండా సీటులో కూర్చునే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా బస్సు డ్రైవర్, క్లీనర్పై ఉంటుందన్నారు. అధికంగా విద్యార్థులను ఎక్కించుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు. విద్యార్థి జీవితం మనపైనే ఆధారపడి ఉంటుందని అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఏమైనా ఉంటే యాజమాన్యానికి తెలియజేసి, ఆ బస్సులను మార్చే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల రవాణా శాఖ అధికారి రాంబాబు, జూనియర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్కుమార్ -
బీపీఎస్ సద్వినియోగం చేసుకోండి
నరసరావుపేట: అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీము) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఉపసంచాలకులు పి.మధుకుమార్ కోరారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ స్టాఫ్, డబ్ల్యుపీఆర్ఎస్, లైసెన్స్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లకు ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో బీపీఎస్, ఎల్ఆర్ఎస్లపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు 31లోపు నిర్మించిన భవనాలకు మాత్రమే అపరాధ రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. జీఓ జారీచేసిన 120 రోజుల లోపు అర్జీ దాఖలు చేయాలన్నారు. వార్డుల వారీగా బీపీఎస్ పరిధిలోకి వచ్చే అక్రమ కట్టడాలను గుర్తించి వాటి యజమానులను అప్రమత్తం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు పాల్గొని మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపు యజమానులు అర్జీలు దాఖలు చేసి అపరాధ రుసుం చెల్లించేలా ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. అలాగే ఎల్టీపీలు తమ సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఉపసంచాలకులు పి.మధుకుమార్ -
అంగన్వాడీ..పర్యవేక్షణేదీ!
పల్నాడుశనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025గట్టెక్కించిన ‘గ్రేస్’.. శిక్షణలో ‘గ్రేట్’! పరీక్షలు విద్యార్థులకా... వర్సిటీకా..!7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది. ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్ను ఆర్డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్లో సూపర్వైజర్ల కొరత జిల్లాలో సూపర్వైజర్ పోస్టుల ఖాళీలు–16 ఉన్నవారిపై పనిభారంతో సతమతం వివిధ కార్యక్రమాల అమలుకు ఆటంకం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
అన్నదాత..దుఃఖీభవ
చంద్రబాబు కోతలు నాకు సొంత భూమి 1.23 ఎకరాలు ఉంది. దీనికి తోడు 1.25 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నా. మొదటి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ జమయ్యాయి. రెండో విడత ఈ నెల 19న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.2 వేలు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.5వేలు జమ కాలేదు. ఇదేమిటని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే, వారు చెప్పిన మాటలు విని ఖంగుతిన్నంత పని అయ్యింది. బతికి ఉండగానే చనిపోయానిని పోర్టల్లో చూపుతోంది. ఈ ఘోరం ఏమిటో అర్థం కావటం లేదు. – పెండ్యాల నాగమురళి, రైతు, కంకణాలపల్లిసత్తెనపల్లి: అన్నదాత సుఖీభవ పథకం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024–25లో సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025–26లో మొదటి విడత పెట్టుబడి సాయాన్ని 2025 ఆగస్ట్ 2న విడుదల చేశారు. మొదటి విడతలో 2,39,959 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత అర్హతలు ఉన్నా సాయం అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నెల 19న రెండో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మొదటి విడత జాబితానే పరిగణలోకి తీసుకోవడం చూస్తే వేలాది మంది రైతులకు ఈ విడత కూడా నిరాశ తప్పని పరిస్థితి. పీఎం కిసాన్తో కలిపి పెట్టుబడి సాయం... చంద్రబాబు ప్రభుత్వం 2025 ఆగస్ట్ 2న తొలి విడతగా 2,39,959 రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని పరిమితం చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ.167.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఈ నెల 19న రెండో విడత 2,40,530 మంది రైతులకు రూ.158.91 కోట్లు విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులతో పోలిస్తే జిల్లాలో 40,222 మంది రైతులకు మొండి చేయి చూపింది. 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తుండడం గమనార్హం. నాకు సొంత భూమి ఎకరం ఉంది. పత్తి సాగు చేస్తున్నా. ప్రకృతి వైపరీత్యాలతో మోంథా తుఫాన్కు తడిసి పత్తి కాయలు నల్లగా మారాయి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుడునని నా సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. కానీ రెండు విడతల్లోనూ పెట్టుబడి సాయం లబ్ధి చేకూరలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే ప్రాసెస్లో ఉందని చెబుతున్నారు. రెండో విడత కూడా నిధులు విడుదలైతే ఇంకా మొదటి విడత కూడా నాకు అంద లేదు. సమస్య ఎక్కడ ఉందో అధికారులు పరిశీలించి లబ్ధి చేకూర్చాలి. – బన్నారావూరి వెంకటేశ్వరరావు, రైతు, లేమల్లె 2019–20 2,41,515 326.04 2020–21 2,50,469 338.13 2021–22 2,48,812 335.90 2022–23 2,66,871 360.27 2023–24 2,80,181 378.24 -
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
తాడికొండ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజధానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు తెలిపారు. తుళ్లూరు పరిధిలోని నేలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. తెలుగు మహాసభలకు ఆహ్వానం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీ నరసింహను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారని తెలిపారు. పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరగనున్న పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేపట్టినట్లు గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఏఎన్యూలో స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించిన సీఈఓ పేరుతో ఈ నెల 26వ తేదీన సాక్షిలో కథనం వెలువడింది. దీంతో సీఈఓ ఆలపాటి మాట్లాడుతూ అన్ని పరీక్ష పేపర్లకు ఫీజు రూ.980 చొప్పున డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫైరింగ్ సమయంలో వేటకు వెళ్లొద్దు బాపట్ల టౌన్: ఎయిర్ఫోర్స్ అధికారులు ఫైరింగ్ చేసే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. గురువారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదన్నారు. సూర్యలంక ఎయిర్ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు. -
తూకం... మోసం.. !
జీరో సరిగా చూడండి.. రెండు కిలోలు సరిపోయింది చూడండి.. అని ఎంతో శ్రద్ధగా చెబుతుంటే సంతోషంగా జేబులో డబ్బులు తీసి ఇస్తాం. రెండు కిలోల సంచి బరువు తక్కువగా అనిపించినా, కళ్లతో చూశాం కదా.. నిజమేనని మనకు మనమే సర్దుకుని వెళతాం. అయితే ఆ నిజాయతీ మాటల వెనుక ఉన్న మోసం.. కళ్లను మాయ చేసే తూకం తెలిస్తే మైకం కమ్ముతుంది. తక్కెడలో మోసాలను అరికట్టడంతో అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత కళ్ల ముందు కదలాడతాయి. నరసరావుపేట టౌన్: వంట గదిలో ఉప్పు, పప్పు, కూరగాయలు ఇలా ఏ సరుకులు కావాలన్నా పక్కనే ఉన్న చిల్లర దుకాణం నుంచి లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొనుగోలు చేస్తుంటాం. కొందరు పావు కిలో, కిలో ఇలా స్థోమత మేరకు సరుకులు తెచ్చుకుంటారు. ఇంకాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఒకేసారి నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెలా మధ్య తరగతి కుటుంబానికి సుమారు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అయితే ఇలా మనం తెచ్చుకునే సరుకుల కొలత కళ్లతో చూసిందే నిజం అని నమ్ముతుంటాం. కానీ మన కళ్లను ఏమార్చి తూకాన్ని మార్చి జేబులు గుల్ల చేస్తున్నారు. 5 కిలోల సరుకు 7.50 కిలోలట.. నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారి జె. సాయి శ్రీకర్ గత ఆదివారం స్థానిక చేపల మార్కెట్ను తనిఖీ చేశారు. అక్కడ ఐదు కేజీల చేపలు తూకం వేస్తే 7.50 కేజీలు చూపించాయి. దీంతో వచ్చిన అధికారులతోపాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మార్కెట్ మొత్తం తనిఖీ చేసిన అధికారులు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. దీంతో వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారు. నిలువు దోపిడీ.. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు మార్కెట్కు క్యూ కడతారు. అక్కడ రద్దీ కారణంగా త్వరగా ఇంటికి వెళ్లేందుకు తొందర పడుతుంటారు. ఇదే అదనుగా మార్కెట్లో వ్యాపారులు.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఆదివారమే మార్కెట్లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కాటాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతికతలో లోపాలను గుర్తించిన వ్యాపారులు తూకంలో దగా చేస్తున్నారు. కేజీకి సుమారు 200 నుంచి 250 గ్రాముల వరకు వ్యత్యాసం ఉండేలా ఎలక్ట్రికల్ కాటాలో అమర్చుతున్నారు. కాటా పెట్టే సమయంలో జీరో చూపించటంతో వినియోగదారులు తూకం విషయంలో అనుమానించటం లేదు. తీరా కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జరిమానాతో ఆగేనా ? నరసరావుపేటలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేసినప్పుడు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని తెలిసినా అధికారులు మాత్రం తూతూమంత్రం జరిమానాలతో సరిపెట్టారు. అసలు ఈ జరినామాతో అక్రమ వ్యాపారుల్లో మార్పు వస్తుందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. అక్రమాలకు పాల్పడినవారిని నిందితులుగా గుర్తించి న్యాయస్థానాల్లో నిలబెట్టవచ్చు. వారిపై నేరం రుజువైతే శిక్షలు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిణామాలతో అక్రమార్కుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కళ్లముందు తూకంలో మోసం గుర్తించినా అధికారులు మాత్రం కేవలం జరిమానాలతో సరిపెట్టడం వినియోగదారులను ఆగ్రహానికి గురిచేస్తుంది. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం భట్టిప్రోలు: బ్రహ్మ విద్యాశ్రమంలో 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు బూర్లె అరుణ కుమారి తెలిపారు. పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు రెండు వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 582.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,272 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
19, 20వ తేదీల్లో కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సంకల్ప్’
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరంలో గల కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక మేనేజ్మెంటు సదస్సు (సంకల్ప్ 2025) గోడ ప్రతులను గురువారం కళాశాల చైర్మన్ కళ్లం మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప్ పేరుతో ఏటా విద్యార్థుల్లో నైపుణ్యతలను మెరుగు దిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఎం. ఉమాశంకరరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 19, 20వ తేదీల్లో సంకల్ప్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. సాంకేతిక, మేనేజ్మెంటు విభాగాలలో ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం ద్వారా పెద్దఎత్తున పారితోషికాలు కూడా అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.ఎస్.బి. రెడ్డి, కళ్లం భరద్వాజ, సంకల్ప్ నిర్వహణ సంచాలకులు హనుమంత్ప్రసాద్, కళాశాల డీన్ ఉపాధి కల్పన విభాగం పీఎల్ మాధవరావు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో పదిశాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సామ్రాజ్యం గురువారం తెలిపారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ ఇంద్ర బస్సు చార్జి గతంలో రూ. 870 ఉండగా, ఇప్పుడు రూ. 790కి తగ్గిందన్నారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ అమరావతి బస్సుల చార్జీ గతంలో రూ. 970 ఉండగా, రూ. 880కు తగ్గించినట్లు వెల్లడించారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ వయా మంగళగిరి మీదుగా వెళ్లే బస్సు చార్జీ రూ. 700 ఉండగా, డిసెంబరు 1 నుంచి రూ. 640 తగ్గిందన్నారు. తెనాలి – బీహెచ్ఈఎల్ ఇంద్ర బస్సు రూ. 710, తెనాలి – విశాఖపట్నం బస్సు చార్జీ రూ. 850కు తగ్గించినట్లు తెలిపారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాకేష్ అనే యువకుడు బాలికను రెండు నెలల క్రితం మాయమాటలు చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాలీబాల్ పోటీల విజేత కృష్ణవేణి జట్టు
నరసరావుపేట ఈస్ట్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వర్సీటీ యోగా కోఆర్డినేటర్ ఆచార్య బి.సూర్యనారాయణరావు, కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య మాట్లాడుతూ పోటీల్లో క్రీడాకారులు చూపిన క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి అభినందనీయన్నారు. కళాశాలతోనే క్రీడలను వదలకుండా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకట్రావు, డాక్టర్ గౌరీశంకర్, అబ్బాయి చౌదరి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందించి బహుమతులు అందించారు. వరుసగా మూడోసారి విజేతగా కృష్ణవేణి టోర్నమెంట్ విజేతగా వరుసగా మూడోసారి కృష్ణవేణి డిగ్రీ కళాశాల నిలిచింది. టోర్నమెంట్లో కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. లీగ్ దశలో ఫైనల్స్లో కృష్ణవేణి, వర్సిటీ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. తొలి రెండు సెట్లును కృష్ణవేణి జట్టు 27–25, 26–24 తేడాతో గెలుపొందగా, మూడవ సెట్లో పుంజుకున్న వర్సిటీ జట్టు 22–25 తేడాతో గెలుపొందింది. నాలుగవ సెట్లో కృష్ణవేణి జట్టు పక్కా ప్రణాళికతో వర్సిటీ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 25–13 తేడాతో గెలుపొంది కప్పును కై వశం చేసుకుంది. వర్సిటీ జట్టు రన్నరప్గా, తృతీయ స్థానంలో ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), నాల్గవ స్థానంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు నిలిచాయి. రన్నర్స్గా వర్సిటీ జట్టు -
వైభవంగా సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ
బెల్లంకొండ: మండలంలోని వన్నాయపాలెం గ్రామంలో గురువారం సాయిబాబా నూతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తురాలు మద్దిబోయిన సావిత్రమ్మ రూ.1.70 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గురువారం ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. స్థానికుల సహకారంతో భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులందరూ సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనుముల రోశిరెడ్డి, మర్రి ప్రసాదరెడ్డి, చింతారెడ్డి సాయిరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు మేకల లక్ష్మయ్య, సాంబశివరావు, ఆరుద్ర నరసింహారావు, గమిడి కోటి నాగయ్య, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు
నరసరావుపేట: బాల్య వివాహాలను ప్రోత్సహించినా, హాజరైనా నిందితులకు రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి హెచ్చరించారు. గురువారం ప్రకాష్నగర్ షాదీఖానాలో సీడీపీఓ ఎం.కాంతకుమారి అధ్యక్షతన బాల్ వివాహ్ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహం వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. బాల్య వివాహం గురించి సమాచారం తెలిస్తే గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, మండల స్థాయిలో సీడీపీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్వైజర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. పల్నాడును బాల్యవివాహా రహిత జిల్లాగా చేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. అదనపు సీడీపీఓ మాణిక్యాలరావు, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధికారులు, విద్యాశాకాధికారులు, మిషన్శక్తి కో ఆర్డినేటర్, ఐసీడీఎస్ అధికారులు, బాలల పరిరక్షణ వన్స్టాప్ సెంటర్ ప్రతినిధులు, సూపర్వైజర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండుతున్న పంటలు
నరసరావుపేట రూరల్: కాలువ మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుప్పగంజి వాగు మళ్లింపు పథకంలోని వందల ఎకరాల చివరి భూములకు నీరు అందక పంటల ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎండుతున్న పంటలను రక్షించుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంట కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. కుప్పగంజి వాగు నీటి మళ్లింపు కాలువ పరిధిలో మండలంలోని కేఎం అగ్రహారం, గుంటగార్లపాడు, రంగారెడ్డిపాలెం, ములకలూరు, జొన్నలగడ్డ తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాలు సాగులో ఉంది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేవు... కేఎం అగ్రహారం నుంచి ప్రారంభమయ్యే కాలువ గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. కాలువ పూడికతో నిండిపోవడంతో చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మిరప, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మిరప రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి పెట్టారు. పంటలు ఎండిపోతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో రైతులు ఎకరా చొప్పున డబ్బులు వసూలు చేసి కాలువ మరమ్మతు చేపట్టారు. జేసీబీతో పూడికతీత ప్రారంభించారు. కౌలు రైతు సంఘం జిల్లానాయకులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు కొరిటాల గోపాలరావు, కృష్ణారెడ్డి తదితరులు ఎండుతున్న పంటలను, కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు స్పందించి కాలువ మరమ్మతుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
రబీ పంటలపై రైతులకు శిక్షణ
యడ్లపాడు: గ్రామీణ అవగాహన కృషి అనుభవ పథకంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు జగ్గాపురంలో గురువారం రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఎం. నగేష్, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్ హాజరయ్యారు. రైతులకు రబీలో సాగుచేసే శనగ, మొక్కజొన్న పంటలపై మార్గ నిర్దేశం చేశారు. విత్తన శుద్ధి, తెగుళ్ల నివారణే కీలకం రైతులకు విత్తన శుద్ధి, తెగుళ్లు, పురుగుల నివారణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనగలో ఎండు తెగులు నివారణకు విత్తన శుద్ధిలో కార్బెండజం కిలో విత్తనానికి 2.5 గ్రాములు, ఆ తర్వాత ట్రైకోడెర్మా పొడి కిలో విత్తనానికి 10 గ్రాములు వాడాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి, ప్రారంభ దశలో వేప నూనెను వాడటం ద్వారా పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. మెరుగైన దిగుబడికి యాజమాన్య పద్ధతులు శనగ పంట యాజమాన్యంలో భాగంగా 30–35 రోజులకు, 60–65 రోజులకు నీటి తడి ఇవ్వడం ద్వారా దిగుబడి 2–3 క్వింటాళ్లు పెరుగుతుందని, సకాలంలో కలుపు నివారణ ముఖ్యమని సూచించారు. శనగకు ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను చివరి దుక్కుల్లో వేసుకోవాలని తెలిపారు. శనగపచ్చ పురుగు, ఆకు మాడు, తుప్పు తెగుళ్ల నివారణకు మందుల వాడకాన్ని వివరించారు. విద్యార్థినులు కీర్తి, శ్రీనిధి, జోషిత, శ్రేయ, అనగాని బేబీ, విజయలక్ష్మి, గాయత్రి, జ్యోత్స్నలు శనగపై తాము తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించి, రైతులకు వివరించారు. అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ సహా దాదాపు 50 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
నరసరావుపేట రూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు రూపుమాపుతామంటూ పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపేందుకు అందరూ కట్టుబడి పనిచేయాలని తెలిపారు. బాల్య వివాహాలు ఆడపిల్లల భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. బాలికలకు విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్.గోపీనాథ్, అడ్మిన్ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఎంటీ ఆర్ఐ యువరాజు పాల్గొన్నారు. -
హైవేపై అడ్డదారులతో ప్రమాదాలకు ఆస్కారం
నాదెండ్ల: జాతీయ రహదారి గణపవరం–చిలకలూరిపేట మార్గంలో మూడు అనధికార అడ్డదారులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే హైవేపై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు అడ్డదారులు ఏర్పాటు చేసుకున్నారు. మూడు కిలోమీటర్ల నిడివిలో మూడు చోట్ల ఉన్న అడ్డదారుల కారణంగా రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాతపడగా, ఎంతోమంది గాయాలపాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు, రాళ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి రాకపోకలు సాగిస్తున్నారు. గణపవరం సమీపంలో విష్ణు స్పన్పైప్స్ ఎదురుగా, కుప్పగంజివాగు బ్రిడ్జి సమీపంలో, నూతనంగా ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్బంకు ఎదురుగా డివైడర్పై మూడు అడ్డదారులు ఉన్నాయి. నేషనల్ హైవే అధికారులు, పోలీసులు స్పందించి డివైడర్పై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి అడ్డదారులు మూసివేయాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పల్నాడు
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025● పత్తి, మిర్చి పంటల నష్టాలతో మొక్కజొన్న వైపు మళ్లిన రైతులు ● ఏలూరు ప్రాంతానికి దీటుగా పల్నాడు వైపు కంపెనీల చూపు ● రబీ సీజన్లో భారీగా పెరిగిన మొక్కజొన్న సాగు దుర్గి: అక్టోబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు విత్తనాలు నాటేందుకు సీజన్ అనుకూలంగా ఉంది. గత నెల రోజులకుపైగా సాధారణ మొక్కజొన్న 27,067 ఎకరాలు, విత్తనోత్పత్తి మొక్కజొన్న కలిపితే సుమారు 50 వేల ఎకరాలకుపైగా జిల్లాలో సాగు చేశారు. ముఖ్యంగా మాచర్ల, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, బొల్లాపల్లి, సత్తెనపల్లి, గురజాల తదితర ప్రాంతాలలో సుమారుగా 27 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పత్తి, మిర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటంతో విత్తనోత్పత్తి మొక్కజొన్నకు కంపెనీలు ముందుగానే ఒక ధరను నిర్ణయించి పంటను కొనుగోలు చేయటంతో రైతులు పంటను సాగు చేస్తున్నారు. పెట్టుబడి, చీడపీడల నష్టం తక్కువగా ఉండటంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. వివిధ కంపెనీలు వైరెటీని బట్టి క్వింటాకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ధరలు నిర్ణయించారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వటంతో పాటు పలు తెగులు, పురుగు, గడ్డి మందులనూ వారే అందిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటను పలు కంపెనీలు హైదరాబాద్, ఏలూరుకు తీసుకెళ్లి విత్తనశుద్ధి చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దుర్గి పరిసర ప్రాంతాలలో పలు కంపెనీలు స్థానికంగా మొక్కజొన్న డ్రయర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ● జెడ్పీలో పనులన్నీ మీరే కేటాయించుకుంటే ఇక ప్రజాప్రతినిధులుగా మేమెందుకు? ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ ● రాజ్యాంగ దినోత్సవం రోజు జెడ్పీటీసీలకు అవమానం ● ప్రణాళిక–ఆర్థిక, పనుల ఆమోదానికి సంబంధించిన కమిటీలు బహిష్కరణ ● తమ మండలాలకు పనులు కేటాయించలేదని మండిపాటు ● ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైర్పర్సన్ వైఖరిపై ఆగ్రహం ● ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో చైర్పర్సన్ 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. పల్నాడు ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్న రైతాంగం కష్టనష్టాలను చవిచూసి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. రెండేళ్లుగా మొక్కజొన్న విత్తనోత్పత్తితో రైతులు లాభాలు పొందుతున్నారు. -
29 నుంచి పల్నాడు బాలోత్సవం
నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30వ తేదీలలో మూడవ పిల్లల పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బాలోత్సవం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్, కట్టా కోటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ చిన్నారులలో సృజనాత్మకత, దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంచేలా దీన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే పోటీలలో జిల్లా వ్యాప్తంగా 200కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో పోటీలు ఉంటాయని తెలిపారు. కోలాటం, శాసీ్త్రయ నృత్యం, లఘు నాటికలు, బుర్రకథ, విచిత్ర వేషధారణ వంటి మొత్తం 69 అంశాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరారు. పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరించారు. బాలోత్సవం కోశాధికారి కోయా రామారావు, కమిటీ సభ్యులు నెల్లూరు బ్రహ్మయ్య, కోటా సాయి కుమార్ పాల్గొన్నారు. -
పక్షపాతంపై నిరసన గళం
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్లో కొనసాగుతున్న వ్యవహారాలను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ, జెడ్పీ యంత్రాంగం ఏకపక్ష వైఖరిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు బహిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ మొత్తం ఆరు సమావేశాలకుగానూ మూడు స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా తయారు చేసిన అజెండాలను తిరస్కరించారు. -
అమరేశ్వరాలయంలో విశేష పూజలు
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు. తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్కుమార్ పాల్గొన్నారు. -
పత్తి రైతుకు కొనుగోలు కష్టాలు
● పత్తి కొనుగోళ్లలో చంద్రబాబు సర్కార్ ఉదాసీనత ● నామమాత్రంగా 11 కేంద్రాలు ఏర్పాటు ● జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 2.60 లక్షల ఎకరాలు ● దిగుబడుల అంచనా 12.28 లక్షల క్వింటాళ్లు ● జిల్లాలో ఇప్పటి వరకు 20,224 క్వింటాలే కొనుగోలు సత్తెనపల్లి: జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 11 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేటలో మరో కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. కేవలం 20,224 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. సగం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారని, మిగిలిన సగం దళారులే కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో విక్రయాలు జరిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జిల్లాలో జిన్నింగ్ మిల్లులు అనేకం ఉన్నా చంద్రబాబు సర్కార్ నామమాత్రంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు చేపట్టవచ్చు. దక్కని మద్దతు ధర... సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమ శాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొప్పున మద్దతు ధర తగ్గిస్తున్నారు. బన్నీ లేదా బ్రహ్మరకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకు, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మధ్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. తేమ 9 శాతం ఉంటే రూ. 8,028.90, తేమ 10 శాతం ఉంటే రూ. 7,947.80, తేమ 11 శాతం ఉంటే రూ. 7,866.70, తేమ 12 శాతం ఉంటే రూ. 7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరలు నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తాచెదారం, గుడ్డిపత్తికాయలు, రంగుమారినా, పురుగుపట్టిన, కౌడిపతి, ముడుచుకు పోయిన పత్తి కాయలను వేరు చేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధనలు విధించారు. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,02,400 మంది రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 10–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. సగటున 12 క్వింటాళ్ల చొప్పున 12,28,800 క్వింటాళ్లు పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు 11 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో 537 మంది రైతులకు చెందిన 20,224 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. -
రాజ్యాంగ పరిరక్షణలో పోలీసులు ముందుండాలి
నరసరావుపేట రూరల్: రాజ్యాంగ పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది ముందుండాలని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవి సంతోష్ తెలిపారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ సంతోష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామిక రాజ్యాంగాలలో ఒకటని తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాజ్యాంగం చట్టపరమైన పుస్తకం మాత్రమే కాదని, దేశ పరిపాలన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పాటించాల్సిన విలువలు, హాక్కులు, బాధ్యతలు గ్రంథంలో పొందుపరిచారని వివరించారు. అనంతరం అదనపు ఎస్పీ(ఏఆర్) సత్తిరాజు అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రమాణం చేయించారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నరసరావుపేట ఈస్ట్: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు పంచిపెడుతున్నారని విమర్శించారు. కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాధాకృష్ణ మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు ఉన్నాయని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాము, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.సుభానీ తదితరులు పాల్గొన్నారు. -
లీగ్ దశకు వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొనగా, రెండవ రోజు బుధవారం పోటీలు లీగ్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ దశలో వర్సిటీ వ్యాయామ కళాశాల జట్టు 52–10, 25–14 తేడాతో చలపతి ఇంజినీరింగ్ కళాశాలపై గెలుపొంది లీగ్ దశకు చేరుకుంది. ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల జట్లు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 25–24, 25–12, 17–15 తేడాతో ధనలక్ష్మి కళాశాల జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు 25–20, 25–16 తేడాతో వరుస సెట్లతో ఏపీఆర్డీసీ నాగార్జునసాగర్ జట్టుపై విజయం సాధించింది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 15–25, 25–21, 06–15 తేడాతో గెలుపొంది లీగ్ దశకు చేరుకొంది. లీగ్ దశకు చేరుకున్న కళాశాలల జట్లు గురువారం పోటీ పడతాయని టోర్నమెంట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తెలిపారు. వర్సిటీ జట్టును ఎంపిక చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్కే సతీష్బాబు, లక్ష్య కళాశాల డైరెక్టర్ హరిబాబు, ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు, శ్రీ చైతన్య కళాశాల డీన్ కృష్ణ, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. తలపడనున్న కృష్ణవేణి, ధనలక్ష్మి, బాపట్ల కళాశాలల జట్లు -
విద్యార్థులను తీర్చిదిద్దడానికి టింకరింగ్ ల్యాబ్స్ దోహదం
నరసరావుపేట రూరల్: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ దోహదపడతాయని డీఈవో చంద్రకళ తెలిపారు. నీతి అయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, సమగ్ర శిక్ష, యూనిసెఫ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్లకు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. జిల్లాలోని 23 ఏటీఎల్ స్కూల్ నుంచి ఇన్చార్జ్లు శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా ఇన్చార్జ్లతో ఎగ్జిబిట్స్ను తయారు చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీవైఈవో సుభాని మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులతో పంచుకుని ఎగ్జిబిట్స్ తయారు చేయించాలని తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సమర్థ వినియోగం ద్వారా కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన పది లక్షల మంది విద్యార్థులను పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలుగా తయారు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవోలు ఎస్కె సుభాని, వి.ఏసుబాబు, జిల్లా సైన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ పాల్గొన్నారు. టెక్నికల్ పర్సన్లుగా వెంకట్, వాణి వ్యవహరించారు. -
పీజీ ఫలితాల్లో కీర్తికి రాష్ట్ర ప్రథమ ర్యాంక్
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ కీర్తికి కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు, డీన్ డాక్టర్ సి.హెచ్.మోహన్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు. -
దళితులపై వేధింపులు
●జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, నాయకులు ●దళిత వర్గాలపై కేసులు పెడుతూ బాధిస్తున్న చంద్రబాబు సర్కార్ ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నరసరావుపేట: చంద్రబాబు సర్కార్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో దళితులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్బాబు ఆదేశాలతో బుధవారం పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో స్థానిక గడియార స్తంభం సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ● చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్లో దళితుల సమస్యలపై పార్టీ తరఫున రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ● రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ● జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత పాల్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బడుగు, బలహీనవర్గాలలో ఉన్న అన్ని కులాలకు చేయూతనిచ్చేలా అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ●పార్టీ పట్టణ అధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ● పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఎవరైనా అమలుపరచారంటే అది ఒక్క వైఎస్సార్ మాత్రమేనని తెలియజేశారు. ● సామాజిక సేవకులు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్కు సరైన గౌరవం ఇవ్వడం లేదని, విజయవాడలోని సామాజిక మహా శిల్పాన్ని సందర్శించకుండా ఆయన్ను అవమానించే చర్యలకు పాల్పడటం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియల్, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నెలటూరి సురేష్, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు మణీంద్రరెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి, రొంపిచర్ల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటేష్ పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కన నిర్మిస్తున్న మెడికల్ వైద్య కళాశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు పీపీపీ పద్ధతిలో కాకుండా ఇటు ప్రభుత్వం ప్రారంభించకుండా డోలాయమానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఇది ఒక చాలెంజ్ అని కళాశాలను పూర్తిచేసి నిబద్ధత, నిజాయతీ నిరూపించుకోవడానికి ఒక పరీక్ష అని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన మెడికల్ సీట్లు తీసుకువస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యార్థులకు వైద్య, విద్య దక్కుతుందని వివరించారు. పల్నాడు ప్రాంత ప్రజలకు మెడికల్ కళాశాల వర ప్రసాదమని తెలిపారు. విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాల సంవత్సర కాలంగా ఆగిపోయి ఎడారిలాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య , పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ , నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, భక్తులు వెంకటేశ్వర్లు, సంపత్ వెంకటకృష్ణ, మద్దిరాల నాగేశ్వరరావు, షేక్ బాషా పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
బాపట్ల టౌన్: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లాలోని హైవే, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ అధికారులతోపాటు జిల్లాలోని డీఎస్పీలు, హైవేల పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను, ఎక్కువగా రోడ్డు సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్ను పీపీటీ ద్వారా తెరపై ప్రదర్శించారు.రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సంభవించే మరణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బీ, హైవే అధికారులు సంయుక్త కార్యచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డిస్టిక్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ టి.కె.పరంధామరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ డి.ప్రసాదరావు, రేపల్లె, బాపట్ల, చీరాల, సీసీఎస్ డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎండీమోయిన్, పి.జగదీష్నాయక్, నాన్ హైవే, జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216, జాతీయ రహదారి 167(ఎ)ల అధికారులు, జాతీయ రహదారులు ఉన్న సంబంధిత సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మేదరమెట్ల: రోడ్డు క్రాస్ చేస్తున్న మోటా రు బైక్ను కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కొరిశపాడు జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్పై బుధవారం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన రోశయ్య మరో వ్యక్తితో కలిసి మోటారు బైక్పై వెళుతూ కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు సమీపంలో గల గాజు ఫ్యాక్టరీ వద్ద బైకును రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి బద్వేల్కు వెళుతున్న కారు మోటారు బైకును ఢీకొంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్లో ఒంగోలు కిమ్స్కు తరలించారు. మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
లిమ్కా రికార్డులో అఖిల్కు చోటు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): కరాటే కిక్స్లో సత్తా చాటి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి అఖిల్ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 23న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లిమ్కా బుక్ రికార్డులో అత్యధికంగా మాష్గిరి కిక్స్ 30 నిమిషాలు ఆపకుండా కిక్స్ కొట్టి రికార్డు సాధించినట్లు ఆర్గనైజర్ మిట్టల్ జయంత్ బుధవారం తెలిపారు. విశేష ప్రతిభ కనబర్చి లిమ్కా బుక్లో స్థానం పొందిన అఖిల్ను గ్రామస్తులు అభినందించారు. -
లింగ వివక్ష తగదు
నరసరావుపేట: లింగ వివక్ష, మహిళా సాధికారత, ఆస్తుల్లో నిర్ణయాధికారం, సమాన పనికి సమాన వేతనం అంశాలపై అవగాహన కోసం మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలు నయీ చేతన్ 4.0 ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. లింగ వివక్ష వద్దు, సమానత్వమే ముద్దు, సీ్త్ర, పురుష సమానత్వం దేశ ప్రగతికి సమానం, ఇంటిపని అందరిపని అంటూ నినాదాలు చేస్తూ మహిళలు ర్యాలీగా బయలుదేరి స్టేషన్రోడ్డులోని గాంధీపార్కుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తెలుగుతల్లి విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. దీనిలో డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, సోషల్ వెల్ఫేర్ పీడీ, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు. -
మాచర్లలో గంజాయి స్వాధీనం
మాచర్ల: పట్టణంలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ జగదీష్ చెప్పారు. మాచర్ల పట్టణ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలో గంజాయి వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 15 రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం రాత్రి పశువుల ఆసుపత్రి వెనుక పలువురు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పట్టణ ఎస్ఐ ఎం వెంకట్రావు, తహసీల్దార్ కిరణ్కుమార్ల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.40వేల విలువైన నాలుగు కిలోల గంజాయితోపాటు గంజాయి విక్రయించగా వచ్చిన మరో రూ.3వేల నగదు, ఆరు హషీఫ్ ఆయిల్ బాటిల్స్ను స్వాధీనపర్చుకున్నారు. మొత్తం రూ.52వేల విలువైన సామగ్రితోపాటు ఇందుకు మూల కారకులైన 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉన్నారు. వీరంతా గతం నుంచే గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పాత నేరస్తులని తెలిపారు. పూర్తిస్థాయిలో గంజాయిపై దృష్టి సారించి వీరి ద్వారా గంజాయి విక్రయదారుల సమాచారం తీసుకొని పట్టణంలో గంజాయి లేకుండా అదుపు చేస్తామన్నారు. ఏ ఒక్కరైనా గంజాయి గురించి సమాచారమివ్వాలన్నారు. నిందితులందరినీ మాచర్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ జగదీష్ చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న వారిలో కీలక పాత్ర వహించిన పట్టణ సీఐ వెంకటరమణ, ఎస్ఐలు వెంకట్రావు, బి అనంతకృష్ణ, పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు మంగళవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, వర్సిటీ రెక్టార్ ఆచార్య రామినేని శివరామప్రసాద్ ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులోనూ ముందుంటారని పేర్కొన్నారు. రెక్టార్ మాట్లాడుతూ.. ఏటా క్రీడల కోసం వర్సిటీ దాదాపు రూ.2 కోట్లు వ్యయం చేస్తుందని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పాతూరి శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు, వైస్ ప్రిన్సిపల్ సతీష్బాబు, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీలో వర్సిటీ పరిధిలోని 20 కళాశాలల జట్లు పాల్గొన్నారు. అంతర్ కళాశాలల విజేతతోపాటు వర్సిటీ జట్టును ఎంపిక చేయనున్నట్టు టోర్నమెంట చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. తొలిరోజు విజేతలు వీరే.. పురుషుల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 20 కళాశాలల జట్లు తలపడనున్నాయి. తొలిరోజు చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై విక్టరీ డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు 25–13, 25–5తో విజయం సాధించింది. పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట) జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 25–16, 25–17తో గెలిచింది. ఎస్కేఆర్బీఆర్ జట్టుపై వర్సిటీ కళాశాల జట్టు 25–14, 25–22తో విజయం సాధించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టుపై టీజేపీఎస్ కళాశాల (గుంటూరు) జట్టు 25–27, 25–23, 15–04తో గెలిచింది. విద్యా కేంద్రం (సత్తెనపల్లి) జట్టుపై కృష్ణవేణి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు విజయం సాధించింది. -
పేదలకు రుణాలు అందేనా!
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల పట్ల చిన్న చూపుచూపుతోంది. కొద్ది నెలల కిందట ఇదిగో రుణాలు ఇస్తున్నాం..వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలను నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్టీలకు కనీసం దరఖాస్తు చేసుకోమని చెప్పిన పాపన పోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుధవారం జెడ్పీ స్టాయీ సంఘ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షించనున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ అసమర్థ పాలనపై గుర్రుగా ఉన్నారు. ఎస్సీల ఆశలకు తెర జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాకు రూ.990 యూనిట్లు కింద రూ.41.33 కోట్లు, పల్నాడు జిల్లాకు రూ.992 యూనిట్లు కింద రూ.38.56 కోట్లు మేర సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకు(40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ) రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సమ యం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ సైట్ను ప్రభుత్వం మూసివేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సంక్షేమ హాస్టల్స్పై శీతకన్ను గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతుంది. ఎస్టీ హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడంతో, హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ఎస్టీ నాయకులు మండిపడుతున్నారు. నెల రోజుల కిందట పెదనందిపాడు, అనపర్రు బీసీ హాస్టల్లో పుడ్ పాయిజన్ అయి 56 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్స్లో విద్యార్థులు ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాలికల హాస్టల్స్పై నియంత్రణ లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు(క్రెడిట్ క్యాంపులు) జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగిలింది. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సత్తెనపల్లి: రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రసూన వైద్యులకు సూచించారు. సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకపోవడంపై ఆర్ఎంఓను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడుతూ ఓపీ బ్లాక్, సదరం క్యాంపు కలిసి ఉండటం వలన ఎక్కువ రద్దీగా ఉంటోందన్నారు. వెయిటింగ్ హాలులో సదరం క్యాంపు వారికి కుర్చీలు వేయాలని ఆదేశించారు. విధుల్లో సెక్యూరిటీ గార్డులు లేకపోవడాన్ని గుర్తించి మండిపడ్డారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. పెదకూరపాడు సీహెచ్సీలో.. పెదకూరపాడు: మండలంలోని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా డాక్టర్ ప్రసూన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు, అందుతన్న సేవలపై ఆరా తీశారు. వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. రాబోయే నెలలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో ప్రారంభిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ విద్య, వైద్య సిబ్బంది ఉన్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన -
మహిళల రక్షణకు బలమైన చట్టాలు
గుంటూరు లీగల్: మహిళల రక్షణ కోసం మన చట్టాలు బలంగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మహిళలపై జరిగే శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక, హింసలు, సైబర్ హింసల గురించి వివరించారు. వాటి ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలిపారు. ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 15 (లింగ వివక్ష నిరాకరణ), ఆర్టికల్ 21(జీవించే హక్కు) ద్వారా మహిళల హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. గృహ హింస, మెయింటెనెన్సు వంటి చట్టాల గురించి సమాజంలో, ఇంట్లో, పనిచేసే చోట మహిళలకు జరిగే శారీరక, మానసిక హింసలపై అవగాహన కల్పించారు. మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ మాట్లాడుతూ మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు, మహిళలకు అందే హక్కుల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా డిజిటలైజ్డ్ క్రైమ్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉందన్నారు. మహిళలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. హక్కుల దుర్వినియోగం, పని చేసేచోట, ఇంట్లో వేధింపులకు గురి అవ్వడం, మహిళలకు ఉన్న ఇష్టాలు, అభిప్రాయాలను నియంత్రించడం ద్వారా ఎక్కువగా హింసలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలకు జరిగే హింసల నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి
తాడేపల్లిరూరల్: ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆర్జేడీ పద్మ అన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలలో విద్యార్థు ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్–2026 అమలు పర్యవేక్షించటానికి మంగళవారంపెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్జేడీ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి తరగతిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఆర్కేవీఎం పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత నీట్, జేఈఈ మెటీరియల్ అందజేశారు. అనంతరం అధ్యాపకు లతో సమావేశమై ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సా ధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆర్జేడీ పద్మను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అచ్చంపేట: తాడువాయిలో కంది పంటను క్రోసూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ, ఏవో పి.వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం పరిశీలించారు. కంది పంటను ఆకుచుట్టు పురుగు, పూత పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పురుగు లేత ఆకులను, పూతను కలిపి గూడుగా చేసుకుని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయన్నారు. నివారణకు క్లోరిపైరిఫోస్, నోవల్యూరోన్, తయోదికార్బ్ నీటితో కలిపి మొక్క పూర్తిగా తడిసే వరకు పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు లామిడా సైహలో త్రిన్ మందును నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరులోని అమరా వతి రోడ్డు భారత్పేట ఐదవ లైనులో వినియోగంలో ఉన్న బోరింగ్ పంపు కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడింది. స్థానికుల నీటి అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న చేతిపంపు ఆర్నెల్ల క్రితం మరమ్మతుకు గురికావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది తిరిగి బిగించడం మరిచారు. అప్పటి నుంచి బోరును ఓపెన్గా అలాగే వదిలివేయడంతో చిన్నారులు ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదం బారిన పడే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి తక్షణమే చేతి పంపును బిగించాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట: సాతులూరు–నరసరావుపేట రైల్వే స్టేషన్ల మార్గంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు అత్యవసరంగా పట్టాలు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్వో వినయ్కాంత్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని కారణంగా ఆ మూడు రోజులు రైల్వేగేటు మూసివేయటం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 582.80 అడుగులకు చేరింది. ఇది 290.5140 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,500, ఎడమకాలువకు 4,160, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 12,586, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 28,046 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. -
ప్రతికూల వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు కనీసం కోసిన పంట వర్షాల బారిన పడకుండా కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం టార్పాలిన్ పట్టలు కూడా అందించడం లేదు. ఈనెల 27వ తేదీలోగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో జిల్లాలో 53,090 హెక్టా
●సత్తెనపల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతు భరోసా కేంద్రాలను అప్రమత్తం చేసేది. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి రైతుమిత్ర సంఘాలకు పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, కోతమిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇలా అన్నిటిని అందించేది. ఇవే కాకుండా ప్రతి రైతు భరోసా కేంద్ర వద్ద కనీసం 50 నుంచి అధికంగా 150 వరకు టార్పాలిన్ పట్టలు అందుబాటులో ఉంచేది. 40 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఈ టార్పాలిన్లను రైతులకు 50 శాతం రాయితీతో అందించేది. రూ.1200 చెల్లిస్తే రైతులకు టార్పాలిన్లు అందేవి. వర్షాలకు పంట తడిసిపోకుండా కాపాడేవి. వరి పొలంలో కోత కోసిన కుప్పలపై రక్షణకు, పంట నూర్పిడి సమయంలో నేల మీద వేసేందుకు, ధాన్యం ఆరబెట్టేందుకు ఉపయోగపడేవి. అనంతరం రబీలో కూడా వీటి వినియోగం కొనసాగేది. వెలుగు కార్యాలయాలకు .. ఇవే కాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా వెలుగు కార్యాలయాలకు మరికొంత పెద్ద సైజులో ఉండే టార్పాలిన్లను రాయితీపై ఇచ్చే వారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. రాయితీలు లేకపోవడంతో రైతులు బయట వ్యాపారుల వద్ద అధిక మొత్తం డబ్బులు చెల్లించి టార్పాలిన్లు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. రైతులకు గతంలో మాదిరిగా కోత మిషన్లు, నూర్పిడి యంత్రాలు ఇవ్వకపోవడంతో పాటు ఈ–క్రాప్ నమోదు మందకొడిగా చేస్తుండడంతో రైతులు పంట నూర్పిడి చేయకుండా పంట పొలాల్లో, కల్లాల్లో కుప్పలు వేసి విడిచి పెడుతున్నారు. -
అమరావతి జిల్లా ఏమైంది?
