breaking news
Sangareddy District Latest News
-
ఎన్నికల కమిటీలో డీసీసీలకు అవకాశం
జోగిపేట(అందోల్): కొత్తగా ఎన్నికయ్యే డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల కమిటీలో కూడా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో డీసీసీ అధ్యక్షులు కేవలం సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలను సమీకరించడం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యే వారని, కానీ ఈసారి వారి ప్రాధాన్యతను పెంచేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల స్థానంలో టికెట్ కేటాయించే విషయంలో కూడా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల్లో నుంచే డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 50కిపైగా డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈనెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించి సంగారెడ్డిలోనే ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీకి కేవలం ఆరుగురి పేర్లను మాత్రమే పంపుతామని, ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఎంపిక చేస్తారన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం కూడా అవసరమని వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ పరిశీలకులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాష్ట్ర ఫెడ్కాన్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట -
మందకొడిగా దరఖాస్తులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మద్యం షాపులను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు పోటీ పడుతుండటం సాధారణం. సిండికేట్గా మారి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటుంటారు. కానీ జిల్లాలోని నాలుగు మద్యం షాపులకు మాత్రం గురువారం వరకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. నారాయణఖేడ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మూడు షాపులకు, అందోల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మరో షాపునకు ఇప్పటివరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నాలుగు మద్యం షాపులు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. కాగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శనివారంతో ముగియనుంది. ఈసారి స్పందన అంతంతేనా? మద్యం షాపుల కేటాయింపుల విషయంలో ఈసారి మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. 2023తో పోల్చితే ఈసారి అంతంత మాత్రంగానే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఐదు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మద్యం షాపులున్నాయి. 2023లో నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో ఏకంగా 6,156 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఇప్పటివరకు 1,264 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు గడువు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. చివరి రెండు రోజులైన శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ అధికారులు ధీమాతో ఉన్నారు. అయితే 2023లో వచ్చిన స్థాయిలో ఈసారి అంతగా రాకపోవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనుభవం ఉన్న వారితో కలిసి.. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో కలిసి సిండికేటుగా మారి పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకునే వారు కూడా కొందరు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒకవేళ అదృష్టం వరించి వచ్చిన మద్యం షాపును నిర్వహించలేని పక్షంలో ఎవరికై నా లీజుకు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాగా తక్కువ సేల్స్ ఉండే మద్యం షాపులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న షాపులను కొనుక్కునేందుకు మద్యం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు కూడా ఈసారి జిల్లాలోని మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తున్నారు. సిండికేటుగా మారి.. బల్క్గా దరఖాస్తులు మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారి బల్క్గా దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన ఈ ఫీజును ఈ వ్యాపారులు ఏమాత్రం లెక్క చేయరనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. బిల్లులు సకాలంలో రావనే భయంతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వీరంతా ఇప్పుడు ఈ మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతారనే అంచనాలున్నాయి. పైగా ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉండటంతో ఎలాగైనా మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఒక్క దరఖాస్తు కూడా రాని మద్యం షాపులు నాలుగు ఆశించిన స్థాయిలో మద్యం వ్యాపారుల నుంచి స్పందన కరవు చివరి రెండు రోజుల్లో బల్క్గా వస్తాయనే ధీమాలో ఎకై ్సజ్ వర్గాలు రేపటితో ముగియనున్న గడువు -
అందరివాడే.. అయినా బదిలీ
రామచంద్రాపురం తహసీల్దార్ బదిలీపై జోరుగా చర్చ రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డి ఆకస్మిక బదిలీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్, ఉస్మాన్నగర్, కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెలలో రియల్ వ్యాపారం జోరుగా ఉండటంతో ప్రభుత్వ పెద్దల కన్ను ఈప్రాంతంపైనే ఉంటాయి. ప్రభుత్వం మారినా ప్రభుత్వానికి చెందిన ముఖ్యశాఖల అధికారుల బదిలీలు రాష్ట్రస్థాయి బడా నేతల కనుసైగల్లో జరగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రాంతంలో ఏ శాఖలోనైనా పోస్టింగ్ రావాలంటే రాజకీయ పలుకుబడిఉన్న అధికారులు మాత్రమే ఇక్కడకి వస్తారన్న ఆరోపణలున్నాయి. వచ్చిన తర్వాత వారి ఆగడాలకు అంతూపొంతు లేకుండా పోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వచ్చినప్పుడే వెళ్లిపోతారని... రంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నికల సమయంలో సంగ్రామ్రెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికల తర్వాత సంగ్రామ్ రెడ్డి బదిలీపై వెళ్తారని స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అనుకున్నారు. కానీ, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సానుకూలంగా వ్యవరించారన్న సానుభూతితో బదిలీ కాకుండా అడ్డుకున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలకు వారనుకున్న విధంగా పనులు చేశారని రెవెన్యూ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి ఆర్డీఓ బదిలీ అనంతరం సంగ్రామ్రెడ్డి సైతం బదిలీ కావచ్చని చాలామంది చర్చించుకున్నారు. మంత్రికి ఫిర్యాదు చేసినా.. అదే విధంగా గత కొన్ని నెలల క్రితం తెల్లాపూర్ పరిధిలోని ఓ వెంచర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఈ విషయాన్ని స్థానికులు ప్రధాన శాఖకు చెందిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకుని పోయి విచారణ చేయాలని సదరు మంత్రికి లేఖ సైతం ఇచ్చారు. ఆ విషయంలో జిల్లా ఉన్నతాధికారలు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కొంతమంది అధికారులు, నేతల ఒత్తిడితో వాటిని పట్టించుకోలేదానే విమర్శలున్నాయి. వాటితో పాటు వివాదాస్పదమైన భూములలో తల దూరుస్తున్నారని సంగ్రామ్రెడ్డిపై గతంలో అనేక మార్లు స్థానికులు సైతం ఆరోపించారు. పెద్దల అండతో మరికొంతకాలం ఉంటారనుకున్న సదరు తహసీల్దార్పై జిల్లా ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసి అందరిని విస్మయానికి గురిచేశారు. ఇదిలా ఉండగా బదిలీకి గల కారణాలు తెలియక కార్యాలయ సిబ్బంది, పలువురు తలలు పట్టుకుంటున్నారు. మృదుస్వభావంతో కనిపించే సంగ్రామ్రెడ్డి బదిలీ స్థానికం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికై నా నిఘా అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యతోపాటు క్రీడలు ముఖ్యమే
పటాన్చెరు: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పటాన్ చెరు మైత్రి క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి 69 వఎస్జీఎఫ్ క్రీడా పోటీలను గురువారం కలెక్టర్ ప్రావీణ్య క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...క్రీడాకారులకు ఈ మూడు రోజులు అత్యంత కీలకమని ఈ క్రీడల్లో రాణిస్తే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. చదువుతోపాటు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఈ క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సంఖ్య పెంచేందుకు క్రీడాకారులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దృఢత్వంతోపాటు విద్య,ఉపాధి అవకాశాల్లో అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎస్పీ పరితోశ్ పంకజ్ శుభాకాంక్షలు తెలిపారు. పౌష్టికాహారలోప నివారణకు పోషణ అభియాన్ పటాన్చెరు టౌన్: పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి పోషణ అభియాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పటాన్చెరులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ జయరాం నాయక్ పాల్గొన్నారు. 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాల్లో కలెక్టర్ ప్రావీణ్య కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సాధనకు కృషి చేయాలి: ఎంపీ రఘునందన్రావు -
ప్రారంభమైన ఉపాధి హామీ సభలు
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గుర్తించే గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ప్రతీ ఏటా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి సభలు నిర్వహించి పనులు గుర్తించేవారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఆలస్యంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ తయారీకి ఆదేశాలు వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించడంతో పాటు కూలీల బడ్జెట్ తయారీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల సమక్షంలో ప్రజలతోపాటు రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులను ఎంపిక చేయనున్నారు. సహజ వనరులతోపాటు వ్యవసాయ సంబంధిత, వ్యక్తిగత, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత గుర్తించాలని ఆదేశించారు. గత సంవత్సరంలో గుర్తించిన పనులతోపాటు చేపట్టిన పనుల వివరాలను సభలో చదువుతారు. ఉపాధి హామీలో జియోగ్రఫీకల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) యుక్తధార యాప్ను ఉపయోగించి పనులను ఎంపిక చేస్తారు. గతంలో చేపట్టిన పనులు పూర్తయిన తర్వాతే కొత్త పనులు చేపడతారు. పంచాయతీల వారీగా గుర్తించిన పనులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఉపాధి హామీలో చేపట్టే పనులు ప్రజలతోపాటు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. పశువుల పెంపకానికి షెడ్ల నిర్మాణం, బయోగ్యాస్ ప్లాంట్, వ్యవసాయ పొలాలకు మట్టి రహదారులు నిర్మించడం, పండ్ల తోటల పెంపకం, నర్సరీల ఏర్పాటు, ఫామ్ పాండ్, ప్రభుత్వ భవనాలలో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, నీటి నిల్వ గుంతలు, కందకాలు, బండరాళ్లతో చెక్ డ్యామ్, ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులు చేపట్టారు. వచ్చే ఆర్థిక ఏడాదికి రూపకల్పన గ్రామ పంచాయతీ తీర్మానాలతో ప్రణాళిక కూలీల జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు ఆలస్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30.96 లక్షల పనులు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 18 లక్షలకు పైగా పని దినాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పనులు కొనసాగుతాయి. జిల్లాలో 2.18 లక్షల జాబ్ కార్డులు ఉండగా 1.20లక్షల జాబ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. -
బంద్ విజయవంతం చేయాలి
వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన బీసీ జేఏసీ నేతలు సంగారెడ్డి : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. పార్టీలకతీతంగా జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అంతకుముందు బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెబుదామన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, గోకుల్ రృష్ణ, వైస్ చైర్మన్ గోరుగంటి రమేశ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ కుమ్మరి సాయిలు, నాయకులు హరికిషన్, కో–కన్వీనర్ పి.కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు సంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్ 42% అమలు కోసం ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్కు పీడీఎస్యూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన పీడీఎస్యూ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నం.9 ను హైకోర్టు కొట్టి వేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ జేఏసీ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ను చేర్చడం ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లను సాకారం చేయాలనే డిమాండ్తో చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా నాయకులు శ్రీకాంత్,పవన్, అభిషేక్, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
విరామమెరుగని బోధన
ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగ రాములు హత్నూర(సంగారెడ్డి): పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు 80 ఏళ్ల వృద్ధాప్యంలో సైతం విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరకు చెందిన కోట గంగ రాములు 1968లో ఉపాధ్యాయుడిగా జిన్నారం మండలం శివనగర్ పాఠశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించి.. 2004 ఏప్రిల్లో మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం గంగారం పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అనంతరం బోరపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది సంవత్సరాలుగా ఉచితంగా తెలుగు బోధన చేశారు. దౌల్తాబాద్ పాఠశాలలో రెండేళ్లు, కొన్యాల పాఠశాలలో ఐదు నెలలు తెలుగు బోధించారు. 2011 నుంచి హత్నూర కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో 14 ఏళ్లుగా ఉచితంగా విద్యార్థినులకు తెలుగు బోధిస్తున్నారు. వద్ధాప్యంలో 9 ఏళ్ల క్రితమే భార్య లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. సంతానం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల పిల్లలనే తన పిల్లలనుకుంటున్నారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వచ్చి పిల్లలతోనే భోజనం చేసి సాయంత్రం వరకు వారికి బోధిస్తున్నారు. 1999లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు సైతం అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నెల పెన్షన్ విద్యార్థుల అవసరాలకు, ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు కొంతమేర సహాయం అందిస్తానని గంగ రాములు తెలిపారు. 80 ఏళ్ల ఉచితంగ బోధిస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు. -
శభాష్.. దుర్గయ్య
● బస్సులో మరిచిపోయిన 39 తులాల బంగారం బ్యాగ్ అప్పగింత ● నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడికి డిపో సిబ్బంది సన్మానం సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు దుర్గయ్య నిజాయితీ చాటుకున్నాడు. సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి వసుధ ప్రకాష్ భార్యాభర్తలు గురువారం సికింద్రాబాద్లో 39 తులాల బంగారం కొనుగోలు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ బస్టాండ్ నుంచి సంగారెడ్డికి బస్సులో తిరిగి వస్తుండగా బ్యాగ్ సీట్లో పడిపోయింది. అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న దుర్గయ్య అనే ప్రయాణికుడు కండక్టర్ శ్రీధర్ రెడ్డికి బ్యాగ్ను అందజేశాడు. వెంటనే డిపో మేనేజర్కు తెలియజేయగా.. సంబంధిత ప్రయాణికులకు సమాచారం అందించి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 39 తులాల బంగారు బిస్కెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న దుర్గయ్యను ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులు అతడికి ధన్యవాదాలు తెలిపారు. -
ఎంచె దాటేదెలా.. పంట చేరేదెలా!
వరద మిగిల్చిన నష్టం అన్నదాతలను వీడటం లేదు. మంజీరా వరదలతో కుర్తివాడ ఎంచె (వంతెన)కొట్టుకు పోయింది. ఇంత వరకు తాత్కాలిక మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో వంతెన అవతల మంజీరా ఒడ్డున సాగుచేసిన 200 ఎకరాల పంట నీటిపాలైంది. అలాగే సుమారు 800 ఎకరాల్లో పండిన వరి పంట కోత కొచ్చింది. కోసిన ధాన్యం ఇంటికి రావాలంటే ఎంచె ఒక్కటే మార్గం. 2008లో అప్పటి ఎమ్మెల్యే శశిధర్రెడ్డి చొరవతో రూ.78 లక్షల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. ఇటీవల వరదలతో రోడ్డు కొట్టుకు పోయిందని, ఇప్పుడు ధాన్యం ఇంటికి తీసుకు రావాలంటే మార్గం మూసుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే చేతికొచ్చిన పంట కూడా నీటి పాలవుతుందని, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. – పాపన్నపేట(మెదక్) -
కారు చీకట్లో కాంతి రేఖ..!
సిద్దిపేటకమాన్: కార్నియా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఇదో శుభవార్త. తిరిగి చూపును ప్రసాదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టు కింద పోస్టు గ్రాడ్యుయేషన్ టీచింగ్ సదుపాయం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మూడు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన వ్యక్తి నుంచి ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగ వైద్యులు కార్నియా సేకరించి హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆసుపత్రికి పంపుతారు. వాటిని అవసరమైన వారికి అమర్చి తిరిగి కంటి చూపును ప్రసాదించనున్నారు. ఇందుకోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్నర్సులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆరు గంటల్లోపు కార్నియా సేకరణ సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చే మృతదేహాల నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి, ప్రత్యేక బాక్సులో స్టోర్ చేస్తారు. ఆర్టీసీ ద్వారా హైదరాబాద్ సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కార్నియాలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు చూపును తిరిగి తీసుకురావచ్చని ఆసుపత్రి ఆప్తమాలజీ హెచ్ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. స్టాఫ్ నర్సులకు అవగాహన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంతో సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత ఆధ్వర్యంలో ఆప్తమాలజీ హెచ్ఓడీ చంద్రశేఖర్ వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. దీంతో ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులు, వారి అటెండ్లకు కార్నియా డొనేట్ చేసేలా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. వైద్యులు, సిబ్బందికి అవగాహన చనిపోయిన వ్యక్తి నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి అమర్చడం వల్ల కంటి చూపును ప్రసాదించవచ్చు. పైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎంపికైంది. చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియా దానం చేసేలా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. – డాక్టర్ సంగీత, సూపరింటెండెంట్ సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి -
మనసున్న మాస్టారు..
తొగుట(దుబ్బాక): విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేసిన ఉపాధ్యాయుడు ముక్క రమేశ్ అభినందనీయుడని ప్రధానోపాధ్యాయుడు నయీమా కౌసర్ అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన 39మందికి రమేశ్ దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పేద కుటుంబాల విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని గమనించి వారి అవసరాలను తీర్చడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లుగా విద్యార్థులకు ఏదో రకంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్కు చెందిన ఒరాకిల్ స్వచ్ఛంద సంస్థ నుంచి రూ 40వేల విరాళంగా సేకరించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని పేర్కొన్నా రు. అలాగే విద్యార్థులకు రూ 5వేల విలువగల క్రీడా సామగ్రిని అందించారని తెలిపారు. విద్యార్థులు ఎంఎంఎస్ పరీక్షలకు సిద్ధం కావడాని కి రూ 3వేల విలువగల పుస్తకాలు అందించా రని గుర్తుచేశారు. రమేష్ అందిస్తున్న సేవా కార్యక్రమాల మూలంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోందన్నారు. -
దిగుబడి..దిగాలు
రాయికోడ్(అందోల్)/న్యాల్కల్ (జహీరాబాద్): ఈ ఏడాది పత్తి సాగు రైతులకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. రూ.వేలల్లో పెట్టుబడులు వెచ్చించిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని వాపోతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడిని ఆశించిన రైతులకు కేవలం మూడు నుంచి నాలుగు క్వింటాళ్లే వస్తుండటంతో రైతులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. జిల్లాలో 3.68 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా సుమారు 3,87,539 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. సదాశివపేట, రాయికోడ్, మునిపల్లి, వట్పల్లి, నారాయణఖేడ్, మనూరు తదితర మండలాల్లో అధికంగా సాగు చేశారు. అప్పటికే పత్తి పంటపై ఎకరా సాగు కోసం రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. తొలుత పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలో పత్తి రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాలకు పత్తిపంటలు దారుణంగా దెబ్బతినడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. వచ్చిన దిగుబడినైనా దక్కించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూలీలకు అధిక రేట్లు ఓ వైపు, కూలీల కొరత మరోవైపు పత్తిరైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పత్తితీత కోసం కిలో రూ.16 చొప్పున కూలీలకు చెల్లించాల్సి వస్తుండటంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. వేధిస్తోన్న కూలీల కొరత జిల్లాలో కూలీల కొరత ఉండటంతో ఉమ్మడి మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మైబూబ్ నగర్, రంగారెడ్డి, దేవరకొండ, కర్నూల్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలను ద్వారా కూలీలను తెప్పించుకుని రైతులు పత్తితీత పనులు కొనసాగిస్తున్నారు. కూలీలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు అయ్యే రవాణ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తోంది. ఇక వలస కూలీలకు వారానికొకసారి దావత్ కూడా ఇవ్వవలసి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. రైతులకు ఈసారి కలిసిరాని పత్తి సాగు! రూ.12 వేలు చెల్లిస్తే... క్వింటాలు పత్తికి రూ.8,110లుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు తగ్గనుండటంతో తాము నష్టపోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వింటాల్కు రూ.12 వేలు చెల్లిస్తే నష్టాల నుంచి కొంతమేర బయట పడొచ్చని రైతులు ఆశిస్తున్నారు. కూలీలు దొరకడం లేదు నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేసి రూ.లక్షకు పైగా వెచ్చించాను. పత్తితీతకు స్థానికంగా కూలీలు దొరకడం లేదు. యాసంగి పంటలపైనే ఆశలు పెట్టుకున్నాను. –భాగన్న, రైతు మాటూర్ గ్రామం రూ.12 వేల ధర నిర్ణయించాలి అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీసం రూ.12 వేలు నిర్ణయించి ఆదుకోవాలి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. దీంతో వెచ్చించిన పెట్టుబడులు వస్తే చాలని భావిస్తున్నాం. –గోపాల్రెడ్డి, రైతు, ఖాంజమాల్పూర్ రాయికోడ్ మండలంతీతలో జాగ్రత్తలు పాటించాలి పత్తి పూత, కాత సమయాల్లో వర్షాలు అధికంగా కురవడంతో పత్తి దిగుబడి పడిపోయింది. దీంతో తీత లో రైతులు జాగ్రత్తలు పాటించాలి. పత్తికాయ నుంచి పత్తిని పూర్తిగా తీయాలి. రవాణాలో పత్తి వృథాను అరికట్టాలి. పంటకు దుమ్ముధూళీ అంటుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయం అనంతరమే పత్తిని తీయాలి. పంటను ఆరబెట్టి నాణ్యతను కాపాడుకోవాలి. –సత్యనారాయణ. ఏడీఏ రాయికోడ్. -
ఎన్నికల అధికారులంఅంటూ తనిఖీ
దంపతుల నుంచి 6 తులాల నగలు తస్కరణ పాపన్నపేట(మెదక్): ఎన్నికల అధికారుల మంటూ నమ్మబలికి దంపతుల వద్ద నుంచి 6 తులాల బంగారం తస్కరించారు. ఈ సంఘటన పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివా స్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగ్సాన్పల్లికి చెందిన ఏడుపాయ ల మాజీ డైరెక్టర్ బూచనెల్లి కిషన్, మాణెమ్మ దంపతులు ఎల్లుపేటలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యక్రమానికి స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో కొత్తపల్లి అనంతుని వాగు వంతెన వద్దకు రాగానే.. ఇద్దరు అగంతుకులు తాము ఎన్నికల అధికారులమంటూ వీరి వాహనాన్ని ఆపారు. తమ వద్ద నగదు లేదని వారు చెప్పగా, మాణెమ్మ మెడలో ఉన్న బంగారాన్ని చూపిస్తూ.. జాగ్రత్తమ్మా దానిని స్కూటీ డిక్కీలో వేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి, డిక్కీలో వేసింది. వెంటనే అగంతకులు మరోసారి చెక్ చేద్దామంటూ.. డిక్కీలో చేయి పెట్టి, మాటలతో ఏమార్చి నగలు తస్కరించారు. అగంతకులు వెళ్లి పోగానే అనుమానం వచ్చిన దంపతులు, డిక్కీలో బంగారు ఆభరణాల కోసం వెతకగా..అవి కనిపించ లేవు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
● మహిళ కడుపులో 4.1 కిలోల గడ్డ తొలగింపు ● దుబ్బాక ఆస్పత్రి వైద్యుల ఘనత దుబ్బాక: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. బుధవారం సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ ఆధ్వర్యంలో వైద్యులు ఓ మహిళకు కడుపులో నుంచి 4.1 కిలోల ఓవరియాన్ మాస్గడ్డను తొలగించారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందెడ్కు చెందిన జయ(30) ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. నాందెడ్లో ఎన్నో ఆస్పత్రులు తిరిగినా తగ్గడం లేదు. బంధువుల సమాచారం మేరకు మూడు రోజుల క్రితం దుబ్బాక ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అయితే కడుపులో 15 సెంటీమీటర్ల ఓవరియాన్ మాస్ గడ్డ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో బుధవారం ఆయుష్మాన్భారత్ పథకం కింద ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి గడ్డను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హేమరాజ్సింగ్ తెలిపారు. కాగా, ఆపరేషన్ చేసి జయ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆమె బంధువులు అభినందనలు తెలిపారు. -
ఎస్జీఎఫ్ క్రీడా సంబురం
● నేటి నుంచి పటాన్చెరులో ప్రారంభం ● మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు ● తరలిరానున్న 33 జిల్లాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పటాన్చెరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలకు పటాన్చెరు మైత్రి మైదానం వేదికగా నిలవబోతోంది. గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో క్రీడా పోటీల తోపాటు, క్రీడాకారులకు ఉచిత వసతి, భోజనం, ట్రోఫీలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు, 60 మంది శిక్షకులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా సంబరాల్లో పాల్గొనబోతు న్నారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు జరగనున్నా యని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో మొదటిసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్చెరును వేదికగా నిలపడం జరిగింది. త్వరలో మహిళల కబడ్డీ జాతీయ పోటీలకు పటాన్చెరు వేదికగా నిలవబోతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. -
ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటో!
టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాం తడి, పొడి చెత్త విభభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బసిల్ ఏజెన్సీకి అప్పగించాం. చెత్త విభజనపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. పొడి చెత్త అమ్మకంపై వచ్చే ఆదాయం నుంచి మున్సిపల్కు కొంత డబ్బు రావాల్సి ఉంటుంది. ఏజెన్సీ మాత్రం మున్సిపల్కు డబ్బులు ఇవ్వడం లేదు. ఇక నుంచి పొడి చెత్తపై టెండర్ ప్రక్రియను చేపడుతాం. మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వినియోగించే ఆటోలు, ట్రాక్టర్, అందులో పోసే డీజిల్ ఖర్చంతా మున్సిపాలిటీదే. చెత్తను సేకరించి డీఆర్సీసీ సెంటర్కు తరలించేది మున్సిపల్ కార్మికులు. చెత్తను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు మున్సిపల్దే. వాహనాలు, వాటి మరమ్మతుల ఖర్చులన్ని మున్సిపల్వే. అలాంటప్పుడు పొడి చెత్త ద్వారా వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీకి నయా పైసా రావడంలేదు. గంపగుత్తగా అమ్ముకోవడానికి చేసుకున్న ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. పొడి చెత్త నుంచి వచ్చే ఆదాయంలో కనీసం 30 శాతం మున్సిపల్కు చెల్లించాల్సి ఉంటుంది. పొడి చెత్తలో వచ్చే ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ సీసాలు, అట్టలు ఇలా వచ్చిన వస్తువులకు గాను కిలో కొంత కార్మికులకు ఇన్సెంటివ్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్డుల వారీగా తడి, పొడి చెత్త విభజనపై సంస్ధ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు. -
మౌలిక సదుపాయాలు కల్పించండి
సంగారెడ్డి జోన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని, ప్రతీ మండలం, నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లను నియమించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ నివేదికలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్, టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా హార్వెస్టర్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం రైతుల విశ్రాంతి కోసం షెడ్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో డీఎం సివిల్ సప్లై అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలసరోజ, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, పీడీ డీఆర్డిఏ జ్యోతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
మళ్లీ తెరపైకి!
● బడుల తనిఖీలకు టీచర్లు ● పాఠశాలల వారీగా కమిటీలు ● గతంలో వెనక్కి తగ్గిన విద్యాశాఖ చేగుంట మండలం కరీంనగర్ స్కూల్లో తనిఖీసర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యను అందించి.. విద్యార్థుల్లో స్థాయికి తగ్గ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా టీచర్ర్లతో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అప్పట్లో టీచర్లు వ్యతిరేకించడంతో అమలును నిలిపివేశారు. తిరిగి కొన్ని మార్పులతో టీచర్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా జిల్లాలో డీఈఓ రాధాకిషన్ సారథ్యంలో ఇప్పటికే వేసిన జిల్లాస్థాయి కమిటీ రోజు వారీ తనిఖీలు జరుపుతోంది. – మెదక్ అర్బన్ ప్రతి వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక కమిటీ, 50 ఉన్నత పాఠశాలలకు మరో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి, ప్రతి వారం డీఈఓలకు నివేదిక అందజేయాలి. ప్రాథమిక పాఠశాలకు ప్రైమరీ హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎం నోడల్ అధికారిగా, ఎనిమిది మంది సబ్జెక్ట్ టీచర్లు, పీఈటీలు సభ్యులుగా ఉంటారు. పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసిన టీచర్లు కనీసం పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండాలి. జిల్లాలో ఇప్పటికే మొదలైన తనిఖీలు కనీస సామర్థ్యాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఇప్పటికే జిల్లాలో ఒక తనిఖీ టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎంఓ, సెక్టోరియల్ అధికారులు, ఆయా మండల ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజు ఒక మండలానికి వెళ్లిన టీం సభ్యులు, విడిపోయి ఒక్కొక్కరు ఒక పాఠశాలకు వెళ్తున్నారు. విధిగా ప్రార్థనలో ఉండి, మద్యాహ్నం వరకు ఈఎల్ఎం అమలు తీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలోని చతుర్విద ప్రక్రియలు వస్తున్నాయా..? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు అభ్యాస దీపికల వినియోగాన్ని గమనిస్తున్నారు. టీచింగ్ డైరీ, పీరియడ్ ప్లాన్స్, టీఎల్ఎం వాడకం తీరును చూస్తున్నారు. అయితే ఎండ్లైన్.. బేస్లైన్ టెస్ట్లలో టీచర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలుస్తుంది. పలుచోట్ల బేస్లైన్ టెస్ట్లను మూల్యాంకనం చేయడం లేదని సమాచారం. ఎండ్లైన్లో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు, బేస్లైన్లో 6 శాతం చూపడం దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మూడు మండలాల్లో జిల్లా టీంలు తనిఖీలు నిర్వహించారు. -
కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక
రామచంద్రాపురం(పటాన్చెరు): కార్యకర్తల అభీష్టం మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట స్పష్టం చేశారు. రామచంద్రాపురం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాల సేకరించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేస్తామన్నారు. అధిష్టానం ఎవరిని నియమించినా అందరూ కలసికట్టుగా, ఐక్యం ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, రాష్ట్ర సీనియర్ నాయకులు నీలం మధు, గాలి అనిల్ కుమార్, శశికళ, చిన్న ముదిరాజ్, జిల్లా నాయకులు మవీన్ గౌడ్, అరుణ్ గౌడ్, శ్యామ్రావు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట -
ఇల్లు లేని బతుకు ఇంకెందుకు..?
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యచేగుంట(తూప్రాన్): తనకు ఇల్లు లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చేగుంట మండలం పొలంపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ (30)కు సొంత ఇల్లు లేకపోవడంతో గ్రామంలోని ఓ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు కాలేదు. ఇంటి విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇల్లు లేని బతుకు ఇక ఎందుకు అని వాపోయేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సోమవారం బయటకు వెళుతున్నట్లు చెప్పి ఇంట్లోంచి వెళ్లాడు. ప్రవీణ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం స్థానిక చెరువులో ప్రవీణ్ మృతదేహం తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
చట్టాలపై అవగాహన అవసరం: సౌజన్య
ఝరాసంగం(జహీరాబాద్): ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ... విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని లక్ష్యాలను సాధించాలన్నారు. క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ అంజమ్మ, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఘటన
ఇద్దరి బలవన్మరణం రామాయంపేట(మెదక్): రామాయంపేట మండల పరిధిలో వేర్వేరు కారణాల తో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. సదాశివనగర్ తండాకు చెందిన లంబాడి మున్యా (35) వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. తెల్లవారు జామున అతని భార్య లేచి చూడగా, ఇంట్లో ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. దీంతో భయాందోళన చెందిన ఆమె విలపిస్తూ ఈ విషయమై తండా వాసులకు సమాచారం అందించింది. ఎస్ఐ బాల్రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ కాలనీలో .. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ (38) స్థానిక డబుల్ బెడ్రూం కాలనీ ( కేసీఆర్ కాలనీ)లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బాలకృష్ణ రాత్రి తన వ్యవసాయ బోరు వద్ద క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరుస బదిలీలు అందుకేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కీలక అధికారులపై వరుసగా వేటు పడుతుండటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా రెవెన్యూశాఖలో అధికారులకు ఆకస్మికంగా స్థాన చలనాలు కలుగుతుండటం కలకలం రేపుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై ఇటీవల ఆకస్మిక బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రాంరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. ఆయన్ను ఏకంగా జిల్లాలోనే అత్యంత మారుమూల మండలమైన నాగల్గిద్దకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిపాలన సౌలభ్యం పేరుతో ఈ బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. కానీ ఈ బదిలీ రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంగ్రాంరెడ్డిపై ఆకస్మిక బదిలీ వేటుకు కారణాలేంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిడే కారణమా? లేదంటే ఏదైనా అవినీతి ఆరోపణలా? అనే అంశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల బదిలీల్లో భాగంగా సంగ్రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి రామచంద్రాపురం తహసీల్దార్గా పనిచేస్తున్నారు. కాగా, ఈ రామచంద్రాపురం తహసీల్దార్ పోస్టుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. పూర్తిగా నగరంలో కలిసి పోయిన ఈ మండలంలో పట్టణీకరణ ఉన్న ప్రాంతం. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రూ.వందల కోట్లు విలువ చేసే భూములు ఉండే ఇలాంటి మండలాల్లో కీలకమైన తహసీల్దార్ పోస్టు కోసం అధికారులు చేయని ప్రయత్నాలు ఉండవు. పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు చేసుకుని, ప్రజాప్రతినిధుల అండదండలతో ఇలాంటి మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుంటారు. అయితే ఇలాంటి మండలం కీలక మండలం నుంచి ఆకస్మికంగా ఏకంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలం నాగల్గిద్దకు బదిలీపై పంపడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. బదిలీ అయిన సంగ్రాంరెడ్డి బుధవారం వరకు విధుల్లో చేరలేదని సమాచారం.గత నెలలో ఆర్డీఓపై వేటు.. సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేసిన రవీంద్రెడ్డిపై గత నెల సెప్టెంబర్లో ఆకస్మిక వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. రవీందర్రెడ్డి బీఆర్ఎస్ హాయాంలో జిల్లాలో చాలా కాలంగా పనిచేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే రవీందర్రెడ్డిని నిమ్జ్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు బదిలీ జరిగింది. ఇది లూప్లైన్ పోస్టుగా రెవెన్యూ వర్గాల్లో అభివర్ణిస్తుంటారు. లూప్లైన్ పోస్టులోకి వెళ్లిన వెంటనే రవీందర్రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో కొన్ని నెలల్లోనే తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఈ ఆర్డీఓ కార్యాలయం పనితీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనేది బహిరంగ రహస్యంగా మారింది. సామాన్య రైతులు, నిరుపేదలు వివిధ పనుల నిమిత్తం ఈ కార్యలయానికి వస్తే కనీసం పట్టించుకోని అధికారులు..బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల పనులను మాత్రం చకచకా చేసిపెట్టడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో రవీంద్రెడ్డిపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఇది దాదాపు నెల రోజులు గడుస్తుండగానే ఇప్పుడు రామచంద్రాపురం తహసీల్దార్ను అత్యంత మారుమూల మండలానికి పంపడం రెవెన్యూశాఖతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై.. ఇప్పుడు ఆర్సీపురం తహసీల్దార్కు స్థాన చలనం అత్యంత డిమాండ్ ఉన్న మండలం నుంచి మారుమూల మండలానికి.. రెవెన్యూశాఖలో చర్చనీయాంశమవుతున్న అధికారులపై చర్యలు -
బకాయి తిరిగిరాక బలవన్మరణం
జహీరాబాద్ టౌన్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బును సకాలంలో ఇవ్వకపోవడంతో భర్తకు సమాధానం చెప్పలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జహీరాబాద్ పట్టణ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం...జహీరాబాద్ పట్టణ పరిధిలో అల్లీపూర్ షేరి నగర్కు చెందిన చింతల్గట్టు గొల్ల రాజు(38) సదాశివపేట సమీపంలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవసరాల కోసం నర్సింహులు వద్ద బంగారంపై రూ.4 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుల్ని బ్యాంక్లో కట్టమని భార్య స్వప్నకు నాలుగు లక్షలు ఇచ్చాడు. అయితే ఆమె పరిచయం ఉన్న కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామానికి చెందిన శంకర్కు ఆ డబ్బును అప్పుగా ఇచ్చింది. విషయం భర్తకు కూడా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని శంకర్ను అడగడంతో డబ్బులు ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురైన స్వప్న బుధవారం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీకాలతోనే గాలికుంటు నివారణ
సంగారెడ్డి టౌన్: పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. ఈ వ్యాధి నివారణ కోసం టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రతీ ఏటా ఆరు నెలలకొకసారి వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు. నెలరోజుల పాటు టీకాలు ఈనెల15న టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా 23,30,904 పశు పక్ష్యాదులుండగా వీటిలో మూడు నెలలు పైబడిన పశువులకు టీకాలు వేస్తారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీకాలు వేసిన పశువులకు గుర్తుగా కొమ్ములకు ఆకుపచ్చ రంగు వేస్తున్నారు. వ్యాధి లక్షణాలు పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండను కూడా ఇవి తట్టుకోలేవు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుంది. వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి. నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు టీకా వేయించాలి. ఆవులు, గేదెలకు 2 మిల్లీ లీటర్ల చొప్పున టీకా ఇవ్వాలి. టీకాల వేయించడం ద్వారా అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.సద్వినియోగం చేసుకోవాలి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలి. ఈ నెల 15 నుండి నవంబర్ 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వసంతకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిముందస్తు టీకాలతో వ్యాధి నివారణ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఝరాసంగం(జహీరాబాద్): పశువులకు ముందస్తుగా టీకాలు వేయడంతో గాలికుంటు వ్యాధి నివారణ చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో ఆవులు, ఎద్దులు, గేదెలకు బుధవారం ఉచితంగా టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 1.45 లక్షల పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రావు పాటిల్, నాయకులు చంద్రశేఖర్, మారుతి రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, వేణుగోపాల్రెడ్డి, సంగమేశ్వర్, సిబ్బంది హర్షవర్ధన్ రెడ్డి, సునీల్దత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు 1.40లక్షల పశువులకు టీకాలు సద్వినియోగం చేసుకోనున్న రైతులు -
మంజీరాలో ఎముకల గూడు లభ్యం
గల్లంతైన 50 రోజులకు ఆచూకి కొల్చారం(నర్సాపూర్): యాభై రోజుల క్రితం మంజీరాలో గల్లంతైన మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్కు చెందిన టేక్మాల్ ప్రమీల (58) ఆచూకీ లభ్యమైంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ మహ్మద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రమీల ఆగస్టు 26వ తేదీన కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని మంజీరా వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతైంది. నాటి నుంచి వదర ప్రవాహం తగ్గకపోవడంతో ఆచూకీ తెలియకుండా పోయింది. నాలుగు రోజులుగా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో చిన్నఘనాపూర్ శివారులోని మంజీరాలో ఎముకల గూడుతో ఉన్న మహిళ మృతదేహం కనిపించడంతో అటువైపుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ ఎముకల గూడుపై ఉన్న చీర ఆధారంగా ప్రమీలగా గుర్తించారు. మృతురాలి కుమారుడు వీరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కలాం జీవితం స్ఫూర్తిదాయకం
పటాన్చెరు: అత్యంత సామాన్య కుటుంబం నుంచి జీవితాన్ని ప్రారంభించి.. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతోపాటు రక్షణ రంగంలో మిస్సైల్మెన్గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ..అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేశామన్నారు. ప్రతీరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతీ విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
స్కూటీలో నుంచి నగదు చోరీ
జహీరాబాద్ టౌన్: పట్ట పగలే గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీలో నుంచి నగదు అపహరించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన అంజయ్య ఎస్బీ ఐ బ్యాంక్ నుంచి మంగళవారం రూ.3.17 లక్షలు డబ్బు డ్రా చేసుకుని బయట పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కీలో పెట్టి మళ్లీ లోపలికి వెళ్లి వచ్చారు. బ్యాంక్ పని పూర్తయ్యాక స్కూటీ డిక్కీ తెరిచి ఉండడంతో అందులోని నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు. బాధితుడు జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వినయ్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మందుబాబులకు జరిమానసంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎనిమిది మందిని అదుపు లోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని బుధ వారం కోర్టులో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ.. ముగ్గురికి రూ.1,500, మిగతా ఐదు మందికి రూ.1,000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్గొన్నారు. రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలునిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలో ని నందిగామ శివారులో బుధవారం ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. వివరా ల ప్రకారం.. మండలంలోని ఎంపీడీఓ కార్యా లయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, ఫారెస్ట్ ఆఫీసర్ మహేశ్ బైక్పై రామాయంపేట నుంచి నిజాంపేటకు వస్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ఆవుల అపహరణకల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని ఫత్తేపూర్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆవులు అపహరించారు. గ్రామానికి చెందిన హన్మంత్, గాండ్ల పండరికు చెందిన పశువులను ఇంటి ఎదుట కట్టేశారు. ఉదయం చూసేసరికి ఆవులు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీట మునిగి వ్యక్తి మృతి మంజీరాలో మోటారు తీస్తుండగా ప్రమాదం పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో విద్యుత్ మోటారును తీసేందుకు వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘట న కుర్తివాడలో బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆబిద్ (53) వ్యవసాయంతో పాటు, ఆటో నడుపు కొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంజీరా నది దగ్గర ఉన్న తన పోలానికి ,నీరందించే విద్యుత్ మోటారు పైప్లైన్ ఊడిపోయింది. దాన్ని బిగించేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం అతని మృతదేహం దొరికింది. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి కొండపాక(గజ్వేల్): విద్యార్థిని మల్లం మేఘన(14) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కుకునూరుపల్లికి చెందిన మేఘన రోజూ లాగానే 6వ తేదీన పాఠశాలకు వెళ్లింది. అయితే సర్టిఫికెట్ మర్చిపోవడంతో స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చింది. తిరిగి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా హైదరాబాద్ వైపు బుల్లెట్పై వెళ్తున్న కోతి అనిల్ ఢీ కొట్టాడు. దీంతో తలకు గాయాలై కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆమె తండ్రి ఐలయ్య ఫిర్యాదు మేరకు కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్కు గాయాలుఅక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్ధండి సంపత్రాజు ఆర్టీసీ డ్రైవర్. రోజు మాదిరిగానే డ్యూటీకి తన ద్విచక్రవాహనంపై హుస్నాబాద్కు వెళుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో సంపత్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సహాయంతో హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ బి.సౌజన్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈఓ శివ రుద్రప్ప, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు. సజ్జనార్కు ‘ఫొటోఫ్రేమ్’ అందజేతకల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం జంల తండాకు చెందిన రాష్ట్ర బంజార సంఘం నాయకులు చరణ్సింగ్ బుధవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం సజ్జనార్కు ఫోటో ఫ్రేమ్ అందజేశారు. ఆశ్రమ పాఠశాల తనిఖీనారాయణఖేడ్: ఖేడ్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, వసతిగృహాన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాబోధన, భోజనం నాణ్యత విషయాల గురించి విద్యార్థులను ఆరా తీశారు. వసతిగృహంలో సమస్యలు, అవసరాలను గురించి వసతిగృహం సంక్షేమ అధికారిణి బాలమణిని అడిగి తెలుసుకున్నారు. విద్య, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి, పరిశుభ్రత తదితర విషయాల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చట్టం చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజుసంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్కిషన్ భవన్లో బుధవారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో జయరాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం వెంటనే 42% రిజర్వేషన్ అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగూరులో జలవిద్యుత్ ఉత్పత్తిపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. దీంతో క్రస్టు గేట్లు మూసివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా రోజుకు 2,500 క్యూసెక్కుల నీటితో రెండు టర్బయిన్లను ఆన్ చేసి 0.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. -
ఎవరిది ఈ చెత్త ఐడియా..!
సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది అన్నట్లుందీ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి. కష్టం కార్మిలకుదైతే.. కాసులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ జేబుల్లోకి వెళుతున్నాయి. చెత్త సేకరణ ప్రక్రియకు సంబంధించి ఖర్చంతా భరిస్తున్న మున్సిపాలిటీకి నయా పైసా ప్రయోజనం చేకూరడం లేదు. ఈ ‘చెత్త’ఐడియా మున్సిపల్ అధికారులకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని పట్టణ ప్రజలు విస్మయం చెందారు. హుస్నాబాద్: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. తడి చెత్తను వేరు చేసి అక్కడే సేంద్రియ ఎరువుగా మారుస్తుంటే.. పొడి చెత్తను ఓ స్వచ్ఛంద సంస్ధ సొమ్ము చేసుకుంటోంది. తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, బసిల్ ఫౌండేషన్ తెలంగాణ స్వచ్ఛంద సంస్ధతో ఒప్పందం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రతి రోజు 10 ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. మొత్తం 26 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి నెల 195 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో 20 టన్నుల పొడి చెత్తను వేరు చేసి, మిగతా తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. పొడి చెత్తను అమ్ముకునేందుకు మహిళా సంఘాలకు అప్పగించాల్సి ఉండగా, ఐదేళ్ల వరకు బసిల్ ఫౌండేషన్కు అప్పగించారు. -
భరోసా సేవలు అభినందనీయం
సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రం ద్వారా అందించే సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రంలో భరోసా ఐదవ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...మహిళలు, బాలికల సంరక్షణకు పెద్దపీట వేశామన్నారు. మహిళలు, పిల్లలు భయం వీడి నిర్భయంగా వచ్చి తమ సమస్యను తెలుపుకోవచ్చని ధైర్యం చెప్పారు. గత ఐదేళ్లలో 657 పోక్సో, అత్యాచార కేసుల్లో వైద్య, న్యాయ సేవలను అందించినట్లు తెలిపారు. 407 కేసులలో రూ1.73 కోట్ల పరిహారం, 24 మందికి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ రూ.64లక్షలు అందించినట్లు వివరించారు. తక్షణ పరిహారంగా డీఎల్ఎస్ఏ నుంచి రూ. లక్షను, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 50 మందికి రూ: 2.83లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భరోసా నోడల్ అధికారి, అదనపు ఎస్పీ రఘునందన్రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
పర్యవేక్షణ ఫలించేనా?
సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడం లాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని గుర్తించిన ప్రభుత్వం బడులను తనిఖీ చేసే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకుముందు కూడా ఇలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కుతగ్గిన సంగతి తెలిసిందే. – న్యాల్కల్(జహీరాబాద్):జిల్లాలో 864 ప్రాథమిక పాఠశాలలు, 191 ప్రాథమికోన్నత, 243 ఉన్నత పాఠశాలలు(ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు) ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 6,208 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తొమ్మిది బృందాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రెండు, ఉన్నత పాఠశాలలకు మూడు బృందాల చొప్పున జిల్లాలో 14 టీమ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన కమిటీల్లో ముగ్గురు సభ్యులు ఉండగా, ఉన్నత పాఠశాలల కమిటీల్లో తొమ్మిది మంది సభ్యులుంటారు. ఈ కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి. తనిఖీ బృందాలతో మంచి ఫలితాలు! ప్రస్తుతం పాఠశాలలను కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈఓలు తనిఖీ చేస్తున్నారు. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం తనిఖీల కోసం ఈ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా పాఠశాలలను సందర్శించి పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలు తీరు, బోధనా విధానం తదితర అంశాలను పరిశీలిస్తుంది. నివేదికలను పైఅధికారులకు పంపిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ సమీక్షలు నిర్వహించనుండటంతో మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. అంతేకాకుండా అసలే ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులకు సరైన విద్యఅందడంలేదని, ఉన్న టీచర్ల నుంచే తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల చేత పాఠశాలలను తనిఖీ చేయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.బోధనపై ప్రతికూల ప్రభావం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6,972 మంది ఉపాధ్యాయులు ఉండవలసి ఉండగా ప్రస్తుతం 6,208 మందే ఉన్నారు. ఇంకా 764 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిటీల కోసం 60 మంది ఉపాధ్యాయులను తీసుకుంటే టీచర్ల కొరత ఇంకా ఎక్కువ కానుంది. ఫలితంగా చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. బడుల తనిఖీ బాధ్యత టీచర్లకిస్తూ ప్రభుత్వ నిర్ణయం గతంలోనూ ఉత్తర్వులు జారీ ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకతతో ఉపసంహరణ మళ్లీ తెరపైకి వచ్చిన పర్యవేక్షణ కమిటీలుటీచర్లను అవమానించడమే పాఠశాలలను ఉపాధ్యాయుల చేత తనిఖీ చేయించడం ఉపాధ్యాయులను అవమానించడమే. ఈ విధానాన్ని ఇంతకు ముందే వ్యతిరేకించాం. తనిఖీ కోసం ఉపాధ్యాయులను నియమిస్తే వారి కొరత ఇంకా అధికమై విద్యార్థులను నష్టం జరుగుతుంది. రెగ్యులర్ ఎంఈఓలు, నోడల్ అధికారులను నియమించి వారి చేత పాఠశాలలను తనిఖీ నిర్వహించాలి. దత్తాత్రి, తపస్ జిల్లా అధ్యక్షుడు కమిటీలను ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 1,298 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి తనిఖీ కోసం 14 బృందాలు ఏర్పాటు చేసి తనిఖీ చేపడతాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి -
బాబోయ్ దొంగలు
● ఒంటరి మహిళలే టార్గెట్ ● పెరుగుతున్న బంగారం ధరలు ● రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు దుబ్బాకరూరల్: రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం రూ.లక్షా30వేలకు చేరింది. ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ధర ఎంత పెరిగిన అవలీలగా కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచర్ల దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే అంతే.. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అపహరించడానికి ఎంతకై నా తెగిస్తున్నారు. చైన్ స్నాచర్లు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. దారి వెంట వెళ్తున్న వారి మెడలో బంగారం కనిపిస్తే కనిపిస్తే చాలు బలవంతంగా లాక్కెళ్తున్నారు. దీంతో మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. కొందరు స్నాచర్లు బైక్పై వచ్చి అడ్రస్ అడిగినట్లు నమ్మించి పుస్తెలతాడును తెంపుకెళుతున్నారు. ఉదయం వాకింగ్కు వెళ్లిన మహిళలపై దాడి చేసి బంగారం లాక్కెళ్తున్నారు. కొన్ని ఘటనలు.. -
కదలికలు గమనించి.. కళ్లలో కారం కొట్టి..
● పుస్తెలతాడు చోరీకి యత్నం ● దుండగుడిని పట్టుకున్న కార్ వాషింగ్ సెంటర్ నిర్వాహకుడుశంకర్పల్లి: ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్తో దాడిచేసి మహిళ పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా జుల్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకున్నాడు. అతడి బ్యాగులో కారం పొడి, మంకీ క్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తాను చనిపోతూ ఆరుగురికి అవయవదానం
అల్లాదుర్గం(మెదక్): తాను చనిపోతూ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశాడు. వివరా లు ఇలా... మండలంలోని చేవెళ్ల నివాసి మదునురోళ్ల శ్రీకాంత్ దసరా పండుగను సంతోషంగా తన స్వగ్రామంలో చేసుకున్నాడు. వృత్తి రీత్యా హైదరాబాద్కు తిరిగి బయలు దేరాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హైదరాబాద్లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జూదరుల అరెస్ట్ పాపన్నపేట(మెదక్): జూదం ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్గౌడ్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని యూసుఫ్పేట గ్రామ శివారులో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14,049 నగదు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గాంధీనగర్లో.. హుస్నాబాద్రూరల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని గాంధీనగర్ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రూ.6,010 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పెట్రోల్ బంక్లో చోరీ నిజాంపేట(మెదక్): పెట్రోల్ బంక్లో గుర్తు తెలియని వ్యక్తులు పలు సామగ్రిని అపహరించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్ను ఎనిమిది నెలల నుంచి మూసివేశారు. కాగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆఫీస్ అద్దాలు పగులగొట్టి కంప్యూటర్ మానిటర్, సీసీ కెమెరా మానిటర్ను దొంగిలించారు. బంక్ యాజమాని యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెటర్నరీ ఆస్పత్రిలో.. చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని వెటర్నరీ ఆస్పత్రిలో చోరీ జరిగింది. వివరాలు ఇలా... ఆస్పత్రిలోని స్టోర్ రూమ్ తాళం పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు సంపు మోటారును ఎత్తుకెళ్లారు. మంగళవారం సిబ్బంది వచ్చి చూడగా స్టోర్ రూం తాళం పగులగొట్టి ఉంది. వెటర్నరీ ఆఫీసర్ గీతా మాలిక మోటార్తో పాటు చిన్న చిన్న వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దాడి కేసులో ఇద్దరు అరెస్టుజోగిపేట(అందోల్): టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, భార్య వరలక్ష్మిపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్ఐ పి.పాండు కేసు వివరాలు వెల్లడించారు. వీరప్ప దంపతులు కంది మండలం నుంచి టేక్మాల్ గ్రామానికి కారులో వెళుతుండగా అందోలు గ్రామానికి చెందిన ఎండి. షాహిద్, ఎండి. జాఫర్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా మద్యం మత్తులో నడుపుతూ వారి కారును ఢీకొట్టారు. అంతేగాక కారును అడ్డగించి వీరప్పను కొట్టారు. అడ్డుకోబోయిన భార్య వరలక్ష్మిని కూడా గాయపరిచారు. కాగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. పాము కాటుతో యువకుడి మృతి దౌల్తాబాద్ (దుబ్బాక): పాము కాటుతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన జానిగామ దయాకర్ (22) తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పాము కాటు కరిచింది. వెంటనే అతడ్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ద్విచక్ర వాహనాలు సీజ్
సంగారెడ్డి క్రైమ్: నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సైలెన్సర్లతో ప్రజల ప్రశాంతతకు భంగం కల్గిస్తున్న ద్విచక్ర వాహనదారులపై పట్టణ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... వాహనాదారులు రోడ్లపై శబ్దం చేస్తూ వెళ్లడం ద్వారా శబ్ద కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఐబీ, పోతిరెడ్డి పల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించిన వాహనదారులను 50 మందికి పైగా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
కష్టే ఫలి!
● హర్యానా, గుజరాత్ నుంచి 34 గేదెలు ● రోజూ 160 లీటర్ల పాల విక్రయం ● 57 ఏళ్ల వృద్ధుడి సక్సెస్పై కథనంసొంతూరులో డెయిరీ ఫామ్ కష్టపడితే ఏదైనా సాధ్యం కృషి పట్టుదలతో పాటు కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. నలబై ఏళ్ల పాటు బయలు నాటకం నేర్పించా. గత సంవత్సరం మా ఊరులో 34 గేదెలతో డెయిరీ ఫామ్ పెట్టిన. రెండు ఫూటల 160 లీటర్ల పాలు విక్రయిస్తున్నా. పాలల్లో కల్తీ జరిగే ఈ రోజుల్లో.. నాణ్యమైన పాలను విక్రయిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – కాపు విఠల్, డెయిరీ ఫామ్ నిర్వాహకుడుఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే ఈ రోజుల్లో ఓ వృద్ధుడు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలబై ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి.. నేడు ఓ డెయిరీ ఫామ్కు ఓనర్ అయ్యాడు. నాణ్యమైన పాలను అందించడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్న అఖిల డెయిరీ ఫామ్ నిర్వాహకుడు కాపు విఠల్ సక్సెస్పై కథనం. – రేగోడ్(మెదక్) మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన 57 ఏళ్ల రైతు కాపు విఠల్కు తొమ్మిది ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. 1985లో బయలు నాటకాలు నేర్పించే విద్యను నేర్చుకుని 40 ఏళ్ల పాటు 47 గ్రామాలు, పట్టణాల్లో సుమారు వెయ్యి మంది కళాకారులతో బయలు నాటకం ప్రదర్శించారు. అల్లుడి సూచన మేరకు గత సంవత్సరం గ్రామంలో అఖిల డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. హర్యానా, గుజరాత్ నుంచి ఒక్కో గేదెకు సుమారు రూ. లక్ష 80 వేలు వెచ్చించి మొత్తం 34 గేదెలను తీసుకొచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సుమారు 160 లీటర్ల పాలను రేగోడ్, నారాయణఖేడ్లో విక్రయిస్తూ లాభాలను పొందుతూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నలుగురు బిహార్ కూలీలతో పాటు తాను పని చేస్తూ పామ్ను విజయవంతంగా నడుపుతున్నాడు. ఫామ్కు సు మారుగా రూ.కోటి ఖర్చు అయిందని విఠల్ తెలిపా రు. రోజూ పాల విక్రయంతో సుమారు రూ.8,800, నెలకు రూ. 2 లక్షల 64 వేలు సంపాదిస్తున్నాడు. నేటి సమాజానికి ఈ వృద్ధుడు ఆదర్శంగా నిలుస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఆక్రమణల తొలగింపు
జహీరాబాద్ టౌన్: రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని దత్తగిరి కాలనీలో ఆక్రమణలను తొలగించిన అధికారులు రంజోల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కోర్టు రోడ్డులో డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ రోడ్డులో స్థలాన్ని కబ్జా చేసి డబ్బాలు ఏర్పాటు చేశారు. కాగా పార్కింగ్కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన మూడు డబ్బాలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
పీటీఏల ఏర్పాటుపై వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో పేరెంట్, టీచర్ అసోసియేషన్(పీటీఏ)ల ఏర్పాటుపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్కార్ నుంచి సూచనలు పొంది చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయి దా వేసింది. తెలంగాణ విద్యా చట్టం–1982లోని సెక్షన్ 30 ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనేక చోట్ల ఆ మేరకు చర్యలు చేపట్టలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలం అల్లూర్ గ్రామానికి చెందిన ఉప్పు మల్లికార్జున్ పాటిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యా వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు భాగ స్వామ్యం ఉండేలా, కనీస వసతులు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పీటీఏలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభమైన 30 రోజులలోపు పాఠశాల హెడ్ మాస్టర్ పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చాలా స్కూల్స్లో ఇది అమలు కావడం లేదన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్–టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని సమర్పించేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. -
తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలునంగునూరు(సిద్దిపేట): తల్లికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం ఖానాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెంబర్ల కొమురవ్వ (85)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురి పెళ్లి చేసిన అనంతరం భర్త గురువయ్య మరణించడంతో మానసిక వికలాంగురాలైన చిన్న కూతురు విజయతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కొమురవ్వ మంగళవారం మృతి చెందింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కూతురు అరుణ తల్లికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. తల్లి మరణంతో వికలాంగురాలైన విజయ అనాథగా మిగిలింది. -
గంజాయి సాగుపై పోలీసుల కూంబింగ్
నారాయణఖేడ్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఖేడ్ డివిజన్ పరిధిలో మంగళవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి అక్రమ గంజాయిసాగు, నిల్వల గురించి కూంబింగ్ నిర్వహించారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై రావుల శ్రీశైలం ఆధ్వర్యంలో ఠాణాల ఎస్సైలు, సిబ్బంది, క్యూఆర్టీ టీంలు మంగళవారం పలు గ్రామాలు, తండాల శివార్లలోని పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక నుంచి అన్ని గ్రామాలు, తండాల్లో తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు. గంజాయిసాగు, నిల్వతో ఎవరైనా పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు, హిస్టరీషీట్ తెరుస్తామని, రైతుభరోసా నిలిపివేత చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయిసాగు, నిల్వల గురించి ఎవరికై నా తెలిస్తే డీఎస్పీ నంబర్ 87126 56709 కు, ఖేడ్ సీఐ 87126 56733 కు, ఖేడ్ ఎస్సై 87126 56757 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. -
పనికి వెళుతున్నానని చెప్పి..
