breaking news
Sangareddy District Latest News
-
ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం
ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం (పటాన్చెరు): ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో స్రెకటేరియట్ ముట్టడిలోభాగంగా రామచంద్రాపురం పోలీసులు ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరిలను తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ నేటికీ ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే గృహ నిర్బంధం చేయడమేమిటని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి కృషి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ముబారక్ పూర్(బి) గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రూ.500లకే గ్యాస్సిలిండర్, 200 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, మండల అధ్యక్షుడు సిద్దన్న, ఎంపీడీఓ లక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలి: సౌజన్య సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశు గృహం, సఖీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయసేవల విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మాణ పనులు వేగవంతం జహీరాబాద్ టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపనులు వేగవంతంగా చేయాలని లబ్ధిదారులకు హౌజింగ్ పీడీ చలపతిరావు సూచించారు. మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాను శుక్రవారం ఆయన సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని కలిసి వారితో ఆయన మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి దశల వారీగా బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం ఆయన మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీఓ మహేశ్ తదితరులున్నారు. -
సాగుకు అనుబంధంగా ఉపాధి పనులు
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఉపాధి హామీ పథకం గ్రామాల అభివృద్ధికి, వ్యవసాయ అనుబంధానికి ఉపయోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలంలోని మాధ్వార్, లింగనాయక్పల్లి, నిజాంపేట్ మండలం నాగ్ధర్ గ్రామాల్లో పనుల జాతరలోభాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...గ్రామాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. రెండు, మూడో విడతల్లోనూ అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. -
ఆశయం ఆదర్శమై..
● ‘సాక్షి’కథనాలతో ఉపాధ్యాయులకు దక్కిన గౌరవం ● ఎస్ఈఆర్టీ మ్యాగజైన్లో చోటు ● ఉపాధ్యాయుల ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘సాక్షి’కథనాలతో ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం దక్కింది. సదాశివపేట మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం రామకృష్ణ, ఉపాధ్యాయురాలు సునీత ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఎస్ఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) ప్రచురించే ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు కల్పించింది. ఇందుకుగాను గతంలో ‘సాక్షి’పత్రికలో ప్రచురితమైన ‘సర్కార్ స్కూల్..అడ్మిషన్స్ ఫుల్’,’పర్యావరణం.. బోధన వినూత్నం’తదితర కథనాలు దోహదం చేశాయి. హెచ్ఎం రామకృష్ణ గతంలో సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విధులను నిర్వహించే సమయంలో చేసిన కృషిని ‘సాక్షి’గుర్తించి ‘సర్కార్ స్కూల్.. అడ్మిషన్స్ ఫుల్’కథనం ప్రచురించడం జరిగింది. దీన్నే ఆయన తన సక్సెస్ స్టోరీగా, ఉపాధ్యాయురాలు సునీత ‘కాకమ్మ కథల లాగా బోధిస్తేనే కదా పిల్లలకు ఆసక్తి’అనే అంశాన్ని తన సక్సెస్ స్టోరీగా వివరించడంతో ఎస్ఈఆర్టీ తన ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 51 పాఠశాలల ఉపాధ్యాయులు ఎంపిక కాగా సంగారెడ్డి జిల్లా నుంచి రామకృష్ణ, సునీతలు ఎంపికయ్యారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ‘సాక్షి’దినపత్రికకు, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్,స్కూల్ లీడర్షిప్ అకాడమీ కన్సల్టెంట్ సురేశ్బాబు, సభ్యులు మధుసూదన్రెడ్డి, వెంకట రమణమ్మ, జగదీశ్వర్రెడ్డికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించిన డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖకు ఇంతటి గౌరవాన్ని తెచ్చిన రామకృష్ణ, సునీతలను ఎంఈవో శంకర్, అధికారి సుధాకర్, కాంప్లెక్స్ హెచ్ఎం రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు. -
సమన్వయంతో పని చేయాలి
సంగారెడ్డి జోన్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగితే నివారించే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సరిపడా క్రేన్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్ఓ పద్మజారాణి పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ -
ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఫిల్టర్బెడ్లో పాత యంత్రాల స్థానే అధునాతనమైన సాంకేతికతతో కూడిన కొత్త యంత్రాలను అమర్చనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ తాగునీరు పూర్తిస్థాయిలో శుద్ధి కాకపోతుండటంతో నీళ్లు వాసన వస్తున్నాయన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.ప్రావీణ్యతో పట్టణంలోని అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... ఈ ఫిల్టర్ బెడ్ నిర్వహణను సమర్థవంతమైన ఏజెన్సీకి అప్పగించాలన్నారు. యంత్రాల కొనుగోలుకు అంచనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్, పబ్లిక్హెల్త్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఫిల్టర్ బెడ్ నిర్వహణ కోసం టెండరు ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం న్యాక్ ఇంజనీర్ను నియమించాలని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి సహకారంతోనే 2004లో ఈ తాగునీటి పథకం మంజూరు చేయించానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అంతకుముందు పట్టణంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. రాజంపేట నుంచి హాస్టల్గడ్డ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు, రాజీవ్పార్కు అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేసేందుకు మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్యతో చర్చించిన జగ్గారెడ్డి ఈ తాగునీటి పథకాన్ని వైఎస్ఆర్ మంజూరు చేశారని వ్యాఖ్య -
ఇంటి తాళాలివ్వండి
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన జహీరాబాద్ టౌన్: ఇచ్చిన గడువు ముగిసినందున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారన్నారు. ఈ నెల 14న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేయగా పట్టాలు అందుకున్న మరో 132 మందికి విచారణ పేరుతో తాళాలు ఇవ్వడంలేదన్నారు. గతంలో ఎమ్మెల్యే మాణిక్రావు విజ్ఞప్తి మేరకు అధికారులు విచారణ చేపట్టి వారం రోజుల్లో తాళాలు ఇస్తారని ఎంపీ సురేశ్షెట్కార్ హామీ ఇచ్చారన్నారు. గడువు ముగిసినా తాళాలు ఇవ్వడంలేదని వాపోయారు. పట్టాలు అందుకున్న వారంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులేనని, దివ్యాంగులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే తాళాలు ఇవ్వాలని కోరారు. -
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
● రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మంత్రి దామోదర రాజనర్సింహమునిపల్లి(అందోల్): విద్య, వైద్యం, రవాణ సౌకర్యం మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కలెక్టర్ పి.ప్రావీణ్యతో కలిసి సుసమారు రూ.70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన, భూమి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ...రాష్ట్రంలోనే మునిపల్లిలోని బుదేరా మహిళా డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు భద్రతతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. రోడ్ల నిర్మాణంతో తక్కడపల్లి, గార్లపల్లి గ్రామాల ప్రజలకు హోటళ్లు, చేపలు పట్టుకునే వారికి ఉపాధి అవకాశం దొరుకుతుందని చెప్పారు. వారంలో పనులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. తాటిపల్లి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాలు, తరగతి గదుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. -
ఆకట్టుకున్న టీఎల్ఎం మేళా
న్యాల్కల్(జహీరాబాద్): మండల కేంద్రంలో శుక్రవారం టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ మేళాకు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరై తయారు చేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. ఈ బోధనోపకరణాలను ఎంఈఓ మారుతి రాథోడ్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల హెచ్ఎంలు పరిశీలించారు. ఇందులో మామిడ్గి, న్యామతాబాద్, ఇబ్రహీంపూర్, శంశల్లాపూర్, రేజింతల్, ముర్తుజాపూర్, చాల్కి, మిర్జాపూర్(ఎన్), మిర్జాపూర్(బి), రేజింతల్(ఉర్దూ మీడియం) తయారు చేసిన బోధనోపకరణాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు మెమంటోలు అందజేశారు. -
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ
జహీరాబాద్: మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. శుక్రవారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ చలపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్కుమార్, ఆర్ఐ సిధారెడ్డి, ఏపీఓ గణేష్, కార్యదర్శి వెంకట్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అవేల, మాజీ ఎంపీపీ ప్రియాంక, గ్రామస్తులు గుర్నాథ్రెడ్డి, గుండన్న, సిద్దప్ప, బాబా పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇరిగిపల్లిలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చేర్యాలలో భూమి పూజ.. కంది(సంగారెడ్డి): మండల పరిధిలోని చేర్యాలలో శుక్రవారం అంగన్వాడీ భవనం, ఏర్దనూర్ తండాలో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విడతల వారీగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, నాయకులు ఆంజనేయులు, మోతిలాల్ నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి -
ఉద్యమకారుడికి పీహెచ్డీ పట్టా
జహీరాబాద్ టౌన్: కోహీర్ మండలంలోని పోతిరెడ్డికి చెందిన బేగరి విష్ణు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విష్ణు ఓయూలో పీహెచ్డీ పూర్తి చేశారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్ అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ‘సర్వ శిక్ష అభియాన్: ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేయడంతో పీహెచ్డీ పట్టా లభించింది. ఇటీవల జరిగిన ఓయూ స్నాతకోత్సవంలో గవర్నర్, వీసీ చేతులమీదుగా పట్టా అందుకున్నారు. కాగా, తమ గ్రామానికి చెందిన యువకుడు పీహెచ్డీ పట్టా పొందడంపై పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు అల్పాహారం
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలలిటీ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు పారిశ్రామికవాడలోని నీకోమాక్ పరిశ్రమ సిబ్బంది అల్పాహారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది పేద విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. పరిశ్రమ యాజమాన్యానికి ఎంఈఓ కుమార స్వామి, హెచ్ఎం అంజయ్య ధన్యవాదాలు తెలిపారు. ఆలయాల్లో మహోత్సవాలు నారాయణఖేడ్: శ్రావణమాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని షిర్డీ సాయిబాబా, చక్ర లలితాంబిక దేవి ఆలయాల్లో మహోత్సవాలు ఘనంగా జరిగాయి. షిర్డీసాయిబాబా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ జ్యోషి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అలాగే పట్టణానికి చెందిన రమేష్ మహాప్రసాదం, భారతి, విజయ్ కుమార్ దంపతులు సమస్తపూజా సామగ్రి అందించారు. అనంతరం చక్రలలితాంబిక దేవి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి 10,008 గాజులతో అలంకరణ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలి ఝరాసంగం(జహీరాబాద్): వినాయక చవితి పండుగ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ మంజుల, ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ సూచించారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సింగూరుకు తగ్గిన వరద పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో మూడు క్రస్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9, 11 గే ట్లను రెండు మీటర్ల పైకి ఎత్తి దిగువకు 18 ,672 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
డ్రోన్లతో సాగు!
జహీరాబాద్ టౌన్: జిల్లాలోని రైతులు ఖరీప్ సీజన్లో పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి తదితర పంటలు ఏపుగా పెరిగాయి. పంట ఎదుగుదల, పూత, కాత కోసం రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలువురు రైతులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటను కేవలం పది నిముషాల్లో మందులను పిచికారి చేస్తుంది. నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందు వృథా కావడంలేదు. ఇద్దరు కూలీలు అవసరమయ్యే పనిని ఒక్క డ్రోన్ తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది. అయితే గతంలో మందులు పచికారీ చేస్తున్న సమయంలో రైతులు ఇబ్బందులు పడేవారు. కొంతమందికి ఏకంగా ముక్కు, నోరు, శరీరంపై పడి ఆస్పత్రుల పాలయ్యేవారు, కానీ డ్రోన్ వచ్చాక ఈ ప్రమాదం నుంచి ఉపశమనం కలిగింది. మందుల వృథాతో పాటు ఖర్చులు కూడా తగ్గుతుండడంతో ఎక్కువమంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్న రైతులు సమయం, కూలీ ఆదాతో తప్పిన ఇబ్బందులు వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. విత్తనాలు చల్లడంతో పాటు మందులను తక్కువ సమయంలో సులువుగా పిచికారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ మారుమూల గ్రామాలకు చేరింది. దీంతో పంటల సాగులో వ్యయం తగ్గించడం కోసం రైతులు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా కూలీల కొరత అధిగమించేందుకు డ్రోన్ల సాయంతో క్రిమిసంహాకర మందులు పిచికారీ చేయిస్తున్నారు. త్వారా ఖర్చు తగ్గడంతో పాటు తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో మందును పిచికారీ చేసేందుకు వెసులుబాటు కల్గుతుంది. -
ఉపాధి హామీ పనులు ప్రారంభం
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హమీ పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ రంగారవు పాల్గొన్నారు. వట్పల్లి(అందోల్): ఉపాధి పనుల జాతరలో భాగంగా అందోల్ మండలంలోని నేరడిగుంట, రోళ్లపాడ్, చింతకుంట, కన్సాన్పల్లి, కోడెకల్, సంగుపేట, వట్పల్లి మండలంలోని బిజిలీపూర్ గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అంజయ్య, రాజేశ్కుమార్, ఎంపీఓ సోమ్నారాయణ, ఏపీఓ అర్చన పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ పటాన్చెరు: వినాయక చవితి సందర్భంగా ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆలయ అర్చకులు సంతోష్ జోషి, చంద్రశేఖర్, జగదీశ్వర్ స్వామి, అయ్యప్ప, సతీష్, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. విద్యార్థులకు సహకారం న్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీదర్ ద్వారకా ఆస్పత్రి వైద్యుడు సందీప్ సూచించారు. ఈ మేరకు మిర్జాపూర్(బి)లోని జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో ఐడీ కార్డులు, బెల్టులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులు పుల్కల్(అందోల్): మండల పరిధిలోని పెద్దారెడ్డిపేట చౌరస్తా నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ మేరకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుమ్మరి లింగన్న ఉచితంగా పూడ్చివేసి ఔదార్యం చాటాడు. అలాగే గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారంగా బోరు వేయించి మోటారు బిగించారు. దీంతో గ్రామస్తులు ప్రశంసించారు. పనుల జాతరలో భూమి పూజ జహీరాబాద్ టౌన్: మండలంలోని అనేగుంటలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ మేరకు పశువుల పాక, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి పూజలు చేసి శంస్థాపన చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు పూజలు నిర్వహించిన అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జ్యోతి, మండల ప్రత్యేక అధికారి, వ్యవసాయశాఖ ఏడీఏ. భిక్షపతి, డిప్యూటీ ఈఈ, రామచందర్, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఏపీఓ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నానో యూరియాపై అవగాహన
కంది(సంగారెడ్డి: నానో యూరియాతో అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కాశీపూర్లో రసాయనిక మందులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడంతోపాటు నానో యూరియా వాడకంపై అవగాహన రైతులకు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లీటరు నానో యూరియా బస్తా యూరియాతో సమానమని తెలిపారు. కాగా, ప్రస్తుతం మండలంలో 60 మెట్రిక్ టన్నుల యూరియా 45 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ.. రాయికోడ్(అందోల్): మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సారిక, ఎస్ఐ చైతన్య కిరణ్తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భగంగా పురుగు మందులను పరిశీలించి ఎరువుల స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీలకే ధరలకే విక్రయించాలన్నారు. అనంతరం ఆయా దుకాణాల్లో విక్రయించిన ఎరువులు, పురుగు మందుల వివరాలను తెలుసుకుని రిజిస్టర్లను తనిఖీ చేశారు. -
తాటిపల్లి కేజీబీవీ అభివృద్ధికి కృషి
మునిపల్లి(అందోల్): కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి రాత్రి తాటిపల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే అదనపు గదులు, డైనింగ్ హాల్, మరుగు దొడ్లు, కిచెన్ రూం, హాలు, ప్లే గ్రౌండ్ వంటి పలు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించాల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, ఆర్డీఓ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
ఆయిల్ పామ్తో అధిక లాభాలు
న్యాల్కల్(జహీరాబాద్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ రైతులకు సూచించారు. మండల పరిధిలోని వడ్డిలో శుక్రవారం ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తామన్నారు. పంట నిర్వహణ కోసం ఏడాదిలో ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.16,800 ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మాధవి, హెచ్ఈఓ విఠల్, రైతులు పాల్గొన్నారు. 295 రకంతో మంచి దిగుబడులు జహీరాబాద్ టౌన్: వ్యవసాయ శాఖ పంపిణీ చేసిన ఎంజీజీ 295 రకం పెసర పంటతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఏఓ లావణ్య పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని కోత్తూర్(బి)లో వ్యవసాయ శాఖ ప్రదర్శించిన ఎంజీజీ 295 రకం పెసర పంటను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజు రైతులు పాల్గొన్నారు. -
గోవా మద్యం పట్టివేత
ఇద్దరి అరెస్టు జహీరాబాద్ టౌన్: గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను గురువారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా సూపరింటెండెంట్ నవీన్చంద్ర ఆదేశాల మేరకు మండలంలోని చిరాగ్పల్లి చెక్పోస్టు వద్ద ఎస్ఐ కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నల్గొండకు చెందిన నవీన్, మురళీలు ట్రావెల్స్ బస్సులో మద్యం తీసుకొస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు వారి నుంచి వివిధ రకాల బ్రాండ్స్కు చెందన 37 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసు కుని ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎస్ఐ ఉమారాణి, హెచ్సీ కిషన్ కాని స్టేబుళ్లు అంజిరెడ్డి, వంశీ, శివ పాల్గొన్నారు. -
ఉదయం పనులు.. రాత్రి దొంగతనాలు
సిద్దిపేటకమాన్: ఉదయం ఫంక్షన్హాల్లో పనులు చేసుకుంటూ రాత్రి సమయాల్లో షెటర్ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలోని వైష్ణవి మెడికల్ షాప్, వన్టౌన్ పీఎస్ పరిధిలోని హరిహర మెడికల్ షాప్లో ఈ నెల 11న రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో హైదరాబాద్లో నివాసం ఉంటున్న రాజమండ్రికి చెందిన ఇందుకూరి సూర్య (38), సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన బాణపురం సుభాష్ (40), మెదక్ జిల్లా పటాన్చెర్కు చెందిన ఎస్కె సాజిద్ (32), హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన మహ్మద్ ఆరీఫ్ (21)లు ఫంక్షన్హాల్ పనులు చేస్తుండగా పరిచయమయ్యారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఉదయం ఫంక్షన్హాళ్లలో పనులు చేస్తూ రాత్రి సమయాల్లో తాళం వేసిన దుకాణాల షెటర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ పుటేజీల ఆధారంగా వారిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుల నుంచి ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ అసిఫ్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ కనకరాజు, ప్రశాంత్రెడ్డి, సిబ్బంది సందీప్రెడ్డిని సీఐ అభినందించారు. షెటర్ తాళాలు పగులగొడుతున్ననిందితుల అరెస్ట్ నలుగురు నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీఐ ఉపేందర్ -
కాళ్లు కోల్పోయిన సిద్దిరాములుకు వీల్చైర్
చిన్నశంకరంపేట(మెదక్): రెండు కాళ్లు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల సిద్దిరాములుకు సానీక్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ గురువారం వీల్చైర్ అందజేశారు. ఈ మేరకు బుధవారం సాక్షి పత్రికలో ‘రెండు కాళ్లు కోల్పోయా ఆదుకోండి’ అనే కథనానికి సానీక్ష పౌండేషన్ చైర్మన్ స్పందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యుడు శ్రీకాంత్తో కలిసి శేరిపల్లికి చేరుకుని సిద్దిరాములకు వీల్చైర్ను అందించారు. ఈ వీల్చైర్ను హైదరాబాద్కు చెందిన ఇక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేఘన నండూరి, రాజశేఖర్రెడ్డి సహకారంతో అందించినట్లు తెలిపారు.స్పందించిన ‘సానీక్ష’ ఫౌండేషన్ -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
పటాన్చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ చౌరస్తాలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు సీఐ వినాయక్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. ఈ తనిఖీలో మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన ఎరుకలి అరుణ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం నిందితుడి నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఆసిఫ్ అలీ, అభిమాని సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.రిమాండ్కు తరలింపు -
మత్తు పదార్థాలపై కొరడా.. జాగిలాలతో తనిఖీలు
చిన్నశంకరంపేట(మెదక్): గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాలపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ మేరకు చిన్నశంకరంపేట, నార్సింగి మండల కేంద్రాల్లోని హోటళ్ల వద్ద పోలీస్లు డాగ్స్కాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. దాబాలతో పాటు హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్డాండ్లలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదర్థాలతో పాటు మద్యంను గుర్తించేందుకు జాగిలాలతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే మిర్జాపల్లి రైల్వేస్టేషన్, నార్సింగి బస్టాండ్లలో డాగ్స్కాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో చిన్నశంకరంపేట, నార్సింగి ఎస్ఐలు నారాయణగౌడ్, సృజర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.హిందీ టీచర్కు డాక్టరేట్రామాయంపేట(మెదక్): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు దోర్బల వేదశ్రీకి డాక్టరేట్ లభించింది. హిందీ సాహిత్యంలో ‘సామాజిక ధ్యాన్’ కావ్యం రూపొందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో హిందీ టీచర్ను తోటి ఉపాధ్యాయులు సన్మానించారు.చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిరామచంద్రాపురం(పటాన్చెరు): పట్టణంలోని లింగంపల్లి చౌరస్తా వద్ద తీవ్రగాయాలైన ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జి కింద ఈనెల 13న తీవ్ర గాయాలతో ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన పోలీసులు వెంటనే 108 అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు టీషార్ట్, ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిడి వయస్సు 35నుంచి 40ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి ఎవరైన గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.రోడ్డు ప్రమాదంలో..పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇంద్రేశం నుంచి పోచారం వెళ్లే దారిలో ఈనెల 17 వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కుంటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యంపటాన్చెరు టౌన్: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము గ్రీన్ విల్లాస్ సమీపంలోని కొచ్చెరువు కుంటలో గురువారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉండవచ్చని, మృతిచెంది మూడు రోజులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పొలం పనులకు వెళ్లితిరిగిరాని లోకాలకు..సిద్దిపేటఅర్బన్: వరి పొలంలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఎన్సాన్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన తంగళ్లపల్లి నర్సింహాచారి (50) వృత్తి రీత్యా బంగారు నగల పనిచేస్తుంటాడు. గత కొంత కాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 19న ఉదయం పని నిమిత్తం వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని ఓ వరి పొలంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ప్యాంట్ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా నర్సింహాచారిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు దినేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
సిద్దిపేటకమాన్: నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ సీహెచ్ రమేష్ తెలిపారు. పట్టణంలో రైస్ మిల్లర్లు, డాక్టర్లు, పత్తి, వస్త్ర, సిమెంట్, పౌల్ట్రీ, ఇతర వర్తక సంఘాలు, వ్యాపారులతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024–25 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు, అడ్వాన్స్ టాక్స్, మోసపూరిత రిఫండ్ క్లైయిమ్ చేయడంతో కలిగే పరిణామాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోవడంతో కలిగే పరిణామాలు, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ అధికారి రమణరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది ప్రదీప్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ సీహెచ్ రమేష్ -
కాలుష్యం కాటేసింది..!
తొగుట(దుబ్బాక): కలుషిత నీటితో చేపలు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని వర్దరాజుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా గ్రామ శివారులోని గుట్టల మధ్యన సిద్దిపేట పట్టణ మున్సినపాలిటీ చెత్తయార్డు ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి చెత్తతో పాటు పట్టణంలోని ఆస్పత్రుల నుంచి డిస్పోజల్స్ను సైతం పడేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి దుర్వాసనతో పాటు రసాయనాలు, విషవాయువులు వెలువడడంతో పొలాల్లో పనిచేయలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు కలుషితమైన నీరంతా సమీపంలోని గుట్టకాడి కుంట, దమ్మాయిచెరువు, కాసాయికుంట, పిండే చెరువుల్లోకి చేరుతోంది. దీంతో చెరువుల్లోని నీళ్లు కాలుష్యం చెంది చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. కొంతకాలంగా మృత్యువాత పడుతున్న చేపల సంఖ్య పెరిగిపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డంప్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులతో పాటు మత్స్యకారులు కోరుతున్నారు. చెరువుల్లోకి చేరుతున్న కలుషిత నీరు పట్టించుకోని మున్సిపల్ అధికారులు మృత్యువాత పడుతున్న చేపలు ఉపాధి కోల్పోతున్నామనిమత్స్యకారుల ఆవేదన -
తప్పుడు పట్టా..
రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రైతు ఆత్మహత్యాయత్నంచిన్నకోడూరు(సిద్దిపేట): తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోనెపల్లికి చెందిన ముష్మిరి యాదయ్యకు సర్వే నంబర్ 310లో వంశపారంపర్యంగా ఉన్న 1.32 గుంటల భూమిలో కొంతకాలంగా సాగు చేసుకుంటున్నారు. అయితే గతేడాది ఎలాంటి విక్రయాలు జరపకుండానే ముష్మిరి రామవ్వ, ముష్మిరి వజ్రవ్వ, ముష్మిరి బాల్రాజుల పేరిట పట్టాలోకి మారింది. అయితే, ఈ భూమిని ఇతరులకు విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న యాదయ్య కుమారుడు రాజు వెంటనే భూ రిజిస్ట్రేషన్ నిలిపి వేయాలని తహసీల్దార్ సలీమ్కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత క్షణికావేశంలో తనకు న్యాయం చేయాలని డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా.. స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ సలీమ్, ఎస్ఐ సైఫ్ అలీ బాధితుడు రాజుతో మాట్లాడి సర్ది చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్కు నివేదించి బాధితుడికి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
చోరీ చేసిన ఇంటికే నిప్పు
రామాయంపేట(మెదక్): ఓ ఇంట్లో చోరీ చేసిన అనంతరం దుండగులు నిప్పు పెట్టిన ఘటన మండలంలోని పర్వతాపూర్లో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ బాల్రాజు కథ నం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రపు విష్ణువర్ధన్రెడ్డి కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటుండగా.. పర్వతాపూర్లో తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి విలువైన వస్తువులు దోచుకున్నారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్రెడ్డి ఉదయం గ్రామానికి వచ్చి చూడగా.. ఇంటిలో కొంతభాగం కాలిపోగా విలువైన వస్తువులు సైతం కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు అనుమానంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గేమ్ ఓవర్!
సాక్షి, సిద్దిపేట: ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్–2025 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభతో పాటు రాజ్యసభల్లోనూ ఆమోదం పొందింది. ఈ మేరకు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేమింగ్, బెట్టింగ్లకు చాలా మంది యువత బానిసై ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది అప్పుల పాలై పోలీసులను సైతం ఆశ్రయించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్లు నిషేధంలో ఉన్నప్పటికీ దొంగచాటున ప్రవేశించి యువతను బానిసలుగా మార్చాయి. తాజాగా, ఉభయ సభల్లో ఆన్లైన్ గేమింగ్ యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు. -
మంచి నిర్ణయం
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లతో యువత బానిసై అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామునిపట్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్తో రూ.లక్షల్లో నష్టపోయాడు. దీంతో అప్పులు ల్లించలేక కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది. – సింగిరెడ్డి, లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ కేంద్ర నిర్ణయం హర్షణీయం ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన అన్ని యాప్లను బ్యాన్ చేయడం హర్షణీయం. ఈ యాప్లతో ఎంతోమంది యువత డబ్బులు పోగొట్టుకున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. అన్లైన్ యాప్లను పూర్తిస్థాయిలో అరికట్టాలి. – రాము, వ్యాపారస్తుడు, జగదేవపూర్ మంచి పరిణామం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్పై నిషేధం విధించడం చాలా మంచి పరిణామం. ఆన్లైన్ గేమింగ్ ఉచ్చులో చిక్కి వందలాది కుటుంబాలు ఆర్థికంగా చిన్నభిన్నమయ్యాయి. యువకులు పద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. – రమణారెడ్డి, దుబ్బాక -
టీఎల్ఎంతో అవగాహన సులువు
జోగిపేట(అందోల్): టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో విద్యార్థులకు బోధిస్తే పాఠాలు సులభంగా అర్థమవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య పేర్కొన్నారు. అందోలులోని డీఎల్ ఫంక్షన్హాల్లో బుధవారం ఏంఈవో బండి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన టీఎల్ఎం మేళాకు మాణయ్య హాజరై మాట్లాడారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన పరికరాలతో పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పరికరాలను రూపొందించిన ఉపాధ్యాయులను, జిల్లా స్థాయికి ఎంపికై న ఉపాధ్యాయులను అభినందించారు. 34 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించారు. విజేతలు వీరే ఈ మేళాలో జరిగిన పోటీలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయలు విజేతలుగా ఎంపికయ్యా రు. తెలుగులో జె.శాంత కుమారి (బ్రహ్మణపల్లి), అహ్మద్ పాషా (జోగిపేట) ఆంగ్లంలో టి.బాలమణి (పోతిరెడ్డిపల్లి), జి.ఫణీశ్రీ (రాంసన్ పల్లి), గణితంలో టి.దేవదాస్ (కన్సాన్పల్లి), ఎస్.సంగీత (మన్సాన్పల్లి), పరిసరాల విజ్ఞానంలో డి.భార్గవి (అ న్నాసాగర్), టి.కల్పన (సాయిబాన్ పెట్), ఉర్దూ మీడియంలో దుర్దన అప్సరి (అందోల్), రహీమ భాను(జోగిపేట) ఎంపికై న వారిలో ఉన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య అందోల్లో టీఎల్ఎం మేళా -
సంగారెడ్డికి మంజీరా నీళ్లు
సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు మంజీరా నీళ్లు అందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను కోరారు. మంచి నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి బుధవారం రాజంపేట ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజీరా నీటి పథకం ప్రారంభించినప్పుడు ఒకేసారి పది ట్యాంక్లు నిండి గంటన్నరలోనే నీటి సరఫరా జరిగేదని కానీ, ఇప్పుడెందుకు అలా జరగడం లేదని జగ్గారెడ్డి అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ కోసం సింగూర్ ప్రాజెక్ట్ వద్ద రూ.వంద కోట్లతో ఫిల్టర్బెడ్ నిర్మించారని పదేళ్లపాటు ఒకే కాంట్రాక్టర్కు నిర్వహణ ఇవ్వగా అతడు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి 10 ట్యాంక్ల ద్వారా మంజీరా నీటి సరఫరా జరిగేందుకు తగిన ప్రణాళికలు, అవసరమైన నిధులకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. రాజంపేట ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసిన జగ్గారెడ్డి నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష -
ఇందిరమ్మ పంచాయితీ
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదన జాబితాలకు బ్రేకు పడింది. ఈ ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. దీంతో ఈ జాబితాల్లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్, ఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదు. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచి..కాంగ్రెస్లో కొనసాగుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర పడటం గమనార్హం. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇన్చార్జి మంత్రి వద్దే పెండింగ్! నిరుపేదలకు గృహ వసతిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మగృహాల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 40% ఇళ్లను అంటే సుమారు 1,400 ఇళ్లను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వద్ద బ్రేకులు పడ్డాయి. జిల్లాలో మిగిలిన మూడు నియోజకవర్గాల నుంచి వెళ్లిన లబ్ధిదారుల జాబితాలకు ఆమోదముద్ర పడగా, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంపిన 2,800 ఇండ్ల లబ్ధిదారుల జాబితాలకు మాత్రం ఆమోదం రాలేదు. మంత్రితో చర్చించనున్న ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలకు నెలలు గడుస్తున్నా ఆమోదముద్ర పడకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్తో చర్చించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈనెల 14న ఈ భేటీ కావాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఈ అంశంపై చర్చించడం కుదరలేదు. రెండురోజుల్లో మంత్రిని కలుస్తామని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. అర్హులైన వారందరికీ ఇచ్చాం ఎమ్మెల్యేలకు కేటాయించిన 40% ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలతో ప్రతిపాదనలు పంపాము. కానీ ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. ఇది సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలను వర్తింప చేశాము. – చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యేగతంలో ఇలా లేకుండే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తీరు సరికాదు. మేం ఇచ్చిన ప్రతిపాదనలకు మంజూరు ఇవ్వడంలేదు. సంక్షేమ పథకాల అమలు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలా లేకుండే. మా ప్రతిపాదనలకు ఆమోదం కోసం మంత్రితో చర్చిస్తాం. – కె. మాణిక్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పంపిన లబ్ధిదారుల జాబితాకు బ్రేక్ మంజూరును ఆపేసిన ఇన్చార్జి మంత్రి వివేక్ 2,800 ఇండ్ల చొప్పున ప్రతిపాదనలు పంపిన ఇద్దరు ఎమ్మెల్యేలు -
పంటలు నీటపాలు
భారీ వర్షాలు రైతన్నను ముంచెత్తాయి. ఆగస్టు తొలివారం వరకు పంటలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు రూ.లక్షలాది పెట్టుబడులు పెట్టి కలుపుతీత, ఎరువులను వేసుకున్న దశలో భారీ వర్షాలు దంచికొడుతుండటం తో పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా జిల్లాలో వరి, పత్తి, పెసర, మినుము, సోయా తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్టాన్ని మిగిల్చిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – న్యాల్కల్(జహీరాబాద్):ఈ ఏడాది జిల్లాలో 7.50 లక్షలు ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉండగా ఇప్పటివరకు 6,88,50 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా 3,45,954 ఎకరాల్లో పత్తి, 1,21,535 ఎకరాల్లో వరి, 67,556 ఎకరాల్లో సోయా, 73,557 ఎకరాల్లో కంది, 12,071 ఎకరాల్లో పెసర, 9,688 ఎకరాల్లో మినుము సాగు చేసుకోగా మిగిలిన 1,20,000 ఇతర పంటలను రైతులు వేసుకున్నారు. 727 ఎకరాల్లో పంట నష్టం వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు సేకరిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో పర్యటించి 507మంది రైతులకు చెందిన 727 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. వరి, పత్తి, పెసర, మినుము, సోయా తదితర పంటలు దెబ్బతింటున్నట్లు అధికారులు తెలిపారు. అధికంగా అందోల్ నియోజకవర్గంలో160 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, జహీరాబాద్ ప్రాంతంలో 121 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అధిక శాతం పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల వివరాల సేకరణ కొనసాగుతుంది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నీట మునిగింది మూడెకరాల్లో పత్తి పంటను వేశాను. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నీట మునిగింది. పంట సాగు కోసం చాలా పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – విఠల్, రైతు–రేజింతల్ అధికంగా వరి దెబ్బతింది జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 727 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎంఏఓలు, ఏఈఓలు పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. అధికశాతం వరి పంట దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. – శివ ప్రసాద్, డీఏఓ,సంగారెడ్డిరేజింతల్ గ్రామ శివారులో నీట మునిగిన పంటదెబ్బతిన్న పంట రైతులు ఎకరాలు వరి 205 315 పత్తి 137 198 సోయాబీన్ 95 95 పెసర 20 28 మినుము 19 26 కంది 21 25 జొన్న 13 12 మొక్క జొన్న 2 6 కూరగాయలు 8 13.3 మొత్తం 507 727.3పరిహారం అందించాలని కోరుతున్న రైతులుఅత్యధికంగా అందోల్లో 160 ఎకరాల్లో పంటనష్టంకలుపు తీసి, ఎరువులు వేసిన దశలో భారీ వర్షాలు -
పాత మద్యం కొత్తసీసాలో
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏ4 మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొనసాగే దుకాణాలకు ఈ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దుకాణాల లైసెన్సు నవంబర్ 30తో ముగియనుంది. గతంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు ఉండగా దానిని రూ.3 లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. కాగా, తాజా నోటిఫికేషన్లో రిజర్వేషన్లు సైతం కేటాయించారు. గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. జనాభా ఆధారంగా ఎకై ్సజ్ పన్ను రిటైల్ షాపులు చెల్లించే ఎకై ్సజ్ పన్ను 2011 జనాభా లెక్కల ప్రకారం ఉండనుంది. పన్ను చెల్లించే మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐదువేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5,000 నుంచి 50,000 ఉంటే రూ.55 లక్షలు, 50,000 నుంచి లక్ష ఉంటే రూ.60 లక్షలు, ఒక లక్ష నుంచి ఐదు లక్షలు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.1.10కోట్లుగా నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలున్నాయి. మద్యం దుకాణాల లైసెన్స్కు నోటిఫికేషన్ జిల్లాలో 101 మద్యం దుకాణాలు నవంబర్ నెలతో దుకాణాల గడువు పూర్తి -
పారిశుద్ధ్యం బాధ్యత అధికారులదే
వట్పల్లి(అందోల్): సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు పంచాయితీ కార్యదర్శులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా స్పష్టం చేశారు. మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనం, మురికికాలువలను పరిశీలించి, స్వచ్ఛతపై అధికారులకు పలు సూచనలు చేశారు. శిథిలావస్థకు చెందిన ఇళ్లలో నివాసం ఉండకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మురికికాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని దోమల నివారణకు అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా ఫాగింగ్ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను రెండు రోజులకొకసారి తప్పనిసరిగా శుభ్రం చేసిన తర్వాతనే నీటిని కుళాయిలకు వదలాలని చెప్పారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు డంప్యార్డులకు తరలించాలన్నారు. విధుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీవో ఖాజానసీరోద్దీన్, కార్మికులు, సిబ్బంది ఉన్నారు.డీపీఓ సాయిబాబా -
ప్రయాణికులకు మెరుగైన సేవలు
నారాయణఖేడ్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లో ఖేడ్ నుంచి నిజామాబాద్కు బుధవారం ఆయన నూతన బస్సు సర్వీనును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఖేడ్ ప్రాంతవాసులు వ్యాపార, వాణిజ్య, ఇతర అవసరాల కోసం నిజామాబాద్ ప్రాంతానికి అధికంగా రాకపోకలు సాగిస్తున్నందున వారి సదుపాయం కోసం బస్సుసర్వీసును ఏర్పాటు చేశామన్నారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఖేడ్ క్యాంపు కార్యాలయం ఆవరణలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్అలీతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా రాజీవ్ చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ ఆయనచూపిన బాటలో ప్రతిఒక్కరూ పయనించాలన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
కల్హేర్(నారాయణఖేడ్)/నారాయణఖేడ్: ఎవరైనా యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. నల్లవాగు ప్రాజెక్టును ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతితో కలిసి బుధవారం సందర్శించారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం, అలుగుపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నిర్మాణం, ఆయకట్టు విస్తీర్ణం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి పంటల సాగు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నల్లవాగు ప్రాజెక్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను సూచించారు. వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్టు వద్దకు ఎవ్వరూ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిర్గాపూర్లో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా స్టాక్, రికార్డులు పరిశీలించారు. నల్లవాగు గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులంలో వసతులు, బోధన అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు శ్రద్ధగా చదవాలని చెప్పారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ సుందర్, డీఈఈ పవన్కుమార్, సీఐ వెంకట్రెడ్డి, తహసీల్దార్ హేమంత్, ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ఏఓ హరికృష్ణ పాల్గొన్నారు. ఆస్పత్రి తనిఖీ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఖేడ్ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల బారిన పడిన వారికి తక్షణం వైద్య సేవలు అందిస్తూ అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల సమన్వయకర్త డా.సంగారెడ్డి, ఖేడ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రమేశ్ ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య నల్లవాగు ప్రాజెక్టు సందర్శన -
మా హయాంలో యూరియా కొరత లేదు
కొమురవెల్లి(సిద్దిపేట): కేసీఆర్ పాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ముందుచూపుతో యూరియా కొరత లేకుండా చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాలుకు గాయం కావ డంతో శస్త్ర చికిత్స చేయించుకుని నయం అయిన వెంటనే బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఆయనకు కార్యకర్తలు కొమురవెల్లి పాత కమాన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు నింపి రైతులకు నీరు అందించామని తెలిపారు. కాళేశ్వరం రిజర్వాయర్పై జష్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధంగా ప్రచారం చేస్తూ కేసీఆర్, హరీశ్రావులపై ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే ఎత్తైన, తక్కువ సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం రిజర్వాయర్ రెండు పిల్లర్లు కుంగితే వాటిని బాగు చేసి రైతులకు నీరు అందిచాల్సింది పోయి, విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.చేర్యాల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా -
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం
దుబ్బాకటౌన్: గ్రామాల్లో ఉండే ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం చేపట్టిందని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా చేసేందుకు వాలంటరీ టీచర్లను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 23న వాలంటరీ టీచర్లకు గ్రామస్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి సెప్టెంబర్ 8న ఉల్లాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఉల్లాస్ ముఖ్య ఉద్దేశం 2030 వరకు భారతదేశంలో నిరక్షరాస్యులు లేకుండా 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, ఆర్పీలు, ఉపాధ్యాయులు, వీవోఏలు తదితరులున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి -
సాగుపై క్షేత్రస్థాయిలో విద్యార్థుల పరిశీలన
హత్నూర (సంగారెడ్డి): మండలంలోని పన్యాల గ్రామంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ సాగును రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం పరిశీలించారు. గ్రామీణ కృషి అనుభవం కారక్రమంలో భాగంగా విద్యార్థులు వంశీ, మణికంఠ, సాయి శివనాథ్, అనిల్ గ్రామీణ వ్యవసాయ భాగస్వామ్య విశ్లేషణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా. అరుణ, డా.రాహుల్, డా.నిర్మల పాల్గొన్నారు. విద్యార్థులు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలు సుకున్నారు. సమస్యలను గ్రామ పటం, చిత్రాల రూపంలో ప్రదర్శించారు. రైతులు టి.బుచ్చి రెడ్డి, డి.విఠల్, బషీర్, శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ రమేశ్, గ్రామ కార్యదర్శి శ్వేత, స్థానికులు అరుణ్ కాంత్ రెడ్డి, సతీశ్, శంకర్, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఇల్లు ఖాళీ చేయించిన ఆర్ఐ
కుటుంబ సభ్యులతో కలిసి కనిపించకుండా పోయిన ముంపు బాధితుడుగజ్వేల్రూరల్: ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తేనే ఖాళీ చేస్తామంటూ మల్లన్నసాగర్ ముంపు గ్రామానికి చెందిన ఓ భూ బాధితుడు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇంటిని వేరొకరికి కేటాయించగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చిన ఆర్ఐ ఇంటిని ఖాళీ చేయించగా సదరు కుటుంబ సభ్యులు రోడ్డెక్కి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం గజ్వేల్లో చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన అరికెల చంద్రంకు పునరావాసం ప్యాకేజీ కింద ప్లాటును ఎంచుకోగా, ఆర్అండ్ఆర్ కాలనీలో ఓ అసంపూర్తి నిర్మాణ ఇంటిలో ఉంచారు. తిరిగి కొద్ది రోజుల తర్వాత తనకు ఇల్లు కావాలంటూ ప్యాకేజీ కింద వచ్చిన రూ.5లక్షలను తిరిగి ప్రభుత్వానికే డీడీ కట్టినప్పటికీ, ఇళ్లు ఇవ్వలేమంటూ అధికారులు ఆ డీడీని తిరిగి చంద్రంకే చెల్లించారు. ఎలాగైనా అధికారులు తనకు ఇళ్లు కేటాయిస్తారనే ఆశతో చంద్రం తాత్కాలికంగా నివాసముంటున్న ఇంటికి రూ.13లక్షలు చెల్లించి మరమ్మతులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో చంద్రం ఉంటున్న ఇంటిని అధికారులు మాధవరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మాధవరెడ్డి ఇంటిని ఖాళీ చేయాలని చంద్రంను కోరగా.. తాను ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తే వెళ్ళిపోతామని చంద్రం పేర్కొనడంతో నిరాకరించిన మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించి తనకు ఇంటిని అప్పగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్డీవో, తహశీల్దార్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్ఐ కృష్ణ బుధవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సాయంతో చంద్రం ఇల్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లేదని, తమకు న్యాయం చేయాలంటూ చంద్రం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది, పోలీసులు చంద్రం కుటుంబ సభ్యులను ఇల్లు ఖాళీ చేయించి మాధవరెడ్డికి తాళాలను అప్పగించారు. ఈ క్రమంలో చంద్రం తన భార్య లావణ్య పిల్లలతో కలిసి కనిపించకుండా పోయాడు. గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డితో పాటు చంద్రం బంధువులు, గ్రామస్తులు పోలీస్స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. -
ఖాజీపేట తండాకు రాకపోకలు బంద్
నర్సాపూర్ రూరల్: మండలంలోని ఖాజీపేట గిరిజన తండాకు ఐదో రోజులుగా రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో తండాకు వెల్లే మట్టిరోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. రెడ్డిపల్లి – ఖాజీపేట టీడబ్ల్యూ రోడ్డు నుంచి గిరిజన తండా వరకు సుమారు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్క నుండి కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ ఉండటంతో పాటు మరోపక్క వాగు ఉండటంతో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు కోతలకు గురైంది. దీంతో స్కూల్ పిల్లలతో పాటు గిరిజనులు నిత్యావసర సరుకులు, ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. కాళేశ్వరం కాలువతోనే తమ రోడ్డు కుంగిపోయి గుంతలు ఏర్పడుతున్నాయని తండా గిరిజనలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలేశ్వరం ఏఈ డబ్ల్యూఓ సుజాతరాణిని వివరణ కోరగా తండా రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వర్షంతో కొట్టుకుపోయిన మట్టి రోడ్డు ఐదు రోజులుగా గిరిజనులకు ఇబ్బందులు -
డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ఎడ్యుకేషన్ : జేఈఈ, నీట్, ఈఏపీసెట్ ఎంట్రెన్స్లకు హాజరయ్యే విద్యార్థులు ఫిజిక్స్ వాలా ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం ఆయన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించి ఆన్లైన్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోజు వారి తరగతులతో పాటు, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు. డిజిటల్ క్లాస్లను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.సిద్దిపేట జిల్లా డీఐఈఓ రవీందర్ రెడ్డి -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
సంగారెడ్డి జోన్: రిఫ్రెష్మెంట్ కోర్సులో భాగంగా జిల్లా నుంచి వచ్చే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన సందర్శించి, బ్యారెక్స్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించేలా నూతన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. డ్రిల్ ప్రాక్టీస్, రెగ్యులర్ పరేడ్లో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫిజికల్ ట్రైనింగ్, లా క్లాస్లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ -
హైదరాబాద్కు తాగునీరెట్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తే హైదరాబాద్కు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయం ఎలా అనే అంశం తెరపైకి వస్తోంది. నగరానికి తాగునీటి సరఫరాలో ఈ జలాశయమే కీలకం. హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్) ఇక్కడి నుంచి ప్రతిరోజు 120 మిలియన్ గ్యాలెన్ల తాగునీరు హైదరాబాద్కు సరఫరా చేస్తోంది. నగరంలోని గచ్చిబౌలి, హైటెక్సిటీ, బంజారాహిల్స్, టోలీచౌక్ (పాక్షికంగా), హఫీజ్పేట్, హైదర్నగర్, లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరుకు ప్రాంతాలకు ఇక్కడి నుంచే పంపింగ్ జరుగుతోంది. ఎన్డీఎస్ఏ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఖాళీ చేస్తే ఈ ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయని ఆ సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. డెడ్ స్టోరేజీ కోసం ప్రతిపాదనలు ఈ జలాశయం కట్ట పూర్తిగా దెబ్బతిన్నదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తక్షణం కట్ట రివీట్మెంట్కు మరమ్మతులు చేయని పక్షంలో డ్యామ్ తెగిపోయి భారీ నష్టం వాటిల్లుతుందని నివేదిక ఇచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో వచ్చిన వరదతోపాటు, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని కూడా దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు. వారం రోజుల క్రితం 22.2 టీఎంసీలు నీరు ఉండేది. ఇప్పుడు ఈ నీటి నిల్వను 18.6 టీఎంసీలకు తగ్గించారు. 16.55 టీఎంసీలకు తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. తాజాగా డెడ్ స్టోరేజీ (1.5 టీఎంసీల)కు తగ్గించేందుకు అనుమతి మంజూరు చేయాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టును డెడ్స్టోరేజీ చేసి రూ.16.08 కోట్లతో మరమ్మతు పనులు చేస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిషన్ భగీరథకు సైతం.. సంగారెడ్డితోపాటు, మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న భగీరథ తాగునీటి పథకాలకు సింగూరు ప్రాజెక్టే ఆధారం. ఈ తాగునీటి పథకాల కోసం రోజుకు 120 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ప్రధానంగా సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిలాల్లో కొన్ని గ్రామాలకు ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రాజెక్టును ఖాళీ చేస్తే పాత తాగునీటి పథకాలతోపాటు, బోర్లే ఆధారం కానున్నాయి.సింగూరు ప్రాజెక్టుటీఎంసీలుప్రశ్నార్థకంగా మారిన ప్రత్యామ్నాయం.! సింగూరును ఖాళీ చేస్తున్ననీటి పారుదల శాఖ డెడ్ స్టోరేజీకి సర్కారుకు ప్రతిపాదనలు 16.5 టీఎంసీలకు తగ్గించేందుకు అనుమతి తక్షణమే ఖాళీ చేసి మరమ్మతులు చేయాలి : ఎన్డీఎస్ఏసింగూరు నుంచి నీటి కేటాయింపులు ఇలా.. కామారెడ్డి జిల్లానిజాంసాగర్ ప్రాజెక్టుకు 8.35ఘనపురం ఆనకట్టకు.. 4.06మిషన్ భగీరథతాగునీటి పథకానికి.. 5.70సింగూరు కాలువలకు 2.00హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ 6.96 -
పురాతన భవనం కూల్చివేత
ఝరాసంగం(జహీరాబాద్): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఓ పక్క కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలతో భవన యజమాని కూల్చివేత పనులు ప్రారంభించారు. కొన్ని ఏళ్ల పాటు ఓ వైపు కుటుంబం నివాసం ఉండటంతో పాటు అప్పట్లో పోలీస్ స్టేషన్, ఆ తర్వాత బీసీ సంక్షేమ వసతి గృహం కొనసాగింది. అనంతరం సినిమా ప్రదర్శనలతోపాటు ప్రైవేటు కార్యాలయాలు కొనసాగాయి. -