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడి పదకొండేళ్లు దాటినా జిల్లా ఏర్పాటు చేయకపోగా కనీసం అమరావతిలో రెవెన్యూ డివిజన్ కూడా లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు తమ అవసరాలకు గుంటూరుకు, అమరావతి టెంపుల్ సిటీ వారు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న దృష్ట్యా అమరావతిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అమరావతిని కొత్త జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇకనైనా వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పాముకాటుకు రైతు మృతి నాదెండ్ల: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కనపర్రు గ్రామానికి చెందిన రైతు నరిశెట్టి చిన్నయ్య (55) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం మాచర్ల రూరల్: మండల పరిధిలోని కంభంపాడు గ్రామ సమీపంలోని సాగర్ కుడి కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు మాచర్ల రూరల్ ఎస్ఐ సంధ్యారాణి తెలిపారు. వయస్సు సుమారు 50 – 55 ఏళ్లు ఉంటుందన్నారు. ఒంటిపై ఆకుపచ్చ జాకెట్, నీలి రంగు చీర ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి మృతదేహం.. తాడేపల్లి రూరల్: విజయవాడ కృష్ణానది నీటిలో సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణలంక పోలీసులు మంగళవారం గుర్తు తెలియని ఓ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం సీతానగరం నుంచి విజయవాడ వైపు వచ్చి ఉండవచ్చని భావించి తాడేపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. బాలుడి వయస్సు సుమారు 14 సంవత్సరాలు ఉండవచ్చని గుర్తించిన వారు తాడేపల్లి, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోరారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలి రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డివైడర్ను ఢీకొట్టిన కళాశాల బస్సు తెనాలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాల బస్సు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. చేబ్రోలు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు విద్యార్థులతో మంగళవారం తెనాలి వచ్చింది. ఇక్కడి ప్రకాశం రోడ్డులో పెట్రోలు బంకు వద్ద డివైడర్ను ఢీకొట్టింది. విద్యార్థులు అద్దాలపై పడడంతో అవి పగిలి పలువురు గాయపడ్డారు. తమకు ఫిర్యాదు అందలేదని టూ టౌన్ పోలీసులు తెలిపారు. -
స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే షెడ్యూల్ ప్రకటనపై విద్యార్థుల విస్మయం
ఏఎన్యూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారుల వింత ధోరణికి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. పీజీ కౌన్సెలింగ్లో రెండు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించిన నిర్వాహకులు స్పాట్ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వర్సిటీలోని పలు విభాగాల్లో స్పాట్ అడ్మిషన్ల వల్ల సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనివార్య కారణాల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ప్రతి ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్కాలర్షిప్ రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం వృథా కాకూడదనే భావనతో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆయా కోర్సుల్లో చేరుతూ ఉంటారు. ఈ సారి స్పాట్ అడ్మిషన్ జరగకుండానే ఫీజుల షెడ్యూల్ ప్రకటించడం గందగోళానికి దారి తీసింది. వర్సిటీ అధికారుల నిర్ణయంతో తమకు ఏడాది కాలం వృథా అవుతుందని స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై సీఈఓ ఆలపాటి శివప్రసాద్ను వివరణ కోరగా అడ్మిషన్లకు తనకు సంబంధం లేదని, అకడమిక్ క్యాలండర్ ప్రకారం మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెదకాకాని నవశక్తి క్షేత్రంలో చోరీ పెదకాకాని: పెదకాకాని నవశక్తి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆభరణాలతో పాటు మూడు హుండీలను ఎత్తుకెత్తిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రమైన పెదకాకాని శివారులో వెనిగండ్ల నుంచి అగతవరప్పాడు వెళ్లే రోడ్డులో నవశక్తి పీఠం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం పూజా కై ంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ తలుపులకు అర్చకులు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం గుడి వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసిన గడి పగులగొట్టి తలుపులు తీసి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి ఆభరణాలు 12 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, 2 ముక్కుపుడకలు, ఆలయంలో అమర్చిన మూడు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆభరణాలు సుమారు 50 గ్రాములని ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం సీ్త్ర హక్కుల పరిరక్షణ, సీ్త్ర హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా కరపత్రాలను ముద్రించటం శుభ పరిణామం అన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ నోడల్ అధికారి అరుణ, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, సభ్యులు మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ ఫీజు షెడ్యూల్ విడుదల డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026 మార్చి నెలలో నిర్వహించనున్న 10వ తరగతి, ఇంటర్మీడియేట్ దూరవిద్య (ఓపెన్ స్కూల్) పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఫీజును డిసెంబర్ 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో డిసెంబర్ 11, 12వ తేదీలలో, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 13, 14, 15వ తేదీలలో చెల్లించవచ్చని పేర్కొన్నారు. 10వ తరగతికి రూ.100, ఇంటర్మీడియేట్ (థియరీ)కి రూ.150, ప్రాక్టికల్స్కు రూ.100 చెల్లించాలని వివరించారు. ఫీజును ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రం, ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని తెలిపారు. ఫీజు, సబ్జెక్ట్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని, ఆన్లైన్ సేవాకేంద్రంలో సేవా రుసుం చెల్లించి తగిన రసీదు పొందాలని సూచించారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం సమావేశం యడ్లపాడు: పంచాయతీ కార్యదర్శుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.రమేష్ బాబు పేర్కొన్నారు. మండలంలోని మైదవోలు గ్రామంలో ఓ ప్రైవేటు భవనంలో సోమవారం రాత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. రమేష్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి సిరిపురం హరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నియామక పత్రాన్ని హరికి అందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సాంబశివరావు, టి.మోహన్ రావు, ఇ.శంకరరావు, షేక్ ఫాతిమాబీ, షేక్ రమీజ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలతోపాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసరావుపేట రూరల్: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్టు జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.మల్లికార్జునరావు తెలిపారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ పోటీలు ఎన్టీఆర్ జిల్లా నున్నా జెడ్పీ హైస్కూల్ నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని హెచ్ఎం పేర్కొన్నారు. ట్రాక్ విభాగంలో సీహెచ్ విజయలక్ష్మి, ఎన్.పరమాత్మలు ప్రథమ స్థానం, రోడ్ విభాగంలో ఎస్కే నబీర్ (అండర్–17), వై.తేజస్విని (అండర్–14), ఎన్.సింధు (అండర్–14)లు ప్రథమస్ధానం, ఎన్.బింధుశ్రీ (అండర్–17), జి.నరేంద్ర (అండర్–14), ఎస్కే ఆమన్ (అండర్–14) ద్వితీయ స్థానం, జి.మణికంఠ (అండర్–17), ఎ.లావణ్య (అండర్–14)లు తృతీయ స్థానాలు సాధించినట్టు పేర్కొన్నారు. వీరిని వ్యాయమ ఉపాధ్యాయుడు ఐ.సునీల్, ఉపాధ్యాయులు అభినందించారు. -
రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ
సత్తెనపల్లి: పత్తి రైతులకు మేలు చేసేలా కేంద్రానికి లేఖ రాశామని, 18 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని విన్నవించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గుంటూరు రోడ్డులోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5.40 లక్షల హెక్టార్లలో పత్తి పండిందని, మోంథా తుఫాన్తో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పరిహారం చెల్లించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. సీసీఐ నిబంధనలతో పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వినుకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించటానికి అదాలత్ దోహదపడుతుందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, జిల్లా విశ్రాంత న్యాయమూర్తి ఎస్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. మంగళవారం పట్టణంలోని కారంపూడి రహదారి మార్గం విద్యుత్ స్టేషను ప్రాంగణంలో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యలు ఉంటే ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తామన్నారు. రీడింగ్, మీటర్లలో పేర్లు మార్పు, అధిక బిల్లులు, కేటగిరీ మార్పులు తదితర సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటంతో పాటు వినియోగదారులకు సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయిలో రెండు నెలలకొకసారి ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్లైన్ విధానంలో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతున్నాయన్నారు. నూజెండ్ల మండలం అల్లిభాయిపాలెం గ్రామంలో విద్యుత్ లైను సమస్యపై వచ్చిన ఫిర్యాదుపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖాధికారి డాక్టరు పత్తిపాటి విజయ్కుమార్, ఫోరం సభ్యులు సునీత, డి.కృష్ణనాయక్, ఆర్.శ్రీనివాసరావు, డీఈ చేజర్ల రాంబోట్ల, ఏడీఏ భవనం వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఏఈలు జవ్వాజి నటరాజ్ తదితరులు ఉన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేలు -
తుఫాన్ వచ్చి నెల దాటుతున్నా ఆదుకోని ప్రభుత్వం
నేను ఐదు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ. 1.70 లక్షలకు పైన పెట్టుబడి పెట్టా. ఎకరాకు 35 బస్తాలు చొప్పున 175 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించా. పంట కీలక సమయంలో మోంథా తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుతం ఎకరానికి 25 బస్తాలు మించి దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. తుఫాన్ వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందించలేదు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ అందించలేదు. – కొత్తపల్లి యోహాన్, కౌలు రైతు, చేజర్ల ● -
చివరిలో కలవరం!
చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరుగాలం చెమటోడ్చిన అన్నదాతలకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. కనీసం ఇంటిలో తిండి గింజలైనా వస్తాయనే ఆశతో సాగు చేసిన వారికి తుపానులు, చీడపీడలు, మద్దతు ధర దక్కకపోవడం వంటి దెబ్బలు తప్పడం లేదు. పెట్టుబడులు రావడం లేదు. మోంథా తుఫాన్ నుంచి తేరుకున్న రైతులకు మళ్లీ ఇప్పుడు పంట చివరి దశలో మళ్లీ తుపాను తప్పదేమోననే ఆందోళన వెంటాడుతోంది. సత్తెనపల్లి: జిల్లాలో తుపాను ప్రభావం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ చల్లని గాలులు వీస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవక రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. తర్వాత ఆలస్యంగా కురిసిన వర్షాలతో వరి నాట్లు గతంలో కంటే అధికంగా వేశారు. మరి కొన్ని చోట్ల పొలాల్లో సరిపడా నీరు లేక మోటార్ల సహాయంతో నింపుకొని దమ్ములు చేసి మరీ వరినాట్లు వేశారు. ఆ తర్వాత అడపాదడపా కురిసిన భారీ వర్షాలతో వరి పొలాలు కొంత ముంపు బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల భయాందోళనలకు గురి చేసిన మోంథా వర్షాలు పంటలను ముంచేయడంతో తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 114.75 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గణంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను వస్తే పరిస్థితి ఏంటని రైతులు కలవరం చెందుతున్నారు. కోతలు ప్రారంభం జిల్లాలో ఈ ఏడాది వరి నాట్లు ఆలస్యంగా మొదలైనప్పటికీ ఆయా రకాల వరి విత్తనాలు కాలపరిమితి మేరకు గింజ తయారై ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నకరికల్లు ఏరియాలో వరి కోతలు ప్రారంభం కాగా... మరో 15 రోజుల్లో జిల్లా అంతటా కోతకు సిద్ధం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 38,599 హెక్టార్లు. ఈ ఏడాది 53,090 హెక్టార్లలో వరి సాగైంది. రానున్న 15 రోజుల్లో కోతకు పూర్తి స్ధాయిలో సిద్ధమవుతున్నా. గత నెలలో మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వరి పంట నీట మునిగి రైతులు నష్టపోయారు. మళ్లీ తుపాను వస్తే కోలుకోలేని నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పులు... జిల్లాలో వారం రోజుల క్రితం గజగజ వణికించిన చలిగాలులు ఇప్పుడు కాస్త చల్లగాలులుగా మారిపోయాయి. రాత్రీపగలు తేడా లేకుండా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణ మార్పులు తుపాను హెచ్చరికలను సూచిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే గింజ తయారై కొన్ని కోతలకు రాగా, మరికొన్ని పొలాలు 15రోజుల్లో కోతకు సిద్ధం కానున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. పంటలతో పాటు వరి పొలాల్లో నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఈ నెల 24న తుపాను అనుకున్నప్పటికీ ప్రస్తుతం 26 నుంచి 29 వరకు రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాపై ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ ప్రకటనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో తుపాను ప్రభావానికి అవకాశం లేదని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తోంది.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అయితే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పటికే జిల్లాలోని నకరికల్లు ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మంచి ధర పలికేలా కొనుగోలు కేంద్రాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నాం. –ఎం. జగ్గారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పల్నాడు -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
నరసరావుపేట రూరల్: ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు దండుకున్నట్టు పలువురు బాధితులు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పెద్దమొత్తంలో నగదును మోస పోయినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. వీటితో పాటు కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలకు సంబంధించి 111 ఫిర్యాదులు ఎస్పీకి అందాయి. పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మోసాలపై ఫిర్యాదులు ఇలా... ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ 36.40లక్షలు తీసుకుని మోసం చేసినట్టు 12మంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన శిరికొండ వెంకట్రావు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని 2021లో డబ్బులు వసూలు చేశాడు. తరువాత నకిలి అపాయిమెంట్ లెటర్లు సృషించి వీరిని మోసం చేశాడు. దీన్ని గుర్తించిన బాధితులు డబ్బులు ఇవ్వమని నిలదీశారు. ఇవ్వకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ● హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ మోసం చేసి రూ.5లక్షలు తీసుకున్నట్టు బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన మహిళ తాను హైకోర్టులో పని చేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు చూపించింది. హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.5లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నమ్మి పలు ధఫాలుగా డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. రెండు నెలల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పిందని, తరువాత నుంచి ఫోన్ చేయగా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. అనుమానంతో విచారించగా ఆమెకు హైకోర్డులో ఎలాంటి ఉద్యోగం లేదని తెలిందని, తనను మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరింది. ● ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 200 రెట్లు లాభాలు పొందవచ్చని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్కాల్ నమ్మి రూ.81లక్షలు మోసపోయినట్టు నరసరావుపేట కాకతీయనగర్కు చెందిన వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఫోన్లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి మొదట రూ.3లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.1.5లక్షలు లాభం వచ్చినట్టు తెలిపారు. దీంతో వారి మాటలు నమ్మి పొలం తాకట్టు పెట్టి రూ.81లక్షలు పలు దఫాలుగా పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. తరువాత లాభాల నగదు ఉపసంహరణకు ప్రయత్నించగా అదనంగా 20శాతం కమీషన్ చెల్లించాలని చెప్పారని పేర్కొన్నాడు. కొంత కాలానికి తన నంబర్ను బ్లాక్లో పెట్టారని ఫిర్యాదులో తెలిపాడు. జిల్లా ఎస్పీకి పలువురు బాధితుల ఫిర్యాదు -
పైసా పరిహారం ఇస్తే ఒట్టు ..!
సత్తెనపల్లి: రైతు సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే..దానికి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. తాజాగా మోంథా తుఫాన్తో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగింది. అయినా ఇప్పటివరకు రైతులను ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. జిల్లాలో 1730.25 హెక్టార్లలో పంట నష్టం.... పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలకు రైతులకు నష్టం వాటిల్లింది. అప్పట్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికలు కూడా పంపారు. కానీ ఒక్క పైసా పరిహారం విడుదల కాలేదు. తాజాగా గత నెలలో మోంథా తుఫాన్ ధాటికి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి వచ్చే తరుణంలో కాయ నల్లగా మారి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జిల్లాలో మొత్తం 1730.25 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు, 3,377 మంది రైతులకు పరిహారం అందించేలా జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. -
అండర్–14 యోగా రాష్ట్రస్థాయి విజేత ప్రకాశం
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల నుంచి 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో యోగా పోటీ లు జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అండర్ 14,17 విభాగాల్లో బాలబాలికలకు సంబంధించి యోగా పోటీల విజేతలను ప్రకటించారు. మరో రెండు రోజులపాటు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్ఎం గిరిజ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలికలు విభాగంలో ఎన్.శృతి (ప్రకాశం) మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. కృష్ణా జిల్లాకు చెందిన జి.శ్రావణి రెండో స్థానం, చిత్తూరు జిల్లాకు చెందిన కె.తేజశ్రీ మూడో స్థానం సాధించారు. ● అండర్–14 ట్రెడిషనల్ యోగా బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన సురేంద్ర మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన కౌషిక్ రెండో స్థానం, పశ్చిమ గోదావరికి చెందిన ఆర్.విక్రమాధిత్య మూడో స్థానం సాధించాడు. ● అండర్–17 ట్రెడిషనల్ బాలుర విభాగంలో తూర్పు గోదావరికి చెందిన క్రాతిక్ రామ్ మొదటి స్థానం, గుంటూరుకు చెందిన కె.సంపత్ రెండో స్థానం, వైజాగ్కు చెందిన పి.దేవాష్ మూడో స్థానం. ● అండర్–14 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో ప్రకాశంజిల్లాకు చెందిన కుంచాల హెప్సిబా, నాయపాము శృతి మొదటి స్థానం, తూర్పు గోదావరికి చెందిన పి.హసిని, ఎం.శ్రీవల్లి రెండో స్థానం, అనంతపురానికి చెందిన కె.మోక్షిత, కె.మోహిత మూడో స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నంకు చెందిన వాసవి, కౌశల్య మొదటి స్థానం, ప్రకాశానికి చెందిన భవ్యశ్రీ, లిఖిత రెండో స్థానం, తూర్పు గోదావరికి చెందిన జంగీలాబీ, పావని మూడో స్థానం సాధించారు. ● అండర్–17 రిథమిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో కర్నూల్కు చెందిన తులసి సాయి, షాహిద్ అప్రిద్ మొదటి స్థానం, కడపకు చెందిన ప్రశాంత్, లక్ష్మణ్ రెండో స్థానం, ప్రకాశానికి చెంది న మహేష్, మిల్టన్ మూడో స్థానం సాధించారు. ● అండర్–17 ట్రేడిషనల్ యోగా బాలికల విభాగంలో పశ్చిమ గోదావరికి చెందిన భవాని చౌదరి, తూర్పు గోదావరికి చెందిన ఛైత్రశివ వాసుకి రెండవ స్థానం, అనంతపురానికి చెందిన భరణి మూడో స్థానం సాధించారు. విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బా ల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటాపోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలు ర విభాగంలో పూల్ ‘సి’లో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ ‘డి’లో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ ‘బి’లో విన్నర్గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ ‘సి’లో విన్నర్గా పశ్చిమ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ ‘డి’లో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. ● మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైన ల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సా యంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్న మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శంకర్రావు, అండర్–19 కార్యదర్శి చింపారెడ్డి తెలిపారు. ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు ఉన్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన
నరసరావుపేట: సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే హెచ్ఆర్ పాలసీ, మినిమం ఆఫ్ టైమ్ శాలరీ(ఎంటీఎస్) అమలు చేయాలని జేఏసీ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్టేషన్రోడ్డులోని గాంధీ పార్కు వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పీజీఆర్ఎస్లో ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జీతాల పెంపు, సమయానికి చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్, రిటైర్మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచటం, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాల అమలు, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10న చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొని తమ న్యాయమైన హక్కులకోసం పోరాడాలని జేఏసీ నాయకులు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ, ఉద్యోగులు ఖాసీంవలి, సుబ్బాయమ్మ, మంజూష, జయప్రకాష్ పాల్గొన్నారు. లింగాపురంలో ఘర్షణ ఇద్దరికి గాయాలు మాచర్ల రూరల్: మండలంలో పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మండలంలోని లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్వర్లు, రాగి నాగేశ్వరరావు మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని మహిళకు గాయాలు వేగంగా వెళ్తున్న కారు ఢీకొని పశువుల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె. రమణమ్మ పొలం నుంచి పశువులను తోలుకొని ఇంటికి వెళ్తుండగా, గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రమణ తల, కాలుకు గాయాలయ్యాయి. మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు. -
టీ స్టాల్ యజమాని హత్య
నరసరావుపేట రూరల్: పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో టీ స్టాల్ నిర్వహిస్తున్న ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున టీ స్టాల్లో పనిచేస్తుండగా గుర్తుతెలియని ఇరువురు ఘాతకానికి పాల్పడ్డారు. హత్యలో ఓ మహిళ కూడా పాల్గొన్నట్టు పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ద్వారా నిర్ధారించారు. పట్టణంలోని కొండలరావుపేటకు చెందిన షేక్ బాజి (35) గతంలో టీ స్టాల్లో మాస్టర్గా పనిచేస్తుండేవాడు. ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలోని చిలకలూరిపేట రోడ్డులో తానే సొంతగా టీ స్టాల్ ప్రారంభించాడు. తెల్లవారుజామున 6 గంటల సమయంలో టీ స్టాల్ తెరిచి పనిచేస్తుండగా ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడకి వచ్చి బాజీపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాజీని గుర్తించిన స్థానికులు లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తలపైన, ఛాతీపైన బలమైన గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల్నాడు రోడ్డులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. దాడిలో పాల్గొన్న మహిళ బాజీ హత్య కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతుడి భార్య, బంధువుల నుంచి అనుమానితుల వివరాలు సేకరించారు. దీంతోపాటు ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ పుటేజ్ను పరిశీలిస్తున్నారు. సీసీ పుటేజ్లో హత్యలో ఇరువురు పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇద్దరిలో ఒకరిని మహిళగా గుర్తించినట్టు తెలిసింది. మృతుని భార్య జబీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు. -
అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
ధాన్యం సేకరణ పోస్టర్ ఆవిష్కరణ నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలు నాణ్యతతో పరిష్కరించటంపై దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 122 అర్జీలు స్వీకరించారు. అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్లినప్పుడు గ్రీవెన్స్ జాబితా సిద్ధంగా ఉంచి అధికారులకు చెప్పాలన్నారు. ఒకటీ రెండు అర్జీలు స్వయంగా తనిఖీ చేయటం ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిచాలన్నారు. తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయగా అర్జీల పరిష్కారంలో నాణ్యత సరిగా లేదని గుర్తించినట్లు తెలిపారు. తహసీల్దార్లు వారి దగ్గరకు వచ్చిన గ్రీవెన్స్ సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలన్నారు. అర్జీలు పరిష్కరించే బాధ్యత క్షేతస్థాయి అధికారులపైనే ఉందన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్షేత్రస్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి ఏ అర్జీ వచ్చినా వ్యక్తిగతంగా పరిశీలన చేసి పరిష్కరించాలని, ఆ విధంగా చేయకుండా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన రెఫరెన్స్లను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీసు ద్వారా తపాలా పంపించటం జరుగుతుందని, వాటిని తీసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కమిషన్తో సమగ్ర కుల గణన చేపట్టాలి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి, పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నా, ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా బీసీ కులాల జనగణన జరిపించాలని ఆయన కోరారు. 139 బీసీ కులాల్లో ఎవరెంతో తెలియకుండా రిజర్వేషన్లు అమలు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ తిమ్మరాజు, తన్నీరు వెంకట్, ముదిరాజ్, జిల్లా నాయకులు బి.శ్రీనివాసరావు, శీలం వెంకట్రావు పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ
దుర్గి: అక్రమ అరెస్టులు, కేసులు తనపై మోపినా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కంచరగుంట, మంగాపురం తండా గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ సర్పంచ్ ఆలేటి వెంకటేశ్వర్లు, యాక్సిడెంట్కు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాణావత్ బాలునాయక్లను పరామర్శించారు. మంగాపురం తండాలో ఇటీవల అక్రమ కేసులు బనాయించి పోలీసులతో దెబ్బలుతిన్న పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రతి కార్యకర్తను, నాయకులను, అభిమానులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అభయమిచ్చారు. అధికారముందని, అక్రమంగా, అన్యాయంగా వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. సంవత్సరంన్నర కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, దీనికి తాజా ఉదాహరణే మాజీ సీఎం జగన్ పర్యటనకు తరలివస్తున్న ప్రజానీకమేనని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం పెద్దబ్బాయ్, గొట్టం బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు పాశం కోటిరెడ్డి, బూడిద సైదులు, తోట మూర్తి, మాదాసు వాసు, అరిగెల కొండలు, కలవల వీరగోవిందు, మాదాసు భిక్షమయ్య, మోతీలాల్ నాయక్, కోటా రాజు, బొంతా కృష్ణ, మాదాసు హనుమంతరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వామీ.. మరలా జగనన్న పరిపాలనే రావాలి 2024 ఎన్నికల ప్రచారం తరువాత మొదటి సారిగా మండలంలోని మంగాపురం తండాకి చేరుకున్న పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూసిన మంగాబాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆయన్ను భావోద్వేగంతో హత్తుకొని కన్నీటి పర్యంతమైంది. సోమవారం పర్యటనలో భాగంగా పీఆర్కే మంగాపురంతండాకు చేరుకున్నారు. గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన పీఆర్కేను ద్దేశించి వృద్ధురాలు మాట్లాడుతూ ‘‘స్వామీ.. జగనన్న పాలన ఎప్పుడు వస్తుందయ్యా’’ అంటూ కన్నీటి పర్యంతమైంది. తమ బాగోగులు చూసే నాథుడే కరువయ్యారని పేర్కొంది. పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
పోలీసు వనంలో విద్యా సుగంధం
చిలకలూరిపేట: ఓ ఐపీఎస్ అధికారిగా కల్లోల కాశ్మీరంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్... నక్సల్స్ ప్రభావిత చత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్ నియంత్ర విధులు... వెస్ట్ బెంగాల్లో కోల్ మాఫియా, దేశ సరిహద్దుల్లో స్మగ్లర్లతో తలపడటం వంటి సాహసభరిత, అత్యంత ప్రమాదభరిత విధుల నిర్వహణ ఒక వైపు.. మరోవైపు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల నుంచి ఎంబీఏ, పీహెచ్డీ, డాక్టర్ ఆఫ్ లా వంటి విద్యార్హతలు సాధించడం ఆయనకే సాధ్యమైంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి బొప్పూడి నాగరమేశ్ స్వగ్రామం చిలకలూరిపేటలోని బొప్పూడి. ఊరి పేరే ఇంటిపేరుగా కలిగిన ఆయన్ను ఆయనను లక్ష్యసాధనకు మరోపేరుగా చెప్పుకోవచ్చు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారనే విధంగా కొనసాగుతున్న ఆయన జీవన పయనం ఎందరికో స్ఫూర్తిదాయకం. పరాక్రమవంతుడైన అధికారి బొప్పూడి పాండురంగారావు, నాగమణి దంపతులకు 20 జులై 1963లో బొప్పూడి నాగ రమేశ్ జన్మించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా వ్యవహరించిన తండ్రితోపాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంటర్ వరకు విద్యాభ్యాసం కొనసాగింది. 1983లో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బీటెక్ పట్టా పొందారు. అక్కడి నుంచి ఐదేళ్లపాటు జెంషెడ్పూర్లోని టాటా మోటార్స్లో ఇంజినీర్గా విధులు నిర్వహించారు. 1988లో ఐఐఎంలో ఎంబీఏ సీటు, సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. దీంతో ఐపీఎస్లో చేరి హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ అనంతరం వెస్ట్ బెంగాల్ కేడర్కు నియమితులయ్యారు. తొలి పోస్టింగ్ ఎస్డీపీవోగా వనగ్రామ్లో నియమితులయ్యారు. అక్కడ యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్లో పాల్గొని రూ.కోట్లు విలువైన స్మగ్లింగ్ సామగ్రి పట్టుకోడవం ద్వారా సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం 1991లో బారక్పూర్ ఏడీఎస్పీగా పదోన్నతి లభించింది. అక్కడ గ్యాంబ్లింగ్, హెరాయిన్ స్మగ్లింగ్ ముఠాల నియంత్రణకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. విద్యా ప్రస్థానం ఒకవైపు సీఆర్పీఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వంటి ప్రమాదభరిత విధులు నిర్వహిస్తూనే తనకు అత్యంత ఇష్టమైన విద్యా వ్యాసంగాన్ని నాగరమేశ్ కొనసాగించారు. ● మొదటగా ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చినా, ఐపీఎస్ కారణంగా వదులుకున్న నేపథ్యంలో అక్కడి నుంచే విద్యాప్రస్థానం కొనసాగించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఐఐఎం కోల్కత్తా నుంచి ఎంబీఏ డిగ్రీని 2003లో పూర్తి చేశారు. ● 2004–10 మధ్య ఖరగ్పూర్ ఐఐటీ నుంచి మేనేజ్మెంట్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలు పొందారు. ● 2014–18 మధ్య నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ● కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎంఏ సైకాలజీతోపాటు స్పానిష్, చైనీస్ భాషల్లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కోర్సులు పూర్తి చేశారు. ● 2024లో నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లా పట్టా పొందారు. ● 2015 ప్రాంతంలో అమెరికాలోని నేషనల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు భారత ప్రభుత్వం తరుఫున వెళ్లి పాఠాలు బోధించారు. ● ప్రస్తుతం తెలంగాణా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్న ఆయన పేద ప్రజలకు న్యాయసేవలు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాక్షికి వివరించారు. దీనికి తోడు విదేశీ యూనివర్సిటీల నుంచి అంతర్జాతీయ అంశాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు. చివరగా దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నిజాయతీగా, ఎవరికీ లొంగిపోకుండా విధులు నిర్వహిస్తే దేశంలో అవినీతి, అరాచకం అంతరించి పోయి దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ విధులు నిర్వహిస్తూనే నాగ రమేశ్ అపారమైన జ్ఞాన సముపార్జన ఉద్యోగ ప్రస్థానంలో పలు పతకాలు ప్రతిష్టాత్మక ఐఐటీ,ఐఐఎం వంటి సంస్థల నుంచి డిగ్రీలు అనంతరం 2001–03 మధ్య కాలంలో వర్ధమాన్జిల్లా ఎస్పీగా నియమితులై కోల్ మాఫియాను సమర్థంగా ఎదుర్కొవడం ద్వారా ప్రభుత్వరంగ ఈసీఐఎల్ కు రూ.రెండువేల కోట్లు లాభం చేకూరేందుకు దోహదపడ్డారు. 2005లో డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన 2008లో సీఆర్పీఎఫ్ డీఐజీగా(యాంటీ ఇన్సర్జెన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేశారు. 2010లో చత్తీస్గఢ్లోని దర్బాఘాటీ ప్రాంతంలో మావోయిస్టులు 73 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చటంతో ఆ ప్రాంతంలో ఐజీ ఆపరేషన్స్గా నియమితులయ్యారు. అక్కడ ఆయన విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలకు పరాక్రమ మెడల్ లభించింది. అదే ఏడాది చివరిలో కశ్మీర్లో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్స్ ఐజీగా నియమితులయ్యారు. అక్కడ 2011–12 ప్రాంతంలో హార్డ్కోర్ పాకిస్తానీ టెర్రరిస్టు అబ్దుల్లా ఉని ఎన్కౌంటర్ ఆయన సారథ్యంలో జరిగింది. ప్రభుత్వం నుంచి రూ.3లక్షలు రివార్డు సైతం అందుకున్నారు. అనంతరం 2013–15 కాలంలో ఢిల్లీలోని ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా, సీఆర్పీఎఫ్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2016లో తిరిగి వెస్ట్బెంగాల్కు అడిషనల్ డీజీగా వెళ్లిన ఆయన 2020లో డీజీగా పదన్నోతి పొంది 2023లో డీజీపీగా పదవీ విరమణ చేశారు. -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి:ఎస్టీయూ
వెల్దుర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చిన హామీ మేరకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి. రామిరెడ్డి కోరారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ అర్హతనిచ్చి, మినహాయింపునివ్వాలని, పెండింగ్లో ఉన్న కామన్ సర్వీసు రూల్స్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారన్నారు. అధికారులు యాప్లు త్వరగా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అలా చేస్తే ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. మండలంలోని నూతన ఉపాధ్యాయులకు అపరాజిత ఆగ్రోఫాం ద్వారా లంచ్ బ్యాగ్లు, సర్వీసు రిజిస్టర్లు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు హరినాయక్, కార్యదర్శి తాటి రాజా, మాచర్ల రాంబాబు, మాచర్ల అనిల్, కృష్ణ, జిల్లా నాయకులు గురవయ్య, రాజశేఖర్, ఏసురత్నం, జాన్, మంగ్లానాయక్, అమలబాబు, సంస్థ మేనేజర్ శేషుబాబు పాల్గొన్నారు. -
ఐఎంఏ గుంటూరు శాఖకు అవార్డులు
గుంటూరు మెడికల్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖకు వివిధ రంగాల్లో అందించిన సేవలకు లభించిన అవార్డులను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి నుంచి గుంటూరు ఐఎంఏ శాఖ కార్యనిర్వహకవర్గం అందుకుంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికష్ణ, డాక్టర్ వి.మహేష్ డాక్టర్ డి.అమరలింగేశ్వరరావు, డాక్టర్ ఎన్.కిషోర్, డాక్టర్ ఎం.పర్నికుమార్ తదితరులు డాక్టర్ బన్సాలి నుంచి అందుకున్నారు. గుంటూరు శాఖకు ఐదు అవార్డులు దక్కటం పట్ల పలువురు వైద్య ప్రముఖులు అభినందనలు తెలిపారు . ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు బొల్లాపల్లి : వెల్లటూరులోని సోమేశ్వరస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసినట్లు దేవదాయ శాఖ అధికారి సీహెచ్ శివనాగిరెడ్డి సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేతపూడి వెంకటేశ్వర్లు, అడక లింగరాజులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఇప్పటికీ వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.33.18 లక్షలు, సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.78.39 లక్షలు దాతల నుంచి విరాళాలు అందాయన్నారు. స్వర్ణ కుటీరం నిర్మాణానికి భూమి పూజ వినుకొండ : స్థానిక కొండమెట్ల వద్ద ఉన్న అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్వర్ణ కుటీర నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ ఏజీపీ పోట్లూరి సైదారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఐదుగురు దాతలు ఒక్కొక్కరు రూ.1.08 లక్షల చొప్పున మొత్తం రూ.5.40 లక్షలు మందిరం నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. కార్యక్రమంలో మేలిశెట్టి ఉషారాణి, ఏటుకూరి కృష్ణవేణి, వి.రమ, పత్తి భ్రమరాంబ, బుర్ర సుజాత పాల్గొన్నారు. పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్ట ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పునీత శౌరి మహోత్సవాలకు జెండా ప్రతిష్టా కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి డిసెంబరు మూడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో తొలి రోజు మేత్రాసన ప్రొక్యురేటర్, ఛాన్సలర్ గురుశ్రీ దాసరి కిరణ్, ఫాదర్లు దిలీప్కుమార్, బాలశౌరి, కన్నీ థామస్లతో కలిసి జెండాను ప్రతిష్టించారు. ఏసును స్తుతిస్తూ ఆరాధించారు. డిసెంబర్ 3న గురువులతో సమిష్టి పండుగ దివ్యబలి జరుగుతుందని ఫాదర్ దిలీప్ కుమార్ చెప్పారు. రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా గుంటూరుఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్మేళా సద్వినియోగంచేసుకోవాలన్నారు. 98663 66187, 95817 94605 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ప్రసన్నాంజనేయునికి సర్వాంగం బహూకరణ
శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు లీగల్: జిల్లాలోని న్యాయవాదుల వన సమారాధన ఆదివారం చిన్న పలకలూరులోని పెట్రోల్ బంకు సమీపంలోని మామిడి తోటలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏర్పాట్లు చేశారు. -
రషీద్ కుటుంబం
కన్నీరుమున్నీరైన గురజాల/ రెంటచింతల: రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బయో డీజిల్ అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతుడిని గురజాలకు చెందిన రషీద్గా గుర్తించారు. రషీద్ గత ఆరు సంవత్సరాలుగా బయోడీజిల్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర కిందటే వివాహం కాగా, ఆయిదు నెలల కుమారుడు ఉన్నాడు. రషీద్ తండ్రి ఆరేళ్ల కిందట చనిపోవడంతో తల్లి ఖాశీంబీ, భార్య అమిజాబేగం, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రషీద్ అకాల మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. తహున్షాకు గుండెలో రంధ్రం ఉండటంతో రెండు నెలల క్రితమే ఆపరేషన్ చేయించారు. వారం రోజులుగా ప్లాంట్లో డీజిల్ లేదని, శనివారం రాత్రి ట్యాంక్ వస్తుందని విధులకు వెళ్లి ఆదివారం ఉదయానికే రషీద్ చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పారిశ్రామికంగా పల్నాడు ప్రాంతం ప్రసిద్ధి చెందింది. సిమెంటు, కెమికల్, సున్నం వంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయిు. వేల మంది కార్మికులు వాటిల్లో పనిచేస్తుంటారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక కేంద్రాలు పల్నాడు ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 50 కిలోమీటర్లు దూరం వరకు ఒక్క అగ్నిమాపక శాఖ కార్యాలయం లేకపోవడం గమనార్హం. పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. -
పల్నాటి వీరుల ఆయుధాలకు ఘనంగా వీడ్కోలు
కారెంపూడి: ఐదు రోజులుగా పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. వీరాచారులు ఉదయాన్నే నాగులేరు గంగధారి ఒడ్డున వీరుల ఆయుధాల అలంకారాలు తీసివేసి నూతన అలంకారాలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికెళ్లి ఆయనను తోడ్కొని చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. చెన్నకేశవునికి పూజలు చేశాక తీర్థం తీసుకున్నారు. ఆలయం ముందు మరికొందరు వీరంగమాడారు. తర్వాత బ్రహ్మనాయుడు విగ్రహానికి పూజలు చేశారు. అంకాలమ్మను దర్శించుకున్నారు. అంతా కలిసి నాయకురాలు నాగమ్మ వేషంలో ఉన్న వీరాచారుడిని తరుముకుంటూ లంకన్న ఒరుగు ప్రాంతానికి పరుగున చేరుకున్నారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ నాయకత్వంలో వీరాచారులంతా రణక్షేత్ర వీధుల్లో ఉగ్రరూపంలో పరుగు లాంటి నడకతో విషాద వదనాలతో లంకన్న ఒరుగుకు చేరుకున్నారు. అక్కడ లంకన్న వేషధారణలో మృతి చెందినట్లుగా పడి ఉన్న లంకన్న పాత్ర పోషిస్తున్న ఆచారవంతుని వద్దకు వారంతా చేరుకున్నారు. అక్కడ పెద్దపెట్టున ఏడుపులు విన్పించాయి. విషాద వదనాలతో అంతా ఉద్విగ్నంగా ఉన్నారు. లంకన్న వద్దకు పీఠాధిపతి చేరుకుని ముసుగు తొలగించి ఆయన నోట్లో శంఖుతీర్థం పోసి ప్రాణ ప్రతిష్ట చేసిన ఘట్టాన్ని ప్రదర్శించారు. తర్వాత ఆచారవంతులంతా లంకన్నను తోడ్కొని నాగులేరు గంగధారిలో స్నానం ఆచరింపచేశారు. బ్రహ్మనాయుడు లంకన్నకు ప్రాణ ప్రతిష్ట చేశాడనే చారిత్రక గాథను ఉత్సవాలలో నాటకీయంగా ప్రదర్శించారు. ఆసాంతం ప్రశాంతంగా.. సాయంత్రం వీరుల ఆయుధాలన్నింటికి నాగులేరు ఒడ్డున అలంకారాలు తీసి వేశారు. ఆయుధాలను శుభ్రం చేశారు. రాత్రికి శంఖుతీర్థ మండపంలో బ్రహ్మనాయుడు పాత్రలో ఉన్న పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇచ్చిన తీర్థం తీసుకుని అలంకారాలు లేని ఆయుధాలతో వీరాచారులు పరుగులు తీస్తూ ఆయుధాలకున్న గంటలు మోగిస్తూ కారెంపూడి వీధులను కలియతిరిగారు. వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగాయి. దీంతో కళ్లిపాడు ఉత్సవ ఘట్టం ముగిసింది. అప్పటికే కళ్లి మండల కోసం వేచి ఉన్న ప్రజలు వాటిని తీసుకుని పొలాలలో చల్లుకున్నారు. ఇళ్లలో పెట్టుకున్నారు. దీంతో ఉత్సవాలు ముగిశాయి. మరో వైపు అప్పటికే వీరాచారుల కుటుంబాలు స్వస్థలాల ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నలుగురికి తీవ్రగాయాలు రెంటచింతల: మండల పరిధిలోని గోలి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హాలియాకు చెందిన కంటోజు పరిపూర్ణాచారి(42) తన అన్న శ్రీనివాసచారితో కలిసి గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు భర్త గోవిందాచారిని పరామర్శించారు. వా రు తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం హాలియా వెళ్తున్న సమయంలో నాగమయ్య దేవస్థానం సమీపంలో సమాధానపేటకు చెందిన వేల్పుల నరేంద్ర, జొన్నలగడ్డ సంతోస్, గుంజరి వెంకటేష్ ముగ్గురు మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలపై నున్న ఐదుగురు కిందపడ్డారు. ప్రమాదంలో పరిపూర్ణాచారి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాల య్యా యి. వారిని ఏపీ జన్కో అంబులెన్స్ వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేట తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పది పరీక్షల షెడ్యూల్ విడుదల డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం తెలిపారు. మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 1న ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను యుడైస్ వెబ్సైట్లో సరిచూసుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకు వెళ్లి సరిచేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేపు క్రోసూరులో జాబ్మేళా క్రోసూరు: క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన సోమవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి జి.తమ్మాజీరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్మేళాకు పలు కంపెనీలు హాజరువుతున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు విద్యార్హతను బట్టి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుందన్నారు. 10వ తరగతి, ఆపై చదువులు చదివి 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. బయోడేటా, చదువుకున్న సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ నకలు, ఫొటోలు తీసుకుని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు హాజరుకావచ్చన్నారు. వివరాలకు 7779858789, 8074393466 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. శ్రీసత్యసాయి అన్నప్రసాద వితరణ నరసరావుపేట ఈస్ట్: శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, సతైనపల్లిరోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు, పల్నాడు బస్టాండ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కేంద్రాలలో దాదాపు 8వేల మందికి ప్రసాదం అందించారు. శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ కూనిశెట్టి సత్యసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి సభ్యులు, సీ్త్ర సేవాదళ్ సభ్యులు సేవలు అందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు. -
రెండు పళ్ల విభాగం విజేత కేసానుపల్లి ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శనివారం రెండు పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ప్రారంభించారు. ప్రథమ బహుమతిని దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన పొన్నబోయిన విష్ణుభరత్ యాదవ్ జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీరెడ్డి, ప్రకాశం జిల్లా కంభం మండలం యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలతా నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. నాల్గవ బహుమతిని నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత, ఐదో బహుమతిని బెల్లంకొండ మండలం మాచాయపాలెంకు చెందిన గౌరు కార్తికేయ, అమరావతి మండలం గిడుగుకు చెందిన భూపతి శ్రీనివాసరావు కంబైన్డ్ జత కై వసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని పల్నాడు జిల్లా మాచవరం మండలం మల్లవోలుకు చెందిన ఘంటా రమ్య నాయుడు ఎడ్ల జత గెలుచుకున్నాయి. ఈ ఆరు బహుమతులను కారెంపూడికి చెందిన టీడీపీ నాయకుడు సంగినేడి ధనుంజయ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సంగినేడి బాలకృష్ణ ప్రదానం చేశారు. పోటీలలో పాల్గొన్న మిగిలిన రెండు జతలకు కూడా నగదు బహుమతులను ప్రదానం చేశారు. బహుమతి ప్రదానంలో పంగులూరి అంజయ్య, చప్పిడి రాము కారెంపూడి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
తల్లి, కుమారుడిని కలిపిన జ్యోతి ఫౌండేషన్
సత్తెనపల్లి: మతిస్థిమితం లేని యువకుడు ఐదు నెలల క్రితం తప్పి పోవటంతో తల్లి వెతకని చోటు లేదు. ఎక్కడా జాడ కనిపించక ఆందోళన చెందుతున్న తరుణంలో సత్తెనపల్లి నుంచి వచ్చిన ఫోన్తో ఆ తల్లి ఆనందానికి ఆవధులు లేవు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్లో గత రెండు రోజుల క్రితం మాసిపోయిన బట్టలతో మతిస్థిమితం లేక తిరుగుతున్న యువకుడ్ని ఆటో వాళ్ళు గుర్తించి జ్యోతిఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓలేటి కుమారి మతిస్థిమితం లేని 20 సంవత్సరాల మంజునాథ్ అనే కర్ణాటకకు చెందిన యువకుడిని అక్కున చేర్చుకొని జ్యోతి ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకుని వచ్చి సపర్యలు చేయించింది. అతనికి స్నానం చేయించే క్రమంలో అతని చేతి మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా కర్ణాటకలో ఉన్న యువకుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం తో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి వారికి వారి కుమారుడు మంజునాథ్ను అప్పగించింది. ఈ సందర్భంగా మంజునాథ్ తల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ సత్తెనపల్లిలో నా బిడ్డ ఉన్నాడని జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓలేటి కుమారి ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్లో నా బిడ్డను చూసుకొని చాలా సంతోషించానని, తమ కుమారుడ్ని తమకు అప్పగించిన ఓలేటి కుమారికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాది దివ్వెల శ్రీనివాస రావు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొతుగంటి రామకోటేశ్వరరావు వెంట ఉన్నారు. -
25 నుంచి అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు చెప్పారు. పోటీల కరపత్రాలను శనివారం వారు విడుదల చేశారు. పోటీలలో భాగంగా వర్సిటీ టీమ్ను ఎంపిక చేస్తారని వివరించారు. పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), డాక్టర్ చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల జట్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 11 అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేయండి హైకోర్టు స్టేటస్కో ఉన్న సర్వే నెంబరు భూమిలో టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. అదేమని అడిగిన వారిని పోలీసుల అండదండలతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. –గ్రామ దళితులు, మురికిపూడి, చిలకలూరిపేట మండలం పీఎం ఈజీపీ రుణాలు మంజూరు చేయండి ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద పీఎం ఈజీపీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి. మూడేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అమలు కాలేదు. రుణాలు అందక వడ్డీదారుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. సిబిల్స్కోరు, ఒకరికి ఒకరు ష్యూరిటీ లేకుండా వెంటనే ఇవ్వాలి. –మీరయ్యమాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు -
అరకొర వేతనాలు.. చాకిరి మోపెడు
పెదకూరపాడు: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అరకొర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ భద్రత అయినా ఉందా అంటే అదీ లేదు. దీంతో వారు పోరాట దీక్షకు దిగ్గారు. పల్నాడు జిల్లాలో క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు(సీఆర్ఎంటీ), మండల సమన్వయకర్తలు(ఎంఐఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 192 మంది పనిచేస్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వారి ఎదుగుదలలో ఎలాంటి మార్పులు లేదు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునేందుకు దశల వారీగా ఉద్యమం చేపట్టారు. వీరి డిమాండ్లు..... ● సమగ్ర శిక్షలోని అన్ని కేటగిరీలకు హెచ్ఆర్ పాలసీ తక్షణం అమలు చేయాలి. ● అన్ని కేటగిరీలకు మినిమయం టైం స్కేల్ అమలు చేయాలి. ● ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు అందించాలి. ● రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి ● గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలి. ● సమగ్ర శిక్షలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు మెడికల్, చైల్డ్ సెలవులు అందించాలి. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకే ఈ పోరాటం. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. –జి.జ్యోతి, క్లస్టర్ మొబైల్ టీచర్ -
పేద గిరిజనులకు 170 ఎకరాలు పంచాలి
నరసరావుపేట: బొల్లాపల్లి మండలం గండిగనుముల రెవెన్యూలోని సర్వే నంబర్ 430లో 170 ఎకరాలు పేద గిరిజనులకు పంచాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలసి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందిస్తూ విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రజాసంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ భూములు తండాలో ఉన్న భూమి లేని, వలసదారులకు కేటాయిస్తే తండాలో ఉండి వ్యవసాయం చేసుకొని జీవించే అవకాశం ఉంటుందని అన్నారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోటనాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.శ్రీనునాయక్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన నాయకులు అంజు నాయక్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు. -
కార్టూనిస్ట్ సుభానీకి అరుదైన గౌరవం
కారంచేడు: పొలిటికల్ కార్టూనిస్టు సుభాని షేక్కి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్లోని(ఆత్రేయపురం) బాపు రమణ అకాడమీ వారు సుభానీ ప్రతిభను గుర్తించి బాపు అవార్డును ప్రకటించింది. వివరాలు.. కారంచేడు గ్రామంలో 1961లో జన్మించారు. ప్రాథమిక విద్యను కారంచేడులోను, కాలేజ్ విద్యను సమీపంలోని చీరాలలో పూర్తి చేశారు. మాస్టర్స్ డిగ్రీని గుజరాత్లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి కార్టూన్లపై ఉన్న మక్కువతో ఆయన హైదరాబాద్లోని ఆంధ్ర భూమి వారపత్రికలో 1985లో జాయిన్ అయ్యారు. 1988 వరకు అక్కడే ఉన్న ఆయనను 1991లో వరకు పొలిటికల్ కార్టూనిస్ట్గా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి సౌత్ ఇండియాలోనే ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన దక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గాను, తరువాత కార్టూన్ ఎడిటర్గాను అంచలంచలుగా ఎదిగారు. 40 సంవత్సరాల తన సర్వీస్లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
పత్తి రైతుల ‘యాప్’ సోపాలు!
సత్తెనపల్లి: పత్తిని మద్దతు ధరకు విక్రయించుకునేందుకు అన్నదాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతుంది. పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నా యి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), మార్కెటింగ్ శా ఖ అధికారులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు చోద్యంచూస్తున్నారు. స్లాట్ బుకింగ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతిరోజూ ఉద యం 10 గంటలకు స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు, ఎర్రర్ వంటివి కనిపిస్తున్నాయి. ఇదేమి మాయనో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. యా ప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తు న్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతికతతో ఇబ్బందులు... జిల్లాలో 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ గా ప్రస్తుతం సత్తెనపల్లి, నరసరావుపేట, క్రోసూ రు, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఏడు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేపడుతున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసు కోవచ్చు. వారం రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతులు అన్ని పనులు వదిలిపెట్టి పత్తిని మద్దతు దరకు అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంట ర్లు, రైతు సేవా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమందికి రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగ్గా లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చని యాప్ లోనే ఉంది. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు వస్తే వెంట నే వాట్సాప్ గ్రూప్లో తెలియ చేయగానే యంత్రాంగం పరిష్కారం చేస్తున్నారు. ఎప్పటికప్పు డు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 37 నుంచి 39 వరకు స్లాట్లు బుక్ అవుతున్నాయి. వీఏఓలు అందుబాటులో ఉండి కో–ఆర్డినేట్ చేస్తున్నారు. – ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, సత్తెనపల్లి -
హత్య కేసులో నిందితుల అరెస్టు
నరసరావుపేట టౌన్: స్వల్ప వివాద నేపథ్యంలో ఓ వ్యక్తిని కాళ్లతో, చేతులతో విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డిఎస్పీ ఎం. హనుమంతరావు తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈపూరు మండలం అంగుళూరు గ్రామానికి చెందిన అచ్చు కట్ల రాంబాబు ఈనెల 10వ తేదీ సాయంత్రం వినుకొండ పట్టణంలో నిందితులు ఓ మద్యం షాపు వద్ద ఉండగా దారిన పోతూ ఉమ్మి వేశాడని దాంతో తమను చూసి ఉమ్మి వేసినట్లుగా వాళ్లు భావించి వివాదానికి దిగారన్నారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిందితులలో ఒకరిపై చేయి చేసుకోవడంతో నలుగురు కలిసి రాంబాబుపై విచక్షణరహితంగా కాళ్లు చేతులతో దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన రాంబాబు చికిత్స పొందుతూ 13వ తేదీ వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో మృతి చెందాడన్నారు. గుండె, లివర్లపై తగిలిన బలమైన దెబ్బలతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఈ ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ ఫుటేజ్ ఆధారంగా వినుకొండ పట్టణానికి చెందిన పల్లె మరియబాబు, పల్లె వినయ్లతో పాటు మరో ఇద్దరు మైనర్ యువకులు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో వినుకొండ పట్టణ సీఐ బలగాని ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
దత్తత మరో మార్గం!
మాతృత్వం ఓ వరం.. సత్తెనపల్లి: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్ట రీత్యా నేరం. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. అక్రమ మార్గాలను ఎంచుకొని చిక్కుల్లో పడుతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటిన ప్రారంభమైన జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఈ నెల 30 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 24న సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిశు గృహ కేంద్ర అధికారులు దత్తత ఏ విధంగా పొందాలి. దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అనధికార దత్తత చెల్లదు... కొందరు బంధువులకు చెందిన పిల్లలను, తెలిసిన వారి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారు. తీసుకున్న వారికి జేజే యాక్ట్ సెక్షన్ 81 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం... దత్తత కోరే తల్లిదండ్రులు తొలుత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్ఐసీ.ఇన్ వెబ్ సైట్లో దరఖాస్తు నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లోడ్ చేయాల్సిన పత్రాలు ... భార్యాభర్తల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువపత్రం, సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ పత్రం, దీర్ఘకాలిక అంటూ వ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడలేదని, దత్తత తీసుకోవడానికి అర్హులని ధ్రువీకరిస్తూ మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. -
పల్నాడు
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 584.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,765 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 4,227 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.కారెంపూడి: కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా శనివారం వీరుల గుడి ఆవరణలో కోడిపోరు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ముందుగా వీర విద్యావంతు లు కోడిపోరు కథాగానం చేశారు. తర్వాత బండ్ల గణేష్ ఒక పుంజును మరొకరు మరో పుంజును బరి లోకి వదిలారు. రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు గెలిచిందని మూడో పందెంలో బ్రహ్మనాయు డు పుంజు ఓడిందని ప్రకటించారు. పీఠాధిపతి పిడు గు తరుణ్ చెన్నకేశవ బ్రహ్మనాయుడు పాత్రలో మరొ కరు నాయకురాలు నాగమ్మ పాత్రను పోషించారు. రణక్షేత్రంలో గ్రామోత్సవాల సందడి వీరుల ఆయుధాలతో వీరాచారులు పౌరుషంతో ఊగిపోయారు. అలనాటి వీరుల ఆయుధాలతో వీరంగమాడారు. కత్తులతో విన్యాసాలు చేశారు. వీరుల ఆయుధాలను వారిపై వాల్చి ఆవేశాన్ని తగ్గించారు. పాత కారెంపూడి బజార్లన్నింటిలో గ్రామోత్సవాలు కొనసాగాయి. గ్రామస్తులంతా ప్రతి ఇంటి వద్ద వారు పోసి కొబ్బరికాయలు కొట్టి పూల దండలు వేసి వీరులకు నీరాజనాలు పలికారు. వీరాచారులు ఆయుధా లను వారిపై వాల్చి ఆశీర్వాదం అందించారు. ఉద యాన్నే వీరుల గుడి నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు చేసుకున్నారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత నుంచి గ్రామోత్సవానికి వీరుల ఆయుధాలు బయలుదేరాయి. మొదట తోట బజారులో ఉన్న బ్రహ్మనాయుడు మేడ వద్దకు ఆయుధాలన్నీ తరలివెళ్లాయి. సంప్రదాయ కత్తి విన్యాసాలు చేశారు. ఆ ప్రాంత వాసులంతా పల్నాటి వీరులకు నీరాజనాలు పట్టారు. ఆ బజారులోనే వీరుల ఆయుధాలు ప్రతి గడప నుంచి పూజలందుకున్నాయి. గ్రామోత్సవం పూర్తయ్యే సరికి అర్థరాత్రి దాటే అవ కాశం కన్పిస్తోంది. కోట బురుజు సమీపంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి హారతులిచ్చారు. ఉదయాన్నే వీరాచారులు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత నుంచి గ్రామోత్స వా లు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు చేసుకుని అంకాలమ్మ తల్లి చెన్నకేశవస్వామి నైవే ద్యం అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరాచారు లతో పాటు ప్రజల వేలాదిగా ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఉత్సవాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలసి వీరుల గుడిలో ఆయుధాలకు పూజలు చేశా రు. అనంతరం ఎడ్ల పోటీలను ప్రారంభించారు.బ్రహ్మనాయుడు మేడ వద్ద వీరుల ఆయుధాలకు పూజలుకోడిపుంజును వదులుతున్న బండ్ల గణేష్, వీక్షిస్తున్న ఎమ్మెల్యే జూలకంటి7ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కళ్లిపాడు నాడు వీరుల ఆయుధాలు కళ్లి పోతురాజు మండపం వద్ద కళ్లికి ఒరగడంతో ఉత్సవాలను ముగించి వీరాచారులు స్వగ్రామాలకు పయనం కానున్నారు. -
సతీష్కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట నాదెండ్ల: టీటీడీ పరకామణి విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్కుమార్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని నాదెండ్ల పీఏసీఎస్ మాజీ సీఈవో, పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట చిన్నఅంజయ్య డిమాండ్ చేశారు. విధుల్లో నిజాయితీగా సేవలందిస్తూ, పరకామణిలో అవకతవకలు వెలుగులోకి తెచ్చిన సతీష్కుమార్ సేవ లు ఎనలేనివన్నారు. ఆయన మరణంపై ప్రభు త్వం పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, సతీష్కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మధుబాబు మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా అర్బనన్ డెవలప్మెంట్ అథారిటీ(పీఏయూడీఏ)చైర్మనన్గా్ నియోజకవర్గ టీడీపీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు నియమితులయ్యారు. 2012లో జరిగిన మాచర్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మధుబాబు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. మధుబాబు నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీకి చేసిన సేవలకు గానూ పదవి వరించిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, మధుబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర బట్రాజ కార్పొరేషన్ చైర్మన్గా సరికొండ సత్తెనపల్లి: ఏపీ బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 12వ వార్డు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు అలియాస్ మార్కెట్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం 11 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రకటించింది. సరికొండ వెంకటేశ్వరరాజుకు బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించింది. వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వరరాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి నందనలు తెలిపారు. -
ద్రోణాదుల యువకుడి అరుదైన ఘనత
మార్టూరు: గత దశాబ్దకాలంగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మండలంలోని ద్రోణాదుల గ్రామానికి చెందిన పెంట్యాల ధర్మతేజ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన అట్లాంటా యూనివర్సిటీ నుంచి ధర్మ తేజ ఈనెల 21వ తేదీ డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ధర్మతేజ విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ధోరణులు, వ్యాపార వ్యూహాలు, సృజనాత్మక నాయకత్వాన్ని సమ్మేళనం చేస్తూ తాను సమర్పించిన వ్యాసాలకుగాను అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నట్లు తెలిపారు. అట్లాంటా కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో తనకు ప్రదానం చేసినట్లు వివరించారు. డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా సాధించిన ధర్మతేజ -
రైతులు క్లస్టర్ విధానం అవలంబించాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లానరసరావుపేట: జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎఫ్పీఓ రైతులకు మునగ విత్తనాలు, సంక్షేమ హాస్టళ్లకు కంప్యూటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పంట ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకూ అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు. రైతులకు మునగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి, సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని, పది కాలాలపాటూ రైతులకు ఆదాయానిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో ఇన్పోసిస్ అందజేసిన కంప్యూటర్లు, దుప్పట్లను సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ మురళి, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ–వార్డు సచివాలయ సెక్రెటరీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొనాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
నకరికల్లు:స్థానిక శ్రీలక్ష్మీనర్సింహస్వామి కొండ వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టామహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో కొండ ప్రారంభంలో స్వామివారి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అర్చకుడు కొడవటికంటి మధుసూధనాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేశారు. భక్తుల సహకారంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శనివారం తెలిపారు. గుంటూరు సుదర్శిని నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అమరావతి:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి లోని శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తికమాసం అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.చంద్రశేఖరరావు సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ అమరేశ్వరునికి ఈ కార్తిక మాసంలో రూ.1,57,82,956 ఆదాయం వచ్చిందన్నారు. ఈ నగదు మొత్తాన్ని దేవాలయ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నామని తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈనెల 28, 29 ,30వ తేదీల్లో జరగనున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 71వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లవరపు పవన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఏఎన్యూ ప్రధాన ద్వారం వద్ద జాతీయ మహాసభల ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. పవన్కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ దేశవ్యాప్తంగా విద్య, యువత, జాతీయత ఆధారంగా విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్ గంగాధర్, ఏఎన్యూ విభాగ ఉపాధ్యక్షుడు రామ్, కార్యదర్శి వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తిగా బాపట్ల 6వ జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి శ్యాంబాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన డాక్టర్ ఎన్.సత్యశ్రీ అనంతపురం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎవ్వరినీ నియమించక పోవడంతో బాపట్ల ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తిని ఇన్చార్జిగా నియమించారు. -
సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను అభివృద్ధి చేస్తాం
బాపట్ల: సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ను ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ శనివారం పరిశీలించారు. రిసార్ట్స్లో లభ్యమయ్యే వసతి సదుపాయా లు, బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సౌకర్యా లు, పర్యాటకులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆయన సూర్యలంకను ఆకర్షణీయమై న పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రిసార్ట్స్ సౌకర్యాల విస్తరణ, భద్రతా ఏర్పాట్ల మెరుగుదల, పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యే క ప్యాకేజీల రూపకల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారాంతాలు, సెలవుదినాల్లో పెరిగే పర్యాటక రద్దీ దృష్ట్యా సేవల నాణ్యత, పరిశుభ్రత, జనసంచారం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టోల్ వసూలుపై అసంతృప్తి సూర్యలంక వెళ్తున్న చైర్మన్ వాహనాన్ని టోల్ వసూలు పేరుతో నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. టూరిజం ప్రాంతానికి వచ్చే వాహ నాలపై టోల్ వసూలు చేయడం సరికా దని, ఈ అంశంపై కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. పంచా యతీ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారన్న విషయంపై ఎలా వసూలు చేస్తున్నారు, దానికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలన్నారు. -
బరువెక్కిన హృదయాలతో అంతిమ యాత్ర
కారంచేడు:తన కాళ్లపై తాను నిలబడుతూ.. తమకు కూడా అండగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు ఆ కన్నకూతురు విగతజీవిగా ఇంటికి చేరింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు, తోబుట్టువు గండెలవిసేలా రోదించారు. బరువెక్కిన గుండెలతో అంతిమ సంస్కారాలు నిర్వహించా రు. బాపట్ల జిల్లా కారంచేడు స్టేట్ బ్యాంక్ ఎదురు బజారుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారి లకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండెకరాల సాగుభూమితో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడంతో పా టు, బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి రామకృష్ణ శ్రమించా రు. కుమారుడు చిన్న ఉద్యోగం సంపా దించుకుంటే.. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23)ని బీటెక్ పూర్తి అయిన తరువాత అప్పులు చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు. అక్కడ ఎంఎస్ పూర్తిచేసింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఈ నెల 7న ఛాతీలో నొప్పి, కొద్దిగా దగ్గు రావడంతో సాధారణమని భావించి చికిత్స తీసుకోలేదు. ఎప్పటిమాదిరిగానే నిద్రపోయిన ఆమె మరుసటి రోజు తిరిగి లేవలేదు. విషయం గమనించిన స్నేహితులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి వారు చాలా కష్టపడి నిధులు సేకరించారు. 14 రోజుల తర్వాత శుక్రవారం మృతదేహాన్ని కారంచేడులోని ఇంటికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతు రు విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ తల్లితండ్రులు, సోదరుడు తల్లడిల్లిపోయారు.కదలివచ్చిన ఊరురాజ్యలక్ష్మి మృతదేహం గ్రామానికి వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు, ఆమె బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. కడసారిగా ఆమె చివరి చూపును సూసేందుకు వచ్చిన గ్రామస్తులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రతి ఒక్కరూ రాజ్యలక్ష్మికి కన్నీటి వీడ్కోలు పలికారు. -
మద్దతు ధరకు పత్తి కొనుగోలు
జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు క్రోసూరు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8110 ఇస్తున్నట్లు, ఈ–పంటలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే తమ పత్తిని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునే అవకాశం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. మండలంలోని పీసపాడు, ఎర్రబాలెం గ్రామాలను జిల్లా వ్యవసాయాధికారి శుక్రవారం సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు. రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి తమ వివరాలను యాప్లో నమోదు చేయించుకోవాలన్నారు. తమకు ఇష్టమైన కొనుగోలు కేంద్రాన్ని, పత్తిని తీసుకువచ్చే తేదీని ఎంపిక చేసుకొని ఆ వివరాలను కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేయాలన్నారు. యాప్లో నమోదు చేసుకున్న తర్వాత తేదీ ప్రకారం ఎంపిక చేసుకున్న జిన్నింగ్ మిల్లుకు పత్తిని తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు. వీలుకాని పక్షంలో ముందు రోజు బుకింగ్ను రద్దు చేసుకోవచ్చన్నారు. మార్కెట్ యార్డులోని జీడీసీఎంసీ ఎరువుల అమ్మకం కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ఎరువుల నిల్వలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, రైతు సేవా కేంద్ర సిబ్బంది సుబ్బారావు (పీసపాడు), సౌజన్య (ఎరబ్రాలెం), ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
నెల్లూరు జిల్లాలో పట్టుబడిన గంజాయి ధ్వంసం
యడ్లపాడు: ప్రజా ఆరోగ్య భద్రత కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపుతున్నట్లు నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీగా పట్టుబడిని గంజాయి, నిషేధిత మాదక ద్రవ్యాలను శుక్రవారం అధికారులు ధ్వంసం చేశారు. యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్లో మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య వివరాలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో 61 కేసులు ద్వారా ఎకై ్సజ్శాఖ స్వాధీనం చేసుకున్న నిషేధిత మాదక ద్రవ్యాలను ఈ ఏడాది జులై 9న నిర్వహించిన డీడీసీ సమావేశంలో వీటిని ధ్వంసం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ మేరకు తాము స్వాధీనం చేసుకున్న డ్రై గంజాయి 751.586 కిలోలు, 3.2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు కలిగిన గంజాయి మొక్కలు, 950 గ్రాములు హషీష్ ఆయిల్ ప్లాంట్కు తరలించి ధ్వంసం చేశారు. పర్యావరణ ప్రమాణాలు పాటిస్తూ విజయవాడలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు వీటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిస్పోజిల్ కమిటీ సభ్యులుగా నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య, అసిస్టెంట్ కమిషనర్ పి దయాసాగర్, ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ కె విజయ్ వ్యవహరించారు. ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీర్ ఎం అజీనాబేగం, నెల్లూరు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె రమేష్, అదే జిల్లాలోని తొమ్మిది ఎకై ్సజ్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, సిబ్బంది, ఏపీ ఆపరేషన్ టీం ప్రెసిడెంట్ ఎంవీ చారి, సిబ్బంది, కొండవీడు వీఆర్వో దండా కృష్ణ చైతన్యం, వీఆర్ఏ కూచిపూడి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్స్ విజేత హుజూర్నగర్ ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శుక్రవారం సీనియర్స్ విభాగంలో పోటీలు రసవత్తరంగా జరిగాయి. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. హుజూర్నగర్కు చెందిన సుంకే సురేంద్రరెడ్డి ఎడ్ల జత బండను 2,330 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి కంబైన్డ్ జత, తృతీయ బహుమతిని విజయవాడకు చెందిన పొందుగల ఈశ్వర్ ఎడ్ల జత, నాలుగవ బహుమతిని నంద్యాల జిల్లా గోస్పాడుకు చెందిన గోటికా హేత్విక్రెడ్డి, దినేష్రెడ్డి కంబైన్డ్ జత, ఐదో బహుమతిని బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరస్వామిచౌదరి ఎడ్ల జత, ఆరవ బహుమతిని ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. బహుమతి దాతలు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చెల్లెలు నాగలక్ష్మి, పంగులూరి పుల్లయ్య, బ్రాంది షాష్స్ అసోషియేషన్, బొమ్మిన శేషగిరిరావు అండ్ సన్స్, శ్రీకృష్ణ కోల్డ్ స్టోరేజి, బాలాజీ హీరో షోరూమ్, కల్లుట్ల రమేష్, మాడిశెట్టి నరసింహారావు, మిరియాల వెంకటేశ్వర్లులు ప్రదానం చేశారు. కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు, బొమ్మిన శేషగిరిరావు, నాగారపు రాముడు, పలిశెట్టి హనుమంతరావు, పలిశెట్టి శ్రీను, చింతపల్లి రామ్మూర్తి, కార్యనిర్వాహక సభ్యులు కర్నా సైదారావు, పలిశెట్టి కోటేశ్వరరావు, సంగినేడి బాలకృస్ణ, తోట శ్రీను. పలిశెట్టి రాఘవ, తోట అబ్బాయి, పలిశెట్టి కొండ, జక్కా నరసింహారావు, జక్కా వీరయ్య పురంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పోటీల నిర్వహణలో పాల్గొన్నారు. -
610 గ్రాముల బంగారం స్వాధీనం
చోరీ కేసులో నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. రూ.80 లక్షల విలువైన 610 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. రెండు ల్యాప్టాప్లు, ఐదు గడియారాలతోపాటు చోరీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన ఆటోలు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లోనే చోరీ కేసును ఛేదించిన ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు, వన్టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐ పి.వంశీకృష్ణ, ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఇతర సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
చోరీల మిస్టరీని ఛేదించిన పోలీసులు
నరసరావుపేటరూరల్: నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో వరుస చోరీల మిస్టరీని పోలీసులు ఛేదించారు. చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు వస్తువులు, ఆటో, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వివరాలు వెల్లడించారు. నరసరావుపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రకాష్నగర్ ఆర్అండ్బీ ఆఫీసు సమీపంలో నివసిస్తున్న గడిపూడి సుబ్బారావు దంపతులు ఈనెల 4వ తేదీన ఇంటికి తాళాలు వేసి రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలోని తమ కుమార్తె వద్దకు వెళ్లారు. ఈనెల 9వ తేదీన తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి బంగారు నగలు దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసి వన్టౌన్ పోలీసులు సీఐ ఎస్కే టి ఫిరోజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంటి సమీపంలోని సీసీ టీవీ పుటేజ్ను పరిశీలించి నలుగురు నిందితులను గుర్తించారు. నరసరావుపేట బరంపేటకు చెందిన పేరేచర్ల వంశీ, మాచర్లకు చెందిన బండారు బాలయ్య, నరసరావుపేట పెదచెరువుకు చెందిన వేముల తిరుపతిరావు, మీసాల రాజేష్లను ఈనెల 20వ తేదీన గురువారం అరెస్ట్ చేశారు. కూలి పనులు చేసుకుంటూ రెక్కీ చోరీ కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులపై ఇప్పటి వరకు ఎటువంటి నేరచరిత్ర లేదని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. భవన నిర్మాణ పనుల్లో నలుగురు కూలీలుగా పనిచేస్తుంటారని వివరించారు. పనులకు వెళ్లే సమయంలో తాళాలు వేసి ఉన్న ఇంటిని గుర్తించడం తరువాత రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ఆరు నెలల్లో ఆరు చోరీలకు నలుగురు ముఠా పాల్పడినట్టు తెలిపారు. నరసరావుపేట టూటౌన్, నరసరావుపేట వన్టౌన్, నరసరావుపేట రూరల్లో రెండు, వినుకొండలో రెండు చోరీలకు ఈ ముఠా సభ్యులు పాల్పడ్డారని వివరించారు. -
సత్రశాలలో జిల్లా అదనపు సీనియర్ జడ్జి ప్రియదర్శిని పూజలు
సత్రశాల(రెంటచింతల): సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో 10వ అదనపు జిల్లా సీనియర్ జడ్జి ప్రియదర్శిని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ముందుగా దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేల శివశర్మ నేతృత్వంలో జడ్జి ప్రియదర్శినికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. పోలి పాడ్యమిని పురస్కరించుకుని దేవస్థానం సమీపంలో ప్రతిష్టించిన కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టి పవిత్ర కృష్ణానదిలో నదీమ తల్లికి హారతులిచ్చారు. ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి దేవస్థానం చరిత్రను జడ్జికి వివరించారు. -
సాయం అందలేదు
● అన్నదాత సుఖీభవ పథకంలో అన్యాయం ● రెండో విడతలోనూ బాబు సర్కారు మొండిచేయి ● జిల్లాలో 1.60 లక్షల మంది కౌలు రైతులు ● వర్తించని ప్రభుత్వ పథకాలు, రాయితీలు ● పండించిన పంట చేతికి అందక అవస్థలు సత్తెనపల్లి: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తరువాత మొదటి సంవత్సరం పథకం వర్తింప చేయలేదు. ప్రస్తుతం రెండో సంవత్సరంలోనూ మొండి చేయి చూపిందనే విమర్శలు ఉన్నాయి. కౌలు రైతుల సంగతి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనం సమకూరడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులు... జిల్లాలో సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులు పొలాలు సాగు చేస్తుండగా, కేవలం 67 వేల మందికి మాత్రమే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు(సీసీఆర్) పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 57 వేల మందికి మాత్రమే సీసీఆర్ కార్డుల పంపిణీ జరిగింది. సీసీఆర్ కార్డులు పొందిన కౌలు రైతులకు సైతం ఇప్పటికీ ఎటువంటి ప్రయోజనం సమకూరలేదు. సీసీఆర్ కార్డు లేని వారు సుమారు 1.03 లక్షల మంది వరకు ఉంటారని కౌలు రైతులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కౌలు రైతులకు లబ్ధి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు అన్ని విధాల అండగా నిలిచేది. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసా పేరిట సాయం అందించింది. పంట నష్టం జరిగినప్పుడు కౌలు రైతుల ఖాతాలకు పరిహారం జమ చేసేది. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో కౌలురైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం మొదటి ఏడాది సాయం ఎగ్గొట్టేసింది. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలు రైతులకు అందజేయలేదు. దీంతో జిల్లాలోని 1.60 లక్షల మంది కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను రెండు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సమయంలో చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అందకపోగా ప్రస్తుతం రెండో విడతలోనూ అందలేదు. కౌలు రైతులకు సాయం అందించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – జంగం కోటయ్య, కౌలు రైతు, రాజుపాలెం కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి. మోంథా తుఫాన్ నష్టపరిహారం కూడా కౌలు రైతులందరికీ వర్తింప చేయాలి. మిగిలిపోయిన కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులు అందించి పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. –పెండ్యాల మహేష్, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, పల్నాడు -
జై చెన్నకేశవ ..మార్మోగిన పల్నాటి రణక్షేత్రం
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం రణక్షేత్రం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. గోవింద నామస్మరణలు, జై చెన్నకేశవ నినాదాలు మిన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సకల వీరాచారులంతా ఆయుధాలను చేతపట్టి కదం తొక్కారు. సంప్రదాయ డోలు సన్నాయిమేళాలు, వెనుక వీరుల ఆయుధాలతో వీరంగమాడుతూ వీరాచారులు, ఆ వెనుక అంకమ్మ బుట్టలతో పొంగళ్లతో మహిళలు గ్రామోత్సవాలు నిర్వహించారు. చెన్నకేశవస్వామి అంకాలమ్మ తల్లి గుడుల వైపు కదిలారు. ఆలయాల నుంచి బయటకు వచ్చిన వారు ఒక్కరుగా కత్తి సేవ లు చేసుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆచారం ఉన్న వారంతా కత్తులను గుండెలపై మోదుకుంటూ గోవింద నామస్మరణ చేశారు. అంకాలమ్మ తల్లి గుడిలో చెన్నకేశవస్వామి ఆలయం వెలుపల, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు కొనసాగాయి. మహిళలు పొంగళ్లు చేసుకుని సమర్పించారు. నాగులేరు ఒడ్డున వీరుల గుడిలో పొంగళ్లు చేసుకుని ప్రధాన గ్రామోత్సవంతో కదలలేని వారు విడివిడిగా మొక్కులు చెల్లించారు. రాత్రికి మందపోరు కథాగానాన్ని వీరాచారులు ఆలపించారు.అత్యంత రక్తసిక్తమైన మందపోరు యుద్ధాన్ని అత్యంత హృద్యంగా ఆలపించారు. నేడు కోడిపోరు పల్నాటి ఉత్సవాలు ఐదు రోజుల్లో ప్రధానమైన కోడిపోరు ఉత్సవం శనివారం జరగనుంది. వీరుల గుడి ఆవరణలో అలనాడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల మధ్య జరిగిన కోడిపోరును నాటకీయంగా ప్రదర్శించనున్నారు. వీర విద్యావంతులు కోడిపోరు కథాగానం చేస్తారు. ఆదివారం కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి. మందపోరు నాడు ఉప్పొంగిన భక్తిపారవశ్యం -
బాల్య వివాహాలతో అనర్థాలు
బెల్లంకొండ: బాల్య వివాహాలు చేయడం ద్వారా ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శౌరిరాజు పేర్కొన్నారు. శుక్రవారం బెల్లంకొండలో గ్రామస్థాయి బాల్య వివాహాల నిరోధక, పర్యవేక్షణ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు. బాల్య వివాహాల ద్వారా మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం, మాతా శిశు మరణాలకు దారితీస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం గ్రామస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ గడిపర్తి జ్యోతి సముద్రం, పంచాయతీ కార్యదర్శి గిరిధర్రెడ్డి, ఏఎన్ఎం విజయలక్ష్మి, వీఆర్వో ముక్కంటి, అంగన్వాడీ పార్వతి, ఎన్జీవో సభ్యుడు దుగ్గి శామ్యూల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శౌరిరాజు -
తాకట్టు బంగారం బాధితులకు పరిష్కారం
దొడ్లేరు(క్రోసూరు): రెండు సంవత్సరాల క్రితం దొడ్లేరు చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు నందు ఖాతాదారులు తాకట్టు పెట్టుకున్న బంగారు ఆభరణాలు గోల్మాల్ కాగా విచారణ అనంతరం సమస్యను పరిష్కరించినట్లు బ్యాంకు రీజనల్ మేనేజర్ గురువారం తెలిపారు. 2023ఆగస్టులో బ్యాంకులో 505 మంది ఖాతాదారులకు చెందిన తాకట్టు బంగారు ఆభరణాలలో అవతవకలు జరిగాయి. బాధితులు అనేకమార్లు బ్యాంకు ఎదుట ఆందోళన చేయటం జరిగింది. దీనిపై సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, క్రోసూరు సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు గోల్మాల్ అయిన ఆభరణాల విషయంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 505 మంది ఖాతాదారులకు సంబంధించిన ఆభరాణాలపై విచారణ చేపట్టిన ప్రక్రియలో గత ఏడాది 401 మంది బాధితులందరికీ రూ.2.5 కోట్లు పరిష్కరించినట్లు బ్యాకు రీజనల్ మేనేజరు పి.సుభాష్, బ్యాంకు మేనేజరు శివశంకర్ నాయక్ వివరించారు. అదేవిధంగా మరో 104 మంది ఖాతాదారులకు రూ.కోటి రూపాయలు చెల్లించి సమస్య గురువారం పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం 505 మంది ఖాతాదారులకు రూ.3.5 కోట్లు బ్యాంకు అందచేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకులో లావాదేవీలు జరగని ఖాతాదారులకు... ఈ సందర్భంగా రీజనల్ మేనేజరు విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ ఆదేశాల మేరకు తమ బ్యాంకు లో గత పది సంవత్సరాలు గా 1818 ఖాతాదారులకు చెందిన నగదు రూ.23 లక్షలు ఉండిపోయాయన్నారు. వారు లేదా వారి వారసులు వచ్చి తమ జాబితా చూసుకుని వారి నగదు తీసుకెళ్లాలని కోరారు. -
టీస్టాల్ నిర్వాహకుడిపై కత్తితో దాడి
నరసరావుపేట టౌన్: టీస్టాల్ నిర్వాహకుడిపై వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చాకిరాల మిట్టకు చెందిన ముట్టుకూరు మణికంఠ సత్తెనపల్లి రోడ్డులో సారిక టీ స్టాల్ నిర్వహిస్తుంటాడు. సాయంత్రం దుకాణంలో టీ కాస్తుండగా వెనుక నుంచి వచ్చిన సుబ్బారావు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో మణికంఠ తల వెనుక భాగంలో రక్త గాయమైంది. క్షతగాత్రుడిని సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. అనంతవరం(క్రోసూరు): మండలంలోని అనంతవరం గ్రామంలో సిమెంట్ పనులకు వెళ్లే కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... గ్రామానికి చెందిన ఉసిరికాయల నరసింహారావు ఉరఫ్ ముసలయ్య (54) గ్రామంలో ఇంటి నిర్మాణ పనుల్లో కూలి పనికి వెళ్లాడు. పని నిమిత్తం ఇంటిపైకి వెళ్లగా ఇంటిపైన 11కేవీ విద్యుత్ తీగలు ఉండటంతో విద్యాదాఘాతానికి గురై అక్కడి నుంచి కిందపడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరాపై దృష్టి సారించాలి
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి నరసరావుపేట రూరల్: విద్యుత్ సమస్యలను పరిష్కరించి నిరంతరాయంగా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. జొన్నలగడ్డలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం పల్నాడు సర్కిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేవిధంగా చూడాలన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యుత్ శాఖ పనితీరుపై ప్రభుత్వం చేపట్టిన సర్వేలో సంతృప్తి స్థాయిలో స్పందన వచ్చిందన్నారు. వినియోగదారులు నూరు శాతం సంతృప్తి చెందేలా సిబ్బంది పనితీరు కల్పించాలని తెలిపారు. ఆపరేషన్స్, నిర్వహణలో సిబ్బంది పనితీరుపై స్పష్టత ఉండాలని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేస్తే మెరుగైన సరఫరా ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ అమర్చే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. దీంతోపాటు కుసుమ్ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకంపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు ఎ.మురళీకృష్ణ యాదవ్, టీవీఎస్ఎన్ మూర్తి, వెంకటేశ్వర్లు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి డాక్టర్ పత్తిపాటి విజయ్కుమార్, పల్నాడు సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
చలికాలం .. జర భద్రం
●గత వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రత ● జిల్లాలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు ● ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ●జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు సత్తెనపల్లి: చలి పంజా విసురుతున్న పరిస్థితి జిల్లా అంతటా కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఉదయం, రాత్రి చల్లటి గాలులు వీస్తున్నాయి. వాతావరణం చల్లబడి శీతాకాలం పూర్తి స్థాయిలో ఆవరించింది. జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు వీడకపోవడం, సాయంత్రం ఐద గంటలకే చీకటి పడటం కనిపిస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతల మార్పుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు, పాలు, కూరగాయలు, ఆకు కూరలు విక్రయించేవారు, పేపర్లు వేసేవారు, టీ, అల్పాహార దుకాణదారులు రక్షణ కవచాలు ధరించి కూడా వణుకుతూనే జీవన పోరాటానికి వెళుతున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు... చలి కారణంగా జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకై టిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. వృద్ధులలో కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ అర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అలాగే చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్య లు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోయి, ప్రాణాంతకమైన హైపోథెర్మియాకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు... చలితీవ్రత పెరిగిన దృష్ట్యా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ● ఉదయం, సాయంత్రం వేళల్లో ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి తొడుగులు ధరించడం తప్పనిసరి. ● బయటకు వెళ్లేటప్పుడు శరీరమంతా కప్పి ఉంచేలా చూసుకోవాలి. ● శరీరానికి వేడినిచ్చే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేడి పాలు, సూప్లు, హెర్బల్ టీలు తాగటం మంచిది. ● చలిమంటలు కాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను అగ్రి ప్రమాదాల నుంచి దూరంగా ఉంచాలి. ● రాత్రి పడుకునేటప్పుడు గదిని వెచ్చగా ఉంచుకోవాలి. వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా చలికి గురికాకుండా చూడాలి. ● శరీరంలో తేమ నిలిచి ఉండేందుకు మాయిశ్చరైజర్ వాడాలి. ● గోరువెచ్చని నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. ● చలి కారణంగా శరీరం గట్టిపడకుండా ఉండటానికి తేలికై న వ్యాయామాలు, నడక వంటివి చేయడం మంచిది. ● చలి సమయంలో దాహం తక్కువగా ఉన్నా కూడా రోజంతా నీటివి తాగడం అవసరం. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ● వెంటనే చల్లని వాతావరణంలో నుంచి వేడిగదిలోకి రావడం లేదా వేడి నుంచి ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి వెళ్లడం నివారించాలి. ● దమ్ము, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు ఉన్నవారు చలి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మందులు దగ్గర ఉంచుకుని, బయటకు వెళ్లడం తగ్గించాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను పాటించాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించు కోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. శ్వాస కోశ సమస్యతో ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యశాలలను సందర్శించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలిలో తిరగ కుండా చూసుకోవాలి. ప్రజలు బయటికి వచ్చే సమయంలో టోపీ, కండువా, చేతి తొడుగులు ధరించాలి. చర్మాన్ని కవర్ చేస్తూ .. జల నిరోధిత బూట్లు ధరించాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు అవసరమైతేనే బయటుకు రావాలి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దు. చలి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు -
పల్నాడు
శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 20257పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని బాలా త్రిపురసుందరి సమేత రాజరాజ నరేంద్రస్వామి ఆలయంలో కార్తికమాసం చివరిరోజు గురువారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఫిరంగిపురం: ఫిరంగిపురంలో కుష్ఠు వ్యాధిపై చేస్తున్న సర్వే తీరును గురువారం స్టేట్ సర్వేలెన్స్, ఇన్చార్జి లెప్రసీ జేడీ డాక్టర్ ఉషారాణి పరిశీలించారు. స్వర్శ లేని మచ్చలను గుర్తించాలన్నారు.నరసరావుపేట టౌన్: తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానని నమ్మబలికి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూ.9 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్ మొదటి వీధిలో కాకుమాను అయ్యప్ప నివాసం ఉంటున్నాడు. పది రోజుల కిందట అయ్యప్ప తాత కృష్ణమూర్తికు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను కేరళలో జేసీబీతో కొండ ప్రాంతంలో పనిచేస్తుండగా బంగారం దొరికిందని దాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికాడు. నాలుగు రోజుల కిందట నరసరావుపేటకు వచ్చి రెండు బంగారపు చిన్న గుండ్లు ఇచ్చి టెస్ట్ చేయించుకోవాలని చెప్పాడు. వాటిని కృష్ణమూర్తి టెస్ట్ చేయించగా బంగారం అని తేలింది. దీంతో అతని మాటలు నమ్మారు. రూ.9 లక్షలకు మూడు కేజీల బంగారం ఇస్తానని చెప్పటంతో ఈనెల 12వ తేదీ కృష్ణమూర్తి అతని మనవడు అయ్యప్ప ఇద్దరూ వెళ్లారు. బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో బస్సు దిగమన్నాడు. అతను చెప్పిన ప్రదేశంలో బస్సు దిగిన తర్వాత ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు వచ్చి మూడు కిలోలు ఉన్న బంగారం పూత ఉన్న ముద్దను ఇచ్చి రూ.9 లక్షల నగదు తీసుకొని వెళ్లారు. దాన్ని నరసరావుపేటకు తీసుకొచ్చి పరీక్ష చేయించగా నకిలీది అని తేలింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.యడ్లపాడు: వర్షం కురవడం ప్రతి జీవికి హర్షం. పంటలకై తే ప్రాణం. అదే వర్షం అధికమైతే యడ్లపాడు మండల ప్రజలకు అది జీవన్మరణ పోరాటంగా మారుతోంది. ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు..యడ్లపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. నక్క వాగు, ఉప్పవాగులు ఉగ్రరూపం దాల్చి, పంట పొలాలను ముంచి, ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం కరువైంది. యడ్లపాడు మండలంలో ప్రధానంగా నక్కవాగు పలు గ్రామాల గుండా ప్రవహిస్తుంది. వాగుకు కొన్ని చోట్ల కరకట్టలు లేకపోవడం, మరి కొన్నిచోట్ల గండ్లు పడటంతో వర్షం వచ్చిన ప్రతి సారీ వాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వచ్చే నీరు, కొండవీడు కొండలపై కురిసిన నీరు సైతం కొండవాగు రూపంలో వచ్చి చేరడంతో నక్కవాగు, దాని చీలిక అయిన ఉప్పవాగు భారీ ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి. వీటి వల్ల కాజ్వేలు, లోలెవల్ చప్టాలపై నుంచి నీరు ప్రవహిస్తూ పలు గ్రామాల మధ్య సంబంధాలను తెంచేస్తున్నాయి. నీటి మునుగుతున్న పంటలు.. మోంథా తుఫాన్ కారణంగా పలు రకాల పంటలు నీట మునిగి రైతులు పూర్తిగా నష్టపోగా, జల దిగ్భందంతో పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. కరకట్టల ను తెంచుకుని దూసుకొచ్చే ఈ వరద నీరు వందలాది పంటల్ని ముంచెత్తుతోంది. చెంఘీజ్ఖాన్పేట, సొలస, లింగారావుపాలెం, మైదవో లు, యడ్లపాడు, కారుచోల, గుత్తావారిపాలెంతోపాటు లోతట్టు ప్రాంతాలైన తిమ్మాపురం, దింతెనపాడు, జగ్గాపురం, జాలాది, సందెపూడి, గణేశుని వారిపాలెం, తుర్లపాడులో వెల్లువపడి నీరుతప్ప మరేమీ కనిపించని పరిస్థితి. ఏటా ఇలా జలగండంతో పంటలు నష్టపోయిరైతులు అప్పుల్లోకూరుకుపోతున్నారు. వాగుల వల్ల ఇబ్బందులు.. నక్కవాగు తొలిగా సొలస వద్ద ఉన్న లోలెవల్ కాజ్వే పైగుండా ప్రవహిస్తుంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. వాగు వెంబడి ఉన్న పంటపొలాలు నీట మునుగుతాయి. లింగారావుపాలెం గ్రామంలో పడమరవాగు ఒకవైపు, నక్కవాగు మరోవైపు ఊరిని చుట్టుముడతాయి. భారీ వర్షం కురిస్తే ఈ గ్రామంలోనూ రాకపోకలు స్తంభిస్తాయి. ఆ తర్వాత నక్కవాగు రెండు పాయలుగా చీలి ఒకటి తిమ్మాపురం, మరోకటి యడ్లపాడు వైపు ప్రవహిస్తాయి. మైదవోలు వద్ద నుంచి చీలే రెండోపాయనే ఉప్పవాగు అని పిలుస్తారు. తిరిగి ఈ రెండు పాయలు జగ్గాపురం గ్రామ శివారులో ఒక్కటవుతాయి. ఇక్కడే పలు రకాల కొండవాగులు కూడా వచ్చి ఈ వాగులో చేరతాయి. అసలే లోతట్టు ఆపై నలుదిక్కుల నుంచి వచ్చే నీటితో దిగువ ప్రాంతాలు, పంటపొలాలు అతలాకుతలమవుతాయి. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు మైదవోలులోని రామాలయం సమీపంలో, కారుచోల చెరువు పక్కనే ఉన్న రెండు చప్టాలు, కారుచోల–జాలాది మార్గంలోని చప్టా, జాలాది సచివాలయాల సమీపంలోని రెండు చప్టాలు, జాలాది–గణేశునివారిపాలెం మార్గంలోని నాలు గు చప్టాలు, జాలాది–వేలూరు, తుర్లపాడు–కొప్పర్రు మార్గాల్లో లోలెవల్ చప్టాలు ఉన్నాయి. అధిక వర్షాలు కురిస్తే చాలు ఆయా చప్టాలపై నుంచి నీరు వేగంగా ప్రవహిస్తూ ఆయా గ్రామాల మధ్య సంబంధాలను తెంచేస్తాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. సొలస వద్ద ఉన్న లోలెవల్ కాజ్వేలపై నుంచి నీరు ప్రవహిస్తూ ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభింపజేస్తా యి. లింగారావుపాలెం గ్రామాన్ని పడమర వా గు, నక్కవాగులు చుట్టుముట్టడంతో భారీ వర్షాల కు రాకపోకలు స్తంభిస్తాయి. తిమ్మాపురం, యడ్ల పాడు వైపు చీలి ప్రవహించే ఉప్పవాగు, నక్కవాగులు తిరిగి జగ్గాపురం శివారులో కలిసి లోతట్టు ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. -
విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించాలి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులు ప్రతి రోజూ కొంత సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. పల్నాడురోడ్డులోని శాఖా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో డీఈఓ చంద్రకళ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కథలు, సాంస్కృతిక, చరిత్ర పుస్తకాలను చదవటం వలన పాఠ్యపుస్తకాలలో లేని ఎన్నో విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. కథల పుస్తకాలు చదవటం ద్వారా నీతి తెలుసుకుంటారని వివరించారు. పుస్తకాలు చదువుతున్నప్పుడు జీవితంలో ఏదో సాధించాలనే కోరిక కలుగుతుందని తెలిపారు. గ్రంథాలయంలో సభ్యత్వం పొంది నచ్చిన పుస్తకాన్ని ఇంటికి తీసుకవెళ్లి చదవాలని సూచించారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం ద్వారా ప్రేరణ పొందుతారని తెలిపారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి డి.సునీత మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకం తగ్గించి గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవటం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వివరించారు. వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక, విజ్ఞాన పోటీలలో విజేతలకు బహుమతులు అందించా రు. గ్రంథాలయాధికారి యడ్లపాటి రాధ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అభ్యుదయ భారతి అధ్యక్షుడు రత్నాకరం రాము, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా కాశీ విశ్వేశ్వరస్వామి తెప్పోత్సవం
నకరికల్లు: శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి వారి తెప్పోత్సవం వేడుకలు గురువారం కనుల పండువగా సాగాయి. ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో పలుప్రాంతాల నుంచి సేకరించిన పూలతో అలంకరించిన హంస వాహనంపై స్వామివార్ల ఉత్సవమూర్తులు కొలువుదీరగా తెప్పోత్సవం సాగింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు కొమ్మవరపు పవన్కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేషపూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. -
జూనియర్స్ విజేత హైదరాబాద్ ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలలో భాగంగా గురువారం జూనియర్స్ విభాగంలో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. హైదరాబాదుకు చెందిన మేకా రామకృష్ణ, ప్రతీక్ ఎడ్ల జత 3,195 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్నాయి. ద్వితీయ బహుమతిని ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత, నాలుగవ బహుమతిని గుంటూరు జిల్లా లింగాయపాలేనికి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత, ఐదో బహుమతిని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్ చౌదరి ఎడ్ల జత, ఆరో బహుమతిని బాపట్ల జిల్లా రేపల్లెకి చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. బహుమతులను దాతలు పంగులూరి అంజయ్య, శిరిగిరి గోపాలరావు, గుండా వెంకట నరసింహారావు, నర్సింగ నాగేశ్వరరావు, చిరుమామిళ్ల రామలక్ష్మయ్య, పిన్నెల్లి అనంత రామయ్య, నాగారపు సుబ్బారావు సన్స్ రామకృష్ణ, పలిశెట్టి కోటేశ్వరరావు (మునసబు), నాగెండ్ల రామారావులు ప్రదానం చేశారు. -
ఎన్కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలి
నరసరావుపేట: మావోయిస్టు అగ్ర నాయకులు హిడ్మా, టేక్ శంకర్, పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. గురువారం పట్టణంలోని స్టేషన్రోడ్డు గాంధీపార్కు ఎదుట ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు మాట్లాడుతూ అల్లూరు జిల్లా మారేడుమల్లిలో అగ్ర నాయకులు హిడ్మా, అతడి భార్య రాజే మరో నలుగురు మావోయిస్టులు, ఆ మరుసటిరోజు టేక్ శంకర్తో సహా ఏడుగురు చొప్పున ఎన్కౌంటర్కు గురయ్యారన్నారు. వీటిపై ప్రజలకు అనుమానాలు ఉన్నందున న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కగార్ పేరుతో రెండేళ్ల నుంచి 720 మందికి పైగా ఆదివాసులు, మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో చంపిందన్నారు. దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం దారుణమన్నారు. ఇది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. మావోయిస్టులు, ఆదివాసులతో శాంతి చర్చలు నిర్వహించాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నారన్నారు. దేశ ప్రజలు మౌనం వీడి ఈ నరమేదాన్ని ఆపివేయాలని ఉద్యమించాలని కోరారు. దోపిడీ వ్యతిరేక పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్న, ప్రజా కళామండలి రాష్ట్ర నాయకురాలు ఉన్నం రాణి పాల్గొన్నారు. -
న్యాయస్థానం, ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యం
యడ్లపాడు: న్యాయస్థానం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారమే యడ్లపాడు లూథరన్ పాఠశాల భవిష్యత్ కార్యాచరణ ముందుకు సాగుతుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్, యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ తెలిపారు. రిటైర్డ్ కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్, ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ జోసఫ్ పీఎస్, రిటైర్డ్ జిల్లా జడ్జి, ఏఈఎల్సీ సెక్రటరీ కంట్రోలర్ జేసు రత్నకుమార్, ఏఈఎల్సీ అసిస్టెంట్ ప్రాపర్టీ ఆఫీసర్ డి లెనిన్ గురువారం స్థానిక లూథరన్ హైస్కూల్ను సందర్శించారు. పాఠశాల సమస్యలను జేసు రత్నకుమార్, హెచ్ఎం బీఎస్ పద్మలత వారికి వివరించారు. జిల్లా డీఈవో ఎల్ చంద్రకళ, పాఠశాల విద్య జిల్లా ఏడీ–2 ఉదయభాస్కర్, యడ్లపాడు తహసీల్దార్ జెట్టి విజయశ్రీ నుంచి పాఠశాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను తెలుసుకున్నారు. విద్యా, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి పాఠశాల భవనం, ఆట స్థలం, వెనుక ఉన్న ఖాళీ స్థలాలను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో డాక్టర్ జాషువా డానియేల్ మాట్లాడుతూ పునరుజ్జీవనానికి అవసరమైన చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరముందని కమిటీకి సూచించారు. పాఠశాల బలోపేతానికి విద్యార్థుల చేరిక కీలకమని, విద్యార్థులు లేకపోతే విద్యాశాఖ, ప్రభుత్వం నుంచి చట్టపరమైన సహాయం అందించే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. తాను కూడా లూథరన్ విద్యాసంస్థలో చదివిన విద్యార్థిగా, పాఠశాల అభివృద్ధికి వ్యక్తిగతంగా, మైనారిటీ కమిషన్ ద్వారా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చేరికల ప్రక్రియను చేపడితే పాఠశాల తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీవైఈవో ఎస్ఎం సుభాని, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, వీఆర్వోలు, ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువాడానియల్ లూథరన్ హైస్కూల్ సందర్శన -
తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత
నరసరావుపేట టౌన్: తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దచెరువు మూడు బావుల సెంటర్ వద్ద నివాసం ఉంటున్న నాలుగేళ్ల వేల్పూరి ఎస్తేరు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఈ మేరకు తల్లి వేల్పూరి మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ ఎస్ఐ లేఖాప్రియాంక సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాలంతా గాలించారు. బరంపేట శిశుమందిర్ వద్ద ఆచూకిని కనుగొని బాలికను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తప్పిపోయిన బాలికను వెతికి పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐను డీఎస్పీ హనుమంతరావు అభినందించారు. -
ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేయండి
చేబ్రోలు: ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ వివరించి చైతన్య పరచాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు అన్నారు. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించి చెత్త సంపద తయారీ కోసం సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ఎంపీడీఓ టి.ఊహారాణి, డిప్యూటీ ఎంపీడీఓ రవిశంకర్, సర్పంచ్ సాంబశివరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నాగాభరణం బహూకరణ
నకరికల్లు: నర్శింగపాడు గ్రామంలోని గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామికి నకరికల్లుకు చెందిన తిరువీధుల శ్రీనివాసరావు దంపతులు వెండి నాగాభరణాన్ని గురువారం సమర్పించారు. రూ.7.5 లక్షల విలువైన వెండి నాగాభరణాన్ని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తిరువీధుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కర్లపాలెం: చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దివ్య హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9 మంది వేద పండితులచే ఘనంగా హోమం జరిపించారు. కార్తికమాసం ఆఖరి రోజును పురస్కరించుకుని అమ్మవారికి శక్తి స్వరూపిణి అలంకారం చేశారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బాపట్లకు చెందిన విజయలక్ష్మి నాదస్వర బృందం మంగళవాయిద్యాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో తెనాలికి చెందిన రంగిశెట్టి రమేష్ రంచించిన రావమ్మ రావమ్మా బగళాముఖి అనే పాటను పృధ్వీ మనోజ్ చేత పాడించి ఆవిష్కరింపచేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి సభ్యులు పట్టాభిరామరావు, ప్రసాద్ తదితరులు ఉన్నారు. పెదకూరపాడు: రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా అమరావతి సత్తెనపల్లి మార్గంమధ్యలో ఉన్న పెదకూరపాడు రైల్వే గేటు 21, 22, 23 తేదీల్లో మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు పునరుద్ధస్తారని చెప్పారు. ప్రయాణికులు వేరే మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : నిర్మాణదారులు, వెండర్ల మధ్య అనుసంధానం కోసం నారెడ్కో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి మామిడి సీతారామయ్య తెలియజేశారు. గురువారం నగరంలోని ఓ హాటల్లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణదారులు, వెండర్ల మధ్య పరస్పర సహకారం, కమ్యూనికేషన్ను మరింత బలపరిచేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో నారెడ్కో ద్వారా నిర్మాణదారులకు, వినియోగదారులకు ఆధునిక నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరెడ్డి, చుక్కపల్లి రమేష్, క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ అంకారావు, సెక్రటరీ మాదాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వి. శ్రీనాథ్, ట్రెజరర్ సీహెచ్ తిరుపతయ్య, అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
సమస్యలకు ‘చెక్’ పెట్టాలంటే...
ప్రతిఏటా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్న మండల ప్రజలకు ఇకనైనా శాశ్వత పరిష్కారం చూ పాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. బలహీనంగా ఉన్న కరకట్టలను పటిష్టం చేయాలి. గండ్లు పడిన ప్రదేశాలలో మరమ్మతులు పూర్తిచేయా లి. వాగుల లోపలి వైపు, నీటి పరివాహక ప్రాంతాలలో ప్రవాహానికి అడ్డుపడే పిచ్చి మొక్కలు, ముళ్ల కంప పూర్తిగా తొలగించాలి. నీరు స్వేచ్ఛగా పారేలా మార్గాన్ని సుగమం చేయాలి. లోలెవల్ చప్టాల స్థానంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కనీ సం కాజ్వేలనైనా నిర్మించాలి. వేసవిలో వాగు లోప ల, అధిక నీరు చేరే ప్రాంతాలలో కరకట్టకు దూరంగా రీచార్జ్ పిట్లను, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. సమీప పంటపొలాల్లో చిన్న చెరువులను ఏర్పాటు చేసి, చిన్న కాలువల ద్వారా వరద నీరు వాటికి మళ్లేలా రైతులకు అవగాహన కల్పించాలి. చర్య ల ద్వారా వరద నష్టాన్ని తగ్గించడమే కాకుండా, వృథాగా పోతున్న వర్షం నీటిని భూమి లోకి ఇంకించి, భూగర్భ జలాలు పెరిగేలా చేసి, ప్రజలకు తిరిగి ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. యడ్లపాడు ప్రజల కన్నీటి కష్టాలు తీరి, ప్రతి వర్షపు చినుకు వరంగా మారే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. -
అంగన్వాడీలకు మంగళం
అంగన్వాడీ కేంద్రాలకు మంగళం పాడేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతోపాటు టీకాలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న ఈ కేంద్రాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాబు సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తెనపల్లి: పలు అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంగన్వాడీల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో అటు ఆరేళ్ల లోపు పిల్లలకు, ఇటు గర్భిణులు, బాలింతలకు తీరని అన్యాయం చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా క్రోసూరు మండలాన్ని ఎంపిక చేశారు. మండల స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో చైర్మన్గా మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ), కో చైర్పర్సన్గా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ), మెంబర్లుగా ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎమ్), అంగన్వాడీ వర్కర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, స్వయం సహాయక సంఘాల తల్లుల కమిటీలో ఉంటారు. అంగన్వాడీ కేంద్రాలకు పాఠశాలలు ఎంత దూరంలో ఉన్నాయి. ఏ ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. 200 మీటర్లు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి అమలు చేసేందుకు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయు) ఆధ్వర్యంలో ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. తొలి దశ బడి ప్రాంగణంలోవి... తొలి దశలో సర్కార్ ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయాలని నిర్ణయించింది. రెండో దశలో మిగిలిన వాటిని విలీనం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) బృందం కూడా జిల్లాలో పర్యటించనుంది. ఆరు ప్రధాన సేవలు బంద్... అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పలు రకాల సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాల ల్లో విలీనం చేస్తే ఈ సేవలు అన్ని బంద్ కానున్నాయి. ముఖ్యంగా పోషకాహారం పంపిణీ, ప్రీ–స్కూల్విద్య, ఆరోగ్యవిద్య, రెఫరల్సేవలు, తదితర సేవలన్నీ ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఈ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేస్తే ఆయా సేవలన్నీ అందే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం తక్షణం విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని సీఐటీయూ నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ ప్రాజెక్ట్లు : 09 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు : 2,010 మినీ అంగన్వాడీ కేంద్రాలు : 21 6 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య : 1,05,811 బాలింతలు : 9,587 మంది గర్భవతులు : 9,368 మంది అంగన్వాడీలను పాఠశాలల్లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. మూడేళ్ల లోపు చిన్నారులందరినీ ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపి బలోపేతం చేయాలి. ఇప్పటికే అనేక రకాల యాప్లు ప్రవేశపెట్టి అంగన్వాడీ కార్యకర్తలను మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు పనిచేయక అనేక అవస్థలు పడుతున్నారు. – గుంటూరు మల్లేశ్వరి, సీఐటీయూ గౌరవ అధ్యక్షురాలు, పల్నాడు జిల్లా -
పల్నాటి రణక్షేత్రానికి ‘వీరారాధన’ శోభ
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు రణక్షేత్రం కారెంపూడిలో బుధవారం రాత్రి కార్తిక అమావాస్య నుంచి ప్రారంభం అయ్యాయి. వివిధ కారణాలతో ఇక్కడ నుంచి వలస వెళ్లిన వీరాచార వంతులు తమ వద్ద ఉన్న వీరుల ఆయుధాలతో తరలి వస్తున్నారు. ముందుగా కళ్లిపోతురాజును దర్శించుకుని, వీరుల గుడి పక్కనే ఉన్న నాగులేరు గంగధారిలో స్నానాలు చేస్తున్నారు. ఆయుధాలు శుభ్రం చేసుకున్నాక అలంకరించుకుని వీరుల గుడిలో పెడుతున్నారు. గురువారం కూడా వీరాచారులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరుల గుడిలోని ఆయుధాలను వెలుపలికి తీసి గుడికి శుభ్రంగా వెల్లవేశారు. తర్వాత వాటిని అలంకరించి తిరిగి గుడిలో పెట్టారు. రాత్రి వరకు వచ్చిన వీరాచారులు తమ ఆయుధాలతో గ్రామోత్సవంగా బయలు దేరి చెన్నకేశవస్వామి, వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. బ్రహ్మనాయుడు విగ్రహానికి నమస్కరించి ధూపం వేశారు. తర్వాత కోట బురుజు మీదుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికెళ్లి ఆయనను తోడ్కొని వీరుల గుడికి చేరుకున్నారు. వీరాచారులందరికీ పేరుపేరున పీఠాధిపతి కంకణధారణ చేశారు. వీరుల గుడి ముఖ మండపంపై ఎర్రజెండా ప్రతిష్టించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత వీరుల గుడి ఆవరణలోని తూర్పు మండపం వద్ద నైవేద్యం తయారు చేయించి వీరుల ఆత్మలకు అర్పించే క్రతువు నిర్వహించారు. రాచగావు కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. వీరవిద్యావంతులు రాచగావు కథాగానం తెల్లవార్లూ చేశారు. ఉత్సవ ప్రాంగణానికి కాపలా ఉండాలని బ్రహ్మనాయుడు పోతురాజుకు ఆన పెట్టిన ఘట్టంతోనే ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
వీఆర్ఏల పోరుబాట
పెదకూరపాడు: ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సహాయకులు పోరుబాట పట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు షేక్ బందగి సాహెబ్ తెలిపారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద వీఆర్ఏలు నిరసన చేపడతారని తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా వీఆర్ఏలకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందన్నారు. దశల వారీ పోరాటానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు, అటెండర్ నైట్ వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏల చేత 70 శాతం భర్తీ చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, వివిధ ఖాళీ పోస్టుల భర్తీలో వీఆర్ఏకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాన్ని జయప్రదం చేయాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చారు. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఎడ్ల పోటీలలో భాగంగా బుధవారం న్యూ కేటగిరి విభాగంలో పోటీలు జరిగాయి. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ విభాగంలో ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాలకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత బండను 5051.11 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 5000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం సాధించాయి. కాకుమాను మండలం కొండబలవారిపాలెంకు చెందిన జీపీ బుల్స్, గుడవల్లి లక్ష్మీదీక్షిత్ చౌదరి కంబైన్డ్ ఎడ్లజత తృతీయ స్థానాన్ని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పిన్నెల్లికి చెందిన పిక్కిలి తేజశ్వ మురళి ఎడ్ల జత నాలుగవ బహుమతిని, మేడికొండూరు మండలం సరిపూడి గ్రామానికి చెందిన వెదుళ్లపల్లి శ్రీనివాసరావు, పాలడుగు గ్రామానికి చెందిన శాఖమూరి విజయ్కుమార్ కంబైన్డ్ జత ఐదవ స్థానంలో నిలిచాయి. అలాగే ఆరవ బహుమతిని రాజుపాలెంకు చెందిన డప్పులపూడి వినోద్కుమార్, పల్నాడు జిల్లా మాచవరంకు చెందిన కేవీఆర్ నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు, బొమ్మిన శేషగిరిరావు, నాగారపు రామకృష్ణ, పలిశెట్టి హనుమంతరావు, పలిశెట్టి శ్రీను. చింతపల్లి రామ్మూర్తి తదితరులు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. బహుమతులను దాతలు గ్రామ ఇన్ఛార్జి సర్పంచ్ బాణా వతు సరస్వతీ బాలు నాయక్, చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈఓ, ఫర్టిలైజర్స్ అసోషియేషన్ నాయకులు, బూసా రామాంజనేయులు, రమావతు నాగుల్ నాయక్, లీలాలక్ష్మీ ప్రసన్న అందించారు. న్యూకేటగిరి విభాగం విజేత శేషాద్రి చౌదరి ఎడ్ల జత -
వైద్యశాఖ మంత్రిని సత్వరమే మార్చండి
నరసరావుపేట: గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాడేరు మెడికల్ కళాశాలకు ఈ ఏడాది 50 సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిరాకరించటం బాబు సర్కారు తీరుకు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నరసరావుపేటలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆ పదవి నుంచి తొలగించి బాధ్యత గల వ్యక్తికి ఆరోగ్యశాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సైతం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైద్యుల్ని సైతం మోసం చేసిన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన మంత్రిత్వ శాఖపై పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారని, పీహెచ్సీ వైద్యులను సైతం మోసం చేశారని గోపిరెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్లు చెల్లించాలని కోరుతూ సమ్మెకు దిగితే కేవలం రూ.250 కోట్లు చెల్లించి చేతులు దులుపుకొన్నారన్నారు. గత ప్రభుత్వం పూర్తిచేసి ప్రారంభించిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. -
ఏడు మిల్లుల్లో పత్తి కొనుగోలు
నరసరావుపేట/సత్తెనపల్లి: జిల్లాలో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ఏడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు మొదలు పెట్టారని జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి కేవీఎన్ ఉపేంద్రకుమార్ పేర్కొన్నారు. మిగతా నాలుగు మిల్లుల్లో కూడా త్వరలో కొనుగోళ్లు మొదలు పెడతారన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ జిన్నింగ్ మిల్లును సందర్శించారని తెలిపారు. పత్తి కొనుగోలును పరిశీలించారన్నారు. రైతులకు గ్రామ రైతు సేవ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించామని పేర్కొన్నారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ 8 నుంచి 12లోపు ఉంటేనే వారికి స్లాట్ బుకింగ్ చేస్తారన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి శుభ్రమైన తేమలేని, రంగుమారని పత్తిని తెచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
బెల్లంకొండ: విద్యుత్ షార్ట్ సర్క్యూతో ఇల్లు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని సుగాలి కాలనీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడు మాచర్ల షేక్ మొహమ్మద్ ఖాసిం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సుగాలీ కాలనీలో మువ్వ శీను ఇంట్లో మొహమ్మద్ ఖాసిం గత కొన్ని నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కాగా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో నిప్పు అంటుకుందని బాధితుడు తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న బీరువాలోని సామగ్రి, వస్తువులు, దుస్తులు, టీవీ, ఫ్యాన్లు, ఇంట్లో సామగ్రి, వంట సామాన్లుతోపాటు రూ.20వేలు నగదు అగ్నికి ఆహుతి అయిందన్నారు. స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో మొహమ్మద్ ఖాసిం కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. -
సమైక్య భారతావనికి పునాది వేసిన సర్దార్ పటేల్
నరసరావుపేట: దేశ సమైక్యత కోసం ధృడంగా నిలబడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘మై భారత్ గుంటూరు’ ఆధ్వర్యంలో బుధవారం నరసరావుపేటలో సర్దార్ 150 ఐక్యత జిల్లాస్థాయి పాదయాత్ర ఎస్ఎస్ఎన్ కాలేజ్ క్రీడా మైదానంలో ప్రారంభమై పల్నాడు రోడ్డు వెంబడి సాగింది. ఎంపీ లావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ షేక్ యూసఫ్ అలీ, ఆర్డీఓ కె.మధులత, మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయిలు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఎంపీ లావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాల విలీనానికి చేసిన కృషి అమోఘమన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యతా గొప్పదని చాటి చెప్పిన సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశానికీ పునాదులు వేయడానికి అవిశ్రాంతంగా కృషిచేశారన్నారు. దేవిరెడ్డి కిరణ్మయి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. పట్టణ కమిషనర్ మేడికొండ జస్వంతరావు, తహసీల్దార్ కె.వేణుగోపాల్, బీజేపీ నాయకులు జన్నాభట్ల ఆదిత్య, పులిగుజ్జు మహేష్, కళాశాల కార్యవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపిలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, రోటరీ క్లబ్ ప్రతినిధి సుమిత్ర కుమార్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అన్నదాసు సరళ కుమారి, ఎన్సీసీ ఆఫీసర్ బీఎస్ఆర్కే రాజు పాల్గొన్నారు. ఐక్యతా ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు -
తుపాను బాధిత కుటుంబాలకు సాల్వేషన్ ఆర్మీ సాయం
కొల్లూరు: మోంథా తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు అంతర్జాతీయ రక్షణ (సాల్వేషన్ ఆర్మీ) సైన్యం ఎమర్జెన్సీ డిజాస్టర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమం చేపట్టారు. మండలంలోని ఈపూరులంక, మొసలిపాడు గ్రామాలలోని పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ రాష్ట్రీయ నాయకులు కమిషనర్ దాసరి దానియేల్ రాజు, ఈపూరులంక సర్పంచి మేకతోటి శ్రీకాంత్, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులు లెప్ట్ కల్నల్ గేరా థామస్, మేజర్ ప్రభాత్కుమార్, కెప్టెన్ రమేష జీవన్రాయ్, మేజర్ రవి మోసెస్, మేకతోటి శరత్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
మూర్ఛ వ్యాధికి ఆధునిక చికిత్స
●ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గుంటూరు మెడికల్: మూర్ఛ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయని, ఈ వ్యాధిపై అపోహలు వీడి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీ య అధ్యక్షురాలు, లలితా సూపర్ స్పెషాలిటీ న్యూ రాలజీ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ అన్నారు. నేషనల్ ఎప్లిక్సిడే సందర్భంగా బుధవారం గుంటూరు కొత్తపేటలోని లలితా సూపర్స్పెషాలిటీ హాస్పటల్ ప్రాంగణంలో డాక్టర్ విజయ ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ● డాక్టర్ విజయ మాట్లాడుతూ మెదడులో ఉన్న నాడీ కణాలు ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సందేశాలు పంపుతాయని చెప్పారు. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అకస్మాత్తుగా ఎక్కువ కావడం, నియంత్రణ లేకుండా పెరగడంతో మూర్ఛ వ్యాధి వస్తుందన్నారు. ● సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ ఉప్పాల వీరమ్మ మాట్లాడుతూ పుట్టక సమయంలో మెదడుకు గాయాలు కావడం, మెదడు ఇన్ఫెక్షన్లు, మెదడు అభివృద్ధి లోపాలు, తల గాయాలు, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్లు, వారసత్వం కారణాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుందని చెప్పారు. ● డాక్టర్ ఉషాకిరణ్ మాట్లాడుతూ మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు ప్రజలు చుట్టూ గుమికూడకుండా చూడాలన్నారు. మూర్ఛతో పడిపోయిన వారిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలన్నారు. వెంటనే వైద్యుడి సహాయం పొందాలన్నారు. ● డాక్టర్ అజ్మ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు. ● న్యూరో సైక్రియాటిస్ట్ డాక్టర్ అజయ్ మాట్లాడుతూ వ్యాధి వల్ల అనేక సామాజిక సమస్యలు ఎదువుతాయని, వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో వివరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి బాధితులు, వారి సహాయకులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మా సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు
నకరికల్లు: నర్శింగపాడులోని శ్రీ గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో లక్ష బిళ్వార్చన వేడుకలు బుధవారం కనుల పండువలా సాగాయి. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజాధికాలు జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకాలు చేశారు. చండీపారాయణం, రుద్రహోమం, చండీహోమం, అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు. బగళాముఖి ఆలయానికి ఐఎస్ఓ 9001 అవార్డు చందోలు(కర్లపాలెం): చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయానికి హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డు రావటం బాపట్ల జిల్లాకే తలమానికమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆలపాటి శివయ్య ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డును ఆలయ మేనేజర్ నరసింహమూర్తికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ చందోలు బగళాముఖి అమ్మవారి చరిత్ర తెలుసుకుని అవార్డు అందజేశామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు, ఆలపాటి శివయ్యలను ఆలయ మేనేజర్, అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు పట్టాభిరామారావు, ప్రసాద్, ఆలయ అర్చకులు ఉన్నారు. నువ్వులు, వేరుశనగల దిగుబడి పెంపునకు శిక్షణ గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ ఆర్థిక సహకారంతో బుధవారం లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మి మాట్లాడుతూ నువ్వులు, వేరుశనగ పంటల్లో దిగుబడిని పెంచే దిశగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందన్నారు. రైతులు నూనె గింజల పంటలను విరివిగా చేపట్టి భారతదేశ వంటనూనెల దిగుమతులను తగ్గించాలని కోరారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ శివన్నారాయణ వేరుశనగలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్ళు యాజమాన్యం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకునే విధానాలు వివరించారు. నిత్యాన్నదాన పథకానికి విరాళాలు పెదకాకాని: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం విజయవాడకు చెందిన తిరుక్కోవల్లూరి సాంబమూర్తి పేరు మీద వారి సతీమణి శోభ రూ. 50,116 అందజేశారు. అలానే గుంటూరుకు చెందిన నందిగామ సాంబశివరావు, నర్రా రామమూర్తి, గింజుపల్లి గోపాల్స్వామిల పేరు మీద నందిగామ శిరీష, ప్రసాద్రెడ్డి దంపతులు దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. -
27న టీటీడీ దేవస్థానానికి సీఎం రాక
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా తాడికొండ: ఈ నెల 27వ తేదీన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పా ట్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. ఆలయంలో నిర్మించబోయే రెండవ ప్రాకార నిర్మాణానికి సంబంధించి జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చేపట్టవలసిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలెక్టర్ చర్చించారు. తెనాలి: భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 27వ తేదీన తెనాలి రానున్నారు. ఆరోజు స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ సంఘసేవకుడు పెమ్మరాజు దుర్గాకామేశ్వరరావు అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సత్కార గ్రహీత దుర్గాకామేశ్వరరావుకు భారతజ్యోతి బిరుదును మాజీ ఉపరాష్టపతి చేతులమీదుగా అందజేస్తామని వివరించారు. దుర్గాకామేశ్వరరావుపై రూపొందించిన సంచికను అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరిస్తారు. తెనాలి ప్రచురణలు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో ఓలేటి పార్వతీశం, డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్శ్యాంప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
సత్తెనపల్లి: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి గాయాలైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదులాంతర్ల సెంటర్లో బుధవారం రాత్రి జరిగింది. పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కోటపాటి కృష్ణకుమారి (59), నాగమల్లేశ్వరరావు దంపతులు. కృష్ణకుమారి భర్త గతంలోనే మృతి చెందాడు. వారికి కుమారులు కృష్ణ, వెంకట్రావు ఉన్నారు. వెంకట్రావు ఆర్టీసీలో హయ్యర్ బస్సు కాంట్రాక్ట్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ డిపో వద్దకు చిన్న కుమారుడు వెంకట్రావుతో ద్విచక్ర వాహనంపై కృష్ణకుమారి బుధవారం రాత్రి బయలుదేరారు. అచ్చంపేట రోడ్డు నుంచి గుంటూరు వైపు మలుపు తిరిగే క్రమంలో ఖాళీ టిప్పర్ ఢీకొట్టడంతో కృష్ణకుమారి కింద పడ్డారు. ఆమె తలపై నుంచి టిప్పర్ చక్రం వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. వెంకట్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండమోడు– పేరేచర్ల జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టణ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. వాహనాలను క్రమబద్ధీకరించారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ పి.పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయాలు ముస్తాబు
పల్నాటి వీరుల ఇలవేల్పు చెన్నకేశవస్వామి, వీరుల అంకాలమ్మ, శక్తి దేవతలు పోలేరమ్మ, పాతపాటేశ్వరమ్మ వార్లు ఉత్సవాలకు ముస్తాబయ్యారు. వీరాచారులు, వేలాది భక్తులకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీ.శ 11వ శతాబ్దం నాటి ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటున్నాయి. ఐదు రోజుల ఉత్సవాలలో చెన్నకేశవస్వామి, శక్తి దేవతలకు వీరాచారులు పూజలు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. వీరుల ఆయుధాలతో దేవతలను దర్శించుకుని పూజ తర్వాత ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ కత్తులతో గుండెలపై మోదుకుంటూ ఆచారాన్ని నెరవేర్చుతారు. మొక్కులు చెల్లిస్తారు. వీరావేశంతో వారు వేసే చిందులతో పల్నాటి పౌరుషం ఉత్సవ వేళ ఉట్టిపడుతుంది. ఉత్సవాలలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పోటీలను ప్రారంభించారు.ఆర్డీఓ మురళి, డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. -
సొంత వ్యాపారానికి రుణం అండ
నరసరావుపేట: అర్హులైన వారికి రుణ సదుపాయం కల్పిస్తే సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. బుధవారం భువనచంద్ర టౌన్ హాలులో ఎస్బీఐ ఆధ్వర్యంలో రుణ వితరణ (క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం) నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ద్వారా 5,555 మంది లబ్ధిదారులకు రూ.118 కోట్ల రుణ సహాయం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లావు ఆలోచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రుణాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల లోన్లపై అవగాహన కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎస్బీఐ డీజీఎం సురేష్ ప్రభు, రీజనల్ మేనేజర్ పి.రవికుమార్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సయ్యద్ జిలాని, టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, డీఆర్డీఏ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఎస్బీఐ ద్వారా 5,555 మందికి రూ.118 కోట్లు అందజేత