యువతి అదృశ్యంపటాన్చెరు టౌన్: పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హిమబిందు వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన మధు కుమారి (21) హైదరాబాద్ మదీనగూడ పరిధిలోని షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి.. చేగుంట(తూప్రాన్): బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. బంధువులు, స్థానికుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు పిర్యాదు చేశారు. నర్సాపూర్లో వ్యక్తి.. నర్సాపూర్రూరల్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని రుస్తుంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొన్యాల దుర్గయ్య ఈనెల 12న మధ్యాహ్నం ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు వద్ద, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక
నారాయణఖేడ్: ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తల అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ జిల్లా పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. ఖేడ్లోని సాయిబాబా ఫంక్షన్హాల్లో మంగళవారం ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజరిట మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పార్టీలో తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరి సమష్టి కృషి కారణంగానే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. ఇదే ఐక్యతలో కార్యకర్తలు ఉండాలని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడి వచ్చిన దరఖాస్తుల్లో వడపోత నిర్వహించి ఆరుగురి పేర్లు అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం డీసీసీ అధ్యక్షుడి బాధ్యతగా ఉంటుందన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు మాట్లాడుతూ..కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే తాము విజయం సాధించామని, స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, శంకరయ్యస్వామి, రషీద్, ఆనంద్ స్వరూప్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పరిశీలకురాలు సిజరిట అధిష్టానానికి ఆరుగురి పేర్లు -
నిమ్జ్లో రైతుల సందడి
జహీరాబాద్ టౌన్: రెండు నెలల తర్వాత జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పరిహారం చెక్కుల కోసం రైతులు పట్టణంలోని నిమ్జ్ కార్యాలయానికి రావడంతో సందడి నెలకొంది. జూలై 10న నిమ్జ్ కార్యాయలంలో ఏసీబీ దాడులు చేయడంతో భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ అందుకున్న భూ సేకరణ పనులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆమె భూసేకరణపై శ్రద్ధ చూపుతున్నారు. దీంతో ప్రాజెక్టులో భూములు కొల్పోయిన రైతులు పరిహారం చెక్కుల కోసం కార్యాలయానికి వస్తున్నారు.మళ్లీ ఊపందుకున్న కార్యకలాపాలు -
18న బంద్ను విజయవంతం చేయాలి
సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మంగళవారం ఐబీలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, నాయకులు కూన వేణు, కుమ్మరి సాయిలు, శ్రీధర్ మహేంద్ర, రమేశ్ గౌడ్, పుల్లంగారి సురేందర్, గోకుల్ కృష్ణ, బలరాం, కృష్ణమూర్తి, రాందాస్ పాల్గొన్నారు.బీసీ నేతల రౌండ్టేబుల్ సమావేశం -
బాణసంచా దుకాణాల కేటాయింపు
నారాయణఖేడ్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఖేడ్ పట్టణంలోని తహసీల్ గ్రౌండ్లో బాణసంచా దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు మంగళవారం లాటరీ ద్వారా వాటిని కేటాయించారు. దుకాణాలను ఏర్పాటుకు 24 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్ కార్యాలయం నుంచి అటవీశాఖ కార్యాలయం ముందు వరకు అక్కడి నుంచి ఐబీ కార్యాలయం వైపునకు ఏర్పాటు చేసుకోవడానికి లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. వ్యాపారులు నిర్ణీత రుసుము చెల్లించి నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశివయ్య, శానిటేషన్ అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. అంతకుముందు లాటరీ విధానాన్ని దుకాణాల కేటాయింపు తీరును మైదానంలో డీఎస్పీ వెంకట్రెడ్డి పరిశీలించారు. అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలే జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వర్రావు సంగారెడ్డి క్రైమ్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పనిసరని జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వర్రావు హెచ్చరించారు. తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ..బాణసంచా విక్రయాల కోసం ఇప్పటివరకు 242 దరఖాస్తులు రాగా 162 దుకాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేశామన్నారు. పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్, బైపాస్లోని మహిళా ప్రాంగణం, మండే మార్కెట్లో దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం లోపించవద్దు డీపీఓ సాయిబాబాకంది(సంగారెడ్డి): గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డీపీఓ సాయిబాబా సూచించారు. మండల పరిధిలోని వడ్డెనగూడ, కొయ్యగుండు తండాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు పంచాయతీ సిబ్బంది వివరించాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి డీఆర్డీఏ జ్యోతి సంగారెడ్డి టౌన్: గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డీఆర్డీఏ జ్యోతి సూచించారు. సంగారెడ్డిలోని మహిళా సమాఖ్య కేంద్రంలో సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మహిళా సంఘాల సభ్యుల చేత కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చామన్నారు. ఖైదీలకూ న్యాయసహాయం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: జైలులో ఉన్న ఖైదీలకు న్యాయపరమైన సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. కందిలోని సెంట్రల్ జైలులో ఆమె మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఖైదీలకు కనీస సదుపాయాల అందించాలని సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. వంటశాలను, లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఆమె వెంట జిల్లా జైలు అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. -
వైద్యకళాశాలలో మైదానం ఏర్పాటు
సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జీజీహెచ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు కానున్న మైదానంలో క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కోర్టులు, వాలీబాల్ కోర్ట్, త్రోబాల్ కోర్టు, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు అనువైన మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం బేగ్కు సూచించారు. సదరం క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సదరం క్యాంప్నకు వచ్చే దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదరం క్యాంపులో పాల్గొనడానికి ఇప్పటివరకు 1,249 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఆస్పత్రి, వైద్యకళాశాల సందర్శన -
భూ నిర్వాసితులకు ఇంటి స్థలం కేటాయించాలి
ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుకొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అలియాబాద్, తొగర్పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ హామీ మేరకు ఇంటి స్థలం కేటాయించాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు విజ్ఞప్తి చేశారు. బాధిత రైతులకు ఇంటి స్థలానికి సంబంధించి పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ టీజీఐఐసీ చైర్మ్న్ నిర్మలారెడ్డి, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డితో కలసి మంగళవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిశారు. . ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రైతులు కొన్నేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి తక్షణమే ఇంటి స్థలం మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తొగర్పల్లిలో ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల భవనం పాడుబడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు కలెక్టర్కు వివరించారు. అనంతరం నిర్మలారెడ్డి మాట్లాడుతూ...కొండాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకులంగా స్పందించారు. -
ఆశలన్నీ కొనుగోలు కేంద్రాలపైనే
అకాల వర్షాలతో ఓవైపు పంటలు దెబ్బతినగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాలిక వానాకాలం పంటలు చేతికొస్తున్నాయి. ఇప్పటికే పెసర, మినుము పంటలు కోతలు కోసి రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా మారనుంది. బయట మార్కెట్లో, దళారుల వద్ద పంటలకు మద్దతు ధర లభించడంలేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. – నారాయణఖేడ్: తగ్గిన పంట దిగుబడి జిల్లాలో 67,676 ఎకరాల్లో సోయాబీన్ పంటను రైతులు సాగు చేశారు. పెసర పంట 12,116 ఎకరాలు, మినుము 9,688 ఎకరాల్లో సాగు చేశారు. అకాల వర్షాల వల్ల పెసర, మినుము పంటలు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు రావాల్సి ఉండగా కేవలం 3 క్వింటాళ్ల వరకే దిగుబడులు వచ్చాయి. సోయాబీన్ ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడులు రావాల్సి ఉండగా 4 నుంచి 6 క్వింటాళ్ల వరకే దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం సోయాబీన్ క్వింటాల్కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. గతేడాది ఈ పంటకు 4,892 మద్దతు ధర ఉండగా ఈసారి 8.9% మద్దతు ధర పెంచారు. పెసర రూ.8,682లు గతేడాది ఉండగా 1% పెంచి ఈ ఏడు రూ.8,767లు, మినుము గతేడాది రూ.7,400 చెల్లించగా 5.4% పెంచి రూ.7,800 చొప్పున మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో రైతులకు ప్రయోజనం చేకూరాల్సి ఉండగా ప్రస్తుత మార్కెట్లో పెసర, మినుము పంటలను దళారులు రూ.6వేల నుంచి రూ.7వేల లోపే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వర్షాలతో తడిసిన పంటలు.. కాగా ఈసారి భారీగా, ఏకధాటిగా వర్షాలు కురవడంతో చేలల్లో నీళ్లు నిలిచి పంటలు బాగా దెబ్బతిన్నాయి. దిగుబడులపై తీవ్ర ప్రభావం పడటంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదు. మార్కెట్లో తడిసిన పంటలకు ధర లేకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వం తడిసిన, రంగుమారిన పంటను కొనుగోలు చేయదు. దీంతో రైతులకు దళారులే దిక్కయ్యారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి తడిసిన పంటను కొనుగోలు చేసిన పక్షంలో రైతుల ప్రయోజనం కలిగేది. సోయాబీన్ పంట నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో అధికంగా పప్పుదినుసు పంటలు సాగవుతాయి. పంట విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.కోతలు ప్రారంభమైన సోయాబీన్ కానరాని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పెసర, మినుము దళారులపాలు -
మున్సిపాలిటీలతోనే మెరుగైన పాలన
పటాన్చెరు: గ్రామ పంచాయతీల కంటే మెరుగైన పరిపాలన మున్సిపాలిటీల ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్రెడ్డితో కలిసి ఆమె మంగళవారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పటాన్చెరు నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం, సమీకృత అభివృద్ధి కోసం నూతనంగా ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.15కోట్ల చొప్పున నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2047 విజన్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు పౌర సేవ కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ...రాబోయే తరాలకు మెరుగైన సౌకర్యాలు, అభివృద్ధితో కూడిన పట్టణాలను అందించాలన్న లక్ష్యంతోనే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందన్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫాల్గుణ కుమార్లు మాట్లాడారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్రావు, మున్సిపల్ సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పౌర సేవ కేంద్రం ప్రారంభం -
అవినీటి అధికారులపై వేటు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకు పోయి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మూకుమ్మడి బదిలీలు జరగనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిల్లో జిల్లాలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇలాంటి అధికారులపై దృష్టిసారించిన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మూడేళ్లకొకసారి బదిలీ ఎక్కడ? నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేతల పంచన చేరుతున్న కొందరు అధికారులు ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకేచోట కదలకుండా ఉన్నారంటే ఈ అధికారులు ఏ స్థాయిలో అక్రమార్జన కూడగట్టారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈశాఖలో ఒక చీఫ్ ఇంజనీర్, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 24 డీఈ పోస్టులున్నాయి. అలాగే సుమారు 80కిపైగా ఏఈలు, ఏఈఈలు పనిచేస్తున్నారు. ఖాళీలు పోగా సుమారు 120మందికి పైడా ఇంజనీరింగ్, టెక్నికల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్ద కాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులున్నారంటే ఏ స్థాయిలో వీరి ఆగడాలు సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి కోసమే ప్రత్యేక బదిలీలురాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజనీరింగ్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదుగురు డీఈలకు, 11 మంది ఏఈఈలకు స్థాన చలనం కలిగింది. అయితే ఈ బదిలీలతో సంబంధం లేకుండా సంగారెడ్డి జిల్లా కోసం ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వందల కోట్లు అక్రమార్జనకు మరిగిన ఈశాఖ అధికారులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ బదిలీల విషయం ముందే పసిగట్టిన ఈ అక్రమార్కులు మళ్లీ మంచి పోస్టింగ్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం త్వరలో జారీ కానున్న బదిలీల ఉత్తర్వులు! చెరువుల ఆక్రమణదారులతో చెట్టపట్టాల్ వందల చెరువుల అన్యాక్రాంతానికి పరోక్ష సహకారం కోట్లలో అక్రమాస్తులు కూడగట్టిన ఇంజనీరింగ్ అధికారులు సంగారెడ్డి ప్రాంతంలో సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చెరువుల కబ్జాదారులతో చేతులు కలిపారు. కంచే చేను మేసిన చందంగా చెరువులను కాపాడాల్సిన ఈ అధికారి వీటిని కబ్జా చేస్తూ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా వ్యవహరించారు. చెరువుల్లోంచి మట్టిని అక్రమ రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. పైగా చెరువులను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చాలు.. పెద్ద మొత్తంలో దండుకోవడం, ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంలో సదరు అధికారి ఆరితేరారు. రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారిపై ఇప్పుడు బదిలీ వేటు వేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.పటాన్చెరు ప్రాంతంలో సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న మరో ఇంజనీరింగ్ అధికారి చెరువుల కబ్జా రాయుళ్లతో చెట్టపట్టాలేసుకున్నాడు. సుమారు నాలుగు వందలకు పైగా చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర వాటర్బాడీలకు ఎన్ఓసీలు జారీ చేసి రూ.వందల కోట్లు వెనకేసుకున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పైగా చెరువులను కబ్జా చేసే అక్రమణదారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం అయ్యేందుకు పరోక్షంగా సహకరించాడు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈ అధికారికి స్థానచలనం కల్పించాలని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రతి ఒక్కరూ పనులు చేసే సమయంలో భద్రత నియమాలు పాటించాలని కార్మిక శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ లేబర్ సేల్ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, చారి, జనార్దన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చట్ట ప్రకారం అగ్రిమెంట్లు చెల్లవు
మార్టిగేజ్ ప్రాపర్టీస్కే లీగల్రైట్స్ ఉంటాయి. అప్పుల కోసం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సరికాదు. ఇంటర్నల్గా రెండు పార్టీలు బాండ్ పేపర్లపై, తెల్లకాగితాలపై చేసుకునే అగ్రిమెంట్లు కోర్టు అంగీకరించదు. సేల్డీడ్ ఉంటే ఆస్తిపై సర్వహక్కులు కోల్పోయినట్లే. అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా.. కబ్జాలో తామే ఉన్నట్టు రుజువు చూపిస్తే కొంత వరకు సేఫ్. కోర్టులో ప్రూవ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. బ్యాంకులు మార్టిగేజ్ చేసుకుంటాయి తప్పా ఆస్తులను అనుభవించవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచి విధానం కాదు. – సార వెంకటవర్మ, న్యాయవాది, జోగిపేట -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ హవేళిఘణాపూర్(మెదక్): యువకులు సైబర్ నేరాలు, డ్రగ్స్ భారిన పడకుండా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్చంద్రబోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, డాక్టర్ శరత్, సాయికిరణ్, నాగరాజు, హెచ్ఎం రఘుబాబు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్వాధీనంశివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం మండల పరిధిలోని పాంబండలో సీసీఎస్ పోలీసులు దాడులు చేసి ఓ పౌల్ట్రీపామ్లో 12 బస్తాల రేషన్ బియ్యం (6 క్వింటాళ్లు) పట్టుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శివ్వంపేట పీఎస్కు తరలించారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ సప్లయ్, రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టారు. ముగ్గురు దొంగలు అరెస్టుమద్దూరు(హుస్నాబాద్): ధాన్యాన్ని అపహరించి తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలోని కూటిగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్ మహబూబ్ కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన అల్ద కొమురయ్య మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హుస్నాబాద్, అక్కపేట మండలాలకు చెందిన గంటల శంకర్, పండుగ సతీశ్, బడుగు సంపత్ సుమారు 12 క్వింటాళ్ల మక్కలను అపహరించి హుస్నాబాద్కు తరలిస్తున్నారు. రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పందగా కనిపించడంతో విచారించగా దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మద్యం మత్తులో యువకుల వీరంగం కారుకు అడ్డుగా వెళ్లి దంపతులపై దాడి వట్పల్లి(అందోల్): మద్యం మత్తులో ఇద్దరు యువకులు దంపతులపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం మండలంలోని అల్మాయిపేట వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ పాండు వివరాల ప్రకారం... టేక్మాల్ గ్రామానికి చెందిన భక్తుల వీరప్ప ఆయన సతీమణి వరలక్ష్మితో కలిసి సంగారెడ్డి నుంచి వస్తున్న క్రమంలో అందోల్ గ్రామానికి చెందిన జాఫర్, షాహిద్ బైక్పై వస్తూ కారును ఓవర్టేక్ చేశారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లి బైక్ను కారుకు అడ్డుపెట్టి కారు నడుపుతున్న వీరప్పను బయటకు లాగి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన సతీమణిపై కూడా దాడి చేయగా అటువైపుగా వెళ్లేవారు అడ్డుకున్నారు. ఈ దాడిలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు జహీరాబాద్ టౌన్: మున్సిపల్ పరిధిలోని రంజోల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సోమవారం తొలగించారు. రంజోల్ గ్రామ పరిధిలోని 111 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారు 10 అక్రమ కట్టడాలను గుర్తించారు. గ్రామంలో ఒక రోజు ముందు దండోరా వేయించి అనంతరం జేసీబీతో అక్రమ కట్టడాలు, రేకుల షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురుబలవన్మరణానికి పాల్పడ్డారు. ఉరి వేసుకొని మహిళ.. నిజాంపేట(మెదక్): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నిజాంపేటకు చెందిన విభూతి జ్యోతి, నర్సింహులు దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత నెలలో మహబూబ్నగర్కు కుమారుడు అనిల్కుమార్తో సహా వలస వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడికి ఫిట్స్ రావడంతో వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి(41) ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన ఆమె భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ములుగులో వివాహిత.. ములుగు(గజ్వేల్): వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కొక్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు... దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన అశ్విని(26)కి కొక్కొండకు చెందిన గుండ్రెడ్డిపల్లి రవిగౌడ్తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది రోజులుగా అశ్వినితో భర్తతోపాటు మరిది, అత్త తరుచూ గొడవపడేవారు. ఈ విషయం అశ్విని తన తండ్రికి పలుమార్లు చెప్పినప్పటికీ సర్దుకు పోవాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అశ్విని ఇంట్లో ఉరివేసుకుంది. ఆమె మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసై యువకుడు.. శివ్వంపేట(నర్సాపూర్): మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని గంగాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహబూబ్(25) ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిసై కొన్నాళ్ల నుంచి విధులకు వెళ్లకపోవడంతో తల్లి చాంద్బీ మందలించింది. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బిజ్లిపూర్లో ఫంక్షన్కు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా మహబూబ్ ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో.. కౌడిపల్లి(నర్సాపూర్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని సలాబత్పూర్లో జరిగింది. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేశ్(51) మూడేళ్ల క్రితం అప్పుచేసి కూతురు పెళ్లి చేశాడు. ఓ వైపు పెళ్లికి చేసిన అప్పులు తీరక, మరోవైపు కూతురు జీవితం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటిదూలానికి ఉరివేసుకున్నాడు. మానసిక ఆందోళనతో.. చిన్నశంకరంపేట(మెదక్): మానసిక ఒత్తిడితో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన రెడ్డి యాదగిరి కుమారుడు ప్రసాద్(20) ఇంటి వద్దే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత బైక్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీశాడు. సోమవారం ఉదయం రెక్కలగుట్ట వద్ద బైక్ కన్పించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి వెతకగా చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. నిందితుడికి జీవిత ఖైదు మెదక్ మున్సిపాలిటీ: ఓ కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదుతోపాటు, జరిమాన విధించింది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాలు... సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్ 2020 నవంబర్ 10న జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణం వద ఓ మహిళ ను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాటలు కలిపి చేగుంట రోడ్ వైపు ఉన్న ధర్మకుంట సమీపంలోకి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఫకీరానాయక్ పక్కన ఉన్న బాటిల్ను పగులగొట్టి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమో దు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు పటాన్చెరు టౌన్: యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామంలో హైదరాబాద్ బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో ఎన్ఎస్ఎస్ వింటర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ వద్ద మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తుందన్నారు. చదువు మీరు కోరుకున్న లక్ష్యాన్ని దగ్గర చేస్తుందని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే పోలీసులకు, అధ్యాపకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నరసింహులు, డాక్టర్ ఎం.మధుకర్, నార్కొటిక్స్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారుల నయా దందా
భూములు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులు ● సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ● తేడాలొస్తే భవిష్యత్లో ఇబ్బందులే ● మార్టిగేజే బెటర్ అంటున్న న్యాయ నిపుణులు గతంలో బంగారం కుదవపెట్టి, ప్రామిసరీ నోట్లు రాసిస్తే వడ్డీ వ్యాపారులు అప్పులిచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిస్తేనే అప్పులు ఇస్తున్నారు. ఈ నయా దందాకు వడ్డీ వ్యాపారులు తెరలేపారు. అయితే ఈ విధానంతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే తీసుకున్న వారు సేఫ్గా ఉంటారని చెబుతున్నారు. – జోగిపేట(అందోల్) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫైనాన్స్కు చెందిన వారు సిండికేట్గా ఏర్పడి జోగిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని రైతులకు, చిన్న చిన్న వ్యాపారులకు అధిక వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. ఇందుకు భూములనే కాకుండా భవనాలు, కమర్షియల్ షట్టర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దళారులకు పండుగ వ్యవసాయ భూమిపై అప్పులిస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ఒకరిద్దరూ దళారులు ఉన్నారు. వారు అప్పు ఇచ్చే వ్యక్తులకు తీసుకునే వారిని పరిచయం చేసి డబ్బులు ఇప్పించి రిజిస్ట్రేషన్ వరకు ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు 2 శాతం కమీషన్ను తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ఘటన డాకూరు గ్రామానికి చెందిన బోయిని కృష్ణ అందోలు మండలంలోని కొంత మంది రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులిచ్చి భూములను తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇదే భూమిని రూ.50 లక్షలు, కోటి రూపాయల వరకు ఇతరులకు అమ్ముకున్నాడు. అప్పు తీసుకున్న రైతులు లబోదిబోమన్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉడాయించాడు. డాకూరు గ్రామానికి చెందిన భాగయ్య కృష్ణపై కేసు పెట్టాడు. కాగా ఆరు మాసాలుగా కృష్ణ పరారీలో ఉన్నాడు. భూమి వాల్యూ తక్కువతోనే.. అధికారికంగా భూముల విలువ తక్కువగా ఉండటంతో బ్యాంకర్లు ఆ మేరకు రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు రూ.2.50 లక్షల నుంచి రూ.3.60 లక్షలు మాత్రమే వాల్యూ ఉండటం వల్ల బ్యాంకర్లు భూమిని మార్టిగేజ్ చేసుకొని రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇక్కడ డబ్బులు తీసుకున్నప్పుడు, విడిపించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ ఫీజును అప్పు తీసుకున్న వ్యక్తే చెల్లించాలి. దీంతో అదనపు భారం పడటంతోపాటు భూమిపై సర్వహక్కులు కోల్పోవలసి వస్తుంది. -
బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..
జగదేవ్పూర్(గజ్వేల్): బాబాయ్ దశదినకర్మకు వెళ్లి అబ్బాయ్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సర్ధగాని చిన్నరాజు(35), రజిత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రాజు గ్రామంలో టెంట్హౌస్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బాబాయ్లు అయినా సర్ధగాని యాదగిరి, సర్ధగాని నర్సయ్యల దశదినకర్మ కార్యక్రమానికి సోమవారం గ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి మహాసముద్రం చెరువు కట్ట వద్దకు వెళ్లారు. తలనీలాలు అనంతరం చెరువులోకి దిగి స్నానం చేస్తుండగా రాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చెరువులోకి దిగి రాజును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కళ్ల ఎదుట భర్త మృతి చెందడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాము కాటుతో..కొమురవెల్లి(సిద్దిపేట): పాము కాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గౌరాయపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పెద్ది నర్సింహారెడ్డి(57) ప్రతి రోజు మాదిరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు పొడిచి వృద్ధుడు..హుస్నాబాద్రూరల్: ఎద్దు పొడవడంతో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం మాలపల్లిలో సోమవా రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సొల్లు రాజయ్య(75) రోజులాగే బావి వద్ద పశువు లను మేతకు విడిచే క్రమంలో ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య బాలవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. రామచంద్రాపురం(పటాన్చెరు): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 30న రాత్రి రామచంద్రాపురం పట్టణంలో ఆర్టీసీ డిపో సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈనెల 11న రాత్రి మృతి చెందాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం లభ్యం శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తించిన పశువులు కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మధుకర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఇటువైపునకు వచ్చి ఆకలితో అలమటించి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయ స్సు 55 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ హైమద్ మోహినోద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన బుడ్డెన్నోళ్ల సురేశ్ ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గడంతో చేపల వేటకు వెళ్లాడు. ఆనకట్ట దిగువన చిన్నఘనాపూర్ పరిధి లోని మెకానికల్ బ్రిడ్జి వైపు చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న జాలరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బందితోపాటు టీజీఎఫ్ బృందాల ను రప్పించి గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి మంగళవారం గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. -
పది ప్రత్యేక తరగతుల పరిశీలన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ాధ్యన్ని పరిశీలించారు. పాఠశాలలో సదుపాయా లు, తరగతుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామకృష్ణకు అభినందన సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రామకృష్ణను సోమవారం డీఈఓ వెంకటేశ్వర్లు అభినందించారు. వివరాల ప్రకారం.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీచర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్(నీపా న్యూఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో స్కూ ల్ లీడర్షిప్ అకాడమీ తెలంగాణ ట్రయల్ బ్లేజర్స్ 2025 పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో హెచ్ఎం రామకృష్ణతో పాటుగా అదే పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాలు సునీతకు స్థానం దక్కింది. విద్యాభివృద్ధికి హెచ్ఎం రామకృష్ణ చేస్తున్న కృషిని డీఈఓ అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామకృష్ణ ట్రయల్ బ్లేజర్స్ పుస్తకాన్ని డీఈఓ వెంకటేశ్వర్లుకు అందజేశారు. కార్యక్రమంలో నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
చిలప్చెడ్(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దూదేకుల యూసుఫ్ మద్యానికి బానిసై తరుచూ తాగి భార్య రిజ్వానాతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న తాగి వచ్చిన యూసుఫ్ భార్యతో గొడవపడ్డాడు. అనంతరం రాత్రి 9 గంటలకు కుటుంబసభ్యులతో భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత చూస్తే యూసుఫ్ కనపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. తెల్లాపూర్లో యువతి.. రామచంద్రాపురం(పటాన్చెరు): యువతి అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమురంభీమ్ కాలనీకి చెందిన గంగమ్మ స్థానికంగా అపార్ట్మెంట్లోని ఇళ్లలో పనిచేస్తుంది. కాగా మధ్యాహ్నం ఆటోలో బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వెంటనే రోడ్లకు మరమ్మతులు
సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు రవాణా సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ విభాగం నుంచి మంజూరైన నిధుల నుంచి పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు. కోరిన సమాచారం అందించాలి సమాచార హక్కు చట్టంలో భాగంగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందించాలని కలెక్టర్ సూచించారు. సమాచార హక్కు చట్ట వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి సమాచారంతో కూడిన సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావాణికి 38 దరఖాస్తులు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ మేరకు 38 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశం -
పోలియోపై అపోహలు వద్దు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలం భీంరాలో ఆదివారం పోలియో చుక్కలు వేసిన వెంటనే శిశువు మృతి చెందడంతో సంబంధిత కేంద్రాన్ని డీఎంహెచ్ఓ నాగనిర్మల, డిప్యూటీ డీఎంహెచ్ఓ సంధ్యారాణి సందర్శించారు. శిశువుకు వేసిన చుక్కల మందు సీసాను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ.. పోలియో చుక్కల మందుపై అపోహలు వద్దని తెలిపారు. జిల్లాలో 1.86 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. భీంరాలో మృతి చెందిన శిశువుతో పాటు 108 మందికి చుక్కల మందు వేశామన్నారు. శిశువు అనారోగ్యంతోనో, లేక ఏడుస్తుండగానే పోత పాలు పట్టడంతో పాలు ఊపిరితిత్తుల్లోని వెళ్లి శ్వాస ఆడగంతోనో జరిగి ఉంటుందని అన్నారు. పోస్టుమార్టం అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగమణి ఉన్నారు. వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలిపోలియో చుక్కలు వేసి మా బాబు మృతికి కారణం అయిన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని శిశువు తల్లి స్వర్ణలత బంధువులు సోమవారం కంగ్టి తహసీల్దార్ భాస్కర్కు వినతి పత్రం అందజేశారు. పోస్టుమార్టం రిపోర్టు రాక ముందే డీఎంహెచ్ఓ తమ శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని తెలపడంతో ప్రభుత్వ వైద్య సిబ్బందిపై అనుమానం పెరిగిందన్నారు. బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలతో పాటు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తప్పని సరిగా పోలియో చుక్కలు జహీరాబాద్: ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందును తప్పని సరిగా వేయించాలని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ గాయత్రిదేవి సూచించారు. సోమవారం న్యాల్కల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా చుక్కల మందు వేయించేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్యులు అమృత్రాజ్ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ నాగ నిర్మల భీంరాలో శిశువు మృతిపై విచారణ -
తడిసి ముద్దయింది..
నారాయణఖేడ్: ఈ వర్షాకాలంలో అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ సీజన్ రైతన్నకు నష్టాన్నే మిగిల్చింది. జూన్ మాసంలో లోటు వర్షపాతం కురిసి.. తర్వాల నెలల నుంచి దంచి కొట్టింది. ప్రతీ నెలలోనూ అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్లో 121 మి.మీ వర్షపాతం నమోదు కాగా, 53 మి.మీటర్లు మాత్రమే కురిసింది. జూలైలో 191 మి.మీకు గాను 205 మి.మీటర్లు కురిసి 14మి.మీ అధికంగా, ఆగస్టులో 191మి.మీటర్లకు గాను 441మి.మీ కురిసింది. సెప్టెంబర్లో 162 మి.మీటర్లు కురియాల్సి ఉండగా 246 మి.మీ కురిసి 84మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణంగా 544 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకు మించి 892 మిల్లి మీటర్ల వర్షపాతం కురిసింది. అంటే మూడు నెలల కాలంలో 348 మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. భారీ వర్షాల వల్ల పెసర, మినుము పంటలు వంద రోజుల్లో చేతికి వస్తుంది. ఈ సమయంలో అధిక వర్షాల వల్ల నాని దెబ్బతింది. మార్కెట్లో పెసర, మినుము పంటలకు ధర లేకుండా పోయింది. అధిక వర్షాలతో నష్టం అధికంగా, నిరంతరాయంగా వర్షాలు కురియడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పొ లంలో నీరు నిలవడం వల్ల వేర్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడటం, నేల లోని గాలి ఖాళీలు నీటితో నిండిపోయి వేర్లకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. వేర్లు కుళ్లిపోయాయి. అధిక వర్షాల వల్ల నీటిలోని పోషకాలు కొట్టుకుపోవడం వల్ల మొక్కకు పోషక పదార్థాలు అందకుండా పోతాయి. స్వల్ప కాలికాలైన పెసర, మినుము పంటలు వర్షం వల్ల నాని దెబ్బతిన్నాయి. పెసర, మినుము ఎకరంలో 6 నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. పంట నానడం వల్ల మార్కెట్లో ధర లేకుండా పోయింది. కంది పంటకు వేరు కుళ్లు తెగులు సోకుతోంది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సోయా పంట నీరు నిలువడం వల్ల కాయలు పగిలి గింజలు రాలిపోనున్నాయి. మొక్కజొన్న సున్నితమైన పంట కావడం..నీరు నిలువడం వల్ల కాండం కుళ్లు తెగులు, వేరు కుళ్లు తెగులు, చీడపీడల సమస్య అధికంగా ఉండనుంది. మూడు నెలల్లో సాధారణం కంటే అధికంగా 348 మి. మీ వర్షపాతం పంటలపై తీవ్ర ప్రభావం దిగుబడులు నష్టపోతున్న రైతులు సాధారణం 544 మి.మీ కురిసింది 892 మి.మీ అధికంగా 348 మి.మీ -
ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ
ఇటీవల కొత్తగా ఏర్పాటు అయిన జిన్నారం మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మండలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చడంతో సమస్యలు మాత్రం తీరలేదు. పైగా ఆదాయ, వ్యయాలు పక్కన పెడితే సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిన్నారం (పటాన్చెరు): కాంగ్రెస్ ప్రభుత్వం జిన్నారం మండలాన్ని ఇటీవల మున్సిపాలిటీగా మార్చింది. పట్టణీకరణ వృద్ధి చెందకుండా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీగా మారిన తర్వాత నిధుల కొరత ఏర్పడింది. దీంతో సిబ్బంది, కార్మికులకు నాలుగు నెలలుగా సమయానికి జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మున్సిపల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మున్సిపాలిటీకి ఆదాయం కూడా లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. నిర్వహణ భారం కొత్త మున్సిపాలిటీ నిర్వహణ రోజురోజుకు భారంగా మారుతుంది. దీంతో పన్నుల భారం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వద్దని చెప్పినా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఇందుకు మున్సిపాలిటీలో తలెత్తిన సమస్యలేనని చెబుతున్నారు. రాను రాను ఇంటి పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందని భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.ఖర్చులు ఘనం.. జిన్నారం మున్సిపాలిటీలోని 10 గ్రామాల నుంచి ఏటా రూ.38 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. కాగా మున్సిపల్ నిర్వహణలో ఖర్చు మాత్రం కోటి వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనిలో ఎక్కువ భాగం సిబ్బంది వేతనాలకు 70 లక్షలు వరకు చెల్లించాల్సి వస్తోంది. ఖర్చులు పెరుగుతూ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి లేక, పాలన భారంగా మారింది. జిన్నారం మున్సిపాలిటీని వెంటాడుతున్న నిధుల కొరత వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికుల అవస్థలుత్వరలో అందజేస్తాం పారిశుద్ధ్య కార్మికులకు గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి జీతాలు అందలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన నెల రోజుల వేతనం ఇవ్వాల్సి ఉంది. మండలం నుంచి పట్టణంగా మారడంతో కార్మికులకు నూతన బ్యాంకు ఖాతాలను ప్రారంభించి 15 రోజుల్లో జీతాలు అందజేస్తాం. త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – తిరుపతి (జిన్నారం మున్సిపల్ కమిషనర్) -
మీ మద్దతు ఎవరికి..?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు ఝరిత ఆ పార్టీ నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలతో కలిసి సోమవారం సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ, మండలాల అధ్యక్షులు, వివిధ విభాగాల బాధ్యులతో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని ఆరా తీశారు. ఈ సందర్బంగా ఝరిత మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి ఉన్న నాయకులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. డీసీసీ పదవుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, 50 ఏళ్లలోపు ఉన్న వారికి 50 శాతం రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్ష పదవి కీలకం కాబోతుందని, ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీతో డీసీసీ అధ్యక్షులు నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ పరిశీలకులు భేటీ -
ఖనిజ సంపద లూటీ..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూగర్భ గనులశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, గనులశాఖకు రూ.లక్షల్లో రాయల్టీ, సీనరేజీ ఎగవేస్తూ నిత్యం కొనసాగుతున్న ఖనిజ సంపదను అక్రమ రవాణా గుట్టును రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రట్టు చేసింది. ఆ విభాగం రాష్ట్ర ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం జిల్లాలో ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 16 అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఎలాంటి ట్రానిట్స్ పర్మిట్ లేకుండా ఖనిజ సంపదను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వాహనాలను జిల్లా భూగర్భ గనులశాఖ ఽఅధికారులకు అప్పగించగా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు. విచ్చలవిడి అక్రమ దందా జిల్లాలో అపారమైన ఖనిజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనేదానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. భూగర్భగనుల శాఖకు చెల్లించాల్సిన రాయల్టీ, సీనరేజీలను ఎగవేస్తూ, అర్థరాత్రి వేళల్లో అడ్డూఅదుపు లేకుండా ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు మరోసారి రుజువైంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రూ.వందల కోట్ల రాయల్టీ ఎగవేసిన ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ప్రభుత్వం హయాంలోనూ ఈ దందాను కొనసాగిస్తున్నారనేది రుజువైంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఒక్క రాత్రి తనిఖీ చేస్తే ఏకంగా 16 వాహనాలను పట్టుకున్నారంటే నిత్యం ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఖనిజ సంపదను లూటీ చేయడానికి మరిగిన ప్రజాప్రతినిధులు, నాయకుల అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చేష్టలుడిగి చూస్తున్న జిల్లా అధికారులుజిల్లాలో విచ్చలవిడిగా మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుంటే భూగర్భ గనులశాఖ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ అక్రమ మైనింగ్ వాహనాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఆశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర విభాగం తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వాహనాలు పట్టుబడుతుంటే, జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఎందుకు పట్టుబడటం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆశాఖ జిల్లా అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నారు. ఈ తనిఖీల కోసం భూగర్భ గనులశాఖ ప్రత్యేకంగా తనిఖీల బృందాలను నియమించింది. ఈ బృందాలు కూడా ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో విలువైన ఖనిజ సంపద లూటీ అవుతున్నట్లు తేలుతోంది.నిశిరాత్రి వేళల్లో .. మైనింగ్ మాయ అక్రమ రవాణా చేస్తున్న 16 వాహనాలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ యథేచ్ఛగా రాయల్టీ, సీనరేజీ ఎగవేస్తున్నట్లు గుర్తింపు గనుల శాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో వెలుగులోకి మైనింగ్ దందాపిలిస్తే వెళ్లి జరిమానా విధించాం రెండు రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పిలిస్తే వెళ్లాం. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని మాకు అప్పగించారు. వాటికి జరిమానాలు విధించాం. ఎన్ని వాహనాలను పట్టుకున్నాం.. ఎంత జరిమానా వివరాలు కార్యాలయంలో ఉన్నాయి. – రవిబాబు, భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
విద్యార్థుల పాత్ర కీలకం
రామచంద్రాపురం(పటాన్చెరు): భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ తెలిపారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్నగర్ కస్తూర్బా పాఠశాలలో జరిగిన ప్రధానమంత్రి ప్రత్యక్ష కార్యక్రమంలో విద్యార్థులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు వారి మేధాశక్తితో నూతన పరికరాలను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఉస్మాన్నగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థులు పబ్లిక్ టాయిలెట్ ఆటో ఫ్లష్ పరికరాన్ని తయారు చేశారన్నారు. ప్రధానమంత్రి ప్రత్యక్ష కార్యక్రమానికి కస్తూర్బా పాఠశాలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన పాఠశాల ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరెడ్డి, జిల్లా జీఈసీఓ సునీత కన్న, ఎంఈఓ పీపీ రాథోడ్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మన ఊరు–మన బడి పథకం ద్వారా రూ.67 లక్షలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్డీసీ కాంక్రీట్ ఇండస్ట్రీస్ సీఎస్ఆర్ నిధులు రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మరో రెండు అదనపు తరగతి గదులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహాయ సహకారాలతో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్, పంచాయతీరాజ్ డీఈ సురేష్, ప్రమోద్ గౌడ్, ఆర్డీసీ పరిశ్రమ ప్రతినిధి నరేష్, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపికనారాయణఖేడ్: మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇర్ఫాన్, శానవాజ్, ఆజన్, ఫయాజ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. జిల్లాలోని గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గ్రౌండ్లో నిర్వహించిన అండర్ –19 ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ క్రీడల్లో ప్రతిభచాటారన్నారు. ఎంపికై న విద్యార్థులను గణపతితోపాటు గురుకుల ప్రదానోపాధ్యాయులు రాములు, పీఈటీ అజీజ్, సంతోష్, ధన్రాజ్, ఉపాధ్యాయులు సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు. బెస్ట్ అవైలబుల్ బకాయిలు చెల్లించండికేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం డబ్బులు చెల్లించకపోవడంతో దళిత, గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి రూ.130 కోట్ల పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు డబ్బులు రానందున అందులో చదువుతున్న విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని వాపోయారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం ఇంటికే పరిమితం అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, నర్సింలు, మల్లేశం, సహాయ కార్యదర్శి జయరాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో వ్యాసరచన పోటీలుఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ విధానంలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆరో తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో 500 పదాలకు మించకుండా రాసి పంపాలన్నారు. కాగా, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్పీ సూచించారు. సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించారు. -
హరేకృష్ణ మందిరాన్ని నిర్మిస్తాం
జహీరాబాద్: జహీరాబాద్లో అక్షయపాత్ర భవనంతో పాటు హరేకృష్ణ మందిరాన్ని నిర్మించనున్నట్లు కందిలోని హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి విభీషణ్ ప్రభు తెలిపారు. ఆదివారం పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో 176వ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయా నిర్మాణాలకు తమ బృంద సభ్యులు స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా అనాథలకు ఉచితంగా, పేద ప్రజలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సైతం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో దామోదర మాసం సందర్భంగా దీపారాధన చేశారు. అలాగే హుగ్గెల్లి గ్రామంలో 141వ పల్లె సంకీర్తన నిర్వహించారు. -
రైల్వే స్టేషన్ల నుంచి రవాణా!
ప్రధానంగా రైళ్ల ద్వారానే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా అవుతున్నట్లు సమాచారం. జిల్లాలోని ప్రధానంగా మెదక్, అక్కన్నపేట, మీర్జాపల్లి, వడియారం రైల్వేస్టేషన్లలో వీటి వినియోగం ఇటీవల పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న యాచకులు, వారి అనుచరులు గంజా యి, ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తూ తరచూ గొడవలకు దిగుతున్నారు. గంజాయి దొరకని పరిస్థితుల్లో వారు వైట్నర్, వాహనాల టైర్ల పంక్చర్ కోసం వినియోగించే ద్రావణం బోనోఫిక్స్, ఫెవికిక్ వాడుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి అక్కన్నపేట స్టేషన్ను సందర్శించిన సమయంలోనే యాచకులిద్దరూ జేబు రుమాలులో బోనోఫిక్స్ ద్రావణం వేసుకుని యాదృచ్ఛికంగా కంటపడ్డారు. వారు రుమాలులో వేసుకున్న ద్రావణాన్ని ముక్కుదగ్గర ఉంచుకొని మత్తులో తేలడం కనిపించింది. -
దేశ ఐక్యతకు పాటుపడతాం
మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ రాఘవులు పటాన్చెరు టౌన్: దేశ ధర్మ ఐక్యతకు పాటుపడే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుందని మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ రాఘవులు అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ నుంచి పలు వీధుల గుండా పథ్ సంచాలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వందేళ్ల కిందట ఐదు మంది స్వయం సేవకులతో ప్రారంభమై నేడు లక్ష లాది శాఖలతోపాటు కోట్లాదిమంది స్వయం సేవకులతో ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పథ్ సంచాలన్లో పాల్గొన్న యువతను అభినందించారు. డ్రిప్ పరికరాలు ధ్వంసం చిన్నకోడూరు(సిద్దిపేట): ఆయిల్ పామ్ తోటలో దుండగులు డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం చిన్నకోడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కర్నే శ్రీలత, కర్నే సత్తవ్వలు మూడున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. గత నెలలో ఒకసారి మొక్కలు తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి తమ తోటలోని డ్రిప్ పరికరాలు పూర్తిగా ధ్వంసం చేశారని వాపోయారు. దీంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేకాట స్థావరంపై దాడి ముగ్గురు అరెస్టు, 10 మంది పరారీ వెల్దుర్తి(తూప్రాన్): పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. తూప్రాన్ సీఐ రంగకృష్ణ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు వెల్దుర్తి ఎస్ఐ రాజు సిబ్బందితో దామరంచ అటవీప్రాంతంలో దాడిచేయగా కొందరు వ్యక్తులు అక్కడ జూదం ఆడుతున్నారు. పోలీసులను గమనించి పదిమంది అక్కడి నుంచి పరారయ్యారు. కాగా ముగ్గురు జూదరులు పట్టుబడ్డారు. ఘటనా స్థలం నుంచి 5 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లతో పాటు రూ. 3,29,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కలప పట్టివేత ట్రాక్టర్ సీజ్ తూప్రాన్: అక్రమంగా తరలిస్తున్న కలపతోపాటు ట్రాక్టర్ను ఆదివారం అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా... పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు వెనుక అక్రమంగా చెట్లు నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన అటవీ శాఖ అధికారులు అనుమతులు లేకుండా చెట్లను నరకడం చట్ట రీత్యా నేరమని సదరు వ్యక్తికి జరిమానతో పాటు ట్రాక్టర్ను సీజ్ చేశారు. యశ్వంత్రావు పాటిల్కు అవార్డు జహీరాబాద్ టౌన్: తెలంగాణ బసవదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశ్వంత్రావు పాటిల్కు బసవ పీఠం వారు శరణ కాయకరత్న అవార్డును ప్రదానం చేశారు. కర్నాటక రాష్ట్రంలోని బసవ కల్యాణ్లో జరుగుతున్న 24వ కల్యాణ పర్వ సమ్మేళనంలో ఆయనకు బసవ ధర్మపీఠం మహిళా జగద్గురు గంగామాతాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాటిల్ను రాష్ట్ర అధ్యక్షుడు శంకర్పాటిల్, జహీరాబాద్ అధ్యక్షుడు శరణప్ప తదితరులు అభినందించారు. -
డెత్ స్పాట్..
ఆత్మహత్యలకు కేరాఫ్ చెరువు సంగారెడ్డి క్రైౖమ్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చూడగల ప్రదేశాల్లో మహబూబ్ సాగర్ (మినీ ట్యాంక్ బండ్) ఒకటి. అది ఒక అప్పటి మాట. ఇప్పుడు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా, డెత్ స్పాట్గా మారింది. ఇటీవల ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. చెరువు చుట్టూ సరైన రక్షణ కవచం లేక ఆత్మహత్య చేసుకునే వారు కట్టపై నుంచి చెరువులోకి దూకుతున్నారు. సందర్శకుల భద్రతతో పాటు ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ఆత్మహత్యలకు స్పాట్గా మారింది. తాజాగా ఈనెల 11న గుర్తుతెలియని యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది మార్చి17న మెదక్ జిల్లాకు చెందిన తల్లి, కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మృతదేహాలు నీటిలో తేలాయి. గడిచిన 10 నెలల్లో గుర్తుతెలియని మృతదేహలు దాదాపు 10 నుంచి 15మంది చెరువులో తేలడంతో పోలీసులు వాటిని బయటకు తీసి కేసులు నమోదు చేశారు. భద్రత కరువు.. గత ప్రభుత్వాలు ఈ చెరువుని (మినీ ట్యాంక్ బండ్) అభివృద్ధి పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు ఇటు వైపు రాకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా యని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏఎస్ఐ స్థాయి అధికారితో పాటు మూడు నుంచి ఐదు మంది సిబ్బంది నిత్యం విధుల్లో ఉండేవారు. ప్రస్తుతం ఒక్క కానిస్టేబుల్ కూడా విధుల్లో లేకపోవడం గమనార్హం. కనిపించని హెచ్చరిక బోర్డులు చెరువును చూడటానికి నిత్యం పట్టణ ప్రజలతో పాటు, చుట్టు ప్రక్కల గ్రామల నుంచి దాదాపు 50 నుంచి 150 మంది సందర్శకులు వస్తుంటారు. చెరువు కట్టపై పలు చోట్ల కనిపించని హెచ్చరిక బోర్డులు, ప్రమాదకర స్థాయి నీటి మట్టం లోతు , రెండు వైపులా కంచెలు లేవు. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మద్యం తాగిన అనంత రం చెరువులో ప్రమాదకరంగా చేపలు పట్టబో యి, ఈత రాక తమ ప్రాణాలు కోల్పోతున్నారు.రక్షణ చర్యలు చేపడతాం చెరువు కట్టపై భద్రత చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు గురించి మున్సిపాలిటీ, పలు శాఖల అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. రాత్రి సమయంలో భద్రత సిబ్బందితో పాటు, పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండేలా చూస్తాం. పాదచారులు, సందర్శకులు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా సమయ పాలన బోర్డు ఏర్పాటు చేస్తాం. – రమేశ్, పట్టణ సీఐ -
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్: సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక విపంచి ఆడిటోరియంలో జరిగిన మాజీ సైనికుల ఆత్మీ య సమ్మేళనం, అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల్లో సైనికులు ఉద్యోగాలు చేస్తుంటే, ఇక్కడ వారి పిల్లలు నాన్ లోకల్ అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం వీర సైనికుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ప్రతినిధులు జోజి, మల్లిక్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 267మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే హరీశ్ రావు పంపిణీ చేసి మాట్లాడారు. మార్కెట్లో రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత, కార్మికులను చిత్తు చేస్తున్నాయి. గతంలో పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాల వినియోగం క్రమక్రమంగా పల్లెలకు పాకింది. దానికి బానిసలవుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జిల్లాలోని ప్రధానంగా పరిశ్రమలతోపాటు రైల్వేస
● గ్రామాలకు పాకిన వ్యసనం ● అడ్డాలుగా పరిశ్రమలు, రైల్వేస్టేషన్లు, దాబాలుమత్తు.. చిత్తు గంజాయి మత్తులో జోగుతున్న యువతమహారాష్ట్ర, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేల సంఖ్యలో జిల్లాలోని పలు పరిశమ్రల్లో పనిచేస్తున్నారు. వీరు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి వస్తున్న క్రమంలో అక్కడి నుంచే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రైళ్లలో తీసుకొస్తున్నట్లు పోలీస్శాఖ అనుమానిస్తుంది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖతోపాటు పోలీస్శాఖ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల పలుమార్లు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారిపై .. జిల్లా మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి 11 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాలనుంచి జాతీయ రహదారి మీదుగా గంజాయి అక్రమ సరఫరా పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు సమాచారం. గత ఏడాది పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్న కారు రామాయంపేటవద్ద ప్రమాదానికి గురికాగా ఈ విషయం బయటపడింది. జాతీయ రహదారిపై ఎక్కడో ఒకచోట తరచూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. -
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
చెరువులోపడి వృద్ధుడు మృతి హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఫరీద్పూర్లో చోటు చేసుకుంది. వివరాలి లా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతల రాజయ్య శివారులోని చెరువు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలుజారి అందులో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.కాగా అతడికి మతిస్థిమితం లేదని తెలిపారు. కుళ్లిన స్థితిలో యువకుడి శవం.. నారాయణఖేడ్: కుళ్లిన స్థితిలో యువకుడి శవం చెరువులో లభ్యమైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన సిర్గాపూర్ ఆంజనేయులు (32)వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు శివారులో గల కుబులం చెరువు వద్దకు వెళ్లగా శవమై తేలి కనిపించాడు. మృతుడి భార్య ఇతనితో దూరంగా ఉంటుందని, కొన్ని రోజులుగా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కోహెడ(హుస్నాబాద్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన వేల్పుల సంపత్(39) చెప్పుల షాపు నిర్వహణకు, ఓ ఫైనాన్స్ ద్వారా ఆటో కొనుగోలు చేసి సుమారు రూ. 30 లక్షలు అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఈ నెల 1న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో అత్తగారి ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. కాగా మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంమ్మార్పీస్ మండలాధ్యక్షుడు మంద మల్లేశం కోరారు. -
బకాయిలు విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్నేండ్లుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తమ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కట్టుకలిసిగా భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచైనా సరే బకాయిలు విడుదల చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మహేశ్, రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షు డు సతీశ్, సహాయ కార్యదర్శి అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు స్వరాజ్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు. -
పూరి గుడిసె దగ్ధం
తూప్రాన్: ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని వెంకటరత్నాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గౌడెల్లి రాజు, రజిత దంపతులు పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లారు. పిల్లలు ఇంటివద్దే ఉన్నారు. పాఠశాలకు సెలవు దినం కావడంతో పక్కింట్లో ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు గుడిసెలో నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలోని బియ్యం, బట్టలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం ఉన్న నివాసం కోల్పోయి రోడ్డున పడింది. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. బస్సులో నుంచి దూకిన బాలికకు గాయాలు జోగిపేట(అందోల్): ఆధార్కార్డు తల్లికి ఇచ్చేందుకు ఓ బాలిక కదులుతున్న బస్సులో నుంచి కిందకి దూకింది. వివరాలు ఇలా... పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన అక్షిత తన చెల్లెలు, తల్లితో కలిసి ఆదివారం సంత కావడంతో జోగిపేటకు వచ్చారు. పప్పు దినుసులు కొనుగోలు చేసిన తర్వాత బస్టాండ్కు వచ్చి సంగారెడ్డి వెళ్లేందుకు అక్షిత తన సోదరితో కలిసి బస్సు ఎక్కారు. తల్లి ఆమె బంధువులతో కలిసి కలిసి తర్వాత వస్తానని చెప్పింది. ఈ క్రమకంలో తల్లి ఆధార్ కార్డు తన వద్దే ఉందని గుర్తించి వెంటనే బస్సులో నుంచి కిందకు దూకేసింది.దీంతో ఆమెకు గాయాలు కావ డంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపారు.కాగా అక్షిత గ్రామంలోని పాఠశాల లో తొమ్మిదో తరగతి చదువుతుంది. -
జిల్లా సరిహద్దు రోడ్డుకు మరమ్మతులు
కల్హేర్(నారాయణఖేడ్): భారీ వర్షాల కారణంగా జిల్లా సరిహద్దులో కల్హేర్–పిట్లం మండల కేంద్రాల మధ్య రోడ్డు కోతకు గురైన రోడ్డును ఆదివారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 10న ‘కోతల రోడ్డుకు మరమ్మతులేవి?’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, అధికార పక్షం నాయకులు స్పందించారు. ఇటీవల కుండపోతగా కురిసిన వర్షం కారణంగా కల్హేర్ సమీపంలో మహరాజ్ వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. ఫలితంగా వరద ప్రభవంతో రోడ్డు కోతకు గురైంది. కల్హేర్ నుంచి కామారెడ్డి జిల్లా పిట్లం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం, బాన్స్వాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు దెబ్బతిన్న చోట్ల ట్రాక్టర్లు, జేసీబీ సహాయంతో మొరం మట్టి వేసి చదును చేశారు. ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు చేయడంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. రోడ్డు మరమ్మతు పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు దేవదాస్, నాయకులు వెంకట్రెడ్డి, బేగరి సాయిలు, కిష్టారెడ్డి పరిశీలించారు.కల్హేర్–పిట్లం మధ్య రాకపోకలు పునరుద్ధరణ -
ఐక్యతతోనే రాజకీయంగా ఎదగాలి
జహీరాబాద్ టౌన్: ఐక్యంగా ఉంటూనే రాజకీయపరంగా ఎదగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం బీసీ సంఘం నాయకులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 42% రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని కోరారు. ప్రతీబిడ్డకు పోలియో చుక్కలు వేయాలిరామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం, భారతినగర్ డివిజన్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. మట్టి అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తాంమట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు జిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్ర సమీపంలోని సర్వేనంబర్ 1లో నిబంధనలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా అక్రమ మట్టి రవాణా సాగుతోందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి తరలిస్తున్న వ్యక్తులతో వాదనలకు దిగారు. మట్టి రవాణాకు సంబంధించి అనుమతులు రెన్యూవల్ కాకుండా యథేచ్ఛగా మట్టిని తరలించడంపై మండిపడ్డారు. అక్రమార్కులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయండిసీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య పటాన్చెరు టౌన్: సదాశివపేట పట్టణంలో ఈనెల 19న జరిగే సీఐటీయూ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన కిర్బీ పర్మినెంట్, క్యాజువల్ కార్మికుల సమావేశానికి రాజయ్య హాజరై మాట్లాడారు. సీఐటీయూ నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతుందన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి కృషిరామచంద్రాపురం(పటాన్చెరు): కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని జనశక్తి పార్టీ రామ్ విలాస్ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ పేర్కొన్నారు. భెల్కాలనీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన నేతలను ఆదివారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నేతలు తపన్ధరం, శాంతను మండల్లు తనను మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. -
పోలియోను నిర్మూలిద్దాం
సంగారెడ్డి/సంగారెడ్డి జోన్: జిల్లాలో 97.11% పల్స్ పోలియో కార్యక్రమం పూర్తయినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. అన్ని శాఖల అధికారులతో కలిసి మొదటిరోజు 1,86,147 మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డితో కలిసి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమీన్పూర్లో పోలియో చుక్కల స్టాక్ లేదనటంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే 1,500 డోసుల పోలియో చుక్కల మందు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సరఫరా చేసినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి 60 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పల్స్ పోలియో చుక్కలు, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు యథావిధిగా ప్రజావాణికలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారులకు అందజేయడానికి ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావచ్చని కలెక్టర్ సూచించారు. 97.11% పూర్తయిన పల్స్ పోలియో కలెక్టర్ ప్రావీణ్య పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి -
బోర్డులు మార్చండి సారూ!
సంగారెడ్డి నుంచి అందోల్, నర్సాపూర్, హైదరాబాద్, నారాయణఖేడ్ వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు పూర్తిగా పాడయ్యాయి. కొన్ని చోట్ల అక్షరాలు, దూరాన్ని సూచించే నంబర్లు చెరిగిపోయాయి. ప్రమాదాలు జరుగు స్థలాలు, వేగపరిమితిని చూపించే బోర్డుల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అర్ధరాత్రి వేళ ప్రయాణించే వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఇవి పాడైనప్పటికీ అధికారులు మాత్రం బోర్డులు మార్చటం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సూచిక బోర్డులు మార్చాలని వాహనదారులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ సంగారెడ్డి: బీసీలకు అన్యాయం చేస్తే సహించేదిలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ హెచ్చరించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డిలో ధర్నా, రాస్తా రోకో చేశారు. ఐబీ నుంచి ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లిన వారు తిరిగి పునరాలోచన చేసి కేసు వాపసు తీసుకోవాలని హితవు పలికారు. రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతిలో ఉన్నంతకాలం బహుజనులు బానిసలుగానే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్యస్వామి, శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి సాయిలు ,పుల్లంగారి సురేందర్,కొండల్ ,తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ పదవికి పోటాపోటీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవి నియామకం ప్రక్రియ ఈసారి కాస్త భిన్నంగా చేపట్టింది. ఈ పదవిని ఆశించిన నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమం పేరుతో ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో ముఖ్యనేతల సమావేశం నిర్వహించింది. డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలారెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు సిజరిట, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పీసీసీ పరిశీలకులు తోట లక్ష్మికాంతరావు, కార్పొరేషన్ల రాష్ట్ర చైర్మన్లు గిరిధర్రెడ్డి, ఎం.ఏ.ఫయీం, నాయకులు నీలంమధు, గాలి అనిల్కుమార్, పలువురు బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 12 మంది నాయకులు డీసీసీ పోస్టుకోసం దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దరఖాస్తు ఫారాలను తీసుకున్నారు.అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాం: సిజరిట, ఏఐసీసీ పరిశీలకులు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం.అభ్యర్థుల ఎంపికలో డీసీసీ కీలకం: మంత్రి దామోదర 2025 నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీలో అన్ని వర్గాల నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాకే డీసీసీ అధ్యక్ష పదవిని ప్రకటిస్తాం. రానున్న రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో డీసీసీ అధ్యక్షులు కీలకం అవుతారు. తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ, గ్రామపార్టీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ నియామకం కూడా త్వరలోనే పూర్తవుతుంది.సుమారు 12 మంది నాయకులు దరఖాస్తులు ఈసారి భిన్నంగా ఈ పదవి నియామకం ప్రక్రియ ఆశావహులను ఇంటర్వ్యూలు చేసిన పరిశీలకులు ఏఐసీసీకి ఆరుగురు పేర్లతో కూడిన జాబితాపార్టీ కోసం ఏం చేశారు? పేరు.. కులం.. ఎన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? పార్టీ కోసం ఏం సేవ చేశారు? ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేశావా? గెలిచిన పదవి ఏంటీ? పార్టీ ఆదేశిత కార్యక్రమాలు ఏమేమి చేశావు? వంటి అన్ని అంశాలు డీసీసీ పదవికి సంబంధించిన దరఖాస్తు ఫారంలో ఉన్నాయి. ఈ పదవిని ఆశిస్తున్న నాయకులు ఈనెల 18లోపు ఈ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చిన నాయకులతో ఏఐఐసీసీ పరిశీలకులు సిజరిట ఒక్కొక్కరితో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆయా నాయకులతో ఐదారు నిమిషాలు మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన దరఖాస్తులపై జిల్లా ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ చేసి ఆరుగురు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపుతామని సిజరిట ప్రకటించారు. ఏఐసీసీ నాయకత్వం ఇందులోంచి ఒక పేరును ప్రకటిస్తుందని తెలిపారు. -
రైతన్న ఇంట సిరుల పంట
కల్హేర్(నారాయణఖేడ్): రైతన్న ఇంట సిరుల పంట పండనుంది. వర్షాకాలంలో భారీ వర్షాలతో జిల్లాలోని సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. జిల్లాలో 1,51,511 ఎకరాల్లో వరి సాగులో ఉంది. ఖేడ్ డివిజన్లో 42,468 ఎకరాల్లో వరి సాగులో ఉందని వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు ఆయకట్టు కింద 6 వేల ఎకరాల్లో వరి వేశారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద వరి సాగు చేయడంతో పల్లెలో ఎటుచూసినా వ్యవసాయ భూములు పచ్చదనంతో కోనసీమ అందాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. రైతులు వరి కోతలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మనూర్, నాగల్గిద్ద, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జిల్లాలో 37.87 లక్షల మెట్రిక్ క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, డీసీఎంఎస్, పీఎసీఎస్, మార్క్ఫెడ్ కలిపి 207 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వర్షాలతో గుబులు వానకాలంలో మొదట వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతన్నలకు ‘కాలం’కలిసొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారింది. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. బోరు బావుల్లో భూగర్భజలం పెరిగింది. అయితే పంట చేతికొచ్చేదశలో వర్షాలు పడితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భయాందోళనలో ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించి కల్హేర్, సిర్గాపూర్, నిజాంపేట్ మండలాల్లో వరి పంట నేలవాలిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.వర్షాకాలంలో భారీగా వరి సేద్యం జిల్లాలో 1,51,511 ఎకరాల్లో సాగు 37.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల వినతిపదెకరాల్లో వరి సాగు చేశాను. పంట ఆశాజనకంగా ఉంది. వరి కోతలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా. వాగు దగ్గర వరదతో కొంత పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. – పబ్బతి కిష్టారెడ్డి, రైతు, కల్హేర్ -
యువత.. ఫిట్నెస్ మంత్ర
నయా ట్రెండ్నిత్యం ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మారిన ట్రెండ్కు అనుగుణంగా యువత ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇనుప ఖండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువత దేశానికి అవసరమంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకున్నారో లేక నయా బాడీ ట్రెండో చెప్పలేం కాని యువకులు జిమ్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో యువత ఫిట్నెస్పై ఈ వారం కథనం. – దుబ్బాక/దుబ్బాకటౌన్ :జిమ్లో సాధన చేస్తున్న యువకులుశిక్షకుల సూచనల మేరకు..ఉదయం, సాయంత్రం వేళలో జిమ్లలో శిక్షకుల సూచనల మేరకు సాధన చేస్తున్నారు. మారుతున్న నేటి సమాజంలో మధ్య వయస్సు వారు సైతం బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. దీంతో వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉదయం వాకింగ్ చేయడంతో పాటు జిమ్లలో వర్కౌట్లు చేస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. సిక్స్ప్యాక్పై ఆసక్తి ఆరోగ్యానికి ప్రాధాన్యం శరీరాకృతి కోసం కసరత్తు సెలబ్రిటీలను అనుసరిస్తున్న యువకులు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో జిమ్లు -
మద్యానికి బానిసై.. జీవితంపై విరక్తి చెంది..
వట్పల్లి(అందోల్): ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందోలు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... చింతకుంట గ్రామానికి చెందిన బాలరాజు(23) తండ్రి చనిపోగా తల్లి వద్దే ఉంటున్నాడు. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్న అతడు కనిపించకుండా పోయి పది రోజులు కావస్తుంది. కౌలు రైతు శనివారం ఉదయం చెట్టుకు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం వేలాడుతూ ఉండడాన్ని చూసి జోగిపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ పాండు తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కాగా ఘటనా స్థలంలో ద్విచక్రవాహనాన్ని చూసి బాలరాజు మృతదేహంగా గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు. మనస్తాపంతో భర్త.. మునిపల్లి(అందోల్): భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... మండలంలోని మేళసంగ్యం గ్రామానికి చెందిన బేగరి బాలయ్య (47), భారతమ్మ దంపతులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. బాలయ్య తరచూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. కాగా ఈ నెల 7న భార్యతో బాలయ్య మద్యం తాగడానికి డబ్బులు కావాలని గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన అతడు రెండు రోజుల క్రితం ఇంట్లోని బాత్ రూంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు, భార్య భారతమ్మకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి బాలయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. జహీరాబాద్ టౌన్: వైన్స్ పర్మింట్ రూం వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు. పట్టణ సమీపంలోని భరత్నగర్కు చెందిన సంగెం అనిల్గౌడ్(37) మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. మద్యం తాగే అలవాటు ఉన్న అనిల్గౌడ్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. పట్టణంలోని ఓ వైన్స్ పర్మింట్ రూం వద్ద పడి ఉన్నాడు. ఆయన నుదిటిపై గాయాలు ఉన్నాయి. స్థానికులు గమనించి ఆయనను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొ న్నారు. భర్త మృతి పట్ల భార్య సరిత అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తి ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
పటాన్చెరు టౌన్: కంటైనర్ కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటక గుల్బర్గా నుంచి మెహదీపట్నంకు ఓ కుటుంబం కారులో వస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కర్దనూర్ సమీపంలో కొల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఐదుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆసిఫ్, అబ్దుల్ బషీర్ బేగం, ఆయేషా, జబ్బిన్ బేగం, ముదా షేర్, రహమతున్నీసాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో చిన్నారి క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే ఔటర్ అంబులెన్స్ క్షతగాత్రులను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
పటాన్చెరు టౌన్: తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉండే లక్ష్మి కూతురు ప్రియ (19) ఇస్నాపూర్లో ఓ బట్టల షాపులో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈనెల 8న ఉదయం ప్రియ ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో ఎవరికి చెప్పకుండా అదే రోజు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. కాశీంపూర్లో యువకుడు జహీరాబాద్: మండలంలోని కాశీంపూర్ గ్రామానికి చెందిన సుభాష్ (28) అదృశ్యమయ్యాడు. చిరాగ్పల్లి పోలీసుల కథనం ప్రకారం... ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తండ్రి నర్సింహులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. చెరువులో మృతదేహం లభ్యంసంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని స్థానిక మహబూబ్సాగర్ చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శనివారం ఉదయ స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు. వెంటనే ఘటన స్థలానికి చెరుకొని మృతదేహన్ని బయటకు తీశారు. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు అపహరించిన నిందితుడి అరెస్టుపుల్కల్(అందోల్)/జోగిపేట: మహిళకు బైక్పై లిఫ్టు ఇచ్చి ఆభరణాలు అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జోగిపేట సీఐ అనిల్కుమార్ కేసు వివరాలు వె ల్లడించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మంగళి సత్యమ్మ(58)శుక్రవారం సదాశివపేటలోని తనసోదరి వద్దకు బయలు దేరింది. మార్గమధ్యలో చిలిప్చెడ్ మండలం బంజారనగర్కు చెందిన రమావత్ బన్సీలాల్ (బన్సీ) ఎదురై సత్యమ్మతో మాటలు కలిపి, మీ చెల్లి ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. పల్సర్ బైక్పై ఆమెను ఎక్కించుకుని పుల్కల్ మండలం గొంగులూరు శివారుకు వచ్చాడు. అక్కడ మైసమ్మ గుడివద్దకు రాగానే బైక్ ఆపి మహిళపై దాడిచేసి బంగారు కమ్మలు, వెండి కాళ్ల కడియాలు లాక్కున్నాడు. ఆమె అరవడంతో దూరంగా ఉన్న వ్యక్తి పరిగెత్తుకు రావడంతో పరారయ్యాడు. పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ నేతృత్వంలో ఆభరణాలను రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించారు. పేకాట స్థావరంపై దాడికల్హేర్(నారాయణఖేడ్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. సిర్గాపూర్ ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం... సిర్గాపూర్ మండలం అంతర్గాం తండాలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కొంతమందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 3,250, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగ అరెస్టుసిద్దిపేటకమాన్: దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... జనగామ జిల్లా నర్మెటకు చెందిన శివరాత్రి ఈశ్వర్ పట్టణంలోని మిలాన్ గార్డెన్ సమీపంలో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
చెడు వ్యసనాలకు బానిసై.. చోరీలు
● సిగరెట్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ ● రూ.18 లక్షల సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీమెదక్ మున్సిపాలిటీ: ఐటీసీ గోదాం సిగరెట్ బాక్స్ల చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది లక్షల సిగరెట్ బాక్స్లు, మూడు వాహనాలు, రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లికి చెందిన మైదరబోయిన శ్రీకాంత్, కోనాయిపల్లి చెందిన జెట్టి మహేశ్ కొన్నేళ్లుగా ఐటీసీ గోదాం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మంచి స్నేహితులు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా గోదాంలోని సిగరెట్ బాక్స్లను అపహరించి డబ్బు సంపాదించాలని పథకం రచించారు. ఈ క్రమంలో గోదాంలో ఉన్న భద్రత లోపాలను గమనించి చోరీకి అనుకూలంగా ఉందని అవకాశం కోసం ఎదురు చూశారు. 2024 డిసెంబర్ 08న అర్ధరాత్రి గోడదూకి గోదాంలోకి ప్రవేశించి టాటా ఏస్ వాహనం తాళాలు పగులగొట్టి అందులోని రూ.8లక్షల 30వేల విలువైన సిగరెట్లు దొంగతనం చేసి అమ్ముకున్నారు. తిరిగి ఇదే తరహాలో 2025 మే 18న రూ.15 లక్షల సిగరెట్లు, సెప్టెంబర్ 9న రూ.10లక్షల విలువైన సిగరెట్లు ఎత్తుకెళ్లారు. ఈ మూడు చోరీల్లో సుమారు రూ.33లక్షల విలువైన గల సిగరేట్ బాక్స్లను అపహరించి, మహేశ్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి రిటైల్ వ్యాపారులకు అమ్ముతున్నారు. సుమారు రూ.18లక్షల 64వేలు రాగా వాటిని సమానంగా పంచుకున్నారు. కాగా మూడోసారి చోరీ చేసిన సిగరెట్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో శనివారం జీడిపల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఎస్ఐ సుభాష్ గౌడ్ అదుపులోకి విచారించగా చేసిన చోరీలు ఒప్పుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పర్యవేక్ష ణలో సీఐ రంగకృష్ణ, ఎస్సై సుభాష్గౌడ్, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతి, నరేందర్గౌడ్, సురేశ్ను జిల్లా ఎస్పీ అభినందించారు.ఒంటరిగా వెళ్తున్న వారే టార్గెట్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్ మెదక్ మున్సిపాలిటీ: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన నీలగిరి దశరథ్ జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ పెయింటింగ్ పనులు, రేగోడ్ మండలం లింగంపల్లికి చెందిన బుర్నోటి ఆగమయ్య కూకట్పల్లిలో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. టేక్మాల్ మండలం కొరంపల్లికి చెందిన ధన్నారం కృష్ణ ఇంటర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు కలిసి ఈనెల 7న సెల్ఫ్డ్రైవ్ కారు తీసుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ నర్సాపూర్ పట్టణంలో స్కూటీపై వెళ్తున్న కొండయ్యను ఆపారు. అతన్ని కొట్టి రూ.350తోపాటు అతని సెల్ఫోన్ లాక్కున్నారు. అనంతరం నర్సాపూర్ శివారులో గొర్రెల కాపర్లు అయిన నర్సింహ, రామప్పలను కారులో ఎక్కించుకొని మార్గమధ్యలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న రూ.8వేల వరకు నగదు, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. సాంకేతిక ఆధారాలు ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి స్విఫ్ట్ కారు, సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి, నర్సాపూర్ ఎస్ఐ రంజిత్రెడ్డి పాల్గొన్నారు. -
పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు
హాజరైన అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు కౌడిపల్లి(నర్సాపూర్): పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు చేకూరనుందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నూతనంగా ప్రారంభించిన పీఎండీడీకేవై పథకం కార్యక్రమాన్ని మండలంలోని తునికి కేవీకేలో ఆన్లైన్లో అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా డీఏఓ దేవ్కుమార్ మాట్లాడుతూ... ఈ పథకంతో పీఎం దేశంలోని రైతులు, వ్యవసాయ అభివృద్ధికి రూ.42వేల కోట్ల కేటాయించారని చెప్పారు. అనంతరం రైతులకు కేవీకేలో సాగుచేస్తున్న సేంద్రియ పంటలు, వర్మీ కంపోస్ట్ను క్షేత్రస్థాయిలో చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, కేవీకే హెడ్అండ్ సైంటిస్ట్ డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, ఉదయ్కుమార్, డాక్టర్ భార్గవి, రైతులు పాల్గొన్నారు. సీపీఆర్ చేసి.. ప్రాణాలు కాపాడి.. హవేళిఘణాపూర్(మెదక్): ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా... మండలంలోని లింగ్సాన్పల్లికి చెందిన జ్యోతి కుటుంబీకులతో గొడవపడి ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఉరి వేసుకుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు 100కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది జయానంద్, వరప్రసాద్, రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి ఇంట్లో కొన ఊపిరితో ఉన్న జ్యోతిని కిందకు దించి సీపీఆర్ చేశారు. వెంటనే పోలీసు వాహనంలో హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఆపదలో ఆదుకున్న సీఐమెదక్ మున్సిపాలిటీ: ఓ కుటుంబానికి ఆపదలో ఆపన్నహస్తం అందించి పోలీసు అధికారి మానవత్వం చాటుకున్నాడు. వివరాలు... మెదక్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఈనెల 10న తిరుపతి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ ఆ కుటుంబానికి సంబంధించిన వస్తువులు డబ్బులు చోరీకి గురయ్యాయి. దీంతో ఆ కుటుంబం స్వగ్రామం తిరిగివచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మహేశ్ ఎస్పీ సూచన మేరకు ఆ కుటుంబానికి సురక్షితంగా మెదక్ రావడానికి రూ.4వేల సహాయం చేశారు. కాగా ఆ కుటుంబంలో పెద్ద వారిలో ఒకరు వికలాంగుడు కాగా ఇద్దరు ఆడవాళ్లకు మాటలు రావు. చిన్న బాబుకు మాత్రమే మాటలు వస్తాయి. రైల్వే పోలీస్ సహకారం తీసుకుని వారికి సమయానికి డబ్బులు పంపి వారిని మెదక్కి తీసుకొచ్చామని సీఐ తెలిపారు. చెట్టును ఢీకొట్టిన కారు కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రవీంద్రనగర్ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... హైదరాబాద్ నుంచి మల్లారెడ్డి, రాజహంస దంపతులతో పాటు మరొకరు ప్రతాప్రెడ్డి కరీంనగర్కు సొంత కారులో వస్తున్నారు. ఈ క్రమంలో రవీంద్రనగర్ శివారులో రాజీవ్ రహదారిపై అకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో తప్పించబోయి కారు రోడ్డు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అంబులెన్స్లో క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పోలీసులను అభినందించిన ఎస్పీ శ్రీనివాసరావుభార్యాభర్తలతో పాటు మరొకరికి గాయాలు -
నూనెగింజల సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా వ్యవసాయాధికారి కె.శివప్రసాద్ ● ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషియోజన ఆవిష్కరణ వీడియో ప్రదర్శన జహీరాబాద్: రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటలను సాగుచేస్తూ వాటి దిగుబడులను పెంచుకునే విధానంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.శివప్రసాద్ సూచించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని శనివారం మండలంలోని దిడిగి గ్రామ శివారులోని డీడీఎస్–కేవీకేలో ధన్ ధాన్య కృషి యోజన ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్ తెలుగు అనువాదాన్ని రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ...ఇటీవల గ్లోబల్ పరిస్థితుల కారణంగా పప్పులు, నూనెగింజల దిగుమతుల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపుకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా కుసుమ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయాధికారులు లావణ్య, వెంకటేశ్వర్లు, నవీన్, అస్సరుద్దీన్, వినోద్కుమార్, శాస్త్రవేత్తలు వరప్రసాద్, సాయి ప్రియాంక, అగ్రామనిస్ట్ రమేష్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో.. జహీరాబాద్ పట్టణంలోని సుభాష్గంజ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించేందుకు వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు. -
డీసీసీ పీఠం దక్కేదెవరికో?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై నేడు స్పష్టత రానుంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నిర్మలారెడ్డినే మరోమారు కొనసాగిస్తారా? లేదా ఈ పదవిలో కొత్త వారిని నియమిస్తారా? అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకు పడటంతో అధినాయకత్వం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులతోపాటు, జిల్లా కార్యవర్గాన్ని నియమించాలని నిర్ణయించింది. దీంతో ఆదివారం సంగారెడ్డిలో ఆ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఏఐసీసీ పరిశీలకులు హజరుకానున్నారు. డీసీసీ పదవిని ఆశిస్తున్న వారు ఈ సమావేశంలో దరఖాస్తు చేసుకోవాలని పార్టీ నాయకత్వం శ్రేణులకు సూచించింది. దీంతో ఆసక్తి ఉన్న నాయకులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయి. పార్టీ అధినాయకత్వం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎవరిని నియమించాలనే ముఖ్యనేతలు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించే అవకాశాలున్నాయి. ఏ వర్గానికి దక్కుతుందో..? జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రెండు వర్గాలుగా మారింది. సంగారెడ్డి, ఆందోల్ వంటి ఒకటీ రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు రెండు, మూడు వర్గాలుగా విడిపోయారు. నారాయణఖేడ్తోపాటు, పటాన్చెరు, జహీరాబాద్లలో ఆ పార్టీ ముఖ్యనాయకులు ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఈ వర్గాలను ఏకతాటి పైకి తేవడం, ఆయా నాయకులను సమన్వయం చేయడం పార్టీ అధినాయకత్వానికి తలకు నొప్పిగా తయారవుతోంది. ఈ క్రమంలోనే ఈ డీసీసీ అధ్యక్ష పదవి ఏ వర్గానికి చెందిన నాయకుడికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఉజ్వల్రెడ్డి వైపు ముఖ్య నేతల మొగ్గు ఈ పదవిలో నిర్మలారెడ్డినే కొనసాగించాలనే ఎక్కువ మంది నాయకులు అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల వరకై నా కొనసాగించాలని పలువురు కీలక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకవేళ కొత్త వారిని నియమించిన పక్షంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరికి పదవి వరిస్తుందనేది నేడు తేలనుంది. మార్చిన పక్షంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. సామాజిక సమీకరణాలు మినహాయిస్తే...వైద్యుడైన ఉజ్వల్రెడ్డికి ఈ పదవినివ్వడం ద్వారా మేథావివర్గానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు. అలాగే కాస్త యువ నాయకత్వానికి అవకాశం దక్కినట్లవుతుందని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఉజ్వల్రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. షెట్కార్ వర్గీయులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అధినాయకత్వం అభిప్రాయ సేకరణ చేసే అవకాశాలుంటాయని, లేనిపక్షంలో ఏకగ్రీవంగానే ఈ పదవి నియామకం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నిర్మలారెడ్డినే మరోసారికొనసాగిస్తారా! -
నీళ్లివ్వండి సారూ..
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీ 15 రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో రహదారిపై శనివారం ఆందోళనకు దిగారు. కాలనీలోని ప్రతీ ఇంటికి కేవలం మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేసినప్పుడు కనెక్షన్ ఇచ్చారని, పట్టణంలోని వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వకపోవడమే నీటి ఎద్దడికి ప్రధాన కారణమని వివరించారు. అధికారులు నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత
మహంకాళి దేవాలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు టౌన్: దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శనివారం మహంకాళి అమ్మవారి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ప్రతీ తరగతికి టీచర్ను నియమించాలియూటీఎఫ్ నాయకుల డిమాండ్ జహీరాబాద్: ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్లోని శ్రామిక భవన్లో శనివారం యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలను బతికించుకుని దేశంలో పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా కమిషన్ వేసి సలహాలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. యూటీఎఫ్ అగ్రనేత నాగటి నారాయణ తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. గిరిజన భాష నటుడు కేపీకి పితృ వియోగంపరామర్శించిన కాంగ్రెస్ నాయకులు జహీరాబాద్ టౌన్: మండలంలోని గమ్యానాయక్ తండాకు చెందిన గిరిజన భాష నటుడు కేపీ చవాన్ తండ్రి గిరియా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. కేపీ చవాన్ బంజారా భాషలో పలు చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించారు. తండ్రి గిరియా నాయక్ కూడా కొడుకును హీరోగా పెట్టి సినిమా తీశారు. కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు నేత,మాజీ కౌన్సిలర్ మోతిరాం రాథోడ్ తదితరులు తండాకు వెళ్లి నటుడు కేపీ చవాన్ను పరామర్శించారు. కందకం రోడ్డు పనులు పూర్తి చేయాలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆ రోడ్డును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. పట్టణంలోని కందకం రోడ్డుపై ఆర్ ఆండ్బీ, మున్సిపల్ అధికారులతో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, జగ్గారెడ్డి దంపతులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...తాను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్రెడ్డి చొరవతో కందకం రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. ఈ 11 ఏళ్లలో రూ.15కోట్లు ఖర్చు చేసి ఇప్పటివరకు ఈ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను నిలదీశారు. -
సర్కారు బడుల్లో అల్పాహారం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ● చర్యలు చేపట్టిన ప్రభుత్వం ● జిల్లాలో 1,08,293మందివిద్యార్థులకు ప్రయోజనం ● ఇప్పటికే కొనసాగుతున్నరాగిజావ పంపిణీనారాయణఖేడ్: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు వారికి ఉదయం పూట అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి పాఠశాలల విద్యార్థులందరికీ అల్పాహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ పథకం జిల్లాలోని నియోజకవర్గానికి రెండు పాఠశాలల చొప్పున అక్కడక్కడా ప్రారంభించాక శాసనసభ ఎన్నికలు రావడం, అనంతరం ప్రభుత్వం మారడంతో అల్పాహారం కొనసాగలేదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం అందించాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో చైన్నెలో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లిన సీఎం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేయాలని గతంలోనే వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడంతో రానున్న విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం అమలైతే జిల్లాలో 1,08,293మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. పథకం అమలుపై కసరత్తు పథకాన్ని ఎలా అమలు చేయాలి? అల్పాహారంగా ఏమేమి అందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట కార్మికుల ద్వారా వీటిని వండించి అందించాలని ఆలోచిస్తున్నారు. అల్పాహారంగా విద్యార్థులకు రైస్కు సంబంధించిన వంటకాలు పొంగలి, కిచిడీ, పులిహోరా, వెజ్ బిర్యానీ తరహాగా, మరో రెండు రోజులు ఉప్మా, ఇంకో రెండు రోజులు ఇడ్లీ/ బోండా లాంటివి అందించాలన్న ఆలోచన చేస్తున్నారు. మూడు రోజులపాటు రైస్తో కూడుకున్న అల్పాహారం, మరో రెండు రోజులు ఇతర అల్పాహారం అందించాలని యోచిస్తున్నారు. విద్యార్థుల అల్పాహారంకు అయ్యే వ్యయంలో కొంత శాతం కేంద్రం పీఎంశ్రీ పథకం ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం తన వాటా నిధులు చెల్లించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో భరించి అల్పాహారం అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సగటున రూ.10 నుంచి రూ.15 వరకు ప్రస్తుతం అల్పాహారంకు ఒక్కో విద్యార్థికి 1 నుంచి 5వ తరగతివరకు రూ.8, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.12 చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో విద్యార్థికి రూ.10 నుంచి రూ.15వరకు ఖర్చు చేసి పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులద్వారానే అల్పాహారం వండించాలని, ఇందుకుగాను వారికి నెలకు రూ.500 చొప్పున పారితోషికం అదనంగా చెల్లించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. పాఠశాలలకు వంటగ్యాస్ సిలిండర్ల కనెక్షన్లు సమకూర్చాలని కూడా విద్యాశాఖ ప్రతిపాదించింది. ఒక్కో కనెక్షన్కు రూ.రెండు వేలపైగా డిపాజిట్ చేయాల్సి ఉండగా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలని నివేదించింది. గ్యాస్ కొనుగోలు ధరను మాత్రం వంటగ్యాస్ ఏజెన్సీలు భరించాల్సి ఉంటుంది. ఇప్ప టికే ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంగా రాగి జావను అందిస్తోంది.పాఠశాలలు సంఖ్య విద్యార్థుల ప్రాథమిక పాఠశాలలు 863 55,577 ప్రాథమికోన్నత పాఠశాలలు 191 38,821 ఉన్నత పాఠశాలలు 211 13,895 -
అసలేం జరిగింది?
మెదక్జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విష యం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. గిరిజన మహిళ హత్యాచారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం సంచలనం రేపిన కొల్చారం ఘటన -
నేడు పల్స్ పోలియో
● స్పెషల్ డ్రైవ్లో జిల్లా ఎంపిక ● మూడు రోజులపాటు చుక్కల పంపిణీ సంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జిల్లాలను ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఇందులోభాగంగా పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్కు సంగారెడ్డి జిల్లా ఎంపికై ంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1,91,668 మంది చిన్నారులకు పంపిణీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లాలో 1,91,668 చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేయనున్నారు. నవజాత శిశువుల నుంచి ఐదేళ్ల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి టీకా అందేలా చర్యలు చేపట్టారు. మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను వైద్యశాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. మొదటిరోజు ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్, గ్రామపంచాయతీ తదితర ప్రధాన ప్రదేశాలను గుర్తించి బూత్ల వారీగా పంపిణీ చేశారు. మిగతా రెండు రోజుల్లో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తారు. 4,548 మంది సిబ్బంది పల్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో 4,548 మంది సిబ్బందిని కేటాయించారు. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ 1,583, అంగన్వాడీ 1,505, ఆశా వర్కర్లు 904 మంది సిబ్బందితోపాటు ఇతర వాలంటీర్లను 906 మందిని నియమించారు. వీరితో పాటు 8 మంది ప్రోగ్రాం అధికారులను నియమించి, పర్యవేక్షణ జరుపనున్నారు. రోజు వారీగా పంపిణీ చేసిన వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తారు. -
గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): గంజాయి తాగడమే కాకుండా అమ్మడానికి యత్నిస్తున్న ముగ్గురు యువకులపై కేసు నమోదైంది. చేర్యాల సీఐ శ్రీను శుక్రవారం పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన పండ్ల ప్రణయ్, వడ్లకొండ గ్రామానికి చెందిన గడ్డం పువన్, మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన మహ్మద్ సోహెల్ ఉప్పరొనిడ్డ సమీపంలో గంజాయి తాగుతున్నారనే సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, మద్దూరు పోలీసులు కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద 123 గ్రాముల గంజాయి, 2ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
తల్లిదండ్రులను మించిన దైవం లేదు
● పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ ● హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాక: తల్లిదండ్రులను మించిన దైవం లేదని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. నిరంతరం దైవనామస్మరణతోనే సర్వసుఖాలు చేకూరుతాయని తెలిపారు. పట్టణంలో గ్రామదేవత అయిన బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీ అమ్మవారి) విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శుక్రవారం సాయంత్రం మాధవానంద సరస్వతి స్వామిజీ పాల్గొని విగ్రహాలకు తదితర పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే భగవంతుడికి చేసినట్లేనన్నారు. ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో హాని తలపెట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కత్తి కార్తీకతో పాటు పలువురు ప్రముఖులు, వేదపండితులు, కులసంఘాల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన మత సామరస్యం దుబ్బాక: బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. పట్టణంలోని ముస్లిం మత గురువుగా ప్రసిద్ధి గాంచిన బిస్మిల్లా హకీమ్ బాబా బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు తన వంతుగా విరాళం అందించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. -
తుల్జాభవానీ ఆలయంలో చోరీ
● ఆభరణాలు, హుండీల అపహరణ ● ఆనవాళ్లు సేకరించిన క్లూస్టీం జహీరాబాద్: ఆలయంలో దొంగలు పడి హుండీలు పగులగొట్టి నగదు, ఆభరణాలను దొంగిలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం... మొగుడంపల్లి మండలంలోని ఖాంజమాల్పూర్ గ్రామంలో గల శివాజీ మహారాజ్ నిర్మించిన తుల్జాభవానీ మాత ఆలయంలో ఆరు నెలల క్రితం మూడు హుండీలను ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల జాతర సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, కానుకలు హుండీల్లో వేశారు. హుండీల్లోని డబ్బులు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ చోరీ జరిగింది. గర్భగుడిలో, ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు హుండీలను దొంగలు గురువారం ర్రాతి ఎత్తుకెళ్లి ఆలయం సమీపంలో పగులగొట్టి నగదు, కానుకలను తస్కరించారు. ఆలయంలోని అమ్మ వారి విగ్రహంపై ఉన్న వెండి కిరీటం, ముఖం, పాదాలతో పాటు శఠగోపం ఎత్తుకెళ్లారు. ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న హుండీని మాత్రం దొంగలు ఎత్తుకెళ్లలేక పోయారు. కాగా ఆ హుండీని పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో తెరిపించి లెక్కించగా 3.80లక్షలు సమకూరింది. దొంగతనానికి సంబంధించిన సమాచారం అందుకున్న సీఐ శివలింగం, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి ఆలయా న్ని సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు ఇటీవల ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సేవా దృక్పథం కలిగి ఉండాలి
శివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముగ్ధుంపూర్లోని బేతాని సంరక్షణ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... వైకల్యం వారి శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. మానసిక వికలాంగుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానించినా, ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టరీత్యా శిక్షంచబడతారన్నారు. ఆశ్రమంలోని పలువురు అనాథలకు ఆధార్ కార్డులు లేక ప్రభుత్వం నుంచి అందాల్సిన పెన్షన్, ఇతర సదుపాయాలు అందడం లేదని ఆశ్రమ నిర్వాహకుడు సజీవ్ వర్గీస్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భవితలో న్యాయ విజ్ఞాన సదస్సు మెదక్జోన్: మెదక్ పట్టణంలోని భవిత కేంద్రంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి ఆర్ఎం శుభవల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లాడ్స్ డిప్యూటీ చీఫ్ రామశర్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య, సీడీపీఓ కరుణశీల, ప్యానల్ లాయర్ కరుణాకర్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ ఎంపికలు
మెదక్జోన్ : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అండర్ –17 బాల బాలికలకు ఫుట్బాల్ ఎంపికలు జరిగాయి. ఉమ్మడి జిల్లా నుంచి 145 మంది బాలబాలికలు ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 18 మంది బాలికలు, 18 బాలురను ఎంపిక చేసి నవంబర్ మొదటి వారంలో నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీడీలు శ్రీధర్ రెడ్డి, నగేశ్, శ్రీనివాసరావు, రూపేందర్, దేవేందర్ రెడ్డి, శేఖర్, దేవానంద్ పాల్గొన్నారు జగదేవ్పూర్(గజ్వేల్): బాలికపై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం... జగదేవ్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని రోజులుగా ప్రేమించమని వెంటపడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. -
మెడికల్ మాయ!
యథేచ్ఛగా శాంపిల్స్ మందుల అమ్మకాలు ● నిరక్ష్యరాస్యులకు అంటగడుతున్న వైనం ● ఫార్మసిస్టుల పేరుతో దుకాణాలకు అనుమతులు ● పట్టించుకోని అధికారులు మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో పలు కంపెనీ శాంపిల్స్ మందుల విక్రయంతో పాటు జనరిక్ను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. –తూప్రాన్ నిబంధనల ప్రకారం మందుల దుకాణం పెట్టుకునేందుకు ఫార్మసీ కోర్సులు చదివిన వారు అర్హులు. అయితే జిల్లాలోని మెడికల్ షాపుల్లో చాలా వరకు ఈ కోర్సు పూర్తి చేసిన వారు కనిపించరు. ఎవరో ఒకరి వద్ద ఫార్మసీ సర్టిఫికెట్ అద్దెకు తీసుకుని దుకాణాలు నడుపుతున్నారు. జిల్లాలో 560 మెడికల్ షాపులు, 47 ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా మందులు విక్రయించేవారు వందల్లో ఉంటారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాంపిల్స్ను విక్రయిస్తూ.. వివిధ మందుల కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు వైద్యులకు శాంపిల్స్ను అందిస్తాయి. వీటిని విక్రయించకూడదు. వాటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్ఎంపీ వైద్యుల వద్ద శాంపిళ్ల మందులు అధికంగా ఉంటున్నాయి. వీరు రోగులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ శాంపిల్స్ మందుల దుకాణాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మందులను నిరక్ష్యరాస్యులకు విక్రయిస్తున్నారు. ఈ తతంగం అంతా ఆస్పత్రుల పరిధిలో ఉన్న మెడికల్ షాపుల్లో ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. పెరుగుతున్న ఏజెన్సీలు మెదక్ జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఇటీవల మెడికల్ ఏజెన్సీలు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నాయి. జిల్లాలో 47 ఏజెన్సీలు, 560 మెడికల్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. వీటిని సైతం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు మెడికల్ షాపుల్లో శాంపిల్స్ అమ్ముతున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ పేర్కొన్నారు. లైసెన్స్లు తప్పకుండా నిర్వాహకుల పేరు మీదనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల జిల్లాలో ఐదుగురు ఆర్ఎంపీలపై కేసులు నమోదు చేశాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. –చంద్రకళ, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, మెదక్ కాసులు కురిపిస్తున్న.. వివిధ కంపెనీలు తయారు చేస్తున్న జనరిక్ మందులు మెడికల్ షాపుల యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ మందులు తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే ఆయా మందులపై ముద్రించి ఉన్న ధరకే అమ్ముతున్నారు. దీంతో రోగులపై తీవ్ర భారం పడుతోంది. వ్యాధుల బారిన పడిన వారు ఈ మందులు వాడితే జబ్బు నయం కాకపోవడంతో తిరిగి పలుమార్లు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మరలా మందుల మార్చి వేరే మందులు అంటగడుతున్నారు. ఆస్పత్రుల వైద్యులకు మెడికల్ షాపుల నుంచి కమీషన్లు వెళుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగికి కావాల్సిన మందులు లేకుంటే... వేరే కంపెనీ మందులను అంటగట్టుతున్నారు. లాభాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఇలాంటి మందులనే అమ్ముతున్నారు. -
రైతు కమతాల్లోనే కల్లాలు
● నిర్మాణాలకు కేంద్రం సుముఖం ● రైతులకు భారీ ప్రయోజనం ● రోడ్లపై పంటలు ఆరబెట్టే బెడదకు ఫుల్స్టాప్నారాయణఖేడ్: పండించిన పంటల రైతులు ఆరబెట్టేందుకు కల్లాల సదుపాయం లేక రోడ్లపై పంటలను ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టకుండానే తీసుకొస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ నివారిస్తూ రైతులకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం కల్లాల నిర్మాణాలకు సూత్రపాయంగా అంగీకరించింది. ఉపాధిహామీ పథకంలో కల్లాల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. కల్లాల ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. 2021– 22లో కల్లాల నిర్మాణాలు ఉపాధి హామీ పథకంలో అప్పట్లో చేపట్టారు. అయితే కేంద్రం అనుమతి లేకుండా నిర్మించారని వాటిని మధ్యలో నిలిపివేశారు. అప్పట్లో 50, 60, 75 చదరపు మీటర్ల చొప్పున మూడు రకాలుగా కల్లాలను నిర్మించారు. 50 చదరపు మీటర్ల కల్లానికి రూ.50 వేలు, 60కు రూ.62వేలు, 75 చదరపు మీటర్లకు రూ.78వేల వరకు చెల్లించారు. కొంత మొత్తం కూలీ కింద చెల్లింపులు జరగగా మెజార్టీ డబ్బులు మేటీరియల్ కాంపోనెంట్ కింద అందజేశారు. అప్పట్లో రైతులు కల్లాల నిర్మాణాలకు ముందుకు వచ్చారు. మధ్యలో నిలిచిపోవడంతో పథకం అప్పటినుంచి కొనసాగలేదు.కల్లాల నిర్మాణాలకు కేంద్రం చర్యలు జిల్లాలో సుమారు 70వేల జాబ్ కార్డులు ఉండగా 2,11,054మంది కూలీలు పనులు చేస్తున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల అంశం, రైతులు పత్తి పంటను ఆరబెట్టకుండానే తెస్తున్నారనే అంశాలపై కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డితో జరిగిన చర్చ సందర్భంగా ప్రస్తావన రావడంతో ఉపాధి హామీలో కల్లాల నిర్మాణాలకు అనుమతిస్తామని మంత్రి గిరిరాజ్సింగ్ వెల్లడించారు. ప్రతీ పంచాయతీలోనూ కల్లాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని సూచించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కల్లాల నిర్మాణంపై దృష్టి సారించింది. రైతుల అవసరం మేర కల్లాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు కల్లాల నిర్మాణంపై మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు చేపడతాం. అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తాం. గతంలో కల్లాల నిర్మాణం చేపట్టినా మధ్యలో నిలిచిపోయింది. ప్రస్తుతం వచ్చే మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. కల్లాల నిర్మాణంతో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బాల్రాజ్, అదనపు పీడీ, డీఆర్డీఏ, సంగారెడ్డి -
అలా ఎలా లెక్కిస్తారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అధికారులు చేసిన తప్పిదాల కారణంగా రీజనరల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ రహదారి నిర్మాణంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చింతలపల్లి ప్రాంతం భూములు కోల్పోతున్నారు. అయితే ఈ భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించే పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములకు మున్సిపాలిటీ ధరల ప్రకారం లెక్కించి పరిహారం చెల్లించాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భూముల ధరలతో లెక్కించి పరిహారం చెల్లించాలని చూస్తున్నారని ఈ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చింతలపల్లి గ్రామం 2018లోనే సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైందని చెబుతున్నారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన 2020 తర్వాత తెరపైకి వచ్చింది. కానీ పరిహారం చెల్లింపు విషయానికి వస్తే ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీలో ఉండే భూముల ధరలతో ఎలా లెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమ భూములను లాక్కోవద్దని ఈ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పరిహారం చెల్లింపుల్లోనూ అధికారులు అన్యాయం చేస్తున్నారని, తమకు మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం చెల్లించకపోతే భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సంగారెడ్డి జిల్లాలో మూడు మండలాల్లోని 13 గ్రామాల పరిధిలో రైతులు భూములు కోల్పోతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, హత్నూర మండలాల పరిధిలో ఈ గ్రామాలున్నాయి. ఇందులో చింతలపల్లి కూడా ఒకటి. రెవెన్యూ అధికారులు ఈ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే 24 డ్రాఫ్ట్ అవార్డును ప్రకటించారు. ఈ క్రమంలో చింతలపల్లి నిర్వాసితులకు గ్రామీణ ప్రాంత రేట్లతో పరిహారం చెల్లించేలా అవార్డు ఇచ్చారని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటున్నారు.నేతల చుట్టూ రైతులు తమ సమస్యను పరిష్కరించాలని పలువురు నిర్వాసిత రైతులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని తమ సమస్యను పరిష్కరించాలని ఇటీవల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అలాగే ఎంపీ రఘునందర్రావుకు కూడా వినతిపత్రం అందజేయాలని ఈ నిర్వాసిత రైతులు నిర్ణయించారు. తమకు తగిన పరిహారం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.13 గ్రామాల్లో నిర్వాసితులుట్రిపుల్ఆర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల ఆందోళన -
రెండో విడత పాఠ్యపుస్తకాలు పంపిణీ
● జిల్లాకు చేరుకున్న పుస్తకాలు ● వీటితోపాటు డిజిటల్ బుక్స్ అందజేతజహీరాబాద్ టౌన్: ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందించడం ప్రారంభించారు. పార్ట్–1 సిలబస్ పూర్తి కావస్తుండగా రెండో విడత పార్ట్–2 పుస్తకాల పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు. ఇటీవలే మండల కేంద్రాలకు పుస్తకాలు సరఫరా అయ్యాయి. మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పాఠశాల సిబ్బంది బడులకు చేరవేస్తున్నారు. గతేడాది పంపిణీలో ఆలస్యం కావడంతో ఈ సంవత్సరం జాప్యాన్ని నివారించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పార్ట్–2 పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించాల్సి ఉండగా జిల్లాకు 80% రెండవ విడత పుస్తకాలు వచ్చాయి. వీటిని జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలకు సులువుగా పంపిణీ చేసేందుకు సబ్జెక్టులు, తరగతుల వారీగా పుస్తకాలను విభజించారు. పార్ట్–2 పుస్తకాలను విద్యార్థులకు 15 రోజుల క్రితమే పంపిణీ చేయాల్సి ఉండగా దసరా సెలవులు రావడంతో వాయిదా వేశారు. సెలవులు ముగియడంతో పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 4,31,872 పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరవేశారు. వీటితో పాటు డిజిటల్ బోధన అందించేందుకు 6,7,8,9 తరగతి విద్యార్థులకు మరో 1,07,968 పుస్తకాలు వచ్చాయి. పార్ట్–2 పుస్తకాలతో పాటు డిజిటల్ బుక్స్ కూడా విద్యార్థులకు అందజేయనున్నారు. నోట్బుక్స్, తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను జూన్లో పార్ట్–1 పుస్తకాలతోపాటు అందజేశారు. ప్రస్తుతం సబ్జెక్ట్ బుక్స్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. -
భగీరథ నీళ్లు బంద్
● పైప్లైన్ పగిలిపోవడంతో పదిరోజులుగా నిలిచిన నీటి సరఫరా ● దాహార్తిలో ఆరు మండలాల్లోని 449 గ్రామాలు ● మరమ్మతులకు మరో పది రోజులు పట్టవచ్చంటున్న అధికారులు ● గ్రామాలలో ఉన్న రక్షిత మంచినీటి బోర్లను పునరుద్ధరించని వైనంహత్నూర(సంగారెడ్డి)/: పుల్కల్ మండలం వెండికొలు గ్రామ శివారులో పదిరోజుల క్రితం మంజీరా నది నీటిలో పైప్లైన్ పగిలిపోయింది. దీంతో హత్నూర, జిన్నారం, గుమ్మడిదలతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట కౌడిపల్లి ఆరు మండలాల్లో 449 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి బోర్లను కనీసం మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నీటి సరఫరా చేసే బోర్లున్నప్పటికీ వాటికి మోటార్లు లేకపోవడం, మరమ్మతులు చేయించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజలు నీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. నర్సాపూర్, దౌల్తాబాద్, పట్టణాలలో కొంతమంది నాయకులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరిపోవడం లేదు. పైప్లైన్ మరమ్మతులు చేసేంతవరకై నా తాగునీటికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కరించాలని వినతి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలో నీటి సమస్యను వివరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి జలాలను కోమటిబండ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా శివ్వంపేటలోని సంప్కు మళ్లించి నియోజకవర్గ ప్రజలకు నీటి సరఫరా చేపట్టాలని కోరారు.నీళ్లు రాక ఇబ్బందులు కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. బోరు బావుల నుంచి రోజు తెచ్చుకుంటున్నాం. వెంటనే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా అధికారులు మరమ్మతులు చేయాలి. – రమావత్ మాలితగ్గుముఖం పడితేనే.. పైపులైన్ పగిలిపోవడంతో గ్రామాలకు గత పది రోజులుగా నీరు రావడం లేదు. మంజీరాలో నీళ్లు తగ్గితే పైపులైన్కు మరమ్మతు చేయడానికి వీలవుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – రఘువీర్, జిల్లా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ -
సరైన నష్టపరిహారం అందించండి
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంది(సంగారెడ్డి): భెల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి –165 విస్తరణలో భాగంగా భూములు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. మండల కేంద్రమైన కందిలో జాతీయ రహదారి విస్తరణలో భూములు స్థలాలు కోల్పోతున్న బాధితులు, అధికారులతో శుక్రవారం జగ్గారెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు నష్టపోకుండా సర్వేచేసి కలెక్టర్కు నివేదిక పరిహారం అందేలా చూడాలన్నారు. స్థలాలు కోల్పోతున్న వారు మాట్లాడుతూ..రోడ్డు విస్తరణ అధికంగా చేయడం వల్ల తమ ఇళ్లను కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నష్టపరిహారం విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో నేషనల్ హైవే డీఈ రామకృష్ణ, తహసీల్దార్ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి చేర్యాల ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
సంగారెడ్డి: బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ హెచ్చరించారు. వైఎస్సార్ భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుగౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లిన వారు తిరిగి పునరాలోచన చేసి కేసు వాపసు తీసుకోవాలని హితవు పలికారు. బీసీల మీద రాజకీయాలు చేయకుండా బీజేపీ న్యాయం చేయాలన్నారు. హైకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘాల నిరసన బీసీ రిజర్వేషన్ల విషయమై సంగారెడ్డిలో బీసీ విద్యార్థి సంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించాయి. స్థానిక బస్టాండ్ ముందు బైఠాయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని పలువురు బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. రాఽజ్యాధికారం అగ్రవర్ణాల చేతిలో ఉన్నంత కాలం బహుజనులు బానిసలుగానే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ -
బీజేపీ ఓట్ల చోరీని గ్రామాల్లో వివరించండి
నారాయణఖేడ్: బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘం అధికారులతో కుమ్మకై ్క ఓట్ల చోరీతో చేస్తున్న మోసాలను కాంగ్రెస్ శ్రేణులు గ్రామాలకు తీసుకెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్లోని తన నివాస గృహం ఆవరణలో శుక్రవారం సంతకం చేసి ఓట్ల చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల బీజేపీ ఓట్ల చోరీతో అధికారంలోకి వస్తోందన్నారు. కర్ణాటకలో ఒకే ఇంట్లో 80 నకిలీ ఓట్లను తయారు చేయగా దేశంలో మొత్తంలో ఇలాంటి మోసాలకు బీజేపీ పాల్పడిందని ఆరోపించారు. పదేళ్ల కిందట రాష్ట్రంలోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు సంబంధించిన 10 వేల ఓట్లను తొలగించి, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఉప ఎన్నికల్లో లబ్ధిపొందిందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేశ్చౌహాన్, పండరీరెడ్డి, దారం శంకర్, తాహెర్, ముంతాజ్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.సంతకాల సేకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే -
ప్రభుత్వాస్పత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్
సంగారెడ్డి: లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ద్వారా సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర ఆదేశాల మేరకు సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో భాగంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ–అడిక్షన్ / రిహాబిలిటేషన్ సెంటర్ వద్ద లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు,పునరావాసం పొందుతున్న రోగులకు న్యాయసంబంధిత సలహాలు, మార్గదర్శకత్వం, అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందజేస్తారన్నారు. కుటుంబ, ఆస్తి, ఉద్యోగం, గృహహింస, పునరావాసానికి సంబంధించిన చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ క్లినిక్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో ప్రతీ శనివారం ఒక ప్యానల్ లాయర్, ఒక పారా లీగల్ వలంటీర్ను విధులకు వస్తారని వెల్లడించారు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారి నాగనిర్మల, డా.శశాంక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, బాలస్వామి, అడ్వొకేట్ ఖాలేద్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య -
కోతల రోడ్డుకు మరమ్మతులేవి?
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి–కామారెడ్డి జిల్లాల మధ్య దూరాభారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన సరిహద్దు రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్హేర్, పిట్లం మండల కేంద్రం మధ్యలో రోడ్డు బాగా దెబ్బతింది. దీంతోపాటు మహరాజు వాగు వద్ద రోడ్డు కోతకు గురైంది. మరికొన్ని చోట్లరోడ్డు ధ్వంసమైంది. వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది. రోడ్డు కోతకు గురైన చోట ద్విచక్రవాహనాలపై ప్రయాణించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు వెచ్చించి రోడ్డును మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీటీ రెన్యూవల్ పనులు హుష్కాకి బీటీ రెన్యూవల్ పనుల కోసం ఉన్న రోడ్డును తవ్వేశారు. తెల్ల కంకర వేసి రహదారి పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అర్ధంతరంగా పనులు నిలిపివేయడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. మరో పక్క నల్లవాగు వంతెన దగ్గర నుంచి కామారెడ్డి జిల్లా పరిధిలో పిట్లం వరకు మట్టి రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. మహరాజు వాగుపై నిర్మించిన వంతెన దెబ్బతిని ఇనుపచువ్వలు బయటకు వచ్చాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించింది. ప్రమాదకరంగా మారింది కల్హేర్, పిట్లం మండల కేంద్రాల మధ్యలో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు కోతకు గురైన చోట ప్రమాదకరంగా మారింది. వంతెన వద్ద రోడ్డు దెబ్బతినడంతో సర్కాస్ఫీట్లు తప్పడంలేదు. రోడ్డు బాగు పడితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. రోడ్డును వెంటనే మరమ్మతు చేసి పునరుద్ధరించాలి. – నాగరాజు, కల్హేర్ -
అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆసక్తిరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30గంటల నోటిఫికేషన్ జారీ అయ్యాయి. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తీరా సాయంత్రం ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నం.9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. అయోమయం.. ఉత్కంఠ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నం.9ని జారీ చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం ఈ జీవో నం9పై స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పలువురు పిటీషనర్లకు ఆరు వారాల పాటు గడువు విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకు పడినట్లయింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకుల్లో ముందు నుంచి అయోమమే నెలకొంది. ఈ ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. టికెట్ల రేసులో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో విచారణ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. -
పత్తి కొనుగోళ్లకు కపాస్ కిసాన్
● యాప్లో నమోదు చేసుకుంటేనేమద్దతు ధర ● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో అందుబాటు సంగారెడ్డి జోన్: పత్తి కొనుగోలు, అమ్మకాలలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో వాణిజ్య పంటలలో ప్రధానంగా పత్తి పంట సాగవుతోంది. పత్తి పంట రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు చూపిస్తూ రైతుల నుంచి దళారులు దోపిడీకి పాల్పడేవారు. కొనుగోలు చేసే సమయంలో తూకం సరైన విధంగా చేయకపోవడం, కొనుగోలు చేసిన తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం తదితర మోసాలకు దళారుల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు అనుసంధానం చేస్తూ కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులకు తాము పండించిన పత్తి పంట సులభంగా కొనుగోళ్లు జరుపుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిపై మార్కెటింగ్ శాఖతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నమోదు తప్పనిసరి సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర పొంది పంటను అమ్ముకోవాలంటే ఈ కపాస్ కిసాన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులందరికీ ఉపయోగపడేలా తీసుకొచ్చిన ఈ యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే ఈ యాప్ను అందరికీ అందుబాటులోకి ఉంచినప్పటికీ ఈ యాప్లో నిరక్షరాస్యులైన రైతులు ఎంతమంది నమోదవుతారనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఖాదిరాబాద్ విద్యార్థులు
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని ఖాదిరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో ఖాదిరాబాద్ విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగానే నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన పోటీల్లో పాల్గొని గుమ్మడిదల జట్టుపై విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.దిగంబర్రావు, పీఈటీ ఎల్.సంగ్రాంలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలకు.. జహీరాబాద్: త్వరలో జిల్లా స్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు జహీరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అబ్దుల్ రహీం, మునీరుద్దీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జె.రాములు, ఇన్చార్జి కె.ఎస్.జమీల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఖేడ్లో నిర్వహించిన పోటీల్లో అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. పీఈటీ అనిల్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్గౌడ్, విద్యార్థులను వారు అభినందించారు. ట్రోఫీతో విద్యార్థులు, ఉపాధ్యాయులుజిల్లాస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు -
పిల్లల పట్ల ప్రత్యేక
శ్రద్ధ వహించాలిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్ : పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని గురువారం బాలసదన్లో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలకు చట్టా లపై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు క్రమశిక్షణతో మెలిగి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సాధనతోనే లక్ష్యాన్ని చేరుకోవాలి
హత్నూర (సంగారెడ్డి): విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేసి చదువుకుని తమ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రమైన హత్నూర ఐటీఐ ఆవరణలో ఇటీవల ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఏటీసీలో కొనసాగుతున్న బోధనా విధానం, విద్యార్థులకు అందిస్తున్న సాంకేతిక శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు, టెక్నాలజీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులకే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏటీసీ ద్వారా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. అనంతరం హత్నూర ఐటీఐ భవనంతోపాటు మెషీన్ షెడ్లను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతు లు చేయించేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఐటీఐ ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మికి సూచించారు. అవసరమైతే మరమ్మతులతోపాటు పూర్తిగా పనికిరాని భవనాలను కూల్చివేసి నూతన భవనాలు నిర్మించేందుకు పరిశ్రమల సహకారం తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, డాక్టర్ రజినితోపాటు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. రోగులకు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందించాలని అవసరమైతే మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి
● అటకెక్కిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు ● పథకం అమలుపై ఊసెత్తని ప్రభుత్వం బీడు భూములకు ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి వాటిని సస్యశ్యామలంగా మార్చాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు అటకెక్కినట్లే అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం పురోగతి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. జహీరాబాద్: జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా బసవేశ్వర పథకానికి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖేడ్లో భూమిపూజ చేశారు. జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల్లోని 11 మండలాలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. 2021లో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. 21 ఫిబ్రవరి 2022లో ఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆయా పథకాలకు గాను రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రెండు ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి గాను 6,293 ఎకరాల భూమి అవసరం అవుతుందని, రూ.2,653 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియను మొదలు పెట్టలేదు. కోర్టు పరిధిలో ఉన్నందునే జాప్యం సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించి డ్రాయింగ్, డిజైన్, అలైన్మెంట్ పనులకుగాను ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. వాటి పనులను పూర్తి చేసే పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఇతర పనులతో ముందుకు సాగుతాం. ఇంకా భూసేకరణ పనులు ప్రారంభించలేదు. ఈ పథకానికి సంబంధించి సంప్హౌజ్ ప్రాంతంలోని భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నందున జాప్యం జరుగుతోంది. – విజయ్కుమార్, ఈఈ,నీటిపారుదల శాఖ, జహీరాబాద్ 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాల్లోని 2.19లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రతిపాదించారు. అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాలకు చెందిన 65,816 ఎకరాలకు, సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 12 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగు నీటిని అందించేందుకుగాను బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద 8 టీఎంసీల నీటితో 1,65లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.1,774కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 14 జూన్ 2021లో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి అందోల్ నియోజకవర్గంలోని కంకోల్లో సంప్హౌజ్, 21 జూన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సంప్హౌజ్ నిర్మాణానికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా పథకాలకు గ్రహణం పట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల విషయంలో గత 8నెలల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్లో జహీరాబాద్ ప్రాంత నేతల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
జోగిపేట ఆస్పత్రిలో ఆస్కి వైద్య బృందం
జోగిపేట(అందోల్): ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అందులోభాగంగా జోగిపేట ఆస్పత్రి వద్ద ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) వైద్యులు గురువారం జోగిపేట ఏరియా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు, పరికరాలు, అవసరమైన సదుపాయాలను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఆస్పత్రికి సంబంధించిన పలు వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య వారికి వివరించారు. బృందం సభ్యుల్లో వైద్యులు అభిషేక్, శ్రీ హర్ష, మేఘన,దివ్య, మౌనిక, కీర్తి ఉన్నారు. -
వాలీబాల్, ఖోఖో జట్లకు క్రీడాకారుల ఎంపిక
గజ్వేల్రూరల్: ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర, బాలికల వాలీబాల్, ఖోఖో విభాగంలో ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ సమ్మయ్య తెలిపారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లో ఉన్న మైదానంలో గురువారం సిద్దిపేట జిల్లా జట్ల ఎంపికను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులను అండర్–19 విభాగంలో వాలీబాల్, ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు బాలుర, బాలికల విభాగంలో క్రీడాజట్లను ఎంపిక చేశామన్నారు. బాలుర విభాగంలో వాలీబాల్కు 50మంది, ఖోఖోకు 50మంది క్రీడాకారులు హాజరవ్వగా.. ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున, బాలికల విభాగంలో వాలీబాల్కు 45మంది, ఖోఖోకు 30మంది క్రీడాకారులు హాజరవ్వగా.. ఒక్కో జట్టుకు 12మంది చొప్పున మొత్తం 48మంది క్రీడాకారులను సిద్దిపేట జిల్లా నుంచి ఎంపిక చేశారన్నారు. వీరంతా ఈనెల 13న సంగారెడ్డిలోని గిర్మాపూర్లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఎంపికలో పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవికుమార్, గోవర్ధన్రెడ్డి, ఫుట్బాల్ కోచ్ నర్సింహులు, వాలీబాల్ క్రీడాకారుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి మృతిపై కొనసాగుతున్న విచారణ
హుస్నాబాద్రూరల్: మండలంలోని పోతారం(ఎస్)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ మృతిపై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం గురుకుల పాఠశాలల డిప్యూటీ కార్యదర్శి సహజ విచారణ అధికారిగా హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ను విచారించారు. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే తోటి విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థి మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. అంతేకాకుండా రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, వార్డెన్ల వివరాలు తీసుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలతో కలిసి సంఘటనపై చర్చించి సంఘటన సంబంధించి అంశాలను రాబట్టారు. ఈ మేరకు విచారణ నివేదికను గురుకులాల కార్యదర్శికి పంపించనున్నట్లు చెప్పారు. కాగా, విద్యార్థి మృతిపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాల మహానాడు నాయకుడు ఆరె కిశోర్ వినతి పత్రం అందించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. గురుకులాల ప్రిన్సిపాల్స్ సమావేశం.. తెలంగాణ గురుకులాల సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రిన్సిపాల్స్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఆమె ముఽఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో గురుకులాల నిర్వహణ, నిధుల సమకూర్పుపై చర్చించినట్లు ప్రిన్సిపాల్స్ తెలిపారు. గురుకులాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలన్నారు. అలాగే పాఠశాలలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని ప్రిన్సిపాల్స్ డిప్యూటీ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. విచారణ అధికారిగా డిప్యూటీ కార్యదర్శి సహజ -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఒకరి పరిస్థితి విషమంహవేళిఘణాపూర్(మెదక్): మెదక్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఔరంగాబాద్ గేటు వద్ద వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న అవుసులపల్లికి చెందిన గొల్ల సిద్దయ్య కిందపడడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
‘క్యూనెట్’కు యువకుడి బలి
● సూసైడ్ నోట్ రాసి.. ఉరేసుకుని ఆత్మహత్య ● వేలూరులో ఘటన వర్గల్(గజ్వేల్): ‘క్యూనెట్ వారు నన్ను మోసం చేశారు. వాళ్లు చెప్పింది ఒకటి.. అందులో చేసేది ఒకటి. నా వాళ్లు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.. కానీ నేను ఆ నమ్మకాన్ని కోల్పోయాను. వాళ్లను మోసం చేస్తూ రోజురోజు బబతకటం నా వల్ల కాదు. ఎవరు కూడా తన జీవితాన్ని తనంతట తాను పాడు చేసుకోరు. పరిస్థితులు ప్రభావం చేస్తాయి.’..అంటూ సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేస్తూ, మల్టీలెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ ద్వారా మోసపోయానని పేర్కొంటూ ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన వర్గల్ మండలం వేలూరులో గురువారం సాయంత్రం జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి, కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. వర్గల్ మండలం వేలూరుకు చెందిన బడుగు నాగరాజు, వజ్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు బడుగు హరికృష్ణ(26) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రూ. 4 లక్షలు కడితే ప్రతినెల రూ.15,000 చెల్లిస్తామని ‘క్యూనెట్’ అనే మల్టీలెవల్ మార్కెటింగ్, ఫైనానన్స్ కంపెనీ వారి మాటలు నమ్మాడు. తెలిసిన వారి వద్ద రూ. 4 లక్షలు అప్పుచేసి క్యూనెట్ కంపెనీలో చెల్లించాడు. కంపెనీ వారు చైన్లింక్గా మరో వ్యక్తితో మరో రూ. 4 లక్షలు కట్టిస్తే నీకు నెలకు రూ.15,000 వస్తాయని చెప్పటంతో ఖంగుతిన్నాడు. తాను మోసానికి గురయ్యానని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సంవత్సరం క్రితం కూడా హరికృష్ణ బెట్టింగ్ యాప్లో రూ.10 లక్షల వరకు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా ‘క్యూనెట్’ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. జీవితంలో తాను చేసిన ఏ పని కలిసిరావడం లేదని తీవ్ర మనస్తాపంతో సూసైడ్ లెటర్ రాసి గురువారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా మృతుని తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్
జగదేవ్పూర్(గజ్వేల్): మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజ్వేల్ ఏసీపీ నర్సింలు వెల్లడించారు. ఈ మేరకు మండలంలోని బస్వాపూర్లో మహిళ హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన ఆలేటి యాదవరెడ్డి చిన్న కూతురు అపర్ణ.. అదే గ్రామానికి చెందిన అబ్బాస్ను ప్రేమించింది. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పది నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని జనగాంలోని కుకునూర్పల్లిలో నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మనస్పార్థలు రావడంతో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కూతురు తిరిగి పోవడంతో ఆగ్రహానికి గురై తల్లిదండ్రులు, బాబాయి ముగ్గురు కలిసి అబ్బాస్ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిలో యువకుడి తల్లి సాహింబేగంకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కుమారుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, గురువారం ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, కర్ర స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గజ్వేల్రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ కృష్ణారెడ్డి ఉన్నారు. -
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్రగాయాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఓ రైతుకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని రామవరంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆరె గట్టయ్య (50) తన వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మరమ్మతు చేసే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. వెంటనే స్థానిక రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో గట్టయ్య చేతికి, కాలు, శరీరం భాగంలో తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ట్రాన్స్ఫార్మర్ ఎక్కినట్లు అధికారులు చెబుతున్నారు. -
వంట గ్యాస్ లీక్
● వ్యాపించిన మంటలు ● ప్రాణపాయస్థితిలో యువకుడు రామచంద్రాపురం(పటాన్చెరు): ఇంట్లో వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాన్సువాడకు చెందిన కాంట్రాక్టర్ భాస్కర్ రెండేళ్లుగా ఎల్ఐజీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో మరో సిలిండర్ను అమర్చుతుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. భాస్కర్ సతీమణి మంజుల బయటకు రాగా.. వారి ఒకే ఒక్క కుమారుడు ఆనంద్ స్వరూప్ గ్యాస్ ధాటికి భయపడి మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాస్లీక్తో వ్యాపించిన మంటలు -
చేతికొచ్చే దశలో..!
పెట్టుబడి మట్టిలో పోసినట్లే.. దుబ్బాక మున్సిపల్ పరధిలోని చెల్లాపూర్కు చెందిన రైతు కొండె ఎల్లారెడ్డి 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వర్షాలకు వరిపంటకు తెగుళ్లు వ్యాప్తి చెందాయి. ఈని గొలుసులు బయటకు వచ్చాక గింజ గట్టి పడకుండా తాలుపోయి తెల్లగా నిలబడిపోతుంది. రకరకాల మందులు పిచికారీతో పాటు పవర్ ఫుల్ఎండ్రీన్ గోళీలు చల్లినా ఫలితం లేదు. ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులను పిచికారీ చేసిన లాభం లేదు. ఇప్పటి వరకు రూ.2 లక్షలు పెట్టిన పెట్టుబడి మట్టిలో పోసినట్లే అయింది. దుబ్బాక: కోటి ఆశలతో రైతులు సాగు చేసిన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు వరి గొలుసులు తెల్లగా మారిపోతున్నాయి. ఈ ప్రభావంతో వరి చేలల్లో ఈని గింజలు గట్టిపడకుండా పంటలు పొల్లుపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం అంతంత మాత్రమే ఉందని వాపోతున్నారు. దీంతో పాటు వరికి అగ్గి తెగుళ్లు, ఎండాకు తెగుళ్లు, సుడి దోమ, మొగి పురుగు రోగాలు వ్యాపించడంతో రైతులు అయోమయం చెందుతున్నారు. తాలు పోతున్న వరి గొలుసులు రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పంటలు చేతికొస్తున్న దశలో తెగుళ్లతో నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం వరి చేలు పొట్టదశకు వచ్చి ఈనుతున్న తరుణంలో బయటకు వచ్చిన గొలుసులకు గింజలు గట్టిపడకుండా తెల్లగా తాలు పోతున్నాయి. వివిధ రకాల క్రిమిసంహారక మందులు చల్లినా ఫలితం కనబడకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 3.63 లక్షల ఎకరాల్లో వరిసాగు.. జిల్లా వ్యాప్తంగా వానకాలంలో సుమారు 3.63 లక్షల ఎకరాల్లో వరిపంటలు సాగయ్యాయి. జిల్లాలోని చాల ప్రాంతాల్లో ముందుగా వేసిన వరి పంటలు ఈని గింజలు ఎర్రబడుతున్నాయి. ఈ క్రమంలో ఈనిన వరి చేలల్లో గొలుసులకు గింజలు పాలుపోసుకోకుండా అలాగే తెల్లబడి నిలబడిపోతున్నాయి. దుబ్బాక మండలంలోనే కాదు.. జిల్లాలోని చాల గ్రామాల్లో వరి పంటల పరిస్థితి దారుణంగా మారిది. విపరీతంగా ఇష్టమొచ్చిన మందులు... వరి చేల పై రైతులు వీపరీతంగా ఇష్టమొచ్చిన మందులు పిచికారి చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది.నాట్లు వేసినప్పుడు వాతవరణ పరిస్థితులతో ఎదగకుండా ఎర్రగా ఉండడంతో అప్పటి నుంచి ఇప్పుడు ఈని గొలుసు తాలుబోతుండడంతో రకరకాల మందులను వేల రూపాయలు పెట్టి తెచ్చి స్ప్రే చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లకు నివారణ.. వరిచేలు ఈని గింజలు గట్టి పడకుండా తాలుపోవడంతో పాటు మొగిపురుగు, ఎండాకు తెగులు, సుడిదోమ, అగ్గి తెగుళ్లలో మెడవిరుపు రోగం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అగ్గి తెగులు సోకిన భూముల్లో ఈ మెడవిరుపు తెగులు లక్షణాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వరిపంటలపై మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే ట్రై సైక్లోజన్ లేదా గెలిలియో సెన్స్ మందులు పిచికారీ చేయాలంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు తెల్లగా మారుతున్న వరి గొలుసులు ఈని గింజలపై పొల్లు ప్రభావం మందులు కొట్టినా.. ఫలితం శూన్యమే అయోమయంలో రైతులు 4 ఎకరాల్లో వరిపంట వేశా నాలుగు ఎకరాల్లో వరిపంట వేశా. పంట మొత్తం ఈని గొలుసు ఎర్రబడుతుంది. ఈనిన గొలుసు పాలుపోసుకోకుండా గింజ గట్టిపడకుండా తెల్లగా గొలుసులా నిలబడిపోతుంది. చేను గిట్లయితుందని మందు తెచ్చి కొట్టిన. అయినా ఏం లాభం లేదు. చేతికొస్తుందనుకున్న చేను గిట్లకావట్లే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పాతూరి లక్ష్మణ్, రైతు దుబ్బాకవరి పంటలను పరిశీలిస్తున్నాం వరిపంటలకు రకరకాల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈని గొలుసులకు తాలుపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వరి పంటలను వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలిస్తున్నాం. ఇందులో వరిపంట కోత దశకు వచ్చే సమయంలో అగ్గితెగులు, ఎండాకు తెగులు, సుడిదోమ, మొగిపురుగు తదితర రకాల రోగాలు కనిపిస్తున్నాయి. ఫర్టిలైజర్ అధికంగా వాడడంతో పాటు అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులతో తెగుళ్లు ఎక్కువయ్యాయి. – డాక్టర్ పల్లవి, వ్యవసాయశాస్త్రవేత్త -
నేడే స్థానిక నగారా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టానికి గురువారం తెరలేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ జారీ కానుంది. ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్.ఓలు) ఈ నోటిఫికేషన్ను జారీ చేస్తారు. వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 11 తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంటుంది. ఈ మేరకు 25 జెడ్పీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ అధికారులను ఆర్.ఓలుగా నియమించారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ప్రతీ రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఆర్ఓను నియమించారు. క్లస్టర్ స్థాయిల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 118 మంది ఆర్ఓలను నియమించారు. గెజిటెడ్ అధికారులు, హెచ్ఎంలు, సూపరింటెండెంట్ కేడర్ అధికారులకు ఎంపీటీసీ స్థానాల ఆర్ఓలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ)ను కూడా నియమించారు. స్కూల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ కేడర్ అధికారులను ఏఆర్ఓలుగా నియమించారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. బుధవారం హైకోర్టు ఎలాంటి స్టే విధించకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం యథావిధిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది.మండలం ఎంపీటీసీ స్థానాలు జహీరాబాద్ 13మొగుడంపల్లి 11న్యాల్కల్ 15 కోహీర్ 13 ఝరాసంగం 13 మనూర్ 8నాగల్గిద్ద 9 కల్హేర్ 6 సిర్గాపూర్ 8 నారాయణఖేడ్ 15 నిజాంపేట 6 కంగ్టి 12మొత్తం 129తొలి విడత జహీరాబాద్, ఖేడ్ డివిజన్లల్లో..తొలి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లలో 129 ఎంపీటీసీ స్థానాలకు, 12 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ కానుంది. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం, మనూరు, నాగల్గిద్ద, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట, కంగ్టి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న సంశయంతో ఉన్న ఆశావహులు ఇప్పుడు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు ముహూర్తం చూసుకుని నామినేషన్లు వేయనున్నారు.తొలి విడతలో 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్న రిటర్నింగ్ అధికారులు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ జహీరాబాద్, ఖేడ్ డివిజన్లలో షురూ కానున్న ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
చిరునామా చిక్కేనా!
సదాశివపేట(సంగారెడ్డి): వ్యాపార కేంద్రమైన సదాశివపేట పట్టణానికి వస్తున్నారా..అయితే పట్టణంలోని అన్ని ప్రాంతాలు పూర్తిగా తెలిసిన వారిని వెంటతెచ్చుకోవడమే ఉత్తమం. లేదంటే అడ్రస్ తెసుకునేందుకు ఇబ్బందులు తప్పవు మరి. ఎందుకంటే అడ్రస్ తెలుసుకోవాలంటే వీధిపేర్ల బోర్డులు కానరాక గంటల తరబడి తిరగాలి. చివరికి ఆటోవాళ్లు అడిగినంతా చెల్లించి చేతి చమురువదిలించుకోక తప్పదు. ఇదీ సదాశివపేట పట్టణం తాజా పరిస్థితి. బోర్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం అధికారులు పాలకులు మారుతున్న స్ట్రీట్, కాలనీల నేమ్బోర్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించినందువల్ల పట్టణానికి వచ్చే కొత్తవారికి చిరునామా తెలుసుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. సదాశివపేట పట్టణం 27 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. పట్టణ పరిధిలో 50 వరకు వివిధ పేర్లతో కాలనీలు ప్రాంతాలున్నాయి. ఐదేళ్ల క్రితం మండల పరిధిలోని సిద్దపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీని పరిధిలో గుర్తింపు పొందిన 19 మురికివాడలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన రోడ్లు శాసీ్త్రరోడ్డు, తిలక్రోడ్డు, సుభాష్రోడ్డు, వికారాబాద్రోడ్డు, పిట్టలకేరీ, గొల్లకేరీ బైపాస్రోడ్ల గుండ వేలితే ఏఏ కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, వారాంతపు సంతల గురించి పేర్లు సూచించే నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అయితే మున్సిపల్ అధికారుల వీటిని ఏర్పాటు చేయలేదు. దీంతో పట్టణానికి కొత్తగా వచ్చే వారు ఎక్కడికి వెళ్లాలన్నా కనిపించిన వారిని అడ్రస్ అడుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఏకాలనీకి ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీంతో కాలనీ ప్రాంతాల నేమ్ బోర్డులు ఏర్పాటుకు సంబంధించి టౌన్ప్లానింగ్ అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక పన్నుల వసూలులో ముందుంటున్న అధికారులు ప్రజలకు పనికొచ్చే సూచికబోర్డులను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెతుకులాట తప్పదు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి ప్రతీరోజు వేలాదిమంది వచ్చివెళ్తుంటారు. పట్టణంలోని బస్టాండ్లో దిగిన ప్రయాణికులు కాలనీ అడ్రస్లు ప్రాంతాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే అడ్రస్ తెలుసుకునేందుకు సుళువుగా ఉంటుంది. – నల్ల ప్రశాంత్గౌడ్, సదాశివపేట బోర్డులు ఏర్పాటు చేస్తాం పట్టణంలో ప్రధాన రోడ్ల ప్రారంభంలోనే సూచిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. అదే విధంగా ఇతర ప్రాంతాల వారీగా ప్రధాన రహదారుల ప్రారంభ ద్వారాల్లోనే కాలనీలు, ప్రాంతాల పేర్లతో కూడినబోర్డులు పేట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శివాజీ, మున్సిపల్ కమిషనర్ పట్టణంలో కానరాని సూచిక బోర్డులు పట్టించుకోని మున్సిపల్ అధికారులు అడ్రస్ తెలుసుకోవాలంటే కొత్తవారికి తిప్పలే -
పాలనలో కాంగ్రెస్ విఫలం
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. మండల పరిధిలోని మల్లేపల్లి మాజీ సర్పంచ్ శివలీల జగదీశ్వర్ తన అనుచరులతో బుధవారం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. పార్టీలోకి నూతనంగా వచ్చిన వారు గతంలో ఉన్న నాయకులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. అనంతరం శివలీల జగదీశ్వర్ మాట్లాడుతూ...బీఆర్ఎస్లోకి రావడంతో తిరిగి సొంతింటికి చేరినట్లు ఉందన్నారు. కార్య క్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ మాణిక్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విట్టల్, నాయకులు మల్లేశం, శ్రీధర్రెడ్డి, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో పలువురి చేరిక -
సంగారెడ్డి డిపోలో లక్కీ డ్రా
విజేతలుగా రాజేశ్వరి, సయ్యద్, కోటేశ్వరరావు సంగారెడ్డి టౌన్: దసరా సందర్భంగా సంగారెడ్డి ఆర్టీసీ డిపో నిర్వహించిన లక్కీ డ్రా ఫలితాలను ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ వెలువరించారు. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం బాక్స్లో చిట్టీలను డ్రా తీశారు. కాగా హైదరాబాద్ చెందిన రాజేశ్వరి మొదటి బహుమతిని రూ.25 వేలు గెలుచుకున్నారు. ఇక రెండవ బహుమతి రూ.15 వేలను సయ్యద్, మూడవ బహుమతి రూ.10 వేలను పటాన్చెరుకు చెందిన కోటేశ్వరరావు గెలుచుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
శతశాతమే లక్ష్యం
టెన్త్ ఫలితాల్లో జిల్లాను తొలిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికలుపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. శత శాతం ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రచించిన అధికారులు అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. – న్యాల్కల్(జహీరాబాద్): స్టడీ మెటీరియల్ పంపిణీ షురూ జిల్లాలో 245 పాఠశాలలకు సంబంధించి ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తయారు చేసిన 49,576 అభ్యాస దీపికలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా పాఠశాలల్లో తెలుగు మీడియంకు సంబంధించి 12,120, ఇంగ్లిష్ మీడియంకు 34,376, ఉర్దూ మీడియంకు 3,064, కన్నడ మీడియంకు సంబంధించి 16 అభ్యాస దీపికలు జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఈనెల 8 నుంచి అన్ని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు మేలు ఎస్సీఈఆర్టీ తయారు చేసిన గణితం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం నాలుగు సబ్జెక్టులకు సంబంధించి అభ్యాస దీపికలు స్టడీ మెటీరియల్ ప్రభుత్వం పంపిణీ చేయనుండటంతో ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపతాయని అధికారులు పేర్కొంటున్నారు. అభ్యాస దీపికలకు తోడు ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభం కావడంతో పదిలో మంచి ఫలితాలు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. గతేడాది మూడో స్థానం జిల్లాలో జెడ్పీ,కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 249 మొత్తం ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో 12,394 విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతేడాది మంచి ఫలితాలు రావడంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి మొదటిస్థానంలో నిలిపేందుకు అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక తరగతులు ప్రారంభించాం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. ప్రతీ రోజు సాయంత్రం 4.15 నుంచి 5.15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. – రాజ్కుమార్, హెచ్ఎం–మిర్జాపూర్(బి) జిల్లాను తొలిస్థానంలో నిలుపుతాం ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. జిల్లాకు 49,576 అభ్యాస దీపికలు వచ్చాయి. వాటిని రేపటి నుంచి పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఇప్పటికే ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పది ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి ప్రారంభమైన పది ప్రత్యేక తరగతులు నేటి నుంచి అభ్యాస దీపికలు పంపిణీ -
అక్షరాస్యత దిశగా మహిళలు
సంగారెడ్డి టౌన్: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అందరికి చదువు అందరి బాధ్యత’అనే నినాదంతో ‘ఉల్లాస్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులోభాగంగా 56,415 మంది మహిళా నిరక్షరాస్యులను అధికారులు గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ పదిమందికి ఒక వలంటీర్ విద్యాబోధన చేస్తున్నారు. దీంతోపాటుగా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్ బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్లను కూడా ఎంపిక చేశారు. ఉన్నతాధికారులు, విద్యాశాఖ, డీఆర్డీవో, మెప్మా అన్ని శాఖల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలతో పాటు వయోజనుల్లో అక్షరాస్యత పెంచేందుకు కార్యాచరణ రూపొందించారు. ఎనిమిదో తరగతి, ఆపై చదివిన విద్యార్థులు, పట్టభద్రులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు ఇలా పలువురు స్వచ్ఛందంగా పాఠాలు చెప్పేందుకు ఇప్పటికే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లా నుంచి ముగ్గురు రిసోర్స్ పర్సన్లకు శిక్షణనిచ్చారు. అనంతరం ఆయా గ్రామాలకు వెళ్లి పదిమందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకుని వారికి చదువు చెబుతున్నారు. ఇందుకోసం సర్కారు, వయోజన విద్య ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించారు. శిక్షణ ఎలా ఇవ్వాలో చెప్పేందుకు ఒకటి, చదువురాని వారి కోసం అక్షర వికాసం మార్గదర్శిని పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు. పేరు రాయడం, చదవడం, అంకెలు గుర్తించడం, బ్యాంకు ఖాతాలో నగదు, అకౌంట్ నంబర్ వంటివి నేర్పిస్తున్నారు. అధికారుల సమన్వయంతో ముందుకు జిల్లా వ్యాప్తంగా 56,415 నిరక్షరాస్య మహిళల గుర్తింపు పది మందికి ఒకరి చొప్పున వలంటీర్ మహిళలకు తరగతుల నిర్వహణఅక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టాం. వలంటీర్లతో బోధన చేయిస్తున్నాం. – సూర్యారావు, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
ముగ్గురిపై కేసు నమోదు
● యువకుడి తల్లిని కొట్టి చంపిన ఘటనలో.. ● పోలీస్ పహారాలో అంత్యక్రియలు జగదేవ్పూర్(గజ్వేల్): ప్రేమికుడి తల్లిని కొట్టిచంపిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన షాహింబేగం కొడుకు అబ్బాస్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా నచ్చని యువతి తల్లిదండ్రులు, బాబాయి కలిసి మంగళవారం సాయంత్రం అబ్బాస్ తల్లిని కొట్టిచంపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం గ్రామానికి మృతదేహాన్ని తీసుకురాగా గ్రామస్తులు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. అనంతరం వట్టిపల్లి గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యా నేరం కింద ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కొడుకు అబ్బాస్ తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, తల్లిని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వేధిస్తున్నాడని అంతం చేశారు
● భార్య, కుమారులు, మరికొందరు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ కొండపాక(గజ్వేల్): భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో పాటు కుమారులు, మరికొందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కుకునూరుపల్లి పోలీస్స్టేషన్లో బుధవారం వెల్లడించారు. తిప్పారం గ్రామానికి చెందిన సింధు సంతోషతో కరీంనగర్ జిల్లాకు చెందిన మహేందర్తో కొన్నేళ్ల కిందట వివాహం జరిగిందన్నారు. మహేందర్ మద్యం తాగి వచ్చి తరుచూ భార్యతో గొడవపడేవాడరన్నారు. దీంతో బాధలు భరించలేక భార్య తమ కుమారులతో తిప్పారానికి వచ్చి ఉంటోంది. అయినా భర్త వచ్చి వేధిస్తుండటంతో ఈ నెల 4న భర్తపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడిచే చికిత్స చేయించుకొని వచ్చి మళ్లీ గొడవ పడ్డారన్నారు. భార్య సంతోష.. తన ఇద్దరు తమ్ముళ్లు, కొడుకులు, పరిచయం ఉన్న వ్యక్తి సహాయంతో మహేందర్ను ఆటోలో తీసుకెళ్లి గ్రామ శివారులో గల కూడవెళ్లి వాగులో పడేశారన్నారు. ఈనెల 6న వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో బయటకు తీశారు. జేబులో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు మహేందర్గా గుర్తించారన్నారు. మృతుడి భార్య సంతోషను, సహకరించిన వ్యక్తి ఎల్లయ్యను విచారించగా హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా కోర్డు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు -
బస్సులో మర్చిపోయిన బ్యాగు అప్పగింత
హుస్నాబాద్: బస్సులో మర్చిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలికి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. వివరాలు... సిద్దిపేట నుంచి హన్మకొండకు బస్సులో వెళ్లిన ప్రయాణికురాలు శోభారాణి బ్యాగును మరిచిపోయి హన్మకొండ పెట్రోల్ బంక్ వద్ద దిగింది. వెంటనే గమనించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బ్యాగులో 4 తులాల బంగారం, బట్టలు ఉన్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే బస్సు డ్రైవర్ మల్లయ్య, కండక్టర్ శంకర్ను అప్రమత్తం చేశారు. సదరు మహిళకు సమాచారం అందించి తిరిగి హుస్నాబాద్ బస్టాండ్లో బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కంట్రోలర్ లకావత్ హరి, సెక్యూరిటీ సిబ్బంది లకావత్ వెంకటేశ్, మహేందర్లకు ప్రయాణికురాలు ధన్యవాదాలు తెలిపింది. గజ్వేల్రూరల్: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కోర్టు జరిమాన విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో 34మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతిగౌడ్ ఎదుట హాజరుపర్చగా 34 మందికి రూ. 50వేల జరిమానతో పాటు, ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. జహీరాబాద్: కోహీర్ మండలం గురుజువాడలోని వ్యవసాయ బావిలో నుంచి వ్యక్తి మృతదేహం బుధవారం మధ్యాహ్నం లభ్యమైంది. మూడు రోజుల క్రితం బావిలో ఈతకు వెళ్లి గల్లంతయిన మహ్మద్ ఆషిక్అలీ (42) మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. బావి లోపలి భాగంలో మృతదేహం చిక్కుకుపోవడంతో వెలికి తీసే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. బావిలోని నీటిని తోడేందుకు రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పది మోటార్లను బిగించి రెండు రోజుల పాటు నీటిని తోడించారు. దీంతో మృతదేహం బయట పడింది. ఆషిక్అలీ మరణానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈత రాక మరణించాడా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయమై కోహీర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘీభావంగా విద్యా సంస్థల బంద్ నంగునూరు(సిద్దిపేట): హుస్నాబాద్లోని జిల్లెల్లగడ్డ గురుకుల పాఠశాలలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సనాదుల వివేక్ (13) అంత్యక్రియలు అతని స్వగ్రామం నంగునూరులో బుధవారం ముగిశాయి. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహం గ్రామానికి చేరుకోగానే స్థానిక నాయకులు, యువకులు, విద్యార్థులు వివేక్ మృతదేహానికి నివాళులర్పించారు. తల్లి లావణ్య, తండ్రి సత్యనారాయణ, అతని కుటుంబ సభ్యులను ఓదార్చి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ నంగునూరు లోని ఉన్నత, ప్రాథమిక పాఠశాల, అక్కేనపల్లి మోడల్స్కూల్ విద్యార్థులు తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు. వివేక్ మృతదేహనికి నివాళులర్పించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీకి రూ.21.65 కోట్ల ఆదాయం
● సంస్థకు దసరా ధమాకా ● రద్దీకి అనుగుణంగా సర్వీసులు ● 40,76,734 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేత డిపో మహాలక్ష్మి మహాలక్ష్మి నగదు నగదు మొత్తం మొత్తం ఆదాయం ప్రయాణికులు ఆదాయం చెల్లించిన ఆదాయం ప్రయాణికులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) ప్రయాణికులు (రూ.లక్షల్లో) దుబ్బాక 97.14 2,30,377 49.73 75,140 146.87 3,05,517 గజ్వేల్– ప్రజ్ఞాపూర్ 213.96 5,27,780 99.71 1,72,621 313.67- 7,00,401 మెదక్ 211.84 5,27,214 144.25 2,22,987 356.09 7,50,201 నారాయణఖేడ్ 105.4 1,56,193 94.08 1,06,089 199.48 2,62,282 నర్సాపూర్ 72.69 1,91,478 33.83 68,258 106.52 2,59,736 సంగారెడ్డి 200.25 4,95,105 156.62 2,27,825 356.87 7,22,930 సిద్దిపేట 186.67 3,99,101 170.32 2,07,666 356.99 6,06,767 జహీరాబాద్ 154.31 2,65,038 174.76 2,03,862 329.07 4,68,900 మెదక్ రీజియన్ 1242.26 27,92,286 923,3 12,84,448 2,165.56 40,76,734గ్రామాల్లో ఇంటిల్లిపాదితో సంబురంగా జరుపుకునే దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుసర్వీసులు కల్పిస్తూ రీజియన్ పరిధిలో మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపి గమ్యస్థానాలకు చేర్చింది. నారాయణఖేడ్: దసరా పర్వదినం ముందు గత నెల 20 నుంచి ఈనెల 2వ వరకు అనంతరం దసరా తర్వాత ఈనెల 4నుంచి 7వ తేదీవరకు 435 ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ సర్వీసుల ద్వారా రీజియన్ పరిధిలో మహాలక్ష్మి ప్రయాణికులు 27,92,286మందిని, ఇతరులు 12,84,448మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చి రూ.21.65కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి స్పెషల్ బస్సులను నడిపింది. 36,20,551కిలోమీటర్లు మేర బస్సులను తిప్పి 40,76,734మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నా కార్మికులను డబుల్ డ్యూటీలకు పంపించి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చింది. అన్ని డిపోల మేనేజర్లు ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా వారికి సదుపాయాలు కల్పించారు. కార్మికులకు తక్షణం చెల్లింపులు రీజియన్ పరిధిలో అన్ని డిపోల పరిధిలో దసరా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. హైదరాబాద్తోపాటు ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నవారు. విద్య, ఉద్యోగాలకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు దసరా పండక్కి తమ స్వగ్రామాలకు వచ్చారు. కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవకుండా ఆర్టీసీ అధికారులు డ్రైవర్, కండక్టర్లకు డబుల్ డ్యూటీలు వేశారు. డిపోల్లో కొన్ని గంటలు విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు కల్పించారు. డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్కు రూ.1,000, కండక్టర్కు రూ.710ల చొప్పున డీడీ (డబుల్ డ్యూటీ) డబ్బులను స్పాట్లో డ్యూటీ దిగగానే చెల్లించారు. దీంతోపాటు కార్మికులు హోటళ్లలో తినేందుకు సమయం సరిపోక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డీఎంలు వెజ్బిర్యానీ పొట్లాలను డ్రైవర్, కండక్టర్లకు అందజేశారు. సంస్థకు మంచి ఆదాయం సమకూర్చి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు కార్మికులకు మిఠాయిలు సైతం పంపిణీ చేశారు.ప్రయాణికుల సేవకు ఎల్లప్పుడూ సిద్ధం ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడమే ఆర్టీసీ లక్ష్యం. అందుకనుగుణంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల అవసరం మేరకు సర్వీసులు నడిపి వారికి సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రయాణికులు కూడా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థ మనుగడకు సహకరించాలి. –మల్లేశయ్య, డీఎం, నారాయణఖేడ్ సమష్టి కృషి ఫలితం ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అందరం సమష్టిగా కృషి చేసి దసరా సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడిపి రూ.21.65కోట్ల ఆదాయం సంపాదించాం. 36,20,551కిలోమీటర్ల మేర బస్సులను తిప్పి 40,76,743మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వీసులను నడిపాం. – విజయభాస్కర్, రీజినల్ మేనేజర్, సంగారెడ్డి -
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయం
నలుగురు నిందితుల అరెస్టు సిద్దిపేటకమాన్: నకిలీ పత్రాలు సృష్టించి లేని భూమిని ఉన్నట్లు చూపించి ప్లాట్ను విక్రయించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కుషాల్నగర్ సర్వే నంబర్ 1299లో భూమి లేకున్నా 90 చదరపు గజాల ప్లాట్ ఉన్నట్లు పట్టణానికి చెందిన రమణగౌడ్, నరేందర్, రమేష్, చంద్రశేఖర్లు నకిలీ పత్రాలు సృష్టించి రామరాజు వెంకటేష్కు రూ.12లక్షలకు గతంలో విక్రయించారు. అనంతరం వెంకటే్శ అట్టి ప్లాట్లో ఇంటి నిర్మాణానికి ప్రయత్నించగా ప్లాట్ అసలు యజమాని వచ్చి అడ్డుకున్నాడు. దీంతో వెంకటేష్ మోసపోయినట్లు గ్రహించి విక్రయించిన వారిని డబ్బులు అడగగా.. ఇవ్వకపోవడంతో పై నలుగురిపై బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆసిఫ్ దర్యాప్తులో ప్లాట్ పత్రాలు సేకరించి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
● బీఎంఎస్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్కుమార్ ● ఏపీఎల్ అపోలో పరిశ్రమ కార్మికులు నిరవధిక సమ్మె చేగుంట(తూప్రాన్): అపోలో పరిశ్రమ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బీఎంఎస్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్కుమార్ అన్నారు. బుధవారం వడియారం శివారులోని ఏపీఎల్ అపోలో పరిశ్రమ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్కుమార్ మాట్లాడుతూ అపోలో పరిశ్రమలో యాజమాన్యం సీనియార్టీ ఉన్న ఉద్యోగులను అక్రమ బదిలీ చేసిందని ఆరోపించారు. కార్మికులకు న్యా యం చేయాలని తోటి కార్మికులు సమ్మెలో పాల్గొన్న ట్లు తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, నర్సింలు పాల్గొన్నారు. -
వాల్మీకి ఆశయ సాధనకు కృషి
సంగారెడ్డి జోన్: వాల్మీకి మహర్షి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేసి, అభివృద్ధి దిశగా సాగాలని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ, పరిశ్రమల శాఖ అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్తోపాటు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రయోజనం అందేలా చూడాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో అందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్ పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
కాంగ్రెస్లో కలహాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ ఎన్నికల సందర్బంగా రచ్చకెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు మండలాల వారీగా నిర్వహించే సన్నాహాక సమావేశాల విషయంలో జహీరాబాద్ నియోజకవర్గంలో రాజుకున్న రచ్చ ఏకంగా రాష్ట్ర అధినాయకత్వమే కలగజేసుకునే పరిస్థితికి చేరింది. ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి వద్దకు వెళ్లింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఈ నియోజకవర్గం నాయకులను సమన్వయం చేయాల్సి వచ్చింది. సస్పెన్షన్ల ప్రకటన చిచ్చు.. జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ నియోజకవర్గం ఇన్చార్జి చంద్రశేఖర్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనపై మరో వర్గం భగ్గుమంది. పార్టీ మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం నియోజకవర్గం ఇన్చార్జికి ఎక్కడిదని సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. పైగా ఏళ్ల తరబడి పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడిని ఈ ఎన్నికల సందర్భంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయని మండిపడుతోంది. ఒక మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం పీసీసీ అధ్యక్షుడికే ఉంటుంది. ఏదైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ నిర్ణయిస్తేనే పీసీసీ అధ్యక్షుడు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. కానీ నియోజకవర్గం ఇన్చార్జి ఎలా సస్పెన్షన్ ప్రకటన ఇస్తారని భగ్గుమంటోంది. నర్సింహారెడ్డిని పార్టీ నుంచి తొలగించలేదని, ఎలాంటి సస్పెన్షన్ ఉండదని మంత్రి వివేక్తో జరిగిన సమావేశం అనంతరం నాయకత్వం ప్రకటించింది. సమన్వయంతో సమావేశాలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మండలాల వారీగా సమావేశాలు జరుగుతున్నా యి. ఈ నియోజకవర్గంలోని నాయకులను ఇన్చార్జి మంత్రి వివేక్ సమన్వయం చేయడంతో ఈ సమావేశాలకు ఇప్పుడు చంద్రశేఖర్తోపాటు, గిరిధర్రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఇటీవల మొగుడంపల్లి మండల సమావేశానికి ఇరు వర్గాల నాయకులు హాజరయ్యారు. అలాగే జహీరాబాద్ మండల సమావేశానికి కూడా రెండు వర్గాల నాయకులు పాల్గొన్నారు. పాత, కొత్త నేతల మధ్య పోరు ఈ నియోజకవర్గంలో పాత, కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత పదేళ్లు ఇక్కడ గిరిధర్రెడ్డి వర్గం పార్టీని అంటిపెట్టుకుని ఉంటోంది. కాంగ్రెస్ కష్ట కాలంలోనూ తాము పార్టీకి అండగా నిలిచామని, తీరా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు తమపై ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారని మండిపడుతోంది. ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వద్దకు వెళ్లడంతో ఇరు వర్గాలను హైదరాబాద్లోని తన నివాసానికి పిలిపించి సమన్వయం చేయాల్సి వచ్చింది. ఇన్చార్జి మంత్రి వివేక్ వద్దకు ‘జహీరాబాద్’ పంచాయితీ ‘స్థానిక’ఎన్నికల వేళ రచ్చకెక్కుతున్న నేతల ఆధిపత్య పోరు ఇరువర్గాలను సమన్వయం చేసిన మంత్రి వివేక్ -
ప్రజాస్వామ్యంపై దాడి
కోర్టు ఆవరణలో ధర్నా చేస్తున్న న్యాయవాదులుసంగారెడ్డి టౌన్: సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై న్యాయవాది రాకేశ్ కిశోర్ దాడి చేయడాన్ని జిల్లా కోర్టులోని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. జస్టిస్ గవాయ్పై దాడికి వ్యతిరేకంగా జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ...సీజేఐపై దాడి భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. దేశంలో లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాజ్యాంగం పెట్టని గోడలా ఉందని, దానిని ధ్వంసం చేయడానికి సనాతన ధర్మం పేరుతో కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్ కిశోర్పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, దేశంలో ఏ కోర్టులో కూడా వాదించకుండా ఆయన బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాస్,రామారావు,నారాయణ, కృష్ణ, దర్శన్, సుభాష్ చందర్, నిజాముద్దీన్ రషీద్, శ్రీను నాయక్,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు నారాయణఖేడ్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్బీఆర్ గవాయ్పై న్యాయవాది రాకేశ్ కిశోర్ బూటు విసిరి దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ ఖేడ్ జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, కార్యదర్శి నర్సింహారావు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని ఖండిస్తూ న్యాయవాదుల నిరసన -
వాల్మీకి మార్గంలో నడుచుకోవాలి: ఎస్పీ
సంగారెడ్డి జోన్: వాల్మీకి చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ రవాణా జరగకుండా చర్యలుస్థానిక ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంతోపాటు డబ్బు అక్రమంగా రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ రాములు, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, వెంకటరెడ్డి, సైదా నాయక్ పాల్గొన్నారు.పిల్లల పట్ల శ్రద్ధ వహించాలిజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డిటౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ, సఖి కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్లు మరమ్మతు చేయండినారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షాలకు బాగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన రోడ్లు, వంతెనలకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతూ మంగళవారం ఖేడ్ మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రవీందర్ నాయక్ ఖేడ్సబ్ కలెక్టర్ ఉమాహారతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం వినతి పత్రాన్ని సబ్కలెక్టర్కు అందజేశారు. సోమవారం కురిసిన కుండపోత వర్షం కారణంగా ఖేడ్–సిర్గాపూర్ మార్గంలోని ర్యాకల్–చల్లగిద్ద తండాల మధ్య రోడ్డుతోపాటు, ర్యాకల్ సమీపంలోని వంతెన వద్ద గొయ్యిపడి ప్రమాదకరంగా మారిందని వివరించారు. ర్యాకల్ నుంచి పోతన్పల్లి వైపు వెళ్లే రోడ్డు సైతం బాగా దెబ్బతిందని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నాయకులు చౌహాన్ సర్దార్ నాయక్, తదితరులు ఉన్నారు. ఎన్ఎంఎంఎస్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్)కు 2025–26 విద్యాసంవత్సరంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎంఈఓ శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు రూ.50, బీసీలు, ఇతరులు రూ.100 చెల్లించాలని కోరారు. ఎన్ఎంఎంఎస్ఎస్ పరీక్షలో ఉతీర్ణులైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12వేలు స్కాలర్షిప్ లభిస్తుందని చెప్పారు. డిసెంబర్ 7న రాత పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సామూహిక కుంకుమార్చన
సదాశివపేట(సంగారెడ్డి): దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా పట్టణంలోని భవసార క్షత్రియ సమాజ్ శ్రీభవాని మందిరంలో, శ్రీబంగారు మైసమ్మ మందిరాల్లో మంగళవారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళల సామూహిక కుంకుమార్చన హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణపాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చింతా సాయినాథ్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కలిసికట్టుగా పనిచేద్దాం
జహీరాబాద్: సమిష్టిగా ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం జహీరాబాద్ మండల అభ్యర్థుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, ఐడీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్లు మాట్లాడారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్లయితే పార్టీ ఉపేక్షించబోదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, ఈ విషయంలో ఎలాంటి తీర్పు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ తరఫున 42% టికెట్లను బీసీలకు కేటాయిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామ స్థాయిలో ముగ్గురి పేర్లను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. సేకరించిన పేర్లను అధిష్టానవర్గం వద్దకు పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీడీసీ చైర్మన్ ముబీన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, అడ్హక్కమిటీ చైర్మన్ ఎం.జి.రాములు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, ఎంపీ క్యాంపు కార్యాలయ ఇంచార్జి శుక్లవర్ధన్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు నాగిశెట్టిరాథోడ్, మాణిక్యమ్మ పాల్గొన్నారు. ముఖ్య నేతల ఐక్యతారాగం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల నెలకొన్న విభేదాలకు తెరదించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక సమావేశంలో చంద్రశేఖర్, గిరిధర్రెడ్డి, ఉజ్వల్రెడ్డి, ఎం.డి.తన్వీర్లు ఒకే వేదికపై కూర్చుని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ఐక్యతా రాగం ఆలపించారు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. గ్రూపురాజకీయాలను పార్టీ ఉపేక్షించదు సమావేశంలో పార్టీ నేతలు చంద్రశేఖర్, గిరిధర్రెడ్డి, ఉజ్వల్రెడ్డి, తన్వీర్ల ఐక్యతారాగం ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు -
రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు ఏర్పాట్లు
పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోకి మైత్రి మైదానం కేంద్రంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని మైత్రి స్పోర్ట్స్ క్లబ్ భవనంలో క్రీడల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అండర్ 17 బాలుర వాలీబాల్, అండర్ 14 బాలురు, బాలికల కబడ్డీ పోటీలను అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 420 మంది క్రీడాకారులతో పాటు 200 వందల మంది వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. వీరందరికి మూడు రోజులపాటు భోజనం, వసతి, బహుమతులు సొంత నిధులతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లను సైతం సొంత నిధులతో జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు తెలిపారు. క్రీడల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్రెడ్డి, జీహెచ్ఎంసీ డిబేట్ కమిషనర్ సురేశ్, మండల విద్యాశాఖ అధికారులు పీపీ రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దీన్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు పటాన్ చెరులో క్రీడా సంబరాలు ఈనెల 16, 17, 18 తేదీల్లో వాలీబాల్, కబడ్డీ క్రీడలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్క చూపాలిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు మండలస్థాయిలో ఎన్నికల వ్యయంపై సహాయక పరిశీలకులు నియామకం అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
అవగాహనే రక్ష
రోజు రోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అవగాహన ఉంటే సైబర్ ఉచ్చులో పడకుండా ఉంటారని, ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. – పటాన్చెరు టౌన్సాఫ్ట్వేర్, ప్రైవేట్, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారిని సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి మీ అబ్బాయి కేసుల్లో ఇరుక్కున్నాడని.. డబ్బులు చెల్లించాలని లింకులు పంపి ఫోన్ను హ్యాక్ చేస్తున్నారు. క్రైమ్ జరిగిన గంటలోనే (గోల్డెన్ హవర్) బాధితులు ముందుగా 1930కు కాల్ చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం ఇవ్వాలి. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం వారి పరిధిలోకి వచ్చే పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలి. వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో 178 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా బాధితులు మొత్తం 4.15 కోట్లు పోగొట్టుకున్నారు. ఇలా మోసపోతున్నారు.. ● పార్ట్ టైం జాబ్ పేరుతో టాస్కులు ఇస్తూ, నగదు ఇన్వెస్ట్ చేయిస్తూ, అధిక డబ్బు సంపాదించవచ్చని. ● ఏటీఎం కార్డు, డెబిట్ కార్డ్ అప్డేట్ చేయాలని వివరాలు సేకరించి బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయం చేస్తున్న ఘటనలు అనేకం. ● ఆన్లైన్ ఉద్యోగాలంటూ ఫోన్కు వచ్చిన లింకులు క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వారు కొందరు. ● ఫేస్ బుక్లో వాహనాలు, సెకండ్ హ్యాండ్ వస్తువుల ప్రకటనలు క్లిక్ చేసి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. కొన్ని ఘటనలు ● పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 15న తన ఫోన్కు టాస్కులు చేస్తే కమీషన్ ఇస్తామని గుర్తుతెలియని మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలు నమోదు చేయగా... వారు వాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి నగదు చెల్లించి టాస్కులు చేశాడు. దీంతో బాధితుడు మొత్తం రూ.47 లక్షల 67 వేలు చెల్లించాడు. కాగా పెట్టిన నగదును ఇవ్వాలని అడగగా అవుతలి నుంచి స్పందన లేదు. ● ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి సెప్టెంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పాడు. దీంతో బాధితుడు కార్డు వివరాలు చెప్పాడు. లిమిట్ పెంచామని.. మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పాలని సూచించాడు. నిజమని నమ్మి చెప్పగా వెంటనే అతడి ఖాతా నుంచి రూ. రెండు లక్షల 19 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అవగాహన కల్పిస్తున్నాం బాధితులు గోల్డెన్ అవర్లోనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. దోచుకున్న నగదును బ్లాక్ చేస్తారు. సైబర్ నేరాలపై విద్యాసంస్థల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఓ పరిశ్రమలో కార్మికులకు అవగాహన కల్పిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి జనవరి నుంచి ఇప్పటి వరకు 178 కేసులు ఆన్లైన్ జాబ్స్, ఫోన్కాల్స్తో బురిడీ -
లక్షలాది రైతులకు పత్తి జీవనాధారం
దుబ్బాకటౌన్: పత్తి పంట ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు జీవనాధారమవుతుందని, వ్యవసాయం నుంచి వస్త్ర పరిశ్రమ వరకు అనేక రంగాల్లో ఉపాధి కల్పిస్తుందని భారత నవ నిర్మాణ సంస్థ కో ఆర్డినేటర్ దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం రామారం గ్రామంలో ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచ వాణిజ్య సంస్థ 2019లో మొదటిసారి ప్రపంచ పత్తి దినోత్సవం ప్రారంభించిందన్నారు. పత్తితో మనకు వస్త్రాలు మాత్రమే కాకుండా, విత్తన నూనె, పశువుల ఆహారం వంటి అనేక ఉత్పత్తులు లభిస్తున్నాయని గుర్తు చేశారు. పత్తి సహజమైన పంట కావడం వల్ల పర్యావరణానికి మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కల్పన, ఫీల్డ్ ఫెసిలిటీర్స్ కరుణాకర్, శ్రీకాంత్, వినోద్ రెడ్డి తదితరులున్నారు.