భారతదేశ ఆర్థిక చరిత్రలో తొలిసారిగా, కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఇలా ఎప్పుడైనా వచ్చిందా అంటే..
1999 బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. 1999లో, ఫిబ్రవరి 28 ఆదివారం వచ్చింది. అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దానిని ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 27న, శనివారం ప్రవేశపెట్టారు. 1999 బడ్జెట్ కూడా చారిత్రాత్మకమైనదే. ఎందుకంటే అప్పటి వరకు, కేంద్ర బడ్జెట్లను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. పగటిపూట జరిగే ప్రకటనల సమయాన్ని ఉపయోగకరంగా మార్చేలా.. ఏళ్ల నాటి బ్రిటిష్ వలసవాద ఆచారానికి తెరపడిన రోజు అది.
ఇలా సెలవురోజున ప్రవేశపెడితే ఏం జరుగుతుందంటే..
పార్లమెంట్ షెడ్యూల్ ప్రకారం సమావేశమవుతుంది - సెలవు దినం అయినప్పటికీ, పార్లమెంటు సాధారణంగా బడ్జెట్ కోసం సమావేశమవుతుంది. ఆర్థిక మంత్రి షెడ్యూల్ చేసిన సమయంలో లోక్సభలో ప్రసంగిస్తారు.
మార్కెట్లు ప్రత్యేక సమావేశాలను ప్రారంభించవచ్చు - BSE, NSE సాధారణంగా ఆదివారాల్లో మూసివేయబడినప్పటికీ, ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను నిర్వహించవచ్చు, దీని వలన పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రకటనలకు వెంటనే స్పందించవచ్చు.
విశ్లేషణకు అదనపు సమయం. అలాగే ఆదివారం బడ్జెట్ పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక లక్ష్యాలు, రంగాల కేటాయింపులను అధ్యయనం చేయడానికి ఈ అదనపు సమయం ఉపయోగ పడుతుంది. పైగా మార్కెట్లు మార్పులలో పూర్తిగా ధర నిర్ణయించే ముందే ఈ అదనపు సమయంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉడొచ్చు.
అస్థిరత ఇప్పటికీ సాధ్యమే - అదనపు సమయం ఉంటుంది కాబట్టి.. బడ్జెట్లో ఆశ్చర్యకరమైనవి ఉంటే, ముఖ్యంగా సాధారణ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనప్పుడు మార్కెట్లు చాలా వేగంగా కదలడం ఊపందుకునే అవకాశం ఉంటుంది.
(చదవండి: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ఎందుకు..? ఎప్పటి నుంచి మొదలైందిలా)