పేకాటరాయుళ్లపై కేసు నమోదు
హత్నూర(సంగారెడ్డి): పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని శివారులోని ఓ ఫామ్హౌస్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష 80 వేల 650 , 13 సెల్ఫోన్లు, మూడు కార్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు మోదు చేసి న్యాయస్థానంలో హాజరు పర్చారు. దాబాలు, రైల్వేస్టేషన్ తనిఖీ మనోహరాబాద్(తూప్రాన్): ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని దాబాలు, రైల్వే స్టేషన్లో భద్రతా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపారు. మంగళవారం మనోహరాబాద్ రైల్వే స్టేషన్, దాబాల్లో తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడుతూ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, వస్తువులు, పార్శిల్ కనిపించినా తమ దృష్టికి తేవాలన్నారు. -
విపత్తులపై అవగాహన కలిగి ఉండాలి
పటాన్చెరు టౌన్: విపత్తులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, శ్రీ సత్య సాయి సేవ ఆర్గనైజేషన్ ‘విపత్తు నిర్వహణపై ‘ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... నీరు, భౌగోళిక , మానవ నిర్మిత, జీవ సంబంధిత, పారిశ్రామిక, అను సంబంధిత విపత్తులు మనకు ఏర్పడతాయని, వాటిపట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. విపత్తుల వల్ల జరిగే నష్టాలను పీపీటీ ద్వారా రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ కమిటీ ఇన్చార్జి శ్రీకృష్ణ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటేశం, డాక్టర్ కరుణా కుమారితోపాటు అధ్యాపకులు ప్రవీణ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యోగిబాబు, డాక్టర్ మల్లిక, డాక్టర్ సుజాత, డాక్టర్ మంజు శ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ -
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
జహీరాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిరాగ్పల్లి గ్రామానికి చెందిన సోలాపూర్ రఘు(40) సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం గ్రామం సమీపంలో వెతుకుతుండగా ఎల్లమ్మ బావి దగ్గర బురదలో చెప్పులు కనిపించాయి. అనుమానంతో బావిలో పాతాళ గరిగే సహాయంతో వెతకగా మృతదేహం లభించింది. బావిలో నీటిని తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య మీనాక్షి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.బావిలో పడి వ్యక్తి మృతి -
చందుకు డాక్టరేట్ ప్రదానం
చేర్యాల(సిద్దిపేట): మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన గదరాజు చందు తెలుగు విభాగంలో డాక్టరేట్ పట్టా పొందాడు. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో ఓయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వైస్ చాన్సలర్ కుమార్ ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం చందును పలువురు ప్రొఫెసర్లు, స్నేహితులు అభినందించారు. మహాధర్నాను విజయవంతం చేయాలి : పీఆర్టీయూ జహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ ఉపాధ్యాయులను కోరారు. పట్టణంలోని బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచర్ల శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ఉందని, ఉపాధ్యాయులు సెలవు పెట్టి ధర్నాలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు శ్రీశైలం, తుకారాం, ఆనంద్, ఆశోక్, వరాలు, ప్రదీప్కుమార్, స్వామిదాస్ పాల్గొన్నారు. ఇల్లు కూలి వ్యక్తికి గాయాలునర్సాపూర్ రూరల్: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పెద్ద చింతకుంటలో ఇల్లు కూలి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పారట్ల శ్రీనివాస్ సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లు కూలి దూలం అతడి తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరు మంది బయటకు పరుగులు తీశారు. వెంటనే అతడ్ని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీఓ మధులత, ఎంపీఓ శ్రీనివాసులు మంగళవారం గ్రామానికి వెళ్లి శ్రీనివాస్ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లను ఖాళీ చేయించి, ఇతర ఇండ్లకు తరలించారు. మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 26 ఇళ్లు పాక్షికంగా కూలినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. రెండు కాళ్లు కోల్పోయా ఆదుకోండి చిన్నశంకరంపేట(మెదక్): రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని ప్రభుత్వం ఆదుకోవాలని నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల సిద్దిరాములు వేడుకున్నారు. కన్పించిన నాయకులు, అధికారులను తనకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అడిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్లుగా నడవలేక నరకయాతన అనుభవిస్తున్నానని, కనీసం తనకు వీల్చైర్ అయినా ఇవ్వాలని కోరాడు. ఏ పని చేయలేకపోతున్నానని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. విషపునీరు తాగి పది మేకలు మృతి తొగుట(దుబ్బాక): పది మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని లింగాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు... గ్రామానికి చెందిన బెస్త లింగం, ఎరుకుల అంజయ్య మేకలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ మాదిరిగా మేకలను తోలుకుని మధ్యాహ్నం మేతకు వెళ్లారు. మేత తిని పంటచేళ్ల సమీపంలో నీళ్లు తాగాయి. మేకలు నీటిని తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కాపరులు, గ్రామస్తులు పశువైద్యాధికారికి ఫోన్లో సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకునే లోపు పది మేకలు మరణించారయి. వెంటనే వైద్య బృందం అప్రమత్తమై మిగతా మేకలకు వైద్యం అందించగా వాటి ఆరోగ్యం నిలకడగా ఉంది. -
దొరకని ఆచూకీ
కొమురవెల్లి(సిద్దిపేట): ఆర్మీ జవాన్ ఆచూకీ లభించకపోవడంతో 11 రోజులుగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన తోట అనిల్ పడకొండేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్లోని అంబాలలో విధులు నిర్వహిస్తున్నాడు. జూలైలో ట్రైనింగ్ నిమిత్తం సికింద్రాబాద్కు వచ్చాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సెలవుపై అయినాపూర్లోని ఇంటికి వచ్చాడు. ఈనెల 6న విధుల్లో చేరేందుకు పంజాబ్లోని అంబాలకు వెళ్లాడు. 8వ తేదీన ఉదయం ఆర్మీ క్యాంపులో రిపోర్టు ఇచ్చి ఇంటికి ఫోన్ చేసి విధుల్లో చేరినట్టు తెలిపాడు. అదే రోజు సాయత్రం మళ్లీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పంజాబ్లో ఆర్మీ అధికారులను సంప్రదించగా మొదట అతడు డ్యూటీలో ఉన్నాడని, తర్వాత అతడు అదృశ్యమైనట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట సీపీ అనురాధను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలువగా ఆచూకీ త్వరగా కనుగొనాలని పంజాబ్ పోలీసులను ఫోన్లో ఆదేశించారు. తన కొడుకు ఆచూకీ త్వరగా కనిపెట్టాలని అనిల్ తల్లి మంగమ్మ ప్రభుత్వాలను కోరుతున్నారు. కాగా అనిల్ మిస్సింగ్పై ఫిర్యాదు చేశారని, పంజాబ్లో అక్కడి అధికారులతో మాట్లాడితే మిస్సింగ్ కేసు నమోదైనట్లు చెప్పారని ఎస్ఐ రాజు తెలిపారు. జవాన్ అదృశ్యమై..11రోజులు ఆందోళనలో కుటుంబ సభ్యులు -
ముస్తాబవుతున్న గణనాథులు
● ఆకర్షణీయంగా విగ్రహాలు ● రంజోల్లో పెద్ద ఎత్తున తయారీ● రంగులద్దుతున్న రాజస్తాన్ కళాకారులు ● సైజు, రూపం ఆధారంగా ధరలు జహీరాబాద్ టౌన్: వినాయకుడి పండగ వస్తుందంటే చాలు చిన్న, పెద్ద, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా మండపాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. అప్పుడే వారం రోజుల ముందే సందడి మొదలైంది. వినాయక చవితి పర్వదినానికి గణపయ్య విగ్రహాలు సిద్ధం అవుతున్నాయి. విగ్రహాలను రాజస్తాన్కు చెందిన కళాకారులు ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. అందంగా ఉండటానికి రంగులద్ది మెరుపులు అద్దుతున్నారు. మండపాల నిర్వాహకులు వచ్చి అడ్వా న్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని రంజోల్ వద్ద దూల్పేటలో మాదిరిగా పెద్ద ఎత్తున విగ్రహాలను తయారు చేస్తున్నారు. పది మంది కళాకారుల కుటుంబాలు వేసవి నుంచి తయారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ తయారైన విగ్రహాలను జిల్లాతో పాటు హైదరాబాద్, పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కొంత మంది మండపాల నిర్వాహకులు ముందుగా ఆర్డర్ ఇచ్చి తమకు నచ్చిన నమూనాలో విగ్రహాలను తయారీ చేయించుకుంటారు. వినాయక చవితి ఇంకా వారం రోజులు ఉండగా అప్పుడే విగ్రహాల కొనుగోళ్ల సందడి మొదలైంది. సైజును బట్టి ధరలు విగ్రహాల సైజు, రూపం బట్టి ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. రంజోల్ వద్ద 3 నుంచి 15 అడుగుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. సుమారు ఐదారు కార్ఖానాల్లో ఉండగా ఒక్కో దాంట్లో 150కి పైగా విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆర్డర్లపై కోరిన సైజులో విగ్రహాలను తయారు చేసి ఇస్తారు.విగ్రహాలతోనే ఉపాధి వినాయక విగ్రహాల తయారీతోనే ఉపాధి పొందుతున్నాం. కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడుతాం. తయారీ ఖర్చులు పెరిగాయి. ఆశించిన మేర లాభాలు రావడం లేదు. ఈ సారి అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. పుణే, ముంబయి తరహా కొత్త మాడల్స్ డిమాండ్పై తయారు చేస్తున్నాం. ప్రతిమలు తీసుకునేందుకు జహీరాబాద్తో పాటు కర్నాటక రాష్ట్రంలోని బీదర్, ఉమ్నబాద్, బాల్కీ తదితర ప్రాంతాల ప్రజలు వస్తారు. – ముఖేశ్, రాజస్తాన్ కళాకారుడుపీవోపీతో విగ్రహాల తయారీ రాజస్తాన్ కళాకారులు విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. కుటుంబ సభ్యులంతా సుమారు 10 నెలల పాటు విగ్రహాలను పీవోపీతో తయారు చేస్తారు. కొందరూ విగ్రహాలను తయారు చేస్తుంటే మహిళలు, పిల్లలు రంగులు దిద్దుతారు. ఈ నెల 27న వినాయక చవితి పండగ ఉన్నందున కొనుగోళ్ల సందడి ప్రారంభమైంది. -
వర్గల్ క్షేత్ర నిర్వహణ అద్భుతం
కంచి పీఠాధిపతి ప్రశంసలు వర్గల్(గజ్వేల్): కంచి పీఠం ఆధ్వర్యంలోని వర్గల్ శ్రీవిద్యాధరి క్షేత్ర నిర్వహణ అద్భుతమని కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసించారు. తిరుపతి క్షేత్రంలోని మహా పాదుకా కంచి మఠంలో చతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామివారిని మంగళవారం వర్గల్ క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో అభివృద్ధి కమిటీ బృందం కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వహణ, చేపడుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికను స్వామివారికి వివరించారు. -
యూనిఫామ్ తిప్పలు
కురచ దుస్తులతో విద్యార్థుల అవస్థలు పాతది వేసుకుంటున్న మా పాఠశాలలో ఉపాధ్యాయులు యూనిఫామ్ ఇచ్చారు. అది వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. పాత ది వేసుకుని బడికి పోతున్నాం. మా కొలతలకు తగ్గట్టుగా మంచిగా కుట్టి ఇవ్వాలి. – విజయ్, 10వ తరగతి విద్యార్థి చిన్నగా ఉంది పాఠశాలలో ఇచ్చిన యూనిఫామ్ చిన్నదిగా ఉంది. అది వేసుకోవడానికి రావడం లేదు. ఉపాధ్యాయులేమో రోజు యూనిఫామ్ వేసుకుని రమ్మంటున్నారు. సరైన కొలతలతో కుట్టి తిరిగి మళ్లీ ఇవ్వాలి. – ప్రణయ్, 7వ తరగతి, విద్యార్థి చర్యలు తీసుకుంటాం విద్యార్థులకు పంపిణీ చేసిన యునిఫారాలు కొలతల్లో హెచ్చుతగ్గులు వచ్చిన వాటిని గుర్తించి తిరిగి సరిచేసి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి వివరాలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాంల తయారీ విషయంలో శిక్షణ ఇప్పించాం. అనుభజ్ఞులతోనే తయారీ చేయిస్తున్నాం. – హన్మంత్రెడ్డి,జిల్లా మెప్మా అధికారి, మెదక్తూప్రాన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు పంపిణీ చేసిన యూనిఫామ్లు సరిగా లేక వాటిని ధరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామంటూ ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమైంది. ముఖ్యంగా యూనిఫారాల సరఫరాలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కురుచ దుస్తులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి యేటా రెండు జతల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. జిల్లాలోని 922 ప్రభుత్వ పాఠశాలల్లో 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలలకు డీఆర్డీఏ, అర్బన్ ప్రాంతాల్లో తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలకు మెప్మా పరిధిలో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన యునిఫారాలు కొలతలకు అనుగుణంగా లేవని దీంతో ధరించలేక పోతున్నామని వాపోతున్నారు. పొట్టి దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. గతంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యునిఫారాల క్లాత్ను ఎంఆర్సీ కేంద్రాలకు పంపించేవారు. వాటిని విద్యార్థుల కొలతలను బట్టి పాఠశాల స్థాయిలో టైలర్స్తో కుట్టించి పిల్లలకు అందించేవారు. ఇందుకు ఒక్కో జత కుట్టినందుకు ప్రభుత్వం రూ.40 చెల్లించేది. కాని రెండేళ్లుగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు కావాల్సిన క్లాత్ను సరఫరా చేస్తుంది. గతంలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాల ద్వారా యునిఫాంలు కుట్టిస్తున్నారు. ఒక్కో జతకు రూ.75 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ తరగతుల వారీగా యూనిఫాం కుట్టడం ద్వారా ఒక తరగతిలో ఒక విద్యార్థి పొడువుగా, మరొకరు చిన్నగా ఉండటంతో సరిపోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలోని సర్కారు బడుల్లో84 వేల మంది పిల్లలు పట్టించుకోని అధికారులు -
మహిళను కాపాడిన కానిస్టేబుల్
చేర్యాల(సిద్దిపేట): చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. కానిస్టేబుల్ స్వామి, స్థానికుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన పాక రాణి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వచ్చేసి చనిపోదామని చెరువులో దూకింది. అదే సమయంలో కట్టపై మార్నింగ్ వాక్ చేస్తున్న కానిస్టేబుల్ స్వామి వెంటనే చెరువులోకి దూకి ఆమెను కాపాడి మానవత్వం చాటుకున్నాడు. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ స్వామిని సీపీ అనురాధ, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ ఎల్.శ్రీను, ఎస్ఐ నవీన్, పట్టణ ప్రజలు అభినందించారు. త్వరలో స్వామికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. -
చేపల వలలో చిక్కిన కొండ చిలువ
నర్సాపూర్ : ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు రాయరావు చెరువు నీటితో నిండుకుండలా ఉంది. మత్స్యకారులు చెరువులో చేపలు పట్టేందుకు వలలు ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం వల వేసిన కొంత సేపటికి చూడగా కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు అటవీ శాఖ రేంజ్ అధికారి అరవింద్కు సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రతినిధుల సహకారంతో కొండ చిలువను సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. అటవీ అధికారి అరవింద్ వెంట సెక్షన్ ఆఫీసర్ సాయిరాం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
ఝరాసంగం నుంచి బర్దీపూర్ చౌరస్తా మీదుగా, ఝరాసంగం నుంచి జహీరాబాద్కు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. దీంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు మరమ్మతులు చేపట్టకపోవటంతో గుంతలు పెద్దగా మారుతున్నాయి. –గంగారం, బర్దీపూర్, మం.ఝరాసంగం ప్రభుత్వానికి నివేదికలు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను గుర్తించి, ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు పనులు చేపడతాం. – నర్సింహులు, ఈఈ, ఆర్ అండ్ బీ, సంగారెడ్డి జిల్లా -
ఫొటోగ్రఫీ జర్నలిజంతో చైతన్యం
సంగారెడ్డి జోన్: ఫొటోగ్రఫీ జర్నలిజంతో ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను వినియోగిస్తూ ఫొటోగ్రఫీ మరింత విస్తరించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫొటోగ్రఫీ వర్క్షాప్లు నిర్వహించి మెళకువలు నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ౖఫైసల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఫొటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం -
రేపు మంత్రి పర్యటన
మునిపల్లి(అందోల్): ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 21న మునిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాల్లో బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏఎంసీ చైర్మన్ సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ అధ్యక్షుడు సతీశ్కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బుదేరా మహిళా డిగ్రీ కళాశాల, మునిపల్లి మోడల్ స్కూల్ను మంత్రి సందర్శిస్తారు. ఖమ్మంపల్లి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ప్రమాదస్థాయిలో డబ్బవాగు మునిపల్లి(అందోల్): ఝరాసంగం మండలం జోనగామ శివారులోని తాటిపల్లి డబ్బవాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో బోడపల్లి, పిల్లోడి, తాటిపల్లి, జోనగామ గ్రామాలతోపాటు ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వ్యవ సాయ భూములలో పెట్టిన పంటలను చూసేందుకు వీలులేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా పత్తి పంటలో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని, పంటలకు నష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉధృతి తగ్గేవరకు రావొద్దు హెచ్చరిస్తున్న పోలీసులు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గం సజ్జారావు పేట తండా పరిధిలోని జాడిమల్కాపూర్ ఎత్తిపోతల వద్ద జలకళ ఉట్టిపడుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పైనుంచి కిందికి దూకుతున్న నీళ్లు సందర్శకులను కనువిందు చేస్తోంది. జలపాతాన్ని చూసేందుకు జహీరాబాద్తోపాటు కర్ణాటక రాష్ట్రం నుంచి సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల దగ్గర రోడ్డును మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను మంగళవారం ఏర్పాటు చేసి సందర్శకులను తిప్పి పంపేస్తున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు సందర్శకులు రావద్దని ఎస్ఐ కాశీనాథ్ సూచించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలి పుల్కల్(అందోల్): వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని కార్యదర్శులకు డీపీఓ సాయిబాబా సూచించారు. గొంగ్లూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పాత, మట్టి ఇళ్లను గుర్తించి అందులోని వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వేరే చోట ఆశ్రయం కల్పించాలని సూచించారు. ఎవరైనా ఇళ్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. డీపీఓ వెంట ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్ ఉన్నారు. ధర్నాను విజయవంతం చేయండిః మాణయ్యజోగిపేట(అందోల్): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పీఆర్టీయూ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల మాణయ్య పిలుపునిచ్చారు. జోగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం మహాధర్నా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణయ్య మాట్లాడుతూ..పాత పింఛను విధానాన్ని సాధించేందుకు పీఆర్టీయూ కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అందోల్ అర్బన్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరోత్తమ్ కుమార్, జనార్దన్గౌడ్, అందోల్ రూరల్ శాఖ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాజమల్లు, మయాచారి తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే అభివృద్ధి: సంజీవరెడ్డి
నారాయణఖేడ్: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలతో కలిసి నూతన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల కోసం గుర్తింపు శిబి రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..విద్యార్థులకు థియరీ కన్నా ప్రాక్టికల్స్ సులభంగా అర్థమవుతాయన్నారు. అదేవిధంగా ఖేడ్లో సదరం శిబిరం క్యాంపును ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామన్నారు. అనంతరం డీఈఓ, సైన్స్ అధికారి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నల్లవాగు నీటితో నింపుతాం కల్హేర్ (నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు నీటితో చెరువులు నింపుతామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.డీఈఓతో కలిసి సైన్స్ ల్యాబ్ ప్రారంభం -
నిండుకుండల్లా చెరువులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వారంరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు జిల్లాలో చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెరువులన్నీ జలసిరిని సంతరించుకుని నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1,769 చెరువులు ఉన్నాయి. నీటి పారుదల శాఖ నివేదికల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకు ఇందులో 468 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. అంటే మొత్తం చెరువుల్లో 26% చెరువులు అలుగు పారుతున్నట్లు స్పష్టమవుతోంది. 50% నుంచి 75% నిండినవి 998 సగానికి పైగా నిండిన చెరువులు..అంటే 50% నుంచి 75% వరకు నిండినవి 998 ఉన్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం చెరువుల్లో సుమారు 56% చెరువుల్లో 75% నీళ్లు వచ్చాయి. ఒక్క సంగారెడ్డి డివిజన్లోనే 938 చెరువులు 75% వరకు నిండినట్లు గుర్తించారు. 75% నుంచి 100% నిండిన చెరువులు 269 ఉన్నాయి. వీటిలో సగం చెరువులు ఒకటీ రెండు రోజుల్లో అలుగు పారుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. 25% నుంచి 50% వరకు నీళ్లు వచ్చిన చెరువులు 20 ఉండగా, ఇంకా 25% లోపు నీళ్లు చేరిన చెరువుల సంఖ్య 14 ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఎక్కువగా జహీరాబాద్ డివిజన్లో ఉన్నాయి. ఇతర డివిజన్లతో పోలిస్తే జహీరాబాద్ డివిజన్లో కాస్త తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ చెరువులతోపాటు చెక్డ్యామ్లు, ఆనికట్ల వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. భూగర్భ జలాల అభివృద్ధి కోసం నిర్మించిన పర్క్యులేషన్ ట్యాంకుల్లో సైతం నీరు చేరినట్లు ఆశాఖ నివేదికలు చెబుతున్నాయి.జిల్లాలో అత్యధికంగా దౌల్తాబాద్ నీటిపారుదలశాఖ డివిజన్లో 302 చెరువులు అలుగు పారుతున్నాయి. ఈ డివిజన్లో 394 చెరువులున్నాయి. మిగిలిన 92 చెరువులు కూడా 75% నుంచి 100% నిండినట్లు ఆశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో అధిక వర్షాలు నమోదవుతుండటంతో ఇక్కడి చెరువులు నిండాయి. ఖేడ్ డివిజన్లో 71, సంగారెడ్డి డివిజన్లో 63, జహీరాబాద్ డివిజన్లో 32 చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. అత్యధికంగా దౌల్తాబాద్ డివిజన్లో ఎడతెరిపిలేని వర్షాలతో ఉట్టిపడుతున్న జలసిరి జిల్లాలో మొత్తం చెరువులు 1,769 అలుగుపారుతున్నవి 468మరిన్ని అలుగు పారుతాయి జిల్లాలో 468 చెరువులు అలుగులు పారుతున్నాయి. ఒకటీ, రెండు రోజుల్లో ఈ అలుగు పారుతున్న చెరువుల సంఖ్య మరో వంద వరకు ఉంటాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున చెరువుల్లోకి వరద చేరుతోంది. భారీ వర్షాలతో చెరువులకు గండి పడే ప్రమాదాలు పొంచి ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించాం. – పోచమల్లు, నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ -
గురుకులం ప్రిన్సిపాల్పై వేటు
నారాయణఖేడ్: చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఖేడ్లోని బీసీ గురుకులాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ‘సాక్షి’దినపత్రికల్లో ‘గురుకులానికి గజ్జి’శీర్షికన వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. పాఠశాలలోని గదులు తిరిగి విద్యార్థులతో సమస్యలపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే వ్యాధులు ముదిరాయని, తమకు ఆయనతో భయం ఉందంటూ సమస్యలను ఎమ్మెల్యే ముందు విద్యార్థులు ఏకరవు పెట్టారు. కరెంటు స్విచ్లు చెడిపోయి గదులకు కరెంట్ సరఫరా వస్తోందని ఆందోళన చెందారు. గదుల్లో లైట్లు వెలగడం లేదని, ఫ్యాన్లు తిరగవని వాపోయారు. గురుకులాన్ని కలియదిరిగిన సంజీవరెడ్డి ఆర్సీవో గౌతంరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు బిల్లులు, రికార్డులు పరిశీలించి బిల్లులపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్పై చర్యలకు ఆదేశం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను విధుల్లోంచి తొలగించాలని ఆర్సీవో గౌతంరెడ్డికి ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రిన్సిపాల్గా జూనియర్ లెక్చరర్ ప్రతిభను నియమించారు. వర్గల్కు డిప్యుటేషన్పై వెళ్లిన స్వాతిని తిరిగి గురుకులానికి కేటాయించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనంపెట్టాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మె ల్యే హెచ్చరించారు. సబ్కలెక్టర్ తనిఖీ అనంతరం సబ్కలెక్టర్ ఉమాహారతి గురుకులా న్ని తనిఖీ చేసి గదులను పరిశీలించారు. నిజాంపేట్ వైద్యులు డా.తరుణి, డా.అరవింద్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి గురుకులంలో 50మందికి చర్మవ్యాధులున్నట్లు గుర్తించారు. అనంతరం వారికి చికిత్సలు అందజేశారు.ఎస్ఎఫ్ఐ ధర్నానారాయణఖేడ్: ఖేడ్లోని బీసీ గురుకులంలో విద్యార్థులకు చర్మవ్యాధులు వచ్చినా పట్టించుకోకుండా వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను తొలగించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం గురుకులం ముందు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డికి అందించారు. జూనియర్ లెక్చరర్ ప్రతిభకు బాధ్యతలు అప్పగింత ఆర్సీవో తీరుపై ఎమ్మెల్యే అసహనం -
రెండేళ్ల నుంచి మంచి ఆదాయం
50 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్న. దిగుబడి బాగానే వస్తుంది. మూడేళ్ల క్రితం నష్టాలు చవిచూశాం. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ నుంచి వ్యాపారులు వచ్చి సరైన ధరకు కొంటున్నారు. మూడేళ్ల క్రితం రూ.4 కిలో అమ్ముడు పోగా ఇప్పడు రూ.20 కిలో చొప్పున కొంటున్నారు. – నల్ల నాగేశ్వర్ రెడ్డి, రైతు, రంజోల్మంచి డిమాండ్ ఉంది అరటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జహీరాబాద్ డివిజన్ పరిధిలో అనుకూల వాతావరణం ఉన్నందన మంచి దిగుబడులు వస్తాయి, ఈ ప్రాంతంలో అరటి విస్తీర్ణం ఎప్పుడు తగ్గడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తున్నందున సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అరటి సాగులో అధిక లాభాలు సాధించవచ్చు. పంట సాగు విషయంలో అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేపట్టి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – పండరి, ఉద్యానశాఖ అధికారి, జహీరాబాద్ -
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డేసొంత గూడు నిర్మాణంలో... మకరందాన్ని పీలుస్తున్న కీటకంరెప్పపాటులో జరిగిపోయే దృశ్యాలను ఒక్క క్షణంలో ఆవిష్క ృతం చేసేది ఒక్క కెమెరానే. కెమెరాలో బందీ అయిన ప్రతి చిత్రం అబ్బుర పరుస్తుంది. చిరకాలం పదిలంగా మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. జ్ఞాపకాలకు శాశ్వతంగా ప్రాణం పోసేది ఫొటో. శ్రమైక జీవుల సౌందర్యం, ప్రకృతి మనోహర దృశ్యాలు, పశుపక్షాదులు, పూలసోయగాలు.. ఇలా పదిలంగా ఉంచేదే చిత్రం. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సాక్షి క్లిక్ మనిపించిన చిత్రాలు.మంజీరా డ్యామ్ ఆవరణలో సీతాకోక చిలుక– సిద్దిపేట / సంగారెడ్డి సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు / మిరుదొడ్డి(దుబ్బాక) -
మద్యం బాటిళ్ల స్వాధీనం
జహీరాబాద్ టౌన్: గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్), సంగారెడ్డి టీం సభ్యులు సోమవారం పట్టుకున్నారు. మండలంలోని చిరాగ్పల్లి చెక్పోస్టు వద్ద డీటీఎఫ్ బృందం సభ్యులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్ బస్సులో తీసుకొస్తున్న వివిధ బ్రాండ్స్కు చెందిన 74 మద్యం బాటిళ్లు(42 లీటర్లు)ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో సీఐ వీణారెడ్డి, ఎస్ఐలు హనుమంతు, రమేశ్, మురళి, రాజ, ఉమారాణి ఉన్నారు. -
చేపల వేటకు వెళ్లి.. అదృశ్యం
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏషబోయన దుర్గేశ్ ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలోని మంజీరా నదికి చేపల కోసం వెళ్లాడు. సోమవారం సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు సోదరుడు నర్సింహులు పేర్కొన్నాడు. చికిత్స పొందుతూ వ్యక్తి.. ఝరాసంగం(జహీరాబాద్): గ్యాస్ లీకై న ఘటనలో మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా... మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో ఈనెల 6న గ్యాస్ లీకై మంటలంటుకొని ఒకే కుటుంబంలోని తల్లి శంకరమ్మతో పాటు కుమారులు ప్రభు కుమార్, విట్టల్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈనెల 6న తల్లి, 15న ప్రభు కుమార్ మృతి చెందారు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమారుడు విట్టల్(32) మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. భార్యతో పాటు కుమారులకు అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి బక్కన్న గుండెలవిసేలా ఏడ్చారు. -
అరటి సాగు.. బాగు
జహీరాబాద్ టౌన్: అరటికి ఏ సీజన్లోనైనా మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడువునా సాగుకు అనుకూలంగా వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరిచుకోవడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అరటి పంటతో పాటు పిలకలు, ఆకులకు గిరాకీ ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక లాభాలు సాధించవచ్చు. జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో అరటి పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాది పొడవునా అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎర్రటి, నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం. జహీరాబాద్ డివిజన్లో వ్యవసాయ బావులు ఎక్కువగా ఉండటంతో నీటి తడులకు ఢోకాలేదు. జిల్లాలో జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్కల్, గుమ్మడిదల, కొండాపూర్ తదితర మండలాల్లో అరటి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. జహీరాబాద్ డివిజన్లో సాగు విస్తీర్ణం ఎప్పుడు తగ్గడం లేదు. ఒక్క జహీరాబాద్ డివిజన్లోనే ప్రతి సంవత్సరం సుమారు 500 పైగా ఎకరాల్లో పంట సాగవుతుంది. జిల్లా మొత్తం కలిపి సుమారు 2వేల ఎకరాల్లో అరటి పంటను రైతులు పండిస్తున్నారు. గతంలో మనూర్ మండలంలో పెద్ద ఎత్తున పండించే వారు. మంచి దిగుబడి వచ్చినా కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో పంట సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గింది. ఇప్పుడు అరటికి డిమాండ్ పెరగడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం వల్ల సాగుకు అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ రాయితీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంతో భాగంగా ప్రభుత్వం అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీ అందిస్తుంది. అరటిని టిష్యూ కల్చర్, పిలకలు, గడ్డల పద్ధతిలో సాగు చేస్తారు. టిష్యూ కల్చర్, పిలకల పద్ధతికి ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ ఇస్తుంది. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు ఒక్కొక్క రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తుంది. డ్రిప్ పరికరాలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.ఆసక్తి చూపుతున్న అన్నదాతలు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న విస్తీర్ణం జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో సాగు -
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారులతో కలిసి పోలీసు సిబ్బంది సమష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పోలీసులు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల ఎవరికై నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డయల్ 100 లేదా పోలీసు కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712 667 100కు ఫోన్ చేయాలని సూచించారు.ఇళ్లు కూలి.. ముగ్గురికి గాయాలు పుల్కల్(అందోల్): భారీ వర్షాలకు మండలంలోని పాత ఇళ్లు కూలుతున్నాయి. పత్తికుంట తండా, పోచారం గ్రామంలో సోమవారం ఇళ్లు కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. పత్తికుంట తండాలో తేజావత్ జితేందర్ ఇళ్లు కూలి మట్టి పెళ్లలు మీద పడటంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు సునీత, కార్తీక్కు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎస్ఐ విశ్వజన్ , ఎంపీఓ వేంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు కొత్త ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు పాపన్నపేట(మెదక్): జిల్లాలో కల్తీకల్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్ సీఐ గోపాల్ హెచ్చరించారు. సోమవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని గాజులగూడెం, కొత్తపల్లి, అన్నారం, అబ్లా పూర్, పూసూఫ్పేట, కొడపాక, పొడ్చన్పల్లి, కుర్తివాడ, నార్సింగి గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కల్తీ కల్లు విక్రయించడం నేరమని, దుకాణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పలు కల్లు దుకాణాల్లో సేకరించిన షాంపిళ్లను పరీక్షల నిమిత్తం మెదక్ ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించనున్నట్లు తెలి పారు. ఎస్ఐ బాలయ్య, హెడ్ కానిస్టేబుళ్లు చంద్రయ్య, ఎల్లయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి హుస్నాబాద్రూరల్: రోరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా... స్థానికుల కథనం ప్రకారం... అక్కన్నపేట మండలం కేశాపూర్కు చెందిన అఖిల్ (25) హుస్నాబాద్ నుంచి బైక్పై గ్రామానికి వెళుతున్నాడు. పోతారం(ఎస్) క్రాసింగ్ దగ్గర వర్షానికి బైక్ అదుపు తప్పిరోడ్డు పక్కన ఉన్న కందకంలో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులు చూసి 108కి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చిన్న వ్యాపారాలపై సర్వే మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో సోమవారం కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయం కరీంనగర్ బృందం సర్వే నిర్వహించింది. వ్యవసాయేతర రంగంలోని చిన్న వ్యాపారాల ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టినట్లు అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అసంఘటిత సేవా రంగం, అసంఘటిత భవన నిర్మాణాలపై అయ్యే ఖర్చులపై సర్వే నిర్వహించారు. బృంద సభ్యులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.గృహిణి ఆత్మహత్య మెదక్ కలెక్టరేట్: గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి హవేళిఘణాపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటు చేసు కుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన ఇండ్ల నరేశ్కు కామారెడ్డి జిల్లా అరుగొండ రాజంపేటకు చెందిన సత్యతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గ్రామంలో బంధువుల పెళ్లి ఉండగా 4రోజుల క్రితం వచ్చారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో సత్య బెడ్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. గమనించిన ఆమె అత్త దుర్గమ్మ తలుపులు తట్టినా తీయలేదు. దీంతో కొడుకు నరేశ్కు, ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో వారొచ్చి తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకొని ఉంది. వెంటనే స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆమె భర్త నరేశ్ మృతురాలి శవాన్ని ఇంటి అరుగుపై పడుకోబెట్టి పారిపోయినట్లు సమాచారం. కాగా మృతురాలు 4నెలల గర్భిణి అని తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డను అల్లుడు నరేశ్ హత్య చేశాడని ఆందోళన చేపట్టగా పోలీసులు సముదాయించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
నర్సాపూర్: భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నర్సాపూర్ మీదుగా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామానికి వెళ్తుండగా స్థానిక ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్లతో పాటు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పలువురు నాయకులతో పట్టణ శివారులో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరైనా నివసిస్తుంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు కుంటలను పరిశీలించాలని, పేదల ఇండ్లు కూలిపోతే నివేదిక ఇవ్వాలని సూచించారు. మంత్రి దామోదర ఆదేశం -
జాతీయ క్రీడలకు విద్యార్థులు ఎంపిక
కొండపాక(గజ్వేల్): కొండపాక హైస్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యా పత్యా జాతీయ క్రీడలకు ఎంపికయ్యారని మండల విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సెప్టెంబర్లో మహారాష్ట్రలో జరిగే జాతీయ క్రీడలకు ఎస్ శరణ్య, ఎం.శ్రీరామ్, సీహెచ్ సాత్విక తెలంగాణ జట్టులో ఎంపికయ్యారు. దీంతో ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనంతుల ప్రశాంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.అభినందించిన ఎమ్మెల్యే హరీశ్రావు -
పెళ్లింట విషాదం
● తండీక్రొడుకు మృతి ● చంద్లాపూర్, గంగాపూర్ గ్రామాల్లో విషాదం చిన్నకోడూరు(సిద్దిపేట): ఆ తండ్రీకొడుకుల అనుబంధంపై విధికి కన్నుకుట్టింది. వారిని శాశ్వతంగా విడదీసింది. పెళ్లి వేడుకల ఆనందం ముగియక ముందే ఆ కుటుంబంలో శోకం మిగిల్చింది. వారి మరణం రెండు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి(50)కి భార్య పద్మ, కుమారుడు రాజిరెడ్డి(27), కూతురు సంతోషి ఉన్నారు. వీరికి గంగాపూర్ శివారులో ఎకరం సాగు భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 14న కూతురు సంతోషి పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లి పనులు పూర్తి కావడంతో సోమవారం తండ్రి, కొడుకు అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను రక్షించేందుకు వైరు చుడుతున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో ఇటు చంద్లాపూర్, సాగు చేస్తున్న గంగాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెండు గ్రామాల ప్రజలు, బంధువులు తండ్రి, కొడుకు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
బీడీ పరిశ్రమను కాపాడండి
సిద్దిపేటజోన్: గ్రామీణ కుటీర పరిశ్రమ అయిన బీడీ పరిశ్రమను కాపాడాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు సోమవారం తెలంగాణ భారతీయ మాజ్దుర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని జాతీయ బీఎంఎస్ కార్యదర్శి సురేంద్రన్, అఖిల భారత బీడీ మాజ్దుర్ మహా సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్లతో కలిసి ఆయన పలు సమస్యలపై వివరించారు. తెలంగాణలో 10 లక్షల మంది బీడీ కార్మికులన్నారని తెలిపారు. ప్రస్తుతం బీడీలపై 18 శాతం జీఎస్టీ ఉందని, పెంచే ఆలోచన విరమించి 5 శాతానికి కుదించాలని కోరారు.కేంద్ర మంత్రికి బీఎంఎస్ వినతి -
డ్యామ్కు శాశ్వత మరమ్మతులు
సంగారెడ్డి జోన్: సింగూర్ డ్యామ్కు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...డ్యామ్పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. డ్యామ్ పరిరక్షణకు దేశంలో అత్యున్నత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అవసరమైన డీపీఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల లైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సకాలంలో సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్ద రెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సర్వే పనులు తదితగతిన పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.సమీక్షలో మంత్రి దామోదర -
గురుకులంలో తనిఖీలు
విద్యార్థుల అస్వస్థతపై విచారణ చేపట్టిన అధికారులు పుల్కల్(అందోల్): సింగూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై రాష్ట్ర గురుకుల సొసైటీ జాయింట్ సెక్రటరి సక్రునాయక్, జోనల్ అధికారి రజిని సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులు అస్వస్థతపై ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించి అధికారులు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల టాయిలెట్లు, వంటగదులను పరిశీలించి అపశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిపై వివరాలు సేకరించారు. కాగా అధికారుల విచారణలో హౌస్ మాస్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. పేద విద్యార్థుల చదువుకునే సంస్థలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యమా అని ప్రిన్సిపాల్ అడివయ్యపై మండిపడ్డారు. విద్యార్థులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని నిలదీశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. -
ఘనంగా టీఎల్ఎం మేళా
సదాశివపేట(సంగారెడ్డి): ఉపాధ్యాయుల బోధనోపకరణాల మేళాను సోమవారం పట్టణంలోని రవీంద్రమోడల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల సముదాయంలో నిర్వహించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ సబ్జెక్టులను వివరించడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే వివిధ రకాల బోధనోపకరణాలను మేళాలో ప్రదర్శించారు. పట్టణ, మండల పరిధిలోని 55 పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ రకాల బోధనోపకరణాలు తయారుచేసి ప్రదర్శించగా అందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 10 పాఠశాలలు జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ఎంఈఓ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్ఎన్ఓ సుధాకర్, కాంప్లెక్స్ హెచ్ఎంలు జయసుధ, వినయ్కుమార్, రాజశ్రీ, నిజాముద్దీన్, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీఆర్పీలు పాల్గొన్నారు. -
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
సదాశివపేట(సంగారెడ్డి): వినాయక చవితి వేడుకలకు మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపనకు నిర్వాహకులు పోలీస్శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ స్పష్టం చేశారు. పట్టణంలోని ఎన్గార్డెన్లో సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి డీఎస్పీ హాజరై మాట్లాడారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు పూర్తిగా నిబంధనల మేరకు నడుచుకుంటూ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో మైక్సెట్లు ఏర్పాటు చేయాలంటే పోలీసు, విద్యుత్, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అనుమతి తప్పసరిగా తీసుకోవాలన్నారు. వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, సిద్దన్న, అశిరెడ్డి, ప్రవీణ్కుమార్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ -
సరిహద్దులు దాటొద్దు
సంగారెడ్డి జోన్: పంట సాగులో వినియోగించే యూరియాను జిల్లా సరిహద్దులు దాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్ ముగిసిన అనంతరం జిల్లా ఎస్పీ పరితోశ్పంకజ్తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో అవసరం మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సొసైటీలలో ఎరువుల స్టాక్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడం, బ్లాక్ మార్కెట్కు తరలించడం, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్తో పాటు వచ్చే రబీ సీజన్లో కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జానాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో అర్జీల స్వీకరణకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో బాధితులు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యతోపాటు ఇతర అధికారులు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నేనేమైనా దొంగనా? మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామానికి చెందిన రామ్రెడ్డి అనే రైతు నేనేమైనా దొంగనా? నా సమస్య చెప్పుకోవద్దా? అంటూ ప్రజావాణిలో అధికారుల ముందు విలపించాడు. గ్రామంలోని 307/అ సర్వే నంబర్ లో ఉన్న ఒక ఎకరా 31 గుంటలు అనువంశికంగా వస్తోంది. కొన్నేళ్ల క్రితం ధరణి రావటంతో అసైన్మెంట్ భూమిగా చూపిస్తోంది. మూడేళ్లుగా కార్యాలయాలు చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.యూరియాపై సమీక్షలో కలెక్టర్ ప్రావీణ్య -
గురుకులానికి గజ్జి
నారాయణఖేడ్: ఖేడ్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో చాలామంది విద్యార్థులు చర్మవ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల నుంచి హాస్టల్లో విద్యార్థులు గజ్జి, తామర వంటి చర్మవ్యాధులతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రిన్సిపాల్ పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థుల ఒంటిపై విపరీతమైన దద్దుర్లు వచ్చి దురదలు పెడుతున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు హాస్టల్లో ఉండలేక ఇంటికి వెళ్లిపోయారు. ఆస్పత్రులకు తిప్పుతున్న తల్లిదండ్రులు గురుకులంలో సుమారు 50మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. తమ పిల్లలకు చర్మవ్యాధులు నయం కాకపోవడంతో బీదర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. చర్మవ్యాధి నిపుణులు పరీక్షించి రూ.వేల మందులు సూచిస్తున్నారు. విద్యార్థులకు కాస్త నయం కాగానే గురుకులానికి పంపించగానే తిరిగి చర్మవ్యాధులు అంటుకుంటున్నాయి. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియక అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. తమ పిల్లలను చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులను ప్రిన్సిపాల్ కలవనివ్వకపోవడం, విద్యార్థులను గద్దించి పంపించి వేస్తుండటంతోనే చర్మవ్యాధులు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. పిల్లలను కలిసేందుకు వెళ్లినపుడు విషయం బయటపడుతుందని కలవనివ్వడంలేదని వారు చెబుతున్నారు. చెత్తా చెదారంతో దుర్గంధం గురుకులంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. నీటి ట్యాంకులను సరిగ్గా క్లీన్ చేయించడం లేదని, నీటిలో బ్లీచింగ్ చల్లకపోవడంతో చర్మవ్యాధులు మరింత తీవ్రమైనట్లు విద్యార్థులు వాపోతున్నారు. గురుకులంలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతోంది. 240 మందికి ఒకే మరుగుదొడ్డి గురుకులంలో రెండు భవనాలున్నాయి. ఒక భవనంలో 5, 6, 7వ తరగతి విద్యార్థులు చదువుతూ నివాసం ఉంటున్నారు. మూడు తరగతులకు కలిపి 240మంది విద్యార్థులకుగాను 5 మరుగుదొడ్లు ఉండగా నాలుగు చెడిపోయాయి. వాటికి మరమ్మతు చేయించకపోవడంతో ఉన్న ఒక్క మరుగుదొడ్డినే ఈ 240 మంది విద్యార్థులు ఉపయోగించాల్సి పరిస్థితి నెలకొంది. మరో భవనంలో 8, 9, 10వ తరగతులకు కలిపి 240 మందికిగాను 3 మరుగుదొడ్లు ఉండగా ఒకటి ఉపాధ్యాయులు వాడుకొంటుండగా రెండింటినే 240మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలకు ఉపక్రమించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే విద్యార్థి సంఘాలతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.చర్మ వ్యాధులతో విద్యార్థుల అవస్థలు ఇళ్లకు వెళ్లిపోయిన 50మంది పిల్లలు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో నరకయాతన -
పంట నష్టంపై ప్రతిపాదనలివ్వండి
నారాయణఖేడ్: భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశమై వివరాలను సేకరించారు. పెసర, మినుము మరో ఇరవై రోజుల్లో చేతికి వచ్చే పరిస్థితి ఉందని, ఈ సమయంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిందని అన్నారు. కంది, పత్తిపంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులు అక్కడక్కడా దెబ్బతిన్నాయని అధికారులు దృష్టికి తీసుకురాగా వాటి మరమ్మతు పనులకు ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే సూచించారు. లోలెవల్ కాజ్వేలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వివరాలు వెంటనే సేకరించి మరమ్మతులకు ప్రతిపాదించాలని అధికారులు ఆదేశించారు. జనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. నల్లవాగు నీటిని వదలండి నల్లవాగు నీటిని వెంటనే విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుపైనుంచి వరద నీరు పొంగి పొర్లుతోందని, కుడి, ఎడమ కాలువలద్వారా నీటిని వదలాలని సూచించారు. రైతులు ఆయా చెరువుల్లో వరద నీటిని నింపుకోవాలని సూచించారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని వివరించారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అతలాకుతలం
ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేలల్లోకి వరద చేరి పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. వరద ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లో రోడ్లపైకి నీరు చేరింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:కంగ్టి మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు వాగు పొంగి ప్రవహించాయి. ఏకంగా 16.6 సెం.మీల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో ఈ మండలంలోని రాసోల్, మురుకుంజాల్, తడ్కల్ బాన్సువాడ రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. వలుమూరు వాగు వంతెన వద్ద ఉన్న రోడ్డు 30 మీటర్ల మేరకు కోతకు గురైంది. విద్యుత్స్థంభాలు విరిగి పడటంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్హేర్ మండలంలోని మహారాజువాగు, మీర్కంపేట్వాగు, సిర్గాపూర్ మండలంలోని గైరాన్తాండా వాగులు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి హత్నూర మండలం ఎల్లమ్మగూడ – కొడుపాక గ్రామాల రోడ్డు ధ్వంసమైంది. గుమ్మడిదల మండలంలోని అన్నారం వద్ద 765 జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నీటిని తొలగించేందుకు డివైడర్ను పగులగొట్టాల్సి వచ్చింది. అమీన్పూర్ మండలం గండిగూడెం వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఖాజీపల్లి, శంబీపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మునిపల్లి మండలం డబ్బవాగు రోడ్డుపై ప్రవహించడంతో ఝరాసంఘం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరుకు 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు వరద పోటెత్తింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏకంగా 37 వేల క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్టుకు గండిపడే ప్రమాదం ఉండటంతో 43 వేల క్యూసెక్కులను గేట్ల ద్వారా, జెన్కో విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు పూర్తి స్థాయిలో నిండింది. పంట పొలాల్లోకి వరద భారీ వర్షానికి పంట పొలాల్లోని వర్షం నీరు చేరింది. మునిపల్లి, ఝారసంగం, కోహీర్, రాయికోడ్, సదాశివపేట, కల్హేర్, నారాయణఖేడ్, నిజాంపేట తదితర మండలాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి, కంది, పెసర, మినుము, మిరప వంట పంట పొలాల్లోకి వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేటలో 13.0 సెం.మీలు, కల్హేర్లో 11.9 సెం.మీలు, కడ్పాల్లో 10.7 సెం.మీలు, హత్నూరలో 10.1 సెం.మీలు, అన్నాసాగర్లో 10.3 సెం.మీలు, గుమ్మడిదలలో 9.4 సెంబీలు, సిర్గాపూర్లో 9.7 సెం.మీల రికార్డు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా అన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. సోమవారం రోజంతా ముసురు పెట్టింది. తెగిపడిన రోడ్లు..నిలిచిన రాకపోకలు నీట మునిగిన పంటపొలాలు పూర్తిగా నిండిన నల్లవాగు ప్రాజెక్టు సింగూరుకు 37 వేల క్యూసెక్కుల వరద రాక -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు: అదనపు కలెక్టర్
సంగారెడ్డి జోన్: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతీ శుక్రవారం అన్ని గ్రామాలలో పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తాగునీరు కలుషితం కాకుండా, ప్రతీ నాలుగు రోజులకొకసారి బ్లీచింగ్ కలపాలని సూచించారు. దోమల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. పంట నష్టం వివరాలు సేకరణన్యాల్కల్ (జహీరాబాద్): మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వర్షాలకు 69 ఎకరాల్లో పెసర, మినుము, సోయా పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు వెల్లడించారు. రేజింతల్, మామిడ్గి, ముంగి, హద్నూర్, హుమ్నాపూర్, మెరియంపూర్ తదితర గ్రామాల్లో ఎంఏఓ అభినాష్ వర్మ, ఏఈఓలు సోమవారం పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించారు. విద్యా వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందిధర్నాలో అంగన్వాడీ ఉద్యోగులు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఐసీడీఎస్తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగులకు అతి తక్కువ వేతనం చెల్లిస్తూ పని భారం పెంచుతుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్యదర్శి మంగ, నాయకులు ఏసుమణి, నాగేశ్వరి, గౌరమ్మ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. అదృశ్య ఆయుధం జియోస్పేషియల్ టెక్నాలజీఇస్రో మాజీ శాస్త్రవేత్త పద్మజ పటాన్చెరు: ఆధునిక యుద్ధంలో జియోస్పేషియల్ టెక్నాలజీని ‘అదృశ్య ఆయుధం’గా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ సీనియర్ శాస్త్రవేత్త, ట్రిబుల్ ఐటీ పీహెచ్డీ స్కాలర్ పద్మజ అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘జియో–స్పేషియల్ ఆపరేషనన్స్, రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు’అనే అంశంపై సోమవారం ఆమె అతిథి ఉపన్యాసం చేశారు. అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ...జియోస్పేషియల్ సాంకేతికత శత్రు స్థావరాలు, అక్కడి భూభాగ పరిస్థితులు, నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించే ప్రణాళికలను రచించడానికి తోడ్పడుతుందని చెప్పా రు. జియో భూమిని సూచిస్తుందని, స్పేషియ ల్ అనేది భూమిపై ఉన్న వస్తువుల రేఖాగణిత లక్షణాలను సూచిస్తుందని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. -
పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ చేసిన దామోదర
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమైని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబి నుంచి కలెక్టరేట్ వరకు గౌడ్ కులస్తుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్పంకజ్, అదనపు కలెక్టర్, చంద్రశేఖర్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
నేడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
సంగారెడ్డి టౌన్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గౌడ కులస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గణేశ్ మండపాల వివరాలివ్వండిజహీరాబాద్ టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ఆయా మండపాల నిర్వాహకులు సహకరించాలని ఆయా మండపాల వివరాలను అందజేయాలని జహీరాబాద్ టౌన్ పోలీసులు తెలిపారు. మండపాల వివరాలను పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. మండపాల ఏర్పాటు సమాచారం కేవలం భద్రత, బందోబస్తు కోసం మాత్రమేనని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలున్నా పోలీసుల నివృతి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హామీలు అమలు చేయాలిసీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు జోగిపేట(అందోల్): గ్రామపంచాయతీ కార్మి కులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు పేర్కొన్నారు. జోగిపేటలోని శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేతన పెంపుతోపాటు రెగ్యులర్గా చెల్లిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి 18నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.విద్యాసాగర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు సత్తయ్య, దశరథ్, యాదమ్మ, బాలమణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పీఆర్టీయూ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణజహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 హైదరాబాద్లో పీఆర్టీయూ నిర్వహించతలపెట్టిన మహాధర్నా పోస్టర్ను ఎమ్మార్పీస్ కార్యాలయం వద్ద ఆదివారం ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ మాట్లాడుతూ...సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయలు తీవ్రంగా నష్టపోతున్నారని, పాత పింఛను విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోవాలని కోరితే..
● ప్రాణం తీసిన ప్రియుడు ● నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన సీఐ కంగ్టి(నారాయణఖేడ్): మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కేసుకు సంబంధించిన వివరాలు స్టేషన్లో సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి వెల్లడించారు. మండలంలోని తుర్కవడ్గాం గ్రామానికి చెందిన మృతురాలు సింగిదొడ్డి నర్సమ్మ(40) భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కాగా మృతురాలితో రాంతీర్థ్ గ్రామానికి చెందిన మేత్రి రాజు(42)కు సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నర్సమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ రాజును డిమాండ్ చేస్తుండేది. గురువారం కంగ్టి, నారాయణఖేడ్ రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్లో ఇద్దరి మధ్య పెళ్లి గురించి గొడవ జరిగింది. అప్పటికే తాగిన మత్తులో ఉన్న రాజు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. రూంలోకి తీసుకెళ్లి బండరాయితో ఆమె ఛాతీపై, కాళ్లపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
అప్రమత్తంగా ఉండండి: మాణిక్రావు
న్యాల్కల్(జహీరాబాద్): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే మాణిక్రావు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని చీకూర్తి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనం, బ్రిడ్జి తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు, పాఠశాల భవనాలు దెబ్బతిని వాహన చోదకులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు. వర్షాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ న్యాల్కల్, ఝరాసంగం మండల అధ్యక్షుడు రవీందర్, వెంకటేశం, మాజీ అధ్యక్షుడు నర్సింహరెడ్డితోపాటు నాయకులు ప్రవీణ్కుమార్, భూమారెడ్డి తదితరులున్నారు.దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే -
శతాధిక వృద్ధురాలి మృతి
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన ఆలేటి భూదమ్మ(105) శతాధిక వృద్ధురాలు శనివారం రాత్రి వయోభారంతో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమారై ఉండగా వీరిలో ఇరువురు కుమారులు మృతి చెందారు. భూదమ్మ నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉందని, తన పనులు తానే చేసుకునేదని గ్రామస్తులు తెలిపారు. ఆమె ముని మనవళ్లు, మనవరాళ్లను చూసింది. అంత్యక్రియలు ఆదివారం వ్యవసాయ బావి వద్ద నిర్వహించారు. విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స పుల్కల్(అందోల్): సింగూరు గురుకుల పాఠశాలలో ఆరోగ్యశిబిరం కొనసాగుతుంది. మూకుమ్మడిగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మూడు రోజుల నుంచి పుల్కల్ ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించి చికిత్స అందించారు. కొందరు విద్యార్థులు కోలుకోగా మరి కొందరికి సైలెన్లు ఎక్కిస్తున్నారు. గురుకుల పాఠశాలలోనే క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని పీహెచ్సీ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు. భార్య అదృశ్యంపై ఫిర్యాదు.. పటాన్చెరు టౌన్: భార్య అదృశ్యంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన చందన్ కుమార్ భార్యతో వచ్చి పటాన్చెరు జె.పి కాలనీలో ఉంటూ, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే చందన్ భార్య ఖుషి కొన్ని రోజులుగా సౌరబ్ కుమార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 12న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చందన్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి సౌరవ్ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అతనితో ఉంది. దీంతో భార్యని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి ఇంటి నుంచి ఖుషి వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సౌరబ్పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ వివరాల ప్రకారం... మండలంలోని హోతి(బి)గ్రామ శివారులో రేకుల షెడ్లో కొంత మంది పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడి చేశారు. దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని, వారి వద్ద రూ. 55,350 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 మొబైల్ ఫోన్లు, 7 మోటారు బైక్లను కూడా స్వాధీనం చేసుకుని, సుమోటో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పటాన్చెరు డివిజన్లో.. పటాన్చెరు టౌన్: పేకాట ఆడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,400, 11 సెల్ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నలుగురికి గాయాలు అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని 161 జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం... బాన్సువాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు అల్లాదుర్గం శివారులో ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమదంలో కారులో ప్రయాణిస్తున్న గంగాధర్, స్వరాజ్యలక్ష్మి, శంకర్, సాయిహర్షకు గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సాపూర్ రూరల్: పార్క్ చేసిన స్కూటీ అపహరణకు గురైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం... మండలానికి చెందిన శక్తి ఆకాశ్ పట్టణంలోని బాలాజీ టిఫిన్ సెంటర్ ఎదుట స్కూటీని పార్క్ చేసి పక్కనే ఉన్న పండ్ల దుకాణానికి వెళ్లొచ్చేసరికి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
పటాన్చెరు టౌన్: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సూచించారు. శ్రీకృష్ణ జన్మాష్ఠమి నేపథ్యంలో గోకుల్ నగర్కు చెందిన ఎట్టయ్య, దేవకుమార్ శనివారం రాత్రి నిర్వహించిన శ్రీకృష్ణుని రథోత్సవం, దేవేంద్రుడి ఉత్సవంలో మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ నేత నీలం మధు, కాంగ్రెస్ పార్టీ ప్రొటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, కర్ణాటక కు చెందిన మల్లికార్జున్ అప్పాజీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి రథోత్సవం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలుకాలనీల మీదగా కన్నుల పండుగగా సాగింది. అనంతరం రుద్రారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రావణ మాసం బండ్ల బోనాల ఉత్సవాలలో మహిపాల్రెడ్డి పాల్గొని రూ.లక్ష విరాళం అందజేశారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
కొత్తవారికీ రేషన్
వచ్చే నెల 1నుంచి పంపిణీనారాయణఖేడ్: కొత్త రేషన్కార్డుదారులతోపాటు, పాత కార్డుదారులకు కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలంలో పేదలు వరదలు, వర్షాల వల్ల రేషన్ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకులను అందజేసింది. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం రాష్ట్రస్థాయి గోడౌన్స్ (స్టేజ్–1) నుంచి మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 846 చౌక ధరల దుకాణాల ద్వారా 13,08,489 కార్డుదారులకు ఆహార భద్రతా పథకం కింద ఉచితంగా 8,345 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. కాగా, ఇందులో కొత్తగా జిల్లాలో 31,460 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా ప్రస్తుతం ఉన్న పాతకార్డుల్లో 97,130మంది పేర్లను కొత్తగా నమోదు చేశారు. వీరందరికీ సెప్టెంబర్ నెలలో రేషన్ అందజేయనున్నారు.బియ్యంతో పాటు చేతిసంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్తోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన చేతి సంచిని ప్రభుత్వం అందజేయనుంది. తెల్లటి రంగులో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించి మధ్యలో ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలతోపాటును చేతిసంచిపై ముద్రించారు. బస్తాపై ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’అనే నినాదం ముద్రించారు. రూ.50విలువ చేసే ఈ బ్యాగును ఉచితంగానే సన్నబియ్యంతోపాటు అందజేస్తారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం పర్యావరణహితంగా తయారు చేసిన ఈ బ్యాగును అందజేయనున్నారు. కాగా, బియ్యంతోపాటు అప్పట్లో ఇచ్చిన తరహాలో కందిపప్పు, చింతపండు, ఉప్పు, నూనె, పసుపు, గోధుమలు, చక్కెర తదితర సరుకునులను సైతం అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
గంగమ్మ ఒడిలో దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మ ఆలయం నాలుగు రోజులుగా గంగమ్మ ఒడిలోనే కొనసాగుతోంది. ఆదివారం సింగూరు నుంచి విడుదల చేసిన నీటి ప్రవాహం పెరగడంతో, మంజీరా పరవళ్లు తొక్కుతూ ఘనపురం ఆనకట్టపై నుంచి పొంగి పొర్లుతోంది. ఏడుపాయల్లో జలకళ ఉట్టి పడుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి 32,766 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా, ఇరిగేషన్ అధికారులు 43,634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు భద్రతపై డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 520.5 మీటర్ల నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకుని, నీటిని విడుదల చేస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్సై శ్రీనివాస్గౌడ్ తన బలగాలతో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది స్థానికంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజగోపురంలోని దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరవళ్లు తొక్కుతున్న మంజీరా సింగూరు ఇన్ఫ్లో 32,766 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 43,634 క్యూసెక్కులు -
సమీకృత మార్కెట్లు పూర్తయ్యేనా?
● రోడ్లపైనే విక్రయాలు.. వాహనదారులకు ఇక్కట్లు ● మంజూరైనవి 8.. పూర్తయింది ఒక్కటి ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ● కరువైన అధికారుల పర్యవేక్షణ సంగారెడ్డిలో నిలిచిన మార్కెట్ నిర్మాణంసంగారెడ్డి: ఆర్భాటంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో రోడ్లపై విక్రయాలు జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మార్కెట్లను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఒకే చోట మాంసం, చేపలు, కూరగాయల అమ్మకాలు విక్రయించేందుకు సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. ప్రజలు అన్నీ ఒకేచోట కొనుగోలు చేసుకొనే వీలుంటుందని సర్కారు కూడా భావించింది. త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలు మున్సిపాలిటీల్లో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కానీ, ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తికాలేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం నిధులు మంజూరుచేసి టెండర్లు పిలిచింది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో పనులు ప్రారంభించారు. జహీరాబాద్ మినహా ఎక్కడా పనులు పూర్తికాలేదు. గుత్తేదారుల అలసత్వం, అధికారులు నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఎనిమిదికి పూర్తయింది ఒక్కటే.. జిల్లాలో ఎనిమిది వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లు మంజూరైతే.. జహీరాబాద్లో రూ.10కోట్లతో చేపట్టిన మార్కెట్ పూర్తయింది. సదాశివపేటలో రూ.5.5 కోట్లతో నిర్మాణాలు చేపడితే స్లాబుల వరకే పరిమితమైంది. అందోల్–జోగిపేటలో రూ.2కోట్లతో పనులు మొదలు పెట్టినా పునాది స్థాయిలో ఉంది. అలాగే అమీన్పూర్లో రూ.6.4కోట్లతో పనులు చేపడితే అదే పరిస్థితి. సంగారెడ్డిలో రూ.6.7కోట్లతో చేపట్టగా అవి కూడా స్లాబుల వరకే పరిమితమయ్యాయి. తెల్లాపూర్లో రూ.3.9, బొల్లారంలో రూ.6.5 కోట్లతో పనులు ప్రారంభించినా ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నారాయణఖేడ్లో రూ.2.50కోట్లు మంజూరైనా ఇంకా పనులే ప్రారంభించలేదు. త్వరలో అందుబాటులోకిమంత్రి దామోదర చొరవతో పనులు పూర్తయిన జహీరాబాద్ సమీకృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ఇటీవల మంత్రి పర్యటనలో భాగంగా సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మార్కెట్ల నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. పబ్లిక్ హెల్త్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు తొలుత ఆర్భాటంగా పనులు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత బిల్లులు రాక చేతులెత్తేశారు. -
సమాజ శ్రేయస్సుకు సాహిత్యం అవసరం
పుస్తకావిష్కరణలో దేశపతి శ్రీనివాస్ తదితరులు సిద్దిపేటకమాన్: సమాజ శ్రేయస్సుకు సాహిత్యం అవసరమని రచయిత, శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన సుకృతి శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల మధ్య నిలిచే వారు శతక కవులని పేర్కొన్నారు. నాగరికత సారాన్ని తత్వంగా, కవిత్వంగా అందించే సృజనకారులు కవి, రచయితలు ముందు నిలుస్తారన్నారు. జీవితాన్ని తపస్సులా భావించి సాగే రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని, బాలలకు చిన్నతనంలోనే పద్యాలు నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్రెడ్డి, ప్రవీణ్కుమార్, అంజయ్య, దుర్గం శ్రీను, గణేశ్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి బెదిరింపులకు భయపడం
కేంద్రమంత్రి కిషన్రెడ్డివర్గల్(గజ్వేల్): ఎవరి బెదిరింపులకు భారతీయులు భయపడరని, ప్రజాసంక్షేమం, వారి ఆత్మాభిమానమే ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గౌరారం సమీపంలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్యాలయ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇతర దేశాల వ్యవసాయోత్పత్తులు దిగుమతి చేసుకోవాలని కొన్ని దేశాలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గబోమని, ఇలాంటి బెదిరింపులకు బెదరబోమన్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా భారతీయుల సంక్షేమం కోసం మోదీ నిలబడ్డారని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ధాన్యం కొనుగోలు వ్యయం సుమారు రూ. 3వేల కోట్లు ఉండేదని, ప్రధాని మోదీ అయిన తరువాత ఇప్పుడు సుమారు రూ. 26వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం కృషి చేస్తుందని, గడిచిన పదేళ్లలో ధాన్యం కనీస మద్దతు ధరను రూ.1300 నుంచి రూ.2600 పెంచిందని పేర్కొన్నారు. డైరీ ప్రొడక్షన్లో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. సాగులో ఆధునీకత, ఆరోగ్యకర ఉత్పత్తుల కోసం ఎరువుల వాడకం తగ్గించి, నేచురల్ ఫార్మింగ్ వైపు దృష్టి సారించాలన్నారు. -
రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి
సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అందోల్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.44కోట్ల నిధులతో నూతన రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనం తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ జగదీశ్వర్, ఈఈ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
128 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసుల ఆపరేషన్లో పట్టివేత పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటీ చౌరస్తాలో ఆదివారం ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి ముత్తంగి వైపు సర్వీస్ రోడ్డుపై వస్తున్న మహారాష్ట్రకు చెందిన స్విఫ్ట్ డిజైర్, ఒడిశాకు చెందిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో 55 ప్యాకెట్లలో 128 కిలోల గంజాయిని గుర్తించారు. పట్టుబడిన దాని విలువ రూ.64 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఫిరోజ్ అహ్మద్ , మెహబూబ్ అబ్దుల్ అంసారీ , మహ్మద్ ఇర్ఫాన్లతో పాటు ఒడిశాకు చెందిన సగర్ నాయక్ అలియాస్ సగర్ గజపతిలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో రాజ్ కుమార్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర నాసిక్ జిల్లా.. మలేగావ్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో అంగీకరించారు. పోలీసులు వారి వద్ద నుంచి మొత్తం 128 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు రెండు కార్లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. గంజాయి కేసులో కీలకంగా వ్యవహరించిన బీడీఎల్ సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ వెంకటేశం, సంగారెడ్డి జిల్లా ఎస్–న్యాబ్ సీఐ నాగేశ్వర్రావు సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. -
రామకృష్ణకు పద్మచక్ర పురస్కారం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రామకృష్ణ జాతీయ స్థాయి పద్మచక్ర అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. విద్యా,పర్యావరణ పరిరక్షణ రంగంలో చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణను ఎంఈవో శంకర్, కాంప్లెక్స్ హెచ్ఎం రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు అభినందించారు. కార్యక్రమంలో వల్లూరి పౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... కాలనీలోని శ్యామల, యాదగిరి దంపతుల రెండో కుమారుడు ఉప్పు కార్తీక్(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపు తీయగా కార్తీక్ మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. ఈ ఘటనపై విషయం పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డిని వివరణ అడగగా ఆత్మహత్యకు సంబంధించి ఇంకా ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
అద్దె భారం
సదాశివపేట పట్టణంలో అత్యధిక అద్దెలు ఉండే గురునగర్ కాలనీసదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తుండటంతో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హరియాణ, కర్ణాటక, బిహార్, చత్తీశ్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిమంది కార్మికులుగా జీవనోపాధి కోసం వచ్చి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయలతో సతమతమవుతున్న సామాన్యుడికి పెరిగిన ఇంటి అద్దె కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. యజమానులు ఇష్టానుసారం అద్దెలు పెంచడంతో వాటిని చెల్లించలేక సామాన్యులు సతమతమవుతున్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రూ.18 వేలు అందులో ఈస్ఐ, పీఎఫ్ కటింగ్లతోటు డుమ్మాలు కొట్టగా వచ్చేది రూ.13వేల వరకు నెలసరి వేతనం వస్తుంది. వీటితోనే ఇంటి అద్దె, కుటుంబ పోషణ, పిల్లల చదువులకు సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఆస్తిపన్ను పెరగడం వల్లే సదాశివపేట జనాభా 60వేల వరకు ఉంటే అందులో 20వేల వరకు ప్రజలు అద్దె ఇళ్లల్లోనే జీవిస్తున్నారు. పట్టణంలోని శాసీ్త్రరోడ్, తిలక్రోడ్డు, సుభాష్రోడ్డు, గొల్లకేరీ, రహమత్నగర్, ఫయాజ్నగర్, రాఘవేంద్రనగర్, తదితర కాలనీల్లో అద్దె ఇళ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల అద్దె రూ.7 వేలపైమాటే, అంతేకాకుండా మేడమీద చిన్న గది అద్దెకు కావాలన్నా రూ.4 వేలపైమాటే. ఇంటి నల్లా పన్ను, భవన నిర్మాణ వ్యయం, ఆస్తిపన్ను భారీగా పెరిగినందువల్లేనని తెలుస్తోంది. దీంతో పేద ప్రజలు పట్టణానికి సుమారు 2 లేదా 3 కిలోమిటర్ల దూరంలో ఉన్న సిద్దాపూర్ కాలనీ, హనుమాన్నగర్ కాలనీతోపాటు పరిశ్రమలున్న గొల్లగూడెం, నందికంది, కంబాలపల్లి, మద్దికుంట గ్రామాల్లో తక్కువ రూ.2000 నుంచి రూ.3000ల లోపు అద్దె ఇళ్లను తీసుకుంటున్నారు.వాణిజ్య సముదాయాల అద్దె కూడా.. పట్టణంలోని ప్రధాన రహదారి గాంధీచౌక్, బుక్కకేరి, పట్టలకేరి, సుభాష్రోడ్డు, శాసీ్త్రరోడ్డు, తిలక్రోడ్డు, వికారాబాద్రోడ్డు, అయ్యప్ప మందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్న వాణిజ్య దుకాణాల సముదాయాల అద్దెలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. రెండు మూడేళ్ల క్రితం గరిష్టంగా దుకాణాల అద్దె రూ.10వేలు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారని వ్యాపారులు వాపోతున్నారు. అద్దెలు పెంచడమే కాకుండా అడ్వాన్సుగా రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అద్దె స్థలాన్ని బట్టి పెంచుతున్నారు. దీంతో తక్కువ అడ్వాన్సులు, అద్దెలు ఉన్న ప్రాంతాల్లో దుకాణాలను పెట్టుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం స్పందించి అద్దెలపై నియంత్రణ విధించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.చుక్కల్లో ఇళ్ల కిరాయిలు.. చిక్కుల్లో ప్రజలు సామాన్య మధ్యతరగతికి తప్పని తిప్పలు పరిశ్రమల ఏర్పాటుతో మారిన పరిస్థితులు -
విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంపొందించాలి
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఆసక్తిని పెంపొందించాలని టెన్నిస్, వాలీబాల్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ వాంగ్వాడ్ పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని, ఓటమితో నిరాశ చెందకుండా విజయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వాలు క్రీడారంగానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర టెన్నిస్, వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గణేశ్ మాల్వే, వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ కోరాడే, సిద్దిపేట జిల్లా టెన్నిస్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్కే హైదర్పటేల్, జిల్లా సెక్రటరీ నవీన్, పీడీ గోవర్ధన్రెడ్డి, పీఈటీ నరేశ్ కుమార్, సందీప్, కిరణ్, భాను తదితరులు పాల్గొన్నారు. -
మీనం.. సిద్ధం!
● చేప పిల్లల పంపిణీకి సన్నద్ధం ● నేటి నుంచి 30 వరకు టెండర్ల ప్రక్రియ ● 36,029 హెక్ట్టార్ల విస్తీర్ణంలో చెరువులుసంగారెడ్డి జోన్: జిల్లాలోని జల వనరులలో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ ప్రారంభంలో అంతగా వర్షాలు కురవక పోయినప్పటికీ.. ప్రస్తుతం భారీగా వర్షాలు కురిసి నీటి వనరులు నిండుకుండలా మారాయి. జిల్లా వ్యాప్తంగా 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135నీటి వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు మూడు, 79 పెద్ద చెరువులు, 1053 చిన్న చెరువులు ఉన్నాయి. 234 సంఘాలు ఉండగా.. 12,889 సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలు గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు వాటిని పెంచుతుంటారు. అనంతరం వాటిని పట్టుకొని విక్రయించి జీవనం సాగిస్తుంటారు. గత సంవత్సరం జిల్లాలో 68 లక్షల 31వేల 132 చేప పిల్లలను వదిలినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈసారి నాలుగు రకాల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. బొచ్చ, రవుట, బంగారు తీగ, మోసు రకం వంటి చేప పిల్లలను వదులుతున్నారు. 8200 మీ.మీల సైజు గల చేప పిల్లలను పంపిణీ చేస్తారు. వీటి వివరాలు తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈసారి చేప పిల్లలతో పాటు రొయ్యలను పంపిణీ చేయబోతున్నామని ఇటీవల మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. -
క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
సంగారెడ్డి క్రైమ్: ఇటీవల సైబర్ నేరగాళ్ల దృష్టి గ్రామీణ ప్రజలపై పడింది. ప్రధానంగా వారే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. అవగాహన లేకపోవడంతో, అత్యాశతో మరికొందరు సైబర్ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెలిగ్రామ్ లింకులు, వాట్సాప్ కాల్స్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన ఉంటే సైబర్ దాడులను అరికట్టవచ్చని నిపుణులు, సైబర్ అధికారులు సూచిస్తున్నారు. వివిధ రూపాల్లో.. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అవగాహన రావడంతో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి పలువురికి పోలీస్ అధికారి డీపీతో కూడిన వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ లింకులు తరచుగా వస్తున్నాయి. మీ కుమారుడు డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడని, తప్పించాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ లింకుల నుంచి డబ్బు ఆశ వల వేయడంతో మోసపూరిత లింకులు ఓపెన్ చేసి ఖాతా వివరాలు చెప్పడంతో నష్టపోతున్నారు కొందరు. లింకులు ఓపెన్ చేస్తే అకౌంట్ నుంచి నగదు మాయమవుతుంది. కాగా ఎలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఘటనలు ● ఈ నెల 12న తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. అందులో తన వివరాలు నమోదు చేశాడు. నిర్వాహకుడు చెప్పిన విధంగా కొద్ది రోజులుగా ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. మొత్తం రూ.49 లక్షల 40 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో తాను స్టాక్ మార్కెట్లో పెట్టిన నగదుతోపాటు లాభాలు ఇవ్వాలని బాధితుడు అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ● గత నెల 29న పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్లో లింకు పంపించారు. లింకును ఓపెన్ చేయాలంటే కనీసం రూ.5వేలతో టాస్క్ కంప్లీట్ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. అది నమ్మిన బాధితుడు రూ.2లక్షల 50 వేలను పెట్టుబడి పెట్టాడు. వారం తర్వాత డబ్బులు విత్డ్రా కాకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేక్ కాల్స్ నమ్మొద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫేక్ ఫోన్ కాల్స్, లింకులను నమ్మి మోసపోవద్దు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి. మోసపోయిన గంటలోపు(గోల్డెన్ అవర్)లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశముంటుంది. – వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ, సైబర్ క్రైమ్ ఫేక్ లింకులు పంపుతూ సైబర్ మోసాలు టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్తో బ్లాక్ మెయిల్ అవగాహన లేక మోసపోతున్న ప్రజలు -
కనీస వేతనాల అమలులో విఫలం
పటాన్చెరు టౌన్: కాంటాక్ట్ కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించి, వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి జరుగుతున్న క్యాంపెయిన్లో భాగంగా శనివారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులతో క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ.. 2007 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు జీవోలను సవరించకపోవడం అత్యంత దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు సవరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. జిల్లాలో 1700 పరిశ్రమలు ఉన్నాయని, సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి సమస్యలను గుర్తించి పోరాటం నిర్వహిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఎక్కడికక్కడ జరిగే పోరాటాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు విష్ణు, గంగాధర్, కార్మికులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు -
కేంద్ర మంత్రిని కలిసిన జవాన్ కుటుంబ సభ్యులు
కొమురవెల్లి(సిద్దిపేట): ఇటీవల అదృశ్యమైన ఆర్మీ జవాన్ అనిల్ కుటుంబ సభ్యులు శనివారం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో జవాన్ భార్య అనూష, తల్లి మంగమ్మ తదితరులు ఉన్నారు. నూతన నియామకం జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పనూతల కౌశిక్ గౌడ్ జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేతులమీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జాతీయ జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేశారని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకు లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీటిని వేడి చేసి తాగాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నాగభూషణం శనివారం తెలిపారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని శుద్ధిచేసి క్లోరినేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం రీత్యా ప్రతి ఒక్కరూ తాగునీటిని వేడి చేసిన తరువాత మాత్రమే వాడుకోవాలన్నారు. తాగునీటి విషయంలో చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గృహిణి అదృశ్యం పటాన్చెరు టౌన్: గృహిణి అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో శాంతాబాయి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో జులై 27న ఆమెను చూసేందుకు సోదరి లక్ష్మి వెళ్లింది. అయితే అక్కడి నుంచి శాంతాబాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని ఇంటి యజమాని తెలిపాడు. దీంతో ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. చుట్టుపక్కల స్థానికంగా, స్వగ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. క్షుద్రపూజల కలకలం భయాందోళనలో స్థానికులు చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక బస్స్టాండ్ సమీపంలోని ఓ దుకాణం ఎదుట షాప్ యజమాని ఫొటోను ఉంచి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నల్లటి బొమ్మ పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఉండటాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షాపు ఎదుట క్షుద్రపూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు. కానీ ఈ ఘటన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. షాపు యజమాని ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ తెలిపారు. -
యూట్యూబ్లో చూసి చోరీలు
మెదక్ మున్సిపాలిటీ: చెడు అలవాట్లకు బానిసై దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు కటకటాల పాలయ్యారు. శనివారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7న పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు చోరీపై కేసు నమోదు చేసిన సీఐ మహేశ్ తన బృందంతో దర్యాప్తులో భాగంగా అనుమానితులుగా భావించి నిందితులను పట్టుకోవడంతో చోరీలు బయట పడినట్లు తెలిపారు. వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన గూడెపు శ్రీకాంత్, చర్ల లింగం, కట్ట ప్రసాద్ చెడు అలవాట్లకు బానిసయ్యారు. ఈజీ మనీ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. గత నెలలో ట్రాక్టర్తో గుమ్మడిదల క్రాస్ రోడ్డులో గల ఏటీఎంకు తాడు కట్టి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏటీఎం నుంచి సైరన్న్ రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. గత నెల 30న వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు గోడను పగులగొట్టి లోపల ఏటీఎం చోరీకి యత్నించారు. సైరన్న్మోగడంతో పరారయ్యారు. ఈనెలలో శ్రీకాంత్, లింగంలు కలిసి గుమ్మడిదలలోని భవాని వైన్న్ షాపు గోడకు రంధ్రం వేసి ఖరీదైన మద్యం బాటిళ్లు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈనెల 7న మెదక్ పట్టణం ఆటోనగర్లో గల ఎస్బీఐ(ఏడీబీ) బ్యాంకులో చోరీకి యత్నించి విఫలమయ్యారు. అదే రోజు రాత్రి కౌడిపల్లిలో గల వైన్న్షాప్లో లిక్కర్ దొంగతనం చేశారు. నిందితుల్లో ఒక్కడైన లింగం తన బైక్ను ఫైనాన్స్ నుండి విడిపించుకునేందుకు తన స్నేహితులు శ్రీకాంత్, కట్ట ప్రసాద్లతో కలిసి చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. అలాగే నిందితులు ఉపయోగించిన ట్రాక్టర్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో పాపన్నపేట మండలం పేరూర్ గ్రామానికి చెందిన ఆటో దొంగ పక్రుద్దీన్ను సీసీ టీవీల ఆధారంగా పట్టుకున్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన మెదక్ టౌన్న్ సీఐ మహేశ్, టీం సభ్యులు ఎస్ఐ అమర్, తదితరులను, కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్యను ఎస్పీ, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్ అభినందించారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు దొంగలు నగదు , మద్యం బాటిళ్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ -
చాలా పక్షులు వస్తున్నాయి
వలసొచ్చిన కొంగలు వాగులు, పొలాల వద్ద సంచరిస్తున్నాయి. గుడ్లు పెట్టి పిల్లలను కూడా కంటున్నాయి. ఇది వరకు వలస వచ్చిన పక్షులు తిరిగి వానాకాలం చివరి వారంలో వెళ్లిపోయేవి. కానీ ఇవి ఇక్కడే జీవిస్తున్నాయి. – రాజయ్య, రైతు, మిరుదొడ్డి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి సైబీరియన్ కొంగలు పెట్టిన గుడ్లను కోతులు నాశనం చేస్తున్నాయి. వాటి ఉనికికి ప్రమాదం పొంచి ఉంది. గూళ్లు కట్టుకుని పిల్లలను పొదిగే వరకు వలస పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవరం ఉంది. – సూకూరి ప్రవీణ్, కేరింగ్ సిటిజెన్ కలెక్టివ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ -
ఎగిరొచ్చిన అతిథులు
సైబీరియన్ కొంగలు ఖండాలు దాటి వచ్చి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పలు చెరువులను విడిదిగా మార్చుకుంటున్నాయి. ఏకంగా సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి వలస వస్తున్న ఈ పక్షులను చూస్తే ఔరా అనాల్సిందే. ఆహార అన్వేషణలో యూరప్ రష్యా నుంచి స్నో వైట్, గ్రే కలర్ కలిగిన రెండు రకాల కొంగలు వలస వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక్కడే గూళ్లు కట్టుకుని వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. వలస వస్తున్న సైబీరియన్ పక్షులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – మిరుదొడ్డి(దుబ్బాక):● వలసొస్తున్న సైబీరియన్ కొంగలు ● ఆహారాన్వేషణలో 7వేల కి.మీ. ప్రయాణించి.. ● మధ్య ఆసియా నుంచి మన దేశానికి ● ఇక్కడే గూళ్లు కట్టుకుని సంతతి వృద్ధి ● ఆనందం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు సైబీరియన్ పక్షులు దృఢమైన మూరెడు ముక్కుతోపాటు, పొడవైన తల. విహంగాల్లాంటి పెద్ద పెద్ద రెక్కలు. తెలుపు, నలుపు, గులాబీ రంగులతో దట్టమైన ఈకలు. ఒకేసారి లంఘించి ఎగరడానికి బారెడు కాళ్లు. సుమారు 8 నుంచి 10 కిలోల బరువున్న సైబీరియన్ కొంగలు అవలీలగా ఆకాశంలో ఎగురుతాయి.ఆకట్టుకుంటున్న కొంగలు ఆహార సేకరణలో భాగంగా సైబీరియన్ కొంగలు చెరువులు, కుంటల్లో ఉండే చేపలు, పురుగులను వేటాడి తింటున్నాయి. ఉదయం ఆహార సేకరణ కోసం చెరువులను ఆశ్రయిస్తుండటంతో సందడిగా మారుతోంది. స్వదేశీ కొంగలతో కలిసిపోయి పొలాల గట్లపై వాలుతున్నాయి. చెరువులు, కుంటలు, పొలాల గట్లపై గుంపులు గుంపులుగా కనిపిస్తున్న ఈ కొంగలను చూసి రైతులు, సందర్శకులు తిలకిస్తున్నారు. సాయంత్రం అయితే అవి ఏర్పాటు చేసుకున్న గూళ్లకు వెళ్తున్నాయి.ఆహారాన్వేషణలో... మధ్య ఆసియా యూరోప్ రష్యాలోని నైజీరియా అతి పెద్ద శీతల దేశం. ప్రపంచ దేశాల్లో వేసవి కాలం సుమారు మూడు నెలలు ఉంటే ఇక్కడ ఒక నెల మాత్రమే ఉంటుంది. మే చివరి వారం నుంచి జూన్ చివరి వారం వరకు ఉంటుంది. మిగతా కాలాలు ఎక్కువగా మంచుతో నిండి ఉంటాయి. దీంతో అక్కడ జంతు జాలం మనుగడ సాగించడం కష్టంగా మారుతుంది. చెరువులు, సరస్సులు, నదులు మంచుతో నిండి ఉండటంతో అక్కడ జీవించే సైబీరియన్ పక్షులకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆహారం కోసం ఖండాంతరాలు దాటి భారతదేశం వైపు వలసలు ప్రారంభిస్తాయి. ముఖ్యంగా బీహార్లోని రాజ్కోట్, మహారాష్ట్రలోని పుణేకు భారీగా వలస వస్తాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని కొల్లేరు, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాకు వస్తుంటాయి. మిరుదొడ్డిలోని పెద్ద చెరువును విడిది చేసుకుని ప్రతి యేడాది రాకపోకలు సాగిస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు వేసవి ఉంటుంది. ఇక్కడి చెరువులు, సరస్సులు, రిజర్వాయర్లు, వాగులు వంకల్లో నీటి వనరులు తగ్గిపోవడంతో అందులో లభించే చేపలు, పురుగులను తింటూ కాలం గడుపుతాయి.చెరువులో సందడి చేస్తున్న సైబీరియన్ పక్షులుసంతతి కోసం... సైబీరియన్ కొంగల జీవిత కాలం సుమారు 28 ఏళ్లు. గుడ్లు పెట్టి తమ సంతతని పెంచుకుంటాయి. ప్రతి యేడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఖండాలు దాటి వస్తున్నాయి. తమ సంతతిని పెంచుకోవడానికి మండల కేంద్రమైన మిరుదొడ్డితో పాటు, లక్ష్మీనగర్, అందె, చెప్యాలతో పాటు, కూడవెల్లి వాగు పరిసరాల్లో గుడ్లు పెట్టి పొదగడానికి దృఢమైన పక్షి గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పక్షులు 60 నుంచి 70 రోజుల వరకు ఆహారాన్ని సంపాదించుకోలేవు. తల్లి పక్షులే పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. 70 రోజుల తర్వాత పిల్లలు స్వతహాగా ఎగరడమే కాకుండా ఆహారాన్వేషణలో పడతాయి. -
ప్రమాదంలో ‘సింగూరు’.!
మెదక్ అర్బన్ : రోజు రోజుకు పెరుగుతున్న వరదతో సింగూరు ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడింది. దీంతో దిగువన ఉన్న ఘనపురం ప్రాజెక్టు రైతాంగం ఆందోళనకు గురవుతుంది. అయితే 520 మీటర్ల నీటిమట్టాన్ని కాపాడుతూ అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఘనపురం ఆనకట్ట మాత్రం 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకునే శక్తి ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యమే ముంచుకొచ్చిందా..! మంజీరా నదిపై 1986లో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. నిల్వ నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు. ఇందులో పరిమితికి మించిన నీటిని నిల్వ ఉంచడం ద్వారా ప్రాజెక్టు రివిట్మెంట్, మట్టికట్ట, పారాపిట్ వాల్లు దెబ్బతిన్నాయని జూన్ 23న పర్యవేక్షించిన ఆనకట్ట భద్రతా కమిటీ పేర్కొంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, 520 మీటర్ల కన్నా ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించింది. అయినా వేసవిలో కేవలం రూ. 20 లక్షలతో రివిట్మెంట్ వెంట ఇసుక సంచులు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో 31,400 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో 6 నుంచి 11వ వరకు గేట్లు ఎత్తి 43,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నలకు శాపం నాడు నీటిని విడువలేదు.. నేడు వద్దన్నా విడుస్తున్నరు 3 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఘనపురానికి ఢోకాలేదుఘనపురం ఆనకట్ట భద్రమేనా! సింగూరు ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే ఘనపురం ఆనకట్ట ఎంత వరకు భద్రమన్న ఆందోళన రైతులలో వ్యక్తమవుతుంది. గతంలో 1984లో సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా ఆనకట్టకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని రిటైర్డ్ ఈఈ పేర్కొన్నారు. అయితే ఆయకట్టు ప్రాంతాలు , పంటలు మునిగి భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. వెంటనే అధికారులు ఎలాంటి ప్రమాదం రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మూడు రోజుల్లో నీరు విడుదల
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు ఆయకట్టు కింద పంటల సాగుకోసం చర్యలు తీసుకున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. శనివారం నల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల సాగు కోసం చర్చించారు. నల్లవాగు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తు తం కృష్ణాపూర్ వరకు కాల్వల్లో పనులు పూర్తి చేశామని చెప్పారు. చివరి ఆయకట్టు కల్హేర్ వరకు కాల్వల్లో పనులు చేస్తామన్నారు. ప్రాజెక్టులో ప్రస్తు తం 1,488 ఫీట్లు నీటి నిల్వ ఉందన్నారు. మరో మూడు రోజుల్లో ఆయకట్టు కింద పంటల సాగు కోసం నీటి విడుదల చేస్తామన్నారు. రైతులు పంటల సాగుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఏఈ శివధర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జైరాజ్, గంగారాం పాల్గొన్నారు. నల్లవాగు ఆయకట్టు కిందసాగుకు ఏర్పాట్లు చేసుకోండి రైతులతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
పంట కాల్వకు గండి
సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి డ్యాం ఎగువ భాగం నుంచి వరద నీరు రావడంతో 6, 8, 9, 10, 11 నంబర్ గేట్లను ఎత్తి 43,176 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 68,185 క్యూసెక్కుల వరద రాగా.. ప్రాజెక్టులో 22 టీఎంసీలకు నిల్వ ఉంచి మిగతా నీటిని వదిలి పెడుతున్నారు. పర్యాటకులను డ్యాం పైకి రానీయకుండా పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇసోజిపేట వద్ద కాల్వకు గండి పడింది. అలాగే.. ముదిమాణిక్యం వద్ద కాలువ నీరు పొంగి పొర్లడంతో వరి చేలు మునిగిపోయాయి. వంద ఎకరాల్లో పంట మునగడంతో రైతులు ఆందోళన చెందారు. – పుల్కల్(అందోల్) -
ఈసీఈలో అరుణ్ జ్యోతికి పీహెచ్డీ
పటాన్చెరు: పటాన్చెరు మండలం రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం పరిశోధక విద్యార్థిని అరుణ్ జ్యోతి డాక్టరేట్కు అర్హత సాధించారు. ‘కమ్యూనికేషన్ అప్లికేషన్ల కోసం డిజిటల్ ఫిల్టర్ల ఎఫ్జీఏ ఇంటిగ్రేషన్ కోసం డిజైన్ విధానాలు’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ జయశ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మంజీరా వంతెన పరిశీలనహత్నూర (సంగారెడ్డి): మంజీరా నది ప్రవాహం వల్ల హత్నూర మండలం కొన్యాల గ్రామ శివారులోని నదిపై ఉన్న వంతెనను తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎస్ఐ శ్రీధర్రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. వంతెన పై నుంచి వాహనదారులు, ప్రజలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు, పశువుల కాపరులెవరూ మంజీరా పరీవాహక ప్రాంతంలోకి రావొద్దని సూచించారు. కొన్యాలలోని శిథిలావస్థలో ఇళ్లలో నుంచి కుటుంబాలను తరలించారు. బలవంతంగాభూ సేకరణ చేపట్టొద్దుకార్మిక సంఘం అధ్యక్షుడు రాంచందర్ జహీరాబాద్ టౌన్: బలవంతంగా భూసేకరణ చేపట్టరాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని శ్రామిక్ భవనంలో శనివారం ఎల్గోయి గ్రామ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సేకరణ విషయంలో గత ప్రభుత్వం తరహా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిమ్జ్ కోసం గ్రామంలో ఇప్పటికే వేల ఎకరాల భూమిని సేకరించారన్నారు. సేకరించిన భూముల్లో పరిశ్రమల జాడలేదని, తాజా మరో 200 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ వేయడం శోచనీయమన్నారు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా పంటలు పండే భూములను తీసుకోవద్దన్నారు. నోటిఫికే షన్ను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకలు ఎస్ కుమార్, బి.నర్సింలు, తుల్జరాం, శంకర్, గోపాల్ రైతులు పాల్గొన్నారు. సంపన్నులకే స్వాతంత్ర ఫలాలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర ఫలాలు సంపన్నులకే చెందుతున్నాయని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో ‘79 ఏళ్ల భారతదేశ స్వాతంత్య్రం – రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. దేశంలో 200 మంది కోటీశ్వరుల ఆస్తులు కేవలం 40 శాతం మంది ప్రజల ఆస్తితో సమానంగా ఉందన్నారు. ఒక శాతం మంది చేతుల్లో 50 శాతం ఆస్తి పోగు పడిందని, కానీ దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 42 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. -
గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ
శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకునిసంగారెడ్డిలోని మురళీకృష్ణ ఆలయంలో శనివారం ఘనంగా వేడుకలను జరిపారు. వేకువ జామునే స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మహా హారతి ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తి గీతాలపై చిన్నారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సరస్వతి శిశుమందిర్లో విద్యార్థులంతా రాధా కృష్ణుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
నారింజ వాగు ఉధృతం
బూచినెల్లి రోడ్డు మూసివేత జహీరాబాద్ టౌన్: భారీ వర్షాలకు బూచినెల్లి–ఘనాపూర్ గ్రామాల మధ్యన ఉన్న నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీగా వరద నీరు రావడంతో గేట్లను ఎత్తివేసి నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. దీంతో బూచినెల్లి గ్రామ సమీపంలో ఉన్న నారింజ వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగుపై నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారడంతో ప్రమాదాల నివారణ కోసం రోడ్డును మూసేశారు. చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి, రెవెన్యూ అధికారులు రోడ్డుకు అడ్డంగా ముళ్ల పొదలు వేసి రాకపోకలను నిలిపేశారు. గత సంవత్సరం వాగును బైక్తో దాటుతూ ఒకరు గల్లంతవగా.. మరొకరు ముళ్ల పొదలు పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మండలంలోని అల్గోల్–పోట్పల్లి రోడ్డును కూడా జహీరాబాద్ రూరల్ పోలీసులు మూసేశారు. -
అలుగులు పారిన చెరువులు
ఎడతెరపి లేకుండా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో అందోల్, వట్పల్లి మండలాల్లో చెరువు కుంటలు అలుగులు పారుతున్నాయి. దీంతో పాటు పలుచోట్ల ఇళ్ల గోడలు కూలాయి. పంటలు నీట మునిగాయి. వట్పల్లి మండలం కేరూర్ గ్రామంలో ఊరకుంట చెరువు అలుగుపారడంతో పలు కాలనీలకు వెళ్లే రోడ్డు నీట మునిగి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. గౌతాపూర్, ఉసిరకపల్లి గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలిపోయాయి. అందోల్ మండలంలోని కన్సాన్పల్లి పెద్ద చెరువు అలుగు పారడంతో చేపల కోసం గ్రామస్తులు పరుగులు తీశారు. భారీ వర్షాంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. – వట్పల్లి(అందోల్): -
అప్రమత్తంగా ఉండండి
ఎస్పీ పరితోశ్ పంకజ్ కొండాపూర్(సంగారెడ్డి): జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కొండాపూర్– తేర్పోల్ గ్రామాల మధ్య గల వాగును పరిశీలించారు. రెండు గ్రామాల మధ్య గల వాగు ఉధృతి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ రహదారి వెంట రాకపోకలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఇటువైపు రాకుండా తగిన ఏర్పాట్లను చేయాలని తహసీల్దార్ అశోక్కు సూచించారు. ఎస్పీ వెంట సీఐ సుమన్కుమార్, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ గంగారం వాగును పరిశీలించారు. -
ఉధృతంగా డబ్బవాగు
తాటిపల్లి డబ్బవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దచల్మెడ, చిన్నచల్మెడ, ఖమ్మంపల్లి గ్రామాల చీలవాగు, పిల్లోడి సవుటాగు, తాటిపల్లి డబ్బవాగు, బొడ్చట్పల్లి, లింగంపల్లి గ్రామాల మధ్య కల్వర్టుపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు వ్యవసాయ భూముల్లో నీరు నిలవడంతో పత్తి పంటలు ఎర్రబారుతున్నాయి. గుంతపట్టు భూములలో పత్తి పంటలో నీరు నిల్వ ఉండటంతో పత్తి పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – మునిపల్లి(అందోల్): -
కల్హేర్లో ఇంకా లోటే..
● సాధారణ వర్షపాతం కంటే41 శాతం తక్కువ ● ఐదు మండలాల్లో అధిక, రెండు చోట్ల అత్యధిక వర్షపాతం ● 17 మండలాల్లో సాధారణవర్షపాతం నమోదుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కల్హేర్ మండలంలో వర్షపాతం మాత్రం ఇప్పటికీ లోటులోనే ఉంది. ఇక్కడ సాధారణం కంటే 41 శాతం తక్కువ వర్షం పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వర్షాకాలం సీజను ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వరకు ఈ మండలంలో సాధారణ వర్షపాతం 432 మి.మీలు కాగా, ఇప్పటి వరకు కేవలం 253 మి.మీల వర్షమే పడింది. జిల్లాలో ఈ ఒక్క మండలంలోనే లోటు వర్షపాతం కొనసాగుతుండటం గమనార్హం. కల్హేర్కు సమీపంలో ఉన్న సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట మండలాల్లో సాధారణ వర్షపాతమే రికార్డు అయింది. కానీ ఈ ఒక్క మండలంలోనే ఈ పరిస్థితి కొనసాగడం గమనార్హం. ఏటా జూన్ మొదటి వారం నుంచి వర్షాకాలం సీజను ప్రారంభమవుతుంది. జూన్ 1 తేదీ నుంచి వర్షపాతాన్ని లెక్కిస్తారు. పుల్కల్, ఝరాసంగంలో పుష్కలంగా జిల్లాలో పుల్కల్, ఝరాసంఘం మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. ఈ రెండు మండలాల్లో సాధారణ వర్షం కంటే వరుసగా 70 శాతం. 61 శాతం అఽధిక వర్షం పడింది. పుల్కల్లో ఈ వర్షాకాలం సీజనులో ఇప్పటి వరకు 399 మి.మీల వర్షం సాధారణం కాగా, ఏకంగా 677 మి.మీల వర్షం పడింది. అలాగే ఝరాసంగంలో 380 మి.మీ.లు సాధారణ వర్షపాతం కాగా, ఇక్కడ 613 మి.మీల వర్షం కురిసింది. ఎనిమిది మండలాల్లో అధిక వర్షం జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఇప్పటి వరకు అధిక వర్షం పడింది. కంగ్టి, నాగల్గిద్ద, రాయికోడ్, న్యాల్కల్, మునిపల్లి, వట్పల్లి, రామచంద్రాపురం, చౌటకూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఎనిమిది చోట్ల సాధరణం కంటే సుమారు 20 శాతం నుంచి 50 శాతం వరకు ఎక్కువ వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సీజను ప్రారంభంలో ఆశించిన మేరకు వర్షాలు కురియకపోవడంతో చాలా మండలాలు లోటులోనే ఉండిపోయాయి. పక్షం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లోటు మండలాలు కాస్త సాధారణం, అధిక, అత్యధిక వర్షపాతం నమోదైన మండలాల జాబితాలోకి వచ్చాయి. 17 మండలాల్లో సాధారణ వర్షమే.. జిల్లాలో 32 మండలాలు ఉన్నాయి. శనివారం వరకు 17 మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. సిర్గాపూర్, నారాయణఖేడ్, మనూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, కొహీర్, ఆందోల్, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, కంది, పటాన్చెరు, అమీన్పూర్, నిజాంపేట మండలాల్లో సాధారణ వర్షపాతమే కురిసింది. -
పంట.. వర్షం తంటా!
పొలాల్లో నిల్వ నీరు● దెబ్బతింటున్న పంటలు ● ఆందోళనలో రైతులున్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో వారం రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. తేమ అధికం కావడంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా పంటలను రక్షించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 7.50 లక్షలు ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే.. ఇప్పటి వరకు 6,88,50 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా 3,45,954 ఎకరాల్లో పత్తి పంట, 1,21,535 ఎకరాల్లో వరి, 67,556 ఎకరాల్లో సోయా, 73,557 ఎకరాల్లో కంది, 12,071 ఎకరాల్లో పెసర, 9,688 ఎకరాల్లో మినుము చేసుకోగా మిగిలిన 1,20,000 ఎకరాలో్ల్ చెరకు, జొన్న, మొక్క జొన్న తదితర పంటలను రైతులు సాగు చేసుకున్నారు. వారం నుంచి వానే వాన వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిత్యం కురుస్తుండటంతో పంట పొలాల్లో నీరు నిలబడుతుంది. దీంతో తేమ అధికమై పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా సాగు చేసిన పత్తి పంటలో నీరు నిలబడి అది పచ్చగా మారుతుంది. లోతట్టు ప్రాంతాల్లో పంటలు అధికంగా దెబ్బతింటున్నాయి. పెసర, మినుము, సోయా తదితర పంటలు కూడా దెబ్బతింటున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కురిస్తే పంటలు అధికంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు చూసుకోవాలి. పంట పొలాల్లోంచి నీరు బయటకు వెళ్లేలా కాల్వలను తీసుకోవాలి. పంటలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏఓలు, ఏఈఓలకు సూచించాం. శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి–సంగారెడ్డి పంటలు దెబ్బతింటున్నాయి నాకున్న ఎనిమిది ఎకరాలు, మరో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నా. నెలాఖరులో కురిసిన వానల వల్ల పంటలు బాగుండగా, కొన్ని రోజుల నుంచి రోజు వానలు పడుతుండటంతో పొలంలో నీరు నిలబడి పంట దెబ్బతింటుంది. కౌలుకు తీసుకొని రూ.లక్షల పెట్టుబడి పెట్టాం. – నిరంజన్, రైతు, ముంగి గ్రామం -
తీర్థంతోపాటు ప్రసాదం
నాచగిరిలో ప్రారంభం వర్గల్(గజ్వేల్): నాచగిరిలో భక్తులకు ఇక తీర్థంతోపాటు ప్రసాద వితరణ జరగనుంది. నిన్నటి వరకు నివేదన సమయంలో మాత్రమే భక్తులకు ప్రసాద వితరణ జరిగేది. ఇపుడు గుడి తెరిచిన వేళ స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తునికి తీర్థంతోపాటు ప్రసాద వితరణ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం నాచగిరి లక్ష్మీనృసింహుని సన్నిధిలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ రవీందర్గుప్తా ప్రారంభించారు. వ్రత శోభితం స్వాతంత్య్రదినోత్సవ వేళ నాచగిరి భక్తులతో కిటకిటలాడింది. పెద్దసంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. వ్రతమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. -
అవగాహన కల్పిస్తున్నాం
మహిళా స్వయం సహాయక సంఘాల్లో కొత్తగా కిశోర బాలికలను చేర్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారితో పాటు వికలాంగులు, వృద్ధులకు సంఘాలు ఏర్పడతాయి. గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ రకాల రుణాలు అందజేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. – సూర్యారావు, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి -
కిశోర బాలికలకు వరం
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను తీసుకువచ్చింది. అందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్లు ఉన్న వారు కిశోర బాలికల సంఘం, 18 ఏళ్లు పైబడిన మహిళలు మహిళా సంఘం, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఘం, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారిని దివ్యాంగుల సంఘంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కిశోర బాలికలకు ఆరోగ్యంపై.. జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం అందించే చేయూతతో ఆర్థికంగా బలపడుతున్నాయి. లోన్లు తీసుకున్న వారు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా వచ్చిన లాభంతో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. 15 సంవత్సరాలు నిండిన బాలికలకు కిశోర బాలికల సంఘంగా ఏర్పాటు చేసి వారికి రక్షణ విషయంలో తీసుకోవాల్సినటువంటి అంశాలపై చైతన్యం కల్పిస్తున్నారు. బాలికలకు స్వయం రక్షణ, హెల్త్, పొదుపు వంటి అంశాలపై, యుక్త వయసులో వచ్చే మార్పులు, ఆరోగ్య విషయాలను వివరిస్తున్నారు. వీరితోపాటు గ్రామంలోని దివ్యాంగులు, వృద్ధులకు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి సభ్యత్వం కల్పించి, ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో 695 సంఘాలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం లక్షా 95 వేల మంది మహిళలు సంఘం సభ్యులుగా ఉన్నారు. అందులో 695 గ్రామ సమాఖ్య సంఘాలు ఉన్నాయి. కిశోర బాలికలకు అవగాహన కోసం గ్రామీణాభివృద్ధి సంస్థ, మండల స్థాయి అధికారులకు జిల్లాలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శిక్షణనిచ్చి జీవనోపాధి కల్పించడానికి పలు అవకాశాలు కల్పించనున్నారు. 60 దాటితే వృద్ధులు.. వైకల్యం ఉంటే దివ్యాంగుల సంఘం వివరాలు సేకరిస్తున్న అధికారులు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు -
అలుగు పారుతున్న జగిర్యాల చెరువు
మొన్న బీటలు.. నేడు పచ్చబడివర్షాలు లేక ముందు.. బీటలు బారిన వరి మడిఇటీవల కురిసిన వర్షాలకు పచ్చబడిన మడిరేగోడ్(మెదక్): మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రాత్రి ఏకధాటిగా వర్షం పడటంతో పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. జగిర్యాల చెరువు అలుగు పారుతోంది. చెరువును చూసేందుకు పర్యావరణ ప్రేమికులు తరలి వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐలు ఫెరోజ్, విజయలక్ష్మి చెరువును సందర్శించారు. చెరువు అలుగు పారుతుండటం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని తహసీల్దార్ సూచించారు.జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నర్సింహులు వానాకాలం సీజన్లో రెండెకరాల్లో వరి సాగు చేశాడు. వర్షాలు సకాలంలో కురవక రెండు వరి మడులు నీళ్లు లేక బీటలు బారాయి. బోరులో కూడా నీరు తగ్గడం వల్ల పొలానికి నీరు అందలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి బీటలు పడిన మడి నీటితో నిండి వరి పొలం పచ్చబడింది. -
జవాన్ను వెతకడంలో చొరవ చూపాలి
కొమురవెల్లి(సిద్దిపేట): ఇటీవల మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అనిల్ పంజాబ్లో విధులు నిర్వహిస్తూ అదృశ్యమయ్యాడు. అతడిని వెతకడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జవాన్ కుటుంబ సభ్యులను నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశం కోసం కుటుంబాన్ని వదిలి విధులు నిర్వహిస్తున్న జవాన్ అదృశ్యమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించినా ఫలితం లేదన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జవాన్ ఆచూకీ కనిపెట్టి కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాడూరి రవీందర్, తేలు ఇస్తారి, అత్తిని శారద తదితరులు పాల్గొన్నారు. -
మైత్రి పరిశ్రమపై రైతుల ఆగ్రహం
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడకు చెందిన మైత్రి డ్రగ్స్ పరిశ్రమ యథేచ్ఛగా రసాయన వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా ఏకమై పరిశ్రమ ఎదుట ధర్నా చేపట్టారు. వర్షం మాటున పరిశ్రమ యాజమాన్యం రసాయనాలను విడుదల చేయడంతో పంట నాశనం అయిందని మండిపడ్డారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పీసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పరిశ్రమ వద్ద జలాల శాంపిల్స్ సేకరించారు. పరీక్షల అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు సూచించారు. పరిస్థితి మరలా పునరావృతమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
తూప్రాన్: వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని కన్న తల్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన 10 నెలల తర్వాత తూప్రాన్ పట్టణ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను డీఎస్పీ నరేందర్గౌడ్ తన కార్యాలయంలో వెల్లడించారు. పట్టణ పరిధిలోని ఆబోతుపల్లి గ్రామ శివారులో 2024 నవంబర్ 28న హల్దీవాగులో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేశారు. కేసు ఛేదింపు ఇలా.. మృతుడు మిస్సింగ్ కేసు ఎక్కడ నమోదు కాకపోవడంతో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఫొటోలను మండలం పరిధిలో అతికించారు. వాటిని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ పాషా(25)గా గుర్తించారు. అయితే మృతుని తల్లి మహ్మద్ రహేనా తన కుమారుడు కనిపించడం లేదని ఇప్పటి వరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు రహేనాకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం మక్తా మైలారం గ్రామానికి చెందిన జహంగీర్తో వివాహం జరిగింది. అనారోగ్యంతో భర్త ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి తన ఇష్టం వచ్చినట్లు అక్కడక్కడ గ్రామాల్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కందాల భిక్షపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఐదేళ్లుగా కాళ్లకల్ గ్రామంలో నివాసం ఉంటుంది. కొడుకు అహ్మద్ పాషా మద్యానికి బానిసై తల్లిని నిత్యం వేధిస్తున్నాడు. వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 27న సాయంత్రం ప్రియుడితో కలిసి తల్లి రహేనా కుమారున్ని బైక్పై తూప్రాన్ పట్టణ పరిధిలోని ఆబోతుపల్లి గ్రామ శివారులోకి తీసుకువచ్చి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న కుమారుడి మెడకు తాడు, చున్నీతో బిగించి హత్య చేశారు. అనంతరం బైక్పై తీసుకెళ్లి సమీపంలోని హల్దీ వాగులో పడేశారు. ఎవరికి అనుమానం రాకుండా వెళ్లిపోయారు. కాని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి నిందితురాలు తల్లి రహేనా, ఆమె ప్రియుడు భిక్షపతిలను అరెస్టు చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం, ఐడీ పార్టీ పోలీసులు గోవర్ధన్, కృష్ణ, వెంకట్, నరేందర్, దుర్గేశ్, సురేశ్లను డీఎస్పీ అభినందించారు. ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి 10 నెలల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ నరేందర్గౌడ్ -
బైక్ దొంగ అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): బైక్ను దొంగిలించిన వ్యక్తిని హద్నూర్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమిదొడ్డి అశోక్ నెల రోజుల క్రితం పొలానికి వెళ్లాడు. అక్కడ బైక్ను నిలిపి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం గంగ్వార్ చౌరస్తా వద్ద ఎస్ఐ సుజిత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలో భాగంగా బీహార్కు చెందిన లక్ష్మణ్ టీఎస్15 ఎఫ్ 8026 బైక్పై వెళ్తున్నాడు. పోలీసులు బైక్ను ఆపి వాహన పత్రాలు అడగగా గంగ్వార్లో బైక్ను దొంగిలించినట్లు నిందితుడు తెలిపాడు. బైక్ను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పాఠశాలలో హెచ్ఎం జెండాను ఆవిష్కరించే క్రమంలో పైకి వెళ్లాక ముడి రాలేదు. దీంతో తాడును హెచ్ఎం బలంగా లాగడంతో జెండా తాడు నుంచి తెగిపోయి నేలమీద పడింది. వెంటనే సిబ్బంది జెండా పైపును కిందకు తీసి తిరిగి జెండాను ముడి వేసి ఆవిష్కరించారు. బాధ్యత గల ప్రాధానోపాధ్యాయుడు జెండాను ఆవిష్కరించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడ్డారు. సిద్దిపేటకమాన్: చెరువులో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వన్టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... పట్టణంలోని కోమటి చెరువులో శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు పట్టడానికి వీలులేకుండా కుళ్లిన స్థితిలో ఉంది. మృతుడి వయస్సు సుమారు 35నుంచి 40ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుడి కుడి చేతికి మూడు వరుసల జపమాల, రాఖీ కట్టి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు. నర్సాపూర్రూరల్: మండలంలోని అవంచ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవి, రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సంధించిన మ్యాప్ వేసి పంట సాగు భూములు, జనాభా, వర్ష పాతం, సీజనల్ క్యాలెండర్ వేశారు. అనంతరం గ్రామస్తులతో వ్యవసాయ పరిస్థితులు, వనరులు, సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అక్షిత, అక్షయ, ఆదిరా, కీర్తన, కీర్తిప్రియ పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జెడ్పీ పాఠశాలకు సాతంత్య్ర వేడుకల సందర్భంగా మాజీ సర్పంచ్ శంకరప్ప మనవడు ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ పాఠశాల అవరణలో స్టేజీ నిర్మాణం కోసం ముందుకొచ్చాడు. అలాగే మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్గౌడ్ ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ. లక్ష హెచ్ఎం దీప్లారాథోడ్కు అందించారు. మిర్జాపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యావలంటీర్కు ప్రతి నెల రూ.5 వేలు ఇచ్చేందుకు మాజీ ఉప సర్పంచ్ మనోజ్ ముందుకొచ్చారు. రుద్రారం ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ.15 వేల సౌండ్ సిస్టంను అందజేశారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పోతారం ముత్యాలు గౌడ్ భార్య నర్సమ్మతో కలిసి టీవీఎస్ ఎక్సెల్పై నర్సాపూర్కు వెళ్లి సామగ్రి తీసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ – మెదక్ రహదారిలోని చిన్నచింతకుంట క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆమెను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆమె మృతి చెందింది. -
గ్యాస్ లీకై న ప్రమాదంలో..
వారం క్రితం తల్లి.. ఇప్పడు కొడుకు మృతిఝరాసంగం(జహీరాబాద్): గ్యాస్ లీకై జరిగిన ప్రమాదంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం... ఈ నెల 6న మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న తల్లి శంకరమ్మతో పాటు కుమారులు ప్రభుకుమార్, విట్టల్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. సుమారు 10 రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రభుకుమార్(35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా ఈ నెల 8న మృతుడి తల్లి శంకరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి మరణ వార్త మరువకముందే కుమారుడు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు రెండేళ్ల కుమారుడు ఉన్నారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఆలుమగల మధ్య గొడవలు
పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య పాపన్నపేట(మెదక్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని అమ్రియా తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... తండాకు చెందిన లునావత్ లక్ష్మి(40)భర్త గోపాల్తో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలంగా ఆలుమగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మనస్తాపానికి గురైన లక్ష్మి ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను మెదక్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. -
సలాం జవాన్
తడ్కపల్లి జడ్పీ హైస్కూల్లో సన్మానంసిద్దిపేటఅర్బన్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తడ్కపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో దేశ రక్షణలో పాలు పంచుకున్న ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లను సన్మానించారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ సదయ్య, సుబేదార్ కవిత్పాల్రెడ్డి, రిటైర్డ్ జవాన్లు స్కైలాబ్రెడ్డి, సురేందర్రెడ్డి, అశోక్, ప్రధానోపాధ్యాయుడు దేవర కనకయ్య, ఉపాధ్యాయుడు జోగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం యాదవ సైనిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. రెజాంగ్లా రాజ్ కలశ యాత్ర పది రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాదవ సైనిక అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 1962లో భారత, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో మన దేశం తరపున 124 మంది యాదవ సైనికులు పాల్గొని వీరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో 114 మంది యాదవ సైనికులు అమరులయ్యారని తెలిపారు. అమరవీరుల మట్టిని కలశంగా తయారు చేసి దేశ వ్యాప్తంగా వారి త్యాగాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఈ యాత్ర మిగితా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర బాధ్యులు శ్రీహరి యాదవ్, నియోజకవర్గ జేఏసీ కో ఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, నాయకులు చందు, బైకని శ్రీనివాస్ యాదవ్, జక్కుల రమేశ్ తదితరులు ఉన్నారు. -
ఆధార్లో మార్పుల కోసం వచ్చి..
● పత్రాలు మరిచిపోవడంతో ఇంటికెళ్లిన కొడుకు ● ఆలస్యం కావడంతో గద్వాల్ అనుకుని గజ్వేల్కు వెళ్లిన తండ్రి ● కుటుంబీకులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు గజ్వేల్రూరల్: ఆధార్ కార్డులో మార్పుల కోసం హైదరాబాద్కు వచ్చిన వ్యక్తి దారి తప్పాడు. గద్వాల్ అనుకుని గజ్వేల్కు వెళ్లిన వ్యక్తిని పోలీసులు తిరిగి అతడి కుటుంబీకులకు అప్పగించిన ఘటన శుక్రవారం గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... జోగులాంబ–గద్వాల్ జిల్లా ధారూర్ మండలం రాయలపాడు గ్రామానికి చెందిన చిన్న నాగప్ప మూడు రోజుల క్రితం తన కొడుకు తిక్కన్నతో కలిసి ఆధార్కార్డులో మార్పులు, చేర్పుల కోసం హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో కాగితాలు మరచిపోయానని, వాటిని తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్తున్నానని తండ్రికి చెప్పి అక్కడే ఉండాలంటూ కొడుకు వెళ్లిపోయాడు. కొడుకు రావడంలో ఆలస్యం కావడంతో గద్వాల్కు ఎలా వెళ్లాలంటూ రైల్వేస్టేషన్లో ఉన్నవారిని అడగ్గా వారు గజ్వేల్ అనుకుని బస్సు ఎక్కించారు. శుక్రవారం గజ్వేల్కు చేరుకున్న నాగప్ప బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జగన్మోహన్రెడ్డి, కానిస్టేబుల్ సంతోష్ అతని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు గజ్వేల్కు చేరుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం నాగప్పను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా నాగప్ప కుటుంబ సభ్యులు గజ్వేల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద పెరగడంతో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో శుక్రవారం డ్యామ్లోకి 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 8,9, 11 నంబర్ గేట్లను మీటరున్నర మేర ఎత్తి దిగువకు 20,250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రానికి 2,500 క్యూసెక్కుల నీరు వదలటంతో రెండు టర్బయిన్లను రన్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. పర్యాటకుల సందడి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలటంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. జంట నగరాలతోపాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చారు. జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం పర్యాటకుల సందడి -
స్వాతంత్య్రం తెచ్చిన ఆనందం
పాపన్నపేట(మెదక్): తన కొడుకు ప్రయోజకుడు కావాలని.. తన కళ్ల ముందే ప్రశంసలు పొందాలని ఏ తండ్రైనా కలలు గంటాడు. తన తండ్రి సమాజంలో ఉన్నతుడిగా నిలవాలని ప్రతి కొడుకు ఆశిస్తాడు. మెదక్లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాల వేడుక వారిద్దరి ఆశలను సఫలం చేసింది. పాపన్నపేటకు చెందిన కుకునూరి నరేందర్రెడ్డి మెదక్లో లైబ్రేరియన్గా పనిచేస్తున్నారు. మరో పది నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన కొడుకు అర్జున్రెడ్డి మెదక్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 3 పరీక్షల్లో స్టేట్టాపర్గా నిలిచారు. వారు వృత్తిపరంగా చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా అధికారులు ఆ తండ్రీకొడుకులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఒకే వేదికపై తండ్రీతనయులు సత్కారం పొందిన తీరు అందరినీ ఆనంద పర్చింది.ఒకే వేదికపై తండ్రీకొడుకులకు పురస్కారం -
ఉధృతంగా మంజీరా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర వరదల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ వెల్లడించారు. సింగూరు నుంచి 20,265 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో మంజీర ఉరకలెత్తి ప్రవహిస్తోంది. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. శుక్రవారం ఏడుపాయల్లో పరిస్థితిని కలెక్టర్ రాహుల్రాజ్ ఇరిగేషన్, పోలీసు, ఆలయ అధికారులతో సమీక్షించారు. మంజీర వరద ఉధృతిని ఎప్పటి కప్పుడు అంచనా వేస్తుండాలని అధికారులకు సూచించారు. భక్తులెవరూ మంజీర నది వైపు వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాపర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జి జిల్లా న్యాయమూర్తి నీలిమ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆమె పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. సింగూరు నుంచి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల పరిస్థితిని సమీక్షించిన మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ -
అర్హులకు సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టరు ప్రావీణ్య సూచించారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్తోపాటు క్యాంపు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...స్వతంత్ర సమయరయోధుల స్ఫూర్తితో ఉద్యోగులు తమ విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ అందరి బాధ్యత దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, ఎఆర్.డీఎస్పీ.ఎ.నరేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ -
కాంగ్రెస్కు జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజీనామా
పార్టీలో ఆదరణ లేదని మనస్తాపం పెద్దశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అవుసుల భవాని శుక్రవారం తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గెలుపుకోసం ఎంతగానో కృషి చేశానని, పార్టీ నిర్వహించే కార్యక్రమంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్పార్టీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. -
అమర జవాన్ స్తూపం ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల జ్ఞాపకార్థం ధనసిరి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ స్మారక స్తూపాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మాజీ సైనికులు ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం ఽరాష్ట్ర సరిహద్దులో గల ధనసిరి గ్రామంలో దేశ రక్షణ కోసం ఎందరో సైన్యంలో చేరి సేవలందించారు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు గ్రామంలో వీర అమర జవాన్ జ్యోతి స్మారక స్తూపం నిర్మాణానికి శ్రీకారం చుట్టి గ్రామస్తుల సహకారంతో పూర్తి చేశారు. 15 చదరపు అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఎత్తులో గ్రానైట్ రాయితో ఇండియా గేట్ మాదిరిగా నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.మాణిక్రావు, మాజీ ఎంపీ.బీబీపాటిల్ హాజరై స్మారక స్తూపానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ధనసిరి గ్రామస్తులు సైన్యంలో చేరి దేశసేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు బీదర్ జిల్లా నుంచి, మాజీ సైనికులు హబ్సి దేవరాజ్, కాశీనాథ్, అశోక్ ,గణపతి, సంజీవ్రెడ్డి, విశ్వనాథ్, చంద్రశెట్టి, బస్వరాజ్, మల్లికార్జున్, సురేశ్ యాదవ్, బక్కారెడ్డి, యూనూస్ పాల్గొన్నారు.పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ సైనికులు -
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలే: దేవ్ కుమార్
వెల్దుర్తి(తూప్రాన్): యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్ హెచ్చరించారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ఆగ్రోస్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారి లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.చిలప్చెడ్లో 14.6సెం.మీ వర్షంచిలప్చెడ్(నర్సపూర్): చిలప్చెడ్ మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 14.6 సెం.మీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మండల గణాంకాధికారి దివ్యభారతి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, కురుస్తున్న భారీ వర్షాలకు చిలప్చెడ్ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. చిలప్చెడ్లో కురిసిన వర్షానికి పాక్షికంగా కూలిన ఇళ్లు తహాశీల్దార్ సహాదేవ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ సునీల్సింగ్ ఉన్నారు.కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు సాధిస్తాంసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా యా జమాన్యాల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై జరిగిన క్యాంపెయిన్ వర్క్ షాప్నకు రామయ్య హాజరై మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తామని తెలిపారు.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా భాస్కర్జహీరాబాద్ టౌన్: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జహీరాబాద్ పట్టణానికి చెందిన గొల్ల భాస్కర్ నియమితులైయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలు గోదావరి శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన భాస్కర్ను పలువురు బీజేపీ నాయకులు అభినందించారు.చినుకుపడితే కరెంట్ కట్.. సరఫరాలో తీవ్ర అంతరాయంనర్సాపూర్: నర్సాపూర్లో కరెంటు సరఫరాలో అంతరాయం సాధారణమైందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి రోజు కరెంట్ కోతలు ఉంటున్నాయని, చినుకు పడితే కరెంటు పోతుందని, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. రెండు రోజులుగా కరెంట్ సరఫరాలో అంతరాయం మరింత ఎక్కువైందని స్థానికులు తెలిపారు. శుక్రవారం సైతం కరెంటు చాలా సార్లు పోయిందని అన్నారు. కరెంట్ ఎక్కువ సార్లు పోవడంతో విద్యుత్తు పరికరాలు పాడుతున్నాయని అన్నారు. పట్టణంలో కరెంటు సరఫరాను మెరుగు పర్చాలని వినియోగదారులు కోరుతున్నారు. -
సమగ్రాభివృద్ధి
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆర్థిక భరోసా..నెహ్రూ, ఇందిర స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పేదలకు ఆర్థిక భరోసాకు సంక్షేమపథకాలు అందజేయడంతోపాటుగా అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి దామోదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. అన్నదాతలను ఆదుకునేందకు.. ‘‘అన్నదాతలను ఆదుకునేందుకు జిల్లాలో రూ.910 కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. రైతుభరోసా పథకం కింద ఈ వానా కాలం సీజనులో 3.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.422 కోట్లు జమ చేశాం. ఉచిత విద్యుత్ పథకం కింద జిల్లాలో 1.06 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా 596 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులు ఇచ్చిన 991 దరఖాస్తులను పరిష్కరించాం. జిల్లాలో త్వరలో 206 మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామపాలన అధికారులుగా నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేస్తాం..’’అని దామోదర పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నాం. 14,391 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 2.11 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. 13.08 లక్షల రేషన్కార్డుదారులకు ప్రతీనెలా 8,345 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో కొత్తగా 31,460 రేషన్కార్డులు జారీ చేశాం..’’అని రాజనర్సింహ చెప్పారు. వైద్యం.. విద్య.. ‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 11,691 మందికి రూ.35.15 కోట్ల ఖర్చు చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించాం. త్వరలో సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించి 500 పడకల ఆసుపత్రిభవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఆందోల్లో నర్సింగ్ కాలేజీ తరగతులను ప్రారంభించాం. రూ.600 కోట్లతో ఆందోల్, నారాయణఖేడ్, పటాన్చెరుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. రూ.107 కోట్లతో రాయికోడ్, నారాయణఖేడ్, జహీరాబాద్లలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’అని మంత్రి అన్నారు. రోడ్లు భవనాలు.. నీటి పారుదల.. నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానించేందుకు రూ.293 కోట్లతో రోడ్లు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ 2025–26 ఏడాదిలో రోడ్ల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. తాటిపల్లి – మక్తక్యాసారం రోడ్డుకు కలుపుతూ సింగితం నుంచి కోడూర్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ.42 కోట్లు మంజూరయ్యాయి. రూ.17.70 కోట్లతో గార్లపల్లి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. హెచ్ఏఎం పథకం కింద 343 కి.మీల పొడవైన రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.’’అని మంత్రి ప్రకటించారు.మహిళా సాధికారత కోసం.. ‘‘రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పలు పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలతో సోలార్ విద్యుత్ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ విజయవంతంగా నడుస్తోంది. ఉచిత బస్సు పథకంలో భాగంగా ఇప్పటివరకు 3.62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేశారు. ’’అని మంత్రి వివరించారు. త్వరలో 206 మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి దామోదర ‘‘భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేశాం. మాదక ద్రవ్యాల నిర్మూలనకై సంగారెడ్డి నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.’’అని మంత్రి దామోదర పేర్కొన్నారు. టీజీఐఐసీ రాష్ట్ర చైర్మన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్పంకజ్, అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదరికమే అతి పెద్ద సమస్య
సర్వే ఫలితాలు ఇలా..సాక్షి, నెట్వర్క్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పేదరికమే అతి పెద్ద సమస్య అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అర్హులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం ఎంత మందికి దరిచేరింది? స్వాతంత్య్ర ఫలాలు అందరికి దక్కాలంటే ఏ రంగం నీతి, నిజాయితీగా పనిచేయాలి? ఇలా మూడు ప్రధాన మైన అంశాలపై సర్వే చేపట్టింది. ఈ అంశాలపై సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 90 మంది అభిప్రాయాలను సేకరించింది. పేదరికం తర్వాత అతిపెద్ద సమస్య వైద్యమే అని సర్వేలో పేర్కొన్నారు. కుల వివక్ష కూడా ఎక్కువగానే ఉందని, అవినీతి కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని తేలింది. అందని స్వేచ్ఛ–సమానత్వం.. స్వేచ్ఛ – సమానత్వం ఇంకా ప్రజలందరికి చేరువకాలేదని సాక్షి చేపట్టిన సర్వేలో వ్యక్తమైంది. 60 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 28 శాతం మంది కొద్ది మందికే చేరువైందని చెప్పారు. 12 శాతం మంది అందరికీ స్వేచ్చ – సమానత్వం చేరువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అధికార యంత్రాంగం నీతి నిజాయితీగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయాన్ని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. చట్టసభలు, న్యాయస్థానాలు మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చాలా మంది చెప్పారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వాతంత్య్ర ఫలాలుఅందరికీ దక్కాలంటేమరింత నీతి, నిజాయితీగాపనిచేయాల్సిన రంగం? స్వేచ్ఛ – సమానత్వం నిజంగానే అందరికీచేరుతోందా?మీడియా620చట్టసభలు4510అధికార యంత్రాంగంన్యాయ స్థానాలునాణ్యమైన విద్యదరిచేరని స్వేచ్ఛ, సమానత్వం -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, ఆర్డీఓ రవీందర్రెడ్డి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను గురవారం పర్యవేక్షించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలతోపాటు జాగిలాలతో ఏర్పాట్లను పరిశీలించారు. పంద్రాగస్టు వేడుకకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 9:30 నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేయనున్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల శకటాలను ప్రదర్శించనున్నారు. విశిష్ట సేవలకు ఎంపికైన ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వేడుకలకు హాజరుకానున్న మంత్రి దామోదర -
అగ్రగామిగా అవతరించాలి
పటాన్చెరు/పటాన్చెరు టౌన్: అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాట పోవాలి...అభివృద్ధి చెందిన భారత్గా రూపొందాలి. ప్రపంచ దేశాలకు భారత్ అగ్రగామిగా అవతరించాలి. ఇది నేటి యువత ఆకాంక్ష. అందరికీ విద్య అందుబాటులో ఉండటంతోపాటు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలి. సాంకేతికతలో భారత్లో కీలకపాత్ర పోషించాలి. ఇదంతా అవినీతిరహిత పాలనతోనే సాధ్యం అని యువత బలంగా కోరుకుంటోంది. భారత్ 2047లో జరుపుకునే వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం ఎలా ఉండాలనే అంశంపై‘సాక్షి’ఆధ్వర్యంలో పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన టాక్షోలో యువత తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను వెలిబుచ్చారు. అవినీతిరహిత భారత్ కావాలి అవినీతిరహిత పాలనకు భారత్ దిక్సూచిగా మారాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. దేశం ఇప్పటికీ సామాజిక రుగ్మతలు, వెనుకబాటుతనంతో కునారిల్లుతోంది. దీనంతటికీ అవినీతి పాలనే కారణం. ప్రతీ చోట లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. అవినీతి రహిత పాలన సాగాలి. –కార్తీక్, బి.ఎ.ద్వితీయ ఏడాది, పటాన్చెరు. అన్నిరంగాల్లో ఉన్నతస్థాయికి సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అన్ని రంగాల్లోనూ దేశం ఉన్నత స్థాయికి చేరుతోంది. మన దేశం అగ్రగామి దేశంగా అవతరించాలి. ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు, ప్రముఖ సంస్థల సీఈఓలు మన దేశం వారేకావడం ఇందుకు నిదర్శనం. –సంతోషి, బి.ఎ. ఫస్టియర్, గుండూరు గ్రామం మనమే నంబర్వన్ కావాలి దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. మరింత అభివృద్ధి చెందాలి. అన్ని అవసరాలకు ప్రపంచ దేశాలన్నీ భారత్వైపు చూడాలి. అన్ని రంగాల్లోనూ మనమే నంబర్వన్గా ఉండాలి. ప్రపంచానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించేస్థాయికి ఎదగాలి. – ఎస్.జ్ఞానేశ్వర్, బి.ఎ. ఫస్టియర్, బాచుపల్లి. నిరుద్యోగరహిత భారత్ చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు దొరకాలి. దేశంలో ఒక్క చదువుకున్న నిరుద్యోగి కూడా ఉండకూడదు. చదువుకున్న యువత మనం ఎందుకు చదువుకున్నామా అనే పరిస్థితి రాకుండా చూడాలి. అందరికీ ఉద్యోగాలు దొరికేలా కోర్సులు ప్రవేశపెట్టాలి. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి. – అక్షర సాయి, బి.ఎ, ఫస్టియర్, వికారాబాద్ విద్య, వైద్యం అందరికీ అందుబాటులో.. దేశంలో అన్ని వర్గాల వారికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అందరూ చదువుకోవాలి. వంద శాతం అక్షరాస్యత సాధించాలి. దేశంలో నెలకొన్న అన్ని సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం లభిస్తుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే అందరికీ ఉచితంగా అందించాలి. – ఎస్.తనుశ్రీ, బి.ఎ, సెకండియర్ ప్రజా సమస్యలకు ప్రత్యేక వ్యవస్థ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే గుర్తించి సత్వరమే పరిష్కరించాలి. ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. –ఎస్.నవీన్, బి.ఎ.ఫస్టియర్, గండిగూడెం . అవినీతి, నిరుద్యోగరహితదేశంగా ఉండాలి అందరికీ ఉచిత విద్య, వైద్యం అందాలి విద్య, వైజ్ఞానిక రంగాల్లోభారత్ దిక్సూచి కావాలి పటాన్చెరు డిగ్రీ కళాశాలలోసాక్షి టాక్షోలో యువత ఆకాంక్షలు -
నిండకుండానే గేటు ఎత్తి..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు గండి పడే ప్రమాదం పొంచి ఉండటంతో నీటి పారుదల శాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ జలాశయం పూర్తిగా నిండకపోయినప్పటికీ వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే ప్రాజెక్టు 11వ గేటును ఎత్తి 10,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రివీట్మెంట్ దెబ్బతిన్నదని, మట్టికట్టలు కుంగిపోతున్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తక్షణ మరమ్మతులు చేపట్టకపోతే ప్రాజెక్టుకు గండి పడి భారీ నష్టం వాటిల్లుతుందని ఈ సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 3,868 క్యూసెక్కుల నీరు చేరింది. కానీ 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇందులో 2,492 క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.60 టీఎంసీలే ఉన్నప్పటికీ వచ్చిన నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నీటిమట్టం 522 మీటర్లు. అయితే ఈ నీటిమట్టం 517.8 మీటర్లకు పరిమితం చేయాలని ఆశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటిమట్టం పెరిగితే డ్యామ్కు ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. గతేడాది పూర్తిగా నిండాకే.. గతేడాది ఈ ప్రాజెక్టు సెప్టెంబర్లో పూర్తిగా నిండింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఏకంగా 40 వేల క్యూసెక్కుల వరద రాగా..సెప్టెంబర్ 5న ప్రాజెక్టు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేయడం ప్రారంభించారు. అయితే ఈసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల మేరకు ఆగస్టు రెండో వారంలోనే గేట్లెత్తాల్సిన పరిస్థితి నెలకొంది.మంజీరా డ్యామ్ నుంచి నీటి విడుదల సింగూరు గేటు ఎత్తడంతో మంజీరా డ్యామ్ నిండింది. దీంతో ఈ డ్యామ్ గేటు కూడా ఎత్తారు. 10,200 క్యూసెక్కుల నీరు సింగూరు నుంచి రావడంతో అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఈ డ్యామ్ నుంచి నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్తగా దిగువకు సింగూరు నీటి విడుదల వస్తున్న ఇన్ఫ్లో వచ్చినట్లే మంజీరాలోకి -
మంజీరా పరవళ్లు
సింగూర్ డ్యామ్ నుంచి కిందికి నీళ్లు వదలటంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు మంజీరా డ్యామ్ నిండుకుండలా మారింది. బుధవారం నాటికి మంజీరా డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో గురువారం ఎనిమిదవ గేట్ను రెండున్నర మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో మంజీరా నీళ్లు పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతున్నాయి. దిగువన నీరు ప్రవహించే ఏరు నిండుగా కళకళలాడుతుంది. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
మహాత్మా.. మన్నించు!
జగదేవ్పూర్(గజ్వేల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటారు. అయితే భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మాగాంధీని మాత్రం మరిచిపోతున్నారు. పలు చోట్ల జాతిపిత విగ్రహాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని తిగుల్లో ఖచీర్ వద్ద బురుజు పక్కన గద్దైపె దశాబ్ధాల క్రితం గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పదేళ్ల క్రితం రోడ్డు వెడల్పులో గాంధీ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టి ప్రతిష్టంచకుండా వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విగ్రహాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. కావున వెంటనే గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని స్థానికులు కోరుతున్నారు. »» -
ఆహా ఏమి రుచి..!
జహీరాబాద్ టౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో గురువారం వంటలు, ముగ్గులు, మెహిందీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శాంత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలకు చెందిన 106 మంది విద్యార్థులు పోటీ పడి నోరూరించే పలు రకాల వంటకాలు తయారు చేశారు. ఇందులో చిరుధాన్యాలతో ఘుమఘుమలాడే బిర్యానీ, జీరారైస్, ఫులిహోర, దోశలు, ఇడ్లీ, గారెలు, పాయసం, పలు రకాల స్వీట్లు, జోన, సజ్జ రొట్టెలు వంటి వైరటీ వంటకాలు తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్, డైరక్టర్లు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు కీర్తి, రమేష్, దత్తు, నవీన లావణ్య, శ్రావణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.చిరుధాన్యాలతో నోరూరించే వంటకాలు -
ఇలా వచ్చి.. అలా వెళ్లాడు
మెదక్ మున్సిపాలిటీ: ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ వ్యక్తి గంటల వ్యవధిలోనే మరో కేసులో చిక్కుకొని ఇలా వచ్చి.. అలా జైలుకు వెళ్లిన సంఘటన నర్సాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం, జూదం వంటి వ్యసనాలకు అలవాటైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం మద్దుల్వాయికి చెందిన గజ్జెల భిక్షపతిని తొలిసారి మెదక్ పోలీసులు 2015లో దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వివిధ నేరాలకు పాల్పడడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించగా.. ఈనెల 11న విడుదలయ్యాడు. ఈనెల 13న గుమ్మడిదల నుంచి మెదక్ వెళ్తుండగా.. బస్సులో పరిచయమైన మహిళకు మద్యం, చేపలు, డబ్బు ఇస్తానని నమ్మించి నర్సాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ మహిళకు మద్యం తాగించి రాయితో మోది చెవి రింగులు లాక్కొని పారిపోయాడు. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని ఓ వైన్స్ వద్ద ఆధారాలు సేకరించారు. అనంతరం సమాచారం మేరకు 24గంటల్లోనే గుమ్మడిదలలో భిక్షపతిని అరెస్ట్ చేసి, చోరికి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు.. 12 కేసులు డ్రైవర్గా పనిచేసే భిక్షపతి జల్సాలకు అలవాటుపడి చోరీలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిపై మెదక్ టౌన్ పీఎస్ల(6), సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(2), హత్నూర(1), నారాయణ్ఖేడ్(1), అల్వాల్(1)కేసుతో కలిసి మొత్తం 12 కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మేరకు నిందితుడిపై పీడీ యాక్ట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే ఈ కేసును 24గంటల్లోనే ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం, కానిస్టేబుల్ శ్రీకాంత్లను ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ మహేందర్లు అభినందించి రివార్డులు అందజేశారు. జైలు నుంచి వచ్చిన గంటల్లోనే మళ్లీ దోపిడీ 24గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి రిమాండ్కు తరలింపు -
అధిక వర్షాలతో అప్రమత్తం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ప్రజలకు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారులకు సెలవులను మంజూరు చేయడం లేదని, అన్ని స్థాయిల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఏదైనా సమస్య వస్తే 08457–230000ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆదాయం అదుర్స్
నారాయణఖేడ్: రాఖీ పౌర్ణమిని ఆర్టీసీ క్యాష్ చేసుకుంది. ఈ ఏడాది తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఎక్కువగా ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు కొనసాగించారు. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు కేటాయించి సొమ్ము చేసుకుంది. ఇలా ప్రతీ పండగ సీజన్లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతూ తమ మార్కును ప్రదర్శిస్తుంది. ఈ రాఖీ పౌర్ణమిని సైతం ప్రత్యేక సర్వీసులు నడిపి భారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి ఆదాయం సమకూర్చుకుంది. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆర్టీసీ నిత్యం 275 సర్వీసులు నడిపింది. ఈ సర్వీసుల ద్వారా రీజియన్లో మహాలక్ష్మి ద్వారా 9.73లక్షలు, ఇతరులు 4.61లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రూ.9.07కోట్ల ఆదాయం సాధించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 డిపోల నుంచి ఈ సర్వీసులు కొనసాగాయి. కార్మికులు తక్కువ ఉన్నా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతో యాజమాన్యం వెనుకడుగు వేయలేదు. అన్ని డిపోల నుంచి స్పెషల్ సర్వీసులను నడిపింది. ఈ స్పెషల్ సర్వీసులకు రూ.100 చార్జీ వద్ద రూ.50 అదనంగా వసూలు చేశారు. మొత్తం 275 స్పెషల్ సర్వీసులు రీజియన్ పరిధిలో నడిపారు. సర్వీసులు ఇవే..! మెదక్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి బస్సులను హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాలకు నడిపారు. ఖేడ్ డిపో నుంచి జేబీఎస్, సికింద్రాబాద్, లింగంపల్లి, పటాన్చెరు.. జహీరాబాద్ డిపో నుంచి జేబీఎస్, లింగంపల్లి, సంగారెడ్డి క్రాస్రోడ్డు.. సంగారెడ్డి డిపో నుంచి జేబీఎస్, సికింద్రాబాద్.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నుంచి సికింద్రాబాద్, మెదక్ డిపో నుంచి సికింద్రాబాద్, బాలానగర్ వయా నర్సాపూర్, సిద్దిపేట డిపో నుంచి జేబీఎఎస్, కరీంనగర్, వేములవాడ, దుబ్బాక నుంచి సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి జేబీఎస్, బాలానగర్తోపాటు ఇతర పలు ప్రధాన పట్టణాలు, ప్రాంతాలకు సర్వీసులను నడిపారు. కార్మికులకు భోజన సదుపాయం.. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడిపిన డ్రైవర్, కండక్టర్తో పాటు డబుల్ డ్యూటీ చేసిన వారికి సైతం ఖేడ్ డిపోతోపాటు పలు డిపోల్లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఖేడ్ డిపో స్వీట్లు, వెజ్ బిర్యానీ పంపిణీ చేసి కార్మికులను ప్రొత్సహించారు. డబుల్ డ్యూటీ నిర్వహించిన డ్రైవర్లకు డ్యూటీ దిగగానే రూ.1,000, కండక్టర్కు రూ.650ల చొప్పున డీడీ (డబుల్ డ్యూటీ) అమౌంట్ అందజేశారు. అలాగే కొంతమంది కండక్టర్, డ్రైవర్లకు ఇన్సెంటీవ్ అందజేశారు. ప్రయాణికుల సేవకు సిద్ధం ప్రయాణికులకు సర్వీసు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కార్మికులు కూడా ప్రయాణికుల అవసరాల మేరకు విధులు నిర్వర్తించేందుకు సహకరించారు. డబుల్ డ్యూటీలు సైతం నిర్వహిస్తూ సంస్థ మనుగడ కోసం పనిచేశారు. ప్రయాణికులు ఎల్లపుడూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. కార్మికులకు వెజ్ బిర్యారీ, స్వీట్లు అందించాం. – మల్లేశయ్య, డీఎం, నారాయణఖేడ్ కార్మికుల సమష్టి కృషి ఆర్టీసీ సంస్థలో పని చేసే అన్ని వర్గాల కార్మికుల సమష్టి కృషితో రికార్డు ఆదాయం సాధించాం. రీజియన్ పరిధిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా నాలుగు రోజులపాటు బస్సులు నడిపాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. రీజియన్ పరిధిలో రూ.9.07కోట్ల ఆదాయాన్ని పొందగలిగాం. మహాలక్ష్మి ద్వారా సుమారు 9.73లక్షల మంది ప్రయాణించారు. – విజయభాస్కర్, రీజినల్ మేనేజర్, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిపోల ఆదాయం వివరాలు డిపో మహాలక్ష్మి మహాలక్ష్మి నగదు ఆదాయం నగదు చెల్లింపు మొత్తం ఆదాయం మొత్తం ఆదాయం(రూ.లక్షల్లో) ప్రయాణికులు (రూ.లక్షల్లో) ప్రయాణికులు (రూ.లక్షల్లో) ప్రయాణికులు దుబ్బాక 44.75 78,221 19.36 24,968 64.11 1,03,189 గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 89.35 1,64,394 43.16 61,436 132.51 2,25,830 మెదక్ 87.09 1,83,324 54.95 79,641 142.04 2,62,965 నారాయణఖేడ్ 51.85 63,089 32.81 35,967 84.66 99056నర్సాపూర్ 25.73 57,820 11.01 22,607 36.74 80,427 సంగారెడ్డి 85.57 1,69,769 57.29 80,015 142.86 2,49,784 సిద్దిపేట 95.22 1,57,648 75.21 78,094 170.43 2,35,742జహీరాబాద్ 65.33 98,281 68.37 78,135 133.70 1,76,416 కలిసొచ్చిన వరుస సెలవులు పెరిగిన ప్రయాణికుల సంఖ్య రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు -
దేశభక్తి.. స్వాతంత్య్ర స్ఫూర్తి
తూప్రాన్: పట్టణంలోని గీతా స్కూల్ విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. గురువారం సుమారు 300 మంది విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో త్రివర్ణ పతాకం ఆకృతిలో కూర్చుని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. అంతేకాకుండా జెండాకు ఇరువైపుల జాతీయ పుష్పం ‘కమలం’ ఆకారంలో కూర్చుని అలరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశభక్తిని చాటారు. ఈ మేరకు విద్యార్థుల ప్రదర్శనను పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు ప్రశంసించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఉష , డైరెక్టర్లు రాఘవేందర్గౌడ్, నారాయణగుప్త, ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయికి 16 మంది క్రీడాకారుల ఎంపిక
మెదక్జోన్: త్వరలో చైనాలో నిర్వహించనున్న అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం అండర్ 15 బాలబాలికలకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య అధికారి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఈఓ ఆదేశాల మేరకు పట్టణంలోని గుల్షన్ క్లబ్లో ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 110 మంది బాలికలు, 150 మంది బాలురు పాల్గొన్నారన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 8 మంది బాలికలు, 8 మంది బాలురు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరంతా ఈనెల 18, 19 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుల్షన్ క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ప్రభు, పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మధుసూదన్, వినోద్, నరేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగ ఫలమే.. స్వాతంత్య్రం
● దిశ కమిటీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ● ఆకట్టుకున్న తిరంగా ర్యాలీ దుబ్బాకటౌన్: ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్ర ఫలాలని జిల్లా దిశ కమిటీ సభ్యుడు సుంకోజీ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు, బీజేపీ నాయకులు 150 మీటర్ల త్రివర్ణ పతాకంతో పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భాగంగా దేశ భక్తి నినాదాలతో పట్టణ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ రెడ్డి, మల్లారెడ్డి, రవి కుమార్, రమణా రెడ్డి, రమేష్ రెడ్డి, తదితరులున్నారు.