వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్తో అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆ దేశంపై ‘పరిమిత దాడులు’ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాగా, ‘మేము యుద్ధానికి సిద్ధం, శాంతికీ సిద్ధం’.. అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేయడం గమనార్హం. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో ఒక ముసాయిదా ఒప్పందాన్ని ఖరారు చేసి వాషింగ్టన్కు పంపిస్తామని ఆయన తెలిపారు.


