కోటప్పకొండలో భక్తుల రద్దీ
నరసరావుపేట రూరల్: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షణలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కోటప్పకొండలో భక్తుల రద్దీ


