ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం
నరసరావుపేట టౌన్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన డి.మల్లికార్జునరావు(35) మార్కెట్ సెంటర్ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ రాజమోహనరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
15వ వర్థంతి సభలో వక్తల నివాళి
నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ తదితరులు మాట్లాడారు.
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం


