ముచ్చటగా మూడోసారి..
హ్యాట్రిక్ సాధించిన మహిళా కౌన్సిలర్లు
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మహిళా కౌన్సిలర్లుగా గెలిపొంది తమ విజయఢంకా మోగించారు. 7వ వార్డులో గెలిపొందిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ మూడో సారిగా కౌన్సిలర్గా గెలిచారు. అలాగే 18వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి వాల సుప్రజ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మహిళా కౌన్సిలర్లు వరుస విజయాలు సాధించి రికార్డును సృష్టించారు. పాలనలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయా వార్డు ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.
ముచ్చటగా మూడోసారి..


