వెంబడించి పట్టుకున్న యువకులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెంట్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్ టెస్టింగ్ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ను బంగారు ఆభరణాలపై మిషన్ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్ అధికారి వివేక్రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో లైసెన్సులు లేకుండా హాల్మార్క్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్ మార్క్ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్ మిషన్, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మీడియాపై దాడి...
బీఐఎస్ అధికారులు సన గోల్డ్టెస్టింగ్ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు.
దుకాణ షట్టర్లు పగలగొట్టి రూ. 50 వేలు అపహరణ
నరసరావుపేట టౌన్: ప్రకాష్నగర్లో వరుసగా ఉన్న నాలుగు దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు నగదు అపరించుకు వెళ్లిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి స్కూల్ సమీపంలో వరుసగా ఉన్న నాలుగు దుకాణాలను యజమానులు ఆదివారం రాత్రి యథావిధిగా తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చి చూడగా మెడికల్ దుకాణంలోని కౌంటర్లో ఉన్న రూ.50వేల నగదు కనిపించలేదు. పక్కనే ఉన్న టైలరింగ్ షాప్లో కొంత నగదు అపరించుకు వెళ్లారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు.


