Sangareddy District Latest News
-
పుట్టగొడుగుల్లా అక్రమ షెడ్లు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, బొల్లారం ప్రాంతాల్లో ముఖ్యమైన కూడళ్లు ప్రధాన రోడ్లలో ఎక్కడబడితే అక్కడ రేకుల షెడ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ అనుమతులు తీసుకోవడం లేదు. చకచకా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. కార్యాలయానికి కూతవేటు దూరంలోనే గడ్డపోతారం పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 79లో అక్రమ షెడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. అక్రమాల ముసుగులో షెడ్లను నిర్మిస్తున్నా కనీస చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. వీటిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన గడ్డపోతారం ప్రగతిపథంలో ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో అక్రమార్కులు ప్రధాన కూడళ్లు ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడపడితే అక్కడ వివిధ వ్యాపార వాణిజ్య లావాదేవీలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అక్రమ షెడ్లకు సంబంధించి ఆస్తి పన్ను రావడంలేదని కట్టడి చేయడంలో నగర ప్రణాళిక రెవెన్యూ విభాగం అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. పట్టణ పరిధిలో ఇటు వాణిజ్య దుకాణాలు నిర్మించే ముందు స్థలం యజమాని అన్ని ధ్రువపత్రాలు సమర్పించి మున్సిపల్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక డోర్ నంబర్తోపాటు అసెస్మెంట్ చేసుకుని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి. ఇందుకు విరుద్ధంగా మున్సిపాలిటీలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు శూన్యం అక్రమ షెడ్ల నిర్మాణాలపై అధికారులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. స్థానికులు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగానే స్పందించి వదిలేస్తున్నారు. అధికారుల చర్యలు అక్రమార్కులకు వత్తాసు పలికినట్లుగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నెత్తి చూడని అధికారులు అక్రమ నిర్మాణాలతో ఆదాయానికి గండి -
మంటల్లో ఈత వనం
● దాదాపు 200 చెట్లకు నష్టం ● అప్రమత్తతతో తప్పిన భారీ నష్టం ● మీనాజీపేటలో ఘటన వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం మీనాజీపేట శివారు ఈత వనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 200 చెట్లు దెబ్బతిన్నాయి. ప్రాథమిక దశలోనే మంటలు గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. ఘటన స్థలానికి గజ్వేల్ అగ్నిమాపక శకటం చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. వివరాలు.. మీనాజీపేట శివారులోని రెండున్నర ఎకరాలలో గ్రామ గౌడసంఘం 2,600 మొక్కలు నాటి ఈత వనం పెంచింది. ప్రస్తుతం వాటి ద్వారా ఆదాయం సమకూరుతున్నది. శుక్రవారం గీతకార్మికులు సత్యనారాయణగౌడ్, కిషోర్గౌడ్ వనంలో చెట్లు గీసేందుకు వచ్చారు. పొగలు, మంటలను గమనించారు. వెంటనే అందరినీ అప్రమత్తం చేశారు. అంతా కలిసి నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే, గజ్వేల్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేశారు. వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి బృందం అగ్నిమాపక శకటంతో ఘటనాస్థలానికి చేరుకుని వనంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి ఆర్పేశారు. సకాలంలో ప్రమాదాన్ని గుర్తించి అదుపులోకి తేవడం వల్ల మిగతా వనంలోకి మంటలు విస్తరించకుండా ఆపగలిగామని, లేకుంటే భారీ నష్టం జరిగేదని గౌడసంఘ సభ్యులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 200 చెట్లు దెబ్బతిన్నాయని, రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. -
పిల్లల్లో వ్యాధుల్ని ముందుగానే గుర్తించాలి
సంగారెడ్డి: పిల్లల్లో వ్యాధుల్ని ముందుగానే గుర్తించడం ద్వారా వాటిని నయం చేసి చిన్నారుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలోని ఆర్బీఎస్కే, డీఈఐసీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నవజాత శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు రిస్క్ అసెస్మెంట్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వసంతరావు, డా.శశాంక్లతో కలసి ఆమె ప్రారంభించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాలు, జోగిపేట, సదాశివపేట ప్రాంతాల నుంచి మొత్తం 24 మంది రిస్క్లో ఉన్న పిల్లలను డీఈఐసీ కేంద్రానికి రిఫర్ చేసి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ.. నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లల్లో ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడం చాలా కీలకమన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి, రిస్క్లో ఉన్న పిల్లలను గుర్తించి, వారిని ఆర్బీఎస్కే మెడికల్ అధికారుల ద్వారా స్క్రీనింగ్ చేసి అవసరమైన రిఫరల్ సేవలు, ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు తమ పిల్లల్లో ఉన్న సమస్యలను గుర్తించకపోతే, భవిష్యత్తులో ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని డీఎంహెచ్ఓ వసంతరావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవల ద్వారా రిస్క్లో ఉన్న పిల్లలకు ఉచితంగా సర్జరీలు, ఫిజియోథెరపీ సేవలు అవసరమైన రిఫరల్ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శశాంక్ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ నవీన్ చారి, డీసీపీఎస్ సిబ్బంది లింగం, యాదగిరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి -
10న స్మార్ట్ సిటీకి శంకుస్థాపన
● వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభం ● జహీరాబాద్లో రూ.2వేల కోట్లపెట్టుబడులుజహీరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న రాష్ట్రానికి వస్తున్నందున జహీరాబాద్కు మంజూరైన గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్మార్ట్ సిటీకి పర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న 12 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లలో ఒకటి తెలంగాణలోని జహీరాబాద్కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు గాను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మాసాన్పల్లి, నిజాంపేట్ మండలం నాగధర్, బాచేపల్లిలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం విక్రయించేందుకు నాణ్యత పాటించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. అనంతరం బాచేపల్లిలో సీసీ రోడ్డు, మంచినీటి పథకం బోరు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ భాస్కర్సేట్, ఏపీఎం వంశీకృష్ణ, సర్పంచ్లు కుర్మ సాయిలు, జక్కరయ్య, నాయకులు పత్తిగారి శ్రీకాంత్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
పైన భగభగ..
చెంతన సెగ●ఆర్టీసీ డ్రైవర్ల అరిగోస ●మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి ●నిత్యం వందల కిలోమీటర్ల మేర డ్రైవింగ్ ●కనీస సౌకర్యాలు లేక అవస్థలు మండే ఎండలతో బస్సులు నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలతో బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేక తల్లడిల్లిపోతున్నారు. నిత్యం సుమారు 500 కిలోమీటర్ల మేర బస్సు నడుపుతూ అరిగోస పడుతున్నారు. డ్రైవర్ సీటుముందు ఫ్యాన్లు లేక రోజూ 12 గంటలకు పైగా ఏకధాటిగా బస్సును నడిపి అనారోగ్యం పాలవుతున్నారు. అయినా ఉన్నతాధికారులు వారి ఆరోగ్యంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – మెదక్జోన్ మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్ –ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 611 బస్సులు ఉన్నాయి. వీటిలో 144 ఆర్టీసీ బస్సులు, 160 అద్దెబస్సులు, 186 పల్లెవెలుగులు, 59 డీలక్స్లు, 18 సూపర్ లగ్జరీలు 50 ఎక్స్ప్రెస్లు ఉండగా ఎనిమిది డిపోల పరిధిలో 774 మంది డ్రైవర్లు, 980 మంది కండక్టర్లు ఉన్నారు. బస్సుల సంఖ్యతో పోలిస్తే కేవలం 163 మంది మాత్రమే డ్రైవర్లు అదనంగా ఉన్నారు. కాగా పల్లెవెలుగులు నిత్యం 350 నుంచి 400 కిలోమీటర్లు తిరుతుగుతుండగా, ఎక్స్ప్రెస్లు, లగ్జరీలు, 500 కిలో మీటర్లకు పైగా నడపాల్సి ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు. సూపర్లగ్జరీలు లాంగ్టూర్లకు వెళ్తుండగా అందులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. కాగా సూపర్ లగ్జరీలలో తప్ప మిగతా ఏబస్సుల్లోనూ డ్రైవర్ సీట్లముందు ఫ్యాన్లు లేకపోవడం గమనార్హం. కుంపట్లో కూర్చున్న విధంగా...! ఇరవై రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో బయట కాలు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. ఇలాంటి వేళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిప్పలు అన్నీఇన్నీ కావు. బస్సు పైకప్పు ఇనుప రేకులతో తయారు చేసినవి కావటంతో ఎండవేడిమి మరింత అధికంగా ఉంటుంది. అంతే కాకుండా డ్రైవర్సీటు పక్కనే ఇంజన్వేడి.. నిత్యం 12 గంటలకు పైగా ఏకధాటిగా బస్సును నడపటంతో డ్రైవర్లు నీరసించి పోతున్నారు. గతంలో బస్సు డ్రైవర్ సీటు ముందు చిన్నపాటి ఫ్యాన్ ఉండేది. కొంత మేర ఉపశమనం పొందుతూ బస్సులను నడిపేవారు. వాటిని చాలా కాలంగా తొలగించటంతో గత్యంతర లేక బతుకు జీవుడా అంటూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ట్విమ్డ్రైవర్ల పరిస్థితి మరీ అధ్వానమనే చెప్పాలి. ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ సీటుముందు చిన్నపాటి ఫ్యాన్ ఏర్పాటు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఫ్యాన్లు లేక పోవటంవల్లా ఎండవేడిమి, ఉక్క పోతతో తరుచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు. -
జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026● ర్యాలీలు..విజయోత్సవాలుజిల్లాలో మే డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. సంగారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక నేతలు వివిధ పరిశ్రమల నుంచి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కార్మిక జెండాను ఆవిష్కరించారు. సదాశివపేటలో కార్మిక దినోత్సవానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఖేడ్ ఆర్టీసీ డిపోలో కార్మికులు విజయోత్సవ సంబురాలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరై కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్మిక దినోత్సవానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి హాజరై ప్రసంగించారు. సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్/సంగారెడ్డి ఎడ్యుకేషన్/సంగారెడ్డి జోన్: -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
పటాన్చెరు టౌన్: భద్రతా పరంగా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమీన్పూర్ సీఐ నరేష్ అన్నారు. శుక్రవారం అమీన్న్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట చౌరస్తాలో రాజన్న టీ కొట్టు నిర్వాహకుడు స్వచ్ఛందంగా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాటిని సీఐ నరేష్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా రహదారిపై వాహనాల రాకపోకలు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలను అమర్చడం అభినందనీయమన్నారు. సమాజ భద్రతకు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. -
రూ.14 కోట్లు
హార్టికల్చర్కుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యానవన పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ పంటలు సాగు చేసే రైతులకు వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీల కోసం జిల్లాకు ఈ ఆర్థిక ఏడాది 2026–27 కోసం రూ.14.13 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలున్నాయి. పండ్ల తోటలు, పూల మొక్కలు, కూరగాయలు, తేనెటీగల పెంపకం, సుగంధ ద్రవ్యాలు సాగు చేసే రైతులకు వివిధ పథకాల కింద ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఈసారి 12,199 మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. 70 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ఏటా సుమారు 70 వేల ఎకరాలకు పైగా ఉద్యానవన పంటలు సాగవుతాయి. ఇందులో మామిడి, జామ వంటి పండ్ల తోటలు, కూరగాయలు, పూలతోటలతోపాటు, ఓమ, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కూడా సాగవుతాయి. ఆయా పంటలు సాగు చేసే రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా ఉచితంగా విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, పురుగుమందులు పంపిణీ చేస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల కింద వ్యవసాయ యంత్ర పనిముట్లు కూడా సబ్సిడీపై ఇస్తారు. స్ప్రేయర్లు, రొటోవేటర్లు, మినీ ట్రాక్టర్లు, సీడ్ డ్రిలర్లు వంటి ఆధునిక పనిముట్లు కూడా సబ్సిడీపై ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. అలాగే మామిడి, జామ, బొప్పాయి వంటి తోటల నిర్వహణ (మెయింటెనెన్స్) కింద కొంతమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. ఉల్లిగడ్డలు వంటి పంటలు సాగు చేసే రైతులకు తాత్కాలిక స్టోరేజీ స్ట్రక్చర్లు నిర్మించుకునేందుకు సబ్సిడీలు ఇస్తారు. షేడ్నెట్లు, మల్చింగ్ వంటివాటిని కూడా సరఫరా చేస్తుంటారు. ఇలా ఆయా పథకాల కింద ఇచ్చే ఈ ప్రోత్సాహకాలకు సంబంధించిన సబ్సిడీల కోసం ఈ ఆర్థిక ఏడాదిలో జిల్లాకు రూ.14.13 కోట్లను వినియోగించుకోనున్నారు. సూక్ష్మసేద్య పరికరాలు సైతం పరిమిత నీటి పారుదల సౌకర్యంతో ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యానవనపంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సూక్ష్మసేద్య పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తుంది. ఎస్సీ,ఎస్టీ రైతులకు ఏకంగా వంద శాతం (ఉచితంగా) ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. బీసీ రైతులకు 90% సబ్సిడీ, ఇతర రైతులకు 80% మేర సబ్సిడీలు ఇస్తారు. ఈ పథకానికి కూడా ఈ నిధులను వినియోగించనున్నారు.వివిధ పథకాల కింద12 వేలమంది రైతులకు లబ్ధి కేటాయింపులు సరే.. విడుదలే ప్రశ్నార్థకం ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా సబ్సిడీల కోసం ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గత ఆర్థిక ఏడాది 2025–26లో జిల్లాకు వివిధ పథకాల సబ్సిడీల కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేయగా రూ.5.54 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.3.56 కోట్లు విడుదల కాలేదు. దీంతో నిర్దేశిత ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఈసారైనా మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. -
‘నీట్’కు సర్వం సిద్ధం
సంగారెడ్డి జోన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సులలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలీటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–2026కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,772 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీలు చేస్తారు. ఇటీవల కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులతో సమావేశం నిర్వహించి, నీట్ నిర్వహణపై సమీక్షించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల వసతులు ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచనున్నారు. విద్యుత్తు సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలు పూర్తి చేస్తున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సినవి ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు, ఆధార్ లేదా పాన్ లేదా పాస్పోర్ట్ లేదా స్టూడెంట్ ఐడీ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్కార్డ్ సైజ్ ఫొటోను అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్కు మాత్రమే అనుమతి ఉంటుంది.ముందుగానే చూసుకోవాలి నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామాను ముందురోజే చూసుకోవడం మంచిది. అరగంటకు ముందే కేంద్రానికి చేరుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. – ప్రతీక్ జైన్, కలెక్టర్, సంగారెడ్డి -
శభాష్ పోలీస్
● చెరువులో దూకిన వృద్ధురాలు ● స్థానికుల సహాయంతో కాపాడిన పోలీసులు మిరుదొడ్డి(దుబ్బాక): కుటుంబ కలహాలతో ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన 70 సంవత్సరాల వయస్సు గల చింతమడక లచ్చవ్వ కుటుంబ కలహాలతో సతమతం అవుతుండేది. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళుతున్న హనుమాన్ భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బ్లూ కోడ్స్ పోలీసులు రాజు, బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో అతి కష్టంపై లచ్చవ్వను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు సీపీఆర్ చేసి స్పృహలోకి తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న లచ్చవ్వను 108 ద్వారా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని కాపాడిన బ్లూ కోడ్స్ పోలీసులను గ్రామస్తులు శభాష్ పోలీస్ అంటూ అభిందించారు. -
వాళ్లు నాటుతున్నారు.. వీళ్లు నరికేస్తున్నారు!
రాంతీర్థ్–బీదర్ రోడ్డు మార్గంలో పచ్చని చెట్లను నరికివేసిన దృశ్యంఅల్లాదుర్గం–మెటల్కుంట రోడ్డు పక్కన ఆహ్లాదకరంగా చెట్లున్యాల్కల్ మండలంలో హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని జిల్లా అధికారులు ఆదేశించడంతో కింది స్థాయి సిబ్బంది మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు నాటిన మొక్కలు ఏపుగా పెరిగే వరకు నీటిని అందించి సంరక్షిస్తున్నారు. దీంతో రోడ్ల కిరువైపులా రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత విద్యుత్ తీగలకు తాకుతున్నాయనే కారణంతో ఆ శాఖ సిబ్బంది వాటిని విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. దీంతో మొక్కలను సంరక్షించిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యాల్కల్(జహీరాబాద్): -
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగిరం
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ సంగారెడ్డి జోన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, గన్నీ బ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్యాక్స్, డీసీఎంఎస్, ఐకేపీల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అన్ని కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా ధాన్యం సేకరణ కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సైలెన్సర్లు మార్చితే వాహనాల సీజ్
పటాన్చెరు టౌన్: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు శుక్రవారం ట్రాఫిక్ సీఐ అశోక్, ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా సైలెన్సర్లు మార్చి, కాలుష్యం కలుగజేస్తున్న ఏడు వాహనాలను గుర్తించి, మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానా విధించారు. అలాగే సైలెన్సర్లను తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అశోక్ మాట్లాడుతూ వాహనదారులు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ధ కాలుష్యం సృష్టిస్తే సహించమన్నారు. ఆ వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట్రాఫిక్ సీఐ అశోక్ -
నేడు హిందూ సమ్మేళనం
జహీరాబాద్ టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని దత్తగిరి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో అల్గోల్ రోడ్డులోని పీవీఆర్ గార్డెన్లో సాయంత్రం 5 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు. ఆత్మీయ హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలివ్యవసాయ శాస్త్రవేత్తలు కిరణ్రెడ్డి, చిరంజీవి కొండాపూర్(సంగారెడ్డి): గ్రామాల్లో యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు కిరణ్రెడ్డి, చిరంజీవి కోరారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో శుక్రవారం మారేపల్లిలో నిర్వహించిన రైతులకు అవగాహన కార్యక్రమంలో వీరు పాల్గొని మాట్లాడారు. ప్రతీ రైతు తమ పంట పొలాల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. పంటల్లో రసాయనిక ఎరువులను పరిమితంగా వినియోగించాలని చెప్పారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గి, నేలకు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పంట మార్పిడుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వ్యవసాయాధికారి గణేశ్, ఏఈఓ రవి, రైతులు మొగులయ్య, అనిల్కుమార్,రాజు, నారాయణ, లక్ష్మణ్, మధుగౌడ్, నారాయణ పాల్గొన్నారు.కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి: సౌజన్యసంగారెడ్డి టౌన్: ఇటుక బట్టీ వద్ద కార్మికులకు సౌకర్యాలను కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మండలంలోని హనుమాన్నగర్ పరిధిలోని ఇటుక బట్టీ కార్మికులకు న్యాయ అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాల్య వివాహాలను ప్రతీ ఒక్కరు అరికట్టాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వినియోగం తగ్గించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖేడ్ కమిషనర్ బదిలీనారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన మేనేజర్ వెంకటశివయ్యకు శుక్రవారం బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. గ్రూప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి.ప్రశాంతి ఖేడ్ కొత్త కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్లపాటు పనిచేసిన జగ్జీవన్ ఖేడ్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారంతోపాటు పట్టణాభివృద్ధికి పాటుపడ్డారు. జొన్నలు కొనుగోలు చేయాలిమాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. కల్హేర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటలు కూడా సరిగా కొనుగోలు చేయడంలేదన్నారు. ప్రతీ పంట కొనుగోలు చేసి అదనంగా బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులు పండించిన జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంసింగ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎంఏ.ఘని, నాయకులు బాలయ్య, నర్సింహగౌడ్, వెంకట్నాయక్, గంట విఠల్, మాణిక్ప్రభు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యం
నందిగామలో యువతి.. పటాన్చెరు టౌన్: బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశం వివరాల ప్రకారం... పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన లకీ్ష్మ్నారాయణ ప్రవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు రుచిత (19) ఇంటర్ వరకు చదివి, బ్యూటీషన్ నేర్చుకొని ఈవెంట్స్ చేస్తుంది. మూడు రోజుల క్రితం వరంగల్లో ఈవెంట్ ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంత దూరం వద్దన్నారు. ఈ క్రమంలో గత నెల 30న రామచంద్రపురంలో ఉండే స్నేహితురాలు దగ్గర ఈవెంట్కు సంబంధించిన మెటీరియల్ ఉందని.. తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగయపేటలో వ్యక్తి.. కౌడిపల్లి(నర్సాపూర్): కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన వ్యక్తి అదృశ్యమైయ్యాడు. శుక్రవారం ఎస్ఐ అమరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలంలోని సంగయపేటకి చెందిన పాలంచ మల్లయ్య(58) కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 27వ తేదిన కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మదేవి ఆలయానికి వచ్చాడు. కుటుంబ సభ్యులు ఆలయం వద్ద స్నానం చేసేందుకు వెళ్లగా.. అప్పటి నుంచి అతను కనిపించలేదు. ఆలయ పరిసరాలతోపాటు బంధువుల వద్ద వెతికిన అతని ఆచూకీ లభించలేదు. అయితే మల్లయ్యకు మానసిక స్థితి సరిగా లేక అప్పుడప్పుడు ఇంటినుంచి వెళ్లి తిరిగి వచ్చేవాడని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. -
యువత భవిష్యత్ బాటలు వేసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: యువత సాధికారతకు కేరీర్ గైడెన్స్ ఎంతోగానో దోహద పడతాయని, టెన్త్, ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు సరైన స్ట్రీమ్ ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో కెరీర్ గైడెన్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత కెరీర్ తాను ఎంచుకున్న రంగంలో నాణ్యమైన గుణాత్మక విద్య ద్వారా ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఓటమి వచ్చినప్పుడు అధైర్య పడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ మరలా కష్టపడి చదివి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కలెక్టరేట్లో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు కృషి చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సాహితి పాల్గొన్నారు. -
సమ్మెకు దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు
జహీరాబాద్ టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు జమచేయాలని కోరుతున్న అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమచేయాలని, ఎండల కారణంగా ఒంటిపూట పని కల్పించాలని కోరారు. ఈ సమ్మెలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంజీవ్, మోహన్, యశోదమ్మ, సిద్ధమ్మ కార్మికులు పాల్గొన్నారు. సమస్యలపై నిరసన -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
రూ.8 లక్షల ఆస్తి నష్టం అల్లాదుర్గం(మెదక్): షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమై రూ.8 లక్షల 42 వేల ఆస్తి నష్టం జరిగిన సంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్లో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య పెంకుటిళ్లు ఉండగా.. కొత్తగా ఇళ్లు కట్టుకుంటుండగా మరో గదిలో ఉంటున్నారు. గురు వారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో ఫ్రిజ్లో మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధమైనట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల 20 వేలు నగదు, రెండున్నర తులాల బంగారం, 20 తులాల వెండి అభరణాలు, బియ్యం, పప్పుదినుసులు, దుస్తులు, టీవీ, వ్యవసాయ సామగ్రి, ఇతర వస్తువులు అగ్నికి కాలిపోయినట్లు తెలిపారు. తహసీల్దార్ మల్లయ్య, ఆర్ఐ ఫిరోజ్లు విచారణ చేపట్టారు. కాగా, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బాధితుడు నాగయ్య కోరారు. -
మూసేసిన క్రషర్ మిల్లులే టార్గెట్
● ఇద్దరు దొంగల అరెస్టు ● భారీగా ఇనుప వస్తువులు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన ఎస్ఐ ప్రశాంత్ అక్కన్నపేట(హుస్నాబాద్): వారిద్దరూ స్నేహితులు.. పైగా దొంగతనాలను అలవాటుగా మార్చుకున్నారు. మూసివేసిన క్రషర్ మిల్లులే టార్గెట్గా ఎంచుకొని కొన్నిరోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే.. పోలీసులు వారిని చాకచాక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన అక్కన్నపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం, మేడిపల్లికి చెందిన నూనె సాయికిరణ్, నెల్లూట్ల శేఖర్ స్నేహితులు. కొంతకాలంగా చిన్నకోడూరు, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలల్లో మూసివేసిన క్రషర్ మిల్లుల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కట్కూర్, పరికిబండలతో పాటు తదితర ప్రాంతాల్లో ఉన్న క్రషర్ మిల్లుల్లో భారీ ఇనుప వస్తువులు, మోటార్లు, హౌసింగ్ సామగ్రిని, ఎలక్ట్రిక్ కేబుల్ వైర్లు దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. దీంతో నిందితుల వద్ద ఉన్న ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సమావేశంలో కానిస్టేబుళ్లు రాజ్కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
పంట మార్పిడితోనే దిగుబడులు
వ్యవసాయ శాస్త్రవేత్త పల్లవిదుబ్బాకటౌన్: పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు సాధ్యమని వ్యవసాయ శాసర్తవేత్తలు పేర్కొన్నారు. శుక్రవారం వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రాయపోల్ మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.పల్లవి, డాక్టర్ డి. శ్వేత మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, స్వర్ణలత, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
రామాయంపేట(మెదక్): ఎంతటివారైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ హెచ్చరించారు. పట్టణానికి చెందిన మైనార్టీ, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈసందర్భంగా శుక్రవారం నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నారు. జిల్లాలో గత 25 ఏళ్లగా పార్టీ గెలుపొందలేదని, పార్టీ అభ్యర్థులు గతంలో డిపాజిట్ సైతం కోల్పోయారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ శ్రేయస్సుకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసేవారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నగరపు లక్ష్మీకుమారి డాక్టరేట్కు అర్హత సాధించారు. ‘క్లోఫరాబైన్, డెసిటాబైన్, బెలినోస్టాట్, బోర్టెజోమిబ్ తయారీలో కీలక మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐ) సంశ్లేషణకు అధునాతన విధానాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియాబేగం, పలు విభాగాల అధిపతులు అభినందించారు. సంగారెడ్డి: ఆరుబయట చెత్త పారబోసిన వారితోనే తొలగింపజేశారు మున్సిపల్ అధికారులు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో కొందరికి ‘చెత్త శుద్ధి‘ లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్నారు. దీనిపై విసుగు చెందిన మున్సిపల్ అధికారులు వినూత్న శిక్షకు నడుం బిగించారు. ఎక్కడైతే చెత్తను రోడ్డుపై పారబోశారో వారిని నేరుగా పిలిపించి తీయించారు. చెత్త బయట వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా షాప్ యజమానులు వినకపోవడంతో మున్సిపల్ అధికారులు విసుగు చెంది ఈ పద్ధతిని ఎంచుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, జవా న్లు పట్టణంలోని అన్ని రోడ్లు కలియ తిరుగుతూ రోడ్డుపై చెత్త వేసిన షాపు యజమానులతోనే అదే చెత్తను తీసి వేయించారు. వినకపోతే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నర్సాపూర్లో కలకలం నర్సాపూర్: ఓ శీతల పానీయంలో కలిపే నీళ్లలో మూత్రం పోశాడని శుక్రవారం నర్సాపూర్లో కలకలం రేపింది. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఓ వ్యక్తి లస్సీ సెంటరు నిర్వహిస్తున్నాడు. అతని ఇంటి పక్కన ఉండే బాలుడు లస్సీ సెంటరు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లి డబ్బాలో నీళ్లు నింపుకొని రమ్మని బాలుడిని పంపాడు. అతను ట్యాంకు నల్లా నుంచి నీళ్లు నింపుతూ డబ్బాలో మూత్రం పోయడాన్ని ట్యాంకు ఎదురుగా ఉన్న దుకాణాదారులు గమనించి నిలదీయగానే బాలుడు అక్కడి నుంచి లస్సీ సెంటర్కు పరుగులు తీశాడు. కాగా డబ్బాలో నీళ్లు నింపుతూ మూత్రం పోశాడని అవే నీళ్లను లస్సీలో కలిపి అమ్మితే ఎలా తాగాలని దుకాణదారులు లస్సీ సెంటరు నిర్వాహకుడిని నిలదీయడంతో సెంటరు వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ విషయమై ఎస్ఐ రంజిత్రెడ్డితో ప్రస్తావించగా ఇద్దరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
ఉపాధి కూలీలకు అండగా..
హత్నూర(సంగారెడ్డి): ఉపాధి హామీ పథకం కూలీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సర్పంచ్ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం హత్నూరలో ఉపాధి హామీ కూలీలకు తాగడానికి కూల్ వాటర్ అందజేసి అండగా నిలిచారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మజార్ అలీ, ఉపసర్పంచ్ చెక్క మానస రవీందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మేరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, మన్నె యాదగిరి, బాలు చంద్రయ్య, దశరథ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా బుద్ధ జయంతి నారాయణఖేడ్: మండంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం గౌతమబుద్ధుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం గౌతమ బుద్ధుడి సందేశాలు, ఆలోచనలు ప్రపంచానికి మార్గదర్శకాలని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అనుముల తుకారాం, ప్రశాంత్, కాశయ్య, సిద్దు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ల పంపిణీ మునిపల్లి(అందోల్): మండలంలోని బుదేరా లో నూతన వధూవరులకు శుక్రవారం అల్లాపూర్ సర్పంచ్ నారాయణ హెల్మెట్లు అందజేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ఉపయోగించాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బుదేరా సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ సయ్యద్ ఇస్మాయిల్, బస్వరాజ్ స్వామి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సినీనటి నిధి అగర్వాల్ సందడి జహీరాబాద్: ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహ పరిచారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. సినీ డైరెక్టర్ హరీష్ శంకర్, ఎమ్మెల్యే మాణిక్రావు, మున్సిపల్ చైర్మన్ యూనూస్, వైస్ చైర్మన్ శిరీషారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతో పాటు సర్దార్బాష, సుదీష్ణ, వినీల పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు సమాన వేతనాలు మునిపల్లి(అందోల్): ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సమానంగా వేతనాలు చెల్లిస్తున్నట్లు తాటిపల్లి ఫిల్డ్ అసిస్టెంట్ ఏసయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని తాటిపల్లిలో ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు నిర్వహించుకుని మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం కాల్వల మళ్లింపు పనులను కూలీలు నిర్వహించారు. కూలీలు చేసిన పనులకు టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ సమయానికి కొలతలు కొలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూలీలు మల్లేశం, నర్సింలు, మల్లయ్య, మధు, రత్నయ్యతో పాటు కూలీలు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట గ్రామసభలో బాల్య వివాహాల నిర్మూలనకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సర్పంచ్ ప్రవీణ్కుమాక్ అధ్యక్షతన నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన సభలో పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక ముందు గ్రామంలో బాల్య వివాహాలు చేయకుండా అందరూ సహకరించాలని కోరారు. బాలికలు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్ల తర్వాతనే పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రామచంద్రాపురం(పటాన్చెరు): కొల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ సర్కిల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని రాత్రి కొల్లూరు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తి వయస్సు 30ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతిడి ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, నీలిరంగు జీన్స్ప్యాంట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతిడి ఆచూకీ ఎవరికై నా తెలిస్తే కొల్లూరు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం
ఘనంగా కార్మికుల దినోత్సవం జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, పటాన్చెరు, జోగిపేట, న్యాల్కల్, హత్నూర, జిన్నారం, జహీరాబాద్ మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయుసీ, బీఆర్టీయూ, ఆయా పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యేలు, కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. – సాక్షి నెట్వర్క్: -
లోదుక్కులతో ప్రయోజనాలెన్నో..
● చీడ పీడల నివారణే లక్ష్యం ● సేంద్రియ ఎరువులు వాడాలి ● వ్యవసాయ అధికారుల సూచనలు మునిపల్లి(అందోల్): వేసవిలో నేలను బాగా లోతుగా దుక్కి చేస్తే రైతులు అనేక ప్రయోజనాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వస్తున్న సమయంలో వ్యవసాయ భూములను లో దుక్కుల కోసం ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎండలకు నేల వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేలను బాగా లోతుగా దుక్కి చేసుకోవాలంటున్నారు. వేసవిలో నేలను బాగా దుక్కి చేస్తే కలుపు మొక్కలు వేర్లతో సహాయ పడి ఎండి నశిస్తాయి. భూమి పొరల్లో ఉన్న చీడ పురుగుల గుడ్లు, కోశాలు బయటపడి ఎండకు చనిపోతాయి, లేదా పక్షులు తీనేస్తున్నాయి. దీంతో పంటలు సాగు చేసినప్పుడు చీడపురుగుల బెడద పంటకు తప్పుతుంది. వాలుకు అడ్డంగా, ఏటవాలుగా దుక్కి చేసుకోవడం ద్వారా వర్షం కురిసినప్పుడు నీరు భూమిలోకి ఇంకుతుంది. తద్వారా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతోంది. తేమలో జీవించే వానపాముల సంతతి వృద్ధి చెందుతోంది. ఇవి భూసార పరిరక్షణకు దోహద పడుతాయి. అలాగే వ్యవసాయ భూమిని దుక్కి చేసే ముందు పశువుల పేడ వర్మి కంపోస్టు ఎరువుగా మారి భూమిని సారవంతం చేస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● పెనువిషాదంలో నిరుపేద కుటుంబం ● అంత్యక్రియలకు ఆర్థికసాయం చేసిన గ్రామస్తులు వర్గల్(గజ్వేల్): చేతికందిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నిరుపేద తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. అంత్యక్రియలకు సైతం ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. ఈ ఘటన మండలంలోని శేరిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జిన్న నర్సింహులు దివ్యాంగుడు. ఆయనకు భార్య పుష్ప, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అరవింద్(19) ఉన్నారు. కూలీ పనులతో కాలం వెల్లదీస్తున్నారు. ఒక కుమార్తె వివాహమైంది. పదోతరగతి దాకా చదివిన అరవింద్ చిన్నాచితక పనులతో కుటుంబానికి కాస్తా తోడుగా ఉంటున్నాడు. అతడు గురువారం ద్విచక్రవాహనంపై వర్గల్ వెళ్లి తిరిగొస్తూ గ్రామశివారులో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలతో అదేరోజు రాత్రి ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శుక్రవారం గ్రామస్తులు చందాలు పోగేసి ఆ కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. అశ్రునయనాల మధ్య అరవింద్ అంత్యక్రియలు నిర్వహించారు. లారీ, స్కూటీ ఢీ.. కంది (సంగారెడ్డి): లారీ, స్కూటర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ ఎదురుగా చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. పటాన్ చెరు మండలంలోని బీరంగూడ ఉస్కేబావి ప్రాంతానికి చెందిన సీతారాం రెడ్డి(65) శుక్రవారం సంగారెడ్డి నుంచి బీరంగూడకు స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్కూటీని ఐఐటీ హైదరాబాద్ ఎదురుగా జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీతారాంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తల్వార్తో దాడి చేసిన నిందితుడు అరెస్ట్
పటాన్చెరు టౌన్: తల్వార్తో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బీరంగూడ అంబేద్కర్ కాలనీకి చెందిన పుట్టగడ్డల రత్నయ్య అలియాస్ జీవరత్నం ఏప్రిల్ 25వ తేదీ రాత్రి తన ఇంట్లో కిరాయికి ఉండే రాజు బైక్పై సమీపంలో ఉన్న సాయి కర్రీ పాయింట్కు వెళ్లాడు. అక్కడ రూ.10కి కర్రీ పార్సిల్ ఇవ్వాలని కోరగా.. దుకాణంలోని వ్యక్తులు రూ.30 అవుతుందని తెలిపారు. దీంతో మేము లోకల్, రూ.10కే ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. మాటా... మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆ తర్వాత ఆవేశంతో రత్నయ్య, దుకాణంలోకి వెళ్లి షట్టర్ మూసి, లోపల ఉన్న వారిని బెదిరిస్తూ తల్వార్తో దాడి చేశాడు. కౌంటర్ వద్ద ఉన్న ఉదయ్ భాను తలపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రత్నయ్య అలియాస్ జీవరత్నంను పోలీసులు ఇంటి వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దాడి పాల్పడిన తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ తరలించారు. ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సామూహిక ఉత్సవాలతో ప్రజల్లో ఐక్యత
కొండాపూర్(సంగారెడ్డి): గ్రామాల్లో జరిగే సామూహిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మల్కాపూర్లో పార్వతీ మరకత రాజరాజేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాలు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పవన్, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
బాలికల కళాశాల అభివృద్ధికి సహకారం
సంగారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ మరోసారి ముందుకొచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వినతి మేరకు గతంలో రూ.6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు చేయగా.. మరో వెయ్యి మందికి సరిపడా అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మన్ నిత్యానందరెడ్డిని జగ్గారెడ్డి కోరారు. ఇందుకు గాను మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ఆయన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జగ్గారెడ్డి, నిర్మలతో కలిసి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అరబిందో డైరెక్టర్ సందర్శించారు. అనంతరం కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. కంపెనీ నిధులతో కళాశాల పనులు త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. -
ఆగిన వాహనంలో మంటలు
తప్పిన పెను ప్రమాదంవట్పల్లి(అందోల్): మండల పరిధిలోని బిజిలీపూర్లో శుక్రవారం ఓ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గ్ మండలంలోని చిల్వర గ్రామస్తులు తుఫానులో బిజిలీపూర్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ వాహనాన్ని గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేశారు. అంతలోనే వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులతో పాటు జోగిపేట ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. వాహనంలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. -
ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రైతులు ఆధునిక సాగు పద్ధతులు అనుసరించడంతో అధిక దిగుబడులను సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని మాచిరెడ్డిపల్లిలో సర్పంచ్ మోహన్ గౌడ్ అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగులో పంట మార్పిడి పద్ధతులను పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాలను వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ రేవతి, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో ప్రయోజనం రాయికోడ్(అందోల్): పంట మార్పిడి పద్ధతులతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వాణీశ్రీ, నీలిమ అన్నారు. మండలంలోని కర్చల్లో శుక్రవారం ఏఓ సారికతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. జీవన ఎరువుల ప్రాముఖ్యత, పెట్టుబడులు, మట్టి పరీక్షల ప్రాధాన్యతలపై అవగాహన కల్పించారు. పత్తి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. డ్రోన్ స్ప్రేయర్లతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ప్రభుత్వ సాగు సూచనలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ సారిక, ఏఈఓ నవీన్, ఆత్మ ఏటీఎం రమేష్, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, రైతులు ఉన్నారు. -
కిశోర బాలికలు.. స్నేహ సంఘాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహిళా సాధికారత దిశగా గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్హెచ్జీ గ్రూపుల) మాదిరిగానే గ్రామాల్లో కిశోర బాలికల కోసం కూడా సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్నేహ సంఘాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ సంఘాల్లో 15– 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతానికి ఒక్కో గ్రామంలో ఒక్కో గ్రూపు చొప్పున ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్హెచ్జీ గ్రూపుల్లో 18–60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలే సభ్యులుగా ఉంటారు. 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వారు సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత వైపు సంఘటితం అయ్యేందుకు మార్గం సుగమమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 13 రోజుల కేలండర్.. ఈ స్నేహ సంఘాల్లో సభ్యులుగా ఉండే ఏజ్ గ్రూప్ బాలికలు టెన్త్ నుంచి ఇంటర్.. డిగ్రీ, బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న వారే ఎక్కువగా ఉంటారు. వీరికి వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కేలండర్ రూపొందించారు. శుక్రవారం నుంచే ఈ కార్యక్రమాలను ప్రారంభం కానున్నాయి. సైబర్ క్రైం, స్మార్ట్ఫోన్ వినియోగం, డ్రగ్స్ వంటి అంశాలపై సంబంధిత నిపుణులతో అవగాహన కల్పిస్తారు. సైకిల్ తొక్కడం, బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, రక్తహీనత, కిశోర బాలికల ఆరోగ్య సమస్యలు, బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, భద్రత, తల్లిదండ్రులకు కృతజ్ఞత, బాలికలతో గ్రామసభల నిర్వహణ వంటి కార్యాక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా గ్రామానికో సంఘం ఏర్పాటు 15–18 ఏళ్ల బాలికలే సభ్యులు నేటి నుంచి 13 అంశాలపై అవగాహన కార్యక్రమాలు రాష్ట్రంలో ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ప్రస్తుతం 17,385 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో గ్రామానికి ఒక్కో స్నేహ సంఘం చొప్పున 17,385 స్నేహ సంఘాలను ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 8,940 సంఘాలను ఏర్పాటు చేశారు. మిగిలిన సంఘాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఐకేపీ అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. -
ముగిసిన ఎర్లీ బర్డ్ స్కీమ్
● ఒక్కరోజే రూ.2.28 కోట్ల ఆస్తి పన్ను వసూలు ● ఈ ఏడాది మొత్తంగా రూ.27.18 కోట్లు పన్ను రాబడి జిన్నారం (పటాన్చెరు): పట్టణ పరిధిలో ఆస్తి పన్నుల చెల్లింపులో భాగంగా ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ స్కీం గడువు గురువారంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆస్తిపన్ను బకాయిలను 5% రిబేటుతో చెల్లించారు. డిప్యూటీ కమిషనర్ ప్రదీప్కుమార్కు ఆస్తి పన్నులను చెక్కుల రూపంలో అందజేశారు. పారిశ్రామికవేత్తలు వివిధ వ్యాపారులు ఈ స్కీం ద్వారా అవగాహన పొంది చెల్లింపులు చేశారు. హిందుస్థాన్ కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.85.77 లక్షలు, రానే మద్రాస్ పరిశ్రమ రూ.9.78 లక్షలు, టియానిష్ లేబోరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.3.30 లక్షలు, రాహి ట్రాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ రూ.3.19 లక్షలు, పటేల్ హీరోయిన్ దశరథ్ రూ.19.44 లక్షలు ఆస్తి పన్నును చెల్లించాయి. మొత్తం రూ.2.28 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.24.71 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం 10% టార్గెట్ తో కలిపి మొత్తం రూ.27.18 కోట్లు ఆస్తి పన్నును ఎర్లీ బర్డ్ పథకం కింద వసూలు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీలు మనోహర్, నర్సింహులు, మల్లికార్జున స్వామి, సాయిలు, శ్రీధర్, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కులాంతర వివాహానికి నిరాకరణ
జగద్గిరిగుట్ట: ప్రేమ వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో జగద్గిరిగుట్ట కొండపై ఉన్న గోవిందరాజు స్వామి ఆలయంలో గురువారం పెద్దల సమక్షంలో ఆ ప్రేమ జంట వివాహం చేశారు. మెదక్ జిల్లాకు చెందిన అఖిల్ (26), దివ్యలత (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అఖిల్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. దివ్యలత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చింతల్లో ఉంటున్న వీరు ఇంట్లో పెద్దలకు పెళ్లి విష యం చెప్పగా.. కులాంతర వివాహానికి అంగీకరించ లేదు. దీంతో స్థానిక జగద్గిరిగుట్టకు చెందిన ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్ను సంప్రదించగా.. ఆయన మెదక్ జిల్లా గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దొంతి చంద్రగౌడ్తో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం వీరి సమక్షంలో జగద్గిరిగుట్ట గోవిందరాజు స్వామి ఆలయంలో ఇరువురి అంగీకారంతో వివాహం జరిపించారు. కార్యక్రమంలో గోవిందరాజు స్వామి ఆలయ వ్యవస్థాపకులు నరహరి రవి, శంకర్, రాజు పాల్గొన్నారు.ఆలయంలో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి -
వేసవి.. ఆట విడుపు
నేటి నుండి జూన్ 7 వరకు స్పోర్ట్స్ క్యాంపుల నిర్వహణసంగారెడ్డి జోన్: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసింది. విద్యతోపాటు క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించనుంది. ఈ క్రీడా శిబిరాలు ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటలనుంచి 7 గంటల వరకు నిర్వహిస్తారు. 14 ఏళ్ల లోపు ఉన్న బాల, బాలికలకు 34 రకాల క్రీడల్లో కోచింగ్ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాలో10.. పట్టణాల్లో 14 గ్రామీణ ప్రాంతాల్లో 10, పట్టణాల్లో 14 సమ్మర్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 1 నుంచి జూన్ 7 వరకు విద్యార్థులకు క్రీడలలో కోచింగ్ ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనిచ్చే నిర్వాహకులకు రూ.5 వేలు గౌరవ వేతనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేయనున్నారు. సంగారెడ్డిలో కోచింగ్ కేంద్రం ప్రారంభం సమ్మర్ కోచింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సంగారెడ్డిలో కిక్ బాక్సింగ్ కోచింగ్ను ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడాధికారి అఖిలేశ్రెడ్డి ప్రారంభించి నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించారు. సద్వినియోగం చేసుకోవాలివిద్యార్థులు క్రీడారంగంలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవికాలం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థి కోచింగ్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. క్యాంపులలో పీడీలతోపాటు కోచ్లను నియమించడం జరిగింది. –అఖిలేశ్రెడ్డి, జిల్లా యువజన క్రీడా అధికారి, సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాల ఏర్పాటు 34 రకాల క్రీడల్లో కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే వారికి ఎలాంటి గౌరవ వేతనం ఉండదు. క్రీడలు నిర్వహించే వారికి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నారు. ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజులు నిర్ణయించారు. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్, ఉషులకు రూ.400, ఆర్చెరీ, బాల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కరాటే, ఖోఖో, సెల్ఫ్ డిఫెన్స్, సాఫ్ట్బాల్, హాకీ, టెన్నికోయిట్, త్రో బాల్, నెట్బాల్లకు రూ.200, వాలీబాల్, రెజ్లింగ్, తైక్వాండోలకు రూ.100, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, రూ.1000, లా టెన్నిస్ రూ.1,200, టేబుల్ టెన్నిస్ రూ.700, చెస్, మల్టీజిమ్, ఫుట్బాల్, ఫెన్సింగ్ రూ.300, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్లకు రూ.150 లుగా నిర్ణయించారు. -
మహిళా గౌరవమే నిజమైన అభివృద్ధి
అదనపు డీసీపీ కుశాల్కర్ సిద్దిపేటజోన్: మహిళలకు గౌరవం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి అని అదనపు డీసీపీ కుశాల్కర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మహిళా భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కుషాల్కర్ మాట్లాడుతూ.. సమాజంలో లింగ వివక్ష తగదన్నారు. మహిళలు రక్షణ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు, సైబర్, వరకట్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి మహిళా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు, షి టీమ్స్ సేవలు, డయల్ 100 వినియోగంపై సూచనలు చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. వెల్దుర్తి(తూప్రాన్): విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కుకునూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గ్యార్ల పోచయ్య(60) నాలుగు రోజుల క్రితం వ్యవసాయ పొలం వద్ద బోర్మోటారు నడవకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా కోసం ప్రయత్నాలు చేస్తుండగా షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన పోచయ్యను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. చిలప్చెడ్(నర్సాపూర్): సీజ్ చేసిన ఇసుకను అధికారులు వేలం వేశారు. మండల పరిధిలోని బండపోతుగల్లో అనుమతులు లేకుండా ఇసుక కుప్పలను నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. పది రోజులు క్రితం ఇసుక కుప్పలను సీజ్ చేసిన విషయం విదితమే. గురువారం బండపోతుగల్ గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ సహాదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇసుక వేలంపాటలో చిలప్చెడ్ చెందిన ఓ వ్యక్తి రూ. 33 వేలకు కొనుగోలు చేశాడు. నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేసిన ఇసుకను తరలించాలని తహసీల్దార్ సహదేవ్ అన్నారు. అలాగే.. మండలంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో, యాజమానిపై సైతం కేసు నమోదు చేస్తామన్నారు. మెదక్జోన్: హత్యకేసులో నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ గురువారం తీర్పు ఇచ్చారని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గీత ప్యానల్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్న సూరజ్, రజినీదేవి అక్కడే నివసిస్తూ జీవనం సాగించేవారు. వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో 2023 నవంబర్ 19న ఆవేశానికి లోనైన సూరజ్, రజినీదేవిని చీరతో గొంతు బిగించి హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీధర్ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడే దోషిఅని తేలటంతో జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువడిందని తెలిపారు. -
ఎల్లొద్దాం రండి
ఎల్లమ్మ జాతరకునేటి నుంచే రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు● నెల రోజుల పాటు హుస్నాబాద్లో భక్తుల సందడే ● భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారు ● పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం హుస్నాబాద్: పట్టణంలో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తుల కొంగుబంగారంగా ఎల్లమ్మ తల్లి విరాజిల్లుతోంది. మే ఒకటన జాతర ప్రారంభమై నెలంతా కొనసాగుతుంది. ఇందుకు నిర్వాహకులు అన్ని ఏరాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ఎల్లమ్మ తల్లి విగ్రహంగా ప్రాచుర్యం పొందింది. రేణు అంటే సంస్కృతంలో ఇసుక అని అర్థం. అమ్మవారు జమదగ్ని ఆజ్ఞతో రోజు ఇసుకతో తయారు చేసిన కుండతో నీళ్లను తీసుకువెళ్తుతుండేది. అందుకే అమ్మవారిని రేణుకా దేవిగా చెబుతుంటారు. ఎల్లమ్మ అంటే ఎల్లరకు (అందరికీ) అమ్మగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమ దేవి పర్యవేక్షణలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే నిర్మించిన చెరువుకు ఎల్లమ్మ చెరువుగా నామకరణం చేశారు. అంతటి ప్రాచుర్యం పొందిన ఎల్లమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోంది. రేణుకా ఎల్లమ్మ జాతర వైశాఖ పౌర్ణమి మే 1 నుంచి జేష్ట్య పౌర్ణమి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. వేలాదిగా తరలిరానున్న భక్తులు.. ఎల్లమ్మ జాతరలో బోనాలు, పట్నాలు, ఎండ్ల బండ్ల ఊరేగింపు ప్రత్యేకం. నెల రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శుక్రవారం వైశాఖ ఘటంతో ఆలయ ప్రవేశం నిర్వహిస్తారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, దృష్టి కుంభం, శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మునిరాజు కల్యాణం (సిద్దోగం)చేపడతారు. జాతర సందర్భంగా స్వీట్లు, గాజులు, చీరలు, పూజా సామగ్రి, ఆట బొమ్మలు ఇలా పలు దుకాణాలు వెలిశాయి. రేణుకా ఎల్లమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాగునీరు వసతి, క్యూలెన్లు ఏర్పాటు చేశారు. ఆలయంతో పాటు ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. -
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత సదాశివపేట(సంగారెడ్డి): ఏసీబీ వలకు మున్సిపల్ ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డి చిక్కాడు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఓ స్టీట్ దుకాణం వద్ద బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టణ పరిధిలోని సదాశివ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటి ఆస్తి పన్ను రూ. 41 వేలు ఉండేది. ప్రస్తుతం రూ. 1,04,000 ఆస్తి పన్ను చెల్లించాలని నోటీస్ రావడంతో బాధితుడు మున్సిపల్ కమిషనర్ శివాజీని అశ్రయించాడు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆయన అదేశించారు. ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డి బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి ఇంటి కొలతలు చేసి రూ. 1,04,000 ఆస్తి పన్నులో రూ. 50 వేల కంటే ఎక్కువ తగ్గిస్తానని, తనకు రూ. 35 వేలు ఇవ్వాలని కోరారు. దీంతో బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి కొన్ని రోజుల క్రితం రూ. 20,000 వేలు అందజేశాడు. మిగితా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వారు వల పన్ని పట్టుకున్నారు. నిఖిల్రెడ్డిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించిన అనంతరం ఆయన ఇంటిని సోదా చేశారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ మెదక్ రెంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. లంచం కేసులో బిల్ కలెక్టర్ పాత్ర మాత్రమే ఉందా..? ఇతర అధికారులు ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. -
బీఆర్ఎస్కు మళ్లీ అధికారం ఖాయం
జోగిపేట(అందోల్): తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జోస్యం చెప్పారు. బోధన్లో ఒక కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కేసీఆర్ను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సాగుతుం దని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని ఆ తర్వాత ప్రజలకిచ్చిన మాట మరిచారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని క్రాంతి కిరణ్కు సూచించారు. పట్టణ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్గౌడ్, నర్సింహులు, రమణ, పింటూ తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న -
నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టులో పారా లీగల్ వాలంటరీలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పారా లీగల్ వాలంటరీలు తిరిగి పేదవారికి న్యాయ సేవలను అందించాలని సూచించారు. వరకట్న నిషేధం, బాల్య వివాహాలు నిషేధ చట్టంపై ఉచిత సేవలు అందించేందుకు శిక్షణను వినియోగించుకోవాల న్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాగు ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలివ్యవసాయ శాస్త్రవేత్తలు సంగారెడ్డి టౌన్: రైతులు సాగు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శాంతి, గీత పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని దాసు గడ్డ తండా గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ...రైతులు పరిమితంగా ఎరువులను వాడాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని, సేంద్రియ ఉత్పత్తులను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. రైతులు ఎరువులను కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదులను పొందాలని, శాసీ్త్రయ పద్ధతిలో పంటలను పండించాలన్నారు. పరిహారం ఇవ్వలేకే అసత్య ఆరోపణలుకోదండరెడ్డి ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కంగ్టి(నారాయణఖేడ్): భూముల వ్యవహారంలో ధరణి పోర్టల్లో అక్రమాలు జరిగాయని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నిరాధార ఆరోపణలపై ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రస్థాయి వ్యక్తి గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మండలంలోని తడ్కల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేక ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు. కంగ్టి మండలంలోని గాజుల్పాడ్ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మాధవరావు కుటుంబానికి పరామర్శ కోసం వచ్చిన కోదండరెడ్డి ధరణి పోర్టల్ ప్రారంభం కాకముందే జరిగిన ఘటనలో అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. రైతులకు భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. నేటి నుంచి మెథడిస్ట్ చర్చి జాతరజహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్లో బి.జి.గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 1నుంచి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు. తొలిరోజు సాయంత్రం 6గంటల నుంచి జెండాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 2న ఉదయం 10 గంటల నుంచి ఆరాధన, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటల పోటీలు, సాయంత్రం ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. రాత్రి 9గంటల నుంచి భజన పోటీలు, బుర్రకథ, చలనచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. 3న ఉదయం 10 గంటలకు ఆరాధన, రోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రూ.240 కోట్లు మంజూరు చేయండి
● ఖేడ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి వినతి ● వివాహ వేడుకకు హాజరైన సీఎస్కుఘన స్వాగతం నారాయణఖేడ్: ఖేడ్ అభివృద్ధి కోసం రూ.240కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎస్ కె.రామకృష్ణారావు తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నారాయణఖేడ్కు వచ్చారు. స్థానిక ఆర్అండ్బీ శాఖ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం అతిథిగృహంలో ఆయనతో ఎమ్మెల్యే సమావేశమై మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరా నదిపై ఉన్న వంతెన బ్రిడ్జి కండ్యాంగా మార్చేందుకు రూ.125 కోట్లు, ఖేడ్ పట్టణంకు రింగు రోడ్డుకు రూ.70 కోట్లు, ఖేడ్లో ఏటీసీ కేంద్రానికి రూ.45 కోట్లు మంజూరు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వివాహ వేడుకల్లో ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ రామకృష్ణారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో... సీఎస్ రామకృష్ణారావును బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్పాటిల్, ఖేడ్ మండల అధ్యక్షుడు బక్షి రవీందర్రావు, ఉపాధ్యక్షుడు సురేశ్రావు, కోశాధికారి చంద్రకాంత్, వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానంచి జ్ఞాపికను అందజేశారు. బ్రాహ్మణపరిషత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఖేడ్ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఖేడ్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మిబాయి రవీందర్ నాయక్ కోరారు. సీఎస్ను శాలువాతో సత్కరించారు. వివిధ సమస్యలను వివరిస్తూ పరిష్కరించి ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పెట్రోల్, డీజిల్కు కటకట
నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో వరుసగా నాలుగవ రోజు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖేడ్ పట్టణంలో నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, ప్రతీ రోజు ఏదో ఒక బంకులో మాత్రమే డీజిల్, పెట్రోల్ ఉంటుంది. అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, ఏదో ఒక పం పులో మాత్రమే అందుబాటులో ఉంటుండటంతో వాహనదారులు తెల్లవారు జాము నుంచే ఆయా బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఉన్న పంపుల్లో డీజిల్, పెట్రోల్ ఉండటం లేదు. పెట్రోల్ కొరత ఉత్పన్నమవుతుండటంతో పరిసర గ్రామాల వ్యాపారులు పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ను నింపుకెళ్తున్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వట్పల్లి(అందోల్): ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అందోల్ మండల పరిధిలోని డాకూర్లో గురువారం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహారా ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధ చికిత్సలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. డాకూర్ గ్రామ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు వైద్య చికిత్సల కోసం దగ్గర్లో ఉన్న జోగిపేట ప్రభుత్వాస్పత్రి, సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందోల్ను హెల్త్ హబ్గా అభివృద్ధి తీర్చిదిద్దుతున్నామని దీనిలో భాగంగానే అందోల్ శివారులో 150 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న సహారా ఆస్పత్రి వైద్యలు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎంహెచ్ఓ వసంత్ కుమార్, డాకూరు గ్రామ సర్పంచ్ వసంత్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ నరేందర్రెడ్డి, లయన్స్క్లబ్ అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్గౌడ్తోపాటు ప్రజలు పాల్గొన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు మునిపల్లి(అందోల్): ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. మండలంలోని గార్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుల వివాహనికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ డాకూర్లో ఆరోగ్య శిబిరం ప్రారంభం -
ప్రతీ ఏటా సాగు చేస్తున్నా
ప్రతి ఏటా చేమదంప పంటను సాగు చేస్తున్నాను. నా వాహనం ఉండటంతో హైదరాబాద్ మార్కెట్కు తరలించుకుని లబ్ధి పొందుతున్నా. జీఐ ట్యాగ్ లభించడం వల్ల పంటకు మంచి డిమాండ్ వస్తుందనుకుంటున్నాను. – జి.కిష్టన్న, రైతు–సజ్జాపూర్పంట సాగు పట్ల ఆసక్తి గిట్టుబాటు ధర లభించక పోవడం, పెట్టుబడులు పెరగడం వల్ల పలు కారణాల చేత రెండేళ్ల కాలంగా చేమదుంప సాగుకు దూరంగా ఉన్నాను. జీఐ రిజిస్ట్రీ ఆమోదం లభించినందున పంటకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దీంతో జూన్లో పంటను సాగు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. – పి.అశోక్రెడ్డి, రైతు–సజ్జాపూర్ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం చేమదుంప పంట సాగుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తాం. దీన్ని ఇక ముందుకూడా కొనసాగిస్తాం. రైతులు లబ్ధిపొందాలి. – సోమేశ్వరరావు, జిల్లా ఉద్యానవన అధికారి–సంగారెడ్డి -
జీఐతో పెరిగే!
చేమదుంప సాగు..సజ్జాపూర్ దుంపకు జీఐ రిజిస్ట్రీ ఆమోదం ● శతాబ్దం క్రితం నుంచి గ్రామంలోసాంప్రదాయకంగా వేస్తున్న పంట ● సాగుకు ముందుకువచ్చేరైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం జహీరాబాద్: గత శతాబ్ద కాలంగా సాంప్రదాయకంగా సాగు చేస్తున్న సజ్జాపూర్ చేమదుంపకు జీఐ రిజిస్ట్రీ ఆమోదం లభించడంతో ఈ ప్రాంతంలో ఆ పంట సాగు పెరగనుంది. కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో ప్రతి ఏటా రైతులు చేమదుంప పంటను సాగుచేస్తూ వస్తున్నారు. ఈ గ్రామంలో సాగవుతున్న చేమదుంప పంట నాణ్యవంతమైనది కావడంతో భౌగోళిక సూచిక(జీఐ) నమోదులో కీలక పురోగతిని సాధించింది. గ్రామంలో పండించే ఈ ప్రత్యేక రకం చేమదుంపకు సంబంధించిని జీఐ దరఖాస్తును చైన్నె జీఐ రిజిస్ట్రీ ఇటీవలే ఆమోదించింది. గతేడాది నవంబర్లో ఈ దరఖాస్తును తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(టీజీసీఓఎస్టీ) పేరిట సమర్పించారు. సజ్జాపూర్ చేమదుంప పుట్టుక, ప్రత్యేక లక్షణాలు, జీవరసాయన విశ్లేషణ, డీఎన్ఏ ప్రొఫైలింగ్, రైతుల సాగు పద్ధతులు వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. సజ్జాపూర్ చేమదుంపకు జీఐ ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా అధిక ధర లభించడంతోపాటు ఎగుమతి అవకాశాలు పెరగనున్నాయి. రసాయన ఎరువులు లేకుండా... సజ్జాపూర్లో చేమదుంప పంటను ఎలాంటి రసాయన, పురుగు మందుల పిచికారీ చేయాల్సిన అవసరం లేకుండానే సాగుచేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక దశలో గ్రామంలో ఐదు వందల ఎకరాల వరకు పంట సాగైంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు పంట సాగులో ఉంది. జీఐ ట్యాగ్ లభించడంతో పంట సాగు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తమ గ్రామంలో పండిస్తున్న పంటకు జీఐ ట్యాగ్ లభించడం సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట ఎగుమతులకు అవకాశం లభిస్తే గ్రామమంతా ఇదే పంటసాగు వైపు ఆసక్తి చూపుతామంటున్నారు. ఇటీవల కాలంలో గిట్టుబాటు ధర లభించక పోవడం వల్లే పంట సాగు విస్తీర్ణంపై ప్రభావం పడిందంటున్నారు. జూన్లో పంటను సాగు చేసుకుంటే నవంబర్లో చేతికి అందివస్తుంది. ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్లు సారవంతమైన నేలలో ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కె ట్లో క్వింటాల్ ధర రూ.1,500 పలుకుతోంది. ఈ పంటను రెండు కాలాల్లో అనగా వర్షాకాలం, చలి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. పోషకాల గని చేమదుంపలో అనేక పోషకాలు ఇమిడి ఉన్నాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో, బరువు తగ్గడంలో సహాయ పడతాయి. క్యాన్సర్ నిరోధక శక్తిని పెంపొందించడానికి, కంటి చూపును మెరుగు పరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి చూపును మెరుగుపరచడంలోనూ సహాయ పడుతుంది. -
అనుమతుల్లేని ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): అనుమతుల్లేని ఆర్ఎంసీ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెల్లాపూర్ నైబర్ హూడ్ అసోసియేషన్ సభ్యులు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు విజ్ఞప్తి చేశారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉర్జీత్ విలాస్స్లో గురువారం సృజన వివిధ కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ నైబర్ హూడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెనా సభ్యులు మాట్లాడుతూ..ఇంటి పన్ను విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రేడియల్ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ 20వేల లీటర్ల త్రాగునీటి ఉచితంగా ఇవ్వాలని అధికారులను కోరారు. ఇందుకు సృజన సానుకూలంగా స్పందించారు.సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్సృజనకు స్థానికుల వినతి -
బల్దియాల అభివృద్ధికి సహకారం
పటాన్చెరు/పటాన్చెరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల పరిధిలో గురువారం నిర్వహించిన నూతన కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక అనంతరం..మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి నూతన కో ఆప్షన్ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తమపై నమ్మకంతో కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికకు సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలు ఎంతో నమ్మకంతో ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 153 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే గూడెం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ప్రమీల, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ హరీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నూతన కో ఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం -
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... పటాన్చెరు శాంతినగర్ కాలనీలో ఉంటున్న బీహార్కు చెందిన వికేశ్కుమార్ సింగ్ (31) ఫెన్నార్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పరిశ్రమలో షెడ్డుపై రేకులు ఉండే చోట పనిచేస్తుండగా, తాడు తనకు కట్టుకోకపోవడంతో అకస్మాత్తుగా జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో అతన్ని పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామాయంపేట(మెదక్): కరెంటు షాకుతో తీవ్రగాయాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్ఐ బాల్రాజు వివరాల ప్రకారం.. మండలంలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన తక్కనోళ్ల సిద్ధవ్వ (50 ) సోమవారం తన ఇంట్లో కరెంటు హీటర్తో నీరు వేడి చేస్తున్న క్రమంలో షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజిపల్లి ధర్మి చెరువు కాలుష్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం తట్టుకోలేక కొంతమంది కక్షపూరితంగా దాడి చేసి , ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నాయకుడు, అడ్వకేట్ దండే రమాకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బాలాజీ రావుకు పీహెచ్డీ
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి బాలాజీ రావు డాక్టరేట్కు అర్హత సాధించారు. ‘భారత అణు ఇంధన సబ్–అసెంబ్లీ తయారీ ప్రక్రియలో ఉపయోగించే యురేనియం, జిర్కోనియం ఆధారిత మిశ్రమ లోహాలు, ఉక్కు రసాయన లక్షణాల నిర్ధారణకు కొత్త విశ్లేషణాత్మక అనువర్తనాల అభివృద్ధికి అధ్యయనం’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తెలిపారు. కాగా ఆయనను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం తదితరులు అభినందించారు. -
మరొకరికి తీవ్ర గాయాలు
కారు, బైక్ ఢీ.. ఒకరు మృతిచిలప్చెడ్(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, అతడి సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... చిలప్చెడ్ గ్రామానికి చెందిన శాతరి పరశురాం(25), తన సోదరి రేణుకతో కలిసి బైక్పై చిట్కుల్ చౌరస్తా నుంచి చిలప్చెడ్కు వెళ్తున్నాడు. చండూర్ గ్రామ శివారుకు రాగానే జోగిపేట పట్టణానికి చెందిన ఎన్నం హరీశ్ కారులో జోగిపేట వైపు వస్తూ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పరశురాం మెడకు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రేణుకకు కాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. హరీష్ వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని, మృతుడి తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బస్సులెరుగని పల్లెలు
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుంది. కాగా గిరిజన తండాలకు, చిన్న గ్రామాలకు బస్సులు రాకపోవడంతో మహిళలు, విద్యార్థులు నిరుత్సాహపడుతున్నారు. సర్కారు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా అవి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయని వాపోతున్నారు. ఇప్పటికి బస్సు ఎరుగని పల్లెలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పల్లెలకు బస్సులు రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్యా.. మా మొర ఆలకించి, గ్రామాలకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బస్సులు లేక.. కాలినడకన హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో 62 బస్సులు ఉండగా 22 రూట్లలో అధికారులు నడిపిస్తున్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీర్జాపూర్లో నిర్మించారు. కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం మరిచారు. ఆస్పత్రికి వెళ్లాలంటే గుంతల రోడ్డుపై ప్రయాణం చేయాల్సి రావడంతో వెనుకడుగు వేస్తున్నారు. వంగరామయ్యపల్లె వచ్చిన బస్సు దిగిన తరువాత.. భల్లునాయక్తండా, మీర్జాపూర్ గ్రామాల ప్రజలు కాలినడకన పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్, హన్మకొండ, కరీంనగర్ పట్టణాలకు వెళ్లాలంటే రూ. 30 చార్జి చెల్లించి ఆటో ఎక్కితే తప్ప ప్రజలకు ఆర్టీసీ బస్సు దొరకదు. హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో భల్లునాయక్తండా, మీర్జాపూర్, మడద, దేవేంద్రనగర్, మంచీళ్లబండ, చౌటపల్లి, ఉమ్మాపూర్ గ్రామాలకు ఇప్పటి వరకు బస్సులు రావడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రైవేట్ వాహనాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామాల మీదుగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఉచిత బస్సుకు గిరిజనులు దూరం ఆస్పత్రికి వెళ్లాలంటే కాలినడకే దిక్కు.. గుంతల రోడ్డుతో తండావాసుల అవస్థలు మంత్రివర్యా..మొర ఆలకించరూ! -
ఆర్టీసీ ఎండీని కలిసిన జేఏసీ నాయకులు
గజ్వేల్రూరల్: తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని గజ్వేల్–ప్రజ్ఞాపూర్(జీపీపీ) ఆర్టీసీ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జీపీపీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జక్కుల నర్సింహులు, సీనియర్ నాయకులు కేఎం రెడ్డి బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జీపీపీ ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. హత్నూర(సంగారెడ్డి): మండలంలోని దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్టోర్ గదిలో బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలోని గదిలో పాత పుస్తకాలు, తదితర సామగ్రి ఉండటంతో అగ్రిప్రమాదంలో కాలిపోయాయని స్థానికులు తెలిపారు. గజ్వేల్రూరల్: భూ వివాదంలో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన నలుగురికి కోర్టు జరిమానా విధించింది. గజ్వేల్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని దాతర్పల్లికి చెందిన జాంగితి నర్సింహులు, అతని కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ భూమికి వెళ్లే బాట విషయంలో అక్కారం గ్రామానికి చెందిన గౌలికార్ జనార్దన్ కుటుంబంతో వివాదం ఏర్పడింది. దీంతో గతంలో అమ్మిన భూమికి సంబంధించిన దారిని జనార్దన్ ఆక్రమించి కంచె వేయడంతో నర్సింహులు అభ్యంతరం తెలిపాడు. పరిష్కారం కోసం 2015 ఫిబ్రవరి 17న జనార్దన్ ఇంటికి వెళ్లిన నర్సింహులు, రమేశ్పై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో గౌలికార్ జనార్దన్తో పాటు అతని కుటుంబ సభ్యులు పద్మ, రాజు, రాకేశ్ దాడికి పాల్పడినట్లు కోర్టులో నేరం రుజువైంది. ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ బుధవారం గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతిగౌడ్ తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్కు.. గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన బస్సు డ్రైవర్కు కోర్టు జరిమానా విధించినట్లు గజ్వేల్ సీఐ రవికుమార్ తెలిపారు. వివరాలు ఇలా... 2015 ఫిబ్రవరి 16న గజ్వేల్కు చెందిన విభూతి బస్వరాజు(42) ద్విచక్ర వాహనంపై ప్రజ్ఞాపూర్ శివారులోని రాణే కంపెనీలో విధులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొమురయ్య రాజీవ్ రహదారిపై రాంగ్రూట్లో వచ్చి బస్వరాజును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బుధవారం విచారణ చేపట్టిన గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ స్వాతిగౌడ్ బస్ డ్రైవర్ కొమురయ్యపై నేరం రుజువైనందున రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
మట్టి పరీక్ష.. పంటకు రక్ష
ప్రిన్సిపల్ సైంటిస్టు సతీశ్ కొల్చారం(నర్సాపూర్): పంటలు సాగు చేసే ముందు రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్టు సతీశ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అంశంపై రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... వరిలో నారుమడి, నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. సాగుకు ముందు మట్టి పరీక్షలు నిర్వహించడం ద్వారా నేల స్వభావం తెలిసి, అనువైన పంట వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సమతుల్య ఎరువుల వినియోగం, జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్తగా రూపొందించిన వరి రకాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త రమ్యశ్రీ, ఏఓ శ్వేతాకుమారి, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
నిలువ నీడ లేక..
మెదక్జోన్: మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 1.60 లక్షల జాబ్కార్డులు ఉండగా, వీటి పరిధిలో 3.20 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ జిల్లాలో 33 వేల మంది పైచిలుకు కూలీలు పనులు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 100 రోజులు పనులు సొంత ఊరిలోనే కల్పించి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రారంభించింది. రెండు నెలలుగా కూలీ డబ్బుల్లేవు.. పొట్టకూటి కోసం మండే ఎండను లెక్క చేయకుండా ప్రతిరోజూ 33 వేల మంది కూలీలు ఉపాధిపనులు చేస్తున్నారు. కాగా వీరికి రెండు నెలలుగా కూలీడబ్బులు రావడం లేదు. దీంతో ఫూట గడవక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఇస్తామని కాలం వెళ్లదీస్తున్నారని కూలీలు వాపోయారు. గతంలో వారం, పదిరోజుల కోసారి డబ్బులు వచ్చేవని, ఇప్పుడు రెండు నెలలైనా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. అరకొర వసతులు పదిహేను రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు భగ్గున మండిపోతున్నాడు. కాగా పని చేసేచోట కూలీలకు నీడ కోసం టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, తాగునీటి వసతి కల్పించడంతో పాటు మెడికల్ కిట్లు సైతం అందుబాటులో ఉంచాలి. కానీ సంబంధిత అధికారులు ఈ బాధ్యతలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో టెంట్లు ఏర్పాట్లు చేయగా, చాలా గ్రామాల్లో టెంట్లు కాదు కదా కనీసం తాగునీటిని సైతం ఇవ్వడం లేదు. దీంతో కూలీలే ఇళ్లనుంచి తాగునీటిని తీసుకెళ్తున్నారు. వడదెబ్బతో చస్తున్నా.. పట్టించుకోరా? జిల్లాలో నిత్యం 33 వేలమంది పనులకు.. రెండు నెలలుగా అందని కూలీ డబ్బులు టెంట్లు వేయాలని ఆదేశించాం ఉపాధిహామీ పనులు చేసే ప్రతి గ్రామంలో కూలీలకు నీడ కోసం టెంట్లు వేసి, తాగునీటిని అందుబాటులో ఉంచాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. చాలా గ్రామాల్లో వసతులు ఏర్పాటు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా టెంట్లు వేయకుంటే వెంటనే వేయిస్తాం. – శ్రీనివాసరావు, డీఆర్డీఓ, మెదక్ -
క్రమశిక్షణకు మారుపేరు పోలీసులు
సిద్దిపేటజోన్: పోలీసు విభాగం అత్యంత క్రమశిక్షణకు మారుపేరని, అలాంటి గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న మనం ఐక్యంగా పనిచేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన లింగ వివక్ష – అవగాహన అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ... విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలన్నారు. పనిచేసే ప్రాంతాల్లో మహిళా సిబ్బందిపై వేధింపులు సహించబోమని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఒకరిపైఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలతో, తోటి సిబ్బందితో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నారు. పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళ భద్రత, రక్షణకు సంబంధించిన పలు అవగాహన వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, అదనపు డీసీపీ సుభాష్, ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ దుర్గ, న్యాయవాది రియాజోద్దీన్, సీఐలు, ఎస్సైలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ -
అధిక సాంద్రత పద్ధతితో లాభాలు
● ములుగు సీఈఓలో మామిడి తోటల పరిశీలన ● ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాష ములుగు(గజ్వేల్): అధిక సాంద్రత మామిడి సాగు పద్ధతిలో సంప్రదాయ విధానం కంటే ఎక్కువ దిగుబడి, లాభాలు పొందవచ్చని ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాష అన్నారు. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ప్రూట్స్(సీఈఓ) కేంద్రాన్ని బుధవారం సందర్శించి అత్యధిక సాంద్రత పద్ధతిలో నాటిన మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసర్, దసేరి, ఇమామ్ పసంద్, సువర్ణరేఖ, చెరుకు రసం, రత్న, అమర్పాలీ, మహమూడ వికారాబాద్, అమిని, జలాల్ మామిడి రకాలు అధిక లాభాలను అందిస్తున్నాయని చెప్పారు. ఈ పద్ధతిని ప్రోత్సహించేందుకు హార్టికల్చర్ శాఖ తరపున ఎంఐడీహెచ్ పథకం ద్వారా హెక్టారుకు రూ.80 వేలు సబ్సిడీ అందజేస్తారన్నారు. దీనికి అదనంగా డ్రిప్ రాయితీ కూడా ఇస్తారని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రూ.50కి ఒక మామిడి మొక్క చొప్పున విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన మరియు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కిరణ్, హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.రామలక్ష్మి, అధికారులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి
సంగారెడ్డి జోన్: జిల్లా పంచాయతీ అధికారిగా ఏ.మల్లారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీఎల్పీఓగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతి పొంది బదిలీపై జిల్లాకు వచ్చారు. కొన్ని నెలలుగా జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి ఇన్చార్జి డీపీఓగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డిని కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ముగిసిన శిక్షణ తరగతులుజహీరాబాద్ టౌన్: మొగుడంపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జనగణన శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. మే 11 నుంచి నిర్వహించనున్న జనగణనకు సంబంధించి టీచర్లకు శిక్షణనిచ్చారు. రెండవ విడతలో 37 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన టీచర్లతో ప్రతిజ్ఞ చేయించి నివాస గణన మెటిరీయల్ను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్ఐలతో పాటు మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ గౌరీశంకర్ పటాన్చెరు: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ గౌరీశంకర్ పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని న్యూలాండ్ యూనిట్–2 పరిశ్రమలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా వ్యవహరించాలో కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిబాబు, న్యూలాండ్ యూనిట్–2 ప్లాంట్ హెడ్ మహేశ్ జోషి, సంస్థ సలహాదారు రామకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు ఎమ్మెల్యే సునీతారెడ్డి కొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రంగంపేట, దుంపలకుంట చౌరస్తాలో చలివేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోను లేవన్నారు. ధాన్యం రవాణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ప్రధానంగా ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత, లారీ ఏ రైస్మిల్కు వెళ్తుందన్న విషయమై రైతులకు చివరి వరకు తెలియడం లేదన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి, సజావుగా కొనుగోళ్లు, రవాణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని స్పందనను అభినందించారు. ఆమె వెంట తుక్కాపూర్, పైతర సర్పంచ్లు ఆంజనేయులు, రవితేజరెడ్డి, నాయకులు మల్లేశం, రాజా సంతోష్ కుమార్ ఉన్నారు. -
● బాలురకంటే బాలికలదే హవా ● గతంకంటే స్వల్పంగాతగ్గిన ఉత్తీర్ణత శాతం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారుల సూచనలు, ఉపాధ్యాయులు నిర్దిష్ట ప్రణాళిక, కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యార్థుల పట్టుదలతో పదిలో విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు. రాష్ట్రం ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పది ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 28 మండలాలకుగానూ 5 మండలాలు 100% ఫలితాలు సాధించగా, 15 మండలాలు 99% ఫలితాలు సాధించాయి. బాలికలదే హవా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పదో తరగతి ఫలితాలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 24,573మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా 24,252 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా 98.69% ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో 12,772 మంది బాలురకు గానూ 12,548 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 98.25 ఉత్తీర్ణత శాతం నమోదైంది. అదేవిధంగా 11,801 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 11,704 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 99.18 ఉత్తీర్ణత శాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు సైతం వంద శాతం ఫలితాలు సాధించాయి. జిల్లావ్యాప్తంగా 17 కస్తుర్బా పాఠశాలలు వుండగా 16 కస్తూర్బా వసతిగృహాల్లో వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు రాగా, పుల్కల్లో ఒక విద్యార్థి మాత్రమే ఫెయిలైంది. 17 పాఠశాలలకు 767మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 766 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లావ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో 99.34% ఉత్తీర్ణత నమోదైంది.మెరిసిన మల్కాపూర్ బాలికలు గుమ్మడిదల మండలంలో అత్యల్పంగా 95.67%ఉత్తీర్ణత సాధించారు. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు వర్షిత 594 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా మౌనిక 592 మార్కులతో ద్వితీయ స్థానంలో, ధనలక్ష్మీ 588 మార్కులతో జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచారు. ఆదర్శ పాఠశాలలు అదుర్స్ ఆదర్శ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలతో ఆదర్శంగా నిలిచాయి. ప్రస్తుతం మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదుర్స్ అనిపించారు. 10 పాఠశాలలకు గానూ 9 పాఠశాలు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జిల్లాలో 928మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా 927మంది విద్యార్థులు హాజరయ్యారు. కేవలం ఒకే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు.గురుకులాల్లోనూ ఉత్తమ ఫలితాలు జిల్లావ్యాప్తంగా 11 గురుకులాలకు గానూ 10 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జిల్లావ్యాప్తంగా 833మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు రాయగా 832మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక 197 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు గానూ 134 స్కూళ్లలో 100% ఫలితాలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 9,489 మంది పరీక్షలకు హాజరు కాగా 9,305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
● ‘మద్దతు ధర దక్కేనా’ కథనానికిమంత్రి స్పందన ● హర్షం వ్యక్తం చేసిన మొక్కజొన్న రైతులు వట్పల్లి(అందోల్): ప్రభుత్వం మొక్కజొన్న(మక్కలు) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందా? మద్దతు ధర దక్కుతుందా? అని రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుండటంపై ఈనెల 19 ‘మద్దతు ధర దక్కేనా’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. అందోల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై మార్క్ఫెడ్ అధికారులకు తెలియజేశారు. డీఏసీఎంఎస్ సహకారంతో బుధవారం జోగిపేటతోపాటు అందోల్ మండలంలోని తాడ్మన్నూర్ గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ప్రారంభించారు. మొదటిసారి అందోల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
సేంద్రియ సాగుతోనే ఆరోగ్యం
కొండాపూర్(సంగారెడ్డి): సేంద్రియ సాగుతో భూసారం పెరగడంతోపాటు మనుషుల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. కొండాపూర్లో మండలంలోని హరిదాస్పూర్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి నిర్మలారెడ్డి హాజరయ్యారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, భూసార పరీక్ష ప్రాముఖ్యత, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎరువుల యాజమాన్యంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ అధికంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ఆహారం విషపూరితం అవుతుందన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ..భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేస్తే ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయన్నారు. ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యత, దాని ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు వివరించారు. రైతులు ఎల్లప్పుడూ అధీకృత డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, వాటి రశీదులను భద్రపరుచుకోవాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రీదేవి, లతీఫ్ పాషా, శాస్త్రవేత్తలు డా.గిరిజాదేవి, డా.జి.ప్రతిభ, డా.రవిశంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మాజీ ఎంపీటీసీ నర్సింహరెడ్డి, వైద్యనాథ్ ఏఓ గణేష్, ఏఈఓ రవి పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
సంగారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ మెడి కల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్ బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలు అండగా ఉంటాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరు తో గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి బెదిరిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, డీఎస్పీ సత్తయ్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి -
అవగాహనే ధ్యేయం.. ఆదాయమే లక్ష్యం
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంగారెడ్డి జోన్: వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు వ్యవసాయ అంశాలపై సూచనలు సలహాలిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రసాయన ఎరువుల వినియోగం, సేంద్రియసాగు, పంటమార్పిడి విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయంలో ఆదాయం పెంచటమే లక్ష్యంగా ఈ సదస్సులను నిర్వహిస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్, సాగునీటి ఆదా, పెట్టుబడి ఖర్చులు తగ్గింపు తదితర అంశాలను కూడా రైతులకు వివరిస్తున్నారు. ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక వ్యవసాయాధికారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి ఉంటారు. జిల్లావ్యాప్తంగా 18 బృందాలుగా ఏర్పడి 144 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ సదస్సులు మే 23 వరకు కొనసాగుతాయి. ఏ గ్రామాల్లో ఎప్పుడు నిర్వహించాలి? ఎవరెవరు పాల్గొంటారు? అనే అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించారు. జిల్లాను రెండు క్లస్టర్లుగా విభజించి డా.విజయ్ కుమార్, డా.అరుణలను ఇన్చార్జిలుగా నియమించారు. రైతుల సమస్యలు శాస్త్రవేత్తకు ముందుకు సదస్సులు నిర్వహించిన సమయంలో రైతులు తమ సమస్యలను అధికారుల, వ్యవసాయ శాస్త్రవేత్తల ముందు ఉంచుతున్నారు. కల్తీ విత్తనాల నివారించి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక దిగుబడులు పొందేందుకు కొత్త వంగడాలను సరఫరా చేయాలని, పంట సాగుకు సరిపడా యూరియా, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెబుతున్నారు.ఆధునిక సాగు విధానాలు, ఎరువుల వినియోగంపై రైతులకు సలహాలు ఏప్రిల్ 27 నుంచి రైతు ముంగిట్లోశాస్త్రవేత్తల కార్యక్రమం మే 23 వరకు 18 బృందాలతో144 గ్రామాల్లో పర్యటన -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. తెల్లాపూర్ డివిజన్లో బుధవారం క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. డివిజన్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థపై ఆరా తీశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పూడికతీత పనులను వేగవంతం చేయాలన్నారు. కొల్లూరులోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం చెత్త డంపింగ్ యార్డ్ను సందర్శించారు. చెత్త నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనగణన నమోదులో పాల్గొనండి
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే పటాన్చెరు: జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పటాన్చెరులోని తన నివాసంలో బుధవారం స్వీయ జనగణనను ప్రారంభించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని..కచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు యాప్ ద్వారా స్వీయ జనగణన సైతం చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇళ్లకు వచ్చిన సమయంలో పూర్తి వివరాలు అందించాలని..ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి ప్రమాణాలు, వెనుకబాటుతనం, విద్య స్థాయి, తదితర అంశాల పైన స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఏఆర్ఓ అమరేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల సందర్శన తప్పనిసరి
సంగారెడ్డి జోన్: ప్రతీ అధికారి వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సబ్డివిజన్, తహసీల్దార్, ఎంపీడీఓ, మిషన్ భగీరథ, హౌసింగ్, విద్యుత్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యాసంస్థలు, వసతి గృహాల్లో మరమ్మతులు, పెయింటింగ్ వంటి పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలన్నారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు 1916 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ చెప్పారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఫీడర్ వారీగా పర్యవేక్షణ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫ్యామిలీ మెంబర్, జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారుల పక్కన చెత్త పేరుకుపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా.. జిల్లాలోని అన్ని రూట్లలో పరిధి ప్రారంభం, ముగింపు బోర్డులను స్పష్టంగా కనిపించేలా 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నేషనల్ హైవే–65పై సరైన నిర్వహణ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. 8న జాబ్ మేళా తారా డిగ్రీ కళాశాలలో మే 8న నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నేషనల్ హైవేలపై వేగ నియంత్రణ, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సురక్షితమైన నీటినే తాగాలి
చేగుంట(తూప్రాన్): ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీటిని తాగాలని, నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బ్రహ్మచారి పేర్కొన్నారు. బుధవారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు స్వచ్ఛమైన నీటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ... 150 నుంచి 500 టీడీఎస్ నాణ్యత ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలన్నారు. వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు తీసుకొచ్చిన తాగునీటిని పరిశీలించి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత తగిన మోతాదులోనే ఉందన్నారు. గ్రామాల్లో బోరు బావుల నీటిని వాడుతున్నట్లయితే శుద్ధి చేసిన నీటిని తాగేందుకు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిళ్లలో నిలువ ఉంచిన నీటిని తాగడం కాన్సర్ కొనితెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు అధికారి అనిత, ఏపీఎం దుర్గాప్రసాద్, ఆయా గ్రామాల సీసీలు, గ్రామ సమైఖ్య అధ్యక్షులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
షెడ్డులో మంటలు
● దగ్ధమైన రెండు కార్లు ● అన్నారంలో ఘటన జిన్నారం (పటాన్చెరు): కారు షెడ్డులో మంటలు చెలరేగి రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారంలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... అన్నారం గ్రామ సమీపంలోని కారు మెకానిక్ షెడ్డులో మంగళవారం మధ్యాహ్నం బ్యాటరీ చార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్డులోని మెకానికులు, స్థానికులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో షెడ్డులోని మారుతి రిడ్జ్, షిఫ్ట్ డిజైర్ కార్లు పూర్తిగా మంటలకు దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమీపంలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హెటిరో పరిశ్రమలకు చెందిన ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
చేగుంట(మెదక్): మండల పరిధిలోని బి.కొండాపూర్ చెరువు మత్తడిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... స్థానికులు చెరువు వద్ద మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు పంచనామ నిర్వహించారు. మృతి చెందిన వ్యక్తికి 40 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడికి సంబంధించిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు వద్ద గోనె సంచిలో.. పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు జెన్కో నీటి ప్రవాహం వద్ద గోనె సంచిలో కట్టిపడేసిన గుర్తు తెలియని మృతదేహం లభించింది. పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ కథనం ప్రకారం... మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగి, 5.5 మీటర్ల ఎత్తు, చామన చాయ కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తిని మూడు,నాలుగు రోజుల క్రితమే హత్య చేసి శ వాన్ని సింగూరు జెన్కో వద్ద పడవేశారని అనుమానం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్కు వెన్నెముక సేవాదళ్
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక దాని అనుబంధ విభాగమైన సేవాదళ్ అని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మంగళవారం సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర్థ శిక్షణ శిబిరానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్తో కలసి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ...రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి, పార్టీ సంస్థాగత బలో పేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణ శిబిరంలో చర్చించడం మంచి పరిణామమన్నారు. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులతోపాటు, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మి చెరువును సందర్శించిన పీసీబీ
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని ధర్మి చెరువును గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు మంగళవారం ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు సందర్శించారు. ఇటీవల గడ్డపోతారం అయ్యమ్మ చెరువు అలుగు తొలగించడంతో కాజిపల్లి ధర్మి చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరుకున్నాయని అధికారులకు ఫిర్యాదులు చేశారు. చెరువును సందర్శించేందుకు వచ్చిన ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈ చక్రవర్తి, పీసీబీ ఏఈ రవీందర్తో కలిసి సంయుక్తంగా సందర్శనకు వచ్చారు. గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండా అలుగును తొలగించడమేంటని ప్రశ్నించే క్రమంలో అధికారులు మధ్యలోనే వెళ్లియారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పీసీబీ అధికారులు చెరువులోని శాంపిళ్లను సేకరించారు. నివేదిక అనంతరం బాధ్యులైన పరిశ్రమలపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంద్రసేన, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు వాహబ్ తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో అధిక ఆదాయం
వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీదేవి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సాగులో పంట మార్పిడి పద్ధతులను పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీదేవి రైతులకు సూచించారు. మండలంలోని మెలగిరిపేట్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు హాజరై రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. యూరియాను పరిమిత మోతాదులో మాత్రమే వినియోగిస్తూ సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాల వినియోగించడం వల్ల నేలసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు కచ్చితంగా రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రమేశ్, సర్పంచ్ షాబుద్దీన్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధర కల్పనలో కీలకపాత్ర మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి జోగిపేట(అందోల్): రైతులకు మద్దతు ధరను కల్పించడంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. జోగిపేట గంజ్లో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అండర్పాస్ వంతెన నిర్మాణానికి కృషి ఎంపీ రఘునందన్రావుచిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రం నుంచి శాలిపేట గ్రామానికి వెళ్లే రహదారిపై రైల్వేట్రాక్ వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషిచేస్తానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్తోపాటు మరో ఎనిమిది గ్రామాల సర్పంచ్ల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఆయన రైల్వే డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రతిపాదిత వంతెన గురించి వివరించారు. దానికి ఆయన ఒకటి రెండు రోజుల్లో రైల్వే టెక్నికల్ టీమ్ను పంపించి బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి గురించి, లైట్ల ఏర్పాటుపై నేషనల్ హైవే అథారిటీ అధికారితో ఫోన్లో మాట్లాడారు. తక్షణం లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ వెంట నార్సింగి సర్పంచ్ సుజాతగౌడ్, శాలిపేట, మడూర్ సర్పంచ్లు నారాయణ, దివ్యగౌడ్, ఉప సర్పంచ్లు రాజేందర్రెడ్డి, కిష్టయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీజేపీ నాయకులు సత్యపాల్రెడ్డి, లింగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీకొని ఒకరు..
వెల్దుర్తి (తూప్రాన్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆరేగూడెం గ్రామశివారులో చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన మర్కంటి శంకర్(35) బైకుపై వెల్దుర్తి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అరేగూడెం గ్రామశివారులోని డంప్యార్డు సమీపంలో అందుగులపల్లి నుంచి వెల్దుర్తికి వస్తున్న అక్కమొల్ల వినేశ్, శంకర్ బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శంకర్ బైక్ పై ఉన్న మర్కంటి శ్రీనివాస్, వినేశ్ బైకుపై ఉన్న నీరుడి పద్మ, నీరుడి రాజమణిలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు శంకర్కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతదేహన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఆరేగూడెం గ్రామస్తుల హామీ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సంగారెడ్డి టౌన్: ఈత కొడుతూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... కల్పగూరు గ్రామ పరిధిలోని మంజీరా డ్యాంలో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన గొల్లంకి గణేశ్ (25) ఈనెల 26న సాయంత్రం తన స్నేహితులతో కలిసి వచ్చాడు. సాయంత్రం డ్యాంలోని నీటిలో దిగి ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈత సరిగా రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే మృతి చెందిన యువకుడు ఇస్నాపూర్ పరిధిలోని సెన్సాకోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. స్నానానికి వెళ్లిన యువకుడు.. చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిట్టోజిసల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి రమేశ్ తన బంధువులతో కలిసి గ్రామంలోని శ్యామల వ్యవసాయ పొలంలోని నీటి స్టోరేజీ గుంతలో స్నానం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు రమేశ్ నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
సూత్రధారి.. పాత్రధారి
కొండాపూర్(సంగారెడ్డి): పంచాయతీలకు వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన పంచాయతీ కార్యదర్శి కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. ఆ కాసుల కక్కుర్తిలో గ్రామ పాలకవర్గాన్ని భాగం చేశాడు. పని చేయకుండానే బిల్లులు డ్రా చేసినా ఏం కాదంటూ గ్రామ పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించి గ్రామ సర్పంచ్తో బిల్లులు డ్రా చేయించాడు. వచ్చిన డబ్బుల్ని పాలకవర్గంతో కలసి స్వాహా చేసేశాడు. గ్రామస్థులు ఈ నెల 10న కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డీఎల్పీఓ అధికారి ఈ నెల 20న విచారణ చేపట్టి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసి సుమారు తొమ్మిది రోజులవుతున్నా నేటికీ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదు. పనిచేయకుండానే బిల్లులు డ్రా చేయడంలో సూత్రధారి...పాత్రధారి సదరు పంచాయతీ కార్యదర్శేనని తెలిసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు అతడిపై కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్థులు మండిపడుతున్నారు. పీర్ల బావి మరమ్మతు కోసం గ్రామంలో ఉన్న పీర్ల బావి ప్రమాదకరంగా ఉండటంతో దానిని పూడ్చేందుకు గ్రామ పంచాయతీ నిధులను ఖర్చు చేయాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆలోచన మంచిదే అయినప్పటికీ పనులు పూర్తయ్యాక మాత్రమే బిల్లులను డ్రా చేయాలి. కానీ, మార్చి 31వ తేదీ గడువు దాటిపోతే నిధులు వెనక్కి వెళ్తాయని గ్రామ సర్పంచ్తోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించాడు. దీంతో అనుకున్నదే తడువుగా గ్రామ సర్పంచ్ తమ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చి 31న రూ.7 లక్షలను డ్రా చేయించాడు. అయితే పీర్ల బావికి మరమ్మతుల పేరిట ఈ నిధుల్ని అంతా కలసి స్వాహా చేసేశారు. విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు పీర్లబావి మరమ్మతుకు ఎంత కాదనుకున్నా రూ.2లక్షలు కూడా దాటవని మిగిలిన డబ్బులన్నీ పాలకవర్గం కాజేయడానికే నిధుల్ని డ్రా చేసినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ఏప్రిల్ 10న గ్రామస్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 20న డీఎల్పీఓ అనిత ఈ విషయంపై విచారణ చేపట్టి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు మునిదేవునిపల్లి కార్యదర్శిగా పనిచేస్తున్న కిషోర్పై చాలాకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మండలంలోనే అత్యధికంగా వెంచర్లున్నది ఈ గ్రామంలోనే. వెంచర్లకు ఎలాంటి అనుమతుల్లేకున్నా.. గ్రామ పంచాయతీ అనుమతి మాత్రం ఉంటుంది. మీ దగ్గరకు ఎవరూ రారు. ఎవరొచ్చినా నేను చూసుకుంటానని చెప్తూ ప్రతీ నెల జిల్లా అధికారులకు మామూళ్లు ఇస్తానంటూ రియల్టర్లను బెదిరించడం, వారి నుంచి డబ్బులు వసూళ్లు చేయడం ఆయన నైజం. ఇంతలా అవినీతికి పాల్పడుతున్న కిషోర్ను నూతనంగా ఎన్నికై న పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎంపికై న వార్డు సభ్యులకు పనులు చేయకముందే బిల్లులను ఎలా డ్రా చేయాలో శిక్షణలో నేర్పుతున్నాడా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.డీపీఓకు నివేదికను అందజేస్తా మునిదేవునిపల్లిలో పనులు చేయకుండానే 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసి మాట వాస్తవమే. ఈ విషయంపై విచారణ చేసేందుకు ఈనెల 20న గ్రామ పంచాయతీకి వెళ్లి రికార్డులను తనిఖీ చేసి, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే తుది నివేదకను డీపీఓకు అందజేస్తా. –అనిత, డీఎల్పీఓపనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శి -
జిజ్ఞాస ప్రాజెక్టులో సత్తాచాటిన దుబ్బాక
రాష్ట్ర స్థాయి పోటీలకు మూడు ప్రాజెక్టులు ఎంపికదుబ్బాక: జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా చాటింది. కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు మరోసారి రాష్ట్రస్థాయి పోటీలకు మూడు విభాగాల నుంచి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సమర్పించిన 1431 అధ్యయన ప్రాజెక్టులలో 309 రాష్ట్రస్థాయి ప్రజెంటేషన్కు ఎంపికయ్యాయి. ఇందులో దుబ్బాక కళాశాల నుంచి 5 ప్రాజెక్టులు సమర్పించగా.. 3 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ భవాని తెలిపారు. రసాయన శాస్త్రం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాంసుందర్ పర్యవేక్షణలో రూపొందించిన వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో నీటిశుద్ధి, తెలుగు విభాగం ఉపన్యాసకులు వెంకటేశ్ పర్యవేక్షణలో రూపొందించిన కుల వృత్తులు, తెలంగాణ వాడుక పదాల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఉపన్యాసకులు ఆంజనేయులు పర్యవేక్షణలో రూపొందించిన యూరియా పంపిణీలో యాప్ పనితీరు విధానంపై సాంకేతిక పరిష్కారాలను ప్రతిపాదించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను,అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. నర్సాపూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు.. నర్సాపూర్ రూరల్: రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన రెండు ప్రాజెక్టులకు గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. జంతుశాస్త్రం విభాగం అధ్యాపకుడు డాక్టర్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పక్షుల వైవిధ్యంపై చేపట్టిన పరిశోధన ప్రాజెక్టు, భౌతికశాస్త్రం విభా గం అధ్యాపకుడు రవి ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యుత్ వినియోగంపై చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. కాగా విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు. -
బైకు ఢీకొని మహిళ మృతి
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పులిమామిడి శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ... మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి(65) మంగళవారం కిరాణ వస్తువుల కోసం సమీప గ్రామమైన పులిమామిడికి వచ్చింది. వస్తువులు తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో దౌల్తాబాద్ వైపు నుంచి వస్తున్న బైకు శ్రీదేవిని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించారు. మృతురాలి భర్త శ్రీనివాసచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియలకు వెళ్లొస్తూ.. కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి నిజాంపేట్ మండలంలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని నాగధర్ గ్రామానికి చెందిన మల్కపూరం కిష్టయ్య(57) ఆటోలో రాపర్తిలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో పల్సర్ బైక్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన బోల్తాపడింది. ఆటో నడుపుతున్న కిష్టయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న నాగధర్ గ్రామానికి చెందిన డేవిడ్, బైక్ నడుపుతున్న నితిన్రెడ్డికి గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
పది మంది ప్రయాణికులకు గాయాలు మెదక్జోన్/కొల్చారం: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో పదిమంది ప్రయాణికులకు గాయాలవ్వగా, అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొల్చారం మండలం అప్పాజిపల్లి వద్ద మెదక్–నర్సాపూర్ జాతీయరహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై హైమద్ మైనొద్దీన్ వివరాల ప్రకారం... బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జేబీఎస్ నుంచి వయా నర్సాపూర్ జాతీయరహదారి మీదుగా బోధన్ వెళ్తుంది. ఈ క్రమంలో కొల్చారం మండలం అప్పాజిపల్లి సమీపంలో గల మూతపడ్డ పెట్రోల్ పంపు వద్దకు రాగానే బస్సు... వడ్ల లోడ్తో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో 35 మంది ప్రయాణికులుండగా వారిలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్కు తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్ సాంబయ్యకు కుడికాలు, ఎడమ వైపు పక్కటెముకలు విరిగాయి. బాన్సువాడకు చెందిన జాకీర్ అనే మరో ప్రయాణికుడికి తలకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు.చిన్నశంకరంపేట(మెదక్): బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సూరారం గ్రామానికి చెందిన బక్కన అనిల్, దిడ్డికాడి వినీల్ బైక్పై గవ్వలపల్లికి వెల్లి పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు అంబులెన్స్లో మెదక్ ఆస్పత్రికి తరలించారు. జహీరాబాద్లో ఇద్దరికి.. జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం... చెన్న బసప్ప కారును రెంట్కు తీసుకొని హైదరాబాద్ నుంచి కర్నాటక గుల్బర్గాకు వెళ్తున్నాడు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఇంద్రప్రస్థ వెంచర్ వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న బసప్పతో పాటు కారు డ్రైవర్ భీమయ్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి ఇద్దరికి.. -
అడవి పందులను పట్టి.. విక్రయానికి యత్నం
నలుగురిపై కేసు నమోదు నర్సాపూర్: అడవి పందులు పట్టి అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడాని వచ్చిన వ్యక్తులపై కేసు నమోదైంది. స్థానిక ఎఫ్ఆర్వో దివ్య వివరాల ప్రకారం... శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామాని కి చెందిన సహదేవ్ నవాపేట గ్రామ శివారులో మూడు అడవి పందులను పట్టుకున్నాడు. వీటి ని నిజాంపేట గ్రామానికి చెందిన సురేశ్, విఘ్నే శ్, ప్రవీణ్లకు అమ్మడానికి ప్రయత్నించాడు. అమ్మకానికి పెట్టిన మూడింటిలో ఒకటి చనిపోగా, మిగిలిన రెండింటిని అడవిలో వదిలేశామని అధికారులు తెలిపారు. కాగా అడవి పందులు పట్టిన సహదేవ్తో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన ముగ్గురిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. న్యాల్కల్(జహీరాబాద్): అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్న లారీని మంగళవారం హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని ముంగి చౌరస్తా వద్ద ఉదయం ఎస్ఐ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి కర్నాటక బీదర్కు వెళ్తున్న ఇసుక లారీని తనిఖీ చేశారు. ఆ లారీకి కరీంనగర్ నుంచి జహీరాబాద్ వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుండటంతో పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. బెజ్జంకి(సిద్దిపేట): అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును మంగళవారం టాస్క్ఫోర్స్ సీఐ శ్రీధర్ సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు మండలంలోని దాచారం శివారులోని కాలువ సమీపంలో నిల్వ చేసిన ఇసుక డంపును సీజ్ చేశారు. అలాగే బెజ్జంకి, దాచారం కాలువ సమీపంలో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించామని ఎస్ఐ సౌజన్య తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్న చిలాపూర్కు చెందిన బొట్ల ప్రవీణ్పై కేసునమోదు చేశామని, అక్రమ ఇసుక డంపు వద్ద పోలీస్ బందోబస్తు పెట్టినట్లు తెలిపారు. పాపన్నపేట(మెదక్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన కాగితాల జహంగీర్(39)ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి కొద్ది పాటి అప్పులున్నాయి. అయితే ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. సోమవారం రాత్రి ఓ విందులో పాల్గొని, మద్యం తాగి వచ్చిన అతడు ఇంటి బయట పడుకొని అప్పుల విషయమై ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఒకరు.. మిరుదొడ్డి(దుబ్బాక): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని చెప్యాలలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్ఐ సమత కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బైండ్ల యాదగిరి (42) కూలీ పనులు చేసుకుంటూ భార్య రజిత,పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో యాదగిరి మద్యానికి బానిసగా మారాడు. కుటుంబ పోషణతో పాటు, తాగడానికి అందరి దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులిచ్చిన వారి నుంచి వత్తిడి ఎక్కువైంది. దీంతో మద్యం మత్తులో ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకున్నాడు. -
ట్రాన్సిట్ హోంను సందర్శించిన ఎస్పీ
జోగిపేట(అందోల్): జోగిపేటలోని సబ్జైలులో విదేశీ ఖైదీలకు ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోంను మంగళవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. సోమవారం 12 మంది విదేశీ ఖైదీలను ట్రాన్సిట్ హోంకు తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని వివిధ రకాల నేరాలకు పాల్పడి తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ట్రాన్సిట్ హోంకు తరలించారు. వారికి సౌకర్యంగా ఉందా? లేదా అన్న విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ఎస్పీ పరిశీలించారు. విదేశీ నేరస్తులను కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలను జైలులో రిమాండ్లో ఉంచారు. ఇది తమ పరిధిలోకి రాదని ప్రత్యేకంగా హైదరాబాద్ ఆ విభాగానికి చెందిన అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. -
కేజీబీవీ పిలుస్తోంది..
● ఆంగ్ల మాధ్యమంలో బోధన ● ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం ● జిల్లాలో 23 పాఠశాలలు దుబ్బాకటౌన్: పేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్ వరకు బోధన అందిస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆరో తరగతిలో.. జిల్లాలో మొత్తం 23 కేజీబీవీలు ఉన్నాయి. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆంగ్లంలో బోధన పాఠశాలలో విద్యార్థినులకు పలు వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, నాణ్యమైన విద్య, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు వస తితో కూడిన విద్యను అందిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలు నిరుపేద బాలికలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు నైపుణ్యాలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. భవిష్యత్లో విద్యార్థులకు ఉపాఽధి అవకాశాలు పొందేలా కుట్లు, అల్లికలతో పాటు ఇతర అంఽశాలను సైతం నేర్పిస్తున్నారు. వివిధ రకాలు వృత్తి విద్యాకోర్సులు సైతం అమలు చేస్తున్నారు. -
సొంత శాఖనే సవాల్..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్కు తన సొంత రెవెన్యూ శాఖనే సవాల్గా మారనుంది. ఈ శాఖలో జిల్లాలో పాతుకుపోయిన కొందరు అధికారుల అవినీతి, అక్రమాల బాగోతాలు తరచూ వెలుగులో వస్తుండటంతో ఆశాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతానికి పరోక్షంగా సహకరిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు కొందరు అధికారులు ఎదుర్కొంటుండగా, వివాదాల్లో ఉన్న ప్రైవేటు భూముల లావాదేవీల విషయంలో పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటున్న ఘటనలు జిల్లాలో సంచలనంగా మారుతున్నాయి. ప్రతీక్జైన్ సోమవారమే కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ యువ ఉన్నతాధికారికి ఇప్పుడు రెవెన్యూశాఖను గాడిపెట్టడం సవాల్గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మండలాల్లోనే ఏళ్ల తరబడి.. జిల్లాలో కొందరు తహసీల్దర్లు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములున్న, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ రియల్ ప్రాజెక్టులున్న మండలాల్లో పాతుకు పోయారు. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలు, ముంబై హైవే ఉన్న మండలాల్లోనే వీరు పోస్టింగ్లు దక్కించుకుంటున్నారు. ఎన్నికలు వంటి కారణాలతో బదిలీ అయినా..కొన్ని నెలలు కూడా గడవకుండానే వీరు తిరిగి పక్క మండలానిని చేరుకుని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారులో కీలక మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు హయాంలోనే కీలక మండలాల్లో పోస్టింగ్లు దక్కించుకుంటూ తమ హవాను కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. హైదరాబాద్కు అనుకుని ఉన్న ఈ మండలాల్లో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. దీంతో వీరి అక్రమార్జన కూడా అదేస్థాయిలో ఉంటోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమార్కులకు కలెక్టర్ చెక్ పెడతారా? లేదా అనే అంశం తెరపైకి వస్తోంది. సంచలనంగా మారుతున్న భూ బాగోతాలు రెవెన్యూ అధికారుల అక్రమాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇటీవల నందికందిలో 9.13 వివాదాస్పద భూమికి నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వ్యక్తికి పౌతీ చేసిన వ్యవహారంలో రూ.కోట్లలో ముడుపులు చేతులు మారాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తహసీల్దార్పై బదిలీ వేటు పడగా, డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. రామచంద్రాపురం మండలంలో పనిచేసిన ఓ తహసీల్దార్పైనా బదిలీవేటు పడింది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఆయన్ను మారుమూల మండలానికి బదిలీ చేశారు. జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఓ ఆర్డీఓపై కూడా ఆకస్మిక బదిలీ వేటు పడింది. ఇలా రెవెన్యూలో అక్రమార్కుల ముడుపుల బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తుండటం సంచలనంగా మారుతోంది. అన్యాక్రాంతమైన సర్కారు భూములు జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతమయ్యాయి. అమీన్పూర్ మండలంలో రూ.లక్షల కోట్ల విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు చేస్తున్న సర్కారు భూముల కబ్జాకు కొందరు రెవెన్యూ అధికారులు సహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జా జరుగుతున్నా కళ్లు మూసుకున్నందుకు కాసుల వర్షం కురుస్తోంది. తీరా అన్యాక్రాంతమయ్యాక చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాన్ని సక్రమం చేయడంలోనూ కొందరు అధికారులు ఆరితేరిపోయారు. వీరిపై కొత్త కలెక్టర్ దృష్టి సారిస్తే ఈ శాఖ కొంతమేరకు గాడిన పడుతుందనే వాదన వినిపిస్తోంది. భూ భారతి సమస్యలే అధికం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భూసమస్యలే అధికంగా ఉంటున్నాయి. అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ముడుపులు ఇచ్చే బడాబాబులు, నేతలు, ప్రజాప్రతినిధుల భూసమస్యలు ఆగ మేఘాలపై పరిష్కారం అవుతుండగా, నిరుపేద రైతులు మాత్రం చెప్పులరిగేలా ప్రజావాణికి క్యూ కడుతున్నారు. ఇలాంటి నిరుపేద రైతుల భూసమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రజల మన్ననలు పొందుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కుట్టు యంత్రంతో ఉపాధి మంత్రం
● బలహీనవర్గాల మహిళలకు పంపిణీ ● నియోజకవర్గానికి వెయ్యి.. ● త్వరలో దరఖాస్తుల స్వీకరణ నారాయణఖేడ్: నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బీసీ మహిళలకు ఆటోమేటెడ్ కుట్టు మెషీన్లను పంపిణీ చేయనున్నారు. నియోకవర్గానికి వేయి చొప్పున జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కలిపి 5 వేల కుట్టు మెషీన్లను ఉచితంగా అందజేయనున్నారు. నైపుణ్యం ఉన్న మహిళలు సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధిని కల్పించేందుకు నిర్ణయించారు. వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను అందించనున్నారు. వీటిని వందశాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆర్థికంగా ఎదిగే వెసులుబాటు గ్రామీణ ప్రాంతాల్లో టైలరింగ్లో నైపుణ్యం ఉన్న మహిళలున్నా వారికి సరైన ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. వస్త్రాలు కుట్టడంలో అనుభవమున్నా గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రతిభ వెలికి తీసే పరిస్థితులు లేవు. పేదరికం కారణంగా చాలామంది బలహీన వర్గాల మహిళలు కుట్టు మెషీన్లను కూడా కొనే పరిస్థితి లేదు. నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టైలరింగ్పై ఆధారపడి జీవనాన్ని సాగి స్తున్న సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో మహిళలు టైలరింగ్ వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ వారిచ్చే జీతాలతోనే సరిపుచ్చుకుంటున్నారు. వీరికే నేరుగా అధునాతన కుట్టు మెషీన్లు అందజేసి ప్రోత్సహిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. కార్మిక శాఖ ద్వారా... నాలుగైదేళ్లుగా జిల్లాలో కార్మికశాఖ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా మెషీన్లను పంపిణీ చేశారు. జిల్లాలోని నారాయణఖేడ్, ర్యాకల్, జహీరాబాద్, రాత్నపూర్, మల్గి, జోగిపేట ప్రాంతంలో మరవెళ్లి, సంగారెడ్డిలోని ఐటీఐ క్యాంపస్లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్లో 30 మంది చొప్పున లేబర్ కార్డులు కలిగి ఉన్న మహిళలను గ్రూపులుగా తయారు చేసి ఒక్కో బ్యాచ్కు మూడు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ అందజేయడంతోపాటు ఉచితంగా మెషీన్, టూల్కిట్, సర్టిఫికెట్లను అందించారు. కార్మిక శాఖ ద్వారా శిక్షణ పొందిన చాలామంది మహిళలు నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వస్త్రాలు కుట్టి ఉపాధి పొందుతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపికప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీకి సంబంధించి త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని స్వీకరించి లబ్ధిదారులను కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్ కుట్టు మెషీన్లు వారి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి ఆర్థిక ఆసరాగా ఎదిగేందుకు ఉపయోగపడనుంది. -
జూన్ నుంచి అల్పాహారం
పటాన్చెరు టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో జూన్ నుంచి అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి వెల్లడించారు. పటాన్చెరు పీవీ నరసింహారావు ఆడిటోరియంలో మంగళవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన అంగన్వాడీ గ్రాడ్యుయేషన్ దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు సంస్థల కంటే అంగన్వాడీలో చిన్నారులకు మెరుగైన ఎదుగుదల ఉంటుందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. చిన్నారులు ఎదగా లంటే అంగన్వాడీలకు పంపాలని ఆమె చెప్పారు. అంగన్వాడీల్లో చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల, సీడీపీఓలు జయ రాం నాయక్, పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి జనగణన కీలకం
● ఎంపీ మాధవనేని రఘునందన్రావు ● సొంతూరులో స్వీయగణన దుబ్బాక: దేశ సర్వతోముఖాభివృద్ధికి జనగణన కీలకమని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. మంగళవారం తన స్వగ్రామం భూంపల్లి–అక్భర్పేట మండలం బొప్పాపూర్లో స్వీయగణనలో తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగణన, కులగణనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు జనగణనలో తమ కుటుంబానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజల నుంచి సేకరించే ప్రతి సమాచారం, దేశ భవిష్యత్త్తో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో ప్రధానపాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ సర్పంచ్ భానుప్రసాద్, తహసీల్దార్ బాల్రాజు, ఎంపీడీవో సోమిరెడ్డి తదితరులు ఉన్నారు. -
స్వీయగణనను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్ సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్: జనగణన ప్రక్రియను సులభంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయగణనను ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ స్వీయ నమోదు చేసుకున్నారు. అనంతరం ఖేడ్ మండలంలోని తుర్కాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీచేసి ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరు, వైద్యులు, సిబ్బంది పాటిస్తున్న సమయపాలన గురించి ఆరా తీశారు. అనంతరం ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్వీయగణనకు మే 10వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మాణం జరిగేలా చూడాలని తెలిపారు. సాదాబైనామాలు, భూభారతి తదితర అంశాల పరిష్కారంపై అధికారులకు కలెక్టర్ వివరించారు. గత వేసవిలో నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలను, గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు, సెన్సస్ డైరెక్టర్ రమాదేవి, స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కమిషనరు జగ్జీవన్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాజీనామాల వివాదం
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలో నాలుగు రోజులుగా సాగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాజీనామాల పర్వానికి తెరపడింది. ఇటీవల మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత చిమ్ముల గోవర్ధన్రెడ్డి పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్పై విమర్శలు చేయగా..గోవర్ధన్రెడ్డి రాజకీయ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కౌన్సిలర్ నరేందర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గోవర్ధన్రెడ్డి మండిపడుతూ అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ధైర్యముంటే తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఆ స్థానంలో తమ కార్యకర్తలను బరిలోకి దింపి గెలిపిస్తామన్నారు. గోవర్ధన్రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ నరేందర్రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. కాగా గోవర్ధన్రెడ్డి సతీమణి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంధ్య కూడా ఆమె పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే నరేందర్రెడ్డి తన రాజీనామాపత్రంతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వైస్చైర్ పర్సన్ సంధ్య రాజీనామాకు సిద్ధం కాకపోవడంతో నరేందర్రెడ్డి పంతం నెగ్గినట్లైనది. అనంతరం ఈ వ్యవహారంపై కౌన్సిలర్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ...బీఆర్ఎస్ నాయకులు సవాలు విసిరినా ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా స్థాయిని మరిచి కాంగ్రెస్ నేతలపై విమర్శలు తగవని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలవలేని వ్యక్తి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ నాయకులపై విమర్శలు మానుకుని అభివృద్ధికి కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు, వడ్డే కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. అనవసర విషయాల్లోకి లాగొద్దు: చైర్పర్సన్ సంధ్య రెండు రోజులుగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్య స్పందించారు. పరస్పర సవాళ్లు రాజకీయంగానే చేస్తే మంచిదని అందులోకి మహిళా ప్రజాప్రతినిధులను లాగొద్దని సూచించారు. రాజీనామా విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ అభివృద్ధిలో సమిష్టి కృషితో ముందుకెళ్లడమే తన ముందున్న లక్ష్యం అని పేర్కొన్నారు. నాయకుల మధ్య వాడీవేడి చర్చలు రాజకీయ పరంగానే ఉండాలని కోరారు. -
కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి
● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్ వన్ టూ వన్గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్, గ్రామ, మండల, బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు. -
ఘనంగా విత్తన దినోత్సవం
● 100 మంది మహిళా రైతుల జీవవైవిధ్య విత్తన ప్రదర్శన జహీరాబాద్: ప్రపంచ విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని డెక్కన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవవైవిధ్య విత్తన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. పస్తాపూర్ గ్రామంలోని సంస్థ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 45 గ్రామాలకు చెందిన 100 మంది డీడీఎస్ మహిళా రైతులు చిరుధాన్యాల విత్తనాలతోపాటు సాంప్ర దాయ విత్తనాలు ప్రదర్శించారు. అత్యధికంగా 57 రకాల విత్తనాలను ప్రదర్శించిన నాగ్వార్ గ్రామ మహిళా రైతులకు ప్రథమ బహుమతి అందజేశారు. 56 రకాలు ప్రదర్శించిన గుంజోటి గ్రామ రైతులకు ద్వితీయ బహుమతి, 55 రకాలు ప్రదర్శించిన బిడకన్నె రైతులకు తృతీయ బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ భిక్షపతి, డీడీఎస్ ఈడీ దివ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న గ్రామసింహాలు
వీధి కుక్కల బెడదను నివారించేందుకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆ ఆపరేషన్లు చేయకపోవడంతో కుక్కలు విపరీతంగా పెరిగి గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. దీంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. – సిద్దిపేటకమాన్ పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో బెజ్జంకి మండలంలో ఓ పదేళ్ల బాలుడు తోటి పిల్లలతో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఐదు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసి చేతిపై కరిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు బాబు చేతి వేళ్లకు సంబంధించిన కండరం, ఎముకకు గాయమైంది. బాబు ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో ఏదో ఒక చోట ప్రతి రోజు వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా దాడులు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీల పరిధితో పాటు మండల కేంద్రాలు, చాలా గ్రామాల్లో వీధి కుక్కలు దాడులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు, సైకిళ్లపై వెళ్తున్న వారి వెంటపడి పరుగులు పెట్టిస్తున్నాయి. వేసవిలో ఎండ ప్రభావంతో కోపం, చిరాకుతో వీధి కుక్కలు అకస్మాత్తుగా పిల్లలు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల భారీ నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వాటిని తింటున్న కుక్కలు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.గతేడాది 7వేల మంది బాధితులు జిల్లాలో గతేడాది 7,727మంది కుక్క కాటుకు గురయ్యారు. వీరికి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్వీ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 603, ఫిబ్రవరిలో 527, మార్చిలో 475, ఏప్రిల్లో ఇప్పటి వరకు 397మందితో కలిపి మొత్తం 2002 మంది కుక్క కాటుకు గురయ్యారని అధికారులు తెలిపారు. వారికి ఏఆర్వీ వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ వినోద్బాబ్జి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఆర్వీ 14,167, ఏఆర్ఎస్ 1,805, హెచ్ఆర్ఐజీ 980 వ్యాక్సిన్ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా కుక్కకాటుకు గురైతే వెంటనే సంబంధిత పీహెచ్సీ, ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.భయాందోళనలో ప్రజలు వీధుల్లో, రోడ్లవెంట వెళ్లేవారిపై దాడులు జిల్లాలో గతేడాది 7,727.. ఈఏడాది 2వేల మంది బాధితులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు శూన్యం -
‘పుచ్చ’ ధర ఢమాల్
జహీరాబాద్ టౌన్: పుచ్చ సాగు చేసిన రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వేసవిలో మంచి లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టిన రైతులకు తెగుళ్లు, ధరల పతనం వల్ల కన్నీళ్లు వస్తున్నాయి. డిమాండ్ లేక ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ. 6 నుంచి రూ.7 పలుకుతుంది. ధరలు పడిపోవడం వల్ల వేల రుపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోతున్నారు. మంచి లాభాలు తెచ్చిపెడుతోందని, దళారుల బెడద ఉండదని రైతులు పుచ్చకాయల సాగుకు మొగ్గు చూపారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. 1600 ఎకరాల్లో సాగు.. వేసవిలో అధికంగా వినియోగించే పుచ్చ సాగుపై జిల్లాలోని పలు ప్రాంత రైతులు దృష్టిపెట్టారు. 65 రోజుల నుంచి 70 రోజుల్లో పంటచేతికి వస్తుందని, లాభాలు కూడా బాగా వస్తాయని సుమారు 1600 ఎకరాల్లో పంట సాగు చేశారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో జహీరాబాద్ ప్రాంత రైతులు కొన్నేళ్ల నుంచి పుచ్చ పంటను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి పెరగడంతో మార్కెట్ను ముంచెత్తింది. మార్కెట్లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తున్నా.. కొనేవారు లేరు. దీంతో ధరలు భారీగా పడిపోయాయి.ధర లేక ఇబ్బందులు రంజాన్ పర్వదినం సమయంలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కానీ ధరలు మాత్రం పెద్దగా పెరగలేదు. ప్రస్తుతం కిలో రూ. 6 నుంచి రూ.10 పలుకుతుంది. గత సంవత్సరం కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు పలికింది. పుచ్చ సాగు చేయడానికి ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్ల కారణంగా ఎకరానికి 15 క్వింటాళ్లు వచ్చింది. డిమాండ్ తగ్గడం వల్ల కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొంద మంది రైతులు పుచ్చకాయలను పొలంలోనే వదిలేస్తున్నారు. తెగుళ్ల కారణంగా కాయ సైజు పెరుగుదల నిలిచిపోయింది. పక్కనే ఉన్న కర్నాటక, మహరాష్ట్ర నుంచి కూడా ప్రతి రోజు రైతులు పుచ్చకాయలు జహీరాబాద్ మార్కెట్కు తీసుకొస్తున్నారు. దీంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు.సాగు చేసిన అన్నదాత దిగాలు పెరిగిన పంట సాగు పెట్టుబడి రాక నష్టాలు చేనులోనే వదిలేస్తున్న వైనం -
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజావాణిలో వినతుల స్వీకరణ సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పట్ల సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఎస్పీ, ఉద్యోగులు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిక్ జైన్ను ఎస్పీ పరితోశ్ పంకజ్, ఉద్యోగులు కలిశారు. కలెక్టరేట్ లో పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు డాక్టర్ డి.వైద్యనాథ్, కమిటీ సభ్యులు సంతోశ్ కుమార్, బలరాం, పర్వతాలు, లలిత కుమారి రామాచారి తదితరులు పాల్గొన్నారు. రికార్డుల ప్రక్షాళన పేరిట అక్రమాలురైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నారాయణఖేడ్/కంగ్టి(నారాయణఖేడ్): గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతోనే అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫలితంగా చాలామంది రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. ఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కేసీఆర్ రెవెన్యూ మంత్రిగా, కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఉండి అమెరికాలోని దివాళాతీసిన కంపెనీకి రికార్డులను, రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అప్పగించగా కేటీఆర్ అగ్రిమెంట్పై సంతకం చేశారని గుర్తు చేశారు. భూముల విషయంలో రైతులు గుంట భూమికూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉండరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణిలో లోపాలను సరిదిద్దడానికి భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు కంగ్టి మండలం గాజులపాడ్ గ్రామంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలసి పర్యటించారు. ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్.రెడ్డి, సునీల్ పాల్గొన్నారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయంరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు వట్పల్లి(అందోల్): పంట మార్పిడి పద్ధతితోనే సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. వాణిశ్రీ, డా. నీలిమలక్ష్మీ, డా. శాంతి, డా. గీతలు పేర్కొన్నారు. దుద్యాల గ్రామంలో సోమవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు, నీటివినియోగం, పంటల మార్పిడి పద్ధతి, ఆధునిక వ్యవసాయ విధానం, సమగ్ర పంటల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలివినతిపత్రాలు అందజేత జహీరాబాద్: గోవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు గోవధ నిషేధచట్టం తేవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం నుంచి తహశీల్ కార్యాలయం వరకు సోమవారం గోవులతో ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ...తమ డిమాండ్లను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రికి నివేదించాలన్నారు. అంతకుముందు సిద్ధేశ్వర గోశాల నిర్వహకులు గోవులను అలంకరించి పూజలు చేసి నృత్యాలు చేయించారు. -
నిండు కుండలా ‘నారింజ’
● వేసవిలోనూ ఎండని ప్రాజెక్టు ● పెరిగిన భూగర్భ జలాలు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎండలు మండుతున్నా నారింజలో పుష్కలంగా నీరు ఉంది. ప్రాజెక్టులో నీరు నిలువ ఉండటంతో చుట్టుపక్క గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పడిపోవడం లేదు. ముఖ్యంగా కొత్తూర్(బి),దిడ్గి, మల్కాపూర్, బుర్దిపాడ్, బూచినెల్లి, మిర్జాపూర్(బి), రేజింతల్ తదితర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుదలకు దోహదపడుతుంది. బోరుబావుల్లో నీరు ఉండటంతో వాణిజ్య పంటలైన చెరకు, అల్లం, కూరగాయాలను రైతులు పండి స్తున్నారు. నారింజ ప్రాజెక్టు ప్రభావం జహీరాబాద్ పట్టణంపై కొంతఉంది. నారింజలో నిండుగా నీరు ఉండటంతో పట్టణంలోని బోర్లలో నీరు అడుగంటడంలేదు. దీంతో పట్టణంలో నీటి ఎద్దడి సమస్య తప్పింది. -
పోలీసుల చెంత తప్పిపోయిన బాలుడు
పటాన్చెరు టౌన్: తప్పిపోయి ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ నవ్య వెంచర్ సమీపంలో ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల బాలుడు ఒంటరిగా తిరుగుతుండటంతో అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి బాలుడిని స్టేషన్కు తీసుకువచ్చారు. కాగా బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఉంటే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలని సూచించారు.గుర్తుపడితే సమాచారం ఇవ్వండి -
అప్రమత్తంగా ఉండాలి
వేసవిలో కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పెంపుడు కుక్కల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి. ఏమైనా మార్పులు కనిపిస్తే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలి. ప్రతి ఆరు నెలలకోసారి తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్క కరిచినా, గోర్లతో రక్కినా, నాలుకతో టచ్ చేసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్క కాటుకు గురైతే ఏఆర్వీ వ్యాక్సిన్ తీసుకోవాలి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఆర్వీ వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ వినోద్బాబ్జి, జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ, సిద్దిపేట● -
వామ్మో! 4 గంటలు ఉండాలా?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు వ్యవసాయ కూలీలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఈ విధానంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు నిరాసక్తత చూపుతున్నారు.దీంతో కొన్ని ప్రాంతాల్లో అసలుకే వెళ్లకపోగా, మరికొన్ని గ్రామాల్లో కూలీల హాజరు శాతం సగానికి సగం పడిపోతోంది. పనిచేసే ప్రదేశంలో ఏకంగా4 గంటల పాటు గడపాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జహీరాబాద్: పనుల్లో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) విధానాన్ని ప్రభుత్వం ఈనెల నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసింది. రోజుకు రెండుసార్లు కూలీల ఫొటోలను జియో–ట్యాగ్డ్, టైమ్–స్టాంప్ ఫొటోలను వర్క్సైట్ సూపర్వైజర్ అప్లోడ్ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడికి ఈకేవైసీ చేస్తారు. దీన్ని ఆధార్కార్డుతో అనుసంధానం చేస్తారు. కూలీలు ఉదయం పని ప్రదేశం వద్దకు రాగానే ఫొటోను తీసుకోవాలి. ఉపాధి పనులు పూర్తి చేసుకున్నాక వచ్చిన సమయం నుంచి నాలుగు గంటలు లెక్క కట్టి రెండో ఫొటోను తీయాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు ఒక నిమిషం తక్కువ ఉన్నా ఫొటోను యాప్ అనుమతించదు. వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కాకుండా మిగిలిన అన్ని పనులకు దీన్ని వర్తింపజేశారు. కూలీల పర్యవేక్షణ, వేగవంతమైన చెల్లింపులు, పథకంలో అవినీతిని తగ్గించేందుకుగాను ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. తెలుగుతో సహా ఇతర అన్ని భాషల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. నెట్వర్క్లేని చోట ఆఫ్లైన్లో హాజరు నమోదు చేసి, నెట్వర్క్రాగానే అప్లోడ్ చేయవచ్చు. నెట్వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురైతే జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్(డీపీసీ) మాన్యువల్ హాజరును ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లడం కుదరదు గతంలో కూలీలు ఇలా వచ్చి గంటసేపు పనులు చేసుకుని తిరిగి వెళ్లిపోయేవారు. కొద్దిసేపు ఉపాధి పనులు చేసుకుని వెళ్లాక, ఉదయం 11 నుంచి 12 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఎన్ఎంఎంఎస్ విధానంతో కూలీ పనులకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఉపాధికూలీల హాజరు శాతం 30% వరకు మాత్రమే ఉంటోంది. పనులు చేశాక గ్రూప్ఫొటో ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు ఉదయం పూట వ్యక్తిగత ఫొటో తీస్తారు. నాలుగు గంటలు గడిచాక కూలీలందరినీ కలిపి గ్రూప్ఫొటో తీస్తారు. ఒక బృందంలో పదిమంది వరకు కూలీలు ఉంటారు. ఉదయం 8 గంటలకు పనులకు వెళ్లేవారు మధ్యాహ్నం 12 గంటల వరకు పని ప్రదేశంలోనే ఉండాలి. అనంతరం గ్రూప్ఫొటో దిగి వెళ్లాలి. ఒకరి స్థానంలో బదులు ఉండదు ఈ విధానంలో ఒకరికి బదులు మరొకరు పనిచేసే అవకాశం ఉండదు. ఇంతకుముందు జాబ్కార్డు కలిగి ఉన్న వారిలో ఒకరికి బదులు మరొకరు వచ్చినా హాజరు పడేది. భార్య బదులు భర్త, భర్త బదులు భార్య లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చినా హాజరు వేసేవారు. ఎన్ఎంఎంఎస్ విధానంలో ఇది అసలే కుదరదు. ఐరిస్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో నమోదవుతుంది. జహీరాబాద్ మండలంలో గతేడాది ఏప్రిల్లో ఉపాధి కూలీల హాజరు రోజుకు 2,200 వరకు ఉండేది. ప్రస్తుతం ఇది 900 మందికి పడిపోయింది. మండలంలోని అర్జున్నాయక్ తండా, హుగ్గెల్లి తండాల్లో కూలీలు ఉపాధి పనులకు అసలుకే వెళ్లడం లేదు. ఆనెగుంట గ్రామంలో ఈ విధానం రాక ముందు ప్రతీనిత్యం 300 మందికి పైగా పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం 89 మంది వరకు మాత్రమే వెళుతున్నారు.అవగాహన కల్పిస్తున్నాం ఉపాధి కూలీలకు ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. గతంలో మాదిరిగానే పనులకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. పని ప్రదేశంలో నిబంధనల మేరకు నాలుగు గంటల పాటు ఉండాల్సిందే. తమ సిబ్బందితో గ్రామాల్లో కూలీలకు అవగాహన కల్పించి పనులకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నాం. క్రమంగా వారు ఈ విధానానికి అలవాటు పడతారు. –అశోక్కుమార్, ఏపీఓ, జహీరాబాద్ -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తెలిపారు. సోమవారం రామచంద్రాపురం డివిజన్లో క్షేత్రస్థాయిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాయసముద్రం చెరువును సందర్శించారు. చెరువు అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాకతీయనగర్ కాలనీలోని థీమ్ పార్కును సందర్శించారు. కాలనీవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 76వార్డులలో ప్రతివారం కాలనీలోని సమస్యను తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ ఉపకమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ కార్పొరేటర్ బి.పుష్ప తదితరులు పాల్గొన్నారు.సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం
సంగారెడ్డి క్రైమ్: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... అందోల్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి భాగ్యమ్మ (52), భర్త సత్యనారాయణతో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని నలందనగర్లో కుండలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అత్తా, కోడలు మధ్య గొడవలు జరిగాయి. క్షణికావేశంలో ఆదివారం రాత్రి మనస్తాపం చెందిన భాగ్యమ్మ ఇంట్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబీకులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో డోజర్ ఓనర్.. చిన్నశంకరంపేట(మెదక్): వెంచర్లో డోజర్ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగి పోలీసుల వివరాల మేరకు... మాసాయిపేట మండలం రామాంతపూర్ తండాకు చెందిన లకావత్ రాజు(30) వెంచర్లో డోజర్ వర్క్ చేశాడు. రెండేళ్లుగా డబ్బుల కోసం తిరుగుతున్నా రేపుమాపు అంటూ తిప్పుతున్నారు. సోమవారం కూడా డబ్బుల కోసం రాగా సరైన సమాధానం రాకపోవడంతో మనస్తాపంతో వెంచర్లోనే చెట్టుకు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంచర్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
డీజిల్ కోసం క్యూలో డబ్బాలు
● ఇబ్బంది పడుతున్న వాహనదారులు ● వరికోత మెషీన్లకు డీజిల్ కొరత హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి క్రైమ్: డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందుల గురవుతున్నారు. వరికోతలు ప్రారంభం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడింది. హత్నూర పెట్రోల్ బంకులో వివిధ గ్రామాలకు చెందిన రైతులు వాహనదారులు సోమవారం డబ్బాలను డీజిల్ కోసంలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలో పెట్టారు. ప్రస్తుతం దౌల్తాబాద్, మల్కాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్, తదితర పట్టణాల గ్రామాలలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటం వల్ల ఒక్కసారిగా హత్నూరలోని పెట్రోల్ బంకుకు వాహనదారులు క్యూ కట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో వరికోతలు జోరుగా ఉండటంతో ప్యాడీ హార్వెస్టర్లకు పెద్ద ఎత్తున డీజిల్ అవసరం పడుతోంది. అయితే డీజిల్ కొరత ఏర్పడటంతో వరికోత యంత్రాల యజమానులు ఆందోళన చెందుతు న్నారు. డీజిల్ దొరకకుంటే వరికోతలు ఆగిపోతాయని రైతులు వాపోతున్నారు. ఆటోవాలాలు సైతం డీజిల్ కొరతతో వాటిని ఇంటిపట్టునే ఉంచాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు డీజిల్ కొరత లేకుండా చూడాలని పలు గ్రామాల రైతుల కోరుతున్నారు. సంగారెడ్డిలో పెట్రోల్ కోసం బారులు పట్టణంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలైన కంది, మల్కాపూర్, పెద్దపల్లి, తదితర పట్టణాల, గ్రామాల్లోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుకు వాహనదారులు బారులు కట్టారు. -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మానెపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జాల రాజయ్యకు జాల నర్సమ్మ(50), నాగమణి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నర్సమ్మకు భర్త, నాగమణితో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పొలం అమ్మకం విషయంలో తరచూ దాడి చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో ఉండే రెండో భార్య నాగమణి మానెపల్లికి రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, రాజయ్య తన మొదటి భార్య కూతురు లావణ్య భర్తకు ఫోన్ చేసి చెప్పాడు. ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నర్సమ్మ తన ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించింది. తన తల్లి నర్సమ్మను తండ్రి రాజయ్య, చిన్నమ్మ నాగమణి హత్య చేశారని మృతురాలి కూతురు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావిలో యువకుడి మృతదేహం.. జోగిపేట(అందోల్): పట్టణ శివారులోని బావిలో సోమవారం యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన మేసీ్త్ర పనిచేసుకునే భరత్ (40) హైదరాబాద్లో మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం అతడు స్వగ్రామమైన జోగిపేటకు వచ్చి పనులు చేసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి సోమవారం బావిలో శవమై తేలాడు. మృతుడి కడుపుపై గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికి తీసి జోగిపేట ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.భర్త, రెండో భార్య కలిసి హత్యచేశారని ఆరోపణలు -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ‘గజ్వేల్’
గజ్వేల్రూరల్: కరాటేలో గజ్వేల్ విద్యార్థులకు గిన్నిస్ రికార్డ్లో స్థానం లభించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈనెల 26న గిన్నిస్ ప్రపంచ రికార్డ్ లార్జెస్ట్ కరాటే డిస్ప్లే నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో కటా విభాగంలో గజ్వేల్కు చెందిన 18 మంది విద్యార్థులు భాగస్వాములైనట్లు నిర్వా హకులు సోమవారం పేర్కొన్నారు. గతేడాది చైన్నెలో 864 మంది విద్యార్థులతో ఉన్న గిన్నిస్ రికార్డును ఈ యేడాది గచ్చిబౌలి స్టేడియంలో 2200 మంది విద్యార్థులు బ్రేక్ చేసినట్లు తెలిపారు. కాగా గిన్నిస్ రికార్డ్లో భాగస్వాములైన కరాటే విద్యార్థులను క్రీడాభిమానులు అభినందించారు. వసంతకు జాతీయ అవార్డు హుస్నాబాద్: పట్టణానికి చెందిన రచయిత్రి ఇంజపురి వసంత రాసిన వసంత వల్లరి తెలుగు గజల్ సంపుటికి వీ.జీ.ఎఫ్ జాతీయ అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీ.జీ.ఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి పండిట్, కార్యదర్శి బిక్కి కృష్ణ ఆమెకు జాతీయ అవార్డును అందజేశారు. జాబేర్ పాషకు జాతీయ పురస్కారం కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రముఖ కవి డాక్టర్ రాధేయ ఆధ్వర్యంలో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డుల ప్రదానోత్సవం అనంతపురంలోని ప్రభుత్వ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన యువకవి జాబేర్ పాష ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇటీవల ఆయన వెలువరించిన అగరు ధూపం, ఊదు పొగ కవితా సంపుటికి గాను ఈ పురస్కారం దక్కింది.ఈ సందర్భంగా కవికి రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. వ్యక్తి అదృశ్యంటేక్మాల్(మెదక్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండలంలోని తంప్లూర్లో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్కానిస్టేబుల్ దేవీదాస్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు(36)కు పదేళ్ల క్రితం అనితతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహులు నెల రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. 10రోజుల క్రితం నర్సింహులు తన భార్య అనితకు ఫోన్ చేసి నేను హైదరాబాద్లో ఉన్నానని, నాఫోన్ పోయిందని.. వేరోక నంబర్తో ఫోన్ చేసి చెప్పాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధంచేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటన మాసాయిపేట మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... గౌతమీ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సుకు మెదక్లో మరమ్మతులు చేయించుకొని హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మాసాయిపేట శివారులో బస్సులో మంటలు రావడంతో డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. సమాచారం అందుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ , చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందితో మంటలను ఆర్పివేయించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మోతాదుకు మించి వాడొద్దు
వట్పల్లి(అందోల్): మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని పోసానిపేటలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల వాడకం తగ్గింపు, సమతుల్య ఎరువులు, సాగునీటి పొదుపు, సేంద్రియ వ్యవసాయ విధానం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాల రశీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డా.వి హేమలత, డా.ఎ.నిర్మల, డా.కే అరుణ, డా.పి.శ్రీ రంజిత, డా.ఎస్ శ్రీదేవి, డా.ఎండీ లతీఫ్ పాష, వ్యవసాయ సహాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యసాయాధికారి శ్రీహరి, ఏఈఓలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల వాడకంపై అవగాహన జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ -
మాదకద్రవ్యాల బారిన పడొద్దు
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మాదకద్రవ్యాలు, బాలల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏహెచ్టీయూ, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ప్రసాద్రావు, షీ టీం ఎస్ఐ పూలబాయి, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి పాల్గొన్నారు. కాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఎస్పీ పరితోష్ పంకజ్ -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
జహీరాబాద్ టౌన్: పట్టణంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ సమీపంలో గల పాత ఆర్టీఏ చెక్పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్నాటక బీదర్కు చెందిన జంతే అభిషేక్, కాంబ్లే ఆకాశ్తో పాటు మరో ఇద్దరు మైనర్లు బైక్పై వెళ్తూ.. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. బైక్ డాక్యుమెంట్ కోసం విచారించగా దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఈ నెల 7,8 తేదీల్లో పట్టణంలో నాలుగు వాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. బైక్లను స్వాధీనం చేసుకొని, నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బైకులను యజమానులకు ఇచ్చినట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ నర్సింహులు, అస్లాం, ఓందేవ్, పృథీరాజ్లను అభినందించారు. నాలుగు బైకులు స్వాధీనం -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఎనిమిది శాఖల జిల్లా ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం!సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగనుంది. దాదాపు నాలుగేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న సుమారు ఎనిమిది మంది జిల్లా అధికారులకు ఈసారి బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులు కాగా, నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీలు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా శాఖలు, కార్యాలయాల్లో జరుగనున్న బదిలీలు 40% మించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఈనెల 21న జీఓ జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జిల్లాలో సుమారు ఎనిమిది శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగుతుందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. బదిలీలు అయ్యే అవకాశం వీరికే బదిలీలు అయ్యే అవకాశం ఉన్న అధికారులను పరిశీలిస్తే..బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేశ్రెడ్డి, జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ అంబిక, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం, సర్వే, ల్యాండ్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ ఈనేష్ తదితరులకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు జిల్లాలోనే పనిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు ఒకరిద్దరికి కూడా బదిలీలు జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న అధికారులకు కూడా ఈ బదిలీల నుంచి మినహాయింపు ఉండనుంది. -
రెండు గ్రామాల మధ్య ఘర్షణ
హత్నూర (సంగారెడ్డి): రెండు గ్రామాల మధ్య కూరగాయల సంత తైబజార్ వేలం చిచ్చు రేపింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని కాసాల – దౌల్తాబాద్ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. దౌల్తాబాద్ గ్రామానికి సంబంధించి తైబజార్ వేలంను నూతనంగా దక్కించుకున్న వారు సంతలో తైబజార్ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాసాల గ్రామస్తులు అడ్డు తగలడంతో రెండు గ్రామాల ప్రజల మధ్య వివాదం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ శివారు దాటి కాసాల గ్రామ రెవెన్యూ పరిధిలో తైబజార్ వసూలు చేయకూడదని కాసాల గ్రామస్తులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా కాసాల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఇరు గ్రామాల మధ్య తైబజార్ సమస్య రగులుతుందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే దౌల్తాబాద్ ప్రజా ప్రతినిధులు, స్థానికులు మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి తైబజార్ వేలం వసూలు చేస్తున్నామని, కావాలనే కాసాల గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వాగ్వాదానికి దారి తీసిన తైబజార్ -
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● పరీక్ష నిర్వహణపై సమీక్ష ● పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మే 3వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు 2,772 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యా హ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులు, సెంటర్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీవో, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో గుడిసె, ధాన్యం దగ్ధం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని మిన్పూర్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నివాస గుడిసె, అందులో ఉన్న మేకలతో పాటు పక్కన ఆరబోసిన ధాన్యం కాలిపోయి సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. వివరాలు ఇలా... ప్రమాదవశాత్తు మొదట పూరి గుడిసె, రేకుల షెడ్డుకు నిప్పంటుకోగా ,అందులో ఉన్న నాలుగు మేకపిల్లలు, రూ.లక్ష నగదు దగ్ధం అయినట్లు బాధితుడు గోదారి సాయిలు తెలిపారు. గుడిసె పక్కన హనుమంతు అనే వ్యక్తి ధాన్యం ఆరబోయగా మంటలంటుకొని సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. స్వీట్హౌస్ యజమానిపై కేసు నమోదు నర్సాపూర్ రూరల్: గడువు దాటిన థమ్స్అప్ విక్రయించిన ఘటన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా... శివాలయం వీధిలో నివాసం ఉండే కంది హరిబాబు నర్సాపూర్ బస్టాండ్ హనుమాన్ ఆలయం సమీపంలోని ఓ స్వీట్ హౌస్లో 1 లీటర్ థమ్స్అప్ కొనుగోలు చేసి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అంతా కలిసి తాగేందుకు మూత ఓపెన్ చేసి హరిబాబు ముందుగా కొంత తాగాడు. టేస్ట్లో తేడా ఉండటంతో గడువు తేదీని పరిశీలించగా గత ఏడాది 2025 సెప్టెంబర్ 15తో గడువు తేదీ కనిపించింది. ఈ విషయమై వెంటనే స్వీట్ హౌస్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా తమకు పట్టనట్లు వ్యవరించడంతో బాధితుడు 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారించగా గడువు దాటిన థమ్స్అప్ విక్రయించిన స్వీట్హౌస్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు హరిబాబు మాట్లాడుతూ.. ఇంకా పిల్లలకు తాగిస్తే ఏమై ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశాడు. పటాన్చెరు టౌన్: ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు గోపాల్ యాదవ్ను నియమించినట్లు రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాజు గోపాల్ యాదవ్ మాట్లాడుతూ... ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై విశ్వాసాన్ని ఉంచి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు మెంబర్ రాజు ముదిరాజ్, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: మిల్లి అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత టైలరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని అజాంపురా వీధిలో గల మైనారిటీ ఫంక్షన్ హాలులో మౌలానా జావేద్ అలీ హుస్సామీ ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహిళలు టైలరింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకొని శిక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా జావేద్ అలీ, ఎంఎంఏ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఉమర్ ఖాన్, డాక్టర్ సూఫీ షుజాత్ అలీ, జనాబ్ మీర్ జఫరుల్లా తాహిర్, ముఫ్తీ డాక్టర్ మీర్ ఆబిద్ అలీ, ముఫ్తీ సాబిర్ , ఆరిఫ్ అంజద్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన పశువుల కాపరి పనికి వెళ్లే రమేశ్(48) రెండు రోజులుగా కనిపించట్లేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. రుద్రారం పెద్ద చెరువులో ఆదివారం మృతదేహం తేలడంతో బయటికి తీయించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్పేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎర్ర అశోక్ (30) నాగిరెడ్డిపేట మండలం మాలతుమ్మెద నుంచి యూసుఫ్పేటకు ఐదేళ్ల క్రితం ఇళ్లరికం వచ్చాడు. భార్య లక్ష్మి, కొడుకుతో జీవిస్తున్నాడు. శనివారం బయటకు వెళ్లిన అతడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఇలా తిరిగితే ఎలా అంటూ భార్య నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన అశోక్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతన్ని అంబులెన్స్లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
కాలుష్య జలాలపై పోరాటానికి సిద్ధం
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజిపల్లి ధర్మ చెరువు పరిరక్షణకు గ్రామస్తులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఆదివారం గ్రామస్తులు అంతా సమావేశం ఏర్పాటు చేసుకొని కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటానికి తీర్మానం చేశారు. ఇటీవల చెరువులో రసాయన వ్యర్థ జలాలు చేరడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. గండి చెరువు ఎఫ్టీఎల్ తగ్గించడం, వ్యర్థ జలాల విడుదలపై ఇరిగేషన్, సనత్నగర్ పీసీబీ కార్యాలయంలో ఫిర్యాదు, జీఎంఆర్ కాలనీకి మంచినీటి సరఫరాకు తీర్మానించారు. చెరువులు, పంట పొలాలను పరి రక్షించేందుకు సాగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ భార్గవ్, నాయకుడు దండే రమాకాంత్, గ్రామస్తులు సత్తయ్య, భీమయ్య, జనార్దన్, శ్రీను, శ్రావణ్, నాగరాజు, వీరయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
హెచ్చరిక బోర్డులేవీ?
మిరుదొడ్డి(దుబ్బాక): ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకుండా ఉన్న మిరుదొడ్డి – ధర్మారం రోడ్డు ఇప్పుడు హడలెత్తిస్తోంది. తరచూ మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఏ మాత్రం ఆదమర్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చేరి లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికి పోతున్నారు. ధర్మారం నుంచి ఆరెపల్లి, లక్ష్మీనగర్ చౌరస్తా మీదుగా మిరుదొడ్డి వరకు నాలుగు మూల మలుపులు ఉన్నాయి. వీటి వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పాటు, రోడ్డు కిరువైపులా చెట్లు కమ్మేయడంతో ఎదరుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కొన్ని ఘటనలు.. ● గత ఏడాది క్రితం సిద్దిపేటకు చెందిన సోహెల్ అనే స్టేట్ బాడీ బిల్డర్ బైక్పై ధర్మారం నుంచి మిరుదొడ్డికి వస్తున్న క్రమంలో ఆరెపల్లి శివారులోని మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోహెల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● ఇటీవల మండల పరిధిలోని లింగుపల్లి గ్రామానికి చెందిన గంగయ్య ధర్మారం–మిరుదొడ్డి చౌరస్తాలో రోడ్డు దాటుటుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ● లక్ష్మీనగర్ చౌరస్తా శివారులోని మూల మలుపు వద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మెగా కనన్స్ట్రక్షన్లో ఇంజనీరింగ్ విధులు నిర్వహిస్తున్న ఎన్సాన్పల్లికి చెందిన వెంకటేశ్ గౌడ్ బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ● అల్వాల గ్రామానికి చెందిన ఎండీ. హనీఫ్ అనే ఎలక్ట్రీషియన్ ఆరెపల్లి శివారులో బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో తన కుడి కాలును పొగొట్టుకొని తన జీవనాధారం కోల్పోయాడు. దీంతో చికిత్స చేయించుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి సుమారు రూ.10 లక్షల అప్పులు చేసి ప్రస్తుతం దినదిన గండంగా బతుకీడుస్తున్నాడు.మూల మలుపుల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా.. ఎలక్ట్రీషియన్గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో మిరుదొడ్డి నుంచి ధర్మారం మీదుగా దుబ్బాకకు ఆటోలో వెళ్తున్నాను. ఆరెపల్లి శివారు మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో నా కుడి కాలు నుజ్జునుజ్జయింది. పక్కటెముకలు విరిగాయి. ప్రాణాలకు ముప్పుగా మారుతుందని చెప్పిన వైద్యులు నా కుడి కాలును పూర్తిగా తొలగించారు. దీంతో ఉపాధి కూడా కరువై.. కుటుంబాన్ని పోషించే స్తోమత లేకుండా పోయింది. – ఎండీ. హనీఫ్, అల్వాల -
బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
ఆమనగల్లు: ఓ మహిళను రుణం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించిన దొంగ పోలీసులకు చిక్కాడు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన ముగురాల రాజేందర్గౌడ్ అలియాస్ రాజు అలియాస్ గోలి శివ పాత నేరస్తుడు. ఈనెల 21న నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన ఓ మహిళకు రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. తన బైక్పై ఎక్కించుకుని ఆమనగల్లు సమీపంలోని చింతలపల్లి సరిహద్దులో ఆమెను బెదిరించి మెడలో ఉన్న రూ.31 వేల విలువైన బంగారు ఆభరణాన్ని లాక్కున్నాడు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అక్రమ పార్కింగ్పై చర్యలేవీ?
జిన్నారం (పటాన్చెరు): రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలుపడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్ విల్స్ పరిశ్రమకు చెందిన వాహనాలు రోడ్డుపైనే పార్క్ చేయడంతో ప్రయాణికులు వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ అక్రమ పార్కింగుతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. పరిశ్రమ తీరు మారకపోవడమే కాకుండా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అక్రమ పార్కింగుపై చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
బస్సును ఢీకొట్టిన డ్రిల్లింగ్ వాహనం
నర్సాపూర్: స్థానిక బస్టాండులోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బోరు డ్రిల్లింగ్ వాహనం ఆదివారం ఢీకొట్టింది. వివరాలు ఇలా... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్ నుంచి సంగారెడ్డి వెళ్తూ స్థానిక బస్టాండులోకి వెళ్తేందుకు టర్న్ అవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బోరు డ్రిల్లింగ్ వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బస్సు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పలు చిరు వ్యాపారుల దుకాణాలు , పార్కు చేసిన బైక్లను ఢీకొట్టడంతో అవన్నీ ధ్వంసమయ్యాయి. గాయాలైన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డిని వివరణ కోరగా.. ప్రమాదం జరిగిన సమాచారం రాగానే తమ సిబ్బందిని పంపినట్లు చెప్పారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
గోదావరి జలాలు విడుదల చేయాలి
గౌరారం రైతుల వినతివర్గల్(గజ్వేల్): ఎండుముఖం పడుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయాలని మండలంలోని గౌరారం రైతులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సంగారెడ్డి కెనాల్ గౌరారం వద్ద కాలువలో అడుగంటిన నీటిని చూపుతూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం గోదావరి జలాల ఆశతో వివిధ పంటలు సాగుచేశామని, వరిపైరు పొట్టదశకు చేరిందన్నారు. ఈ కీలక తరుణంలో కాలువలో నీళ్లు అడుగంటి ఎండిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వం గోదావరి జలాలు విడుదల చేసి సాగుచేసిన పంటలు ఎండిపోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌరారం సర్పంచ్ కనకరాజుగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకర్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు, యూ టర్న్ చేస్తున్న వాటర్ ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు కథనం ప్రకారం.. మెహిదీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి శంకర్పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. జన్వాడ గ్రామ శివారులోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రాగానే.. ఓ వాటర్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటోంది. అతి వేగంతో ఉన్న బస్సు ట్యాంకర్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్ రవీందర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ ఇంజన్ని పిలిపించారు. గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ భాగాన్ని తొలగించి, డ్రైవర్ని బయటకు తీశారు. డ్రైవర్ కాలు విరగ్గా, కండక్టర్ ముక్కుకి, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం నార్సింగిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుడికి గాయాలు -
క్యూఆర్టీ టీం అలర్ట్.. దొంగ అరెస్ట్
పాపన్నపేట(మెదక్): చిన్నారి కాళ్ల కడియాలు దొంగతనం చేస్తున్న సమయంలో గమనించిన క్యూఆర్టీ టీం వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకొని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఏడుపాయల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏడుపాయల దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఖాజిపల్లికి చెందిన స్వప్న, మహిపాల్ దంపతులు తమ కూతురు రేవతితో కలిసి వచ్చారు. వారు దుకాణంలో కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ సమయంలో వారి చిన్నారిని పక్కకు తీసుకెళ్లిన అగంతకుడు, బుజ్జగిస్తూ కాళ్ల కడియాలు దొంగిలించాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీం సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొదట తనకు ఏమి తెలియదని బుకాయించాడు. గట్టిగా నిలదీయడంతో దుస్తుల్లో దాచుకున్న వెండి కడియాలను అప్పగించాడు. వెంటనే నిందితున్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. -
పేదల సొంతింటి కల సాకారం
● కూటిగల్ స్తూపానికి నిధుల మంజూరు ● భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి మద్దూరు(హుస్నాబాద్): సీఎం రేవంత్రెడ్డి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాపాలనలో నిలువనీడలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతో దోహద పడుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూటిగల్ గ్రామం నుంచి 28 మంది అమరులయ్యారని, వారి జ్ఞాపకార్థంగా ఉన్న అమరవీరుల స్తూపం అభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండల్రెడ్డి, జాలపల్లి సర్పంచ్ కమలాకర్ యాదవ్, సర్పంచ్లు బాలకృష్ణ, కనుకచంద్రం, రూపేష్, జిల్లా నాయకులు రఘువీరారెడ్డి, మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
హ్యాకథాన్లో సత్తా చాటిన సిద్దిపేట
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముస్కాన్ డ్రీమ్స్ క్రియేటివ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెల్స్ ఫార్గో సహకారంతో హైదరాబాద్లో కేశవ మెమోరియల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అంతర్ జిల్లా ఏఐ సాక్ష్యం హ్యాకథాన్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయని, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును దామరకుంట ప్రభుత్వ పాఠశాల, బెస్ట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో చిన్నకోడూర్, బెస్ట్ ఎఫెక్టీవ్ కమ్యూనికేషన్లో చంద్లపూర్ ప్రభుత్వ పాఠశాలలు ఎంపికై నట్లు శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో సుమారుగా 120 పాఠశాలలకు 10 ఉన్నత పాఠశాలలు ఎన్నికై నట్లు తెలిపారు. చిన్నకోడూర్ విద్యార్థులు రైతులు పొలానికి నీటిని పారించే విధానం, చంద్లపూర్ విద్యార్థులు ఫేక్ డీప్ వీడియోలు అండ్ పిక్చర్స్ వల్ల వచ్చే నష్టాలు, దామరకుంట విద్యార్థులు కూరగాయలను రైతులు సులభంగా ఏ విధంగా సేకరించాలో వివరించారు. కార్యక్రమంలో ప్రతి పాఠశాల విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలు, క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్, క్రిటికల్ థింకింగ్, ఊహాత్మక నైపుణ్యాలు ద్వారా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. -
ప్లాస్టిక్ పూలపై నిషేధం
కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయంసంగారెడ్డి జోన్: పర్యావరణ పరిరక్షణ, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ ధర, ఎక్కువ కాలంపాటు ఆకర్షణీయంగా కనిపించడంతో ప్లాస్టిక్ పూల వినియోగం పెరిగింది. ఫలితంగా సహజపూలకు డిమాండ్ తగ్గడంతోపాటు విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే మార్కెటింగ్ శాఖ ఏప్రిల్లో పూల విక్రయాలను నిషేధించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ పూలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ పూలు విక్రయిస్తే సంబంధిత దుకాణదారుడుకి జరిమానా విధించడంతోపాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పేర్కొంది. సహజ పూలసాగుకు ప్రోత్సాహం ప్లాస్టిక్ వల్ల సహజంగా పూలు సాగు చేసే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండటంతో కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పడిపోతుంది. అయితే పూల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధంతోపాటు పర్యావరణహితమైన పూల సాగుకు ప్రోత్సాహకరంగా సబ్సిడీలను అందజేస్తోంది. గతేడాది జిల్లాలో 200 ఎకరాల విస్తీర్ణంలో పూలు సాగు చేసిన రైతులకు ప్రోత్సాహకాలను అందించింది. నిషేధం అమలయ్యేనా? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దంటూ నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం పెరగటం, నిషేధం అమలు కాగితాలకే పరిమితమైపోవడంతో అనుకున్న లక్ష్యం కాస్తా నీరుగారిపోయింది. పూల విక్రయాల నిషేధం కఠినంగా అమలు చేసి, సహజంగా పూలు సాగుచేసిన రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
సకాలంలో బిల్లులు అందించాలి
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ డీఈఈ, డివిజన్ పరిధిలోని ఏఈలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, పూర్తయిన, వివిధస్థాయిల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, బిల్లుల చెల్లింపు వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్నవాటిని పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందిస్తూ త్వరగా పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమెల్యే ఆదేశించారు. వైభవంగా జాతర ఉత్సవాలు ఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామంలో భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆకుల లింగాపూర్ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. జాతర, కల్యాణోత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విద్యతో ఏదైనా సాధ్యమే
న్యాల్కల్(జహీరాబాద్): క్రమశిక్షణ, పట్టుదలతోపాటు చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని మంత్రి వివేక్ అన్నారు. మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ...నాడు అంబేడ్కర్కు జరిగిన వివక్షతవల్ల చదువుకు దూరమై ఉంటే నేడు రాజ్యాంగం నిర్మాతగా ఉండే వారు కాదన్నారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేడ్కర్ చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. రాంతీర్థ్ నుంచి హద్నూర్ వరకు రోడ్డు బాగు చేయించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఎంపీ సురేశ్ కుమార్షెట్కార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని 140 కోట్లమంది నడుచుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలం సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు అందులో వివేక్ పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనూస్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ అందరివాడు జహీరాబాద్ టౌన్: బీఆర్ అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి లేదా ఒక జాతికి సంబంధించిన వారు కాదని ఆయన అందరివారని మంత్రి వివేక్ అన్నారు. మొగుడంపల్లి మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ప్రతిష్టించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప మానవీయ విలువలను బోధించారన్నారు. -
విస్తరణకు మోక్షం ఎప్పుడో!
● అధ్వానంగా జహీరాబాద్–బీదర్ రోడ్డు ● తరచూ ప్రమాదాలు.. గుబులు పుట్టిస్తున్న ప్రయాణం ● పట్టించుకోని అధికారులు జహీరాబాద్–బీదర్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రద్దీగా ఉండే రహదారి ఇరుకుగా ఉండటంతోపాటు అడుగడునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటక రాష్ట్ర పరిధిలోకి వచ్చే రోడ్డును అక్కడి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టి వేగ నిరోధకాలు, ప్రమాద సూచికలను, రేడియం బోర్డులను ఏర్పాటు చేయగా ఇక్కడ ప్రభుత్వం మాత్రం విస్తరణపనులు చేపట్టటం అటుంచి కనీసం మరమ్మతు పనులైనా చేపట్టలేదు. – జహీరాబాద్ టౌన్: పట్టణం సమీపంలో గల చౌరస్తా నుంచి కర్ణాటకలోని బీదర్ పట్టణం వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడువునా జహీరాబాద్–బీదర్ రహదారి సాగుతుంది. రాష్ట్ర సరిహద్దు వరకు గల 19 కిలోమీటర్ల రోడ్డు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రాగా సుమారు 13 కి.మీ కర్ణాటకలోని బీదర్ పరిధిలోకి వస్తుంది. చౌరస్తా నుంచి కర్ణాటక సరిహద్దు వరకు గల తెలంగాణలోని రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గతేడాది నుంచి రోడ్డు ప్రమాదాల వల్ల కనీసం 10 మంది మృత్యువాత పడగా 25 మందికి గాయాలయ్యాయి. ఆర్అండ్బీ పరిధిలో ఉన్న రోడ్డును నేషనల్ హైవే అథారిటీకి బదలాయించిన తర్వాత రెండు శాఖల అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలోనే ఈ రోడ్డును ఎన్హెచ్ఏ వారికి బదలాయించామని, రోడ్డు మరమ్మతుల గురించి వారే చూసుకోవాలని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఎన్హెచ్ఏ అఽధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోతుండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.నేషనల్ హైవే అథారిటీకి బదలాయింపు జహీరాబాద్–బీదర్ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ. కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఉన్న రోడ్డులో నిత్యం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిగా గుర్తించి ఫోర్లైన్గా విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వెంటనే ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్ హైవే అథారిటీకి బదలాయించారు. ఏళ్లు గడుస్తున్నా రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయకపోవడంతో విస్తీర్ణం పనుల్లో జాప్యం జరుగుతోంది. -
ఘనంగా రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు
సంగారెడ్డి: రేణుక ఎల్లమ తల్లి నాలుగో వార్షికోత్సవం చౌటకూరులో ఆదివారం ముగిశాయి. ముగింపు రోజైన ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు పోసానిపల్లి, సరాప్పల్లి, సుల్తాన్పూర్, ఉప్పరిగూడెం, కోర్పోలు తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి సుభాష్రెడ్డి, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్, సర్పంచ్ పార్క్ల రాంరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి జోన్: జిల్లా నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన ప్రావీణ్య ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేకాధికారిగా బదిలీ అయ్యారు. నారాయణపేట కలెక్టర్గా పనిచేసిన ప్రతీక్జైన్ను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయటంతో కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్కు వచ్చిన ప్రతీక్జైన్కు అదనపు కలెక్టర్ మాధురి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆకట్టుకుంటున్న హస్తకళ మేళాసంగారెడ్డి: సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో అఖిలభారత, హస్తకళా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో ఆయుర్వేద ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తులు, వన్ గ్రామ్గోల్డ్ ఉత్పత్తులు, కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్ హైదరాబాద్ మంచి ముత్యాలు, మైసూర్ రోజ్హుడ్, సహార న్ పూర్ ఫుడ్ కార్వింగ్ వరంగల్ చెవర్, జూట్ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూరీ బ్యాక్స్లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూ రు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్, పట్టువస్త్రాలు, టవల్స్, చేనేత దుప్ప ట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్ కూడా అమ్మకానికి ఉంచారు. ఆదివారం సెలవు రోజు కావడంతో టీటీడీ కల్యాణ మండపం కళకళలాడింది. దుర్గమ్మా.. దీవించమ్మాపాపన్నపేట(మెదక్): ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు చేపట్టారు. ఫుట్బాల్ పోటీల్లో రాణించాలిగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ గరల్స్ ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. మహనీయులను మరవొద్దు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసు కోవడం శుభపరిణామమన్నారు. మహనీయు లు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహ నీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవు లు, కళాకారులు, మేధావులు, అభిమానులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. -
ఘనంగా వాసవీమాత జయంతి
సంగారెడ్డి/ సంగారెడ్డి జోన్/జోగిపేట(ఆందోల్): రాష్ట్ర ప్రభుత్వం వాసవీకన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఆదివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు తోపాజిఅనంత్ కిషన్, పూర్ణచందర్, నామా భాస్కర్, జూలకంటి మల్లేశం, పుల్లూరి ప్రకాష్, చందా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవీకన్యకాపరమేశ్వరి జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంగారెడ్డి తహసీల్దార్ జైరాం నాయక్ అమ్మవారికి పూజలో పాల్గొన్నారు. జోగిపేటలో... జోగిపేట పట్టణంలో వాసవీకన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో ఆర్యవైశ్య సంఘం నుంచి మధ్యరంగం, గౌని, పోచమ్మ గుడి, హనుమాన్ చౌరస్తా, బసవేశ్వరుని విగ్రహం మీదుగా వాసవీ కళ్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. మహిళలు కలశాలు పట్టుకుని ఒకే రంగు చీరలను ధరించి అమ్మవారిని ఊరేగించారు. పోలీసు కార్యాలయంలో... సంగారెడ్డి జోన్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఐలు డానియెల్, రాజశేఖర్రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ధ్యేయం
కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. కల్హేర్, కృష్ణాపూర్, మార్డిలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం విక్రయించేందుకు నాణ్యత పాటించాలన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. మార్డిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివశ్రీనివాస్, ఏపీఎం వంశీకృష్ణా, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి, సర్పంచ్లు కొడి గంగారం, గోవింద్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎస్సైకు రివార్డుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఎకై ్సజ్ ఎస్సై మురళీ ఉన్నతాధికారుల నుంచి రివార్డు అందుకున్నారు. గతేడాది అక్టోబర్లో గోవా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 47 కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. ఆయన సేవలను గుర్తించి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ షానవాజ్ ఖాసీమ్ మురళీకి రూ.25వేల నగదు రివార్డును అందజేసి ప్రశంసించారు. ముగిసిన శిక్షణా తరగతులున్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్లో వారంరోజులుగా నిర్వహిస్తున్న జనగణన శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్న జనగణనకు సంబంధించి రెండు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. మొదటి విడతలో 60 మంది, రెండవ విడతలో 56 మంది చొప్పున మొత్తం 116 మంది పాల్గొన్నారు. అందులో 16 మంది సూపర్వైజర్లు, 92 మంది ఎన్యూమరేటర్లు, ఎనిమిది మంది ఇతరులు శిక్షణ పొందారు. జనగణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్లో వివరాలను ఎలా నమోదు చేయాలనే విషయాలపై శిక్షకులు వెంకట్రెడ్డి అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలిసంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కో ఇన్చార్జ్ భవ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా స్థాయి సమీక్షకు జిల్లా ఇన్చార్జి అబ్దుల్ అమీర్, జిల్లా అధ్యక్షుడు నరేష్గౌడ్తోపాటు ఆమె హాజరై మాట్లాడారు. రాబోయే పరిషత్తు ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బల్వంత్రెడ్డి, వసిం, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్రెడ్డి, అక్బర్, శ్రీహరిగౌడ్, మల్లేష్యాదవ్, అసెంబ్లీ అధ్యక్షుడు వెంకట్ జింగా తదితరులు పాల్గొన్నారు. ‘పేదలు ఆత్మగౌరవంతో బతకాలి’: మంత్రి దామోదర రేగోడ్(మెదక్): పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. శనివారం మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రేగోడ్లోని లబ్ధిదారుడు మహేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. -
మలేరియాను పూర్తిగా అరికట్టాలి
● అదనపు కలెక్టర్ పాండు ● పట్టణంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీసంగారెడ్డి: మలేరియాను పూర్తిగా అరికట్టాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్, పారామెడికల్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాండు హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ... మలేరియా వ్యాధి బారినపడి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఆ వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచే పరిసరాల పరిశుభ్రత నీటి నిల్వలు ఉండకుండా చూడటం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, జిల్లా ఇన్చార్జి మలేరియా అధికారి ప్రవీణ్, జిల్లా ఆరోగ్య విద్యాధికారి శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్ మంగమ్మ, ఆరోగ్య విస్తరణాధికారి వీరేశం ఇతర వైద్య సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. -
ఎమ్మెల్యే గూడెం త్వరగా కోలుకోవాలి
గూడెం మహిపాల్రెడ్డిని పరామర్శించిన హరీశ్రావు, ఎమ్మెల్యేలుపటాన్చెరు టౌన్: ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని శనివారం సాయంత్రం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన సహచర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ...పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపనపడే మహిపాల్రెడ్డి త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాక్షించారు. గూడెంను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు బాల్రెడ్డి, మెట్టు కుమార్యాదవ్, పాండురంగారెడ్డి, విజయ్కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుల ద్వారానే కేసుల పరిష్కారం
సంగారెడ్డి టౌన్: కోర్టుల ద్వారానే కేసులు చట్టపరంగా పరిష్కారమవుతాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వివాదాలు ఉన్న వారు కోర్టులను సద్వినియోగం చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర, ఎస్పీ పరితోశ్ పంకజ్, కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ -
వనరుల దోపిడీ
గ్రామాల్లో సహజ వనరుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పొలాల గట్లు, వాగులు వంకలు, గుట్టలను గుల్ల చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. యథేచ్ఛగా కలపను తరలిస్తూ వాల్టా చట్టాన్ని అతిక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. – జహీరాబాద్ టౌన్ జహీరాబాద్ నియోజవర్గంలోని పల్లె ప్రాంతాల్లో చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతుంది. వాతావరణం కలుషితం కాకుండా మానవాళిని రక్షిస్తున్న పచ్చని చెట్లను వ్యాపారులు విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఏమాత్రం భయం లేకుండా లారీలు, ట్రాక్టర్లలో కలిపి తరలిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం టేకు, వేప, తుమ్మ, తదితర రకాల చెట్లను నరికివేయడానికి అటవీశాఖ అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. ఎవరైనా చెట్లను తొలగించాలంటే వాటి వివరాలు, సంఖ్య, వాటి వయస్సును నమోదు చేయాలి. ఒక్కో చెట్టుకు రూ.500 అటవీశాఖ పేరుతో డిపాజిట్ చేయాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతే కలపను తరలించుకోడానికి అవకాశం ఉంటుంది. రెండు మొక్కలు నాటే నిబంధన అమలేది? చెట్లను తొలగించిన తర్వాత చెట్టుకు బదులు రెండు మొక్కలను నాటాలి. మూడేళ్లపాటు వాటిని సంరక్షించాలి. అలా చేయడం వల్ల డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. కానీ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. అటవీశాఖ అధికారుల అండదండలతో యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారు. దీని కారణంగా వృక్ష సంపద అంతరించిపోతుంది. మొగుడంపల్లి. కోహీర్, జహీరాబాద్ మండలంలో వ్యవసాయ భూముల్లో పెరిగిన చెట్లను నరికివేస్తూ కలపను తరలిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల రుపాయలు ఖర్చు చేసి మొక్కను పెంచుతుంటే మరోవైపు వాటిని నరికివేస్తుండటంతో ఆ పథకం అసలు లక్ష్యం దెబ్బతింటుంది. సంబంధిత అటవీశాఖ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి చెట్ల అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.దళారులపై చర్యలు తీసుకోవాలి పచ్చని చెట్లను నరికే దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెట్ల నరికివేత కారణంగా భవిష్యత్లో కరువు కాటకాలు వచ్చే అవకాశాలున్నాయి. మొగుడంపల్లి మండలంలో అటవీప్రాంతం ఉండటంతో వ్యవసాయ పొలాలతో అటు ఫారెస్టు చెట్లను కూడా నరికివేస్తున్నారు. అధికారులు గట్టి నిఘా పెట్టి దళారులపై చర్యలు తీసుకోవాలి. – వినయ్ పవార్, మానవ హక్కుల సంఘం నాయకులువాల్టాకు తూట్లు నిర్ధాక్షిణ్యంగా చెట్ల నరికివేత యథేచ్ఛగా కలప రవాణ కళ్లుమూసుకుంటున్న అటవీ అధికారులు -
స్వచ్ఛమైన నీళ్లుఅందించాలి
● రూ.200 కోట్లతో అదనపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి ● మున్సిపల్, పబ్లిక్హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షలో జగ్గారెడ్డి, నిర్మల సంగారెడ్డి: పట్టణ ప్రజలకు ప్రతీరోజు రెండు గంటలపాటు స్వచ్ఛమైన మంచినీళ్లు అందించేందుకు రూ.200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పేర్కొన్నారు. సంగారెడ్డికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో శనివారం సంగారెడ్డిలో వీరు సమీక్ష నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించానన్నారు. నాలుగు దిక్కులా పైపులైన్లు, ట్యాంకులు, నల్లాల కనెక్షన్లు నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టిందన్నారు. మంజీరాలో ఇప్పుడున్న ఇంటెక్వెల్ స్థానంలో మరింత లోపలికి ఏర్పాటు చేసి అదనంగా టాంకుల నిర్మించాలని సూచించారు. ప్రస్తుత ప్రాజెక్ట్ వ్యయం రూ.175 కోట్లతో కొత్త ప్రతిపాదన, మంజీరా డ్యామ్ వద్ద అదనంగా రూ.25 కోట్లతో మరొక ఇంటెక్వెల్ కలిపి మొత్తం రూ.200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ..పనుల మంజూరు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పనులు పూర్తయితే సీఎం రేవంత్రెడ్డితో ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. వచ్చే నెలలో సీఎం సంగారెడ్డికి వస్తున్న నేపథ్యంలో 5 వతేదీ కల్లా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. -
కిచెన్ గార్డెన్లు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
సక్రమంగా వరి కొనుగోళ్లు చేయాలి
హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూరలోని ఐకేపీ, సొసైటీ, సిరిపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన తర్వాత వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. అవసరమున్న గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు కోరారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజశేఖర్, సొసైటీ ఈవో శ్రీనివాస్, సర్పంచ్ నల్లుల్ల ఎల్లయ్య, పలు గ్రామాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
ఉపాధి పనులకు రండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కీలక మార్పుల నేపథ్యంలో.. నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు.. కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.ఈజీఎస్ కూలీల హాజరు పెంచేందుకు టార్గెట్లు గ్రామాల వారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు వీబీజీరాంజీగా పేరు మార్పు నేపథ్యంలో కీలక నిర్ణయాలుజిల్లాల వారీగా టార్గెట్లు ఇలా.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. -
జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్ నియమితులయ్యారు. నారాయణపేట కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన్ని సంగారెడ్డికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన ప్రావీణ్య రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ బదిలీలు జరిగాయి. ప్రతీక్ జైన్ 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. పాలనపై ప్రావీణ్య తనదైన ముద్ర ప్రావీణ్య జిల్లా కలెక్టర్గా 2025 జూన్ 13న బాధ్యతలు తీసుకున్నారు. పనిచేసిన పది నెలల్లోనే ప్రావీణ్య జిల్లా పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. తరచూ సమీక్షలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపగలిగారు. అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన రెవెన్యూ శాఖను కొంతమేరకు గాడిలో పెట్టగలిగారు. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయడం, బదిలీ వేటు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్ఆర్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. ఈ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి ఈ నిధులు స్థానిక ప్రజల అవసరాలకు వినియోగం అయ్యేలా ప్రత్యేక చొరవ చూపారు.ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య -
సమ్మె వీడి.. విధుల్లో చేరి
సంబరాలు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు సంగారెడ్డి/జహీరాబాద్టౌన్: సమస్యల పరిష్కారం కోసం మూడు రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు శనివారం తిరిగి విధుల్లో చేరి బస్సులను రోడ్లెక్కించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఒప్పుకుని సమ్మె విరమణ చేయడానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో సంగారెడ్డి, జహీరాబాద్, రామచంద్రాపురం, నారాయణఖేడ్లలో కార్మికులు శుక్రవారం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఆయా డిపోల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జాక్ కన్వీనర్ పల్లె కష్ణమూర్తి, డీఎం.స్వామి, కార్మిక సంఘం నాయకులు మానిక్, నర్సింహులు, చంద్రప్ప, సుందర్రాజ్, మల్లికార్జున్, శ్రీనివాస్, హన్మయ్య,నరేందర్తోపాటు పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు వరం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య నందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ 2026–27 విద్యా సంవత్సరానికి అర్హులైన నిరుపేద గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంపికై న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు సంగారెడ్డి జిల్లాలోని సేయింట్ జోసెఫ్ హైస్కూల్, సిద్దిపేట జిల్లాలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికై న వారికి ఈ పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. జిల్లాకు 20 సీట్లు.. జిల్లాలో ప్రస్తుతం 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బాలిక విద్యను ప్రోత్సహించే క్రమంలో బాలికలకు ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది. 20 సీట్లలో 6మంది బాలికలకు కేటాయిస్తారు. మిగతా 14 సీట్లలో ఇతర విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం 3వ తరగతిలో 10 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు, 8వ తరగతిలో 5 సీట్లు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలోని గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 29 వరకు.. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు మెదక్ సమీకృత కలెక్టరేట్లోని రెండో అంతస్తులో గల గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఈనెల 29 వరకు దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. అన్ని వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును తిరిగి ఇదే కార్యాలయంలో మే 7వ తేదీ సాయంత్రంలోపు అందజేయాలి. జిల్లాలో 20 సీట్లు ఖాళీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ ఈనెల 29 వరకు దరఖాస్తుల ఆహ్వానం విద్యార్థులు మెదక్ జిల్లాకు చెందినవారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలి. దీంతోపాటు మీ సేవ నుంచి పొందిన కులం, మున్సిపల్ లేదా తహసీల్దార్తో ధ్రువీకరించిన పుట్టిన తేదీ పత్రాలు కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గత సంవత్సరం పూర్తి చేసిన తరగతి బోనఫైడ్, సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 2పాస్పోర్ట్ సైజు ఫొటోలు జతపర్చి దరఖాస్తు పూర్తి చేయాలి. -
అంబేడ్కర్ అవార్డుకు ఎంపిక
చిన్నశంకరంపేట(మెదక్): అంబేడ్కర్ జాతీయ అవార్డుకు మండలంలోని కొర్విపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రంను ఎంపిక చేశారు. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన బహుజన ఆత్మీయ సదస్సులో రామచంద్రంను అవార్డుకు ఎంపిక చేసినట్లు స్ఫూర్తి సంస్థ చైర్మన్ లయన్ డాక్టర్ రమేశ్ తెలిపారు. మెదక్ జిల్లాలో అంబేడ్కర్ సంఘం ద్వారా ఆయన ఆశయ సాధనకు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 15న హైదరాబాద్లోని సరస్వతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డును అందించనున్నారు. సంగారెడ్డి క్రైమ్: తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. అందోల్ మండలానికి చెందిన బోయిని నాగలక్ష్మి(27), తన కొడుకు అకుల్(6), భర్త అశోక్ కుమార్తో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని బృందావన కాలనీలో జీవిస్తున్నారు. ఈ నెల 20న నాగలక్ష్మిని భర్త మందలించాడు. అదే రోజు తన కొడుకును తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. చుట్టుపక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్హేర్(నారాయణఖేడ్): గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం... సిర్గాపూర్ మండలం హెమ్లానాయక్ తండాకు చెందిన చరణ్సింగ్ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేర్యాల(సిద్దిపేట): పిడుగు పాటుకు పాడిగేదె మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని తాడూరు గ్రామంలో చేటు చేసుకుంది. శుక్ర వారం స్థానికులు ,బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ర రాజిరెడ్డికి చెందిన గేదె గురువారం రాత్రి పిడుగు పాటుతో మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. కాగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఘటన సంగారెడ్డి టౌన్: జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్పూర్కు చెందిన వినోద్ (24)పై సంగారెడ్డి, జహీరాబాద్ పోలీస్ స్టేషన్లలో పలు చోరీ కేసులున్నాయి. జిల్లా కోర్టు 6 నెలల శిక్ష విధించగా 4నెలల క్రితం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. వినోద్ ఆర్వో వాటర్ ప్లాంట్లో వినియోగించే కెమికల్ను తాగానని చెప్పడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జైల్ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్తో మాట్లాడగా... వినోద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదన్నారు. సిబ్బందిని బెదిరించడానికి మాత్రమే కెమికల్ తాగినట్టు నాటకం ఆడాడని చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ అనంతరం సంబంధిత ఖైదీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచాలి
ములుగు ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డిములుగు(గజ్వేల్): హార్టికల్చర్(ఉద్యానవన)పంటల ఉత్పత్తిని పెంచడంలో, నాణ్యతను మెరుగుపరచడంలో ఇన్పుట్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుందని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలో రెండో రీసెర్చ్ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... రైతులకు వాతావరణ ఆధారిత ఆగ్రో సలహాలను అందించాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో పరిశోధన, విస్తరణ రంగాల మధ్య సమన్వయం బలోపేతం చేసి రైతులకు ఉపయోగరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేయడంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం రీసెర్చ్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో చేపట్టిన పరిశోధనల పురోగతి, మామిడి మల్పార్మేషన్ సమస్య, ప్రూట్ బ్యాగింగ్ పద్ధతులు, పాక్లోబుట్రాజోల్ ప్రభావం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ హార్టికల్చర్ౖ డెరెక్టర్ బాబు, ఐసీఏఆర్ అటారి డైరెక్టర్ షేక్ ఎన్.మీరా, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, సెరికల్చర్, ఆర్ఈసీ, బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు, మార్కెటింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా హార్టికల్చర్కు సంబంధించిన కోర్సులు, పరిశోధన, విద్యా కార్యక్రమాలు పూర్తిగా ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వీసీకి వినతి పత్రం అందజేశారు. -
జ్ఞానంతోపాటు నైపుణ్యం ముఖ్యం
జిల్లా అదనపు కలెక్టర్ పాండుసంగారెడ్డి జోన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి అంశాలు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయన్నారు. విజయం ఒక్కరోజులో సాధ్యం కాదని, నిరంతర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అఖిలేశ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, డైరెక్టర్ రాజేశ్ కుమార్, ట్రైనర్ అరవింద, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ కె. కష్ణ కుమార్ పాల్గొన్నారు. -
బామ్మర్దిపై హత్యాయత్నం
మద్దూరు(హుస్నాబాద్): పాత కక్షలు మనస్సులో పెట్టుకొని బామ్మర్దిపై బావ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నర్సాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ఆసిఫ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నెపు శివకృష్ణ అదే గ్రామానికి చెందిన శిరీషను 2015లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా కేసు నమోదైంది. పెద్ద మనుషులు సర్దిజెప్పి ఇద్దరిని కలిపారు. అయితే తనపై కేసుకు బామ్మర్ది చింతల శ్రీకాంత్ కారణమని మనస్సులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి బామ్మర్ది ఇంటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి కడుపులో పొడిచాడు. అడ్డుకోబోయిన భార్య శిరీష చేతికి గాయాలయ్యాయి. గ్రామస్తులు అడ్డుకోవడంతో శివకృష్ణ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. -
యువతా మేలుకో.. గ్రామాలను ఏలుకో
సిద్దిపేటఎడ్యుకేషన్: యువత మేలుకొని రాజ్యాంగంలో పొందుపర్చిన విధివిధానాలపై అవగాహన పెంపొందించుకొని గ్రామాలను ఏలుకోవాలని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ హరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సంస్థల ఎన్నికలు, నిర్వహణపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినట్లు చెప్పారు. ఎన్నికల విధానాలు, రిజర్వేషన్లు, సభలు, సమావేశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి డాక్టర్ శ్రద్ధానందం, అధ్యాపకులు సుమలత, కొండల్రెడ్డి, మహేందర్రావు, రఘుపతి, గణేశ్, పద్మ పాల్గొన్నారు. -
పదిలో ఫెయిలవుతాననే భయంతో..
విద్యార్థిని ఆత్మహత్యపాపన్నపేట(మెదక్): పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని పొడిచన్పల్లి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... తండాకు చెందిన బానోత్ లత, రమేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా చిన్న కుమార్తె సాయిప్రియ(17) కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి, ఇటీవల పరీక్షలు రాసింది. అప్పటి నుంచి ఫెయిల్ అవుతాననే ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే తల్లి భయపడొద్దని ధైర్యం చెప్పినా దిగులుగా ఉంటుంది. కాగా శుక్రవారం కుటుంబీకులు గ్రామ శివారులో ఆరబోసిన ధాన్యం వద్దకు కాపలాగా వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయిప్రియ ఉరివేసుకుంది. కాసేపటికి అన్నం తీసుకొని పోవడానికి వచ్చిన సోదరుడు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. చేతికొచ్చిన బిడ్డ మృత్యువాత పడటంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. -
ఓటర్ల జాబితాపై పర్యవేక్షణ అవసరం
సబ్ కలెక్టర్ ఉమాహారతినారాయణఖేడ్: తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడం కోసం క్షేత్ర స్థాయి పర్యవేక్షణ అవసరమని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు. అందువల్ల బీఎల్వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారని, గృహాల వారీగా జాబితాను మ్యాపింగ్ చేయనున్నామని చెప్పారు. ఒక కుటుంబంలోని వారందరి ఓట్లు ఒకే దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు ప్రజలు సహకరించాలన్నారు. కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తు స్వీకరించాలని, బీఎల్వోల పరిశీలనలో ఉన్న జాబితా క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉంటే అనెగ్జర్–3 లో నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు హసీనాబేగం, విష్ణుసాగర్, గంగాభవాని, శివ శ్రీనివాస్, నాగజ్యోతి, కిరణ్ కుమార్, ప్రభుదాస్, ఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్య, ప్రవీణ్ ఉన్నారు. -
కేంద్ర మంత్రికి ఆహ్వానం
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో మే 1న ప్రారంభం కానున్న రేణుకా ఎల్లమ్మ జాతరకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్రావు ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం కరీంనగర్లో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సునీతకు, సంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆకునూరి చంద్రశేఖర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ, రామక సతీశ్శర్మ పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి.. యువకుడి మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం మిరుదొడ్డి ఎస్ఐ సమత కథనం ప్రకారం... సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన అంబటి నారాయణ భాగ్యవ్వ దంపతుల కుమారుడు వెంకటేశ్ గౌడ్ (25) మల్లన్న సాగర్ ప్రాజెక్టు మెగా కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గురువారం రాత్రి మిరుదొడ్డి నుంచి, ధర్మారం వైపు బైక్పై బయలు దేరాడు. ఈ క్రమంలో లక్ష్మీనగర్ శివారులోని మూల మలుపు వద్దకు రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో కిందపడిన అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కానరాని జొన్న కొనుగోళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పంట చేతికందిన ఈ సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఈ పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తక్షణ ఆర్థికావసరాల కోసం పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు, దళారులు జొన్న రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధరలో భారీగా కోత పెడుతున్నారు. కనీసం మద్దతు ధర కంటే క్వింటాళుకు రూ.వెయ్యి వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో జొన్న రైతులు నిండా మునుగుతున్నారు. 92 వేల ఎకరాల్లో సాగైన జొన్న అత్యధికంగా జొన్న సాగు చేసే జిల్లాల్లో సంగారెడ్డి ప్రధానమైనది. జిల్లాలో ఈ యాసంగి సీజనులో 92 వేల ఎకరాల్లో ఈ పంట సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక్కో ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన సుమారు 18.40లక్షల క్వింటాళ్ల జొన్నలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఏటా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నలను సేకరిస్తుంది. గతేడాది జిల్లావ్యాప్తంగా 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు 3.16 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అధికారులకు విజ్ఞప్తులు ప్రభుత్వం తక్షణం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఇటీవల రైతులు నిరసన తెలిపారు. తక్షణం కేంద్రాలను తెరవాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రాలను సైతం అందజేశారు. ప్రభుత్వం వెంటనే జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ధరలో భారీగా కోత జొన్నలకు కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.3,699గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సర్కారు కేంద్రాలు లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధర భారీగా పడిపోయింది. క్వింటాళుకు రూ.2,600 నుంచి రూ.3,000ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో క్వింటాళుకు రూ.వెయ్యి వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.చేతికందే సమయానికి తెరుచుకోని కేంద్రాలు అనుమతి రాగానే ప్రారంభిస్తాం ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జొన్నల సేకరణ ఉంటుంది. ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక ప్రకటించిన కనీస మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేస్తాం. – చంద్రశేఖర్గౌడ్, మార్క్ఫెడ్, డీఎం. -
కోరం లేక ఎన్నిక వాయిదా
● చైర్మన్ గైర్హాజరు పట్ల నేలపై బైఠాయించిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ● చైర్మన్ తీరుపై ఎమ్మెల్యే మాణిక్రావు అసహనంజహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం కోరం లేనందున వాయిదా పడింది. గురువారం ఎన్నికల షెడ్యూల్ మేరకు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి చైర్మన్ యూనూస్తోపాటు కాంగ్రెస్, మజ్లిస్, స్వతంత్ర కౌన్సిలర్లు గైర్హాజరుకావడంతో ఎన్నిక నిర్వహణ కోసం తగినంత కోరం లేనందున ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ జైత్రాం ప్రకటించారు. దీంతో అసంతృప్తికి లోనైన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మాణిక్రావుతో కలసి కమిషనర్ ముందు సమావేశమందిరంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎన్నిక నిర్వహణ ప్రక్రియకు యూనూస్ గైర్హాజరు కావడం తగదన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎజెండా అంశాన్ని చైర్మన్ సంతకంతోనే జారీ చేశారని, ఇప్పుడాయన సమావేశానికి రాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చైర్మన్ సమావేశానికి రావాల్సిందేనంటూ కమిషనర్ ముందు పట్టుబట్టారు. ఎన్నికకు సంబంధించిన రెండు రోజులకు ముందుగానే ఇవ్వాల్సి ఉండగా రాత్రికి రాత్రి 10 గంటలకు ఆగమేఘాలమీద జారీ చేసి షెడ్యూల్ను ప్రకటించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. కొందరు కౌన్సిలర్లు ఆస్పత్రుల్లో ఉన్నా ఎన్నికల నిర్వహణ కోసమని హైదరాబాద్ నుంచి సమావేశానికి హాజరైనట్లు పలువురు పేర్కొన్నారు. చైర్మన్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కౌన్సిల్లో 37మంది సభ్యులున్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఉన్నారు. దీంతో కౌన్సిల్ సభ్యుల సభ్య 39కి చేరింది. సమావేశం నిర్వహణకుగాను అవసరమైన కోరం 20 మంది సభ్యుల హాజరు తప్పనిసరి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణ కోసం ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే మాణిక్రావుతోపాటు బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు 15మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరి సంఖ్య 19కి చేరింది. దీంతో కోరం లేని కారణంగా ఎన్నిక వాయిదా పడక తప్పలేదు.రాత్రికి రాత్రి సర్క్యులర్ జారీనా: మాణిక్రావుకో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ..రాత్రి పది గంటలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సర్క్యులర్ను సభ్యులకు అందజేయడం సరికాదన్నారు. రాత్రికి రాత్రే ఆస్పత్రుల్లో ఉన్న కౌన్సిలర్లకు, ఇతర ప్రాంతాల్లో ఉన్న కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చి పిలిపించుకోవాల్సి వచ్చిందన్నారు. సర్క్యులర్ ఇచ్చిన చైర్మన్ కూడా పత్తా లేకుండా పోయారన్నారు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. -
బగలాముఖికి 1011 కలశాలతో అభిషేకం
నర్సాపూర్ రూరల్: శివ్వంపేట మండల కేంద్రంలోని బగలాముఖి అమ్మవారి శక్తి పీఠంలో అమ్మవారి జయంతి సందర్భంగా శుక్రవారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి 1011 కలశాల పసుపు జలాలతో, 111 లీటర్ల ఆవుపాలతో ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులకు దాతల సహకారంతో రూ.6 లక్షలతో నిర్మించిన వసతి గృహాన్ని హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహేశ్ గుప్తా, సర్పంచ్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


