Palnadu District Latest News
-
వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపులో భాగంగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం అయిందని పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ పార్టీ పిలుపులో భాగంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే ఈ విధంగా వ్యతిరేకత రావడం చరిత్రలోనే మొదటిసారి అన్నారు. ఎన్నడూ ఈ విధంగా తక్కువ కాలంలోనే వ్యతిరేకత సంపాదించుకున్న కూటమిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రానున్న కాలంలో కూడా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలను ప్రశ్నించేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రావాలన్నారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలకు పిన్నెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం మూటగట్టుకుంటుందన్నారు. దుర్గమ్మకు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్కు చెందిన కె.గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. -
రొంపిచర్లలో దొంగతనం
రొంపిచర్ల: రొంపిచర్లలో గల ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ఇంట్లో నాలుగు లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన బడిగుంచాల విజయ్కుమార్ రెండు సంవత్సరాల కిందట గ్రామానికి వచ్చి స్థానిక హైవే రోడ్డు సమీపంలో సాయిబాబా ఆలయం పక్కన గల స్థలాన్ని అద్దెకు తీసుకుని ఇల్లు నిర్మించుకుని, వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో తన స్వగ్రామానికి వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు ఇంటి తాళం పగులగొట్టి, రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి, లోపల బీరువాను పలుగుతో పగులగొట్టి, అందులో ఉన్న లక్ష రూపాయలు నగదు, మూడున్నర సవర్ల బంగారం తీసుకెళ్లారు. తన స్వగ్రామం నుంచి ఇంటికి వచ్చిన విజయ్కుమార్ ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లో బీరువా తెరిచి, వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. తన ఇంట్లో జరిగిన దొంగతనంలో మూడున్నర సవర్ల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువకల సొత్తు చోరీకి గురైందని బాధితుడు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు, క్లూస్ టీం సభ్యులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిత్యం జన సంచారం, సమీపంలో హైవే రోడ్డు పై ఎప్పుడూ వాహనాల తిరిగే ప్రదేశంలో దొంగతనం జరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. మూడున్నర సవర్ల బంగారం, రూ.లక్ష నగదు మాయం -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో స్టేట్బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొని పలువురు మరణించటం, అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వార్తలలో చూసి ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం రావడం, మంచి ఆరోగ్యం సొంతం అవుతుందని నా నమ్మకం. – జంగం అనుదీప్ సత్యప్రకాష్, ఎస్బీఐ సీనియర్ అసోసియేట్, గుంటూరు -
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
పురపాలక శాఖ మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు ● -
రక్తదాత... సుఖీభవ
నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ..గుంటూరు మెడికల్: జిల్లాలో పలువురు యువత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రక్తం కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు రూపొందించి సేవ చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దానిని కృత్రిమంగా తయారు చేయలేం. మనిషి జీవించటానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. మానవ శరీరంలోని ప్రతి అవయవం రక్తసరఫరాతోనే పనిచేస్తుంది. కొన్ని ఆపరేషన్లు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. రోడ్డు ప్రమాద బాధితులు కొన్ని సందర్భాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు రక్తం దొరక్క ఆపరేషన్లు సైతం వాయిదాలు పడుతుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో రక్తం గ్రూపు ఉంటుంది. ఏ మనిషిలో ఏ రక్తం ఉంది, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అనే విషయాలను కనిపెట్టిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ 1868 జూన్ 14న జన్మించారు. ఆయన జయంతి నాడే ఏటా ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క చుక్క మానత్వం అనే నినాదంతో ఈ దినోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ... రక్తంలో గ్రూపులు... రక్తంలో ఏ, బీ, ఓ, ఏబీ పేరిట పాజిటివ్, నెగిటివ్ గ్రూపులు ఉంటాయి. ఏబీ నెగిటివ్ రక్తం చాలా అరుదుగా లభిస్తుంది. ఏబీ పాజిటివ్ రక్తం గ్రూప్ వారు యూనివర్సల్ రిసీవర్స్. ఎవరి రక్తమైనా వీరికి ఎక్కించవచ్చు. ఓ నెగిటివ్ గ్రూప్ వారు యూనివర్సల్ డోనార్స్. వీరు ఎవరికై నా రక్తం ఇవొచ్చు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా రక్తంలో ఉంటాయి. ఒక్క వ్యక్తి రక్తదానం వల్ల నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తదానం చేసేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, కనీసం 45 కిలోల బరువు ఉండాలి. షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన జబ్బులు, కంటి రోగాలు ఉండకూడదు. సుఖవ్యాధులు ఉన్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారు రక్తం ఇవ్వరాదు. ప్రతి మనిషి ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చు. శరీరం నుంచి 350 మిల్లీగ్రాముల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. రక్తదానం చేసేందుకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధి చాలు. రక్తదానం చేయటం వల్ల మళ్లీ తాజా రక్తం శరీరంలోకి వస్తుంది. తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తాన్ని తీసుకునే ముందు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. రక్తం ఇచ్చిన అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో ద్రవపానీయాలు ఉండేలా చూసుకోవాలి. రక్తదానం చేసిన ఆ ఒక్క రోజు బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు. అవగాహన కల్పిస్తున్నారు.... జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, యువతలో స్వచ్ఛంద రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ వారు ముందుకు వచ్చి రక్తదానం చేసేలా వైద్య అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేయవచ్చు. -
ఆరుగురు బాల కార్మికులకు విముక్తి
నెహ్రూనగర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, చైల్డ్లైన్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్లలో సోమవారం జరిపిన తనిఖీల్లో ఆరుగురు బాల కార్మికులను గుర్తించారు. వారిని వెంటనే పని నుంచి విడిపించి పాఠశాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా వారికి చదువు అవకాశాలు కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. బాల కార్మిక చట్టం ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్లైన్ నంబర్కు, 9492555157కు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రిదేవి, లేబర్ ఆఫీసర్ బొందలపాటి కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ విచ్చేశారు. ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచందర్రావు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలలో ఆయన పాల్గొన్నారు. ఐజీకి ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద ఆశ్వీర్వచనం చేసి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ధూపాటి శివ శంకరరావు, ఎక్స్ అఫీషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్, సిబ్బంది ఉన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఐఎంఎస్ఈఏ) విజయవాడ రీజినల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలో శనివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ సి.సిద్దావలి, సెక్రటరీగా ఎస్.మురళి, జాయింట్ సెక్రటరీగా వి.చలపతిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి.మంగతాయారు, ఆర్.నల్లయ్య, బేతపూడి రాము, జి.రాజేష్, బి.నాగరాజు, వి.మోహనరావు, ఎన్.ఆంజనేయులు ఎన్నికయ్యారు. స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శేషగిరిరావు, స్టేట్ సెక్రటరీ వి.సురేష్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.గిరిధర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) 12 ఏళ్ల ప్రగతి, విజయాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ‘యాత్రి సౌకర్య దివస్’ నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలో విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించి దేశీయ విమాన రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. 2014–15లో రూ.5.98 కోట్లు ఉన్న ఎయిర్పోర్ట్ వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.87.97 కోట్లకు చేరిందని, ప్రయాణికుల సంఖ్య 2.33 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.791.59 కోట్లతో 51,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. పలు ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
యథేచ్ఛగా ఆక్రమణల పర్వం
నరసరావుపేట: గుంటూరు–కర్నూలు రహదారిపై వినుకొండకు వెళ్లే రోడ్డును ఆనుకొని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఆర్టీసీ అధికారుల వినతులతో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి ఆక్రమణలు తొలగించారు. అదే ప్రదేశంలో గత రెండేళ్ల నుంచి మళ్లీ ఆక్రమణలు యథేచ్ఛగా చోటుచేసుకోవటం గమనార్హం. పెరిగిన రద్దీ జిల్లా కేంద్రంగా ఉంటూ రాయలసీమకు ప్రవేశమార్గంగా ఉండే నరసరావుపేట బస్టాండ్ నుంచి బస్సులు, వాటి ద్వారా ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సీ్త్రశక్తి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో బస్టాండ్ నిత్యం రద్దీగా మారింది. అలాగే సమీపంలోనే ప్రముఖ మాల్ ఉండటం వలన ఇటుగా రాకపోకలు పెరిగాయి. డిపోనకు చెందిన 90 బస్సులతోపాటు పైనుంచి నరసరావుపేట మీదుగా ప్రయాణం చేసే మరికొన్ని వస్తుంటాయి. నిత్యం రూ.12.50 లక్షల వరకు ఆదాయం ఆర్టీసీకి వస్తుంది. ఇంతటి రద్దీ ఉండే బస్టాండ్ చుట్టూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. బస్సులు బయటకు వచ్చే ప్రవేశమార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో బడ్డీ కొట్లు, ఇతర వాణిజ్య షాపులను గత ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసుల పహారా మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. వాటి వలన డ్రైవర్లకు బస్టాండ్ దాటి రోడ్డుపైకి వచ్చే వరకు వినుకొండ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు కనిపించేవి కాదు. పలువురు డ్రైవర్లు చేసిన ఫిర్యాదు మేరకు డిపో అధికారులు ఆ అక్రమ వ్యాపారులను తొలగించారు. శుభ్రం చేసి ఆ ప్రదేశం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఆక్రమణల ప్రదేశంగా ప్రకటించి పోలీసు పహారాతో గతంలో ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో ఇటీవల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. డిపో వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ చాలా అవసరం. లేకపోతే ఆటోవాలాలు బస్సులు ఆగిన ప్రదేశానికి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దానిపై డిపో అధికారుల విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రదేశంలో ఓ బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి దానిపై టీడీపీ, జనసేన జెండాలు పెట్టి కొనసాగించారు. ప్రస్తుతం దానిపై ఆ జెండాలు తొలగించారు. దానిపక్కనే ప్రభుత్వం స్పాన్సర్ చేసిన అరకు కాఫీ స్టాల్ ఏరా్పాటు చేశారు. దానిని స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి ప్రారంభించారు. ఇటీవల వినుకొండరోడ్డులో జూపల్లి సెంటర్ను దాటి రోడ్డుకు ఇరువైపులా తొలగించిన ప్రదేశంలో మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. చిరు వ్యాపారులు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు రోడ్డు పక్కనున్న ఆర్ అండ్ బీ స్థలాలను ఆక్రమించారు. -
నీట మునిగిన నాగన్నకుంట
సత్తెనపల్లి: మబ్బులు పట్టి .. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటే చాలు సత్తెనపల్లి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. శనివారం తెల్లవారుజాము సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సత్తెనపల్లి–నరసరావుపేట, సత్తెనపల్లి–అమరావతి రహదారిలో రాక పోకలు నిలిచిపోయాయి. ఉదయం సుమారు గంటకు సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వెళ్లేందుకు నాగన్నకుంట సమీపంలో కాలువ పొంగి రహదారిపైగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు 9 గంటల సమయంలో కొంతమేర నీరు తగ్గడంతో ఆ నీటిలో నుంచే రాకపోకలు కొనసాగాయి. ఇక నాగన్నకుంట లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా నీటమునిగింది. వీధుల్లో వర్షపు నీరు చేరి ఇళ్ళల్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పట్టణంలోని నాగన్న కుంట, శాలివాహననగర్, సుందరయ్యకాలనీ, వెంకటపతి కాలనీతో పాటు మాస్ట్రీన్పేట, దోబీఘాట్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంత ప్రజలు వర్షపునీరు నిల్వడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇది ఇలా ఉంటే సత్తెనపల్లి–అమరావతి మార్గమధ్యలోని నందిగామ లోలెవల్ చప్టా పైగా వరద ఉధృతి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా.. సమస్య పరిష్కారానికి మాత్రం చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందిగామలోని ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. వరద నీరు గృహాల చెంతకు చేరి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాతృశ్రీ అచ్చమాంబ తల్లి దేవాలయ సమీపంలో వరద నీరు నిలిచింది. -
కనిపించని టాస్క్ఫోర్స్ టీం
సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్సూన్ హాలీడే’ జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. గాడిని పూడ్చి అక్రమ రవాణా... ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు. సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్ఫోర్స్ టీంలో మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్ఫోర్స్ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు. -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలి మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
● జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● నిరసన కార్యక్రమాలకు కీలక నాయకులు హాజరు
నరసరావుపేట: ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. మాచర్ల నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం నంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే, పార్లమెంటు పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్లు ప్రత్యేక పూజలు చేశారు. వేల మంది వెంటరాగా నాయకులు ఎడ్లబండిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో అడ్డగించినా పట్టించుకోకుండా వేల మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కార్మికులు భారీగా పాల్గొన్నారు. రింగ్రోడ్డు, బస్టాండ్ సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రతులను బస్టాండ్లో దహనం చేశారు. పలువురు కార్యకర్తలు యాచకులుగా వినూత్నంగా నిరసన నిర్వహించారు. పీఆర్కే, గౌతంరెడ్డి, కేవీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాకముందు చీటర్ అవతారం ఎత్తి అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసిన గాలికి కొట్టుకుపోయే నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనను జయప్రదం చేశారని పేర్కొన్నారు. నరసరావుపేటలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేల మంది నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయ నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేషన్ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా కొనసాగింది. ప్రతి ఒక్కరూ పార్టీ జెండా చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనసాగారు. ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్లు పూర్తిగా అవినీతిమయమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీని దగా చేసి స్పోర్ట్స్ కోటా కింద తమ వారికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీలపై మోసం చేశారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు దొంతిరెడ్డి అంజిరెడ్డి, కనకా పుల్లారెడ్డి, ఎన్కే ఆంజనేయులు, టి.మంగమ్మ, ఎస్.సుజాతాపాల్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, కొత్తూరి కిషోర్బాబు పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ప్రధాన రహదారి మీదుగా గడియారం స్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి తాలూకా సెంటర్ వరకు చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు పెద్దసంఖ్యలో కదం తొక్కారు. తాలూకా సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు పరచకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, డాక్టర్ గీతా వాసంతి, జంగారపు అనూష, చల్లంచర్ల సాంబశివరావు, రమావత్ కోటేశ్వరరావు నాయక్, రాయపాటి పురుషోత్తమరావు, షేక్ మౌలాలి, భవనం రాఘవరెడ్డి, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండలో రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జునయాదవ్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బాసులింగారెడ్డితో పాటు ఐదు మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రసంగించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవటంతో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రతిపక్షం, అధికారపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజలను మోసం చేయటం అలవాటుగా సాగుతోందన్నారు. -
చిలకలూరిపేటలో...
చిలకలూరిపేటలో నరసరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద నుంచి భాస్కర్సెంటర్లోని డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బైకు ర్యాలీని అడ్డుకోవటంతో పాదయాత్రగానే నిర్వహించారు. మైకులు కూడా అడ్డుకున్నారు. సెంటర్లో కార్యక్రమాన్ని ఉద్దేశించి రజని మాట్లాడుతూ సూపర్ సిక్స్కాదు సూపర్ స్కెచ్తో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో అన్నీ వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, రాచమంటి చింతారావు, కందుల శ్రీకాంత్, సయ్యద్ జమీర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
● కాసు కన్వెన్షన్ హాలులో ఆశా, ఏఎన్ఎంలతో యోగాంధ్ర ● పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు నరసరావుపేట: యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆశా, ఏఎన్ఎమ్లతో యోగాంధ్ర కార్యక్రమం పెద్దచెరువులోని కాసు కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకులు ఆధ్వర్యంలో దాదాపు ఒక గంట పాటు నిర్వహించిన యోగా కార్యక్రమంలో అందరూ యోగాసనాలు వేశారు. అనంతరం యోగా మంత్రంతో కార్యక్రమాన్ని ముగించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజు యోగ చేయాలి అన్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల ఏడవ తేదీ నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో యోగా ట్రైనర్, మాస్టర్లచే యోగ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ యోగాని విద్యార్థి దశ నుంచే ప్రారంభించాలని అన్నారు. యోగ వలన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మోగిన బడి గంట
నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తొలిరోజు కావటంతో ప్రాథమిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాఠశాలకు చేరుకున్నారు. నూతన ప్రవేశాల కోసం పలువురు వచ్చి పిల్లలను వివిధ తరగతులలో చేర్పించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని 2,018 పాఠశాలల్లో 2,75,254 మందికిగాను 1,39,425 మంది హాజరైనట్టు అధికారులు గుర్తించారు. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మండలంలోని యలమంద జెడ్పీ హైస్కూల్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, డిప్యూటీ డీఈఓ సుభాని సొలస జెడ్పీ హైస్కూల్, ఎంఈఓలు తమ తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించారు. మనబడి పండుగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి, సూచనలు చేశారు. పాఠశాలలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు -
పల్నాడు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 20267 సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలో కదం తొక్కుతున్న శ్రేణులు వినుకొండలో ర్యాలీలో నాగార్జునయాదవ్, మోదుగుల, బాసు లింగారెడ్డి, నాయకులు నరసరావుపేట ర్యాలీలో డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు వెన్నుపోటుపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సూపర్ సిక్స్ హామీలకు వ్యతిరేకంగా గత రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్లు చేస్తున్న అవినీతి పాలనపై వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేల మంది టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇప్పటికై నా సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. -
అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మొత్తం 484 అదనపు తరగతి గదులు, 55 టాయిలెట్ల నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 218 అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉందన్నారు. ఇప్పటికే పూర్తయిన తరగతి గదులకు విద్యాశాఖ వద్ద అదనంగా ఉన్న ఫర్నీచర్ను ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేయాలన్నారు. వీటికి తోడు 23 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏయే పాఠశాలలో నిర్మాణాలు ఏయే తేదీలోగా పూర్తి చేస్తారో టైమ్లైన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన తరగతి గదులకు ఎప్పటికపుడు ప్రజాప్రతినిథులతో ప్రారంభోత్సవం చేయించాలన్నారు. డీఈవో రామారావు, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్ (మున్సిపల్), గ్రామీణ నీటి సరఫరా, సమగ్ర శిక్ష, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయండి జిల్లాలో చిలకలూరిపేట–నకరికల్లు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167ఏ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టరును జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జాతీయ రహదారులు 544డి, 167ఏ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తీర్ణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నకరికల్లు–ఓడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణ కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ పాల్గొన్నారు. రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలి రెండేళ్ల నమ్మకం వేడుకలు జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ నెల 15న పెరేడ్ గ్రౌండ్స్లో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం, నిర్వహణపై అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం‘ పేరుతో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాస్థాయిలో వేడుకల కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిదులు పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మహిళలను ఈనెల 15న సన్మానించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ అద్దెయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెదకూరపాడులో...
అమరావతి మండల కేంద్రంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి రహదారిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరలింగేశ్వర దేవాలయం సమీపంలోని వంగవీటి రంగా విగ్రహం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి వచ్చేవారిని అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సూపర్సిక్స్ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈదా సాంబిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు వెంపా జ్వాలా నరసింహారావు, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
అమరజవాన్ల కుటుంబాలకు ఉచితంగా సిమెంట్
– శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి నరసరావుపేట రూరల్: దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా సిమెంట్ అందజేస్తున్నట్టు శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి తెలిపారు. పట్టణంలోని హెచ్–6 హోటల్లో శుక్రవారం దాచేపల్లి శ్రీ సిమెంట్ ప్లాంట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ జీఎంలు శ్రీనివాస్, శ్రీధర్ రాజు, ఏజీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు శ్రీ సిమెంట్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ నమాన్ పేరుతో వీరమరణం పొందిన అమరవీరుల కుటుంబాల వారసులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అమరవీరుల కుటుంబం తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు అవసరమైన సిమెంట్ను పూర్తిగా ఉచితంగా సరఫరా చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలు దేశంలోని శ్రీ సిమెంట్ ప్లాంట్ల నుంచి సిమెంట్ను సేకరించవచ్చని స్పష్టం చేశారు. ప్లాంట్ జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దాచేపల్లి ప్లాంట్లో 180 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యధిక శాతం స్ధానికులకే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక వసతుల కల్పన, విద్యా వలంటీటర్ల నియామకం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. -
పీసపాడు వద్ద కారు, ఇసుక ట్రాక్టర్ ఢీ
క్రోసూరు: మండలంలోని పీసపాడు గ్రా మ ప్రధాన రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. పెదకాకానికి చెందిన మాజీ ఎంపీపీ నల్లిమల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బద్దిపూడి రమేష్, మరో ఇద్దరు వ్యక్తిగత పనులపై కారులో సత్తెనపల్లి మీదగా మండలంలోని పీసపాడు వస్తున్నారు.ట్రాక్టర్ క్రోసూరు వైపు నుంచి సత్తెనపల్లి వెళ్తుంది. ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురుకి గాయాలయ్యాయి. ఒకరు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు సమాచారం. ట్రాక్టర్ ముప్పాళ్ల మండలం కు చెందినదిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
17న రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్కు వినతులు సమర్పించండి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబందించి ఏర్పాటుచేసిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్కు జిల్లాలోని బీసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు గుంటూరు కలెక్టర్ కాంపౌండ్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశమౌతారన్నారు. తమ అభిప్రాయాలను సంబంధిత రుజువులతో సమర్పించాలని సూచించారు. వినతులు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డెడికేషన్ భవనానికి రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా పంపవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు నేరుగా కూడా అందజేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 90104 00500 సంప్రదించాలని కోరారు. పల్టీలు కొట్టిన కారు – ఇరువురికి గాయాలు యడ్లపాడు: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై యడ్లపాడు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన కిరణ్ తన స్నేహితుడితో కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తున్నారు. యడ్లపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. కిరణ్, అతని స్నేహితుడికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీశారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలికాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు గురువారం ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు 80 మంది బాలికలు, 120 మంది బాలురు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మంది, జూనియర్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సత్తెనపల్లి జిల్లా పరిషత్ సుగాలికాలనీ ఉన్నత పాఠశాలలో శిక్షణ క్యాంపు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మేణ్యేశ్వరరావు తెలిపారు. ఆయనతోపాటు, కార్యదర్శి షేక్ షమ్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్, అసోసియేషన్ బాధ్యులు సుభాని, శ్రీరామిరెడ్డి, ఆలి, శ్రీనివాసరెడ్డి, జాన్సైదా, మహేశ్వరి, శ్రీను, ప్రవీణ్, శ్రావణిలు ఉన్నారు. బాలికల జట్టు ఇదే.. సబ్ జూనియర్, జూనియర్స్ బాలికల జట్టుకు పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), పి.స్వాతి (సత్తెనపల్లి), షేక్ నాజియా (సత్తెనపల్లి), ఎన్.నిఖిత భవ్య (సత్తెనపల్లి), కె.సాయినిఖిత (సత్తెనపల్లి), కె.నాగమల్లేశ్వరి (సత్తెనపల్లి), పి.అక్షయ్ (సత్తెనపల్లి), పి.మానశ్రీ (సత్తెనపల్లి), ఆర్.శ్రీభవ్య (సత్తెనపల్లి), షేక్ ఆషికా (సత్తెనపల్లి), షేక్ మదీనా జాహ (సత్తెనపల్లి), ఎ.విశ్వఘ్నకృష్ణజ (సత్తెనపల్లి), పి.వేదశ్రీ (ముప్పాళ్ల), ఎస్.నాగరాజలక్ష్మి (ముప్పాళ్ల), వి.శ్రీమ్సీ (సత్తెనపల్లి), పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), షేక్జాస్మిన్ (సత్తెనపల్లి), టి.త్రివేణి (సత్తెనపల్లి), పి.అలేఖ్య (సత్తెనపల్లి), పి.ఈశ్వరి (సత్తెనపల్లి), పి.స్వాతికీర్తన (వినుకొండ), ఎస్.శ్రావ్య (మాదల), జి.చంద్రిక (ఇరుకుపాలెం), పి.ప్రవల్లిక (ఇరుకుపాలెం), పి.స్వాతి (అచ్చంపేట)లు ఎంపికయ్యారు. బాలుర జట్టు ఇదే.. బాలుర విభాగంలో డి.శివసాయి (సత్తెనపల్లి), షేక్ దరియా హుస్సేన్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.ఇర్ఫాన్(సత్తెనపల్లి), షేక్ జావిద్ అలాం (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.వి.సాయిపుల్లా (నరసరావుపేట), ఆర్.వి.బి.శ్రీనివాస్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.సల్మాన్ (సత్తెనపల్లి), కె.నాని (గురజాల), ఎస్.కె.ఎండి.ఇర్ఫాన్ (మాదల), ఎ.విజయదుర్గ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అష్రఫ్ (సత్తెనపల్లి), ఎం.డి.ఎం.డి.రఫీ (సత్తెనపల్లి), కె.ఆకాష్ (సత్తెనపల్లి), గిరిప్రతాప్ (సత్తెనపల్లి), ఎం.కార్తీక్ (సత్తెనపల్లి), షేక్ ఫారూఖ్ (సత్తెనపల్లి), షేక్ జియావుద్దీన్ (సత్తెనపల్లి), కార్తీక్ (చల్లగుండ్ల), ఆర్.కార్తీక్ (సత్తెనపల్లి), కె.సాయిధనుంజయరెడ్డి (సత్తెనపల్లి), కె.షణ్ముఖ రెడ్డి (సత్తెనపల్లి), పి.రామాంజనేయులు (సత్తెనపల్లి), ఎం.ప్రణ్విత్ (సత్తెనపల్లి), అఖిల్ జోసఫ్ (రుద్రవరం), కె.చైతన్య (సత్తెనపల్లి), డి.నిభీష్రెడ్డి (సత్తెనపల్లి), టి.సాయివెంకటప్రసాద్ (సత్తెనపల్లి), వెంకట్ రుషీక్ (అచ్చంపేట), ఎస్.కె.ఎం.డి.సాయిముల్లా (నరసరావుపేట), పి.కఫీజ్ (సత్తెనపల్లి), కె.కార్తీకేయ (సత్తెనపల్లి), బి. లోకేష్ (చల్లంగుండ్ల), షేక్ రోహెల్ (సత్తెనపల్లి), పి.వాసు (సత్తెనపల్లి), షేక్రహీం (సత్తెనపల్లి), షేక్ అబ్దుల్ రెహమాన్ (సత్తెనపల్లి), టి.దీపక్ (సత్తెనపల్లి), ఎన్.నందకిషోర్ (సత్తెనపల్లి), పి.డాని (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అబ్దుల్ రహీం (సత్తెనపల్లి), వై.నరసింహ (సత్తెనపల్లి)లు ఎంపికయ్యారు. -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
మోగనున్న బడి గంట
నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,566 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. గత విద్యా సంవత్సరంలో 2,79,880 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,73,975 మంది విద్యార్థులు నమోదయ్యారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ప్రకటించటంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కిట్లు జిల్లా కేంద్రానికి చేరుకోలేదు. గత ఏడాది మెగా పేరెంట్స్ మీటింగ్లో విద్యాకిట్లు అందిస్తామని ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంతవరకు కిట్లు పాఠశాలలకు చేరవేయలేదు. జిల్లా పరిధిలోని 28 మండలాలకు ఇప్పటివరకు యూనిఫాం, షూస్, బ్యాగ్స్, నోట్బుక్స్, బెల్ట్లు చేరలేదు. పాఠ్యపుస్తకాలు 6,01,848 గాను 5,79,904, వర్క్బుక్స్ 1,28,194కు గాను 1,23,970 ఆయా మండలాలకు చేరుకున్నాయి. డిక్షనరీలను పంపిణీకి సిద్ధం చేశారు. నోట్ పుస్తకాలు మరో రెండు రోజుల్లో చేరుకుంటాయని భావిస్తున్నారు. వస్తువు కావలసినవి వచ్చినవి శాతం యూనిఫాం 1,41,879 0 0 షూస్ 1,41,879 0 0 బ్యాగ్స్ 1,41,879 0 0 నోట్బుక్స్ 8,04,253 0 0 బెల్ట్స్ 96,941 0 0 టెక్ట్స్ బుక్స్ 6,01,848 5,79,904 96.35 వర్క్బుక్స్ 1,28,194 1,23,970 97.70 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 14,540 14,540 100 పిక్టోరియల్ డిక్షనరీలు 11,368 11,368 100 -
అగ్రహారం భూముల సర్వే పూర్తి చేయాలి
నరసరావుపేట: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న అగ్రహారం భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి సెటిల్మెంట్తో సహా అన్ని పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ అగ్రహారం భూములు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగు మండలాల్లోని అగ్రహారం భూములకు సంబంధించిన సర్వేను తక్షణమే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియను ముగించాలని ఆమె స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సర్వే శాఖ ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓ కె.బాలకృష్ణ, వినుకొండ, నూజెండ్ల, ఈపూరు, బొల్లాపల్లి తహసీల్దార్లు సురేష్, రమేష్, నళిని, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తప్పులు లేకుండా ‘సర్’ నిర్వహణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియలపై గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్ క్షేత్రస్థాయి సర్వేపై రాజకీయపార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో బీఎల్ఓలు పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహించే డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. ఓటర్ల వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఓటర్లకు అందించి, వివరాలను పరిశీలించి కలర్ ఫొటోతో పాటు సంతకాలు తీసుకోవాలని సూచించారు. సరిపోలని వివరాలను మాస్టర్ డేటాతో తనిఖీ చేసి, ఎన్నికల డేటా బృందంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్, డిలీషన్ అంశాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల డీటీ, ఏఈఆర్వో, ఈఆర్వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, పూర్తి పారదర్శకతతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు అనుమతుల మంజూరుకు ఆదేశం జిల్లాలోని అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న ప్రజల నివాసాలు, గిరిజన తండాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అటవీశాఖ అనుమతులను నిబంధనల ప్రకారం తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారిణి కృష్ణప్రియలతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోటప్పకొండ ఈవో, మార్కాపురం గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఐటీడీఏ అధికారి పీవో, ఏపీ విద్యుత్ శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
హత్య కేసులో దంపతుల అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ హనుమంతరావు చిలకలూరిపేట: వ్యక్తిని దారుణంగా హతమార్చిన దంపతులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీఖానా సమీపంలో షేక్ కాలేషావలి, షేక్ మనీషా దంపతులు నివాసం ఉంటారు. మనీషాకు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. కాలేషావలి రెడ్ల బజారులో వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ మనీషా, జాకీర్హుస్సేన్ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. జాకీర్ హుస్సేన్ జీవించి ఉన్నంత కాలం తమ మధ్య గొడవలు తప్పవని, అతనిని అడ్డు తొలగించుకొని సంతోషంగా ఉందామని భార్యకు నచ్చ చెప్పాడు. దీనికి అంగీకరించిన మనీషా తన భర్త చెప్పిన ప్రకారం జాకీర్ హుస్సేన్ను ఈ నెల ఒకటో తేదీన ఫోన్ చేసి పిలిపించింది. జాకీర్ హుస్సేన్ వచ్చాక దంపతులు ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని వాహనం ద్వారా తీసుకువెళ్లి వేలూరు– జాలాది రోడ్డులో పడవేశారు. రెండో తేదీన మృతదేహాన్ని గుర్తించిన జాకీర్హుస్సేన్ భార్య షేక్ షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇరువురు సెల్ఫోన్లతోపాటు మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనం, మృతుడి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. -
జన‘ఇరికిరిక్’!
