8న టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

8న టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు

Mar 4 2026 7:44 AM | Updated on Mar 4 2026 7:44 AM

● ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అలాగే భూమి మీద ఆధారపడిన కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు , వృత్తిదారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ● కేంద్ర ప్రభుత్వం అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం ఇచ్చిజన గెజిట్‌ నోటిఫికేషన్‌ గందరగోళ పరుస్తూ అర్థం కాకుండా ఉందని తెలిపారు. ● భూమి తీసుకునే ప్రతి గ్రామంలోనూ గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ● రైతులకు ప్రైవేట్‌ మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌ కుమార్‌, రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి, వి.భారతి,బి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామరృష్ణ, జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి ,సిఐటియు జిల్లా నాయకులు వై. నేతాజీ, కె. నళినీకాంత్‌, ఎన్‌.భావనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి

నరసరావుపేట ఈస్ట్‌: సతైనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్‌, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్‌, డబుల్స్‌, మిక్సడ్‌ డబుల్‌ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్‌ వెబ్‌సైట్‌ లో తమ ఆధార్‌ కార్డు ద్వారా రిజిస్టర్‌ కావాలని తెలిపారు. రిజిస్టర్‌ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.

9న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌) : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్‌ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement