తిరుగు ప్రభల సందడి
మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జాగరణ చేసి మొక్కులు తీర్చుకున్న ప్రభలు సోమవారం ఉదయం నరసరావుపేటకి చేరుకున్నాయి. పట్టణం నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన ప్రభలు రాత్రి కొండ దిగువన స్వామివారి సన్నిధి జాగరణ చేసి సోమవారం ఉదయాన్నే బయలుదేరి వచ్చాయి. ప్రభల వెంట వస్తున్న భక్తులకు మార్గ మధ్యంలో పలువురు దాతలు ఉచితంగా అల్పాహారం అందచేశారు. పోలీసులు పల్నాడు బస్టాండ్ ప్రాంతం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్ను మళ్లించారు.
– నరసరావుపేట ఈస్ట్
తిరుగు ప్రభల సందడి
తిరుగు ప్రభల సందడి
తిరుగు ప్రభల సందడి
తిరుగు ప్రభల సందడి