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026నరసరావుపేట వంటి ప్రాంతానికి ఎన్నో ఏళ్ల తర్వాత నూతన ఆసుపత్రి భవనం ఏర్పాటు చేశారని సంబరపడాలో.. అదే ఆసుపత్రి ఆవరణకు రాజకీయ గ్రహణం పట్టిందని బాధపడాలో తెలియని పరిస్థితి. పేదలకు మరింత వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దాలని కోరుకోవాలో.. ఆసుపత్రిని ఆక్రమణలకు అడ్డాగా మార్చవద్దని వేడుకోవాలో అర్థంగాని దుస్థితి. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రతి అంగుళం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచంగా మార్చమని ప్రజలే ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన దీనస్థితి. ప్రస్తుతం నర్సరావుపేట ఏరియా వైద్యశాలలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు కిరికిరి చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణల పర్వంలో ప్రభుత్వ వైద్యశాల నరసరావుపేట టౌన్న: పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణం వ్యాపార కేంద్రంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల జోక్యం వెరసి ప్రైవేటు మెడికల్ దుకాణాల విస్తరణ పార్కింగ్ సమస్యను తీవ్రం చేస్తోంది. ఫలితంగా రోగులు, గర్భిణులు అత్యవసర సేవల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు రోడ్డులోని ప్రసూతి వైద్యశాల మాతాశిశు సంరక్షణ విభాగాన్ని లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించిన తర్వాత రోగులు, గర్భిణుల తాకిడి పెరిగింది. గతంలో రెండు ఆసుపత్రులు వేరువేరు చోట్ల ఉండటంతో సమస్యలు పెద్దగా ఎదురుకాలేదు. ఇప్పుడు మొత్తం ఒకే చోట ఉండటంతో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాల ఆవరణ వాహనాల పార్కింగ్తో నిండిపోతోంది. అంబులెన్స్లు నిలపటానికి స్థలం ఉండటం లేదు. దీంతో వాహనాలను మండుటెండలో నిలుపుతున్నారు. వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్, సిబ్బంది ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో రహదారులకు మధ్యలో వాహనాలు నిలుపుతున్నారు. ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల క్రిటికల్ ట్రామాకేర్ ప్రారంభం అయితే రోగుల తాకిడి మరింత పెరగనుంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించక పోతే పార్కింగ్ సమస్య తీవ్రరూపం దాల్చనుంది. వైద్యశాల ప్రాంగణంలో కూటమిలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు గతంలో జనరిక్ దుకాణం ఏర్పాటు చేశాడు. వైద్యశాలలో ఔషధాలు అందుబాటులో లేని కారణంగా జనరిక్ దుకాణం వైపునకు రోగులు మళ్లుతున్నారు. వ్యాపారాభివృద్ధిని చూసిన మరో అధికార పార్టీ నేత తాజాగా ఇంకో జనరిక్ దుకాణాన్ని అనుమతులు రాకముందే ఏర్పాటు చేశాడు. కావాల్సిన స్థలం కంటే ఎక్కువగా తీసుకొని శాశ్వత నిర్మాణం చేపట్టాడు. ఉచితంగా మందులు అందజేసే ప్రభుత్వ వైద్యశాలలో అక్రమంగా మరో మందుల దుకాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంబులెన్స్లకు దారేది.. అత్యవసర సేవలకు ప్రాణధారంగా నిలిచే 108 అంబులెన్స్లు ఆసుపత్రికి రావటమే కష్టంగా మారింది. వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకం. వాహనాల రద్దీ కారణంగా విలువైన సమయం వృథా అవుతుందని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశం తక్కువగా ఉండటంతో వాహనాలన్నీ ఒకేచోట నిలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్క్ చేసిన వాహనం తీయటం కూడా కష్టతరంగా మారుతోంది. అత్యవసర సమయంలో పేషెంట్లను వైద్యశాలలో చేర్చాలన్నా, వైద్యశాల నుంచి మరోచోటుకు తరలించాలన్నా 108 సిబ్బందికు సవాల్గా మారుతోంది. -
ముఖం చూపితే రూ. 300
పిడుగురాళ్ల రూరల్: తప్పుడు మస్టర్లతో మాయ... పని చేయకుండా చేసినట్లు బిల్లులు, కొలతలలో వ్యత్యాసాలు, పలు అక్రమాలకు పాల్పడుతూ ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. పని చేసారో లేదో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఎక్కడా పని చేసిన దాఖలాలు లేవు. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అధికారులు చేసే దందా అంతా ఇంతా కాదు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది చేతివాటంతో ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంది. ఫొటో దిగితే ఒక పనైపోతుంది.... ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తీసుకొచ్చారు. కానీ కింది స్థాయి అధికారుల అక్రమాలకు హద్దు లేకుండా పోతోంది. కేవలం ఫొటో దిగితే రూ. 300 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రెండవ ఫొటోకు ఉపాధి హామీ పథకానికి వచ్చిన సభ్యులందరూ రావాలి. దీనిని తూతూ మంత్రంగా ముగించేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. పని కావాలంటే రూ.200 ఇవ్వాల్సిందే... అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని ఉపాధి హామీ పథకం చట్టం చెబుతోంది. కానీ పిడుగురాళ్ల మండలంలో దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. అవసరమైన వారికి పని కల్పించకుండా రూ. 200 ఇచ్చిన వారికి మాత్రమే పని కల్పిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతివాటం చూపిస్తూ గ్రామస్థాయిలో రూ.వేలల్లో జేబులు నింపుకొంటున్నారు. పని కావాల్సిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి లేకుండాపోతోంది. మండలంలోని కామేపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లు రూ. 200 ఇవ్వాలని కూలీలకు హుకుం జారీ చేస్తున్నారు. అధికారుల మౌనముద్ర ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంటే కొంత మంది గ్రామాలలోని అధికారులు జేబులు నింపుకొంటున్నారు. రూ.కోట్లకు పడగలెత్తిన వారికి, ఉపాధి పని అవసరం లేని వారికి కూడా పని కల్పిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు ముడుపులు తీసుకొని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా అంటే ఫొటో క్యాప్చర్ ఉంది కదా అంటూ... దానిని సైతం ఫొటో దిగు... రూ. 300 వందలు పట్టు అనే చందంగా మార్చేశారు. -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
భూసమీకరణ వివరాలు సీఆర్డీఏకు అందించండి
నరసరావుపేట: అమరావతి మండలంలో ల్యాండ్ ఫూలింగ్ (భూసమీకరణ)కు అంగీకరించిన రైతుల వివరాలతోపాటు, దేవదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్డీఏకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ల్యాండ్ ఫూలింగ్, భూముల వివరాలపై జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో త్వరగా పరిహారం అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని సూచించారు. అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న దేవదాయ భూములు, రిజిస్టర్డు, అన్ రిజిస్టర్డు కాని భూములు, జరీబ్ భూములు, చెరువులు, కాలువ పోరంబోకు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలన్నారు. 16న చిలకలూరిపేటలో జాబ్మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు చిలకలూరిపేటలోని మునిసిపల్ ఆఫీస్ రోడ్, అర్బన్ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించే మెగా జాబ్మేళాను జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. జాబ్మేళా వాల్పోస్టర్ను తన కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావుతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్మేళాలో జోయలుకాస్, బుక్ ఎక్స్పోర్ట్, హెటిరో డ్రగ్స్, టీం కంప్యూటర్స్, డీమార్ట్, బిగ్ సి, మెడ్ ప్లస్, టెక్ సొల్యూషన్, అక్రో సాఫ్ట్ సొల్యూషన్, ఇసుజు మోటార్స్, జస్ట్ డయల్, టాటా కాపిటల్, ఫ్యూచర్ ఐటి సొల్యూషన్, రిలయన్న్స్ జియో, అఫెక్స్ సొల్యూషన్, ప్రీమియర్ ఎనర్జేస్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. ఇతర వివరాలకు కిరణ్–7842747682, అంజిరెడ్డి–7779858789, రమ్య–7702921219, అనుష–9848793357లను సంప్రదించాలని కోరారు. అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వేమవరపు రామాంజనేయులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రోస్టిక్ హ్యాండ్ ప్రాజెక్ట్ వాల్పోస్టర్ను రెడ్క్రాస్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
పల్నాడు
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఏడాది మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతపై రవాణా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు వారాలుగా ఆయా విద్యాసంస్థల బస్సులకు పూర్తిస్థాయి తనిఖీలు చేస్తున్నారు. తక్షణం సామర్థ్య పరీక్షలు చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) తప్పనిసరిగా పొందాలని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే సూచించారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవడానికి గత నెల 15వ తేదీతోనే గడువు ముగిసింది. అయినప్పటికీ చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 7 -
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక కార్యాలయంలో బుధవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ చైర్మన్ 2024లో రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు మరొకరిని నియమించకపోవటం తగన్నారు. వేతన సవరణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గృహ అద్దెలు వంటి జీవన వ్యయాలు విపరీతంగా పెరిగినా వాటికి అనుగుణంగా మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించకపోవటం వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పనులతోపాటు రెగ్యులర్ బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తీవ్ర పనిభారం పడుతూ మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఈహెచ్ఎస్ సమర్థంగా అమలు కావడం లేదని, అనేక వైద్యశాలలు వాటిని అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులతో పొందాల్సి వస్తోందన్నారు. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం చేశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థంగా అమలు చేసి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ జి.తిరుపతిరావు, వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, జిల్లా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సురేంద్ర, జిల్లా జేఏసీ మహిళా కార్యదర్శి దివిషా బేగం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు ఆంజనేయులు, బాబా సాహెబ్ పాల్గొన్నారు. -
పాఠశాలలను సిద్ధం చేయండి
నరసరావుపేట ఈస్ట్: 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా పల్నాడు జిల్లా పరిధిలోని పాఠశాలలను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాం ప్రసాద్ తెలిపారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 1560 ప్రభుత్వ, 454 ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వివరించారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు చేరుకున్నాయని, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను గురువారం నాటికి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రూ.15 కోట్లతో కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మౌళిక సదుపాయాలు లేని పాఠశాలల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంద రోజుల్లో ఏసీఆర్ కార్యక్రమంలో భాగంగా 60 పాఠశాలల్లో 218 తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ఏడాది 1వ తరగతిలో 12,000 మంది విద్యార్థులు చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను ఇప్పటికే 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ప్రతి తరగతిలో ప్రవేశాలను పెంచేలా అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు వివరించారు. జిల్లా పరిధిలో 484 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించామన్నారు. ఆయా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.27 కోట్లు నిధులు విడుదల కానున్నట్టు తెలిపారు. దీంతోపాటు 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో సదుపాయాలను పరిశీలించి పాఠశాలలు తెరిచే నాటికి వసతి గృహాలను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు తొలిరోజు నుంచే చర్యలు తీసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్న్కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కు కాపు నాడు వినతి -
● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● చికిత్స పొందుతూ మృతి
బెల్లంకొండ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న సంఘటన మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైన్స్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపాలెంకు చెందిన ఇరువురు యువకులు బైక్ వచ్చి మద్యం సేవిస్తున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఒకరికొకరు నెట్టుకున్నారు. గణేష్ అనే యువకుడిని మరో యువకుడు బీర్బాటిల్తో మెడపై దాడిచేశాడు. ఘటనలో గణేష్కు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే 108 సహాయంతో ఇరువురిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై స్థానిక ఎస్సై గోపిని వివరణ కోరగా ఘటన స్థలంలో విచారించామని, యువకుల బంధువులు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్లో ఉన్న శరత్బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్బాబును మెగా కంపెనీ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులు రారు..సమస్యలు తీరవు
యడ్లపాడు: వందేళ్ల భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ పథకం (రీసర్వే)పై అనేక అవాస్తవ ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నా.. కేవలం పథకాల పేర్లు, నినాదాలు మాత్రమే మారాయి తప్ప సామాన్యుడి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ఎన్నికల ముందునుంచే పాలకులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావేదిక, కలెక్టర్ల ఆధ్వర్యంలోని రెవెన్యూ క్లినిక్లు, ఎమ్మెల్యేల ప్రజా దర్బార్లు.. ఇలా ఊరూరా సభలు నిరంతరాయంగా జరుగుతున్నా, అక్కడ అందుతున్న అర్జీల్లో మూడోంతులకు పైగా శాశ్వత పరిష్కారం దొరకడం లేదన్నది బహిరంగ రహస్యం. సామాన్యుడి రెవెన్యూ కష్టాలు తీర్చి, వివాద రహిత గ్రామాలు నిర్మిస్తామన్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో ప్రజల్లో నిరాశ అలుముకుంది. కంటితుడుపు చర్యలేనా? తాజాగా కూటమి ప్రభుత్వం దేశంలోనే వినూత్నమని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రారంభించిన ‘వన్మంత్..వన్ విలేజ్..ఫోర్విజిట్’ కార్యక్రమం ఆరంభంలోనే అపశ్రుతి పలికింది. మొదటి గురువారం వినతులు, రెండో వారం క్షేత్ర విచారణ, మూడో వారం పరిష్కారం, నాలుగో వారం ముగింపు అంటూ పెట్టిన నిబంధనలు కేవలం కంటితుడుపు చర్యలుగా మిగిలిపోయాయి. మ్యుటేషన్లు, సరిహద్దు వివాదాలు, భూ ఆక్రమణలపై ప్రజలు ఆశగా ఇచ్చిన వినతులు అధికారుల గైర్హాజరీతో బుట్టదాఖలయ్యాయి. విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరు, భూముల కొలతలు తప్ప మిగిలిన కీలక సమస్యలన్నీ యథాతథంగా ఉండిపోయాయి. ఈ గ్రామసభలకు కీలక శాఖల అధికారులు దాదాపుగా డుమ్మా కొట్టారు. ఇందుకు ప్రజావేదిక, ఓటర్ల జాబితా పరిశీలన, జనాభా లెక్కలు, వాటిపై అవగాహనలు, శిక్షణలు రీసర్వే వంటి మల్టిపుల్ టాస్క్లు, యాప్ల నిర్వహణతో ఇప్పటికే సతమతమవుతున్న అధికారులపై ఈ అదనపు భారం మరింత ఒత్తిడిని పెంచడమే ప్రధాన కారణమని అధికారులు వెల్లడిస్తున్నారు. లాగిన్ ఇవ్వలేదు.. నాల్గో వారమే రద్దు! హడావిడిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, అధికారులకు కనీసం ఆన్లైన్ లాగిన్ సౌకర్యం కల్పించకపోవడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దీనివల్ల ప్రజలు ఇచ్చిన అర్జీలు ఆన్లైన్ కాక.. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో సైతం ఎలాంటి డేటా లేకపోవడంతో ఇదంతా ఒక గందరగోళ ప్రహసనంగా మారింది. కార్యక్రమం ప్రారంభించిన నాలుగో వారం ప్రజల అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది పోయి, అదేరోజు కార్యక్రమాన్నే పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. దీంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సామాన్యుడి ఆశలు అడుగంటుతున్నాయి. అప్పుడు ‘సక్సెస్’.. ఇప్పుడెండుకు ‘రివర్స్’? ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో తొలిగా ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేసినప్పుడు విజయవంతమైందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు జటిలంగా మారడంతో నిబంధనలను మధ్యలోనే మార్చేస్తూ ప్రభుత్వం కాలయాపన వ్యూహానికి తెరతీసింది. మొదట మండలానికి ఒక గ్రామం అన్న పాలకులు, ఆ తర్వాత నియోజకవర్గానికి ఒకటని, తీరా ఇప్పుడు జిల్లా మొత్తానికి కలిపి కేవలం ఒకే ఒక్క గ్రామానికి పరిమితం చేస్తూ లాగిన్ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఒకే ఒక్క గ్రామం ఆన్న్లైన్న్లో కనిపిస్తుండటం పాలకుల తిరోగమన విధానానికి అద్దం పడుతోంది. ఒక్క పల్నాడు జిల్లాలోనే 364 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇలా ఒక్కో గ్రామానికి నెల రోజుల సమయం వెచ్చిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల సమయానికి కూడా ఒక నియోజకవర్గం పూర్తికావడం అసాధ్యం. ఇది ప్రజా సమస్యల పరిష్కారం కోసమా లేక కేవలం ప్రచారం కోసమా? అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. -
భద్రతా నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు
లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ బి.విజయ కీర్తి -
సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్
నరసరావుపేట: పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వామపక్షాల దేశవ్యాప్త పిలుపు మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రాస్తోరోకో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. విజయకుమార్ మాట్లాడుతూ... మన రాష్ట్రంలో దొరుకుతున్న గ్యాస్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, కార్పొరేట్లకు రాయితీలు రద్దు చేసి ప్రజలపై భారం తగ్గించాలన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రత్యక్షంగా పడిందని అన్నారు. విభజించు పాలించు అనే తీరులో కేంద్రం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సీపీఎం 1వ, 2వ పట్టణ కార్యదర్శులు షేక్ సిలార్ మసూద్, ఎస్డీ రబ్బాని, నరసరావుపేట మండల కార్యదర్శి డి.శివకుమారి, నాయకులు ఎస్.వెంకటేశ్వరరాజు, టి.పెద్దిరాజు, కె.నాగేశ్వరావు, ఎం.ఆంజనేయులు, కె.ఆంజనేయులు, మస్తాన్వలి, ఖాజావలి, సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, చిన్న జాన్ సైదా, రైతు సంఘం నాయకుడు నాగేశ్వరరావు, గిరిజన నాయకుడు కోయ శ్రీను, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్.జిలాని మాలిక్ పాల్గొన్నారు. -
కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన వాహనం
వాహనదారుడు మృతి అమరావతి: మండల పరిధిలోని నరుకుళ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ధరణికోట గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్(39) సోమవారం తాడికొండ మండలం లాం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం అర్థరాత్రి ద్విచక్రవాహనంపై ధరణికోట బయలుదేరాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న హనీఫ్ నరుకుళ్లపాడు వాగు బ్రిడ్జి వద్ద కుక్క అడ్డుగా రావటంతో అదుపు తప్పి వాహనం చింతచెట్టుకు ఢీకొంది. తీవ్రగాయాలై హనీఫ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న అమరావతి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మంగళవారం హనీఫ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు స్పాట్ కౌన్సెలింగ్ గుంటూరు రూరల్: కాచిపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి నగరంలోని అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హిందూ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. మంగళవారం హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మతో కలసి కౌన్సిలింగ్ ప్రతులను ఆవిష్కరించారు. రంగరాజు మాట్లాడుతూ ఫీజులో బీఈ విద్యార్థులకు రాయితీ ఉంటుందన్నారు. కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ మహిళలు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తున్నామన్నారు. సమావేశంలో ఏఐబీఎఫ్ జాతీయ కార్యదర్శి పాండురంగవిఠల్, కొప్పర్తి సీతారమేష్, మాచిరాజు మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, సీతారామయ్య పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు దగ్ధం ఇంకొల్లు(చినగంజాం): చెత్తకు పెట్టిన నిప్పు అంటుకుని ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన వెనిగండ్ల చంద్రశేఖర్కు చెందిన వ్యవసాయ పనిముట్లు నూతనంగా నిర్మిస్తున్న వైద్యశాల పక్కన ఉంచాడు. అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికుడు తగలబెట్టేందుకు నిప్పు అంటించాడు. తీవ్రమైన గాలి ధాటికి మంటలు చెలరేగి చంద్రశేఖర్కు చెందిన 200 స్ప్రింక్లర్ పైపులు, నీళ్ల ట్యాంకు, 2 ఫుట్ వాల్వ్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పారు. జాతీయస్థాయి పోటీలకు పలువురి ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెంకటప్పయ్య జయంతి వేడుకలు
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఏ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గణపవరం యువకుడు మృతి
నాదెండ్ల: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ వెళ్ళిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో గణపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గణపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ పురాణం బాలాజీశర్మ, శ్రీదేవి (అంగన్వాడీ టీచర్) దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిసుబ్రహ్మణ్యేశ్వర శర్మ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు పురాణం లక్ష్మీనాగేశ్వర సాయిమోహన్ (23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో సోదరుడి వద్ద ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడు బాలమురళీకృష్ణ వీరితో పాటూ ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో టిఫిన్ చేసేందుకు లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్, బాలమురళీకృష్ణ ఇరువురూ కూకట్పల్లి సెంటర్కు వెళ్లి తిరిగి రూమ్కు వస్తుండగా టిప్పర్ వాహనం ఢీకొంది. దీంతో సంఘటనాస్థలంలోనే లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలమురళీకృష్ణ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన గణపవరం తరలించారు. ఉద్యోగాన్వేషణకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో శాంతినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో ఘటన -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్, తుమ్మల శ్రీకుమార్, న్యాయవాదులు సీవీఎల్ఎన్ మూర్తి, బైరపునేని నరేష్, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అతివేగం
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శివారులో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయరావు(42), ఉప్పుతల నర్సింహారావు (38) ఇద్దరు గత కొద్ది రోజులుగా సిమెంట్ పరిశ్రమలో లారీలకు సిమెంట్ ఎగుమతి చేసేందుకు వెళ్తుంటారు. రోజుమాదిరిగా మంగళవారం ద్విచక్ర వాహనంపై వారు సిమెంట్ పరిశ్రమకు బయలుదేరారు. గ్రామం నుంచి దామరచర్ల వైపు లారీ యార్డ్ సమీపానికి రాగానే అదే సమయంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి– నారాయణపురం గ్రామానికి చెందిన జెక్క వెంకటేష్(25) దామరచర్ల నుంచి గుంటూరుకు బైక్పై రాంగ్రూట్లో వేగంగా వెళ్తూ ఎదురుగా సిమెంట్ పరిశ్రమకు వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్లు నడుపుతున్న ధనుంజయరావు, వెంకటేష్లకు తీవ్ర గాయాలుకాగా.. ధనుంజయరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్, నర్సింహారావులను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందాడు. నర్సింహారావు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడు బత్తుల ధనుంజయరావుకు కుమారుడు, కుమార్తె, భార్య సైదమ్మ ఉన్నారు. ఉప్పుతల నర్సింహారావుకు ఇద్దరు కుమారులు, భార్య అంజమ్మ ఉన్నారు. మరో మృతుడు జెక్క వెంకటేష్ అవివాహితుడు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారే.. వాడపల్లికి చెందిన ధనుంజయరావు, ఉప్పుతల నర్సింహారావులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. ఇండియా సిమెంట్ (ఆల్ట్రాటెక్) పరిశ్రమలో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. జెక్క వెంకటేష్ కుటుంబం సైతం పేద కుటుంబమే. చిన్నప్పుడే తండ్రి జెక్క శ్రీనివాస్రావు ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి వెళ్లడంతో తల్లి పూలమ్మ పెంచి పెద్ద చేసింది. కుమార్తె పెళ్లి చేయగా కొడుకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేందుకు రైల్వే స్టేషన్లో వాటర్ బాటిళ్లు, చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. వెంకటేష్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. -
గడువులోగా సర్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై మంగళవారం క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో సర్ ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్ఓలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. వాటిని 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బీఎల్ఏ)లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్ఓలు తమ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ ప్రక్రియ సజావుగా సాగేలా సహకారం తీసుకోవాలన్నారు. జాబితాలో మార్పుచేర్పులు ఉంటే వాటిని ఆన్లైన్లో చేసేటప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బీఎల్ఓలకు ఏఈఆర్ఓలు సెలవులు మంజూరు చేస్తేనే తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎలక్షన్ డీటీల వివరాలు కలెక్టర్కు అందజేయాలని సూచించారు. -
వంటింట్లో గ్యాస్ మంట!
కూటమి ప్రభుత్వం ప్రజలపై రోజురోజుకూ పెనుభారం మోపుతోంది. గ్యాస్ బండను సామాన్య కుటుంబాలకు గుదిబండగా మార్చేసింది. పెట్రోల్, డీజిల్ తరహాలోనే గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. గతేడాది సిలిండర్ పై రూ. 50 పెంచిన ప్రభుత్వం మార్చి నెల 7న ఏకంగా రూ. 60 బాదింది. ప్రస్తుతం మరో రూ. 29 పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగను పురస్కరించుకొని చంద్రబాబు సర్కారు అమల్లోకి తెచ్చిన ఉచిత గ్యాస్ అంతా బోగస్గా మారింది. వేలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నేటికీ ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు ఏకంగా రూ.2.28 కోట్లకుపైగానే అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి: పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ గడిచిన రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వాతలు పెడుతూనే ఉంది. ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా విడతలవారీగా పెంచుకుంటూ పోతోంది. దీనికి కొనసాగింపుగా ఈ వారం ఆరంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా గృహావసరాల వంట గ్యాస్ సిలిండర్ ధరనూ భారీగా పెంచింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి, పేద ప్రజలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది. జిల్లాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,019.50 ఉండేది. కూటమి ప్రభుత్వం గత నెలలో సిలిండర్పై ఒకేసారి ఏకంగా రూ. 993.50 ధర పెంచింది. పెరిగిన ధరలతో జిల్లాలో ఆ గ్యాస్ ధర రూ. 3,184 కు చేరింది. ఇక ఈ నెల మొదటి వారంలో మరోసారి వాణిజ్య సిలిండర్ ధర రూ.40 వరకూ పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ. 3,236 కు చేరింది. ఈ ధరల పెంపు చూసి చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోయారు. తాజాగా సిలిండర్ మీద రూ. 40 పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో సిలిండర్పై రూ. 1,051 పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర చూసి తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసేవారు వాపోతున్నారు. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్లు ఇక పూర్తిగా బ్లాక్ కానున్నాయి. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి వ్యాపార కేంద్రాలు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడంతో 90 శాతం హోటళ్లలో గృహ అవసరాల సిలిండర్లు వినియోగిస్తున్నారు. గృహ అవసరాల సిలిండర్లలోని గ్యాస్ను వాణిజ్య అవసరాల సిలిండర్లోకి డంప్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ లేకుండా హోటళ్లు నడుపుతున్న వారు నేరుగా గృహ అవసరాల గ్యాస్నే వాడుతున్నారు. గ్యాస్ కొరతతో, ధర పెంచడంతో చాలా హోటళ్ల వారు కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. పెను భారం... జిల్లా వ్యాప్తంగా 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల వంటింటి గ్యాస్ రూ. 954.50 ఉండేది. తాజాగా రూ. 29 పెంచిన ధర ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారులు రూ. 983.50 చెల్లించాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ కనెక్షన్లు 6,02,997 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,316 కలిపి మొత్తం 7,88,313 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన వినియోగదారుడు నెలకు కనీసం ఒక సిలిండర్ వాడినా వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. 2,28,61,077 అదనంగా భారం పడుతోంది. అడ్డగోలుగా పెంపు ఎన్నికల హామీల్లో భాగంగా వంట గ్యాస్ ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 24 నెలల్లో మూడుసార్లు ధరలు పెంచేశారు. మొదటి 10 నెలలకు రూ. 50, ఈ ఏడాది మార్చి 7న సిలిండర్పై ఏకంగా రూ. 60, ప్రస్తుతం మరో రూ. 29 పెంచి ధరల వడ్డింపు మొదలెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అర్హత కలిగిన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ పథకం ఆదిలోనే అటకెక్కింది. బడ్జెట్ తారుమారు... గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుతో ఆ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. తిరిగి వచ్చి ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏం చేయాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
కరుణ మరచి కాసుల కక్కుర్తి
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్ల దందా కొనసాగుతోంది. రోజూ వేలాది మంది రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు. వారిలో అధిక శాతం నిరుపేదలే. చికిత్స పొందుతూ రోగి మృతి చెందితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు గుమికూడి దందాకు తెరలేపుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల నిస్సహాయ పరిస్థితులను ఆసరా చేసుకొని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాకు కేటాయించకపోవటంతో పేదలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఏరియా ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని అంబులెన్స్ దందా కొనసాగిస్తున్నారు. దుఃఖంలో ఉన్నా వదిలేదే లేదు.. ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అయితే రూ.3,500 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర గ్రామాలకై తే పరిధిని బట్టి రూ.10,000 వరకు అడుగుతున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల నిస్సహాయతను లక్ష్యంగా చేసుకొని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఇలా డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉచిత సేవలు లేకపోవటంతో గత్యంతరం లేక అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. సిబ్బంది పాత్రపై ఆరోపణలు ఈ వ్యవహారం వెనుక ఆసుపత్రి సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి వివరాలు, పరిస్థితి, బంధువుల వివరాల సమాచారం ముందుగానే అంబులెన్స్ నిర్వాహకులకు చేరుతోందని సమాచారం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన సేవలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు, వైద్యశాల సిబ్బంది సలహాల మేరకు నరసరావుపేటలోని పలు ప్రైవేటు వైద్యశాలలకు పేదలు వెళుతున్నారు. దీంతో వారిపై పెను ఆర్థికభారం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు కూడా ఈ దందాకు అతీతం కావటం లేదు. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఇతర అత్యవసర సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారి చుట్టూ ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది చేరుతున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందదని భయపెడుతున్నారు. మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు వైద్యశాల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే చేరిన రోగులను సైతం ప్రైవేటు ఆసుపత్రుల వైపు మళ్లిస్తున్నారు. రోగుల భయాలను, అవసరాలను వీరు సొమ్ము చేసుకుంటున్నారు. పేషెంట్ను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లడానికి కొంత మొత్తం తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినందుకు కమీషను దండుకోవటం వారికి నిత్యకృత్యంగా మారింది. క్షతగాత్రులను అర్హత లేని వైద్యశాలలకు తరలించి ప్రాణాలమీదకు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేమూరు నియోజకవర్గంలో మట్టి దందా
వేమూరు: వేమూరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని చెరువులో మట్టి తవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారు. తెరవెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆలపాడు చెరువులో తవ్విన మట్టిని పెదపూడి, కూచిపూడి, పెరవలిపాలెం, వలివేరు, అమృతలూరు, మూల్పూరు గ్రామాలకు తరలిస్తున్నారు. మట్టి రవాణాను అడ్డుకుంటే బదిలీ వేటు పడుతుందని అధికారులు భయపడుతున్నారు. చుండూరు మండలం పెదగాదెవలర్రు గ్రామంలో కూడా ఇష్టారాజ్యంగా గుంతలు పెట్టి మట్టి తవ్వకాలు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అడ్డుకుంది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తవ్వకాలు నిలిపి వేశారు. అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో చెరువు తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో ఒక వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇరువర్గాలకు చెందిన నాయకులను పిలిచి పంచాయితీ చేశారు. దీంతో మోపర్రులో చెరువు మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆలపాడులో జనసేన పార్టీకి చెందిన ఓట్లు అధికంగా ఉండటం వల్ల ఆ పార్టీ నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి చెరువు తవ్వకంలో ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మండల అధికారులు అక్రమ మట్టి తవ్వకాలు నిలిపి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ సమీపంలోమంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన ఇంకొల్లు విజయలక్ష్మి, కులవపద్మ స్కూటీపై సత్తెనపల్లి వస్తుండగా వెనుకగా వస్తున్న ఖాళీ ఇసుక టిప్పర్ ఢీకొంది. దీంతో స్కూటీ అదుపు తప్పి కిందపడిపోగా, స్కూటీ వెనుక కూర్చున్న టి.పద్మ (36) తలరోడ్డుకు తగిలి రక్తగాయమై మృతిచెందింది. స్కూటీ నడుపుతున్న విజయలక్ష్మి హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్ను సత్తెనపల్లి రూరల్ పోలీసులు స్టేషన్కు తరలించారు. పద్మ మృతితో భర్త నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహంతో ఇంటి ముందు నిరసన గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందా డు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. -
చంద్రబాబు మోసకారి
మాచర్ల: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఎంతో మోసపూరితంగా ఆయన వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన కార్యక్రమం మాచర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఐదు మండలాల నుంచి వందల మంది తరలివచ్చారు. కార్యాలయం వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు, యువత, ప్రజలు, మహిళలు.. ఇలా అన్నివర్గాల వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను పీఆర్కే ఆధ్వర్యంలో ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత పీఆర్కే మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించేలా రెండేళ్లుగా పాలన చేస్తున్నారన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతులకు చేసిన మేలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను ఊసే లేదని, రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూడా లేవని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలివేసి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ ఇప్పటికీ గాలి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రంలోని ప్రజలకు ఒక్క రూపాయి కేటాయించడం లేదన్నారు. చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుమారుడి కోసం, దత్త పుత్రుడి కోసం ఐటీ కంపెనీలతో ఫేక్ ప్రచారం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ పాలనంతా జగన్ ఫోబియాతోనే చేస్తున్నారన్నారు. నిజాలు మాట్లాడినా, ప్రజలకు మేలు చేయలేదని అడిగినా... అక్రమ కేసులు పెడుతూ అన్ని వర్గాలను పోలీసు స్టేషన్కు పిలిపించి రెడ్బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పోలా శ్రీను, యరబోతుల శ్రీనివాసరావు, బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, పెద్ద మల్లు స్వామి, నవులూరి భాస్కర్రెడ్డి, పోతురెడ్డి కోటిరెడ్డి, షేక్ మస్తాన్, నవులూరి చెన్నారెడ్డి, కొమ్ము చంద్రశేఖర్రావు, కొంగర సుబ్రహ్మణ్యం, చిలుకూరి చంద్రశేఖర్రెడ్డి, నరసింహరావు, తిప్పారెడ్డి గోపాల్రెడ్డి, డి. వెంకటేశ్వర్లు, కొండా శివలింగరాజు, గొట్టం బ్రహ్మారెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, గోలి శ్రీనివాసరావు, షేక్ బాజి, ముస్తఫా, రామాంజనేయరెడ్డి, పిల్లి కొండ, మోరా రామకష్ణారెడ్డి, కేతావత్ బాలునాయక్, మాచర్ల పవన్, పాముల సంపూర్ణమ్మ, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతి, పులిమెల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
దగా డీఎస్సీగా మార్చారు
నరసరావుపేట: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పోస్టులను అమ్ముకొని దగా డీఎస్సీగా మార్చిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడ్డారు. పార్టీ అధీష్టానం పిలుపు మేరకు సోమవారం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను ప్రవేశద్వారం వద్ద పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకొని కేవలం కొంతమందినే లోపలికి పంపారు. పీజీఆర్ఎస్లో దగా డీఎస్సీపై సీబీఐచే విచారణ జరిపించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీబీఐతో విచారణ జరిపించాలి డీఎస్సీపై వచ్చిన వదంతులపై సీబీఐచే విచారణ జరిపించాలని, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ డీఎస్సీలో అవకవతకలు, అభ్యర్థులకు అన్యాయం ఖచ్చితంగా జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 431పోస్టులను న్యాయంగా భర్తీచేయకుండా తమ వారికి అమ్ముకున్నారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీఎస్సీ–98 బ్యాచ్కు 4500 మందికి డీఎస్సీ పోస్టులు ఇవ్వటం వలన వారి కుటుంబాలు అంతా చల్లగా ఉన్నాయన్నారు. ఇప్పుడు అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్ మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యాలరావు, రాష్ట్ర సంయుక్త కార్య దర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా ఉపాధ్యక్షులు నెలటూరి సురేష్, నరసరావుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్, సోషల్మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, కుక్కల పౌలయ్య, రొంపిచర్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటేష్ పాల్గొ న్నారు. అనంతరం కలెక్టర్ ముందు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు రిజర్వేషన్ సక్రమంగా అమలుచేయకుండా హారిజంటల్ రిజర్వేషన్ అనే కొత్తపేరుతో ఎస్సీలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. జీఓ నంబరు 47 అనే కొత్త ఉత్తర్వులతో రెండుశాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను మూడు శాతానికి పెంచారన్నారు. నిబంధనలకు విరుద్దంగా మెరిట్కు పాతరేసి ఒక్కో పోస్టును రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్ముకోవటంపై ఆడియో, వీడియాలు బయటపడ్డాయన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఎటువంటి చలనంలేదన్నారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపే ఉద్దేశ్యంతో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామన్నారు. -
రెండేళ్లలో మొండిచేయి
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా కూటమి నేతలు భారీఎత్తున సంబరాలకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభలకు నాంది పలుకుతున్నారు. అయితే ఇదే సమయంలో రెండేళ్ల కూటమి పాలనలో ఏం సాధించారని పల్నాడు జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి లేదని, తామొస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చారు. మరి రెండేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా పూర్తి చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన సూపర్–6 పథకాలైనా అమలయ్యాయా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో ఏం సాధించారని విజయోత్సవ సభలు చేపడుతున్నారంటూ పల్నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక అడుగువేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయితే రెండేళ్లైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు. ఇంకా అనుమతులంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు జలజీవన్మిషన్, వైఎస్సార్ కరువునివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు వసంతాలు గడిచినా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేకపోతున్నారు. నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు ఇంకా స్థలసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడో పూర్తికావాల్సిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వినుకొండ ట్రామాకేర్ ఏర్పాటు ఎంతో అత్యవసరం దాని ఊసే ప్రస్తుత పాలకులు ఎత్తడం లేదు. సాగర్ కాలువల మరమ్మత్తులు ఇప్పటివరకు చేయలేదు. కీలకమైన జాతీయ రహదారుల పనులు ముందుకుసాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి భూసేకర నేటికి పూర్తికాలేదు. మాదిపాడు బ్రిడ్జ్ పూర్తి చేయలేదు. అభివృద్ధి పనులను అటకెక్కించారు.. ఇంటికే అందుతున్న సంక్షేమానికి మంగళం పాడారు.. ఎర్రటి ఎండలో పండుటాకులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. రైతులు పెట్టుబడి సాయం లేక.. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.. ప్రభుత్వ బడులు మూసేశారు.. పిల్లల్ని ‘ప్రైవేటు’ బాట పట్టించారు. అంతన్నారు.. ఇంతన్నారు.. సూపర్ సిక్స్ అమలులో సూపర్ ప్లాఫ్ అయ్యారు. జిల్లాలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనీలేదు.. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించిన వరికపూడిశెల పనులు సైతం పూర్తిచేయలేదు.. పిడుగురాళ్ల మెడికల్ కళాశాల అభివృద్ధి ఊసే లేదు.. రెండేళ్ల కూటమి నేతలు సాధించింది.. కుట్రలు.. కుతంత్రాలు.. ప్రతిపక్ష నేతలకు వేధింపులు.. క్రూరంగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు మాత్రమేనంటూ జనం పెదవి విరుస్తున్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
అర్చకులపై వేధింపుల పట్ల భక్తుల మండిపాటు
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అర్చకస్వాములపై కూటమి ప్రభుత్వ వేధింపుల పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తులు ఎంతో నమ్మకంతో స్వీకరించే కంకణధారణల నుంచి ఆలయ అర్చకులను తప్పించే కుట్రపై మండిపడుతున్నారు. ఆలయ దినదినాభివృద్ధిలో అర్చకస్వాముల కృషిని వారు గుర్తు చేస్తున్నారు. ఆలయ కమిటీ, ఈవో చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యకం అవుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు పాటించలేదనే నెపంతో ఆలయ అర్చకులపై చర్యలకు ఈవో నలబోతు మాధవిదేవి సిద్ధమవుతుంది. ఈ మేరకు సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. భక్తుల కొంగుబంగారంగా, గ్రామదేవతగా వెలిసిన ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి దేవస్థానం ఐదు దశాబ్దాల్లో జిల్లాలోని ప్రముఖ దేవస్థానంగా మారింది. కోరిన కోర్కెలు తీరుతుండటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగసాగింది. ఆదాయం పెరగడంతో ఆలయ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయంలో 40 సంవత్సరాలుగా కొత్తలంక సుధాకరశర్మ కుటుంబ సభ్యులు అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుమారుడు కార్తీకేయ శర్మ అర్చకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయంలో కంకణధారణపై అర్చక కుటుంబంపై ఆలయ కమిటీ, ఈవో వేధింపులకు పాల్పడటం చర్చనీయంగా మారింది. వివాదాస్పదం కమిటీ చైర్మన్ తీరు ఆలయ కమిటీ చైర్మన్గా బండ్లమూరి చంద్రశేఖర్ వ్యవహార శైలి గతంలోను వివాదాస్పదంగా ఉంది. ఆలయ చైర్మన్గా ఆయన తండ్రి రామయ్య వ్యవహరిస్తున్న సమయంలో అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై వీరు దాడులకు పాల్పడ్డారు. ఈ కేసులో ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ వ్యవహారానికి కారణం ఆలయ అర్చకులే అని అక్కసు పెంచుకున్న చైర్మన్ ఎలాగైనా వారిని ఆలయం నుంచి బయటకు పంపాలనే కుట్ర చేస్తూ పావులు కదుపుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో చైర్మన్గా ఎంపికై న నాటి నుంచే ఏకపక్షంగా వ్యవహరిస్తూ అర్చకులపై వేధింపులు ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కంకణదారణను అర్చకుల నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. తహసీల్దార్ బెదిరింపులపై భక్తుల మండిపాటు కంకణధారణ వ్యవహారాన్ని వివాదాస్పదంగా మార్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ ఈవో నలబోతు మాధవిదేవి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈఓ భర్త వేణుగోపాల్ ప్రస్తుతం నరసరావుపేట తహసీల్దార్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఆలయంలో అర్చకులకు, ఈవో, కమిటీ సభ్యులకు మధ్య జరుగుతున్న వివాదంలో సంబంధం లేకపోయినా ఆయన తలదూర్చడం వివాదాస్పదంగా మారింది. ఆలయ విధుల్లో ఉన్న అర్చకస్వాములపై బెదిరింపు ధోరణిలో తహసీల్దార్ మాట్లాడటం పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మీరు ఎలా ఇక్కడ పనిచేస్తారో చూస్తా అంటూ అర్చకులపై ఆయన బెదిరింపులకు పాల్పడటం భక్తులకు విస్మయానికి గురిచేసింది. ఆలయ వ్యవహరాల్లో ఎటువంటి సంబందం లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతారని భక్తులు ప్రశ్నించారు. తహసీల్దార్ బెదిరింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు భక్తులు తెలిపారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఆదివారం ఆలయంలో చోటుచేసుకున్న ఘటనపై ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ, కెఆర్విఎస్ కార్తికేయలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు ఈవో నలబోతు మాధవిదేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. కంకణధారణలో ప్రభుత్వ ఉత్తర్వులను అర్చకుల ధిక్కరించారని పేర్కొన్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేవదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక సమర్పించినట్టు వివరించారు. -
అర్జీలు త్వరితగతన పరిష్కరించేలా చర్యలు
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలకు మొదటి ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి వివాదాలతోపాటు మోసం తదితర సమస్యలపై 77 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భార్యాభర్తల వివాదాలపై 15, ఆర్థిక అంశాలపై 12, భూ వివాదాలపై 12, కుటుంబ వివాదాలపై 6, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఐదు ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదు పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు. -
డీఈఓపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మెరిట్కు అన్యాయం చేస్తున్న పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు ఏపీ గిరిజన సంఘం, మాల మహానాడు, పీడీఎం, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, బీసీ సంక్షేమ సంఘం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాలు వినతిపత్రం అందజేశాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో (సమగ్ర శిక్ష) ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్ఎస్సీఓ పోస్టులు డిప్యూటేషన్పై భర్తీకి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఇఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్కులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. పది రోజుల తరువాత డిఇఓ తను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డీఇఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగే అవకాశం లేనందున కలెక్టర్ జోక్యం చేసుకుని ఇంటర్వ్యూని పారదర్శకంగా జరిపి మెరిట్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా మెరిట్కు అన్యాయం జరిగితే తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించారు. పీడీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన మెరిట్ ఉన్న ఉపాధ్యాయులకు ఈ పోస్టులు ఇవ్వాలని అలాకాని పక్షాన డీఈఓను సస్పెండ్ చేసే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ గతంలో కూడా డీఈఓపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, గిరిజన సంఘ ఉపాధ్యక్షులు వాంకడోత్ కోటా నాయక్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, బీసీ సంఘం నాయకులు బిళ్లగంటి శ్రీను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కోటా సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్కు ప్రజాసంఘాల వినతి -
అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ సంజన సింహ నరసరావుపేట: అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులకు చెందిన 183 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 61 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్కు చెందినవి 19, సత్తెనపల్లి 28, గురజాల డివిజన్వి 14 ఉన్నాయి. -
కుట్రలో భాగమే మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్ కుట్రపూరితంగా జరిగిందని, బ్రహ్మనాయుడు ఒక బాధితుడని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి కొనుగోనులో బ్రహ్మనాయుడు పేరుపై అగ్రమెంట్ లేదు, అసలు బ్రహ్మనాయుడి ప్రమేయమే లేదు, మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి బ్రహ్మనాయుడు అని శంకరరావు పేర్కొన్నారు. భూ వివాదాన్ని పరిష్కరించమని బ్రహ్మనాయుడే జిల్లా కలెక్టరును కోరిన బాధితుడు మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పచ్చమీడియా విష ప్రచారం చేయడం కుట్రలో భాగమేనన్నారు. అసలు మూడున్నర కోట్లు విలువచేసే భూమి రూ.1500 కోట్లు ఎలా అవుతుందో అర్థం కావడం లేదన్నారు. మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తిపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. మీడియా ఉందని ఎలాబడితే అలా రాస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. -
గంగలకుంటలో వివాహిత హత్య
వెల్దుర్తి: మండలంలోని గంగలకుంటలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లి వీరమ్మ (50) అర్థరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వీరమ్మను సమీప బంధువులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అర్థరాత్రి వర్షం కురిసిన సమయంలో ఈ సంఘటనకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. కొడుకు కొల్లి అంజి ఫిర్యాదు మేరకు మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజుపాలెం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై చౌటపాపాయపాలెం బస్టాప్ సమీపంలో సోమవారం జరిగింది. కొండమోడుకు చెందిన పందిటి సాయిదుర్గారెడ్డి(23) సత్తెనపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతుడు అవివాహితుడు. ఇటీవల మృతుని తండ్రి పుల్లారెడ్డి అనారోగ్యంతో మృతిచెందడం కొద్దిరోజుల వ్యవధిలోనే కుమారుడి మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిలకలూరిపేట టౌన్ :రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతరోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే వీసా సురేష్ (34) కేటగిరింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి పది సంవత్సరాల కిందట మృతిచెందడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రహదారి దాటుతున్న సమయంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళుతున్న రూరల్ ఎస్సై చెల్లి రమేష్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని పట్టణంలోని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగై చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని సోదరుడు సురేంద్ర ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు. దుర్గి: మండల పరిధిలోని పోలేపల్లి జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో–లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇరువురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓబులేశునిపల్లి గ్రామానికి చెందిన బొజ్జా కోటేశ్వరరావు (40) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటోను లారీ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ఉన్న కారంపూడి మండలం నలమాలపాడు గ్రామానికి చెందిన ఇరువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రధాన రహదారిపై గోతులు పడడంతో ప్రమాదానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అతివేగంగా వస్తున్న లారీ గుంతలను తప్పించే క్రమంలో ఆటోను ఢీకొనడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా గుంతలు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
11న ఫుట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలు నరసరావుపేట టౌన్: ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన సోమవారం పట్టణ శివారులో చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మేరీ సుశీల, రామారావు, సౌరమ్మ, సలోమి, ఆంథోనమ్మ, వేలంగిణి రాణి లతో పాటు మరో ఐదుగురు ఆటోలో రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బంధువులు చనిపోతే చూసేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. నరసరావుపేట శివారు గుంటూరు రోడ్డు ఆర్కే రెస్టారెంట్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. సంఘటనలో పై ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈఎంటీ వెంకట చెన్నయ్య, పైలెట్ సాయిరామ్లు క్షతగాత్రులను ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
జన సైనికుల వీరంగం
బిహార్ కూలీపై దాడి సాక్షి, టాస్క్ఫోర్స్ : మద్యం మత్తులో బిహారు కూలీ పై జనసైనికులు దాడికి దిగిన సంఘటన ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఆరుకు పైగా మద్యం బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పూర్ణ అనే మహిళ చిల్లర దుకాణంతో పాటు బెల్ట్షాపు నిర్వహిస్తున్నారు. జనసైనికులు శిరిగిరి రాకేష్, శిరిగిరి జయంత్లు మద్యం మత్తులో బెల్ట్షాపు దుకాణం వద్దకు వచ్చి క్వార్టర్ పై రూ.60 లు ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారంటూ నిర్వాహకురాలితో వాదనకు దిగారు. మీకు బెల్ట్ షాపు ఎవరిచ్చారంటూ నిలదీశారు. మాకు ముప్పాళ్ళ వాళ్ళు ఇచ్చారు...ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నిర్వాహకురాలు అనడంతో నిర్వాహకురాలికి, జనసైనికులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దుకాణంలో సీసీ కెమెరాలో రికార్డు కావటాన్ని గమనించిన జనసైనికుల్లోని ఒకరు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని దుకాణదారురాలితో సీసీ కెమెరా తీసేయ్ అంటూ వాదనకు దిగాడు. గ్రామంలోని రామా లయం నిర్మాణ పనులకు వచ్చిన బిహార్ కు చెందిన కూలీల్లో ఒకరు పూర్ణకు చెందిన దుకాణంలో నిత్యావసర సరుకులు కోసం వెళ్లి జనసైనికులకు, దుకాణం నిర్వాహకురాలి మధ్య జరుగుతున్న వాదనను పక్కన నిలబడి చూస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న జనసైనికుల్లోని ఒకరు నిలబడి ఉన్న కూలీ వివరాలు అడుగుతూ, నీకు ఇక్కడేం పనిరా అంటూ చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న మరొకరు తన ప్యాంట్ జేబులో ఉన్న స్టిక్ను తీసుకొని కూలీపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. పక్కనే ఉన్న వారు వారిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేస్తుండటంతో కూలీ పరారయ్యాడు. అనంతరం దుకాణం పైన దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ సంఘటన అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై నకరికల్లు సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లుకు చెందిన వాకాటి నాగరాజు(18) అతని మిత్రుడు ద్విచక్రవాహనంపై నకరికల్లు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ వాకాటి నాగరాజును వేగంగా ఢీకొంది. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అందుకు రెవెన్యూ అధికారులు సహకరించడంతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు గత వారం రోజులుగా జోరందుకున్నాయి. గ్రామ రెవెన్యూ పరిధిలో వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించారు. ఆ కేంద్రానికి చుట్టుపక్కల సుమారు 15 అడుగుల లోతులో గత వారం రోజులుగా గ్రామానికి చెందిన ఇద్దరు అధికార టీడీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ యద్దనపూడి తదితర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో ఓ నాయకుడు తనకు గ్రావెల్ తవ్వకాల కోసం తహసీల్దార్ మౌఖిక అనుమతులు ఇచ్చారని చెప్పుకోవడం విశేషం. నేనెవరో తెలుసా అంటూ.. విషయం తెలిసిన కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేశ్బాబు ఆదివారం మధ్యాహ్నం గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడివారిని ప్రశ్నించారు. మొదట ఇది తమ పట్టా భూమి అని అనంతరం తహసీల్దార్ అనుమతులు ఉన్నాయని దబాయించే ప్రయత్నం చేశారు. పట్టా చూపమని రమేశ్బాబు, అడగ్గా వారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. అంతటితో ఆగక సదరు చోటా నాయకుడు నేనెవరో తెలుసా ఇప్పుడే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నా, మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ రమేష్ బాబుతో వివాదానికి దిగాడు. మరో వర్గం నాయకుల ఒత్తిడితో దాడులు అధికార పార్టీలోని ఆధిపత్య పోరులో భాగంగా వీరిద్దరిని వ్యతిరేకించే మరో వర్గం నాయకులు తహసీల్దార్, వీఆర్వో, ఏఆర్ఏలను గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశించడం విశేషం. దీంతో తహసీల్దార్ ఆదేశాలతో ఇరువురు సిబ్బంది గ్రావెల్ తవ్వకాల వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్ర చెరువు భూమి అని తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ తమను అక్కడికి పంపినట్లుగా వీఆర్వో తెలిపారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఫారెస్ట్ భూమిలో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హెచ్చరించారు. తవ్వకాల కోసం ఒక పొక్లెయిన్, సుమారు 20 కి పైగా ట్రాక్టర్లు అక్కడ సిద్ధంగా ఉండటం చూస్తుంటే దీని వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా అంత బహిరంగంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహించే ప్రయత్నం జరగదని అర్థమవుతుంది. వారం రోజులుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించిన స్థానిక టీడీపీ నాయకుడు పల్నాడు జిల్లా గణపవరంలోని ఎంఎల్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ట్రాక్టర్లకు సీరియల్ నంబర్లతో టోకెన్లు ముద్రించి అడ్డగోలుగా వ్యాపారం సాగించాడు. టీడీపీలోని వర్గపోరుతో అధికారుల దాడులు అప్పటివరకు మిన్నకుండిపోయిన యంత్రాంగం -
కౌలు రైతు ఆత్మహత్య
కొల్లూరు: పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరు మండలంలోని దోనేపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దోనేపూడికి చెందిన నిమ్మగడ్డ దుర్గారావు (60) మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతి విపత్తుల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి తోడు, పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులతో సతమతమవుతూనే చేసిన అప్పులు తీర్చి, ఆర్ధికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్ధేశ్యంతో లారీ కొనుగోలు చేసి ఇసుక, ఇటుక, మెటల్ చిప్స్ రవాణా ద్వారా బ్రోకరేజ్ చేస్తూ వచ్చాడు. వ్యవసాయంలో వస్తున్న నష్టాలకు తోడు బ్రోకరేజ్లో సైతం నష్టాలు ఎదురవడంతో అప్పులు అధికమయ్యాయి. కొద్ది రోజులుగా తన భార్య వద్ద బాధను వెళ్లగక్కుతున్నాడు. ఎలాగోల కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య సర్ధిచెప్పింది. దుర్గారావు ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి కలుపు నివారణ మందును సేవించాడు. ఇది గమనించిన భార్య స్థానికులు, బంధువుల సాయంతో వైద్యశాలకు తరలించింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. వైద్యశాల నుంచి కొల్లూరు పోలీసులకు ఆదివారం అందిన మరణ నివేదిక మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు శవ పంచనామా నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొండవీడులో వెలుగులోకి శిలా శాసనం
యడ్లపాడు: చారిత్రాత్మక కొండవీడు కోటలో మరో శాసనం బయటపడినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. 42 కొండల సమాహారమైన కొండలలో అతి ఎత్తైన రుద్రపాద శిఖరం సమీపంలో ఈ శాసనం బయటపడిందన్నారు. ముస్లిం రాజుల పాలన కాలంలో ఈ శిఖరాన్ని ఆదం షఫీ బోడు అని పిలిచేవారన్నారు. ఈ శిఖరంపై రెడ్డిరాజులు 14, 15 శతాబ్దాల్లో నిర్మించిన రెండు శివాలయాలు, ఆ తర్వాతి ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన దర్గా ఉండటంతో హిందువులతో పాటూ ముస్లింలు కూడా వెళ్లి అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలు శాసనాలు బయటపడ్డాయన్నారు. తాజాగా బయటపడిన శాసనాన్ని మైసూర్లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం పరిశీలనకు పంపగా, ఇది దాన శాసనంగా గుర్తించారు. శాసనంలో వివరాల మేరకు, భట్లకు నాలుగు వృత్తులు, విరుపాక్ష దీక్షితులకు రెండు వృత్తులు ధారబోసినట్లు రాసి ఉంది. శ్రీ కై లాస శివాయ నమః అని రాసి ఉంది. ఈ శాసనాన్ని పర్వతం ఔభళ పంచారామలు రాసినట్లు ఉంది. కొండవీడు చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో శాసనాలు ఉన్నాయని, భవిష్యత్ తరాలకు రెడ్డి రాజుల చరిత్ర తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సులో ఆగిన ప్రయాణికుడి గుండె
చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు -
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ సైక్లింగ్ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్ జూనియర్, సీనియర్ చాంపియన్షిప్ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్ ఖాన్తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ. అశోక్బాబు, క్రిస్టఫర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్లు కాశీనాథ్రెడ్డి, సీహెచ్ శ్రీరామ్, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఆర్చరీలో చిచ్చర పిడుగు
● విలువిద్యలో సత్తా చాటుతున్న నరసరావుపేట బాలుడు ● చిన్న వయస్సులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నరసరావుపేట: విలువిద్య (ఆర్చరీ) పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నరసరావుపేటకు చెందిన 13 ఏళ్ల బాలుడు మాలపాటి మారుతీ ఆరుష్రెడ్డి సత్తా చాటుతున్నాడు. గత మే నెల గోవాలో నిర్వహించిన ఒకటో ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో రెండు రజతాలు, మూడు, తొమ్మిదో ర్యాంకులు సాధించాడు. చిన్నానాటి నుంచే విజయాలు... డాక్టర్ మాలపాటి చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీలకు 2013 మే 23న జన్మించిన ఆరుష్రెడ్డి చిన్న వయస్సులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. ● మూడేళ్ల వయస్సులోనే విజయవాడ ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేరటం ద్వారా విలువిద్యలో అడుగుపెట్టాడు. దేశం, విదేశాల్లో 17 పోటీల్లో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ● 2017 ఆగస్టు 15న రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ నిర్వహించిన అండర్–9 విభాగ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు. ● 2018 మే 20న రికర్వ విభాగంలో 15 మీటర్ల దూరం నుంచి 122 సెం.మీ. లక్ష్యంపై 14 నిమిషాల 40 సెకన్లలో 118 బాణాలు సంధించి అత్యంత పిన్నవయస్కుడిగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కాడు. ● అక్టోబరులో రికర్వ్ బాలుర అండర్–9 మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్లో కాంస్య పతకం, నవంబరు 2019 చైనా మకావులో నిర్వహించిన వరల్డ్ ఆర్చరీ ఇండోర్ యూత్ పోటీల్లో 12 మీటర్ల దూరంలో 40 సెం.మీ. లక్ష్యంపై జరిగిన అండర్–12 రికర్వ బాలుర విభాగంలో 17వ స్థానం పొందాడు. ● 2022 మే నెలలో ఏపీలో జరిగిన 12వ మినీ, నాలుగో కిడ్స్ అంతర్ జిల్లా రాష్ట్ర స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రథమ స్థానం పొందాడు. ● ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో ఒలింపిక్ రౌండ్, మిక్స్డ్ టీమ్, 10 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు, 15 మీటర్లు, ర్యాంకింగ్ రౌండ్ విభాగాల్లో రజత పతకాలు సాధించాడు. ● 2024 నవంబరులో గుజరాత్లో నిర్వహించిన 68వ జాతీయ పాఠశాల క్రీడల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ● గుజరాత్లో జరిగిన 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో కాంస్య పతకం పొందాడు. ● 2025 మార్చిలో గుంటూరులో నిర్వహించిన 14వ ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణపతకం, వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్లో కాంస్య పతకం పొందాడు. మరిన్ని పతకాలే లక్ష్యం ఆరుష్రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తులో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది తన ఆశయమని చెప్పాడు. ఈ సందర్భంగా ఆరుష్ తాను సాధించిన పతకాలు, షీల్డులను ప్రదర్శించాడు. ఆదివారం స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో ఏపీ ఆర్చరీ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, ప్రధాన కోచ్ చెరుకూరి సత్యనారాయణ, ఆరుష్ తాత, అమ్మమ్మలు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, డాక్టర్ పమ్మి సరస్వతి తదితరులు చిన్నారిని అభినందించారు. -
నేడు కలెక్టరేట్లో ’ప్రజాసమస్యల పరిష్కార వేదిక’
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుందని, నోటీసులు, ఎండార్స్మెంట్లు, వాట్సాప్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని, గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొనుగుపాడు గ్రామానికి చెందిన గద్దె కోటేశ్వరరావు(55) అడిగొప్పుల వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుండ్లపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసరావుపేట రూరల్: ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన ఘటన శనివారం రాత్రి వినుకొండ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇల్లా ఉన్నాయి... విజయవాడ నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ రోడ్డులో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురికి గాయాలయ్యాయి. బస్సు ముందు భాగంతోపాటు కుడివైపున దెబ్బతింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. యడ్లపాడు: విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేడిద అరుణ (45) తన పశువుల పాక వద్ద విద్యుత్ మోటారు ద్వారా నీటిని పట్టుకుంటుండగా విద్యుత్షాక్కు గురైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త దావీదు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. -
నరసరావుపేట పట్టణ జనాభా 1.40 లక్షలు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపల్ పట్టణ జనాభా దాదాపు 1.40 లక్షలుగా తేలింది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1.17 లక్షలు మాత్రమే. గత 15 ఏళ్లలో పెరిగింది కేవలం 25 వేల జనాభా మాత్రమేనని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ 15 ఏళ్లలో పట్టణ జనాభా 1.60 లక్షల వరకు ఉంటుందని ఊహించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. గత నెల నుంచి చేపట్టిన జనాభా గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం సోమవారం ఎనిమిదో తేదీతో ముగియనుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం మే 31వ తేదీతో ముగియాలి. మరో వారం పొడిగించారు. మే 31వ తేదీతోనే దాదాపుగా పట్టణంలో ఇళ్ల గణన ముగించారు. అక్కడక్కడ తాళాలు వేసిన ఇళ్లు, ఖాళీగా ఉన్న వాటిని మరోసారి లెక్కిస్తున్నారు. పురపాలకసంఘ పరిధిలోని 38 వార్డులను 365 బ్లాకులుగా విభజించి 190 మంది సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణానికి నాలుగువైపులా ఉన్న ఇసప్పాలెం, లింగంగుంట్ల, యల్లమంద, కేసానుపల్లి, రావిపాడు గ్రామాల పరిధిలోని 4,458 గృహాలతోపాటు పట్టణంలో ఇప్పటికే ఉన్న 28 వేలకుపైగా అసెస్మెంట్లలోని గృహాలను గణించగా ఈ జనాభా లెక్క తేలింది. పురపాలక పరిధిలో భూమి రేటు పెరిగిపోవటంతో భరించలేని చాలామంది పంచాయతీల్లో కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవటం, లేదా రియల్టర్లు కట్టించిన ఇళ్లను కొనుగోలు చేసి అక్కడే ఉండటం చేస్తున్నారు. దీని వలన జనాభా సంఖ్య అనుకున్నంతగా పెరగలేదు. నేటితో ముగియనున్న ఇళ్ల గణన -
పల్నాడు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు. -
ఎదురెదురుగా రెండు బైకులు ఢీ
బొల్లాపల్లి: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బొల్లాపల్లి మండలం బండ్లమోటు – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కొండబోయిన నాగేశ్వరరావు (45) మృతి చెందాడు. భార్య గోవిందమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సరికొండపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. రావులాపురం గ్రామానికి చెందిన గొంగటి హుస్సేన్రెడ్డి ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామం వెళుతున్నాడు. మార్గంమధ్యలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండెబోయిన నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన గోవిందమ్మను చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్ల మోటు ఎస్సై ఎస్డీ సమీర్ బాషా తెలిపారు. భర్త మృతి– భార్యకు తీవ్ర గాయాలు -
ఆడబిడ్డలకూ వెన్నుపోటే!
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ. 1,500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలామంది ఓటేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై నోరు మెదపడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోగానీ, మంత్రివర్గ భేటీలోగానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పథకం గురించి చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిసినట్లేనా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండని సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత సలహాలపై మహిళా లోకం భగ్గుమంటోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ. 18 వేలు ఆర్థిక సహాయం అందజేయాలి. ఈ పథకం కోసం జిల్లాలోని మహిళలందరూ ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని 7,80,538 మంది మహిళలకు నెలకు రూ. 117.08 కోట్లు బకాయి పడింది. రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ. 36 వేలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని వారికి ఇలా మొత్తం రూ. 2,810 కోట్లు అందజేయాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి నెలా రూ. 1500 చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళల జీవనోపాధికి పెద్దపీట వేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత వంటి ముఖ్యమైన పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలిచింది. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాకే జమ చేసింది. ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.36 వేల వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి రెండేళ్లలో జిల్లా అతివలకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,810 కోట్లు ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు టీడీపీ సర్కార్ ఎత్తుగడలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. ఇంకెవరైనా అమలు చేయలేదంటే వారి నాలుక మందమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో అన్నారు. తీరా చూస్తే మసిపూసి మారేడు కాయ చేసి ఇచ్చాం అన్నట్లు ఉంది ఆయన ప్రభుత్వం తీరు. కుట్రలో భాగంగా పీ4 పథకంలో ఆడబిడ్డ నిధిని చేర్చి ఇక అన్నీ ఇచ్చేశాం అన్నట్లు కవర్ చేసి చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని మరిచిపోయేలా చేసేందుకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనడంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మహిళలు విమర్శిస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లలను కంటే రూ. 30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ. 40 వేలు మహిళలకు ఇస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటన చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడానికే ఆ తల్లిదండ్రులు నానా యాతన పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను మరువలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. -
రగ్బీ రాష్ట్రస్థాయి చాంపియన్లు శ్రీకాకుళం, తూర్పుగోదావరి
సత్తెనపల్లి: రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రగ్బీ రాష్ట్ర స్థాయి అండర్–18 బాల,బాలికల జూనియర్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానాన్ని, నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని, ప్రకాశం జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా, ద్వితీయ స్థానాన్ని ఆతిధ్య పల్నాడు జిల్లా, తృతీయ స్థానాన్ని గుంటూరు జిల్లా కై వసం చేసుకున్నాయి. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబు హాజరై విజేతలకు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి బి.రామాంజనేయులుతో కలిసి బహుమతులు అందజేశారు. ఇండియన్ రగ్బీ క్రీడాకారిణి ఎన్ఎస్ అక్షయను సన్మా నించారు. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.కృష్ణారెడ్డి పి.డానియల్, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు, టెక్నికల్ అధికారులు, పీడీలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు. బాపట్ల డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ -
అర్చకులపైనా ఆగడాలు
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇరువర్గాల వాగ్వాదం ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇస్సపాలెం ఆలయ అర్చకులకు టీడీపీ నేతల వేధింపులు తాజాగా కంకణధారణ రద్దు చేయించిన నాయకులు ప్రైవేటు అర్చకులతో నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు అడ్డుకున్న ఆలయ అర్చకులు... ఆలయంలో ఉద్రిక్తత -
అధిక బరువు శిశువు జననం
మాచవరం: మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధిక బరువుతో శిశువు జన్మించినట్లు వైద్యాధికారి ఎస్.ప్రసాద్ తెలిపారు. మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన డి దివ్యకు 4.6 కిలోల బరువు గల ఆడ శిశువు సాధారణ కాన్పు ద్వారా జన్మించినట్లు తెలిపారు. పీహెచ్సీ సిబ్బంది చాకచక్యంగా వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు అయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరుకు చెందిన సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ కొమ్మినేని రంజిత్ కుమార్ ది ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్) బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నందు ప్రొఫెషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నుంచి ఉత్తర్వులు అందినట్లు రంజిత్ కుమార్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రొఫెషనల్ డైరెక్టర్గా మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. -
బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అక్రమమే
● బాఽధితులనే నిందితులుగా చేర్చటం అన్యాయం ● మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం చిలకలూరిపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుది అక్రమ అరెస్టు అని, బాధితుడినే నిందితుడిగా చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బనాయించిన అక్రమ కేసు విషయమై ఆదివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఆమె సంతకం చేశారు. బయటకు వచ్చాక మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి వ్యక్తో పల్నాడు ప్రాంత ప్రజలందరికీ బాగా తెలుసని చెప్పారు. వినుకొండ ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడిగా మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదని గుర్తు చేశారు. ఫేక్ జీవోలు , వాటికి సంబంధించిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారిలో బ్రహ్మనాయుడు అనుచరులు కూడా ఉన్నారని వివరించారు. నిజాలను బయటపెట్టిన వారిపైనే కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ అరెస్టు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. బ్రహ్మనాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వేధింపులు జరుగుతున్నాయని వివరించారు. బొల్లా నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
బొల్లా ఎదుగుదల చూసి ఓర్వలేక అక్రమ కేసులు
వినుకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ నాయకులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముస్లిం మైనారిటీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యులు హఫీజ్ఖాన్ అన్నారు. వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాదులో ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారని అక్రమంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తన సమీప బంధువు బొల్లా రమేష్ భూమి కొనుగోలు చేశారని, ఇంకా భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, అగ్రిమెంట్ కోసం కొంత డబ్బు బొల్లా బ్యాంక్ ఖాతా నుంచి జమ చేశారని చెప్పారు. అసలు దోషులను వదలిపెట్టి కావాలనే రాజకీయ కుట్రతో బొల్లాను అరెస్ట్ చేశారన్నారు. వినుకొండ అభివృద్ధికి బొల్లా చేసిన కృషి ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు పి.ఎస్ఖాన్, ఖాదర్బాషా, అమీర్, రఫీ, జహంగీర్, మస్తాన్, యాసిన్, జమీర్, ఫక్రుద్దీన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ -
మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టు అన్యాయం
బొల్లా అరెస్టు అక్రమం బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తున్నారు పిడుగురాళ్ల రూరల్: బాధితులనే నిందితులుగా చిత్రీకరించి చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ రీజనల్ కో ఆర్డినేటర్ పాలూరి అంజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బొల్లా రమేష్ రియల్ ఎస్టేట్ దళారుల మాటలు నమ్మి భూమి కొనుగోలు కోసం కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారని తెలిపారు. ఆ అగ్రిమెంట్ కూడా పూర్తిగా బొల్లా రమేష్ పేరుమీదనే ఉందని, ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదని ఆయన స్పష్టం చేశారు. భూములకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ తర్వాతే కొనుగోలు చేయాలని రమేష్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్ చేయించగా సంబంధించి జీవోలు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భూమి యజమానులుగా చెప్పుకొన్న వ్యక్తులు, దళారులపై తాము కేసులు నమోదు చేశామన్నారు. మోసాలను బయట పెట్టిన బొల్లా రమేష్ను నిందితుడిగా చిత్రీకరించటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బు సహాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడును కూడా దీనిలోకి లాగటం రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని భుజాలపై మోస్తున్న కొన్ని కుల మీడియా సంస్థలు బ్రహ్మనాయుడు పేరుతో కథనాలను ప్రచురిస్తూ, లోపల మాత్రం మోసాన్ని ప్రస్తావించటం గమనార్హమన్నారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన బ్రహ్మనాయుడిపై ఇలాంటి అవాస్తవాలు ప్రచురించడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు, ప్రచారాలను నిలిపివేయాలని ఆయన కోరారు. -
ఆహార భద్రతపై అవగాహన అవసరం
గుంటూరు లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, నాలుగో అదనపు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) సి.రమణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించటం, మనం తినే ఆహారం ఎటువంటి కలుషితం కాకుండా సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్. రాజీవ్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల వలన మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి.నరసింహుడు, గవర్నమెంట్ ప్లీడర్ ఎం.సురేష్ బాబు, సి.డబ్ల్యూ.సి. శాఖ శ్రీవాణి, డిస్ట్రిక్ట్ సప్లయి ఆఫీసర్ కోమలి పద్మ పాల్గొన్నారు. -
న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ
చిలకలూరిపేట: సంచలనం సృష్టించిన న్యాయవాది హత్య కేసులో కీలక నిందితురాలు అతని భార్యేనని తేలింది. వివాహేతర సంబంధం, ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. చిలకలూరిపేట రూరల్ పోలీసుస్టేషన్లో శనివారం నిర్వ హించిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. హరిప్రసాద్ ఈ ఏడాది ఏప్రిల్ పదో తేదీన చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కేసు నేపథ్యం... హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి వివాహానికి ముందు నుంచే బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన ఉసర్తి వెంకటకోటయ్యతో వివాహేతర సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వీరు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో తన భర్త హరిప్రసాద్ ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని నాగజ్యోతి తన ప్రియుడు కోటయ్యకు చెప్పింది. హరిప్రసాద్ను అడ్డుతప్పిస్తే తాము కలసి హాయిగా జీవించవచ్చని ఇరువురు కలసి పథకం రూపొందించారు. ముందస్తు పథకంలో భాగంగా హరిప్రసాద్తో సఖ్యతగా ఉంటూ అతని పేరిట ఇన్స్యూరెన్స్ చేయించారు. నామినీగా భార్య నాగజ్యోతి పేరు పెట్టారు. మిత్రుడి సహకారంతో... హరిప్రసాద్ను హత్య చేసేందుకు వెంకటకోటయ్య తన మిత్రుడైన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన కొండారెడ్డి శ్రీనివాసరావు సహాయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదో తేదీన నరసరావుపేట ప్రాంతానికి హరిప్రసాద్ను పిలిపించి రాత్రి కలసి మద్యం సేవించారు. అనంతరం ఏప్రిల్ పదో తేదీ తెల్లవారు జామున యడవల్లి గ్రామ సమీపంలో కాలకృత్యాల కోసం అంటూ ప్రయాణిస్తున్న స్కూటీని ఆపారు. హరిప్రసాద్ కిందకు దిగగానే వెంకటకోటయ్య సైగ చేయడంతో శ్రీనివాసరావు ఇనుప రాడ్తో హరిప్రసాద్ తలపై బలంగా కొట్టాడు. వెంకటకోటయ్య కూడా ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేయడంతో హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డు పక్క లోతట్టు ప్రాంతంలో పడవేసి అతని స్కూటీని కూడా అతనిపై పడవేసి నిందితులు పరారయ్యారు. రోడ్డు పక్కన లభ్యమైన మృత దేహంపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ నిర్వహించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఏప్రిల్ 12వ తేదీన నిందితుడు ఉసర్తి వెంకటకోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావును అరెస్టు చేసి అదే రోజు రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును లోతుగా విచారించగా న్యాయవాది హత్యకేసులో అతని భార్య నాగజ్యోతి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. శనివారం ఆమెను అరెస్టు చేసి ఆమె వాడుతున్న సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్, ఎస్ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. -
శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్
నాదెండ్ల: నాదెండ్ల పోలీస్స్టేషన్లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్ఐలు ఆర్.వెంకటేశ్వరరావు, అనిల్కుమార్, శివరామకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అంకితభావం ఉండాలన్నారు. రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన పేరం రాందాస్(55) మృతి చెందాడు. రాందాస్ రోడ్డు పక్కన నిలబడి ఉండగా అదే మార్గంలో వస్తున్న లారీ రాందాస్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాందాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రాందాస్ను హూటాహుటినా నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రాందాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెలలో ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ మణి తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, మిద్దెతోటల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటి కోర్సులకు 8 వారాలపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒకొక్క కోర్సుకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి ఈనెల 20వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, లేదా ఆండ్రాయిడ్ ఫోన్, ఐపాడ్ వంటివి కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను కానీ 9441355595, 7036689346, 8096085560 సెల్ నంబర్లను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు మాత్రమే సంప్రదించాలన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026గురువులకు ‘టెట్’ టెన్షన్..!తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్ ధర రూ.2,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సత్తెనపల్లి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు ప్రస్తుత సర్వీస్ కొనసాగించాలన్నా .. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయసులో టెట్ రాసి ఎలా ఉత్తీర్ణత సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధం కావాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఉపాధ్యాయుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. లేనిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదవి విరమణకు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి కూడా పదోన్నతులు రావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాట తప్పిన తండ్రీ, కొడుకులు... ‘ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరూ ‘టెట్’ నిబంధనలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్ లో చట్టసవరణ కూడా చేస్తాం’ అని గతంలోనే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నోరు మెదపకపోవడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తప్పనిసరి పక్షంలోనే మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొందరు ఉపాధ్యాయులు సూచిస్తుంటే, మరికొందరేమో ‘20,30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం, ఈ వయసులో మాకు ఈ పరీక్షేంటి?’ అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కష్టమైన పరీక్షే... ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 90శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఆంగ్లం, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయో సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు పెట్టి పాస్ కావాల్సిందే అంటే ఎలా అని ఉపాధ్యాయులు ఆగ్రహిస్తున్నారు. మాచర్ల రూరల్: చంద్రబాబు కుట్రతోనే, ఆయన కనుసన్నలతో పనిచేసే తెలంగాణ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) హెచ్చరించారు. విను కొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ శనివారం హైదరాబాద్లోని కోర్టు వద్ద పీఆర్కే మాట్లాడారు. తిరుమల, వల్లభ డెయిరీలు లాంటి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మచ్చలేని నేత బ్రహ్మనాయుడని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోవటం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి చేతకాక తన పలుకుబడితో అక్రమ కేసులో ఇరికించి ఆయనను జైలుకు పంపించి శునకానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. రాధాకృష్ణ అనే వ్యక్తి భూములను అమ్మజూపేందుకు బ్రహ్మనాయుడు బంధువు రమేష్ అనే అతనితో అగ్రిమెంటు చేయించుకొని అడ్వాన్సు మాత్రమే తీసుకున్నారని, రిజిస్ట్రేషన్ కూడా జరగకముందే రమేష్ ఇది ప్రభుత్వానికి సంబంధించిన జీఓ ఒరిజినలా, కాదా అని పరిశీలించాలని స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని, అయితే ఫిర్యాదుదారుల పైనే అక్రమ కేసులు బనాయించి రిజిస్ట్రేషన్ జరగని భూములను కబ్జాగా పేర్కొంటూ కేసు నమోదు చేయటం దారుణమన్నారు. బ్రహ్మనాయుడుకు బంధువైన రమేష్ భూమి కొనుగోలుకు ఆర్థికంగా సహాయం చేసేందుకు డబ్బును బ్రహ్మనాయుడు సర్దుబాటు చేశాడే కానీ ఆయన పేరు మీద ఎక్కడా అగ్రిమెంట్లు జరగలేదని, ఆ నగదును పూర్తిగా వైట్ రూపంలోనే అందించిన విషయాన్ని గుర్తించకపోవటం బాధాకరమన్నారు. ఫిర్యాదు చేసిన వారినే నిందితులుగా చేయటం వెనుక చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని, అధికారులను ఎంతగా ప్రభావితం చేశాడనేది అర్ధమవుతుందని, ఈ విషయం పై న్యాయం పోరాటం చేసి, బ్రహ్మనాయుడును కడిగిన ముత్యంలా బయటకు తీసుకొస్తామన్నారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేస్తే ఆంధ్రా పోలీసులు అత్యుత్సాహంగా ఆయన కోసం ప్రత్యేక గాలింపులు జరపటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వం, అధికారులతో కుమ్మక్కై ఫిర్యాదు దారుడి పైనే కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే వెలికితీస్తామన్నారు. బ్రహ్మనాయుడికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదులున్నారు. ●డీఎస్సీ పోటీ పరీక్షను ఎదుర్కొని ఉద్యోగంలో చేరి 25 నుంచి 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం సరైనది కాదు. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలి. –మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిటెట్లో ఇన్సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులందరిలోనూ టెట్ పరీక్ష అలజడి రేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. టెట్ అమల్లోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. –బంకా వాసుబాబు, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శినరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నుంచి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం టన్నుల కొద్దీ అక్రమంగా తరలిపోతుంది. కార్డులో సభ్యుడికి రూ.50లు చొప్పున చేతిలో పెట్టి అందినకాడికి ప్రజా పంపిణీ బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్నారు. కొంత మంది అక్రమ డీలర్ల వద్ద నుంచి రేషన్ మాఫియా బియ్యాన్ని సేకరిస్తుంది. కార్డు దారుల వద్ద నుంచి కేజీ రూ.10 చొప్పున డీలర్లు కొనుగోలు చేసి అక్రమ బియ్యం వ్యాపారులకు రూ.15కు అమ్ముతున్నారు. వీటిని దళారులు రేషన్ మాఫియాకు రూ.30కు అమ్మి జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల నుంచి అక్రమ రేషన్ బియ్యం టన్నుల కొద్దీ ప్రతి నెల మొదటి వారంలో తరలిపోతుంది. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన పౌరసరఫరాలు, పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారులు పట్టించుకోకపోవటం ఆందోళన కలిగిస్తుంది. చెలరేగుతున్న ‘పచ్చ’ మాఫియా రేషన్ బియ్యం మాఫియా పట్టుబడకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటుంది. బ్లాక్ మార్కెట్లో కొన్న బియ్యాన్ని అక్రమార్కులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వాటిని రేషన్ మాఫియా కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యలో చెక్పోస్టుల వద్ద ముట్టచెప్పాల్సిన నెలవారీ మాముళ్లు ఎప్పటికప్పుడు అందుతూనే ఉండటంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకు చెందిన నేతలు రేషన్ మాఫియాగా అవతారం ఎత్తి కోట్లు గడిస్తున్నారు. కొందరైతే రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తున్నారు. శనివారం పెట్లూరివారిపాలెం గ్రామం నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యం 6 క్వింటాళ్లను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. చర్యల నిమిత్తం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పంపిణీ చేసిది రెండు రోజులే.. ప్రజా పంపిణీ బియ్యం ప్రతి నెలా 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేయాలి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకు వచ్చిన ఒకటి, రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన సరుకు అంతా బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం కోసం వచ్చిన కార్డు దారులకు కేజీకి రూ.10 చొప్పున కొందరికి ఇస్తుండగా మరి కొందరికి ఈ నెల సరుకు రాలేదని చెప్పి డీలర్లు వెనక్కి పంపుతున్నారు. అధికారుల మౌనం.. మాఫియాకు వరం రేషన్ మాఫియా చెలరేగిపోతున్నా సంబందిత శాఖ అధికారులు స్పందించక పోవటం అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతుంది. కొంత మంది డీలర్లు ఎంఎల్ఎస్ గోదాం నుంచే నేరుగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కార్డు దారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదు. గత కొన్ని నెలలుగా జిల్లాలో ఎక్కడా రేషన్ షాపులు, అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన దాఖలాలు ఏమి లేవు. అధికార పార్టీకు చెందిన నేతలు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తుండటంతో మిన్నకుండి పోతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్నర్సు ఉద్యోగానికి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్హెచ్సీ, సీహెచ్ఓ, యూపీహెచ్సీలో చేసిన స్టాఫ్నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్, రెసిడెన్షియల్ కాలేజ్ స్టాఫ్కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు. 9ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ పల్నాడు జిల్లాలో 1289 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 6,47,934 రేషన్ కార్డు దారులు ప్రతి నెలా 8774 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.48లు వరకు ఖర్చు చేస్తుంది. జిల్లాకు కేటాయించిన 8774 టన్నులకు రూ.42.11 కోట్లు వెచ్చిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజా ధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా పంపిణీ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలేకపోతుంది. ప్రతి నెలా పల్నాడు జిల్లా నుంచి సుమారు రూ.20 కోట్ల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ బోధించే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6,323 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 3,995 మంది టెట్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉందని విద్యాశాఖ గతంలో గుర్తించింది. అంటే మొత్తం ఉపాధ్యాయుల్లో వీరు 63.18 శాతం మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సి ఉంది. లేని పక్షంలో పదోన్నతులు కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డులతో పాటు వారు టెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు?..ఎన్ని మార్కులు సాధించారు?.. ఈ అంశాలన్నీ సీనియార్టీ జాబితా ప్రత్యేక కాలంలో పొందు పరచాలని విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. టెట్ పాసైన వారి పేర్లు మాత్రమే స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్ఎం పదోన్నతుల జాబితాలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. -
సమగ్ర కార్యాచరణతో ‘యోగా’
నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణను జిల్లాలో విజయవంతంగా చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజూ యోగా సాధనలో భాగంగా ఈనెల ఏడు నుంచి 20 వరకు ప్రతి రోజు ఉదయం 6.45 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రత్యేక యోగా కార్యక్రమాలు.. జూన్ 12న ఆశ, ఏఎన్ఎంల తో ‘థిమేటిక్ యోగా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాల యోగాలో భాగంగా 17న కోటప్పకొండ, 19న అమరావతిలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న భారీ స్థాయిలో ఐదు వేలమందితో మెగా యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా పోటీల నిర్వహణ.. యోగాపై ఆసక్తి పెంపొందించేందుకు పోటీలను నాలుగు స్థాయిల్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. ఈనెల 7–9న గ్రామ స్థాయి పోటీలు, 10 –12న మండల స్థాయి పోటీలు, 14 –16న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు 18న రాష్ట్ర స్థాయి పోటీలులో పాల్గొంటారని తెలిపారు. యోగా గురువులు, ట్రైనర్లు, ట్రైనీల మ్యాపింగ్ ప్రతి సచివాలయానికి 10 మంది ట్రైనీలను మ్యాపింగ్ చేసి యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. యోగ గురువులు, మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్లు సమన్వయంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. యాప్లో నమోదు .. యోగాకు సంబందించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని, ఫ్రీ ఈవెంట్ కార్యక్రమాల నమోదు, పాల్గొనే వారి వివరాల అప్లోడ్, పోస్ట్ ఈవెంట్ ఫోటోలు, సమాచారం సకాలంలో అప్లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడేలా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయండి.. నరసరావుపేట: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓ) ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోగానే మ్యాపింగ్ పనులన్నింటినీ చక్కబెట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న 2025 ఓటర్ల జాబితాను ఖచ్చితంగా మ్యాపింగ్ చేయాల్సి ఉందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులకు తావులేకుండా ఈ ప్రక్రియ జరగాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వైఎస్సార్ సీపీ దాచేపల్లి, పిడుగురాళ్ల పలు విభాగాల కమిటీలు నియామకం
పార్టీ మైనార్టీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నాసర్సైదా నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీసెల్ సంయుక్త కార్యదర్శిగా గురజాలకు చెందిన షేక్ నాసర్సైదాను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 13మందితో దాచేపల్లి నగర పంచాయతీ ఎస్సీ సెల్ కమిటీ, 14మందితో దాచేపల్లి మండల క్రిస్టియన్ మైనార్టీ సెల్ కమిటీ, 17మందితో పిడుగురాళ్ల మున్సిపల్ యూత్ వింగ్ కమిటీ, మరో 17మందితో పిడుగురాళ్ల మున్సిపల్ బీసీ సెల్ కమిటీని నియమించారు. అలాగే 20మందితో పిడుగురాళ్ల మున్సిపల్ బూత్ కమిటీల వింగ్ కమిటీ, 17మందితో పిడుగురాళ్ల వైఎస్సార్టీయూసీ కమిటీ, 21మందితో పిడుగురాళ్ల మున్సిపల్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ కమిటీ, మరో 14మందితో పిడుగురాళ్ల మున్సిపల్ ఎస్టీ సెల్ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాలలో పని చేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్లో ఉన్న 10వ తరగతి పరీక్షల షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. ప్రధానోపాధ్యాయులు షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసి సంతకం, పాఠశాల సీల్తో విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఈనెల 10వ తేదీ వరకు సవరించుకునే అవకాశం ఉన్నందున ప్రధానోపాధ్యాయులు భవిష్యత్తులో పొరపాట్లకు తావు లేకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈమేరకు జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిలకలూరిపేటటౌన్: అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అర్బన్ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని రైతు బజార్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సదరు విషయాన్ని అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ ఎస్ఐ సోమేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ చేయగా మృతుని వివరాలు లభ్యం కాలేదు. మృతుడు తెల్లచొక్కా, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని..మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీస్స్టేషనకు సమాచారం తెలియజేయాలని కోరారు. చిలకలూరిపేటటౌన్: తీవ్ర అనారోగ్య సమస్యలతో పట్టపగలే ఇంట్లోనే ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శుక్రవారం మండలంలోని మురికిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ జానీబాషా(42)కు దిల్షాద్తో 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త గ్రామంలోనే చికెన్ షాపు నిర్వహిస్తుండగా, భార్య దిల్షాద్ యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని వసంత నూలుమిల్లులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జానీబాషా ఇటీవల పక్షవాతం బారినపడ్డాడు. అనారోగ్య సమస్యలో లేక మానసిక వేదనో కారణాలు తెలీదుగాని శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంట బాధకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో చిన్నకుమార్తె గమనించి స్థానికుల సహాయంతో 108 వాహనంలో తండ్రిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించింది. కుమార్తె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పల్నాడు
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 519.50 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,000, గరిష్ట ధర రూ.2,200, మోడల్ ధర రూ.1,600 వరకు పలికింది. 7 -
అభివృద్ధి చర్చపై టీడీపీ పోలీసు అస్త్రం
నరసరావుపేట: అభివృద్ధిపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతలు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సవాల్కు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గురువారం సాయంత్రం నుంచే డాక్టర్ గోపిరెడ్డి ఇంటి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చర్చా కార్యక్రమానికి అనుమతులు లేనందున పాల్గొనవద్దంటూ పలువురు వైఎస్సార్సీపీ నాయకులకు ముందస్తు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గోపిరెడ్డికి సవాల్ విసిరారు. ఆ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, తానొక్కడినే వస్తానని డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద బారికేడ్లు ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచే ఇరువురు నేతల పార్టీ కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తల హడావుడి మొదలైంది. పోలీసులు గుంటూరు రోడ్డులో డాక్టర్ గోపిరెడ్డి ఇంటివైపునకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి వెనుకవైపు వీధిలో సైతం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటప్పకొండ వద్ద తాను అన్నీ ఏర్పాట్లు చేశానని, వచ్చేందుకు డాక్టర్ గోపిరెడ్డి భయపడుతున్నారంటూ మీడియాతో ఎమ్మెల్యే అరవిందబాబు చెప్పడం గమనార్హం. దీంతో డాక్టర్ గోపిరెడ్డి 11 గంటల సమయంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చారు. ప్రత్యేక బలగాలతో కలసి డాక్టర్ గోపిరెడ్డి, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ చదలవాడ కూడా తన కార్యాలయం నుంచి బయటకు రావటంతో పోలీసులు నిలువరించారు. ఇరువురు నాయకులతో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, సీఐ అచ్చయ్య, ఎస్ఐలు చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వనందున చర్చ ప్రయత్నం విరమించుకోవాలన్నారు. పలువురు వైఎస్సార్ సీపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు హౌస్ అరెస్టు కూడా చేశారు. -
ఆరు ఎకరాల్లో జామాయిల్ తోట దగ్ధం
నాదెండ్ల: గణపవరంలో పొరుగు రైతు నిర్లక్ష్యం కారణంగా ఆరెకరాల జామాయిల్ తోట దగ్ధమై సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిన సంఘటన జరిగింది. బాధిత రైతులు కాట్రు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, తూబాటి శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. వీరు సుమారు ఆరెకరాల్లో జామాయిల్ తోట సాగు చేస్తున్నారు. తమ తోటకు సమీపంలో చిలకలూరిపేట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 12 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన జంపని వీరయ్య కుమారుడు శ్రీనివాసరావు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 3వ తేదీన ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యేందుకు తన భూమిలోని వ్యర్థాలు సేకరించి జామాయిల్ తోట సమీపంలో కుప్పగా వేసి నిప్పంటించాడు. వేసవి కావటంతో మంటలు తోటకు అంటుకుని ఆరెకరాల తోట పూర్తిగా దగ్ధమైంది. దీంతో తమకు సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా, స్థానిక పెద్దలు రాజీయత్నం చేశారు. అయితే రాజీయత్నం విఫలం కావటంతో శుక్రవారం బాధిత రైతులు నాదెండ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదేరైతు గతేడాది కూడా ఇదేరీతిలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో వెంకటేశ్వర్లుకు చెందిన జామాయిల్ తోట దగ్ధమైంది. అప్పట్లో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం. పిడుగురాళ్లరూరల్: పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అల్లం వెంకటరెడ్డి (45), తన భార్యతో కలిసి పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లాడు. ఈక్రమంలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు పొలంలో పిడుగుపడడంతో వెంకటరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య కళావతి స్వల్ప గాయాలతో పొలంలో సృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన తోటి రైతులు బంధువులకు సమాచారం అందించారు. పొరుగు రైతు నిర్లక్ష్యంతోనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు -
కొండవీడు కొండల్లో హరిత సంకల్పం
యడ్లపాడు: ప్రకృతిని కాపాడుకుంటూ.. రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలని కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్.బి.ఓ) పురుషోత్తమరాజు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ, ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు సంయుక్తంగా శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛగాన్, సురక్షిత్ జలధార వారోత్సవాల్లో భాగంగా చారిత్రక కొండవీడు ఘాట్ రోడ్డుతో పాటు హౌస్ గణేష్ కొండల పరిసర ప్రాంతాలలో సుమారు 650 విత్తన బంతులను (సీడ్బాల్స్) విసురుతూ ప్రకృతి పునరుజ్జీవ నానికి బాటలు వేశారు. నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప, మరో విలువైన స్థానిక వృక్ష జాతికి చెందిన విత్తనాలతో సిద్ధం చేసిన విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు కలిసి ఎంతో ఉత్సాహంగా కొండలపైకి విసిరారు. కార్యక్రమం ప్రారంభంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఒక మొక్క–ఒక జీవితం.. పచ్చదనం పెంచుదాం–భూమిని కాపాడుదామంటూ నినాదాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞను చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తంరాజు మాట్లాడుతూ..ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత. వృక్ష సంపదను పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న వాతావరణ సమతుల్యత లోపాలను అరికట్టేందుకు వృక్ష సంపదను పెంచడమే ఏకై క మార్గమని హితవు పలికారు. గ్రీన్వారియర్స్ ప్రతినిధి శౌరి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. కేవలం ప్రభుత్వాలు, అధికారుల వల్లే పర్యావరణ మార్పులు సాధ్యం కాదని, ప్రతి పౌరుడు ఏడాదికి ఒక మొక్క నాటి సంరక్షించినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యువతరం ప్రకృతి పరిరక్షణలో ముందుండాలని శ్రీనివాస్ కార్తీక్ పిలుపునివ్వగా, విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహను పెంపొందించడం ద్వారానే భవిష్యత్తు సమాజంలో గొప్ప మార్పును చూడగలమని ఉపాధ్యాయుడు డాక్టర్ జున్ను అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, కొండవీడు వాచ్ అండ్ వార్డ్ సభ్యులు, గ్రీన్ వారియర్స్ సభ్యులు సుందరరావు మాస్టర్, చేనేత ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. -
రీచార్జ్ చేయకుంటే చీకట్లే!
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ–పెయిడ్ విద్యుత్ బిల్లింగ్ ప్రారంభం సత్తెనపల్లి: మొబైల్ ఫోన్ల తరహాలోనే విద్యుత్ వినియోగంలోనూ ‘ప్రీ–పెయిడ్’ విధానం అమల్లోకి వచ్చింది. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ఎలా కట్ అవుతాయో.. ఇకపై విద్యుత్ మీటర్లలోనూ రీచార్జ్ గడువు ముగిస్తే ఆటోమేటిక్గా కరెంట్ కట్ అయిపోనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ సరికొత్త ప్రీ–పెయిడ్ బిల్లింగ్ విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు ఏపీసీపీడీసీఎల్ అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వీధి దీపాలు, తాగు నీటి పథకాలకు సంబంధించి మొత్తం 10,812 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. నెలకు రూ. 5.86 కోట్లు డిమాండ్ ఉంది. మెరుగైన విద్యుత్ సరఫరా, బిల్లింగ్లో పారదర్శకత కోసమే ఈ స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు. మాన్యువల్ మీటర్లను చూసి ఇంతకు మునుపు రీడింగ్ నమోదు చేసేవారు. తర్వాత ఐఆర్డీఏ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తర్వాత ప్రీ–పెయిడ్గా మారనున్నాయి. వీటిని ముందుగానే రీచార్జ్ చేసుకోవాలి. సెల్ఫోన్లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో ... ఇక్కడా అదే విధంగా యాప్లో చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా ఆగుతుంది. రీచార్జ్ చేస్తేనే విద్యుత్ వెలుగులు ఉంటాయి. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరగొచ్చనేది నిపుణుల అభిప్రాయం. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్లు ‘బాదుడే బాదుడు’ పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా .. ‘స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి.. విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగిస్తే నిర్భయంగా పగలగొట్టండి’ అని పదేపదే పిలుపునిచ్చారు. కానీ, అదే టీడీపీ అధికారంలోకి రాగానే మాట మార్చి స్మార్ట్ మీటర్ల విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల ముందుగా డబ్బు కట్టి ఈ–వాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు ఉంటుంది. విద్యుత్ వినియోగదారులపై మరో పెను ఆర్థికభారం వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల రూపంలో అడ్డగోలుగా బిల్లులు పెరిగాయని సామాన్యులు వాపోతున్నారు. దీనికితోడు ప్రీ–పెయిడ్ విధానం తీసుకొచ్చేందుకు శరవేగంగా టీడీపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు తొలుత ఈ కొత్త విధానం వర్తింపచేయాలని నిర్ణయించింది. ముందుగా డబ్బు కడితే ఆ మేరకు విద్యుత్ సరఫరా జరగనుంది. బ్యాలెన్స్ అయిపోగానే చీకట్లో మగ్గాల్సిందే. ఈ విధానంపై సామాన్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది క్రితమే అన్ని రకాల సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చారు. ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ చూసి, వాడిన యూనిట్ల ఆధారంగా నెలవారీ బిల్లింగ్ చేసేవాళ్లు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాల సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ సర్వీసులను కొన్ని గ్రూపులుగా విభజించి ఈ–వాలెట్తో రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించారు. నెలవారీ బిల్లింగ్ ఆధారంగా విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీలు, అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5వ తేదీన ఈ వివరాలను విద్యుత్ శాఖ ఆర్థిక శాఖకు సమర్పిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రభుత్వ సర్వీసులకు ఈ విధానాన్ని ప్రారంభించినా ... త్వరలోనే వాణిజ్య (కమర్షియల్), గృహ (డొమెస్టిక్) వినియోగదారులకూ ప్రీ–పెయిడ్ కరెంటు సర్వీసులు వర్తింపచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించినప్పటి నుంచి సాధారణ బిల్లింగ్ పద్ధతిలోనే బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. భవిష్యత్తులో అడ్వాన్స్ కడితేనే కరెంటు ఉంటుందనే వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ శాఖపై ఆధారపడి కొన్నేళ్లుగా జిల్లాలో పని చేస్తున్న 246 మంది విద్యుత్ మీటర్ రీడర్ల జీవనోపాధి కూడా ఈ విధానం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. -
భూ లావాదేవీలతో బొల్లాకు ప్రమేయం లేదు
వినుకొండ: వివాదాస్పద భూమి లావాదేవీలతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ వినుకొండ పరిశీలకులు బాసు లింగారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బ్రహ్మనాయుడు బంధువు, ప్రముఖ వ్యాపారవేత్త బొల్లా రమేష్ ఆ భూమిని కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారని, తాము కొన్న భూమికి సక్రమమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని రమేషే స్వయంగా అధికారులకు పిటిషన్ ఇవ్వడం వల్లే ఈ అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. బాధితులనే నిందితులుగా మార్చారు.. అక్రమాలపై స్వయంగా పిటిషన్ ఇచ్చిన బాధితులను ఈ కేసులో నిందితులుగా మార్చడం అన్యాయమని లింగారెడ్డి ఆరోపించారు. బొల్లా బ్రహ్మనాయుడును రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేనివారే ఈ తప్పుడు కేసులతో ఆయనపై బురదజల్లుతున్నారని, ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని అన్నారు. కోర్టు ద్వారా నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ప్రజా న్యాయస్థానంలో కూడా ప్రజల భారీ మద్దతుతో బ్రహ్మనాయుడు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బొల్లా అరెస్టు ఖండించిన వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసులింగారెడ్డి -
ప్రకృతితో కలసి జీవించాలి
గుంటూరు లీగల్: భూమీద అన్ని జీవ రాశులతో కలిసి జీవించే విధంగా మానవాళి మనుగడ ఉండాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికిందర్బాషా అన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమన్యయంతో ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నాల్గవ అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గుంటూరు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ సి.రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు అవగాహన పెంచాలన్నారు. ముందు తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్.రాజీవ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇన్చార్జి పీపీ ఎం.సురేష్బాబు, ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాస్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంటికొక చెట్టు పెంచితే పర్యావరణ కాలుషాన్ని తగ్గించవచని అన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్స్ స్టాఫ్, ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ప్రభుత్వ న్యాయవాది ఎం.సురేష్బాబు, మొహమద్ నజీనా బేగం పాల్గొన్నారు. లీగల్ వాలంటీర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఏ.పి.పొల్యూషన్ బోర్డు, ఉద్యోగులు కోర్ట్ ప్రాగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. నగరంపాలెం: విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలనతో ప్రజలకు ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, ఉద్యోగోన్నతులు, సెలవులపై వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు అందించారు. జిల్లా ఎస్పీ ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రీవెన్స్కి సంబంధించి అర్జీలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఖాళీలు, పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఒక కుటుంబమని, పరస్పర గౌరవం, సహకారంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలీస్ సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. పాఠశాలలను నెట్ జీరోలుగా తీర్చిదిద్దాలి నరసరావుపేట రూరల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దతురకపాలెంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సంజనా సింహ మాట్లాడుతూ నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్దీకరించుకోవాలన్నారు. హరిత ఇంధన వినియోగ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. -
పులిచింతలేనా!
అచ్చంపేట: పల్నాడు జిల్లా, అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 32 టీంసీలకు చేరింది. ఈ ఏడాది ఎల్నివో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైతే కృష్ణా, డెల్టా ప్రాంతాల ఆయకట్టుకు రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటకాలం ఎంతో దూరంలో లేదు. జూన్ రెండవ వారం నుంచే ప్రారంభం కావాలి. వర్షాలు ఆలస్యమైతే కనీసం జూన్ చివరివారం, జూలై మొదటి వారంలోనైనా ఖరీఫ్ పంట కాలం ప్రారంభమవుతుంది. ఈలోపు వర్షాలు లేకపోతే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 32 టీఎంసీల నీటి నిల్వలు క్రమంగా తగ్గి రెండు, మూడు నెలలలోనే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్న కృష్ణా, డైల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూముల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తలుచుకుంటేనే అన్నదాత వెన్నులో వణుకు పుడుతోంది. మళ్లీ 2019 ముందు పరిస్థితులు పునరావృతం అవుతాయన్న భయపడుతున్నారు. ఏటా సక్రమంగా నిండినా... వర్షాలు లేకపోతే ఎగువ శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణానదీ పరివాహక ప్రాంతా నుంచి నీళ్లు వచ్చి ప్రాజెక్టులో చేరే అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులలో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మళ్లీ ప్రాజెక్టులు నిండాలంటే భారీ వర్షాలు కురవాలి. నిన్న మొన్నటివరకు జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు రుతుపవనాలు వెనుక్కు పోయాయంటున్నారు. జలయజ్జం పథకంలో భాగంగా 13 లక్షల ఎకరాల కృష్ణా, డెల్టా ఆయకట్టు భూములకు నీరు అందించే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 2009లో మహానేత మృతితో నిర్మాణ పనులలో తీవ్ర జాప్యం జరిగింది. 2013 నుంచి ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశారు. అయితే 2019 వరకు వర్షాలు సక్రమంగా లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ సాధ్యం కాలేదు. 2019 ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నుంచే భారీ వర్షాలు కురవడం, ఎగువ నాగార్జునసాగర్ నుంచి వరద రావడంతో 2019 నుంచి గత ఏడాది వరకు ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ వచ్చారు. వేసవిలో వర్షాలు లేకపోయిన సాగు, తాగు నీటి కోసం కొంత మేర వదలడంతో ప్రాజెక్టులో నిల్వ తగ్గినా తిరిగి జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుతూనే ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా? డైవర్షన్ రాజకీయాలను పక్కనబెట్టి, పొగడ్తలతో పొంగిపోవడాలు, ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టించడాలు వంటి లాంటి చర్యలకు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలకాల్సి ఉందని రైతుల సంఘాల నేతలు, అన్నదాతలు పేర్కొంటున్నారు. అన్నీ చేసేశాం అనే భ్రమను వీడి, అన్నదాతలను ఆదుకోవాలనే అంశంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. వచ్చే సంక్షోభాన్ని ఎలా ప్రతిఘటించాలనే అంశంపై దృష్టి సారించాలని, ఏం చేస్తే రైతులకు మేలు చేకూరుతుందో ఆలోచించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే జరిగితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిగా తగ్గితే కృష్ణా, డెల్టా రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరితే భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయితే 500 అడుగులలో బోరు వేసిన చుక్కనీరు పడే అవకాశాలుండవు. దీనివల్ల కృష్ణా డెల్టా ప్రాంత రైతులకే కాకుండా పెదకూరపాడు నియోజకవర్గంలోని భూములకు సాగునీటి కష్టాలు తప్పవు. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిపోతే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయవు. -
అవినీతి బయటపడుతుందనే అడ్డుకున్నారు
నరసరావుపేట: టీడీపీ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే విషయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు తెలుసని, చర్చకు వస్తే దీంతోపాటు అవినీతి బయట పడుతుందనే భయంతో పోలీసులను తమపైకి ఉసిగొలిపి చర్చను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దీనిపై పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాను చర్చకు సిద్ధం కావటంతో టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొలిపి హౌస్ అరెస్ట్ చేయించారని అన్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులు తనను నిర్బంధంలో ఉంచారన్నారు. తమ హయాంలో నియోజకవర్గంలో రూ.2,467 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. చర్చకు ఎమ్మెల్యే మాత్రమే రావాలని స్పష్టం చేశారు. చర్చకు వచ్చే క్రమంలో జరిగిన తోపులాటలో తన చొక్కాకు రక్తం మరకలు కూడా అయ్యాయని చూపించారు. అంతగా భయపడే వారికి చర్చ ఎందుకని ఎద్దేవా చేశారు. ఎస్పీ ఆఫీసులో బాత్రూంలో కూర్చున్నట్టుగా శుభ్రంగా పోయి బాత్రూంలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. అధికారులు ఎవరూ తన మాట వినడం లేదని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పాడం చూస్తే ఇక ఆయనేమి పరిపాలన చేస్తారని నిలదీశారు. ఎప్పుడు చర్చకు పిలిచినా తాను సిద్ధంగా ఉన్నానని, మీడియా ముఖంగానైనా చర్చిద్దామని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చి శివకోటి పాల్గొన్నారు. మీడియాతో డాక్టర్ గోపిరెడ్డి -
లైంగికదాడి కేసులో అన్నదమ్ముల అరెస్ట్
నకరికల్లు: వివాహితపై లైంగికదాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం సీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. ఈనెల 2వ తేదీన చేజర్ల గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్ అతని సోదరుడు శ్రీను ఇద్దరు కలసి నిర్మానుష్య ప్రదేశంలో ఆమైపె లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా గ్రామశివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాన నిందితుడైన కొత్తపల్లి సుధాకర్పై తన భార్యను వేధించిన కేసులో 2021లో నకరికల్లు పోలీస్స్టేషన్లో కేసునమోదైందన్నారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన అవివాహితను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రాజుపాలెం మండలంలో సహజీవనం సాగిస్తూ మోసం చేసిన ఘటనలో రాజుపాలెంలో మరో కేసు నమోదై అరెస్ట్ కాగా ఇటీవలే బెయిల్పై వచ్చాడన్నారు. నిందితుడు క్రోసూరు మండలం నాగవరంలో ఎనర్జీ అసిస్టెంట్గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా..వ్యక్తి మృతి
నకరికల్లు: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని అడ్డరోడ్డు గ్రామ సమీపంలో నరసరావుపేటరోడ్డులో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన అక్కల పెదరామిరెడ్డి(40) ట్రాక్టర్ను బాగు చేయించుకునేందుకు గాను ట్రాక్టర్ నడుపుకొంటూ నరసరావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో అడ్డరోడ్డు సమీపంలో నరసరావుపేట రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపక్కనే గల పంటకాలువలో బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన పెదరామిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్య లక్ష్మీపద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
రొంపిచర్ల: మండలంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు గురువారం అర్థరాత్రి పోలీసులు నిషేధ ఆజ్ఞలను తెలియజేస్తూ నోటీసులు అందజేశారు. బహిరంగ సభలు నిర్వహించటం, ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టటం, ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజలను గుంపులుగా సమీకరించటం చేయరాదని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి, గెల్లి చిన్నకోటిరెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కురుగుంట శ్రీనివాసరెడ్డి, పునుగోటి వెంకట్రావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, మోతుకూరి వెంకటేష్, చపారపు సంజీవరెడ్డి, గాదె రామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రామకృష్ణాపురంలో యువకుడు...
ముప్పాళ్ల: ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి మరో ట్రాక్టర్ కాల్వలో బోల్తా పడి నడుపుతున్న విద్యార్ధి మృతి చెందిన సంఘటన మండలంలోని మాదల–రామకృష్ణాపురం రోడ్డు లో శుక్రవారం జరిగింది. సంఘటన కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇరుకుపాలెం గ్రామ శివారు రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గోగడ శ్రీనివాసరావుకు ఇద్దరు సంతానం. వీరిలో వంశీ(19) ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్షలు రాసి ఇంటివద్ద ఉంటున్నాడు. ఖాళీ సమయంలో తండ్రి శ్రీనివాసరావుకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో తన ట్రాక్టర్తో పొలంలో తొండపి చెరువు నుంచి మట్టి తోలకం పనులు చేస్తున్నాడు. శుక్రవారం సైతం అదే పనిలో ఉండగా భోజనం చేసేందుకు ట్రాక్టర్ నిలిపివేస్తుండగా అక్కడే ఉన్న వంశీ నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఖాళీ ట్రాక్టర్ తీసుకొని తొండపి బయలుదేరాడు. మాదల సమీపంలో మరో ట్రాక్టర్ ఎదురుగా రావటంతో తప్పించే క్రమంలో అదుపు తప్పి ట్రాక్టర్, ట్రక్కు కాల్వలో బోల్తా పడ్డాయి. గమనించిన స్థానికులు ట్రాక్టర్ కిందపడి తీవ్ర రక్త గాయాలతో ఉన్న వంశీని పైకి లేపి 108 కి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వంశీ కి వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ 108 వాహనంలో చికిత్స కోసం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. -
కాలువల మరమ్మతులకు రూ.42.19 కోట్లు
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలోని కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఏడాదిలో 578 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. కాలువ కట్టల బలోపేతం, పూడిక తీత, నీటి నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, గేట్లు, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో సుమారు 290 పనులను గుర్తించి ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరవ్వాలని రెక్టార్ ఆర్. శివరాంప్రసాద్ అన్నారు. ఏఎన్యూలో ఎనిమిది రోజులపాటు జరిగే ఏపీ పీసెట్ పరీక్షలకు రెండవ రోజు గురువారం 715 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. 5వ తేదీన హాల్టికెట్ నెంబరు 11431 నుంచి 12144 వరకూ మొత్తం 713 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మాచర్ల రూరల్: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 48 సిలెండర్లను స్వాధీనపరుచుకున్న సంఘటన పట్టణంలోని శ్రీశైలం రోడ్డు, బ్రహ్మ బోర్వెల్స్లో చోటుచేసుకుంది. తహసీల్దార్ బి.కిరణ్కుమార్ నేతృత్వంలో గురువారం పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. శ్రీశైలం రోడ్డులోని బ్రహ్మ బోర్వెల్స్, కృష్ణ బలిజ కాలనీ, ఆర్చీ పక్కన గల షాపులలో తనిఖీ చేసి చిన్ని శ్రీనివాసరావు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 48 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి వివిధ పేర్లతో డెలివరీ తీసుకొని తన షాపులో నిల్వ ఉంచుకొని బ్లాకులో ఒక్కొక్కటి రూ. వేల చొప్పున విక్రయిస్త్తున్నట్లు ఆరోపణలు రావటంతో తహసీల్దార్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. శ్రీనివాసరావుపై 6 ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ షేక్ బాషా, ఆర్ఐ అనిల్కుమార్, వీఆర్ఓ, వీఆర్ఏలు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 519.60 అడుగులకు చేరింది. ఇది మొత్తం 148.5482 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,933 క్యూసెక్కులు విడుదల అవుతోంది. -
రెండేళ్ల వంచనపై నిరసన గర్జన
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచన చేస్తుండటంపై వైఎస్సార్సీపీ గర్జించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాలు, పట్టణాలలో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇలా... నరసరావుపేటలో... తెలుగుదేశం పార్టీని ఇక నుంచి వెన్నుపోటు పార్టీగా పిలవాలని జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రొంపిచర్లలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లోల చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన బాబు ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా అన్నారు. పేకాటను కూడా క్రీడల్లో చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో అడ్డగోలుగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్కే చెల్లుతుందన్నారు. టీడీపీ మేనిఫెస్టో, బాబు, పవన్ కల్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీలను దహనం చేశారు. చిలకలూరిపేటలో... చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం యడ్లపాడు మండలంలో విజయవంతం అయింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీల అమలులో జాప్యాన్ని ఎండగడుతూ మాజీ మంత్రి విడదల రజని నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ప్రతులను ప్రజలకు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చాక అటకెక్కించిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. తహసీల్దార్ కార్యాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. అక్కడ టీడీపీ మేనిఫెస్టో ప్రతులను రోడ్డుపై పెట్టి తగులబెట్టారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, మోసపూరిత వైఖరిని జనం ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పెదకూరపాడులో... చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు గడిచిన సందర్భంగా పెదకూరపాడులో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్, బాండ్ల ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు బుక్ లెట్లోని అంశాలను స్థానిక ప్రజలకు వివరించారు. సత్తెనపల్లిలో.... మోసానికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిత్యం వంచిస్తున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం గురువారం జరిగింది. డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత ప్రచారం చేస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిపై టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వినుకొండలో... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వినుకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం వరకు జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బాసు లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమంలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. స్థానిక సీఐ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో శివయ్య స్తూపం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాచర్లలో.... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసగించడంపై మాచర్ల మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొండా శివలింగరాజు ఆధ్వర్యంలో గురువారం విజయపురిసౌత్లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. మాచర్ల మండలానికి సంబంధించి జెడ్పీటీసీ పెద్ద మల్లుస్వామి, పార్టీ నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు బూడిద శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి కోటిరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు గాదె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురజాలలో... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసిందని, ఇది దగాకోరు ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి అంజిరెడ్డి హాస్పిటల్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ‘సర్’
మ్యాపింగ్ కాకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి సత్తెనపల్లి: భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్) ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ‘సర్’ నిర్వహణపై సంబంధిత అధికారులు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ)లకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 నుంచి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓటరుగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తారు.అక్కడ నివాసం లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేరుస్తారు. 2002లో అక్కడ ఓటు ఉన్నట్లయితే అందుకు సంబంధించి వివరాలను ఓటరు రక్తసంబంధీకులు బూత్లెవల్ అధికారులకు సమర్పిస్తే మ్యాపింగ్ చేస్తారు. ఒకే కుటుంబంలో ఓటర్లుగా ఉన్న వారందరినీ ఒకే బూత్లో ఉండేలా చూస్తారు. మ్యాపింగ్ కాకపోతే ఇబ్బందే... ఓటరుగా మ్యాపింగ్ కాకపోతే ఇబ్బంది తప్పదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలోని 1,932 పోలింగ్ కేంద్రాల పరిధిలో 17,41,798 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 11,06,750 మంది ఓటర్లు మ్యాపింగ్ జరిగింది. ఇంకా 6,35,048 మంది ఓటర్లు మ్యాపింగ్ కావలసి ఉంది. మ్యాపింగ్ చేసుకోని పక్షంలో ఓటు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. అత్యధికంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు వినుకొండ నియోజకవర్గంలో 1,04,763 మంది, మాచర్ల నియోజకవర్గంలో 1,01,798 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 67,911 మంది, నరసరావుపేట నియోజకవర్గంలో 81,570, చిలకలూరిపేట– 88,429, సత్తెనపల్లి – 90,653, గురజాల – 99,924 మంది ఓటర్లు ఉన్నారు. మ్యాపింగ్లో లింక్ కాని వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలి. ఈ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి... ‘సర్’ విషయంలో రాజకీయ పార్టీలు తమ బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్లు)లు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలన్నాయి. బీఎల్ఓ వచ్చినప్పుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంట్లో లేకపోతే .. ఆ ఇంట్లో ఉన్న ఆ ఓటర్ తాలూకు బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఓటు తొలగిస్తే ఆందోళన వద్దు... ఒక ఇంటిలో ఓటరుగా ఉన్నప్పటికీ పొరపాటున ఓటు తొలగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18వ తేదీలోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలి
నరసరావుపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడే విధంగా ఉపాధ్యాయులు విద్యాభోధన చేయాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. 1,2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు, మెగా డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంలో 60 రోజుల సర్టిఫికెట్ కోర్స్లో ఈనెల 9వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మెగా డీఎస్సీ 2025 ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేసినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని తమ పాఠశాలల్లో అమలుపరిచి ప్రభుత్వ పాఠశాలలంటే నమ్మకం ఏర్పడే విధంగా బోధించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ పూర్ణచంద్రరావు, ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ -
హెవీ మోటార్ డ్రైవింగ్ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం
నరసరావుపేట: స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తిచేసుకున్న 24వ బ్యాచ్ అభ్యర్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.అజితకుమారి గురువారం సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను ఉద్దేశించి అజితకుమారి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ వినియోగించవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఏకాగ్రతతో బస్సులను నడపాలని సూచించారు. డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 25వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. శిక్షణ తీసుకొదలచిన డ్రైవర్లు ఫోన్ నెంబర్లు 9959225428, 7382896150 సంప్రదించాలని కోరారు. డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ షేక్ ఎం.సుభాని, సీహెచ్.మోహనరెడ్డి (రిటైర్డ్) పాల్గొన్నారు. -
వేడెక్కిన పేట రాజకీయం
నరసరావుపేట: నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందులో భాగమే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, అందజేసిన సంక్షేమంపై శుక్రవారం చర్చించేందుకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. అభివృద్దిపై తొలుత సవాల్ విసిరింది డాక్టర్ చదలవాడే. దీనికి స్పందించిన డాక్టర్ గోపిరెడ్డి .. చర్చకు తాను సిద్ధమని, ఆ చర్చా వేదిక పట్టణంలోని టౌన్హాలు లేదా కోటప్పకొండ వేదికగా ఉంటే బాగుంటుందని సూచించారు. దీనిపై గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తానూ కోటప్పకొండ వేదికగా సిద్ధమేనని డాక్టర్ చదలవాడ పేర్కొన్నారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి స్పందిస్తూ కోటప్పకొండ దిగువ భాగంలో చర్చకు ఏర్పాట్లు చేయాలని, తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నాడు రూ. వేల కోట్ల లబ్ధి 2019–24మధ్యలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాము రూ.2476 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమం అందజేసినట్లు ఇప్పటికే డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు. పేదలందరికీ ఇళ్లు పథకం పరిశీలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 14,700 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ఇళ్ల పట్టా అందజేయలేదు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు రూ.7.45 కోట్లు అందజేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 22,243 మంది విద్యార్థులకు రూ.70.7 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. వసతి దీవెన ద్వారా మరో రూ.18 కోట్లు అందజేశారు. సుమారు రూ.74 కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేశారు. పింఛన్ కానుక ద్వారా రూ.356.32 కోట్లు, అమ్మ ఒడికి రూ.119,80 కోట్లు, రైతు భరోసా కింద రూ.138.76 కోట్లు, డ్వాక్రా రుణమాఫీ ద్వారా రూ.144 కోట్లు, రుణాలు రూ.975 కోట్లు, నాడు–నేడు ద్వారా రూ.31.78 కోట్లు, 42 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.16.35 కోట్లు, 36 హెల్త్ క్లినిక్లకు రూ.6.82 కోట్లు, 31 ఆర్బీకేలను రూ.6.75 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్లకు రూ.13 కోట్లు, 11 కమ్యూనిటీ సెంటర్లను రూ.7.13 కోట్లను ఖర్చు చేశారు. మిల్క్సెంటర్లు రూ.6.13 కోట్లు, నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రూ.6.07 కోట్లు, రూ.80 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్కేర్ సెంటర్, 2,718 మంది విద్యార్థులకు ట్యాబ్లు, పలు పాఠశాలల్లో టచ్స్క్రీన్లు 148, స్మార్టు టీవీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తాగునీటికి రూ.78 కోట్లు, జేఎన్టీయూ నిర్మాణానికి రూ.150 కోట్లు , 34.68 కి.మీ. సీసీ రోడ్లు, 15 కి.మీ. సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు అరకొర... రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో రూ.417 కోట్లతో సంక్షేమం, రూ.127 కోట్లతో అభివృద్ధి చేశానని చదలవాడ ప్రకటించారు. పీ4 పథకం ద్వారా రూ.50 కోట్ల విలువైన పనులు చేశామన్నారు. -
పేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం
గుంటూరు మెడికల్: పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకు రావాలనే ఏకైక లక్ష్యంతో గుంటూరు తక్కెళ్ల పా డులోని లతితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పటల్ను ఏర్పాటు చేశామని చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవశర్మ చెప్పారు. గురువారం హాస్పటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ 36 సంవత్సరాలుగా లలితా గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో లక్షలాది మందికి వైద్య సేవలు అందించామన్నారు. వైద్య సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతోనే లలితానగర్లో 600 పడకలతో అన్ని రకాల వైద్య సేవలతో, ఆహ్లాదకరమైన పరిసరాలతో నూతన ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ, త్రీడీ టెక్నాలజీ ఎమ్మారై స్కానింగ్ మెషిన్ను ఏర్పాటు చేశామన్నారు. హాస్పటల్ సీఈఓ, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోలవరపు అనురాగ్ మాట్లాడుతూ గుండె జబ్బు రోగుల కోసం మూడు అత్యాధునిక క్యాథ్ల్యాబ్లు, పది మంది కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారన్నా రు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఫీజుతో గుండె చికిత్సలు అందిస్తున్నామని, 36 ఏళ్లలో 15 లక్షల మందికి పైగా రోగులకు సేవలందించామన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, న్యూరాలజిస్ట్, డాక్టర్ నరేన్ పోలవరపు మాట్లాడుతూ ఏపీలోనే తొలిసారిగా 1990 నుంచి న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యసేవలు తాము గుంటూరు కొత్తపేటలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పక్షవాతం ఏవయస్సు వారికై నా రావచ్చని, తమ అడ్వాన్స్డ్ అంకినీడు స్ట్రోక్ సెంటర్లో ఏఐ ఆధారిత స్ట్రోక్ సేవలు అందిస్తున్నామన్నారు. ఐవీ త్రాంబోలైసిస్, మెకానికల్ త్రాంబెక్టమీ, రోబోటిక్ ఆర్మ్ చికిత్సలతో ప్రపంచ స్థాయి న్యూరో వైద్యం అందిస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ క్యాన్సర్ జబ్బులకు సమగ్ర వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతినెలా రెండో గురువారం పురుషులకు, మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని, వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సిరిచందన గంగసాని మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అత్యాధునిక వైద్యం, విద్య పరిశోధన, సమాజ సేవ అనే నాలుగు అంశాలతో తాము వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని, 5వేలకు పైగా ఉచిత వైద్య శిబిరా లు నిర్వహించామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్టు డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలతోపా టు, గుంటూరు ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. లలిత ఉచిత ఆరోగ్య వాహిని బస్సు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, జబ్బుల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్యులు ఉన్నారని, 24 గంట లు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆధునిక, సాంకేతికతను తీసుకొచ్చి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందరికి చేరువ చేసేందుకే నూతన హాస్పటల్తో ముందుకు వచ్చామని వెల్లడించారు. సీటీఎస్ సర్జన్ డాక్టర్ అవినాష్, న్యూరోసర్జన్ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, జనరల్ సర్జన్ డాక్టర్ ఉమా శంకర్, ఎనస్థీషియా హెచ్ఓడీ డాక్టర్ మహేష్, రేడియాజిస్ట్లు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ సుష్మ, యూరాలజిస్ట్ డాక్టర్ శర్వణ్కుమార్, ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ శివరామకృష్ణ, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణలు తమ వైద్య విభాగాల్లో అందిస్తున్న సేవల గురించి వివరించారు. లలిత పీవీఎస్ హాస్పటల్ నిర్వాహకులు డాక్టర్ రాఘవశర్మ -
టీడీపీ మహిళ నాయకురాలి నుంచి రక్షణ కల్పించండి
నరసరావుపేట రూరల్: నాభర్తతో టీడీపీ మహిళ నాయకురాలు అక్రమ సంబంధం పెట్టుకుందని, దీన్ని ప్రశ్నించేందుకు వెళితే తనపై దాడికి పాల్పడిందని నరసరావుపేట కర్లకుంట కృష్ణదీప్తి రూరల్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ నాయకురాలుకు వేధింపులు ఉన్నట్లు గతంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమె వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన పెద్దకుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి సరైన వైద్యం అందనీయకుండా మహిళ నాయకురాలు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం తండ్రి సంతకం కావాలంటే మహిళ నాయకురాలి ఇంటి వద్ద ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లిన తనపై ఆమె దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నాకు, నాపిల్లలకు మహిళ నాయకురాలి నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరింది. పల్నాడు డీఆర్ఓగా అద్దెయ్య నరసరావుపేట: పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా ఒంగోలు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ కె.అద్దెయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు డీఎస్ఓ నారదముని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో పలువురు ఉన్నత అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి ఆర్డీఓగా కె.గోపాలకృష్ణ నియమితులయ్యారు. ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి పెదకూరపాడు : ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామంలో జరిగింది. ఎస్ఐ గిరిబాబు కథనం మేరకు.. తమ్మవరం గ్రామానికి చెందిన పాలకాయల తరుణ్శ్రీ పదవ తరగతి పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్నాడు. గురువారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తోట సురేష్తో కలిసి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి బాజీ మిరప పొలాన్ని రోటవేటర్ వేసేందుకు గురువారం తెల్లవారుజామున వెళ్లారు. ప్రమాదవశాత్తూ తరుణ్శ్రీ రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. స్థానికుల సమాచా రం మేరకు తల్లిదండ్రులు నారాయణ, సుజాత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరా వతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల రిజిస్ట్రేషన్ గడువు పెంపు గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాకేంతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీని ఈనెల 22వ తేదీ వరకూ పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ వయస్సు 15 ఏళ్లు పూర్తయ్యి ఉండాలనే నిబంధనలు సవరించారని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులేనని తెలిపారు. మరిన్ని వివరాలకు www. angrau. ap. in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. -
దేశాభివృద్ధిలో యువతే కీలకం
నరసరావుపేట రూరల్: దేశాభివృద్ధిలో యువత కీలక భాగస్వామ్యంగా ఉండటం ద్వారానే దేశాభివృద్ది సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రస్థాయి యువజన విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు కోటప్పకొండలో కొనసాగుతున్నాయి. గురువారం కార్యక్రమాల్లో ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు. దేశంలోని యువతను సన్మార్గంలో నడిపించి మత్తు పానీయాలు, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా దేశభక్తిని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. కులం, మతం, ప్రాంతం వైవిధ్యాలు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, లెక్చరర్లతో శిక్షణా తరగతుల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణకు హాజరైన యువత మీ ప్రాంతాల్లోకి వెళ్లి యువకులను సమీకరించి జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. దేశంలో ప్రజల మద్య చిచ్చు పెట్టి విభజించు పాలించు అనే రీతిలో పరిపాలిస్తున్నారని, దీనికి మారణ హోమానికి కూడా వారు వెనుకాడరని ప్రజలందరూ దీనిని గమనించాలన్నారు. 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రజలపై అధిక ధరల భారాలు మోపిందని, దీనిని మోయలేక ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, యువజన సమాఖ్య జాతీయ అద్యక్షుడు రోషన్కుమార్ సింహ, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యుగంధర్, సంతోష్కుమార్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
ముగ్గురు యువకులకు గాయాలు నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు త్రీవ గాయాలైన సంఘటన బుధవారం అర్థరాత్రి ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి మల్లమ్మ సెంటర్కు వెళ్తున్నారు. మార్గంమధ్యలో అంబులెన్స్ సడన్గా బ్రేక్ వేయటంతో వెనుక ఉన్న ట్రాలీ వాహనం ఢీకొంది. అదే సమయంలో అతివేగంగా ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నారు. సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏరియా వైద్యశాలకు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఎటువంటి ఫిర్యాదు అందలేదని వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
భూ సమీకరణ వివరాలు సీఆర్డీఏకు అందించండి
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహనరసరావుపేట: అమరావతి మండలంలో భూ సమీకరణకు అంగీకరించిన రైతుల వివరాలతోపాటు దేవదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్డీఏకు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ల్యాండ్ పూలింగ్, భూముల వివరాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం చేసి, రైతులకు సకాలంలో త్వరితగతిన పరిహారం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని సూచించారు. సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న దేవదాయ భూములు, రిజిస్టర్ అయిన, కాని భూములు, జరీబ్ భూములు, చెరువులు, కాలువ పోరంబోకు తదితర భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలన్నారు. సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమణకాంత రెడ్డి, అమరావతి తహసీల్దార్ నగేష్ పాల్గొన్నారు. ‘సర్’పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ‘సర్’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సర్పై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలను అనంతరం జిల్లా అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో సర్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వసతి గృహాలలో నెట్ జీరో–హెల్తీ క్యాంపస్ జిల్లాలో వసతి గృహాలను నెట్ జీరో – హెల్తీ క్యాంపస్లుగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టరు సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం నెట్ జీరో – హెల్తీ క్యాంపస్ల కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలోగా అన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు నెట్ జీరో – హెల్తీ క్యాంపస్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కమిటీ సభ్యులు డ్వామా పీడీ లింగమూర్తి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, మునిసిపల్ కమిషనరు బి.రమ్య కీర్తన, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) అజెండాను సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ దిశానిర్దేశం చేశారు. బుధవారం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కమిటీ సమన్వయ కర్త, జిల్లా పరిశ్రమల అధికారి సజ్జా వెంకట సురేష్ 14 అంశాల అజెండా వివరించారు. గత నెల 24న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యల నివేదికను వివరించారు. అనంతరం సింగల్ డెస్క్ దరఖాస్తుల స్థితిగతులపై వివరణ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో రాబోతున్న పరిశ్రమలపై అవగాహన, వారికి ఎదురవుతున్న సమస్యలపై నివేదిక సమర్పించారు. పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఏపీఎస్ఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ పి.వెంకయ్య, ఏపీసీపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.యలమంద, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్. నరసింహారావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రామ్ప్రసాద్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ కె.రామబాలాజీరెడ్డి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఐ.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ పి.ఝాన్సీరాణి, ఎన్ఆర్ఈడీసీ అభివృద్ధి అధికారి ఆర్.భువనేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్ హెడ్ డాక్టర్ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో మాట్లాడుతూ తుఫాన్లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా, ఎస్డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్ఈఓసీ ఇన్చార్జి పీటర్, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నరసరావుపేట: కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే వైద్య పరీక్షలతో బాలబాలికల ఆరోగ్య స్థితిని గుర్తించి సత్వరంమెరుగైన సేవలు అందించినప్పుడే వారి వికాసం సాధ్యమవుతుందని ఒంగోలు ప్రాంతీయ సంచాలకులు బత్తుల మనోరంజని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సీడీపీఓలు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లకు జీరో టూ సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్పై ఆర్టిఫీషియల్ స్క్రీనింగ్పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మనోరంజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదడు అభివృద్ధి, హైపర్ యాక్టివిటీ, ఐసీడీఎస్ లక్ష్యాలు, ఏఐ ద్వారా అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో పనిచేయాలన్నారు. మాచర్ల సీడీపీఓ కృష్ణవేణి నవచైతన్యంపై అవగాహన కల్పించారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మావతి, డీఐఓ రోహిణి రత్నశ్రీ, జిల్లా కోఆర్డినేటర్ బి.మాణిక్యరావు, నోడల్ ఆఫీసర్ అరుణ(రేపల్లె) పాల్గొన్నారు. -
పమిడిమర్రులో కూటమి కార్యకర్తల దాడులు
నరసరావుపేట రూరల్: మండలలలోని పమిడిమర్రులో కూటమి కార్యకర్తలు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాలం రమణమ్మ అనే మహిళ తలకు గొడ్డలి దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటుకు బాధితుల స్థలం అడ్డుగా ఉండటంతో కూటమి నాయకులు బలవంతంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నించారు. వారు అడ్డుకోవడంతో మంగళవారం సర్వే అధికారులతో సర్వే చేయించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో కూటమి నాయకులు వారిపై దౌర్జన్యానికి దిగారు. పురుషులు పొలం పనులకు, బయటకు వెళ్లిన సమయంలో మహిళలపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో బీభత్సం సృష్టించారు. సగినాల యలమంద, శ్రీనివాసరావు, జగ్గయ్యతో పాటు మరికొందరు దాడిలో పాల్గొన్నట్లు బాధితులు ఆరోపించారు. రమణమ్మ తలకు తీవ్ర గాయమైంది. ఆమెను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాణభయంతో తమ కుటుంబాలు గ్రామాన్ని వదిలి బయటకు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా దాడికి పాల్పడిన వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కూటమి కార్యకర్తల నుంచి తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని, ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
పేద కుటుంబాల పిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణమస్తు, షాదీ తోఫాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పెళ్లి కానుక ఇస్తామంటూ రెండేళ్లుగా ఊరించింది. ఏ ఒక్కరికీ కానుకలు అందజేయకుండానే పథకానికి పాతరేసి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి చంద్రబాబు సర్కార్ మంగళం పాడేసింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు స్వస్తి పలికింది. కల్యాణ మస్తు, షాదీ తోఫాలను ఈ ప్రభుత్వం ఎత్తేసింది. పెళ్లికానుక అంటూ ఊరించి ఉసురుమనిపించింది. ఇప్పుడు కల్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి బిడ్డల పెళ్లి ఖర్చులకు వడ్డీతో కూడిన రుణమిస్తామని చెప్పటం సిగ్గుచేటు. – తుమ్మల లక్ష్మీసుజాత, మాజీ కౌన్సిలర్, సత్తెనపల్లిసత్తెనపల్లి: చేసిన సాయం శూన్యమైనా .. ఏదో ఇస్తున్నట్టు నమ్మించడం .. ప్రచారం చేయడం .. జనాన్ని ముంచేయడంలో చంద్రబాబుకు మించిన వారు ప్రపంచంలోనే ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పే మాట. అధికారం కోసం హామీలు గుప్పించడం .. అధికారం చేతికి చిక్కాక మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఊరించారు. నెలకు రూ. 1,500 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మోసం చేశారు. పేద కుటుంబాల పిల్లల వివాహాల సమయంలో పెళ్లి కానుకతో ఆదుకుంటామని నమ్మించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ పథక లబ్ధి కలిగించకుండానే ఎత్తేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లి ఇంటికి పావలా వడ్డీ రుణం అందజేస్తామని చెబుతుండడంపై డ్వాక్రా మహిళలు నివ్వెరపోతున్నారు. ఇదెక్కడ రుణ పథకం అంటూ మండిపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదింటి బిడ్డల వివాహానికి కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఉచితంగా సాయమందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల సంక్షేమానికి పాతరేస్తున్నారని, పేదల కష్టాలు పట్టడం లేదని వాపోతున్నారు. రెండేళ్లలో వివాహంతో ఒకటైన జంటలు రూపాయి సాయానికి నోచుకోలేదని నిట్టూ రుస్తున్నారు. అప్పుడు అలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ సీఎంగా కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో పేద కుటుంబాల్లో కొత్తగా పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్లలో ఆడబిడ్డలకు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు సర్కార్ సాయం చేసేది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. మహిళలకు బురిడీ... చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందన్నది జనం మాట. దీనికి కల్యాణ లక్ష్మి పథకమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇవ్వనున్నారు. రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు రుణం ఇస్తారట. ఇచ్చిన రుణం వడ్డీ సహా తీర్చాల్సిందే. అప్పుగా ఇచ్చే పథకానికి కూడా చంద్రబాబు సర్కార్ ఉచితంగా సాయం చేసినట్టు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేయడం లేదు. పావలా వడ్డీ రుణాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో ఉచితంగా అందజేయాల్సిన పెళ్లి సాయాన్ని కమర్షియల్గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణమస్తు, షాదీ తోఫాలాంటి ఉచిత సాయాన్ని ఎగ్గొట్టి పెళ్లిని రుణమయంగా మార్చడం సమంజసం కాదు. పేదింటి బిడ్డల పెళ్లికి ఉచిత సాయం అందించాల్సింది పోయి ఇచ్చే సాయానికి వడ్డీ సహా చెల్లించాలనడం సరైనది కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేదింటి బిడ్డల పెళ్లికి ఉచిత సాయం అందించాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. – ఉల్లంఘుల విజయలక్ష్మి, మహిళా నాయకురాలు, సత్తెనపల్లి -
కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి
జిల్లా కమిటీ సమావేశంలో ఎం. హరిబాబునరసరావుపేట: రాష్ట్రంలో 70 శాతానికిపైగా ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, రాయితీ రుణాలు అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు జి.పిచ్చారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో హరిబాబు మాట్లాడారు. వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఖరీఫ్ నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టలేదని విమర్శించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై. రాధాకృష్ణ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుర్తింపు పొందిన కౌలు రైతులందరికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు పి.మహేష్, లక్ష్మణరావు, షేక్ ఖాసిం, ఎస్. లూదర్ పాల్గొన్నారు. -
పదవి వరించినా పరుగే!
అత్యున్నత స్థాయి కుర్చీ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు.. కానీ ఇక్కడ ఆ కుర్చీలో ఎక్కడ కూర్చోపెడతారోనని పారిపోయేందుకు పావులు కదుపుతున్నారు. పెత్తనం చలాయించే పదవి అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. కానీ నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ పోస్ట్ అంటేనే ఆరుగురు సీనియర్లు సైతం వెనుకడుగు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నరసరావుపేట టౌన్: సాధారణంగా ఉన్నత హోదా అంటే పోటీ, లాబీయింగ్, సిఫార్సులు సహజం. అలాంటిది నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆసుపత్రిలో అత్యంత కీలకమైన సూపరింటెండెంట్ పదవికి డాక్టర్ సురేష్ కుమార్ రాజీనామా చేశారు. ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే, వైద్యులు తప్పించుకుంటున్నారు. హోదా, గౌరవం, కీలక నిర్ణయాధికారం కలిగిన పదవి అయినప్పటికీ ఆ బాధ్యతలు వద్దంటూ సీనియార్టీ లిస్ట్లో ఉన్న డాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పోస్టు చాలా మంది వైద్యుల కెరీర్లో ప్రతిష్టాత్మక మైలు రాయిగా భావిస్తారు. అయితే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో మాత్రం వారిలో భయాన్ని కలిగిస్తోంది. సమస్యలతో నిత్యం సతమతమవుతున్న ఆసుపత్రి పరిస్థితులు, రాజకీయ జోక్యం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, పరిపాలన ఇబ్బందులు ఈ పదవికి దూరంగా ఉండేందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఆరుగురు సీనియర్ వైద్యుల పేర్లను పరిశీలించినప్పటికీ అందరూ ససేమిరా అన్నారు. చివరకు లిస్ట్లో చివరిగా ఉన్న జూనియర్ వైద్యుడికి బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల్లో ఉత్తర్వులు డీసీహెచ్ఎస్గా కొనసాగుతున్న డాక్టర్ ప్రసున్నాను సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలు చేపట్టాలని అధికారులు కోరగా ఆమె నిరాకరించారు. దీంతో వైద్యశాల్లో సీనియార్టీ లిస్ట్లో ఉన్న గైనికాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ అంకినీడు ప్రసాద్, ఆర్థోపెడిక్ డాక్టర్ చైతన్య, అనస్థీషియా డాక్టర్ వెంకట్రావు, జనరల్ సర్జన్ డాక్టర్ కౌమది తదితరులను సంప్రదించినప్పటికీ వారు కూడా ఆసక్తి చూపలేదు. తాము ఆ పదవి చేపట్టేదుకు సుముఖంగా లేమని తేల్చి చెప్పారు. సీనియారిటీ లిస్ట్లో ఉన్న వైద్యులు ముందుకు రాకపోవటంతో చిన్న పిల్లల డాక్టర్ సతీష్ను సూపరింటెండెంట్గా ఉండాలని ఒప్పించి చివరకు ఆయన పేరును సిఫార్స్ చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అధికారకంగా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలవడనున్నట్లు తెలియవచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ముగ్గురు సూపరింటెండెంట్లు మారారు. రాజకీయ వేధింపులే కారణమని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్యశాలలో అనుమతులు లేకుండా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వ్యతిరేకించిన అప్పటి సూపరింటెండెంట్ మంత్రునాయక్పై అధికార పార్టీ నాయకులు వేధింపులకు దిగారు. తర్వాత బదిలీపై వెళ్లారు. తర్వాత డాక్టర్ రంగారావును నియమించినా రాజకీయ ఒత్తిళ్లతో నాలుగు నెలలకే వెళ్లిపోయారు. ఏడాది క్రితం డాక్టర్ సురేష్ కుమార్ను నియమించారు. సమస్యలు సరిచేయలేక అవస్థలు పడ్డారు. ప్రతి అంశంలో రాజకీయ జోక్యం, మరో వైపు ఉన్నతాధికారుల వేధింపులతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సూపరింటెండెంట్లు పదవి వీడుతుండటంతో రోగులకు అందే వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
ఎట్టకేలకు తెరుచుకున్న ఐసీయూ
నరసరావుపేటటౌన్: ఐసీయూ విభాగానికి వేసిన తాళాలకు సాక్షి కథనంతో మోక్షం లభించింది. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఐసీయూను నిరుపయోగంగా మార్చి విభాగానికి తాళాలు వేసిన వ్యవహారంపై ఇంటెన్సివ్ కేర్ ఏది? అనే శీర్షికతో సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వైద్యవిధాన పరిషత్ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసున్న మంగళవారం వైద్యశాలను సందర్శించారు. ఐసీయూ విభాగాన్ని పరిశీలించి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్కుమార్కు తగు సూచనలు చేశారు. కావాల్సిన పరికరాలు, పడకలు, వసతులు ఉన్నప్పటికీ ఐసీయూ నిరుపయోగంగా ఉంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీయూ విభాగానికి ఇన్చార్జిగా మత్తు డాక్టర్ వెంకట్రావును నియమించారు. కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసి సత్వరమే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. గత కొన్ని నెలలుగా ఏరియా వైద్యశాల లోని ఐసీయూ విభాగాన్ని అధికారుల నిర్లక్ష్యంతో తాళాలు వేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఐసీయూ అందుబాటులో లేని కారణంగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నారు. దీంతో మెరుగైన వైద్యం అందక కొందరు మృతి చెందారు. అదేవిధంగా రోగులు వారి సహాయకులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. సాక్షి కథనంతో అధికారులు స్పందించి ఐసీయూను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐసీయూ విభాగానికి ప్రత్యేక సిబ్బంది కేటాయింపు నేటి నుంచి అందుబాటులోకి వైద్య సేవలు సాక్షి కథనంతో అధికారులలో చలనం -
చెలరేగిపోతున్న ఇసుకాసురులు
కృష్ణానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా ఆగని అక్రమాలుసాక్షి, నరసరావుపేట: తమ్ముళ్ల ధనదాహానికి అంతే లేకుండా పోతోంది. పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా వందల లారీల ఇసుకను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుకాసురులు ఇస్తున్న ముడుపులతో దోపిడీకి సహకరిస్తున్నారనే ఆరోపణ ఉంది. అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలోని ఇసుక రీచ్లలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరులు ఇసుకను దోచేస్తున్నారు. ముఖ్యంగా చింతపల్లి రీచ్లో గత నెల ఆగమేఘాల మీద తమకు అనుకూలంగా ఉన్న ఓ మైనింగ్ కంపెనీకి అనుమతులు దక్కించుకున్నారు. ఈ కంపెనీ కేవలం అనుమతుల కోసం ఉపయోగించారని, స్థానికంగా షాడో ఎమ్మెల్యేగా పేరొందిన ప్రజాప్రతినిధి బంధువు కనుసన్నుల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని సమాచారం. ఈ రీచ్కు ఇచ్చిన అనుమతుల్లో కేవలం ఒక మీటర్ లోతు మాత్రమే చిన్న యంత్రాలతో తవ్వడానికి అనుమతి ఉంది. భారీ యంత్రాలతో ఏకంగా 4 నుంచి 5 మీటర్ల లోతు ఇసుకను తవ్వారు. 15 రోజుల్లోనే సుమారు 2 లక్షల టన్నుల ఇసుకను తవ్వేశారని, దీనిపై ఎంకై ్వరీ కమిటీ వేస్తే అసలు నిజాలు భయపడతాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమరావతి మండలం పొందుగల–3 రీచ్ను నామినేటెడ్ టెండర్ రూపంలో అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఈ రీచ్లో నిబంధనల ప్రకారం యంత్రాలు వినియోగించకూడదు. అయితే 8 భారీ జేసీబీలతో మైనింగ్ జరుగుతోంది. ఇసుక అక్రమ దందాలో వచ్చిన డబ్బు వాటాలను పంచుకోవడానికి ఏకంగా గుంటూరు నగరం జేకేసీ కాలేజీ రోడ్డులోని ఓ అపార్టుమెంట్లోని మొదటి అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికే అన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు పెదకూరపాడుకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. కృష్ణా తీరంలో ఏటా విధించే ‘మాన్సూన్ హాలీడే’ (వర్షాకాల విరామం) జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు ప్రమాదకరం. ఈ సమయంలో నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, జూన్ 2వ తేదీలలో సైతం రాత్రి, పగలు లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీ, అధికారులు వాటిని పాత ఫొటోలు అంటూ బుకాయించే అస్కారం లేకుండా ఫొటోలలో తేదీ, సమయంతోపాటు లాగిట్యూడ్, లాటిట్యూడ్ సైతం ఉండటం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా కృష్ణానది తీరప్రాంతాల్లో గస్తీ కాయాల్సి ఉంది. ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాల సీజ్, భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి. కానీ ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. కృష్ణానది రీచ్లలో బరి తెగిస్తున్న అక్రమార్కులు భారీ యంత్రాలు పెట్టి తరలిస్తున్న ఎమ్మెల్యే భాష్యం అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూట సైతం మైనింగ్ పట్టించుకోని మైనింగ్, విజిలెన్స్, పోలీసు అధికారులు పర్యావరణ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదని ఎన్జీటీ ఆదేశాలు ఉన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో వాటిని కాలరాస్తూ ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలో కృష్ణానదిలో దారులను ఏర్పాటు చేసి భారీ యంత్రాలను తరలించి రాత్రిపూట లారీలలో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇసుక కోసం నదిలోకి ఎటువంటి వాహనాలు దిగకూడదు. ఇసుక తవ్వకాలు ఏమాత్రం జరపకూడదు. ఇసుకాసురులు భారీ యంత్రాల సహాయంలో రాత్రిపూట వందల కొద్దీ లారీల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా లారీలను బెల్లంకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అసలే ఇసుక లభ్యత తక్కువగా ఉండటం, ఉన్న ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో జిల్లా వాసులు అధిక ధర పెట్టి బ్లాక్లోనే కొనాల్సి వస్తోంది. ఉచిత ఇసుక మాటున టీడీపీ నేతలు రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. నిబంధనలను పక్కన పెట్టి నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణమ్మ సంపదను ఇసుకాసురులు దర్జాగా దోచుకుంటున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో వారు రెచ్చిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రోసూరు సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు... కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా జరగనివ్వనని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో నిత్యం వందల లారీల ఇసుక తరలిపోతుంటే కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. -
హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష
తెనాలిటౌన్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను మరింత విస్తృతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్ మున్సిపల్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్, ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్కుమార్, ఎన్పీఎంయూ దీపక్ గోయల్లు మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ జరగటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణను ఇప్పుడున్న 1.47 లక్షల టన్నులకు మించేలా చూడాలని చెప్పారు. పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ ద్రవవ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని 15–20 ఎంఎల్డీకి పెంచుకోవాలని సూచించారు. మొక్కల సంఖ్యను అధికంగా ఉండేలా చూడాలని సురభి మాలిక్ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి నాలుగు బుట్టల్లో చెత్త సేకరణ జరగాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఏసుబాబు, మున్సిపల్ ఇంజినీర్ పి.శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 519.90 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,933 క్యూసెక్కులు వస్తోంది. -
ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
వెల్దుర్తి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్తోపాటు 143 హామీలిచ్చారని, పదవి చేపట్టి రెండేళ్లయినా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్, పోస్టర్లను మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు దండుకొన్నారని తెలిపారు. గెలిచాక రెండేళ్లయినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ.3 వేలు, ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలాలు, గృహ నిర్మాణానికి నిధులు, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు భృతి వంటి కార్యక్రమాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే సూపర్సిక్స్పై ఊదరగొడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించటం తప్ప ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలివేసి కార్పొరేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారని తెలిపారు. పేదవారు నివాసం ఉండటానికి కొద్దిపాటి స్థలం కూడా చూపించలేని సీఎం చంద్రబాబు కార్పొరేట్ వారికి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు, బూడిద శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మందా సంతోష్, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ మస్తాన్, మద్దిగపు పాపిరెడ్డి, కొమ్ము బొంగురు, పోలా శ్రీనివాసరావు, పోతురెడ్డి కోటిరెడ్డి, చిల్లంచర్ల సత్యనారాయణ, వినోద్, కంభంపాటి అమర్ తదితరులున్నారు. వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
క్రికెట్ బుకీ అరెస్ట్
● ట్రేడింగ్ పేరిట రూ.కోట్లలో మోసం ● వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకర్ నరసరావుపేట టౌన్: క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ నకిలీ ట్రేడింగ్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణానికి చెందిన కందుకూరి వీరశేఖరాచారి ఉరఫ్ గోల్డ్ శేఖర్ కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ ట్రేడింగ్ కంపెనీ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన కల్యాణ చక్రవర్తిని ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.1.44 కోట్లు తీసుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గోల్డ్ శేఖర్తో పాటు సావాని రవితేజ, మౌర్యవర్థన్రెడ్డి, సావాని లలితలపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులో రవితేజ, లలిత దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న గోల్డ్ శేఖర్, అతని భార్య కందుకూరి వెంకట నాగ సులోచనలను మహానంది లోని లాడ్జిలో తలదాచుకున్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లి సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. గోల్డ్ శేఖర్పై ఇప్పటి వరకు 12 క్రికెట్ బెట్టింగ్, రెండు గంజాయి, ఒక పోక్సో కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా దర్శి పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదల అయ్యాడు. ఇటీవల కడపలో మరో బెట్టింగ్కు సంబంధించి కేసు నమోదై ఉంది. కాగా కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు మౌర్యవర్థన్రెడ్డి, ఇస్లాంపేటకు చెందిన షేక్ నాగూర్లను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు సౌందర్ రాజన్, యాష్న, సిబ్బంది పాల్గొన్నారు. -
వాగునూ వదలని తమ్ముళ్లు
తమ్ముళ్ల ధన దాహానికి వాగులూ మిగలడం లేదు. ఇసుక, గ్రావెల్ మాత్రమే కాదు... వాగు పోరంబోకు భూముల్లో నల్లమట్టిని సైతం మింగేస్తున్నారు. పర్యావరణం, భవిష్యత్ సమస్యలు పట్టించుకోకుండా మట్టి విక్రయించి భారీగా జేబులు నింపుకొంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నది అధికార పార్టీ వారు కావడంతో అధికారులు సైతం వేడుక చూస్తున్నారు. మరికొందరు వారితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. ● విచ్చలవిడిగా మట్టి తవ్వి విక్రయాలు ● రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం ● అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా గుంతలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం రాత్రి సమయాల్లో... -
పల్నాడు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. నరసరావుపేట: మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలు, నియామకాలపై వెంటనే సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీచే సమగ్ర విచారణ జరిపించి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అగ్రనాయకులనే లోపలికి పంపించారు. పీజీఆర్ఎస్లో జరిగిన అవకాతవకలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చకుండా దగా చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామంటూ వారే ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారన్నారు. ఈ రెండేళ్లలో నిరుద్యోగులకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా డీఎస్సీలో దగా చేసి మోసం చేశారన్నారు. అవకతవకలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 4వేల మంది నిరుద్యోగులకుపైగా అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటా తరఫున 400 నుంచి 500 పోస్టులు అమ్ముకున్నారనే విషయం బయటపడిందన్నారు. మెరిట్ జాబితా విడుదల చేయలేదన్నారు. సమగ్ర విచారణ జరపకుండా మాయమాటలు, తప్పుడు ప్రచారాలతో దాటవేసేందుకు ప్రయత్నిస్తే విద్యార్థులు, యువత తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పేదప్రజలు, యువతీయువకులు, విద్యార్థులు, ప్రజల తరఫున తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ఎన్నాళ్లో సాగదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. యువతకు వెన్నుపోటు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల మాట్లాడుతూ చంద్రబాబును చూస్తేనే ప్రజలకు వెన్నుపోటు గుర్తుకు వస్తుందన్నారు. సూపర్ సిక్స్లో నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదన్నారు. డీఎస్సీలో ఒక్కో ఉద్యోగం రూ.15లక్షలు విక్రయించినట్లుగా ఆడియా, వీడియాలు బయటకు వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పడాల శివారెడ్డి, యెనుముల మురళీధరరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా నుంచి వచ్చిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది దగా డీఎస్సీ 6పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పూర్తి అవకతవకల మయమని, అవినీతితో నిండిపోయిందన్నారు. మెరిట్ లిస్టులో ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వకుండా రూ.లక్షలకు దొడ్డి దారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని స్పష్టం చేశారు. నిజాయితీగా డీఎస్సీ నిర్వహిస్తే మెరిట్ లిస్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో సుమారు 420 ఉద్యోగాలను ఒక్కో ఉద్యోగం రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన స్పోర్ట్స్ కోటాలో అర్హులైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసులకు ఉద్యో గాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. క్రీడా మైదానం అంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రూ.లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అమ్ము కున్నారన్నారురు. లోకేష్కు దమ్ము, ధైర్యం ఉంటే డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెరిట్ లిస్టులో ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోయారని, తక్షణమే మెరిట్ లిస్టు ప్రకటించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
చుక్కలు కనిపింఛన్
పిడుగురాళ్ల: సర్వర్ పనిచేయక పిడుగురాళ్లలో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క సర్వర్ పనిచేయక, మరోపక్క ఉక్క పోతతో ఓపిక నశించిన పింఛన్ లబ్ధిదారులు ఇక లాభం లేక వెనుదిరిగారు. అధికారులు సర్వర్తో కుస్తీ పట్టడమే సరిపోయింది. సోమవారం ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, సర్వర్ సమస్యతో కొద్దిమందికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇవ్వగలిగారు. అక్కడ నుంచి సర్వర్ మోరాయించి, సాయంత్రం నాలుగు గంటల వరకు రాకపోటంతో పెన్షన్ దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కచోటకి వస్తేనే పింఛన్.. ముప్పాళ్ల: సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించగా.. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఎప్పుడు ఇస్తారో తెలియక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రమైన ముప్పాళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటింటికి వచ్చి పింఛన్లు అందించాల్సిన ఐకేసీ సీసీ నాగరాజు లబ్ధిదారులందరిని చర్చి వద్దకు వస్తేనే ఇస్తానని చెప్పటంపై వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వయసుడిగి... కాళ్లు, నడుం నొప్పితో ఇబ్బందుల పడుతున్న తమను మరింత ఇబ్బందులకు గురిచేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ముప్పాళ్లలో చోటుచేసుకున్న పింఛన్ పంపిణీ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు అధికారులు పాట్లు పడ్డారు. -
చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు..
వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో రచ్చమల్లపాడు ఒకే కుటుంబంలోని వారు ఇద్దరు మృతిచెంది, ఒకరు తీవ్రగాయాల పాలై కోమాలోకి వెళ్లడంపై రచ్చమల్లపాడు గ్రామం శోకసంద్రంలో మునిగింది. విషయం తెలుసుకున్న బంధువులు, ఆత్మీయులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారయ్యా అంటూ బంధువులు రోదిస్తున్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
నరసరావుపేటరూరల్: ఉద్యోగాల పేరుతో మోసాలపై పీజీఆర్ఎస్లో పలు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ పాల్గొని ఫిర్యా దులు స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక, తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించిన 65 ఫిర్యాదులు అందాయి. ఇందులో భార్యభర్తల వివాదాలపై 15, ఆర్థిక వ్యవహారాలపై 11, భూ వివాదాలు–8, ఆస్తి వివాదాలు–7 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు. సత్తెనపల్లి: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 147 మందికి వివిధ రాష్ట్రాలను కేటాయించారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో 797వ ర్యాంక్ సాధించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.త్వరలో శిక్షణ అనంతరం డాక్టర్ పెండెం ప్రత్యూష్కు రాష్ట్రంలో పోస్టింగ్ కేటాయించనున్నారు. సత్తెనపల్లి: రగ్బీ పల్నాడు జిల్లా జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపికల కార్యక్రమానికి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈవూరి కృష్ణారెడ్డి హాజరై ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6, 7 తేదీల్లో నందిగామలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్షిప్లో పాల్గొంటారని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి పి.డానియేల్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వివరాలను ఆయన వెల్లడించారు. బాలుర జట్టుకు.. ఎల్.పార్థసారథి, వై.జస్వంత్, వి.సుప్రీత అభిషేయ్, ఇ.భువన చంద్రారెడ్డి, ఎం.భానుతేజ, బి.ప్రసన్నకుమార్, జి.జయభాను యాదవ్, బి.జ్యోతిబాబు, ఐ.జాన్, ఎం.కౌశిక్, డి.శివశంకర్, కె.రామ్ చరణ్, స్టాండ్ భైలుగా సి.రామ్మనోహర్, కె. మరియుబాబు ఎంపికయ్యారు, బాలికల జట్టు పి.అలేఖ్య, పి.కోమలి, ఇ.లాస్య, ఎ.పూజిత, సి.హెచ్. ప్రీతి, సీహెచ్.జ్ఞానశ్రీ అర్చన, బి.మహి, పి.శైలజ, బి. శైలజ, బి.గంగాభాయి, కె.సుకన్య, ఎన్.అలేఖ్య, స్టాండ్ బైలుగా ఎన్.నందిని, సీహెచ్.శ్రావ్యలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకరపర్తి శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు పి.శివరామకృష్ణ, వై.పూర్ణచంద్రరావు, లాకు పిచ్చయ్య, వై.చిరంజీవి, క్రీడాకారులు పాల్గొన్నారు. లోపాలు లేకుండా రీ సర్వే బొల్లాపల్లి: లోపాలు లేకుండా పకడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులకు సూచనలు చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు, ఏడీ సర్వే,భాను కీర్తి, నరసరావుపేట ఆర్డీవో ఏ బాలకష్ణ మండలంలో రేమిడిచర్ల, గుమ్మనంపాడు గ్రామాల్లో రీ సర్వే పనులను తనిఖీ చేశారు. స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుమ్మనంపాడు పంచాయతీ పరిధిలోని నిమ్మల సుబ్బయ్య కుంట తండాను సందర్శించారు. తండావాసులు రహదారి కోసం పీజీఆర్ఎస్లో అందజేసిన అర్జీని పరిశీలన అనంతరం తండావాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి మార్గం చూస్తామని తండావాసులకు హామీ ఇచ్చారు. -
అర్జీలు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి
జిల్లా రెవెన్యూ అధికారి నారదముని నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించి జిల్లా నలుమాలల నుంచి వచ్చిన వారిచే 152 అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు గడువులోపు అర్జీలను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. ప్రతిరోజు అర్జీలను మానిటర్ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, పెండింగ్ ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. -
చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతే ఆపరేషన్ దండాయన లక్ష్యం..
బాపట్లటౌన్: మహిళల భద్రతే ‘ఆపరేషన్ దండాయన’ లక్ష్యమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆపరేషన్ దండాయన పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసులు, మహిళలపై వేధింపులు వంటి నేరాల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులపై చట్టపరమైన చర్యలను మరింత కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి కేసులో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేసి, కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత మహిళలకు అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు నేరస్తులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నైబర్హుడ్ వాచ్ విధానాన్ని అమలు చేస్తూ, జియోట్యాగింగ్ ఆధారంగా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ ఇన్న్స్పెక్టర్ జి.నారాయణ, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బారావు, సీసీఎస్ ఇన్న్స్పెక్టర్ ప్రేమయ్య, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8 లక్షల నగదును అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపుకు బేబీ చిప్స్తో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుండి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్ ధ్వంసమై క్యాబిన్లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతిలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురికి తీవ్ర గాయాలు -
దుర్గమ్మకు కానుకగా అరకిలో వెండి దిమ్మె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు -
రైతుల నోట్లో ‘మట్టి’
శావల్యాపురం: శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో మట్టి, ఇసుక మాఫియా పడమటి వాగును పిండేస్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో కొందరు నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు, మండల స్థాయి అధికార పార్టీ నేత ఒకరు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇసుక, మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీకే బ్రిడ్జి నిర్మాణం! ఇటీవల కాలంలో ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలతో పడమటి వాగుపై ఒక బ్రిడ్జిని నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటి నుంచే సదరు నేత కన్ను ఇక్కడి ఇసుక నిల్వలపై పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, ఆఘమేఘాల మీద పొక్లెయిన్లను రంగంలోకి దించారు. చుట్టుపక్కల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాగు అంచుల్లో భారీగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికార పార్టీ నేత అధికారులను మభ్యపెట్టారా, లేక తన రాజకీయ బలంతో భయపెట్టారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పొంచి ఉన్న భారీ ముంపు పడమటి వాగు అంచున ఉన్న పొలాలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల భారీ వరద ముప్పు పొంచి ఉంది. గతంలో పలుమార్లు ఈ వాగు పొంగిపొర్లడం వల్ల చుట్టుపక్కల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఇప్పుడు వాగు అంచులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో, రాబోయే వర్షాకాలంలో వాగు గట్టు తెగి పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి.. దౌర్జన్యం ‘ఇలా అక్రమంగా తవ్వడం వల్ల మా పొలాలు మునిగిపోతాయి, ఇది పద్ధతి కాదు’ అని ప్రశ్నించిన రైతులపై సదరు నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. తమను నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ యథేచ్ఛగా పొక్లెయిన్లతో తవ్వకాలు సాగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ మైనింగ్పై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముంపు ముప్పు నుంచి తమ పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
పల్నాడు
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూకు తాళాలు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర ఆదివారం ఆయన స్వగ్రా మం ఇంకొల్లు మండలం పావులూరులో ఆదివారం నిర్వహించారు. ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఆఖరి మజిలీ యాత్ర రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు ఇన్చార్జి వరి కూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, దాసరి కిరణ్బాబు, వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు. ఊపిరి అందక ఒకరు.. గుండె ఆగిపోతూ మరొకరు... ప్రమాదం బారినపడి అత్యవసర వైద్యం కోసం ఇంకొకరు ఐసీయూ వైపు కదులుతుంటే మూసి ఉన్న తలుపులు ప్రభుత్వ వైద్య దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఐసీయూ అంటే తుదిశ్వాసకు ఆయువు పోసే దేవాలయం.. అలాంటి ఐసీయూకి తాళాలను చూసి పేదోళ్ల కన్నీళ్లు పొంగుతున్నాయి. ఐసీయూకి వేసింది తాళాలు మాత్రమే కాదు.. నిరుపేదల అత్యవసర వైద్య హక్కుకు సంకెళ్లు. కార్పొరేట్ ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేని నిర్భాగ్యులకు మేమున్నామంటూ అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేస్తుండడంతో అభాగ్యుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు చివరి ఆశగా ఉండాల్సిన ఐసీయూ విభాగం కొన్ని నెలలుగా తాళాలు వేసి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అందించే వైద్యం ప్రతినిమిషం విలువైందే. అటువంటి అత్యవసర బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తుంది. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న రోగులు, వారి సహాయకులకు ఐసీయూ తలుపులపై వేలాడుతున్న తాళాలు కనిపిస్తున్నాయి. ఆపదలో కాపాడాల్సిన విభాగం మూతపడటం అంటే పేదల ప్రాణాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని నిరు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు అలాంటి వైద్యశాల్లో ప్రాణ రక్షక సేవలు నిలిచిపోతే ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా ప్రశ్న తలెత్తోంది. అత్యవసరమైతే గుంటూరే..! ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తరువాత రోగులు ప్రతి రోజు అధిక సంఖ్యలో వచ్చేది నరసరావుపేట ఏరియా వైద్యశాలకే. ప్రతిరోజు 1000 కి పైగా ఓపీ నమోదు అవుతూ ఉంటుంది. మొదట 200 పడకల వైద్యశాలగా ఉన్న ఏరియా ఆసుపత్రిని 350 పడకలుగా అప్గ్రేడ్ చేశారు. దాదాపుగా అన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూ విభాగానికి తరలించి పర్యవేక్షణలో ఉంచుతారు. దీంతో పాటు గర్భిణులకు సంబంధించి హైరిస్క్ కేసులను ఐసీయూకు తరలిస్తారు. అయితే గత కొన్ని నెలలుగా ఐసీయూ అందుబాటులో లేకపోవటంతో అత్యవసర సేవలు అవసరమైన రోగులను గుంటూరుకు తరలిస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఐసీయూకి కావాల్సిన పరికరాలన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఐసీయూ అందుబాటులోకి తేకపోవటం విమర్శలకు తావిస్తుంది. ఐసీయూ విభాగాన్ని పూర్తిగా మూసివేసి తలుపుపై ఇటీవల సన్ స్ట్రోక్ వార్డుగా పోస్టర్ అంటించారు. వడదెబ్బ తగిలి వైద్యశాల్లో చేరేవారు లేకపోవటంతో ఆ వార్డును కూడా తెరవటంలేదు. ఏటా పెరుగుతున్న మరణాలు ఏరియా వైద్యశాల్లో ప్రతి ఏటా మాతా, శిశు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవటంలేదన్నా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024–25 లో 183 మంది శిశువులు మృతి చెందగా, 8 మంది బాలింతలు మృతి చెందారు. 2025–26లో 179 మంది శిశువులు మృతి చెందగా, 10 మంది బాలింతలు ప్రసవ సమయంలో మృతి చెందారు. 7ఐదు రోజుల క్రితం నకరికల్లు మండలానికి చెందిన గర్భిణి వైద్యశాలలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆమెకు ప్రసవం అనంతరం సీరియస్ కావడంతో మెరుగైన వైద్యసేవలు అందక.. గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వస్తున్న రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో సేవల్లో జాప్యం జరుగుతుందని రోగులు వాపోతుండగా, మరో వైపు పని ఒత్తిడి కారణంగా మెరుగైన సేవలు అందించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది చెప్పుకొస్తుండడం గమనార్హం. -
భవితకు బాసట
సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాల చిన్నారుల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ‘భవిత కేంద్రాలు’ ఆసరాగా నిలుస్తున్నాయి. బడులకు దూరంగా ఉన్న 3–18 సంవత్సరాల వయస్సున్న ప్రత్యేక అవసరాల చిన్నారుల గుర్తింపునకు ఈ నెల 1న ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఐఈఆర్టీ అధికారులు ప్రత్యేక అవసరాల చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను నూతనంగా గుర్తించి పాఠశాలలో పునఃప్రారంభమైన తర్వాత సమీప భవిత కేంద్రాలు, పాఠశాలల్లో చేర్పించనున్నారు. భవిత కేంద్రాల్లో అందించే సేవలు.. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో గత విద్యా సంవత్సరం 820 మంది విద్యార్థులు లబ్ది పొందారు. వీరిలో 280 మంది విద్యార్థులు ఇంటి వద్ద మంచాలకే పరిమితమై ఉండగా, మిగిలిన 540 మంది భవిత కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వంతోపాటు అలింకో అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన పరికరాలను అందిస్తున్నారు.రాయడం, మాట్లాడటం, చదవడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లాలో మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున 8 మంది ఉన్నారు. వీరు వారంలో ఒకరోజు భవిత కేంద్రాల్లో వైద్యులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నారులకు చిన్నపాటి వ్యాయామాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి వారిలో సానుకూల ధృక్పథాన్ని పెంపొంది స్తున్నారు. డీఈఓ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో ఉన్న ఐఈఆర్టీల ద్వారా నూతనంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల గుర్తింపు సర్వేను వేగవంతం చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించాం. ప్రత్యేక అవసరాల చిన్నారులకు 21 రకాల పరీక్షలు చేసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ఆయా స్థాయిలను బట్టి వారిని సమీప భవిత కేంద్రాలు, సమీప పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. –ఆర్.సెల్వరాజ్, సహిత విద్యా జిల్లా సమన్వయకర్త, పల్నాడు ఐఈఆర్టీ ఉపాధ్యాయులు సుమారు నెలరోజుల పాటు గ్రామాల్లో తిరిగి ప్రజల నుంచి వివరాలు సేకరించి దృష్టి యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన సర్వేలో ఇప్పటి వరకు 60 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించారు. వీరు చేస్తున్న సర్వేను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో భవిత కేంద్రాలు : 28 ప్రత్యేక అవసరాల చిన్నారులు : 820 మంది భవిత కేంద్రాలకు వచ్చేవారు : 540 ఇంటివద్ద చదివే పిల్లలు : 280 కొత్తగా సర్వేలో గుర్తించిన వారు : 60 మొత్తం ఐఈఆర్టీలు : 56 ఫిజియోథెరపిస్టులు : 8 -
హ్యాకథాన్లో మంగళగిరి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సన్మానం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్ఐలు కె.రాజశేఖర్బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం
నరసరావుపేట: నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ చర్చ టౌన్హాలు లేదా కోటప్పకొండ వేదికగా జరగాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిపై పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిరోడ్డుపై అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ సమస్య వలన గంటలతరబడి కూర్చొని చర్చించటం సాధ్యంకాదని, అందువల్ల టౌన్హాలులో అంబేడ్కర్ చిత్రపటం ఏర్పాటుచేసి మీడియా సమక్షంలో చర్చిద్దామని సూచించారు. అధికారంలో వారు ఉన్నందున తేదీ, సమయం, ఏర్పాట్లు అన్నీ ఎమ్మెల్యేనే చూడాలని కోరారు. చెప్పిన సమయానికి వారు ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే వస్తానని పేర్కొన్నారు. పేదవాడికి సెంటు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ చదలవాడ చేసింది శూన్యమని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకి రూ.2476కోట్ల విలువైన సంక్షేమం, అభివృద్ధి పనులు తాము అందజేశామని వెల్లడించారు. పల్నాడును జిల్లాగా ఏర్పాటు చేసి, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించామని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు ఇక్కడ ఉంటున్నారంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తనకు ఆ ఘనత దక్కుతుందన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఏ ఒక్క పేదవాడికై నా ఇంటి స్థలంకోసం సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం తన అనుయాయుడు, ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్న బీసీ కాలనీ రమేష్కు సెంటు రూ.25లక్షలు విలువచేసే నాలుగు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని మాత్రమే ఇచ్చాడని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారు 15వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, జగనన్న కాలనీల్లో సెంటు స్థలం, గ్రామాల్లో సెంటున్నర చొప్పున ఇచ్చామన్నారు. కోటప్పకొండకు నిధులు పెంచామని ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవంలేదన్నారు. ఈ రెండేళ్లలో రూ.4కోట్ల నిధులు పెరిగితే 15 మరుగుదొడ్ల నిర్మాణం తప్పితే మరెటువంటి అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాకాని, చింతలపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరికి కోటప్పకొండ అజమాయిషీ అప్పచెప్పటంతో వారు కొండ నిధులను స్వాహా చేస్తున్నారన్నారు. తాము కోటప్పకొండపైన నంది, మేథా దక్షిణామూర్తి విగ్రహాలు, అతిధిగృహాలు, మెట్లపై షెడ్లు, దేవాలయం చుట్టూ ఉన్న గిరిప్రదక్షణ రోడ్డు, సెంట్రల్ డివైడర్, లైటింగ్, కూడలిలో శివుని బొమ్మ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు 90శాతం హామీలు నెరవేర్చామని మాట్లాడుతున్నాడని, అవి ఏంటో చర్చించేందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రెండు చప్టాలు కట్టి రెండు ప్లైఓవర్లు కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. తాము చేసిన అభివృద్ధి, అందజేసిన సంక్షేమం లెక్కలతో తాను చర్చించేందుకు వస్తానని, దమ్ము, దైర్యం ఉండి వారు వస్తే చర్చించి తేల్చుకుంటామన్నారు. -
అన్నింటా ఇంటి బండ!
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ గ్యాస్ వినియోగం పట్టణంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. పశ్చిమసియా యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడి సామాన్యులు ఒకవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ మార్గంలో గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పాటు డిమాండ్ పెరగటంతో కట్టెల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ క్రమంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు తక్కువ ధరలో లభించే గృహ వినియోగ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో బుక్ చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యేది. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణ పరిధిలో బుక్ చేసిన తర్వాత నెల రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సరిపడా గ్యాస్ అందుబాటులో లేక గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర పెరగటంతోనే.. గృహ అవసరాలకు సరఫరా చేసే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.950ల వరకు ఉండగా, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.3,200 ఉంది. గృహ సిలిండర్ తక్కువ ధర కారణంగా అక్రమ వ్యాపారులు వాటిని ఉపయోగించేందుకు అనేక మార్గాలను వినియోగిస్తున్నారు. కొంతమంది వినియోగదారుల వద్ద సిలిండర్పై రూ.300 నుంచి రూ.500 వరకు అధిక నగదు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేసే దళారుల ద్వారా కొనుగోలు చేసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రభావంతో రూ.2,200 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,200లకు పెరిగింది. ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అక్రమార్కులు గృహ అవసరాల సిలిండర్లను అధికంగా వినియోగించటంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్యాస్ అక్రమ వినియోగ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


