అప్పుల కుప్ప! | - | Sakshi
Sakshi News home page

అప్పుల కుప్ప!

Jan 31 2026 6:47 AM | Updated on Jan 31 2026 6:47 AM

అప్పు

అప్పుల కుప్ప!

● పంచాయతీల్లో పేరుకుపోయిన పన్ను వసూళ్లు ● మార్చి ముంచుకొస్తున్నా రాబడి నిల్‌ ● జిల్లాలో రూ.27.57 కోట్ల బకాయిలు ● జిల్లాలో పన్ను బకాయిల వసూళ్లు, తాజా పన్నుల వసూళ్లలో గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దాచేపల్లి మండలం అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని బొల్లాపల్లి మండలం చివరి స్థానంలో నిలిచింది. ● జిల్లా వ్యాప్తంగా 520 గ్రామ పంచాయతీల్లో పాత బకాయిలు 2025–26 ఆర్థిక సంవత్సర పన్నుల వసూళ్లు పడకేసినట్టు కనిపిస్తుంది. ● పన్నుల వసూళ్లలో దాచేపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట మండలాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా .. బొల్లాపల్లి, అచ్చంపేట, ఈపూరు వరుసగా చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. ● దాచేపల్లి మండలంలో 11,722 అసెస్మెంట్లు ఉండగా పాత బకాయిలు రూ.89 లక్షలు, ప్రస్తుత డిమాండ్‌ రూ.167.84 లక్షలు ఉంది. మొత్తం రూ.256.85 లక్షలు కాగా దీనిలో పాతబకాయిలు రూ. 53.08 లక్షలు, ప్రస్తుత డిమాండ్‌లో రూ.75.15 లక్షలు కలిపి మొత్తం రూ. 128.23 లక్షలు వసూళ్లతో 49.92 శాతం సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ● నరసరావుపేట డివిజన్‌ పరిధిలోని బొల్లాపల్లి మండలాన్ని చూస్తే 16,087 అసెస్మెంట్లకు గాను బకాయిలు రూ.13.39 లక్షలు. ప్రస్తుత డిమాండ్‌ 48.50 లక్షలు కలిపి రూ.61.89 లక్షలు ఉండగా బకాయిలు రూ.1.76 లక్షలు, ప్రస్తుత డిమాండ్‌ రూ.6.60 లక్షలు మొత్తం రూ.8.35 లక్షల వసూళ్లతో 13.49 శాతం వసూళ్లు చేసి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ● ఇలాగే బకాయిలు పేరుకు పోతే పంచాయతీలు ముందుకు వెళ్లే పరిస్థితులు లేవు.

ఆదాయంతోనే పనులు..

జిల్లాలో డివిజన్‌ల వారీగా ఏరియర్స్‌, తాజా పన్ను బకాయిలు

సత్తెనపల్లి: జిల్లాలో 28 మండలాలు ఉండగా 520 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో కేవలం దాచేపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, మాచవరం మండలాలు మాత్రమే పన్ను వసూళ్లలో ముందు వరుసలో ఉన్నట్లు ఈ నెల 29 నాటి గణాంకాలు చెబుతున్నాయి. బొల్లాపల్లి, అచ్చంపేట, ఈపూరు మండలాలు పన్ను వసూలులో చివరి వరుసలో ఉన్నాయి.

ఈ మండలాల్లో ఆశించిన మేర వసూళ్లు కనిపించడం లేదు. ఏటా రూ. కోట్లల్లో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తాయి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నారు. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం వాటి ద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికి తోడు వసూలు చేయాల్సిన ఇంటి పన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్‌లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది.

వసూళ్లలో దాచేపల్లి అగ్రస్థానం .. బొల్లాపల్లి చివరి స్థానం ....

పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధుల తోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకట లాడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేని కోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది. కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్ను ల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.

డివిజన్‌ అసెస్‌మెంట్లు ఏరియర్స్‌ లక్షల్లో కరెంట్‌ లక్షల్లో మొత్తం లక్షల్లో

గురజాల 1,22,952 రూ. 209.36 రూ. 561.87 రూ. 771.23

నరసరావుపేట 1,41,482 రూ. 323.39 రూ. 601.66 రూ. 925.05

సత్తెనపల్లి 1,33984 రూ. 456.54 రూ. 604.55 రూ.1061.69

మొత్తం 3,98,418 రూ. 989.29 రూ.1768.08 రూ.2757.37

అప్పుల కుప్ప! 1
1/1

అప్పుల కుప్ప!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement