గొలుసు దొంగల విజృంభణ | - | Sakshi
Sakshi News home page

గొలుసు దొంగల విజృంభణ

Feb 4 2026 7:22 AM | Updated on Feb 4 2026 7:22 AM

గొలుసు దొంగల విజృంభణ

గొలుసు దొంగల విజృంభణ

● రెండు నెలల క్రితం బరంపేటలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న పెరుగుపల్లి అభినయ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు లాక్కెళ్లారు. ప్రతిఘటించి వెంబడించటంతో ఆమైపె దాడికి పాల్పడ్డారు. ● పాతూరులో ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలిని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు చిరునామా అడుగుతున్నట్లు నటించి, మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అదే విధంగా గత నెలలో రావిపాడు రోడ్డులోని కాకతీయనగర్‌ వద్ద నడిచి వెళ్తున్న వీరరాఘవమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసు కాజేశారు. ప్రకాష్‌నగర్‌లో బజారు నుంచి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో బంగారు నానుతాడును ద్విచక్రవాహనంపై వచ్చిన చోరులు లాక్కొని ఉడాయించారు. వరుస సంఘటనలతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మూడు పోలీసు స్టేషన్‌లలో చైన్‌ స్నాచింగ్‌ కేసుల నమోదు కనీస పురోగతి లేని దర్యాప్తులు నరసరావుపేటలో ప్రశ్నార్థకంగా పోలీసింగ్‌ ఒంటరి మహిళలే లక్ష్యంగా దుండగుల దోపిడీ ద్విచక్ర వాహనంపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్న చోరులు

నరసరావుపేట టౌనన్‌: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్న గొలుసు చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరులు చెలరేగిపోతున్నారు. నరసరావుపేటలో అసలు పోలీసింగ్‌ ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఇవిగో నిదర్శనాలు..

బయటకు రావాలంటే బెంబేలు..

పట్టణంలో ఓ వైపు గొలుసు దొంగతనాలు, మరో వైపు ద్విచక్రవాహన చోరీలు పెరిగి పోవటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తులో ఇద్దరు యువకులు బైకులపై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహన దొంగతనాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలకు రక్షణ కరువైందని యజమానులు వాపోతున్నారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా చోరులు కనీసం లెక్క చేసే పరిస్థితులు కనిపించడం లేదు.

చంద్రబాబు పాలనలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ నుంచి.. బజారుకు వెళ్తున్న గృహిణి వరకు... ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. పోలీసులకు బహిరంగ సవాల్‌ విసురుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement