ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను నిరాశ పర్చిన బడ్జెట్
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేశారు. పీఆర్సీతోపాటు డీఏ లు, సరెండర్ లీవ్స్ సహా ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బడ్జెట్లో బకాయిల చెల్లింపునకు పైసా నిధులు విదల్చకపోవడంతో ఆయా వర్గాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్తో ఈనెల 25న ఎస్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ప్రభుత్వానికి నిరసన తెలియజేయనున్నాం.
డి.పెదబాబు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు


