ప్రశ్నిస్తే చంపేస్తారా?
టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే చంపేస్తారా? టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ విచారణలో వెల్లడిస్తే టీడీపీ నాయకుల తీరు దారుణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తే ఇంత దారుణంగా దాడులు చేస్తారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గతంలో వంగవీటి మోహన రంగను ఏ విధంగా పొట్టన పెట్టుకుందో... ఆ విధంగా అంబటి రాంబాబును చేయాలనే ఆలోచనతో ఉంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– కాసు మహేష్ రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే


