breaking news
Sangareddy District Latest News
-
దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మహిళకు సోమవారం అరుదైన ఆపరేషన్ చేశారు. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన రత్నగారి లత సంవత్సరం నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె దుబ్బాక ఆస్పత్రికి వెళ్లింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను సూపరింటెండెంట్, డాక్టర్ హేమరాజ్సింగ్ పరీక్షించి కడుపులో మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. రక్తం తక్కువగా ఉండటంతో 3 యూనిట్ల రక్తం ఎక్కించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి కడుపులోంచి 7.1కిలోల గడ్డలను తొలగించారు. ప్రస్తుతం లత ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాలు కాపాడిన డా.హేమరాజ్ సింగ్, వైద్యులు రాఘవేందర్ ,శ్రేయ, సనందను అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామంలో వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామ పురోహితుడు బాపుశర్మ, మనోజ్శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకుమార్, ఉపసర్పంచ్ మౌనిక, నాయకులు భాస్కర్రెడ్డి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
తెలంగాణ మట్టి సాహిత్యానికి పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేషకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం అంటే తెలంగాణ మట్టి సాహిత్యానికి వరించిన పురస్కారం లాంటిదని, మంజీర రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగాచారి, సిద్దంకి యాదగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజీర రచయితల సంఘం సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘అనిమేష’’ కావ్యం సమకాలీన భావజాలాన్ని ప్రతిబింబిస్తూ మానవ అనుభూతులను లోతుగా ఆవిష్కరించిన ప్రాముఖ్యమైన కృతి అన్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహత్తర సాహితీవేత్త అని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తోట అశోక్, భగవాన్ రెడ్డి, పప్పుల రాజిరెడ్డి, పొన్నాల బాలయ్య, పాపయ్య, కొమురవెల్లి అంజయ్య, రాజు, అలాజ్ పూర్ శ్రీనివాస్, తైదల అంజయ్య, తిరుపతిరెడ్డి, బుచ్చి రాజ్యం రెడ్డి పాల్గొన్నారు. -
బలవంతపు వసూళ్లు చేయొద్దు
పాపన్నపేట(మెదక్): ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాన్స్జెండర్లు..మండల వాసులతో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లు అంటే అందరికీ సానుభూతి, గౌరవం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలతో మమేకమై, హుందాగా బతుకాలని పిలుపునిచ్చారు. సీఐ జార్జ్ మాట్లాడుతూ.. శుభకార్యాలకు వచ్చే ట్రాన్స్ జెండర్లు ఇష్టంతో ఇచ్చే డబ్బులను సంతోషంగా స్వీకరించాలని చెప్పారు. అనవసరంగా శాపాలు పెడుతూ, ఇబ్బంది పెట్టొద్దన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగమమేనన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి వివాహాలు చేస్తుంటే, వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేయడం తగదన్నారు. ట్రాన్స్జెండర్స్ జిల్లా ప్రతినిధి అంజలి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనన్నారు. వారి పట్ల సమాజంలోని కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు బాధగా ఉంటుందన్నారు. తాము కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హేమభార్గవి అన్నారు. ట్రాన్స్జెండర్ల వేధింపులపై తమకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ట్రాన్స్జెండర్లకు డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచన -
పాతాళం
జలం..అడుగంటుతున్న భూగర్భ జలాలు చిన్న శంకరంపేట మండలంలోనిచందాపూర్లో ఓ రైతుబోరు జిల్లాలో సగటున 10.67 మీటర్ల లోతులో గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్లపైనప్రతీనెల మీటరున్నర పడిపోతున్న వైనంనార్సింగి మండలంలో అత్యధికంగా 19 మీటర్ల లోతుకు.. జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. కాగా మెతుకు సీమలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో నూటికి 95 శాతం రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. ఈ యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. కాగా వరి పంటకు నిత్యం నీటి తడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో నిరంతరం బోరుబావులు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. జనవరిలో 9.36 మీటర్ల లోతులో ఉండగా ఫిబ్రవరిలో 10.67 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన 1.31 లోతుకు పడిపోయాయి. జిల్లాలోని శివ్వంపేట మండలంలో 7.33 మీటర్లలో ఉండగా పాపన్నపేట మండలంలో 7.87 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా నార్సింగి మండలంలో మాత్రం అత్యధికంగా 19.28 మీటర్లలోతుకు పడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది. చేగుంట, హవేళిఘనాపూర్ మండలాల్లో 8 మీటర్ల లోతులో ఉండగా మెదక్, టేక్మాల్, వెల్దుర్తి మండలాల్లో మాత్రం 9 మీటర్ల లోతులో నీరు ఉంది. జిల్లాలో భూగర్భజలాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీ ప్రాంతంలోని పిల్లికొటాల్ శివారులో కేవలం 3.60 మీటర్ల లోతులోనే ఉండటం గమనార్హం. అలాగే హవేళిఘనాపూర్ మండలం కూచన్పల్లి గ్రామ శివారులో 4.5 మీటర్లలోతులో ఉండగా అత్యధిక లోతులో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో శివారులో ఏకంగా 25.24 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే.. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భూగర్భ జలాలు కాస్త మెరుగనే చెప్పాలి. 2025 ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం 10.67 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నాయి.మెదక్లో పైన.. తూప్రాన్లో అడుగున!మండుతున్న ఎండలు ఒకవైపు, నిరంతరం బోరు మోటార్లు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతున్నాయి మరోవైపు. ప్రతి నెల సగటున మీటరున్నర లోతుకు వెళ్తున్నాయి. ఏప్రిల్, మేలో మరింత దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటున ఫిబ్రవరికి సంబంధించి 10.67 మీటర్ల లోతులో ఉన్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే మాత్రం 2 మీటర్ల పైన ఉన్నటు లెక్కలు చెబుతున్నాయి. మెదక్జోన్: -
దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిద్దిపేటరూరల్: కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ములుగు మండలం కొక్కొండ గ్రామంలో నాయీబ్రాహ్మణుల బొందల గడ్డను కబ్జా చేస్తూ కులం పేరుతో దూషించారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ ఏఓకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు యాద నరేందర్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల బొందలగడ్డను కబ్జాను అడ్డుకుంటే కులంపేరుతో దూషిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మల్లేశ్, రవి, ఆంజనేయులు, నరేశ్, నవీన్, క్రాంతికుమార్, వినోద తదితరులు పాల్గొన్నారు. డీఎల్పీఓ విచారణ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్ గ్రామ పంచాయతీలో సోమవారం డీఎల్పీఓ యాదయ్య విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన వార్డు సభ్యుడు గొల్ల యాదయ్యపై ఓడిపోయిన అభ్యర్థి శ్రీకాంత్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కాగా సివిల్ కాంట్రాక్టర్గా యాదయ్య పోటీ చేయడం ఎన్నికల నిబంధలనకు వ్యతిరేకమన్న ఫిర్యాదు మేరకు సోమవారం డీఎల్పీఓ గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి నివేదిక జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఎంపీఓ తిరుపతిరెడ్డి ఉన్నారు. గాలికుంటు టీకాలు వేయించాలిజిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య కౌడిపల్లి(నర్సాపూర్): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. సోమవారం మండలంలోని తునికిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం వస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, లైవ్స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ, వైద్యసిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. గ్యాస్ కొరతను పరిష్కరించాలి గజ్వేల్రూరల్: యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచవద్దని, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణ, రాజేశం మాట్లాడుతూ యుద్ధం వల్ల మన దేశంలో ఆయిల్ కొరత ఏర్పడటంతో గ్యాస్కు ఇబ్బంది జరుగుతున్నట్లు ప్రభుత్వమే చెబుతున్నదన్నారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్రమోడీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీను, చంద్రం, శంకరయ్య, నర్సింలు, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని మహిళకు గాయాలు నిజాంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్లాపూర్ గ్రామానికి చెందిన గాళం సంతోషకు కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రాథమిక చికిత్సచేసి అంబులెన్స్లో సిద్దిపేటకు తరలించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చేర్యాల(సిద్దిపేట): మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శభాష్గూడెంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఉల్లంపల్లి గణేశ్(29) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన అతడు పని చేయగా వచ్చిన డబ్బులు మొత్తం మద్యానికి ఖర్చు చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ సోమవారం బావి వద్ద ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో.. జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... గుమ్మడిదలకు చెందిన పోచగారి రాజిరెడ్డి (43) యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన కవితతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో గొడవపడిన కవిత సొంతూరుకు వెళ్లింది. మనస్తాపం చెందిన భర్త సంజీవరెడ్డి సోమవారం స్థానిక బావి వద్ద విద్యుత్ హైటెన్షన్ స్తంభానికి చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
అదుపుతప్పి ఆటో బోల్తా
శివ్వంపేట(నర్సాపూర్): అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన తూప్రాన్– నర్సాపూర్ హైవేపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... తూప్రాన్ నుంచి నర్సాపూర్కు ఐస్క్రీమ్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ ఆటో అదుపుతప్పి కుడివైపునకు వెళ్లి రాజన్నవాగు బ్రిడ్జిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్తో పాటు ఆటోలో మరో వ్యక్తి ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జిపై బోల్తాపడటంతో ఇతర వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లెలగడ్డలో పాలవ్యాన్.. హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో సోమవారం పాలవ్యాన్ బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం... సిద్దిపేట నుంచి హుజురాబాద్కు వెళ్తున్న పాల వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అందులో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ప్రైవేటు వాహనంలో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
తెలంగాణ సాహిత్య శిఖరం.. సిధారెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఐదు దశాబ్దాలుగా సాహితీ రంగంలో అలుపెరుగని సేవచేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖగా నిలిచాడని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్కుమార్రెడ్డి అన్నారు. విశ్రాంత అధ్యాపకులు సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సోమవారం కళాశాల తెలుగు విభాగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిధారెడ్డి సిద్దిపేట గడ్డకు గర్వకారణమన్నారు. సాంస్కృతిక వారసత్వపు బిడ్డగా, కవిగా, రచయితగా, పరిశోధకుడిగా అనేక సేవలను అందించారన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ జీవితాన్ని అక్షరీకరించిన కలానికి దక్కిన గౌరవమని కొనియాడారు. సిధారెడ్డికి అభినందనలు : జిల్లా కవులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణమని, జిల్లా కవులు సోమవారం పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికవ్వడంపై సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్, మంజీర రచయితల సంఘం, శ్రీవాణి సాహిత్య పరిషత్, సుగుణ సాహితీ సమితి, అక్షర సేద్యం ఫౌండేషన్, సిద్దిపేట రచయితల సంఘాలకు చెందిన కవులతో పాటు వివిధ కవులు నందిని సిధారెడ్డికి అభినందనలు తెలిపారు.సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖ -
జిల్లాలో బర్డ్ఫ్లూ లేదు..
పాపన్నపేట(మెదక్): మండలంలో గుర్తు తెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య స్పందించారు. ఈ మేరకు లింగాయపల్లికి తమ సిబ్బంది వెళ్లి విచారణ జరిపినట్లు తెలిపారు. ఒక షెడ్డులో సుమారు వెయ్యి కోళ్లు చనిపోగా ,మిగతా వాటిని కంపెనీ వారు తీసుకెళ్లారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదన్నారు. అయితే చనిపోయిన కోళ్లకు పరీక్షలు జరిపారా? అని ప్రశ్నించగా ఇక్కడ అలాంటి అవకాశం లేదని, వాటి అవశేషాలను బెంగళూర్ పంపాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే బర్డ్ ఫ్లూ లేదని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుంది. ఇతర గ్రామాల్లో కూడా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోయి ఉండొచ్చన్నారు. వేసవిలో కోళ్ల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుబ్రత పాటించాలని కోరారు. కొక్కెర వ్యాధితో చనిపోయి ఉండవచ్చు జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య -
మందుబాబులకు జరిమాన
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో తదితర చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఒకరికి రూ.1500, ఆరు మందికి రూ.1000 చొప్పున జరిమాన విధించారు. నిందితుడికి 20 ఏళ్ల జైలుమెదక్ కలెక్టరేట్: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రేగోడ్ మండలంలో ఓ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న సారా జైపాల్(25) అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై 2019 జూన్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. అప్పుల బాధతోరైతు ఆత్మహత్యదుబ్బాకరూరల్: అప్పులు తీర్చలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్ల దేవిరెడ్డి(70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి దేవిరెడ్డికి అతని సోదరుల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఏడాది క్రితం దేవిరెడ్డి అప్పులు చేసి తన కుమారుడి వివాహం చేశాడు. అయితే అప్పులు తీర్చడానికి భూమిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాగా భూమి విషయంలో గొడవల కారణంగా వివాదం పరిష్కారం కాలేదు. ఇటు వివాదం పరిష్కారం కాక, చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. -
మొగులు.. గుబులు
భయపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలుజహీరాబాద్లో..కన్సాన్పల్లిలో కురిసిన వడగళ్లు దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, బీర్నీస్, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. అందోల్, జహీరాబాద్లో వడగళ్లు వట్పల్లి(అందోల్)/జహీరాబాద్టౌన్: అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, రాంసాన్పల్లి, నేరడిగుంట తదితర గ్రామాల్లో జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ కాచి సాయంత్రానికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇంటి వాకిలిలో పడ్డ వడగండ్లను కొంతమంది ఏరుకుని తిన్నారు. నీళ్లు ఇంకిన బోరుబావులకు, వాడిపోతున్న వరి పంటకు ఈ వర్షం మేలు చేకూర్చగా..ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక వడగళ్ల వానకు మామిడి కాత నేలరాలింది. గత 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ఆయా గ్రామాల ప్రజానీకానికి ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఖేడ్లో ఈదురుగాలులతో వర్షం నారాయణఖేడ్:ఖేడ్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. కురిసిన వర్షం మనూరులో 24.2 మి.మీలు, సిర్గాపూర్లో1.8, ఖేడ్, నాగల్గిద్దలో 0.8 మి.మీల చొప్పున, కంగ్జిలో 0.4 మి.మీలుగా నమోదైంది. బలంగా వీచిన ఈదురు గాలులకు సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండా పంచాయతీ పరిధి లోని వాలునాయక్ తండాలో శంకర్కు సంబంధించిన రేకుల ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో కుటుంబీకులు నిరాశ్రయులయ్యారు. సర్పంచ్ రుక్మిణిపూల్సింగ్, పంచాయతీ కార్యదర్శి రఫీక్ ఇంటిని సందర్శించారు. నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందించేలా కృషి చేస్తామని సర్పంచ్ హామీనిచ్చారు. గాలులకు ఖేడ్ డివిజన్ పరిధిలోని పలుచోట్ల మామిడి కాయలు రాలిపడటంతో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.పొట్టకొచ్చిన వరి జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరిని వేశారు. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని శిశు మందిర్ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, ధర ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. వస్తువులో నాణ్యత లోపించినప్పుడు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహగౌడ్, కూనవేణు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు భరోసా
● 22 నుంచి పెట్టుబడి సాయం ● మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
ప్రజావాణిలో 57 అర్జీలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 57 అర్జీలు వచ్చినట్లు అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పాండు ఆదేశించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ ఉమాహారతి తదితరులు పాల్గొన్నారు. ఖేడ్లో ఇఫ్తార్ విందునారాయణఖేడ్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖేడ్లో ప్రభుత్వపరంగా ముస్లింలకు రెహమాన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్రెడ్డి, తహశీల్దార్ హసీనాబేగమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముంతాజ్, నాయకులు వినోద్పాటిల్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజు, సుబూర్, మహేశ్, లక్ష్మణ్, నాయకులు పండరీరెడ్డి, మైనొద్దీన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాలయ ఉత్సవ కమిటీ నియామకంజిన్నారం(పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో రానున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రకటించారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎర్రంతగారి ఆంజనేయులు యాదవ్, సభ్యులుగా చేరికారి గోవర్ధన్రెడ్డి, గోకర్ వెంకటేశంగౌడ్, లక్ష్మీ సంజీవ, అర్చకులు లక్ష్మణాచార్యులు నియామకమయ్యారు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్ తన నివాసంలో ఉత్సవ కమిటీ నియామక పత్రాన్ని చైర్మన్కు అందజేశారు. నూతన కమిటీని ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, పుట్టా నర్సింగరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాతృమూర్తికి హరీశ్రావు పరామర్శపటాన్చెరు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఎమ్మెల్యే గూడెం మహి పాల్రెడ్డి మాతృమూర్తి గూడెం మాణెమ్మని సోమ వారం ఉదయం మాజీమంత్రి హరీశ్రావు పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేతోపాటు వారి కుటుంబ సభ్యులకు హరీశ్రావు సూచించారు. -
ఉద్యమాలను ఆపలేరు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావుపటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా జయప్రదం కోసం వెళ్తున్న సీఐటీయూ నాయకులను, అంగన్వాడీ టీచర్ల హెల్పర్లను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రశాంతంగా చలో హైదరాబాద్కు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చినా అరెస్టు చేయడం దారుణమన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఐసీడీఎస్ పరిరక్షణ కోసం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, అనిత, రాణి, లక్ష్మి, గాయత్రి, అక్షద, కృష్ణవేణి, స్వరూప, మందాకిణి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం
రూ.47 కోట్లువసూలైందిరూ.111 కోట్లుసంగారెడ్డి జోన్: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు మరో 16 రోజులు మాత్రమే గడువు మిగిలిఉంది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 50% మాత్రమే పన్ను వసూలైంది. సమయం తక్కువగా ఉండటంతో ఆ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూళ్లు వేగిరం చేస్తున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో అంతలోపు పన్ను వసూళ్లు 100% పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలలో ఈ ఆర్థిక ఏడాదికిగాను రూ.111.55 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సోమవారం వరకు జిల్లావ్యాప్తంగా రూ.47.04లక్షలు మాత్రమే వసూలైంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో అత్యధికంగా వసూలు కాగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో అతి తక్కువగా పన్ను వసూలైంది. ఐదు మున్సిపాలిటీలలో 50% వసూలు కాగా మిగతా 6 మున్సిపాలిటీలలో సగం కూడా పూర్తి కాలేదు. ఇంటి పన్నుతోపాటు నీటి, వృత్తి వ్యాపార పన్ను వసూళ్లలో వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను చెల్లించిన వారికి అక్కడే రశీదును అందిస్తున్నారు. ఇక పన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించాలనుకునేవారికి http://cdma.telanga na.gov.in వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. వసూలైన పన్ను మొత్తాన్ని ఏరోజుకారోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల నిధులు మంజూరు చేస్తుంటాయి. వీటితోపాటు స్థానిక వనరులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వివిధ రకాల పేర్లతో వసూలైన పన్నులతో ఆయా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తిరిగి ఖర్చు చేస్తుంటారు. -
ఆద్యంతం.. భక్తి పారవశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామీణ పేద ప్రజల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎంపీడీఓ లక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దీంతో కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
నమ్మించి బంగారు గొలుసు తస్కరణ
చిలప్చెడ్(నర్సాపూర్): వృద్ధులను నమ్మించిన ఓ దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. ఈఘటన మండలంలోని చిట్కుల్ శివారులో జరిగింది. ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన గాజం హిమగిరి, భర్త సుధాకర్ దంపతులు దుండిగల్లో వారి కూతురితో కలిసి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక గుర్తు తెలియని వ్యక్తి వారికి పరిచయమై ఆయన కారులో వారిని మండలంలోని చాముండేశ్వరి ఆలయానికి తీసుకువచ్చాడు. దర్శనం అనంతరం ఎనగండ్ల రహదారి వైపు తీసుకెళ్లి హిమగిరి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని కారుతో పారరయ్యాడు. ఈ విషయమై బాధితులు ఎస్ఐకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. -
● రైతుల ‘యాప్’సోపాలు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రుద్రారంలో ఆదివారం యారియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో యూరియా వచ్చిందని తెలుసుకొని బుక్ చేసుకునే లోపే యాప్ బుకింగ్ క్లోజ్ అయిందని రైతులు వాపోయారు. కళ్లముదు యూరియా ఉన్న ఇతర గ్రామాల వారు వచ్చి తీసుకెళ్తున్నారని, తమకు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరారు. దీంతో పోలీస్లు గ్రామానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఏఓ ప్రవీణ్తో మాట్లాడి విషయం వివరించగా.. సోమవారం గ్రామ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
లింగమూర్తికి ఎక్సలెంట్ అవార్డు
చేగుంట(తూప్రాన్): ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించినందుకు గాను చేగుంటకు చెందిన లింగమూర్తి లయన్స్ ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అవార్డు అందుకున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం లయన్స్ సిద్దిపేట రీజియన్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లింగమూర్తికి అవార్డును మెదక్ ఎంపీ రఘునందన్రావుతో పాటు లయన్స్ ప్రతినిధులు సంజయ్గుప్తా, బాబూరావు, అమర్నాథ్రావు, విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. -
నేటి బాలలే రేపటి పౌరులు
రామాయంపేట(మెదక్): శిశు మందిరాలు మన సంస్కృతికి నిలయాలని వీహెచ్పీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యంజీ పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్ సింఘాల్ శిశుమందిర్ పాఠశాల నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విశ్వభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంయేజక్ హరిస్మరణ్రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ ఒడి, చదువుల బడి, దేవుని గుడి బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. మన పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి సంస్కారాలు నేర్పిస్తే వారిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు. శిశుమందిర్ సంస్థాపకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో లోపం వల్లే దేశంలో నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల నృత్యాలు, దేశభక్తి గేయాల ఆలాపన ఆకట్టుకున్నాయి. వీహెచ్పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నరసింహామూర్తి, జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, ఇతర ప్రతినిధులు సంగమేశ్వర్, పండరినాధ్, రమణ తదితరులు పాల్గొన్నారు.వీహెచ్పీ తెలంగాణ, ఏపీ కార్యదర్శి సత్యంజీ -
మినీ బస్టాండ్ మంజూరు చేయండి
కొండపాక(గజ్వేల్): మండలంలోని చిన్నకిష్టాపూర్ క్రాస్ వద్ద మినీ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఎంపీ కోటాలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బీజేపీ నాయకులు ఎంపీ రఘనందన్రావుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ త్వరలో నిధులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి వస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్రెడ్డి, తన్నీరు యాదగిరి, రెడ్డమైన పర్శ రాములు, సదానందగౌడ్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేలాది కోళ్లు మృత్యువాత! చుక్కలనంటుతున్న చికెన్ ధరలు పాపన్నపేట(మెదక్): మండలంలో నెల రోజులుగా గుర్తుతెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దీంతో కోళ్ల ఫాంలు వెలవెలబోతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు కోళ్ల ఫాంలు ఉన్నాయి. లింగాయపల్లి శివారులోని ఓ ఫాంలో నెల రోజుల క్రితం వేలాది కోళ్లు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే పాపన్నపేటలో కూడా వందల సంఖ్యలో కోడి పిల్లలు మృత్యువాత పడ్డట్లు సమాచారం. దీంతో మండలంలోని కోళ్లఫాం యజమానులు సంబంధిత కంపెనీల నుంచి కోడి పిల్లలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ఇదే సమయంలో రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. స్కిన్లెస్ కిలోకు రూ. 340, స్కిన్తో కలిపి కిలో రూ.320కి అమ్ముతున్నారు. ఇదే విషయమై జిల్లా పశువైధ్యాధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ల్యాబ్కు పంపడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తామని చెప్పారు. లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరి పరిస్థితి విషమం మనోహరాబాద్(తూప్రాన్): ఓవర్టేక్ చేసే క్రమంలో కంటైనర్ వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. తూప్రాన్ మండలం ఇమాంపురానికి చెందిన అల్లా డి నిఖిల్ (20) మండలంలోని లింగారెడ్డిపేట్కు చెందిన మన్నె స్వామి ఇద్దరు స్నేహితులు. ఆదివారం ఉప్పల్లో పరీక్ష రాయడానికి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో దండుపల్లి వద్దకు రాగానే వెనకాల వేగంగా వచ్చిన కంటైనర్ వీరి ఢీకొట్టింది. ఈఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మేడ్చల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రుస్తుంపేట టర్నింగ్ వద్ద..నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన కొండిగళ్ల జంగయ్య (45) బైక్పై నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం రుస్తుంపేట టర్నింగ్ వద్ద జంగయ్య ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మరొకరు..సంగారెడ్డి టౌన్: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్కు చెందిన చింతల సురేశ్ (25) వెల్నెస్ సెంటర్లో టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టాఫ్ రూమ్లో పడుకున్న సురేశ్ నిద్ర లేవకపోవడంతో సిబ్బంది కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరూ రాకుండానే ఎలా తరలిస్తారని కుటుంబీకులు, ఆందోళన చేపట్టారు. -
కూల్.. కూల్
మట్టి కుండ..ఎన్నో ప్రయోజనాలు మట్టి కుండలోని నీరు, ఆహారం శ్రేయస్కరమైనది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి జీవికి ఆహారం అందించేది నేల తల్లి. అలాంటి నేలతల్లి నుంచి సేకరించిన మట్టితో తయారుచేసిన కుండలకు ఆయుష్ను సైతం పెంచే శక్తి ఉంది. ఒకవైపు వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో మట్టికుండలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం వివాహాలు బోనాలు, వ్రతాలు, కార్యాలయాలు, ఆలయాల్లో వాడకం కోసం కుండల వాడకం పెరుగుతుంది. చిన్న కుండ రూ. 200 నుంచి 300, పచ్చడి కుండ రూ. 150 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కుండలపైగా అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంగారెడ్డి క్రైమ్/ హత్నుర(సంగారెడ్డి): మట్టి కుండలకు రాను రాను డిమాండ్ పెరుగుతోంది. అనాదిగా మనిషి జీవన విధానంతో ముడిపడిన కుండలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం ఆనాయితీగా వస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం ఇచ్చే కుండను జనం కొనుగోలు చేస్తారు. ఇలా కొనే కుండలను ఉగాది కొత్త కుండ అని పిలుచుకుంటారు. పచ్చడితో పాటు పాలు, పెరుగు పెట్టుకోవడం కోసం ఏడాది మొత్తం ఉపయోగించుకుంటారు. ఇన్నిరకాల వంట పాత్రలు వచ్చినప్పటికీ తిరిగి ప్రాచీన కాలం నాటి మట్టి పాత్రలకే ప్రస్తుతం గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తయారుచేసిన మట్టి పాత్రను సైతం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి విక్రయిస్తున్నారు. వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. మట్టి కుండలో నీరు తాగడం మట్టి పాత్రలో వంట చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మట్టి పాత్రలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోయింది.ఉగాది పచ్చడితో మొదలు.. వేసవి మొత్తం వాడకం పెరుగుతున్న విక్రయాలు -
ఇసుక టిప్పర్ సీజ్
పాపన్నపేట(మెదక్): అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం మెదక్ నుంచి బొడ్మట్పల్లి వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యంత్రానికి నిర్లక్ష్యపు తుప్పు శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల్లో ఏర్పా టు చేసిన ప్యాడీ క్లీనర్ భద్రపరచకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పు పట్టి పోతుంది. కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు ధాన్యాన్ని జల్లడ పట్టేందుకు దీనిని ఉపయోగిస్తారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన అనంతరం భద్రపరచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యంత్రం పనికిరాకుండా పోతుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ నర్సాపూర్ రూరల్: స్థల వివాదంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడిన సంఘటన మండలంలోని రుస్తుంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సర్పంచ్ వర్ష భర్త సుదీప్కుమార్కు గాయాలైనట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మూల్యాంకనంలో తప్పులొద్దు
సిద్దిపేటఎడ్యుకేషన్: తప్పులు లేకుండా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని డీఐఈఓ రవీందర్రెడ్డి అన్నారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆదివారం ప్రారంభం అయింది. ఈసందర్భంగా ఎగ్జామినర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, ఇంటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు సమయపాలన తప్పని సరిగా పాటించాలని, విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు చీప్ ఎగ్జామినర్ల వద్ద ఉంచాలని, తప్పనిసరి అయితే తప్ప వాడరాదన్నారు. కొత్తగా మూల్యాంకనం చేసేవారు మొహమాట పడకుండా సీనియర్స్ వద్ద అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. బోర్డు అబ్జర్వర్ విజయ్శేఖర్ మాట్లాడుతూ.. ఓవర్, అండర్ వాల్యుయేషన్ లేకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మూల్యాంకనం చేయాలన్నారు. కార్యక్రమంలో క్యాంపు అధికారులు సత్యనారాయణరెడ్డి, చెన్నోజు శ్రీనివాస్, సీసీఓ కూచంగారి శ్రీనివాస్, ఏసీఓలు దేవస్వామి, శివకోటి, లలిత, విషయనిపుణులు శశిధర్రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.డీఐఈఓ రవీందర్రెడ్డి -
పాలన సదా ‘మామూలే’
● షాపుల ముందు పార్కింగ్ స్థలాలు కరువు ● పట్టణంలో సెట్ బ్యాక్లకు మంగళం ● రోడ్లను అక్రమించి అక్రమ కట్టడాలు వ్యాపారాలు అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. టీఎస్–బీపాస్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారికి నోటీసులు జారీ చేస్తాం. –మున్సిపల్ కమిషనర్ శివాజీ అధికారుల తీరుతో టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తంఏళ్లు గడుస్తున్నా సదాశివపేట మున్సిపాలిటీ తీరు మాత్రం మారడం లేదు. ఏళ్లుగా అవినీతి అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ యంత్రాంగం కాసుల వేటలో నిమగ్నమై ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తోంది. అక్రమ కట్టడాలకు అడ్డు లేకుండా పోవడంతోపాటు వాటిని నిర్మిస్తున్న యజమానుల నుంచి మూమూళ్లు కూడా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో పట్టణంలో భవన నిర్మాణాలు గతంలో ఎన్నడూలేని విధంగా అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇష్టారాజ్యంగా అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు. పలుకుబడి ఉన్న వారి కట్టడాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణాలు మరోవిధంగా చేపడుతున్నారు. చాలామంది పార్కింగ్లకు స్టెల్లార్లను వదిలి వేయకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టి అద్దెలకిస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 14,214 గృహాలు ఉండగా అనధికారికంగా మాత్రం వాటికి రెట్టింపుస్థాయిలో ఉన్నట్లు సమాచారం. ప్రధాన వ్యాపార కూడళ్లు సిద్ధాపూర్గౌని, సుభాష్రోడ్డు, శాసీ్త్రరోడ్డు, బుక్కకేరీ, పిట్టలకేరీ, సిద్దాపూర్రోడ్డు, ఎస్బీఐ బ్యాంకు నుంచి అయ్యప్ప మందిరం వరకు ఇరువైపులారోడ్డు, మురుగునీటి కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో షాపుల ముందు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం పరిపాటిగా మారింది. అయినా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఆంతర్యం అంతుచిక్కడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కళ్లముందే నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన భవన యజమానులు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల కూడళ్లలోనే అనేక అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలు సెట్ బ్యాకులకు మంగళం పాడుతూ నిర్మాణాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా టౌన్ప్లానింగ్ మున్సిపల్ అధికారుల తీరుతో టౌన్ప్లానింగ్ అస్తవ్యస్థంగా తయారైంది. దీనింతటికీ ప్రధాన కారణం టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వం అవినీతి అక్రమాలే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు పొంది నిర్మాణాలు చేసిన భవనాలను పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. సెట్బ్యాకుల సమస్యతోపాటు టౌన్లో లే అవుట్లు లేకుండా ఏర్పడిన సిద్దాపూర్ కాలనీ, సుందరయ్యనగర్, గంజీ వెనుక హనుమాన్గర్, సాయినగర్, శ్రీరాంనగర్, కాలనీల్లో అక్రమార్కులు అంతర్గత రోడ్లను సైతం ఆక్రమిస్తున్నారంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. -
భళా.. హస్తకళ మేళా
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026సంగారెడ్డిలోని టీటీడీ కల్యాణ మండపంలో కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన చేనేత హస్తకళ మేళాకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మేళాలో కొండపల్లి, వేటికొప్పాక బొమ్మలు, నిర్మల్ హైదరాబాద్ మంచి ముత్యాలు, మైసూర్ రోజ్వుడ్, సహారన్ పూర్ ఫుడ్ కార్వింగ్, వరంగల్ చెవర్, జూట్ బ్యాగులు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూరీ బ్యాక్స్లు ప్రదర్శనకు ఉంచారు. వీటితోపాటు పోచంపల్లి, నారాయణపేట, వరంగల్, ఉప్పాడ, కంది, ధర్మవరం, సిద్దిపేట, పొందూరు, వెంకటగిరి, మంగళగిరి చీరలు, చేనేత కాటన్, పట్టువస్త్రాలు, టవల్స్, చేనేత దుప్పట్లు, కర్టెన్లు, ఖాదీ మెటీరియల్స్ కూడా అమ్మకానికి ఉంచారు. –సంగారెడ్డి -
జహీరాబాద్ మార్కెట్కు ధనియాలు
జహీరాబాద్ టౌన్: పెద్ద పంటలతో నష్టపోతున్న రైతులకు చిన్న పంటలు ఆసరా అవుతున్నాయి. స్వల్పకాలంలోనే చేతికందుతూ గట్టెక్కిస్తున్నాయి. చిన్న పంటల్లో ప్రధానమైంది సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన ధనియాలు రైతులను ఆదుకుంటుంది. వంద రోజుల పంట అయిన ధనియాల సీజన్ కావడంతో జహీరాబాద్ మార్కెట్కు అమ్మకానికి రైతులు తీసుకొస్తున్నారు. పట్టణంలోని సుభాష్గంజ్ మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రారంభంలో క్వింటాల్కు నాణ్యతను బట్టి రూ.10 వేల పలికింది. మార్కెట్లో ధరలు రోజుకు మారుతుంటాయి. పెద్ద మొత్తంలో పంట రావడంతో ప్రస్తుతం ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధనియాలు సుమారు. రూ.6 వేల క్వింటాల్ పలుకుతుంది. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలిగీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ సంగారెడ్డి టౌన్: గీతకార్మికుల సమస్యలు పరిష్కరించాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.5000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్గౌడ్, రవీందర్గౌడ్, మల్లేశంగౌడ్, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంనారాయణఖేడ్: అన్నివర్గాల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ కలిసి ఆయన ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్లో డివిజన్ పరిధి లోని 228 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మనూరు మండలం మాయికోడ్, రాణాపూర్ గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలు, నాగల్గిద్ద మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనంతోపాటు పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు ఎమ్మె ల్యే శంఖుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమా ల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభు త్వం అన్నిమతాలు, సాంప్రదాయాలను గౌరవి స్తూ అందరికీ సంక్షేమ పథకాలను చేరు వ చేస్తోందన్నారు. మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, డ్వాక్రా రుణాలను సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. వేప పువ్వు గగనమేనా!జహీరాబాద్ టౌన్: తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా తయారు చేసే ఉగాది పచ్చడిలో ఎన్నో ప్రత్యేకతలుంటాయి. షడ్రుచుల సమ్మేళనంగా ఉండే పచ్చడిలో తీపి, ఒగరు, చేదు రుచులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పచ్చడిలో చేదు రుచి రావాలంటే అందులో కచ్చితంగా వేప పువ్వు వాడాల్సిందే. ఉగాది పండుగ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది పండుగకు వేప పువ్వు కొరత ఏర్పడింది. వేప చెటున్నా పువ్వు మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది వేపాకులు ఎండి రాలిపోయాయి. రెండు మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండగా ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫంగస్, తెగుళ్ల వల్ల వేపాకులు ఎండిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఆకులు చిగురించి పూర్వస్థితికి వసుండగా..పూత మాత్రం రావడం లేదు. పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల ఒక్క వేప చెట్టుకు మాత్రం పువ్వు నిండుగా వచ్చింది. -
నేటి నుంచి ఒంటిపూట బడులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంన్యాల్కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది. -
కొమురవెల్లి అభివృద్ధికి మాస్టర్ప్లాన్
● త్వరలోనే చర్యలు చేపడతాం ● మంత్రి కొండా సురేఖ వెల్లడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం మంత్రి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండగుట్టపై నిర్మించిన 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. -
బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటుందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేట్లోని ఆదివారం హరీశ్రావు నివాసంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, పటాన్చెరు మండల ఇన్చార్జ్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ...ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతీగతీలేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారని విమర్శించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామని తెలిపా రు. పార్టీలో చేరిన వారిలో మల్లేశ్గౌడ్, ధనుంజయ్గౌడ్, పవన్గౌడ్, చరణ్గౌడ్, నక్క వికాస్గౌడ్, కాసా వినయ్గౌడ్, పట్లోళ్ల తిరుపతిరెడ్డిలున్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ పెద్దపీట జిన్నారం (పటాన్చెరు): మైనార్టీలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత కేసీఆర్దేనని మాజీమంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. బొల్లారం డివిజన్ పరిధిలో మాజీ జెడ్పీటీసీ కొలను బాల్రెడ్డి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని మైనార్టీలకు మాటలే తప్ప చేసిందేమీ లేదన్నారు. మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా టమ్రేస్ పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తు చేశారు. అనంతరం మైనార్టీలతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబిపూర్రాజు, పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జెడ్పీమాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు గడిల శ్రీకాంత్గౌడ్, వెంకటేశంగౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి
పెద్దశంకరంపేట(మెదక్): చేపల వేటకు వెళ్లిన జాలరి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిఽధిలోని జూకల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బేస్త బేతయ్య రెండో కుమారుడు బేస్త లక్ష్మణ్(25) రోజు మాదిరిగానే చేపల వేట కోసం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పరిధిలోని ఎల్లమ్మరాళ్లపాయ ప్రాంతానికి తెప్పల సహాయంతో శుక్రవారం తన సోదరులు బేస్త సంగమేశ్వర్, బేస్త దత్తులతో కలిసి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఈతగాళ్ల సహాయంతో వెతికినా ఫలితం లేదు. కాగా శనివారం నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు ఉపయోగించే వల అతడికి చిక్కుకోవడంతో ఊపరాడక మృతి చెందినట్లు భావిస్తున్నారు. విద్యుత్లైన్ మరమ్మతులు చేస్తుండగా.. గజ్వేల్రూరల్: విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మర్కూక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన నీరుడి బాబు(35) మీటర్ రీడర్గా పనిచేస్తున్నాడు. శనివారం శ్రీగిరిపల్లిలో విద్యుత్ లైన్కు సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై గాయపడ్డాడు. స్థానికులు ప్రమాదస్థలం నుంచి గాయపడిన బాబును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే గతంలో సైతం ఇలాంటి ఘటనే జరిగిందని స్థానికులు ఆరోపించారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం గజ్వేల్లో వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గిరిపల్లి గ్రామానికి చెందిన నెమటూరి చిన్నమల్లయ్య(41)కు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. చిన్న మల్లయ్య ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన ఆరు నెలల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలోని సత్యసాయి నగర్లో ఓ అద్దె ఇంట్లో ఉరివేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఫ్యాన్ కొండికి చున్నీతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబీకులతో గొడవపడి యువకుడు .. హవేళిఘణాపూర్(మెదక్): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రమోద్(26) హైదరాబాద్లో నివాసముంటున్నాడు. భార్యతో గొడవపడిన ప్రమోద్ శుక్రవారం స్వగ్రామం ముత్తాయికోటకు వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు. వాయిదాలు చెల్లించలేదనే.. -
దేవుడా ఇందుకిలా చేశావు?
కొడుకు శవంపై పడి రోదిస్తున్న యాదమ్మమెదక్జోన్: కొడుకా నిన్నపుట్టిన రోజు జరు పుకొని.. ఇవాలా చనిపోయావా.. దేవుడా ఇందుకిలా చేశావని మహిళ రోదించింది. రోడ్డు ప్రమాదంలో భర్త, కొడుకు, అల్లుడు చనిపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కంట తడిపెట్టించింది. హవేళిఘనాపూర్ మండలం భూర ్గుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి అమృత్గౌడ్(50),యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కూతురుని ఇదే మండలం బొగుడభూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయాగౌడ్(32)కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కూతురు బానును కొల్చారం మండలం రంగంపేటకు సాయిరాంగౌడ్కు ఇచ్చి వివాహం చేశారు. మూడో సంతానం రిషివర్ధన్గౌడ్(14)ను గ్రామంలో చదివించుకుంటూ కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు కొడుకు తొట్టెల కార్యక్రమానికి బైక్పై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో అమృత్గౌడ్(50) తోపాటు తన కొడుకు రిషివర్ధన్గౌడ్(14), అల్లుడు సాయాగౌడ్ దుర్మరణం చెందారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద తన కొడుకు మృతదేహంపై పడి యాదమ్మ రోదించిన తీరు అక్కడ ఉన్నవాళ్లను కంటతడి పెట్టించింది. ఈనెల 13న ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజున ప్రమాదంలో దుర్మరణం చెందటంతో ఆమె బోరున విలపించింది. ప్రమాదంలో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు, అల్లుడు ముగ్గురు చనిపోగా రెండు కుంటుబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. మృతుడు సాయాగౌడ్కు భార్యతో పాటు 6 ఏళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. రోడ్డు ప్రమాదంలోభర్త, కొడుకు, అల్లుడు దుర్మరణం రోదించిన కుటుంబ సభ్యులు మెదక్ జిల్లాలోఘటన -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. టిప్పర్ ఢీకొని విద్యార్థి.. పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... హైదరాబాద్ ఎరగ్రడ్డ ఆనందనగర్కు చెందిన సుకేశ్(19) రూట్స్ అకాడమీలో యానిమేషన్ డిప్లొమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఐఐటీ హైదరాబాద్లో జరుగుతున్న ఈ – సమ్మిట్కు తన స్నేహితుడు రజనీకాంత్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రుద్రారం గ్రామ శివారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే టిప్పర్ డ్రైవర్ శ్యామ్ అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనం నడుపుతున్న సుకేశ్ కింద పడిపోగా అతని పైనుంచి టిప్పర్ చక్రం ఎక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రజినీకాంత్ కింద పడిపోవడంతో అతని కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు ఢీకొని యువకుడి.. పాపన్నపేట(మెదక్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నార్సింగి శివారులోని దారిదేవుని గుడి వద్ద శనివారం జరిగింది. బాధిత వర్గాల కథనం ప్రకారం.. మండల పరిధిలోని యూసుఫ్పేటకు చెందిన తుడుం నాని (21), అర్కెల లడ్డు ద్విచక్ర వాహనంపై నార్సింగి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్ గౌడ్ను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. బైక్ అదుపుతప్పి ఒకరు.. మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన మల్లెపూల నాగరాజు (24) నెల రోజుల క్రితం సికింద్రాబాద్, పార్శిగుట్టలో భార్య శిరీషతో కలిసి అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి బయలు దేరాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్ మండలం రామాయపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి–44పై బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కాగా మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
హలీం తయారీ విధానం
హలీం తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. హలీమ్ తయారీలో మటన్, చికెన్, పప్పులు, గోధుమలు, నెయ్యి, పిస్తా, బాదం, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఎన్నో రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. దాదాపు 10 గంటల నుంచి 12 గంటల పాటు మాంసాన్ని బట్టిలో ఉడికిస్తారు. 20 నుంచి 30 మంది చెఫ్లు హలీం తయా రీలో శ్రమిస్తారు. చెఫ్ల పనిని బట్టి నెలకు రూ.లక్ష నుంచి 2 లక్షలు జీతం అందిస్తారు. ఉపవాస దీక్షలో ఉన్న వారు ఈ వంటకం తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. హలీం సర్వ్ చేస్తున్న సిబ్బంది -
తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారులపై కేసు
చిన్నకోడూరు(సిద్దిపేట): కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు కుమారులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి, రామవ్వ వృద్ధ దంపతులకు రాజిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. వృద్ధ దంపతులకు ఉన్న ఏడెకరాల భూమిని కూడా ఇద్దరు కుమారుల పేరున చేయించారు. వయస్సు మీద పడటంతో తమను పట్టించుకోవడం లేదని కుమారులను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ వారి గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు. -
అక్రమ సిలిండర్లు స్వాధీనం
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న గృహవసర గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజు, మండల ఆర్ఐ గోపి, తమ సిబ్బందితో శనివారం సాయంత్రం హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ రజని తెలిపారు. గృహవసర సిలిండర్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానంజిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ కవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2026– 27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు సంబంధించి మే 3న పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల 16 నుంచి వచ్చేనెల 15 తేదీ వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాజానికి దిశానిర్దేశం చేసేది కవిత్వమేప్రముఖ కవి, రచయిత పవన్కుమార్ సిద్దిపేటకమాన్: సమాజంలో నెలకొన్న అసమానతలు, రుగ్మతలను రూపుమాపి దిశానిర్దేశం చేసేది కవిత్వమేనని ప్రముఖ కవి, రచయిత పవన్కుమార్ అన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సమాజంలో వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ కవుల రచనలో ప్రస్ఫుటించాలని కోరారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో అశోకరాజు, మహిపాల్, మహేందర్, విజయ, ఉమారాణి, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మద్దూరు(హుస్నాబాద్): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహ్మద్ అసీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... దూల్మిట్ట మండల కేంద్రంలోని మోయతుమ్మెద వాగు నుంచి సుద్దాల బాబు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడులు నిర్వహించి ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. జూదరుల అరెస్ట్ పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని పొడిచన్పల్లి తండా శివారులో శనివారం జూదం ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి 10 ఫోన్లు, రూ.20,040 స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించగా జూదం ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సంగారెడ్డి టౌన్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ శివారులోని నక్క వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి (30) మృతి చెందాడు. వైట్షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ గుర్తించినట్టయితే రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్ చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతికి కారణమైన తమ్మారెడ్డి భూపాల్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నార్సింగి పోలీస్స్టేషన్లో సీఐ వెంటరాజంగౌడ్, ఎస్ఐ సృజనతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న నార్సింగిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన మేడ్చల్ జిల్లా అత్వెల్లికి చెందిన శ్యామ్ శ్యామ్సుందర్రెడ్డి ఉదయం స్నానం చేసి బట్టలు ఆరబెడుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతని భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. భవనంపై జే వైరుకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వ్యక్తి మృతికి భూపాల్రెడ్డి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో అతడ్ని రిమాండ్కు తరలించారు. -
స్తంభాన్ని ఢీకొట్టి..
జహీరాబాద్ టౌన్: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని కరకనెల్లి గ్రామానికి చెందిన ఎస్.చంద్రప్ప(47) బైక్పై జహీరాబాద్కు వస్తున్నాడు. వేగంతో వస్తున్న బైక్ అదుపుతప్పి మార్గమధ్యలో మండలంలోని మల్చెల్మ గ్రామంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో తలకు త్రీవంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఉద్యాన సాగుకు ప్రోత్సాహం
● కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టి ● రైతులకు ఉచితంగా కూరగాయలకిట్ల పంపిణీ ● జిల్లాకు 3,420 కిట్లు మంజూరుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం రైతులను ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తోంది. కూరగాయల పంటలు సాగు చేసేందుకు ముందుకొచ్చే అన్నదాతలకు కూరగాయలు, ఆకు కూరల కిట్లను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి కిట్లను పంపిణీ చేస్తోంది. ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగు చేసే అవకాశంతో పాటు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలను ఆర్జించవచ్చు. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండటంతో మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం జిల్లాలో చాలా రకాల కూరగాయలు సాగవుతుండగా, మరికొన్ని రకాల కోసం ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీగ జాతి కూరగాయల సాగును పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ఉచితంగా కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉచిత కిట్లలో ప్రాధాన్యం వీటికే.. జిల్లాకు ప్రభుత్వం 3,420 కిట్లను మంజూరు చేసింది. ఉచిత కిట్లలో ప్రధానంగా తోటకూర, పాలకూర, టమాటా, చిక్కుడు, బీరకు చెందిన విత్తనాలు ఉన్నాయి. వీటిని బెంగలూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇవి ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంతో అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. పాలకూర, తోటకూర 25, చిక్కుడు, బీర 40 రోజులు, టమాట 50 రోజులకు దిగుబడి రానుంది. రైతులకు ఉపాధి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది. రైతులకు మేలైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో రైతులకు ఉపాధి దొరుకుతుంది. – అబ్దుల్ రషీద్, ఉద్యాన రైతు, ఇశ్రితాబాద్ రైతులను ప్రోత్సహించేందుకే... ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కూరగాయల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి కిట్లను పంపిణీ చేస్తున్నాం. రైతులకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. – సతీశ్, ఉద్యానవన విస్తరణ అధికారి, సదాశివపేట -
హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయోచ్
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఆనందంలో మునిగితేలారు. రాత్రి పగలు తేడాలేకుండా రెండేళ్లు కష్టపడి చదివారు. మంచి మార్కులు సాధించటం కోసం నిద్రాహారాలు మాని పరీక్షల కోసం సిద్ధమయ్యారు. శుక్రవారం పరీక్షలు ముగియడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరికి ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటర్ తర్వాత ఏం చదువుదామని చర్చించుకున్నారు.ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుని ఇంటికి వెళ్లిపోయారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట
పటాన్చెరు: గంగా జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని, ముస్లింల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేసిన మహోన్నత నేత మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మహమూద్ అలీతో పాటు, శాసనమండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారన్నారు. 27 ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ... ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ముగిసిపోయేలా అల్లాను ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ -
మోటారు బయటకు తీస్తుండగా..
దుబ్బాకరూరల్: విద్యుత్ మోటార్ను బయటకు తీస్తుండగా వాగులో పడి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టెబుల్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పొలానికి నీటి సరఫరా కోసం రైతులు కూడవెల్లి వాగులో విద్యుత్ మోటార్లు వేశారు. వాగు నుంచి మోటార్లు బయటకు తీసేందుకు లక్ష్మణ్, బాలయ్య, కనకయ్య వెళ్లారు. మృతుడు ఎనగుర్తి లక్ష్మణ్(50) మొదటగా కొయ్యాడ స్వామిగౌడ్కు చెందిన మోటారును బయటకు తీశాడు. అదే విధంగా పోసిగారి ప్రభాకర్ మోటారును బయటకు తీయమని కమటం సురేశ్, ఇస్తారు మల్లయ్య అడిగారు. లక్ష్మణ్ మోటారును బయటకు తీస్తున్న క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనం ఢీకొని.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పెద్దాపూర్లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్ వివరాల మేరకు... ఈనెల 12న రాత్రి 11గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెద్దాపూర్ శివారులో గల భారత పెట్రోల్ బంకు సమీపంలో కాలి నడకన రహదారిని క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి. విద్యుదాఘాతంతో కార్మికుడు.. శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని గోమారంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరుడి రాములు(48) గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం గ్రామంలో నీరుడి రాములు మరో ఇద్దరు కార్మికులతో కలిసి విద్యుత్ సరఫరా నిలిపివేసి స్తంభాలపై వీధిలైట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా అనంతరం చౌరస్తా వద్ద ఓ స్తంభానికి లైటు వెలగకపోవడంతో విద్యుత్ ఉండగానే నిచ్చెన సాయంతో మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి స్తంభం పైనుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వాగులో పడి రైతు మృతి -
మెరుగైన పాలనకు దోహదం
గజ్వేల్: మున్సిపాలిటీల్లో మెరుగైన పాలన, వసతుల కల్పనకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ దోహదపడనుందని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాగా పాండవుల చెరువులో చేపట్టిన వ్యర్థాల తొలగింపు, డంప్యార్డు నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మి, మురళి, స్వప్న, రూప తదితరులు పాల్గొన్నారు.సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్రావు -
అక్రమ సిలిండర్ల స్వాధీనం
నర్సాపూర్: అక్రమంగా వాడుతున్న గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నట్లు విజిలెన్స్ అండ్ సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశం తెలిపారు. శుక్రవారం ఆయన తన బృందంతో పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లతో పాటు వంట గ్యాస్ వినియోగించే పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ వంట గ్యాస్ను వ్యాపార సంస్థల్లో వాడటం గుర్తించి 46 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 29 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. తాము పట్టుకున్న సిలిండర్లలో 38 హెచ్పీ, భారత్ కంపెనీకి చెందిన 6 , రెండు ఇండెన్కు చెందిన సిలిండర్లు ఉన్నాయన్నారు. తనిఖీల్లో ఇన్స్పెక్టర్ పాండరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, ఏఎస్ఓ నిస్సార్, డీటీ నాగరాజు, ఆర్ఐ నర్సింహులు పాల్గొన్నారు. పెట్రోల్ బంకు తనిఖీ చిలప్చెడ్(నర్సాపూర్): మండల కేంద్రమైన చిలప్చెడ్, చిట్కుల్ గ్రామాల్లోని పెట్రోల్ బంక్లను ఆర్ఐ సునీల్ చౌహాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చమురు నాణ్యత, స్టాక్ను పరిశీలించారు. స్టాక్ ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది? రోజు ఎంత చమురు అమ్ముతారని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు ఎలాంటి లోటు లేకుండా నిల్వ ఉంచుకోవాలన్నారు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద వాహనాలకు గాలినింపే యంత్రాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మిరుదొడ్డి(దుబ్బాక): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. మిరుదొడ్డి ఎస్ఐ సమత వివరాల ప్రకారం... దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన సున్నపు బుచ్చయ్య (52) ఇటీవల దుబ్బాకలో సొంత పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు ధర్మారం జాతీయ రహదారి మిరుదొడ్డి చౌరస్తా వద్ద బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బుచ్చయ్యను ములుగులోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన.. గజ్వేల్రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఎర్రవల్లి)లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పేర్ల గణేశ్(45) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో నెలకొన్న కలహాలతో తీవ్ర మనోవేదనకు గురై మూడ్రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గుర్తుతెలియని మృతదేహం.. జిన్నారం (పటాన్చెరు): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... వ్యవసాయ క్షేత్రాల సమీపంలోని ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకి తీసి, కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వనదుర్గమ్మా.. ప్రసాదం ఎట్లా?
ఏడుపాయలకు తాకిన గ్యాస్ కొరతఒక్క రోజు నిలిచిన లడ్డూ ప్రసాదం ● తప్పని కట్టెల పొయ్యిపాపన్నపేట(మెదక్): పశ్చిమాసియా యుద్ధం మంటలు ఏడుపాయల లడ్డూ ప్రసాదానికి కూడా తాకాయి. గ్యాస్ సిలిండర్లు దొరకక మూడు రోజుల నుంచి పొయ్యి వెలగలేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు గత వారం రోజులుగా దొరకడం లేదు. దీంతో గురువారం భక్తులకు అమ్మవారి ప్రసాదం కరువైంది. చివరకు కట్టెల పొయ్యి రాజేసి శుక్రవారం లడ్డు పులిహోర తయారు చేసి, భక్తులకు అందించారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గమ్మ ప్రసాదం లడ్డూ, పులిహోర విక్రయిస్తారు. లడ్డూ రూ.20, పులిహోర రూ.10కి అమ్ముతుంటారు. ప్రతి రోజు ఎంత లేదన్నా రూ.70 నుంచి రూ.80 వేల ప్రసాదం విక్రయిస్తారు. ఆదివారం ప్రసాదం ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు. నెలకు 80 నుంచి 100 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. మొదట్లో రూ.2019 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్, యుద్ధం తర్వాత రూ.2133కు చేరింది. ఇప్పుడు అవి కూడా దొరకడం లేదు. దీంతో ఏడుపాయల్లో గత ఆదివారం తయారు చేసిన ప్రసాదం, బుధవారం వరకు అందుబాటులో ఉంది. గురువారం మాత్రం భక్తులకు ప్రసాదం అందలేదు. దీంతో మట్టి పొయ్యి నిర్మించి కట్టెల మంట ద్వారా లడ్డు ప్రసాదం తయారు చేయించి, భక్తులకు అందజేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
ఏఐతో మరిన్ని ఉద్యోగాలు
పటాన్చెరు: కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్ పరిధిలోని రుద్రారంలో సీజీసీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయడం, ప్రధాన రంగాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఇండస్ట్రీ కాంక్లేవ్ ముగిసింది. ఎన్ఎక్స్ పీ సెమీకండక్టర్స్లో ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అధిపతి ప్రీత్ యాదవ్, స్టెల్లాంటిస్లో డెలివరీ లీడ్ సుమన్ గోర్లా ముఖ్య అతిథులుగా హాజరై కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.కాంక్లేవ్లో అభిప్రాయపడ్డ పరిశ్రమ నిపుణులు -
మెడికల్ బిల్లులు సక్రమంగా పంపిస్తలేరు
మెదక్జోన్: మెదక్ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సూపరింటెండెంట్ లతీఫ్ఉద్దీన్ ముజాయుద్దీన్, మెడికల్ బిల్లులను సక్రమంగా ఉన్నతాధికారులకు పంపటం లేదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ బిల్లుల విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేయటంతో శుక్రవారం రికార్డులను తనిఖీ చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తించామని చెప్పారు. తన సెక్షన్లో 282 బిల్లులను ఉన్నతాధికారులకు పంపకుండా పెండింగ్లో పెట్టాడని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ పేర్కొన్నారు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్రెడ్డి సుదర్శన్రెడ్డి -
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు
శివ్వంపేట(నర్సాపూర్): ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని లీవ్ ఫామ్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ రంగనాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామంలో సాగు చేస్తున్న 2 సంవత్సరాల వయస్సు గల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి పలు సూచనలు చేశారు. పంట 4వ సంవత్సరం నుంచి కోతకు వస్తుందన్నారు. ఎకరాకు నెలకు సగటున 7 నుంచి 9 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. మార్కెట్లో టన్ను ధర రూ.22 వేలు ఉందన్నారు. ఎకరాకు నెలకు 15 వేల నుంచి 18 వేల ఆదాయం వస్తుందన్నారు. -
డ్రెస్ కొనేందుకు వెళ్లి..
యువతి అదృశ్యం పటాన్చెరు టౌన్: యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్ పాపన్నపేటకు చెందిన వికాస్ ఇస్నాపూర్ పరిధిలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వికాస్కు వరుసకు చెల్లైలెన సురేఖ మెదక్ నుంచి అతడి ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులు ఉన్నాయని డ్రెస్ కొనేందుకు 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వికాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్యమెదక్ కలెక్టరేట్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు వార్డు అవుసులపల్లికి చెందిన దాసరి సత్యనారాయణ(46) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య మంజులతోపాటు పెలైన ఇద్దరు కొడుకులు ఉన్నారు. నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు గజ్వేల్రూరల్: జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిర్దోషిగా బయటకు వస్తారని జాగృతి లీగల్ సెల్ నేత కొట్టాల యాదగిరి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్లో మాట్లాడుతూ లిక్కర్ కేసులో కవితపై ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐ మోపిన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని హైకోర్టు పేరిట నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జాగృతి నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు తీర్చేందుకే భూ రీసర్వే
కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సమస్యలు తీర్చేందుకు భూ రీసర్వే నిర్వహిస్తున్నామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. శుక్రవారం సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో గ్రామ సభ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... భూ సర్వే నిర్వహించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఖాజాపూర్ గ్రామం ఎంపికై ందని తెలిపారు. రైతులకు పొలం గట్లు, హద్దుల సమస్యలు పరిష్కారం చేసేందుకు రీసర్వే ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్రెడ్డి, డీప్యూటీ తహసీల్దార్ హేమంత్కుమార్, సర్పంచ్ రమ్య, ఉపసర్పంచ్ షేక్ హబీబ్ పాల్గొన్నారు.సబ్ కలెక్టర్ ఉమా హారతి -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 28రోజుల్లో హుండీ ద్వారా రూ.1,20,29,945 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఆలయంలోని హుండీలనూ దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలిత సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,20,29,945, మిశ్రమ బంగారం 89 గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 34 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగం నర్సింహారెడ్డి, లింగం, ఎల్లయ్య, మల్లేశం, ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్.సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, లలిత సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు
సంగారెడ్డి జోన్: యువత మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా కఠిన శిక్షలు ఉంటాయని అదనపు కలెక్టర్ పాండు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్డీపీఎస్ చట్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కావొద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో నష్టాలు, భవిష్యత్లో ఎదురయ్యే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ పాండు -
మరో 60 ట్రాన్స్ఫార్మర్లు
నారాయణఖేడ్: విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారంపై విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా 30 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని, త్వరలో మరో 60 ట్రాన్స్ఫార్మర్లు రానున్నాయని తెలిపారు. నాగన్పల్లి, ఇస్లాంపూర్., ఇరక్పల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు స్థలాల ఎంపిక జరగగా బోర్గీలో స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కడ్పల్లో 132 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలం ఎంపిక జరిగిందన్నారు. 1,000 విద్యుత్ స్తంభాలకు ప్రతిపాదించామని చెప్పారు. ఖేడ్ పట్టణంలో రూ.25 లక్షలతో మరో రెండు ఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. 160 కేవీకి సంబంధించి ఐదు ట్రాన్స్ఫార్మర్లు మంజూరుకాగా మూడు విడుదలయ్యాయని పేర్కొన్నారు. 50 ఎల్డీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, అవసరాల మేరకు ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 200 స్తంభాలు కేబుళ్లతోసహ ప్రతిపాదించామన్నారు. కౌలాస్నాలా ద్వారా కంగ్టి మండలంతోపాటు, జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు పంపామని వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమీక్షలో విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి -
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
గ్యాస్ గోసపశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా వచ్చిన గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ అడగటం, బుకింగ్ కాకపోవటం, సర్వర్ డౌన్ కారణంగా జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలే ఇప్పుడు పరీక్షల సమయం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులు గొడవ పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో హాస్టళ్లు, హోటళ్లు, కర్రీపాయింట్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. కట్టెల ధర ఎక్కువగా ఉండటం, విపరీతమైన పొగ రావటంతో వంట చేసే వారి బాధలు వర్ణనాతీతం.మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య, చిత్రంలో ఎస్పీ పరితోష్సంగారెడ్డి జోన్: జిల్లాలో గ్యాస్ నిల్వలు చేసి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో గ్యాస్ సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల కొరత ఎక్కడా లేదన్నారు. వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఎస్హెచ్ఓ, 100 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా పౌర సరఫరాల అధికారి బాలసరోజ, సహాయ పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, సంక్షేమ శాఖల అధికారులు అఖిలేష్ రెడ్డి, జగదీష్, రాజేశ్వర్ అంబదాస్, లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎల్పి.జి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.కోత్లాపూర్లో సిలిండర్ కోసం క్యూ లైన్లో నిలబడిన జనం కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరిక గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు ప్రాధాన్యత క్రమంలో బుకింగ్ చేసుకోవాలి -
అవసరమైతే అసెంబ్లీ ముట్టడి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు, స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, స్కీం వర్కర్లు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ, ఆశా, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఐకేపీ, వీవోఏ, మిషన్ భగీరథ, హాస్పి టల్, మెడికల్, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, వివిధ రంగాల నాయకులు మంగ, మంజుల, నగే ష్, యశోద, దశరథ్, సదానందం, లక్ష్మణ్, జయరాం, రాములు, సుధాకర్ , యేసుమని, సత్తయ్య, ప్రశాంతి, అనిత, గౌరమ్మ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు వేతనాలు పెంచాలని డిమాండ్ -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సంగారెడ్డి టౌన్: ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు డీఆర్డీఏ బాలరాజు అన్నారు. శుక్రవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 11 గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సరైన రికార్డులు లేని గ్రామాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా, మండల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 78 మందికి ఆఫర్ లెటర్లుజాబ్ మేళాకు స్పందన సంగారెడ్డి టౌన్: మహేంద్ర కంపెనీ నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్లో 78 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. మరిన్ని కంపెనీలను ముందుకు తీసు కొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జహీరాబాద్ మహేంద్ర కంపెనీ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ పరీక్షలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 15,765 మంది విద్యార్థులకు గానూ 15,330 మంది విద్యార్థులు హాజరు కాగా 435 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,327 మంది విద్యార్థులకు గానూ 14,029 మంది విద్యార్థులు హాజరు కాగా 298 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1438 మంది విద్యార్థులకు గానూ 1301 మంది విద్యార్థులు హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 97.24గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. సీసీ రోడ్లకు రూ.2 కోట్లు మంజూరు: ఎమ్మెల్యేజహీరాబాద్ టౌన్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఝరాసంగం మండలంలోని 12 గ్రామాలకు గాను రూ.60 లక్షలు, కోహీర్ మండలంలోని మూడు గ్రామాలకు రూ.20 లక్షలు, మొగుడంపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు రూ. 35 లక్షలు, న్యాల్కల్ మండలంలోని 10 గ్రామాలకు గాను రూ. 45 లక్షలు, జహీరాబాద్ మండలంలోని 9 గ్రామాలకు రూ. 40 లక్షల చొప్పన నిధులు మంజూరు అయినట్లు వివరించారు. -
ఇండస్ట్రియల్ టూర్.. నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు
కొండపాక(గజ్వేల్): ఇండస్ట్రియల్ టూర్ ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంపొందుతాయని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. పీఎంశ్రీ కుకునూరుపల్లి పాఠశాల విద్యార్థులు గురువారం ఇండస్ట్రియల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండస్ట్రియల్ టూర్ ద్వారా పరిశ్రమల పని విధానం, యంత్రాల వినియోగం, భద్రతా నియమాలు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల విషయాలను ప్రత్యక్షంగా గుర్తిస్తారన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాలు ప్రాక్టికల్గా చూడటం, తయారు చేయడం వంటి పని విధానం జీవనోపాధికి ఉపయోగపడుతాయన్నారు. కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, టైలరింగ్ తదితర కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్ వెంకటరమణ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.ఎంఈఓ బచ్చలి సత్తయ్య -
విద్యార్థి దశ నుంచే అవగాహన
విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ రమేశ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థి దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన కల్గి ఉండాలని, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో జిల్లా స్థాయి కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు పోస్టర్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ కౌమార దశలో బాల బాలికలకు కలిగే శారీరక, మానసిక, ఉద్వేగపరమైన మార్పుల గురించి అవగాహన కల్పించామని తెలిపారు. హెచ్ఐవీ, ఎస్టీఐ సంక్రమిత వ్యాధుల నివారణకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పోస్టర్ మేళాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం అధికారి డానియల్, అర్బన్ మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్పంచ్కు జాతీయ అవార్డు
కొండపాక(గజ్వేల్): మండలంలోని జప్తినాచారం సర్పంచ్ లక్కిరెడ్డి పావని ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ (బీకాన్) అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ సమ్మేళన్ కార్యక్రమంలో మహిళా సర్పంచ్ల సామాజిక సంస్కరణల విభాగంలో గుర్తింపును పొందారు. సర్పంచ్గా గెలుపొందిన అనతి కాలంలోనే పావని డ్రగ్స్, మద్యపాన వినియోగం వల్ల ఏర్పడే దుష్పరిణాలు, ఇబ్బందులపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అవార్డు పొందిన సందర్భంగా సర్పంచ్ను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు పొందడానికి యువత, గ్రామస్తుల సమష్టి కృషి ఫలమేనన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు శివ్వంపేట(నర్సాపూర్): దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి వివరాలు ఇలా... మండల పరిధిలోని కొంతన్పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్పై బుధవారం సాయత్రం బెదిరింపులతో పాటు కొందరు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వెంకట్రామిరెడ్డి, రవీందర్రెడ్డి, వెంకటేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలే..
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. డార్మెటరీతో పాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వీడాలని అధికారులను మందలించారు. డార్మెటరీలోని నిత్యావసర సరుకులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు రాజులు, భాస్కరాచారి, లింగం, రాజు, బాల్నర్సింహులు, దిలీప్, నితిన్ పాల్గొన్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి -
హత్యాయత్నం కేసులో ఒకరు..
సిద్దిపేటకమాన్: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణంలోని సాజీద్పూరకు చెందిన ఎండి అర్షద్ స్థానికంగా మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. పక్క దుకాణదారుడైన ఎండి షాబుద్దీన్ తన దుకాణం సరిగా నడవకపోవడంతో దానికి కారణం ఎండి అర్షద్, అతడి తమ్ముడు షాహీద్ అని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న షాహిద్ తలపై ఇనుపరాడుతో షాబుద్దీన్ దాడి చేశాడు. అడ్డువచ్చిన అర్షద్ను కొట్డాడు. షాహీద్ను హైదరాబాద్లోని ప్రయివేట్కు తరలించారు. -
28న జాతీయ లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, ఎన్ఐ యాక్టు, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, కాంపౌండబుల్, సివిల్, చెక్బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు లోక్అదాలత్లో కేసులు రాజీ చేసుకుంటే సమయం వృథా అవదన్నారు. న్యాయవాదులు అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. సెల్ఫోన్లు అప్పగింత సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న సెల్ఫోన్లను నూతన టెక్నాలజీ సాయంతో గుర్తించి బాధితులకు అప్పగించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు కమిషనరేట్ పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్నట్లు బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయడంతో పాటు పీఎస్లలో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు నూతన టెక్నాలజీ సాయంతో పోగొట్టుకున్న వాటిని గుర్తించి 109 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్రెడ్డి, నర్సింహులు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, శ్రీను పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్లకు జరిమాన కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమాచారంతో.. మండలంలోని కూరెళ్ల పరిధి శివారులో మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ చంద్రశేఖర్ పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.15వేల చొప్పున జరిమానా విధించి, ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలు పట్టాల కిందపడి.. కాలు తెగి వ్యక్తికి తీవ్ర గాయాలు మనోహరాబాద్(తూప్రాన్): రైలు ఎక్కుతున్న క్రమంలో పట్టాల మధ్య పడి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. గురువారం 108 ఈఎన్టీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్–కాచిగూడ రైలులో చేగుంటలో బిహారీలాల్ (58) ఎక్కాడు. కాగా మార్గమధ్యలో మనోహరాబాద్ వద్ద రైలు ఆగడంతో కిందిగి దిగిన అతడు కదులుతున్న ట్రైన్ ఎక్కు తుండగా ప్రమాదవశాత్తు పట్టాల మధ్య పడిపోయాడు. దీంతో అతని కుడి కాలు తేగిపోవడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి ప్రథమ చికిత్స చేసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకును వెతికేందుకు వెళ్లి.. కుంటలో పడి తల్లి మృతి తూప్రాన్: వారం రోజులుగా కన్న కొడుకు కనిపించకపోవడంతో వెతకడానికి వెళ్లిన తల్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందింది. ఈ సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం... కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అనారోగ్యానికి గురైన లక్ష్మి తన రెండో కుమారుడితో బుధవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో తన పెద్ద కుమారుడి మాదిరిగా కనిపించిన యువకుడిని చూసి వెనకాల వెళ్లిన ఆమె రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి మృతి చెందింది. వెంటనే గ్రామస్తుల సహకారంతో బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఇక పామాయిల్ మేడ్ ఇన్ సిద్దిపేటగా మారనుంది. ఆయిల్ పామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీయడంతోపాటు రిఫైన్డ్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ రూపంలో బయటకు రానున్నాయి. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫ
సిద్దిపేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ (ఇన్సెట్లో ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు)మహర్దశ భారతదేశంలో ఆయిల్ కొరతతో ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. అలాగే ఆ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి.. ప్రస్తుతం 31 జిల్లాల్లో దాదాపు 70వేల మంది రైతులు 2.90లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా పామాయిల్ను సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పరిశ్రమకు 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలో పనులు పూర్తయి ఇప్పటికే ట్రయల్ రన్ సైతం పూర్తయింది. గంటకు 30 నుంచి 120 టన్నులు అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం నుంచి మొదట ప్రారంభించనున్నారు. ఆయిల్ పామ్ పండ్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఫ్యాక్టరీ నిర్మాణం కావడం దేశంలోనే తొలి పరిశ్రమ ఇది. వ్యర్థాలతో విద్యుత్ ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక యూనిట్కు రూ.1.5 మాత్రమే ఖర్చుతో ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. కాలుష్య రహిత కాలుష్య రహితంగా ఫ్యాక్టరీని నిర్మించారు. ఇక్కిడి నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీయూజ్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. భూగర్భ జలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగులకు ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 22వరకు రైతు మేళా నిర్వహించనున్నారు. మేళా ముగింపు కార్యక్రమం, ఆయిల్ పరిశ్రమ ప్రారంభానికి సీఎం రాక సందర్భంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నర్మెటలో 62 ఎకరాల్లోరూ.300 కోట్లతో నిర్మాణం వ్యర్థాలతో విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో 2.90లక్షలఎకరాల్లో సాగు ఈ నెల 22న ప్రారంభించనున్న సీఎంఇక్కడే రిఫైన్డ్ -
ప్రహరీ గోడ నిర్మాణం అడ్డగింత
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల ప్రహరీల నిర్మాణంను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని మానేపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. దీంతోపాటు పక్కనే చెరువు, పెద్ద కాలువ ఉండటంతో ప్రహరీ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేసింది. కాగా సంబంధిత గుత్తేదారు పనులను ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణ నుంచి తమ పంట పొలాలకు దారి ఉందని ప్రహరీ నిర్మించడానికి వీలులేదని గ్రామానికి చెందిన కొందరు రైతులు అడ్డుకున్నారు. దీంతో పునాది వరకు చేసిన పనులను గుత్తేదారు నిలిపివేశారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల రక్షణకు ప్రహరి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గుర్తుతెలియని మృతదేహం
సంగారెడ్డి క్రైమ్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మహబూబ్ సాగర్ చెరువులో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహం బయటకు తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. చాకెట్ల్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి అల్లాదుర్గం(మెదక్): చెట్టు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో గురువారం చోటుచేస్తుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (27) తన భార్యతో కలిసి అల్లాదుర్గం గ్రామానికి చెందిన అనిల్కుమార్ రెడ్డి మామిడి తోటలో కూలీ పని చేస్తున్నారు. ఈ క్రమంలో హరికృష్ణ చింత చెట్టు ఎక్కి చింతపండు తెంపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అతడ్ని పెద్ద శంకరంపేట ప్రైవేట్ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇదేం పాపం
ఆందోళనకు గురిచేస్తున్న తల్లిదండ్రుల తీరు ● కొందరు మగబిడ్డ పుట్టలేదని.. ● పోషించే స్థోమత లేక.. డబ్బులకోసం ఇంకొందరుమెదక్జోన్: నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారుముద్దుగా పెంచాల్సిన ‘అమ్మానాన్న’ అనే పదానికే కొందరు మచ్చ తెస్తున్నారు. పేగుబంధాన్ని మరిచి అంగడి సరుకులా కన్నబిడ్డల్ని అమ్మేస్తున్నారు. మగబిడ్డ కోసం ఎదురు చూస్తూ మూడు, నాలుగో కాన్పుల్లోనూ మళ్లీ ఆడపిల్ల పుట్టడం, మరికొందరు పిల్లల్ని పోశించే స్థోమత లేక, ఇంకొందరు డబ్బుల కోసం విక్రయిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించిన తల్లిదండ్రుల తీరు ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం హవేళిఘణాపూర్ మండలం లింగసాన్పల్లి తండాలో మొదటి కాన్పులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులనే సాకుతో రూ. 1.50 లక్షలకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ఇది గమనించిన అంగన్వాడీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. శిశుసంరక్షణలో.. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 మంది శిశువులను విక్రయించినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వాటిలో కేసులు నమోదు చేసి, విక్రయానికి గురైన శిశువులను రప్పించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, 25 మందిని తిరిగి అప్పగించారు. వారిలో ఇద్దరు దంపతులు మాత్రం చిన్నారులను పోషించలేమని శిశు సంరక్షణ కేంద్రంలోనే వదిలేశారు. పసికందులను విక్రయించిన వారిలో 95 శాతం మంది తల్లిదండ్రులకు చదువు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. నేటి సమాజంలో కూతురు, కొడుకు సమానమనే భావనకు రాకపోవడమే ఇందుకు కారణం. ఆడపిల్లకు కట్నాలు, కానుకలు ఇచ్చి పంపాలనే ఆలోచనతో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఈ వివక్షను పూర్తిగా రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికి చదువుకోవడమే ఏకై క మార్గమని అధికారులు చెబుతున్నారు. శిశు విక్రయాలతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
బ్యాటరీ దొంగల అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): టీ–ఫైబర్కు సంబంధించిన బ్యాటరీలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు బ్యాటరీలు, స్విఫ్ట్కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్ఐ మహ్మద్ అసీఫ్ పీఎస్లోకేసు వివరాలు వెల్లండించారు. గత నెల 27న గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి మండలంలోని వల్లంపట్ల గ్రామ పంచాయతీలో ఉన్న 120 ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. టీ–ఫైబర్ కంపెనీకి చెందిన టెక్నీషియన్ చంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కమాన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్త్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైతం 65ఏహెచ్ సామర్థ్యం గల మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు పంపించారు. మరో ఘటనలో బైక్ దొంగ.. సిద్దిపేట అర్బన్: బైకును అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. చేర్యాలకు చెందిన శశినాథ్రెడ్డి ఫిబ్రవరి 20న నాంచారుపల్లి శివారులోని ఓ దేవాలయం వద్ద తన యూనికాన్ బైకును నిలిపి దర్శనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి బైకు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడి ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన తోటకూరి నరేశ్కుమార్గా గుర్తించారు. ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. అలాగే వన్టౌన్ స్టేషన్ పరిధిలో కూడా బైకును చోరీ చేశాడు. నిందితుడి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద నుంచి ప్రయాణికులతో ఆటో మెద క్ వస్తుంది. ఈ క్రమంలో చంద్రభవన్ కాంప్లెక్స్ సమీపంలో ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆటో ఎదురుగా వచ్చిన కారు, బైక్ లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారితోపాటు బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో టి.మాందాపూర్ తండాకు చెందిన ధరావత్ బాల్య, అతని భార్య పద్మ, షబానా బేగం, తిరుమల శ్రీనివాస్ ఉన్నారు. వీరిని 108లో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చే శారు. -
రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం
వర్గల్(గజ్వేల్): భౌగోళిక రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి. శ్రీలత అన్నారు. వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించిన రెండోరోజు జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల నాయకత్వం, భాగస్వామ్యం ద్వారా సమానత్వం, శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో, శాంతి ప్రక్రియల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ముందుండాలన్నారు. దక్షిణాసియాలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, సవాళ్లను ఎదుర్కొంటూనే పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అధ్యాపకులు సుమ, విద్య, డాక్టర్ పీ.సుజాత, డీ.సుజాత, వీపీ గోవిందరావు, దేదీప్య, జయలక్ష్మి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పత్రాలు సమర్పించిన వారందరికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత -
రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్కంది(సంగారెడ్డి): భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విక్రేతలు, కొనుగోలుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్ సూచించారు. మండల కేంద్రమైన కందిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించి భూభారతి ద్వారా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు విక్రయించే వారు, కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్ సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మెరుగైన సేవలు
డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల పటాన్చెరు టౌన్: రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యాలను విస్తరిస్తా మని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికై న మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, వైస్ చైర్మన్ మదాస్ రాజశేఖర్లు టీజీఐఐసీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. -
ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల్లోభాగంగా చివరిరోజైన గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,181మంది విద్యార్థులు హాజరు కాగా 730 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 16,749 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 1,432 మంది హాజరుకాగా 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు96.14%గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. డీఐఓ రెండు, డీఈసీ మెంబర్లు 11, హెచ్పీసీ మెంబర్లు 03, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 11, 08 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
సర్వం సిద్ధం
14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● హాజరు కానున్న 24,657 మంది విద్యార్థులు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా జిల్లా వ్యాప్తంగా 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. న్యాల్కల్(జహీరాబాద్)/ సంగారెడ్డి ఎడ్యుకేషన్ జిల్లాలో 11 ప్రభుత్వ, 197 జిల్లా పరిషత్తు, 17 కేజీబీవీలు, 2 ఎయిడెడ్, 10 తెలంగాణ మోడల్ స్కూల్స్, 2 టీజీ రెసిడెన్షియల్, 12 ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్, 11 సోషల్ వెల్ఫేర్, 6 ట్రైబల్, 12 మైనార్టీ రెసిడెన్షియల్, 2 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 201 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి 15,033 మంది విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 9,624 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు మరో 46 మంది ఇతర విద్యార్థులతో కలిపి మొత్తం 24,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీ కెమెరాలు పరీక్షలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే సీల్ ఓపెన్ చేస్తారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్తోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది అంటుబాటులో ఉంచారు. ఇతర దుస్తుల్లో హాజరు.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల యూనిఫాంతో కాకుండా ఇతర దుస్తులు ధరించి పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్లోకి మొబైల్తోపాటు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాధికారి, డీఈఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ల మొబైల్ నంబర్లను డిస్ప్లే చేయాలని చెప్పారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి విద్యార్థులకు రవాణ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని ఇదివరకే కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిసిందే. ప్రశాంతంగా పరీక్ష రాయాలి విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పది పరీక్షలను పకడ్బందీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవడంతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తీసుకురాకూడదు. ఏదేమైనా పది పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి 123 పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 123 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 12 మంది రూట్ ఆఫీసర్లు, 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 123 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 65 మంది కస్టోడియన్స్, 6 (బృందాలు) ఫ్లయింగ్ స్క్వాడ్, 123 సిట్టింగ్ స్క్వాడ్, 1,300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు హాల్టికెట్, ప్యాడ్, పెన్నులు తమ వెంట తెచ్చుకోవాలని వారు తెలిపారు. మీసేవ కేంద్రాలతో పాటుగా 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్టికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూర్ కోడ్ను కూడా ముద్రించారు. స్వల్ప మార్పులు పది పరీక్షలు నిర్వహణలో స్వల్ప మార్పులు చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిని కల్పించారు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. -
డీహెచ్పీఎస్కు జిల్లా ఎంపిక
● మరింత సమర్థవంతంగా వైద్య సేవలు ● మంత్రి దామోదర రాజనర్సింహ కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్య సేవలను అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థ (డీహెచ్పీఎస్)ను అమలు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. డీహెచ్పీఎస్ను తొలుత పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కలెక్టరేట్లో డీహెచ్పీఎస్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లాస్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కందిలో కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. తర్వాత సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ప్రాజెక్టు అమలులో భాగంగా జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అమలు చేస్తున్నామన్నారు. రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించి, డీహెచ్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారు. డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటంతో తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సబ్సిడీపై యంత్రాల పంపిణీ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కొక్కటీ రూ.4.9 లక్షల విలువ చేసే 20 హెచ్పీ కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు మంత్రి దామోదర చెప్పారు. రైతులకు పంటల సాగుపై అవగాహన, విద్యారంగంలో పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రజల కోసమే ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిందన్నారు. జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు గ్రామాలు పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్.చొంగ్తూ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఫహీం, అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీసీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయిజహీరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. యుద్ధం ఇలాగే కొనసాగితే రంజాన్ మాసంలో ప్రపంచమంతా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వంటగ్యాస్, నూనెలు, నిత్యావసర సరకుల ధరలు పెరిగి పోయాయన్నారు. యుద్ధం ముగియాలని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అల్లాను ప్రార్థించా లని కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫాలు అందజేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. గత రెండు బడ్జెట్లలో ముస్లింలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఈ బడ్జెట్లో అయినా రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. కల్యాణలక్ష్మి–షాదీముబారక్ కింద ఇచ్చిన మాట ప్రకారం రూ.1.60లక్షలు అందజేయాలని కోరా రు. సమావేశంలో ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిలర్ గౌస్గౌరి వితంతువులకు ప్రతి నెలా రూ.500 వంతున పింఛన్ చెల్లింపులను హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. -
సమస్యల్ని పరిష్కరించండి
కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు సంగారెడ్డి: నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో చింత ప్రభాకర్, మాణిక్ రావు కలెక్టర్ను కలసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అరుట్ల, రాజంపేట్, సదాశివపేట, పెద్దాపూర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా బోర్వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. చిమ్నాపూర్ గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భవన నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్కు వివరించారు. సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి బైపాస్లో నిర్మాణంలో ఉన్న 80 అడుగుల రోడ్డు పనులు నాణ్యత లేకుండా నిదానంగా సాగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.44 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీలో రూ.8.50 కోట్లతో అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. బేగంపేట్ గ్రామంలో వాటర్ ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, స్థానిక సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్...విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మరో రూ.2 కోట్లు మంజూరు చేయండి సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న మినీ హజ్ హౌస్ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు కోరారు. హనుమాన్ నగర్లో ముస్లిం, క్రిస్టియన్ సమాధుల కోసం కేటాయించిన స్థలంలో సరైన వసతులు లేవని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
సిరుల జొన్న
జహీరాబాద్ టౌన్: ఇటీవల కాలంలో ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు రావడంతో జొన్నలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండే ఇప్పుడు జొన్న రైతులకు సిరులు కురిపిస్తోంది. సాధారణంగా యాసంగిలో రైతులు ఆరుతడి పంట ల సాగుకు ఆసక్తి చూపుతారు. కూరగాయలు, శనగ, మొక్కజొన్న, కుసుమ, గోధుమ, ఉల్లితోపాటు జొన్న పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేతకు ఉపయోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో జొన్నను రబీలో ఎక్కువస్థాయిలో పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. యాసంగిలో రైతులు జొన్న పంట సాగుకు ఆసక్తి చూపడంతో జిల్లాలో పంట విస్తీర్ణం పెరిగింది. జొన్న పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. జిల్లాలోని మునిపల్లి, నారాయణఖేడ్, మనూర్, న్యాల్కల్, రాయికోడ్, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్ తదితర మండలాల్లో జొన్న సాగువుతుంది. రాష్ట్ర సరిహద్దులో గల కర్ణాటకలో కూడా ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 25 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది విస్తీర్ణం రెట్టింపు అయింది. సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. పెరుగుతున్న పంట విస్తీర్ణం జొన్నలకు మంచి డిమాండ్ అనువైన రకాలు ఎంపిక చేసుకోవాలి అధిక దిగుబడులను సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకోవాలి. సాగు విధానంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. జొన్నకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభం కలుగుతుందన్నారు. –భిక్షపతి, వ్యవసాయశాఖ ఏడీఏ చిరుధాన్యాల్లో ముఖ్యమైన జొన్నలను ఆరోగ్యం కోసం ఏకమొత్తంగా ఆహారం కోసం తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జొన్న రొట్టెలను ఇష్టంగా తింటుడటంతో జొన్నలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్కు రూ.6 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు సగటున 25–30 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. జొన్నకు తెగుళ్ల బెడద ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు శ్రమిస్తే చాలు. -
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ,సఖి కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలను గౌరవించాలని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయపరమైన విషయంలో ఉచితన్యాయ సహాయం కోసం కోర్టును సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకులుగా ఎదగండిజిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పటాన్చెరు: ఏదైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు స్వీయ రక్షణతోపాటు తోటి పౌరులను రక్షించడం కోసం వారం రోజుల శిక్షణ తరగతులను గీతం విద్యార్థులకు అందజేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛంద సేవకులుగా ఎదగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సౌజన్యంతో వారం రోజుల ‘పౌర రక్షణ స్వచ్ఛంద శిక్షణ సామర్థ్య నిర్మాణం’కార్యక్రమాన్ని గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మతో కలిసి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ శిక్షణలో అగ్నిప్రమాదాలు, విమాన, రసాయన, అణు విస్పోటనం, వరదలు, భవన సముదాయాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపకాధికారి భిక్షపతి, ఎస్టేట్ అధికారులు డీవీఏ మోహన్ ఇతర అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్స్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న స్ఫూర్తి డిగ్రీ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, సతీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ...జిల్లా కేంద్రంలో ఉన్న స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తరగతులు బోధించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. విద్యార్థులే స్వయంగా యూట్యూబ్లో టాపిక్ సెర్చ్ చేసుకుని క్లాసెస్ వింటున్న పరిస్థితి ఉందన్నారు. వెంటనే కాలేజీ గుర్తింపును రద్దు చేయని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తాం. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రీ సర్వేతో భూసమస్యలు దూరంసబ్ కలెక్టర్ ఉమాహారతి నారాయణఖేడ్: రీ సర్వేతో భూసమస్యలు దూరమవుతాయని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. ఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామంలో భూ భారతి రీసర్వేలో భాగంగా గురువారం గ్రామసభను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ...రీ సర్వేలో భూముల హద్దులు నిర్ధారణ అయ్యి భూసమస్యలకు అవకాశం ఉండదన్నారు. రైతులు, గ్రామస్తులు రీసర్వేకు సహకరించాలని కోరారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి పరిధిలోని ఓ చెరుకు తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. బూచినెల్లికి చెందిన మాణిక్కు చెందిన 65వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న పొలంలో చెరకు సాగు చేస్తున్నాడు. అయితే బుధవారం పంటకు నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. అయితే చెరకు తోట మధ్యలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని చిరాగ్పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పటాన్చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని శివారులో ఉన్న దుర్గా రెడ్డి వ్యవసాయ పొలం పక్కనే ఉన్న మూన్ సిటీ వెంచర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు 30 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందన్నారు. అయితే అతడి కుడి చేతి షోల్డర్పై హనుమాన్ టాటూ, ఛాతిపై మామ్, డాడ్ టాటో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎంఓయూతో పరిశోధనకు ముందడుగు
వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ, తునికి ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్(ఈజీవీఎఫ్) మధ్య ఎంఓయూతో పరిశోధన, విద్య, గ్రామీణాభివృద్ధికి ముందడుగు పడుతుందని కావేరి వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ప్రవీణ్రావు అన్నారు. బుధవారం రెండింటి మధ్య (ఎంఓయూ) అంగీకారం కుదిరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా నాణ్యత, గ్రామీణ శక్తివంతీకరణను ఈ భాగస్వామ్యం సమన్వయం చేస్తుందన్నారు. సమ్మిలిత పరిశోధన కార్యక్రమాలు, పరిశ్రమ నైపుణ్యాలు, అకాడమియాలో పరస్పరం ఆలోచనలు పంచుకోవడం, సంయుక్త కార్యక్రమాలు, పాఠ్యాంశాల అభివృద్ధి, నైపుణ్యాల శిక్షణ, సమగ్ర విద్యకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బీ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పోలసాని, డీన్స్ డాక్టర్ కొండ శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కావేరి యూనివర్సిటీ వీసీ ప్రవీణ్రావు -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఒకరి మృతి, పలువురికి గాయాలు గజ్వేల్రూరల్: రింగురోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరికొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మండల పరిధిలోని రిమ్మనగూడ శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, జీపీపీ ఆర్టీసీ డిపో అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వస్తోంది. ఈ క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ శివారులోని రింగురోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన బస్సు డీకొంది. ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడు చిన్నకోడూరు మండలం లింగారెడ్డిపల్లికి చెందిన రంగు సత్యనారాయణ(70)కు తీవ్ర గాయాలు కాగా, బస్సు డ్రైవర్తో పాటు మరికొంత మందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా రంగు సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. -
సిలిం‘ఢర్’.. నో స్టాక్!
రాయికోడ్(అందోల్): పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం గ్రామాల్లోని గృహావసరాల గ్యాస్ సరఫరాపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం గృహావసరాలకు సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో వినియోగదారులకు తిప్పలు తప్పడంలేదు. మండలంలో సుమారు 9 వేల గృహ వినియోగదారులుండగా రోజుకు 120 సిలిండర్లు వినియోగమవుతున్నాయి. గతంలో ఆర్డర్ పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో సిలిండర్ లారీ లోడ్ వచ్చేది. అయితే యుద్ధం నేపథ్యంలో ఆర్డర్ పెట్టిన ఐదారు రోజులకు ఒక లోడ్ సరఫరా చేస్తున్నారని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.925 నుంచి రూ.985కు పెరగడం ఆర్థికంగా భారమవగా స్టాక్ లేకపోవడంతో నిరీక్షణ తప్పడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. -
● రత్నపురి కళాశాల ఎదుట ఆందోళన ● ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ,సీఐటీయూ నాయకుల మద్దతు ● ఆందోళన ఉధృతం.. నచ్చజెప్పిన పోలీసులు
హెచ్ఓడీని శిక్షించాలిహత్నూర(సంగారెడ్డి): 15 మంది సీఎస్సీ విద్యార్థులపై దాడి చేసిన హెచ్ఓడీ, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి బుధవారం ఆందోళన చేశారు. హత్నూర మండలం తురకల ఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సీఎస్సీ చదువుతున్న ఫస్టియర్ విద్యార్థులు 15 మందిపై మంగళవారం విచక్షణారహితంగా హెచ్ఓడీ అధ్యాపకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, సీఐటీ యూ నాయకులు కళాశాల గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై దాడి చేసిన హెచ్ఓడీతోపాటు యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గతంలో కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అధ్యాపకులు తరచూ విద్యార్థులపై దాడులు చేయడం ఈ కళాశాలలో సాధారణమైపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నారం సీఐ రమణారెడ్డి, ఎస్సై శ్రీధర్రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్తోపాటు మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సిబ్బందిని పిలిపించి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడించారు. విద్యార్థులపై దాడి చేసిన శివారెడ్డిని కళాశాల నుంచి ఎండీ సస్పెండ్ చేశారు. గాయాలపాలైన విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు. ఆందోళనలో ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు సాయికుమార్, ఎన్ఎస్వీఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేశ్, సీఐటీయూ నాయకులు శేఖర్, పలు గ్రామాల సర్పంచులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం తరగతి బోధనకే పరిమితం కాకుండా ఆచరణాత్మక, మార్కెట్ ఆధారిత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) కామర్స్ విభాగం బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ పాట్రిక్ ఆంథోని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రాజెక్టుల నివేదికల తయారీపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ స్థాయిలో ప్రాజెక్టుల తయారీ ఒక ముఖ్య విషయంగా ఉండటం విద్యార్థుల భవిష్యత్ కార్యచరణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడం, సూక్ష్మ పరిశీలన చేయడం, పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అనేక నైపుణ్యాలు పెంపుందుతాయన్నారు. అనుభవజ్ఞులైన ఆచార్యుల పర్యవేక్షణలో ప్రాజెక్టులు తయారు చేస్తే భవిష్యత్లో నిర్మాణాత్మక పరిశోధనలకు ఉపయోగపడుతాయని చెప్పారు. ప్రాజెక్టు ఆంశాలను ఎంచుకునేప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటయాన్నారు. సమాజంలోని మౌలిక సమస్యలు, జీవన ప్రమాణాలు, ఉత్పాదకతను పెంపొందించే ప్రాజెక్టులు తయారు చేస్తే పారిశ్రామిక రంగంలో మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత విద్యార్థులకు ఉపయుక్తమైన కార్యక్రమాలను నిర్వహించడంలో కామర్స్ విభాగం ముందుంటుందని అభినందించారు. కార్యక్రమ సమన్వయకర్త, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాలసుదర్శనం వర్క్షాప్ ముఖ్య ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, చర్చించే విషయాలు, శాస్త్ర సాంకేతిక మేళవింపు తదితర అంశాలను గూర్చి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఆయా విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓయూ బోర్డ్ఆఫ్ స్టడీస్చైర్మన్ పాట్రిక్ ఆంథోని డిగ్రీ కళాశాలలో ప్రాజెక్టులనివేదికలపై వర్క్షాప్ -
అభివృద్ధి పనులకు నిధులివ్వండి
మంత్రి వివేక్ను కోరిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం పెండింగ్లో ఉన్న నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ను కోరారు. ఈ మేరకు మంత్రి వివేక్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూ రు చేస్తానని హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. నేడు చెక్కుల పంపిణీ ఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్లో గురువారం ఉదయం 11 గంటలకు ఖేడ్, మనూరు, నాగల్గిద్ద, నిజాంపేట మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. రేపు జాబ్మేళాసంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి నిర్మల బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పదవ తరగతి ఆపై చదువుకున్న నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉ.11.00 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాధికారతే పురోగతికి పునాదిపటాన్చెరు: మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం పటాన్చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లావణ్య మాట్లాడుతూ...చేనేత రంగంలో చేనేత మహిళల కృషి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. చేనేత మహిళలకు ప్రభుత్వం అవసరమైన మద్దతు, శిక్షణ, మార్కెట్ అవకాశాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతారని వివరించారు. శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతన్నారు. -
ప్రజాప్రతినిధుల పట్టు
ప్రజాప్రతినిధుల వాదనలిలా.. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతోంది. జిల్లాకు మంజూరైన రూ.41.99 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనులను తామే నిర్ణయిస్తామని ఇరుపార్టీల ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పోటాపోటీగా పనుల ప్రతిపాదనల జాబితాలను పంపుతున్నారు. దీంతో ఎవరి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ.52.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, మహిళా సంఘాల భవనాలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.10.63 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన రూ.41.99 కోట్లకు సంబంధించిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఈ నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము సూచించిన పనులనే చేయాలని ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఎవరెవరు ఎన్ని రూ.కోట్ల పనులంటే.. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.రెండు కోట్లు, కాంగ్రెస్ నేతలకు కూడా రూ.2 కోట్ల నిధుల చొప్పున పనులు కేటాయించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సంగారెడ్డి నియోజకవర్గంలో చింత ప్రభాకర్ రూ.2 కోట్ల అంచనా వ్యయం కలిగిన సీసీ రోడ్లు పనులను ప్రతిపాదిస్తే..టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కూడా రూ.2 కోట్ల పనులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాణిక్రావుతోపాటు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులు ప్రతిపాదించారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా ఈ పనుల జాబితాలను పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఎంపీ రఘునందన్రావుతోపాటు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా చెరో రూ.2 కోట్ల మేరకు సీసీ రోడ్ల పనులను ప్రాతిపాదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. సీసీ రోడ్ల నిధుల కోసం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలన ఆయా ప్రజాప్రతినిధులు పంపిన ప్రతిపాదనలు కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలోని జిల్లా కమిటీ పరిశీలిస్తోంది. డీఆర్డీఏ పీడీ జ్యోతి, పంచాయతీరాజ్ ఈఈ యుగంధర్, డీపీఓ జానకిరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి రెండు రోజుల్లో పనులను మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్లు జారీ చేయనున్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరుల కోసం ప్రతిపాదిస్తుంటారు. సుమారు రూ.ఐదు లక్షల నుంచి రూ.10లక్షల వరకు అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమ అనుచరులకు ఇప్పించుకోవడం పరిపాటి. అయితే ఈ నిధుల విషయంలో మూడు పార్టీల ప్రజాప్రతినిధులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్న తామే ఈ పనులను ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటుంటే..తమకే ఈ పనులను ప్రతిపాదించే అధికారం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఈ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని తమ ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ప్రజాప్రతినిధులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ పనుల విషయంలో మూడు పార్టీల నేతలు పట్టుబడుతుండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
యథేచ్ఛగా కబ్జా
జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వ భూములు దర్జాగా అన్యాక్రాంతానికి గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రింగ్రోడ్డు సమీపంలోని కోట్ల విలువైన భూములు దురాక్రమణకు గురవుతున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి గ్రామ శివారు శంబిపూర్ సమీపంలోని 181 సర్వే నంబర్లు దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతోందని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫైర్ స్టేషన్ నిర్మాణం ఎప్పుడో! సర్వేనంబర్ 181లోని ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక యాజమాన్యాలు ప్రజాప్రతినిధుల సూచన మేరకు ఫైర్స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవా లని గతంలో కోరారు. ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ యంత్రాంగం స్థానిక నాయకులతో కలిసి స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. కానీ నేటికీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసు కోవాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో దర్జాగా ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు. బోర్డు ఏర్పాటులో అలసత్వం కాజిపల్లి శివారులోని సర్వే నంబర్ 181 భూములు దర్జాగా పలుమార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు రెవెన్యూ అధికారికి స్థానికులు ఫిర్యాదులు చేశారు. నామమాత్రంగా తనిఖీలు చేసి ఊరుకున్నారే తప్ప అక్రమార్కులపై సరైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు మాటల్లో చెప్పడమే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడి హెచ్చరిక బోర్డు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● లిక్కర్ బాటిల్ క్యూఆర్ కోడ్తోనిందితుల గుర్తింపు ● 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులుమెదక్ అర్బన్: వివాహేతర సంబంధం, వ్యసనాలు ఓ మహిళ హత్యకు దారి తీశాయి. సంఘటనా స్థలిలో లభించిన మద్యం సీసా క్యూఆర్ కోడ్తో వేట కొనసాగించిన పోలీసులు కేసును ఛేదించారు. సులోచన హత్య కేసులో నిందితులైన కొమ్మట రాజు, బానోతు భూలి ఎలియాస్ రేణను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాపన్నపేట మండలంలోని కొడుపాకకు చెందిన బేగరి సులోచన (35) భర్త దుర్గయ్య గత కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం ఆమె మెదక్ వెళ్లి కూలీ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో నిజాంపేట మండలం నగరం(నస్కల్) గ్రామానికి చెందిన కొమ్మట రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాజుకు నగరం తండాకు చెందిన బానోతు బూలి ఎలియాస్ రేణతో కూడా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల సులోచన నడవడికపై అనుమానం పెంచుకున్న రాజు, తరచుగా ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి, రాజు, రేణలు ఈనెల 9న సులోచనను మెదక్ నుంచి ఏడుపాయలలోని చెలిమలకుంట వద్దకు తీసుకెళ్లారు. వెళ్లేటప్పుడు నాగ్సాన్పల్లి కమాన్ వద్ద వైన్స్లో రెండు క్వార్టర్లు, రెండు బీర్లు తీసుకెళ్లి అక్కడ తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరిగి సులోచనను రాజు కర్రతో బలంగా కొట్టగా, రేణ ఆమె కాళ్లు కదలకుండా పట్టుకుంది. సులోచన చనిపోగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాల తీసుకొని పరారయ్యారు. కాగా విచారణ ప్రారంభించిన పోలీసులు అక్కడ లభించిన మద్యం సీసాల క్యూఆర్ కోడ్ ఆధారంగా నాగ్సాన్పల్లి కమాన్ వైన్స్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
త్వరలో ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం
ములుగు(గజ్వేల్): రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో త్వరలోనే అన్ని హంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్.దిలీప్ బుధవారం ఉద్యాన వర్సిటీనీ సందర్శించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతులకు అధునాతన శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్రం దోహదపడుతుందన్నారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీని పంటల చీడ పీడల నిఘా, నియంత్రణ ద్వారా దిగుబడి నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజిరెడ్డి -
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా కౌడిపల్లిలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. పీఆర్ డివిజన్ కార్యాలయంలో గదులను పరిశీలించగా ప్లాస్టిక్ బాటిల్స్ ఇతర వ్యర్థ్యాలు ఉండటంతో శుభ్రం చేయాలన్నారు. గ్రంథాలయం కోసం నిర్మించిన భవనంలో పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయం కొనసాగుతుందని, దీంతో ఖాళీ చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్తులు, పాఠకులకు లైబ్రరీ అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పీఆర్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు
ప్రహరీ పలకలను తొలగించిన రెవెన్యూ అధికారులు హత్నూర(సంగారెడ్డి): అసైన్మెంట్ భూముల్లో కొందరు నాయకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన బౌండరీ పలకలను తొలగించారు. డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్రావు, ఆర్ఐ రాహుల్ జీపీఓలు సత్యనారాయణ, సాయికుమార్గౌడ్, ఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా ఏర్పాటు చేసిన సరిహద్దు పలకలను కొంతమేర తొలగించారు. బడుగు బలహీన వర్గాలు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో బోరు వేసి దర్జాగా సమీప పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్మిస్తున్న గృహాలను తొలగించారు. అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మించినా, బోర్లు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్రావు హెచ్చరించారు. రాజకీయ నాయకులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఇసుక, మట్టి రవాణ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముచ్చర్ల గ్రామ శివారు అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భూములను కాపాడాలి ముచ్చర్ల గ్రామ శివారులో పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కాపాడాలని స్థానికులు కోరారు. కొందరు అక్రమార్కులు రాజకీయ నాయకులు అసెంబ్లీ భూముల్లో అక్రమంగా భవనాలు నిర్మించి స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అద్దెకిస్తూ అక్రమార్గంగా డబ్బులు సంపాదిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. -
కబ్జా కోరల్లో మూడెకరాల ప్రభుత్వ విలువైన భూమి
జిన్నారం రెవెన్యూ పరిధికి సంబంధించిన సర్వే నంబర్ 181లోని దాదాపు 3 ఎకరాల భూములపై అక్రమార్కుల కన్ను పడింది. సమీపంలోనే అవుటర్ రింగ్ రోడ్డు ఉండటంతో పక్కా పథకం ప్రకారం అక్రమార్కులు నిర్మాణాలకు తెర తీశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మామూళ్లకు అలవాటు పడిన అధికార యంత్రాంగం అక్రమార్కులకు భూములను కట్టబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే బుధవారం కొన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతన అధికారులు చేపట్టినా ఆ చర్యలను స్థానికులు నమ్మే పరిస్థితి లేదు. కేవలం అనుమానించకుండా ఉండేందుకే ఇటువంటి తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. -
మరో రెండు పంట విరామాలు!
పుల్కల్(అందోల్): సింగూరు మరమ్మతు పనులు ఈ జూన్ నాటికి పూర్తికావడం కష్టమేనని తెలుస్తోంది. రివిట్మెంట్ పనులు జూన్ నాటికి కూడా పూర్తి కావని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో రెండు పంటలకు విరామం ప్రకటించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు మరమ్మతులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం బుధవారం పర్యటించి పర్యవేక్షించింది. ఈ బృందం డ్యామ్ పటిష్టతపై నివేదిక ఇవ్వనుంది. గతేడాది ఈ బృందం డ్యామ్ లోపలి భాగంలో రాతికట్ట(రివిట్మెంట్) నీటి తొలుకులకు కుంగిందని నివేదిక సమర్పించింది. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ రివిట్మెంట్ పనులను జరిపించేందుకు కమిటీ సూచనల మేర స్థానికంగా పంట విరామం ప్రకటించింది. డ్యామ్లో మిషన్ భగీరథకోసం 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. మొదట 800 మీటర్లు కుంగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ పటిష్టతకోసం లోపలిభాగంలో మొత్తం 8 కిలోమీటర్ల మేర రాతికట్టను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.16 కోట్లకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఇంజినీర్ల బృందం సూచించింది. ఎన్డీఎస్ఏ బృందం డ్యామ్ను పటిష్టతను అంచనా వేశారు. డ్యామ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన బృందంలో కమిటీ చైర్మన్ విజయ్ ట్రింబక్ దేశాయ్ సారధ్యంలో మురళీధర్, సతీశ్కుమార్ రేగొండ, శ్రీకాంత్, రాజు, లక్ష్మణరావు ఉన్నారు. ఈ సీజన్లో పూర్తి కానట్లే... డ్యామ్ రివిట్మెంట్ పనులు జూన్లోగా పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు ఇవ్వాలని మంత్రు లు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. డ్యామ్లో మరో 8 టీఎంసీల నీరు ఉందని ఆనీటిని తాగునీటికి వదులుతూ నీరు తగ్గిన కొద్దీ పనులు జరిపించాలని ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు పంటల వరకు క్రాఫ్ హాలీడే ప్రకటించాల్సి రావచ్చని తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన ములుగులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ములుగుకు చెందిన కటికే నర్సయ్య, బుచ్చమ్మ(60) దంపతులు ములుగు రెవెన్యూ కార్యాలయ సమీపంలో గల రాజీవ్రహదారిపై మక్క కంకులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈక్రమంలో ములుగు క్రాస్రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గజ్వేల్ వైపు నుంచి అతివేగంగా దూసుకువచ్చిన కారు వెనుకాల నుంచి వారు ఇరువురు ప్రయాణిస్తున్న ఎక్స్ఎల్ భైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బుచ్చమ్మకు తీవ్ర గాయాలు కాగా వెంటనే లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి బుచ్చమ్మ మృతి చెందింది. మృతురాలు భర్త నర్సయ్యకు కూడా గాయాలయ్యాయి. మృతురాలు కుమారుడు బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
లక్ష్యం కావాలి
ఉగ్రవాద నిర్మూలనేవర్గల్(గజ్వేల్): అంతర్జాతీయ స్థిరత్వ సాధనకు దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరమని, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ సమస్యల పరిష్కారం వంటి అంశాలలో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కృష్ణకుమార్ అన్నారు. బుధవారం వర్గల్ మహాత్మాజ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాలలో ‘ద్వైపాక్షిక సమస్యలపై భౌగోళిక రాజకీయాల ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ భద్రతపై రాజకీయాలు ప్రభావం చూపుతాయన్నారు. సాంకేతిక అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీపై నియంత్రణ, కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగం, ఆర్థిక దౌత్యం వంటి అంశాలు ఆధునిక అంతర్జాతీయ రాజకీయాలలో కీలకంగా పరిణమించాయన్నారు. దేశాల భౌగోళిక స్థానం, సహజ వనరులు, భూభాగం, జనాభా వంటి అంశాలు ఆయా దేశాల శక్తి సామర్థ్యాల నిర్ణయంలో ప్రధాన భూమిక పోషిస్తాయని వివరించారు. ప్రపంచ దేశాల మధ్య శక్తి సమీకరణాలను అర్థం చేసుకోవడంలో జియోపాలిటిక్స్, జియోఎకానామిక్స్ ముఖ్యమైన దృష్టి కోణాలను అందిస్తాయని తెలిపారు. ఈ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చల్లమల్ల వెంకటేశ్వర్లు, బేగంపేట్ మహిళా కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామాచారి, ఆతిథ్య గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కరరావు, వర్జిని దేదిప్య, జయలక్ష్మి, ఏకే చందన, రజని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ భాగ్యలక్ష్మి తదితర 8 మంది స్కాలర్స్ జియో పాలిటిక్స్ అంశం పైన పత్ర సమర్పణ చేశారు. భౌగోళిక రాజకీయ అంశాలతో కూడిన సావనీర్ను సదస్సులో ఆవిష్కరించారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
దుబ్బాక: పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం వీరనగర్ వద్ద రోడ్డెక్కి రెండుగంటలకు పైగా రస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాయపోల్ ఎస్ఐ మానస రైతులకు ఆందోళన విరమించాలని ఎంతగా నచ్చజెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని ఎస్ఐ కచ్చితమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాసంగిలో సాగునీళ్లు విడుస్తారన్న ఆశతో పంటలు వేసుకుంటే ఇంత వరకు నీళ్లు విడవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కాలువ ద్వార వస్తున్న నీటిని తమ గ్రామాల చెరువులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి సర్పంచ్ స్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ స్వామి, ఆయా గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు. -
నాన్బెయిలబుల్ కేసులో నిందితుల అరెస్టు
సిద్దిపేటఅర్బన్: దాయాదులతో భూ వివాదంలో తలెత్తిన గొడవలో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతున్న నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్లో సీఐ వివరాలు వెల్లడించారు. పొన్నాల గ్రామానికి చెందిన మక్కల కనకయ్య, మక్కల శేఖర్, మక్కల లక్ష్మి తమ దాయాదులతో భూమి విషయంలో గొడవపడి దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఈ విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు విధించడంతో కరీంనగర్ జైలుకు పంపించినట్టు తెలిపారు. సెల్ఫోన్ల దొంగ అరెస్టు చేర్యాల(సిద్దిపేట): పట్టణంలోని మొబైల్ షాపులో సెల్ ఫోన్లు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రమేశ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం స్థానిక గాంధీ సెంటర్ వద్ద గల మొబైల్ షాప్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కొమురవెల్లి ఎస్ఐ మహేష్ పెట్రోలింగ్ చేస్తుండగా బస్టాండ్ వద్ద ఏపీ అనంతపురం జిల్లా కదిరికి చెందిన పోతుల శివకుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొబైల్ షాప్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అతని వద్ద మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు శివ్వంపేట(నర్సాపూర్): బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9 సంవత్సరాల బాలిక మంగళవారం రాత్రి గ్రామంలో నిర్వహిస్తున్న సర్కస్ చూడడానికి వెళ్లగా ఓ యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భూములపైనే రేవంత్ కన్ను
● కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవరూ గుంజుకోలేరు ● మాజీమంత్రి హరీశ్రావు రామచంద్రాపురం(పటాన్చెరు): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్నులు భూములపైనే తప్ప ప్రజా సమస్యలపై లేవని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు విమర్శించారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్నగర్ కాలనీలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, మహిళ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం భూములను అమ్మడం, పేదోళ్ల ఇళ్లు కూల్చడం తప్ప మంచిపనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పేరిట పేదోళ్ల ఇళ్లను, ఖమ్మంలో సైతం వందలాదిమంది ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చి వేసిందని చివరికి ఆలయాలను సైతం కూల్చడానికి సిద్ధమైందని మండిపడ్డారు. పేదోళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. పేదల వద్ద ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను గుంజుకోవడం ఎవరి తరమూకాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని హరీశ్రావు కోరారు. గల్ఫ్లో యుద్ధం కారణంగా ప్రపంచమంతా ఆందోళనలో ఉందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో యుద్ధం ముగిసిపోవాలని అల్లాను వేడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గోవుల పట్టివేత
పెద్దశంకరంపేట(మెదక్): అక్రమంగా తరలిస్తున్న గోవులను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్ నుంచి మహారాష్ట్ర డెగ్లూర్ వైపు టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా వాహనాన్ని మండల పరిధిలోని కోళాపల్లి పాత టోల్ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గోవులను తరలిస్తున్న షఫీ, మోసిన్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెండు గోవులు, ఒక దూడను స్థానిక గోశాలకు తరలించారు. ఇసుక వేలంతో రూ.4.15 లక్షల ఆదాయంపాపన్నపేట(మెదక్): గాజులగూడెం నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ‘సాక్షి’ కథనాలకు రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేశారు. ఈ మేరకు సీజ్ చేసి ఇసుకకు బుధవారం వేలం పాటలు నిర్వహించగా రూ. 4,15,935 ఆదాయం వచ్చినట్లు గిర్దావర్ సత్తు స్వామి తెలిపారు. క్యూబిక్ మీటర్కు రూ.585 చొప్పున వేలం పాటలు ఖరారయ్యాయని చెప్పారు. మొత్తం 237 ట్రాక్టర్లకు గాను, 711 క్యూబిక్ మీటర్ల ఇసుక వచ్చిందన్నారు. వేలం పాటలో గ్రామానికి చెందిన ప్రతాప్గౌడ్ అధిక పాట పాడి వేలం దక్కించుకున్నారని తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ గజ్వేల్రూరల్: కుటుంబ సభ్యులంతా నూతన ఇంట్లోకి పడుకునేందుకు వెళ్ళగా... పాత ఇంట్లో దొంగలు పడి రూ.2లక్షల 70వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన సంఘటన గజ్వేల్ మండలం రిమ్మనగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన పంజాల శివలింగంగౌడ్ ఇదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకుంటూ సమీపంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టి ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. ఇంట్లోని సామగ్రి అంతా పాత ఇంట్లోనే ఉండడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఇంట్లో పడుకునేందుకు వెళ్లారు. బుధవారం ఉదయం పాత ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో దాచి ఉంచిన నగదుతోపాటు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జహీరాబాద్ టౌన్: బైక్ను ఆటో ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్కు చెందిన పట్లోళ్ల రాంరెడ్డి(52) బుధవారం బైక్పై పొలానికి వెళ్తున్నాడు. గ్రామ శివారులో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఆటో మోటారు బైక్ను ఢీకొట్టింది. రాంరెడ్డికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు జహీరాబాద్ టౌన్: భార్యను హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ జడ్జి భవానీ చంద్ర భర్తకు జీవిత ఖైదు తీర్పు ఇచ్చారని టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఝరాసంగం మండలంలోని ఏడాకుపల్లికి చెందిన డుబుడం రాములు(38)తో పట్టణంలోని సంతోషిమాత కాలనీకి చెందిన లక్ష్మితో 2012లో వివివాహమైంది. మద్యానికి బానిసైన రాములు భార్యను వేధించడంతో ఆమె తల్లివద్ద ఉంటూ పట్టణంలోని ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంది. మద్యం తాగి ఆమె పనిచేసే ప్రింటింగ్ ప్రెస్ వద్దకు వచ్చి గొడవ పడేవాడు. వేధింపులను తట్టుకోలేక భర్తపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేిసింది. దీంతో ఆమైపె కక్ష పెంచుకుని హత్య చేయాలని రాములు నిర్ణయించుకున్నాడు. 16న డిసెంబర్ 2021లో భార్య లక్ష్మికి మాయమాటలు చెప్పి శివాలయం ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముళ్లపోదలో పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈమేరకు జిల్లా జడ్జి భవానీ చంద్ర నిందితుడు రాములకు జీవిత ఖైదుతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ వినయ్కుమార్ వివరించారు. -
మహిళా సాధికారతకు పెద్దపీట
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డిసంగారెడ్డి జోన్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు తమకు అందుబాటులో ఉండే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ముందడుగు వేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ...మహిళలు సహనం, పట్టుదలకు ప్రతిరూపాలన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. -
యువతకు ఉపాధి అవకాశాలు
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అధికారులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎం సేతు ప్రాజెక్టుపై, వివిధ శాఖల అధికారులతో విద్యారంగ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఐటీఐ కేంద్రాలను బలోపేతం చేసి ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు కింద ఐదు ఐటీఐలను హబ్ అండ్ స్పోక్స్ విధానంలో అభివృద్ధి చేసి పరిశ్రమల సహకారంతో ఐదేళ్లపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులు, శిక్షణ సామగ్రి ఏర్పాటు చేసి ఐటీఐలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. మౌలిక వసతులకు ప్రణాళికలు చేయాలి జిల్లాలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మహిళా డిగ్రీ కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రాజా, ఐటీఐ ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, కన్సల్టెంట్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీపీఓ బాలశౌరి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత తదితరులు పాల్గొన్నారు. -
శ్యాంసుందర్కు ఆర్య వైశ్య మహాసభ మద్దతు
సంగారెడ్డి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్యాంసుందర్కు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ వెల్లడించారు. సంగారెడ్డిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో మీర్దొడ్డి శ్యాంసుందర్కు జిల్లా నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బెజిగం శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు మురిగి.. పనులు మిగిలి!
● రూ.14 కోట్ల సూక్ష్మసేద్య నిధులు వెనక్కి! ● నిధులను పూర్తిగా వాడలేకపోయిన జిల్లా ఉద్యానవనశాఖ ● డ్రిప్ యూనిట్ల మంజూరుకు నిన్నటితో ముగిసిన గడువు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బిందుసేద్య పథకం (డ్రిప్ ఇరిగేషన్) అమలు కోసం జిల్లాకు వచ్చిన సబ్సిడీ నిధులను ఉద్యానవనశాఖ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది. సుమారు వెయ్యి ఎకరాలకు సంబంధించిన నిధులు సుమారు రూ.14 కోట్లు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. తక్కువ సాగునీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు డ్రిప్ (బిందుసేద్యం) పరికరాలను భారీ సబ్సిడీపై అందిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది (2025–26)లో జిల్లాలో 9,665 ఎకరాల్లో డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన యూనిట్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటివరకు (మంగళవారం నాటికి) 8,276 ఎకరాలకు సంబంధించిన డ్రిప్ పరికరాలు మాత్రమే రైతులకు సరఫరా అయ్యాయి. మిగిలిన సుమారు 1,388 ఎకరాలకు సంబంధించిన డ్రిప్ పరికరాలను సరఫరా చేయలేకపోయింది. ఈ పథకం యూనిట్ల మంజూరుకు గడువు మంగళవారం రాత్రి 12 గంటలతో ముగిసింది. దీంతో సుమారు 1,200 వందల ఎకరాల డ్రిప్ పరికరాలకు సంబంధించి సుమారు రూ.14.40 కోట్ల సబ్సిడీ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ ఈ పథకం కింద రైతులకు ఎకరాకు రూ.1.20 లక్షలు యూనిట్ వ్యయంగా ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 100% సబ్సిడీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఉంటే..పదిశాతం రైతు భరించాల్సి ఉంటుంది. అలాగే ఇతర రైతులకు 80% సబ్సిడీ ఇస్తుంది. 20% రైతులు భరించాలి. గరిష్టంగా 12 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలు మంజూరు చేస్తారు. ఈ డ్రిప్ పరికరాలను జిల్లాలో అత్యధికంగా చెరుకు రైతులు వినియోగించుకుంటున్నారు. సుమారు 60 శాతం మంది చెరుకు రైతులే వీటికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కూరగాయలు సాగు చేసే రైతులు, పండ్లతోటలు పండించే రైతులు కూడా ఈ డ్రిప్ పరికరాలను తీసుకుంటారు. కాగా, ఈ పరికరాలపై జీఎస్టీ పన్ను రైతులకు భారంగా ఉండేది. గతంలో 12% జీఎస్టీ వసూలు చేసేవారు. అయితే జీఎస్టీ పన్ను రేటును 5% తగ్గించారు. దీంతో జీఎస్టీ నుంచి రైతులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు ఈ పథకం కింద డ్రిప్ పరికరాలు పొందాలంటే రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న రైతులు యూనిట్ వ్యయంలో రైతు భరించాల్సిన మొత్తాన్ని డీడీలతో ఉద్యానవనశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించి అధికారులు ఈ డ్రిప్ యూనిట్లను మంజూరు చేస్తారు. ఈ సూక్ష్మసేద్య పరికరాల పథకం అమలులో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉందని జిల్లా ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ యూనిట్లు వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నారు. -
మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం
● మాజీమంత్రి హరీశ్రావు విమర్శ ● యుద్ధంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదనసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలో జరిగిన ఇఫ్తార్విందులో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హాయాంలో మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. రంజాన్తోఫా, షాదీముబారక్ వంటి పథకాలతోపాటు, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించారన్నారు. యుద్ధం బాధ కలిగిస్తోంది పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా సామాన్యులు అనేకమంది చనిపోతుండటం కలచివేస్తోందని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లోని ప్రజలతోపాటు, అక్కడున్న భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావం అన్ని దేశాలపై పడుతోందని, భారత్లో పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్ కొరత ఏర్పడుతోందని చెప్పారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లా దయతో యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకుందామన్నారు. కార్యక్రమంలో డీసీఎంస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
అందరూ విద్య నేర్వాలి
వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డికంది(సంగారెడ్డి): మహిళలు, పురుషులు అన్ని వయసుల వారు చదవడం రాయడం నేర్వాలని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కంది మధిర గ్రామమైన కంది లక్ష్మినగర్ తండాలో మంగళవా రం ఉల్లాస్, నవభారత్ సాక్షరతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అధికారి జ్యోతిశర్మ, ఎన్సీఈఆర్టీ అధికారులు అల్కాయోగి, డైనాథామస్, రిటైర్డ్ డైరెక్టర్ నాగలక్ష్మి పాల్గొని తండాకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యా రు. సామాజిక చైతన్య కేంద్రాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆధ్వర్యంలో చదవడం, రాయడంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
భూమే బంగారమాయే
జోగిపేట(అందోల్): మహిళల అలంకరణల్లోనూ, వివాహ కట్నకానుకల్లోనూ బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వివాహ వేడుకంటే వధూవరులకు స్వర్ణాభరణాలు కానుకగా ఇవ్వడం ఆయా కుటుంబాల బాధ్యతగా భావించేవారు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆ సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ఇప్పుడు కట్నకానుకల్లో బంగారం స్థానంలో భూమి వచ్చి చేరింది. వివాహాల్లో కట్నకానుకగా బంగారం బదులు భూమిని ఇస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు నయా ట్రెండ్గా మారింది. కొన్నేళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజానీకం ఆభరణాలు చేయించుకోవడం కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్లలో ఎక్కువగా భూమిని కట్నంగా ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పట్టణాల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసి కట్నకానుకలుగా ఇవ్వడం సాధారణమవుతోంది. ముందుగా కట్న కానుకలు కుదిరిన తర్వాతే పెళ్లి సంబంధాలు ఓకే అయిన సందర్భాలున్నాయి. పెళ్లికి ఎంత నగదు కట్నంగా ఇస్తున్నారు? బంగారం ఎన్ని తులాలు? వరుడికి బైకు, కారుతోపాటు ఆడపడుచు కట్నం కింద ఇంత అన్నట్లు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఆడపడుచు కట్నం కింద 10 గుంటలు, 20 గుంటలు, ఎకరా భూమి, 200 గజాల ప్లాట్, పుస్తెలతాడు, మెట్టెలు ఇస్తామని కట్న కానుకలు మాట్లాడుకుంటున్నారే తప్ప బంగారు ఆభరణాల జోలికి మాత్రం వెళ్లడంలేదు. వివాహ కట్నకానుకల్లో మారుతున్న ట్రెండ్ -
వర్క్షాప్కు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
జహీరాబాద్: గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యేల వర్క్షాప్కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్ వర్క్షాప్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతోపాటు సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు, రాజ్యాంగం అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. 20న చలో కలెక్టరేట్సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి సంగారెడ్డి టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతు, కూలీల హక్కులను తొలగించే పద్ధతులను మానుకోవాలని సీపీఎం సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల హక్కుల పరిరక్షణకు ఈ నెల 20న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయంవతం చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలంలోని పసల్వాదిలో ఉపాధి హామీ కూలీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో యాదగిరి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో అధికారాంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజలపై, కార్మిక, రైతు కూలీలపై ఆర్థిక భారాన్ని మోపుతూ అంబానీ, అదానీలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రూ.3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టడానికి ఎందుకు వెనకాడిందని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయి సెమినార్కు ఎంపికన్యాల్కల్(జహీరాబాద్): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జిక్రా మహి న్ రాష్ట్రస్థాయి సెమినార్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సంగారెడ్డిలో ఐక్య రాజ్యసమితి అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో 43 పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అందులో న్యాల్కల్ పాఠశాలకు చెందిన విద్యార్థి జిక్రా మహిన్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ‘పట్టు సాగుకు ప్రోత్సాహం’జహీరాబాద్ టౌన్: పట్టు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన, పట్టు శాఖ జిల్లా అధికారి సోమేశ్వర్రావు తెలిపారు. కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామ పరిధిలో రైతు నిర్మిస్తున్న షెడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...మల్బరీ తోటల పెంపకం, షెడ్ల నిర్మాణానికి పరికరాల కొనుగోలుకు సిల్క్ సమగ్ర పథకం కింద సబ్సిడీ వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 నుంచి 90%, సాధారణ రైతులకు 50% సబ్సిడీ వస్తుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలిఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇన్చార్జి డీపీఓ జానకిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ...గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కొన్ని గ్రామా ల్లో నూతన సర్పంచులు మల్టీపర్పస్ వర్కర్స్ను వేధింపులకు గురి చేయడం సరికాదని హితవు పలికారు. పైస్థాయి అధికారులు వీటిపై పర్యవేక్షించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ అందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
సమీకృత మార్కెట్కు మోక్షమెప్పుడో?
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై రూ.11 కోట్లతో నిర్మించిన దుకాణాల సముదాయం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. కాంట్రాక్టర్కు రూ.5.50 కోట్ల బిల్లులు చెల్లించే విషయంలో జాప్యమే ఇందుకు కారణం. వినియోగంలోకి తెచ్చి వ్యాపారాలు నిర్వహించుకునేలా మంత్రి దామోదర రెండేళ్ల క్రితం సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి బకాయిలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ చెల్లించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. – జహీరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 23 ఫిబ్రవరి 2024లో మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక మున్సిపల్ సమీక్ష సమావేశానికి హాజరవ్వగా దుకాణాల సముదాయం అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కాంట్రాక్టర్ జావీద్అలీని పిలిపించి చర్చించారు. బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కాంట్రాక్టర్ వద్ద నుంచి దుకా ణ సముదాయానికి సంబంధించిన తాళం చెవిలను అప్పటి కలెక్టర్ వల్లూరి క్రాంతికి అప్పగించారు. దీంతో సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. కానీ, బకాయిల చెల్లింపుల హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు వాపోతున్నారు. రూ.11 కోట్లతో నిర్మాణం జహీరాబాద్ పట్టణంలోని సుభాష్గంజ్లో రూ.11 కోట్ల వ్యయంతో దుకాణాల సముదాయం నిర్మించారు. భవనాన్ని అప్పటి మంత్రి హరీశ్రావు 2022 డిసెంబర్లో ప్రారంభించారు. వేలం ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. అయినా ఇప్పటి వరకు సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్, కమర్షియల్ కాంప్లెక్సు వినియోగంలోకి రాలేదు. అటు వ్యాపారులకు ఎదురు చూపు తప్పక పోగా ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు వ్యాపారాల నిర్వహణకు దుకాణాల కొరత తీర్చడం కోసం సముదాయం నిర్మించారు. కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలతో పాటు ప్రధాన వ్యాపారాలన్నీ ఒకే దగ్గర నిర్వహించేలా గ్రౌండ్ ఫ్లోర్లో 33 దుకాణాలు, మొదటి అంతస్తులో 34 దుకాణాలను నిర్మించారు. సెల్లార్లో వెజ్, నాన్వెజ్ వ్యాపారాల కోసం 84 స్టాళ్లు నిర్మించారు. బిల్లులు చెల్లించకపోవడంతో.. రూ.5.50 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు, రూ.4.50 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, రూ.కోటి పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఈ నిధుల్లో నుంచి రూ.5.50 కోట్ల నిధులు మాత్రమే కాంట్రాక్టర్కు చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ వేచి చూసి విధిలేక తిరిగి దుకాణాల సముదాయం తాళం చెవిలు వెనక్కి తీసుకున్నారు. 53 దుకాణాలను 2023 ఫిబ్రవరి 8న వేలం ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. కానీ, బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించకపోవడంతో కేటాయింపులు నిలిచిపోయాయి.మూతపడిన గ్రౌండ్ఫ్లోర్ దుకాణాలునిరుపయోగంగా భవన సముదాయం బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం కాంట్రాక్టర్ ఆధీనంలో భవనం మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లు.! రోడ్డుపైనే కొనసాగుతున్న వ్యాపారాలురోడ్డుపైనే వ్యాపారాలు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించే విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుండటంతో దుకాణాల సముదాయం నిరుపయోగంగా మారింది. మొదటి ఫ్లోర్ తాళాలను కాంట్రాక్టర్ తన వద్ద పెట్టుకున్నారు. సెల్లార్ను అప్పగించినా వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించడం లేదు. రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్యను పరిష్కరించి, ట్రాఫిక్ లేకుండా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
చిరుత దాడిలో లేగదూడ మృతి
తూప్రాన్: లేగదూడపై చిరుతలు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన మండలంలోని గుండ్రేడ్డిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చింతల శేఖర్ తన పొలం వద్ద పశువులను పాకలో ఉంచాడు. మంగళవారం ఉదయం వెళ్లి చూడగా లేగ దూడ కళేబరం కనిపించడంతో ఖంగుతిన్నాడు. ఇటీవల గ్రామ సమీపంలో రెండు చిరుతలు సంచరిస్తున్న విషయం తెలిసిందే. చిరుతల దాడిలోనే లేగదూడ చనిపోయిందని డివిజన్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ చిరంజీవికి సమాచారం అందించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టంలో చిరుత దాడిలోనే చనిపోయినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలతో భద్రత బలోపేతం: జిల్లా ఎస్పీ -
మద్యం, జల్సాలకు అలవాటై..
మెదక్ కలెక్టరేట్: మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులతో నెల పసికందును సొంత తల్లిదండ్రులే విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మెదక్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. హవేళిఘణాపూర్ మండలం లింగ్సాన్పల్లి తండాకు చెందిన కేతావత్ మహేశ్ మొదటి భార్యను వదిలేసి ఏడాది క్రితం మంజులను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం ఒక మగశిశువు జన్మించాడు. కాగా ఆర్థిక ఇబ్బందులకుతోడు, మహేశ్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం శిశువును మధ్యవర్తి నాగరాజు ద్వారా కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన రాజు – రజిత దంపతులకు రూ.1.50 వేలకు విక్రయించారు. ఇందుకు సంబంధించి బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు. కాగా శిశువు తల్లి మంజుల అంగన్వాడీ కేంద్రానికి పాలకు, పౌష్టికాహారం కోసం రాకపోవడంతో అంగన్వాడీ టీచర్కు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వారి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. వెంటనే విషయాన్ని ఐసీడీఎస్ సెక్టార్ ఇన్చార్జ్ విజయలక్ష్మికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హవేళిఘణాపూర్ ఎస్ఐ సత్యనారాయణ విచారణ చేపట్టి కంచర్లకు వెళ్లి శిశువును తీసుకొచ్చి మెదక్లోని సఖీ సెంటర్లో తల్లి మంజులకు అప్పగించారు. శిశువు అమ్మిన తల్లిదండ్రులు, మధ్యవర్తిగా వ్యవహరించిన నాగరాజు, కొన్నవారిపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. పసికందును విక్రయించిన తల్లిదండ్రులు వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులోని బంగారమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన నారెడ్డి మోహన్రెడ్డి(52) హైదరాబాద్లో సొంత ఇళ్లు ఉంది. అప్పుడప్పుడు హైదరాబాద్కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మోహన్రెడ్డితో పాటు సమీప బంధువులైన తిరుపతి, రఘుపతిరెడ్డి కారులో కామారెడ్డికి వస్తున్నారు. మాసాయిపేట శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మోహన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మిగితా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పాలు పితకడానికి వెళ్తుండగా.. కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రవీంద్రనగర్కు చెందిన కోడెల నర్సయ్య (59) బావి వద్ద పాలు పితకడానికి కాలినడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో గజ్వేల్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న టాటా ఏసీ ట్రాలీ ఆటో డ్రైవరు అజాగ్రత్తగా వాహనం నడుపుతూ నర్సయ్యను వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆయన వాహనం ముందర టైర్ల మధ్యలో ఇరుక్కుని అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవరు తోపుల లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. పాపన్నపేట(మెదక్): పాపన్నపేటకు చెందిన ఆరె కటికె మోహన్ మంగళవారం మేకలు కోసేందుకు ఏడుపాయలకు వెళ్లాడు. తిరిగి ఆటోపై ఇంటికి వస్తుండగా పాపన్నపేట శివారులోని మాలగుట్ట వద్ద ఆటో ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో మోహన్(60) కాలు తెగిపడింది. వెంటనే అతన్ని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మరో ఇద్దరికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. -
తాగునీటి ఇబ్బందులు రావొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో కొనసాగుతున్న ప్రజా పాలన – ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి వసతి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. గ్రామంలో 100 శాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే 99రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను వియవంతం చేయాలని సర్పంచ్ రవికి సూచించారు. వీరజవాన్ చంద్రారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ శ్రీనివాస వర్మ, ఉపసర్పంచ్ రఘుపతి రెడ్డి, నవీన్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ -
మహిళల అభివృద్ధిని అడ్డుకుంటే నష్టం
గజ్వేల్: మహిళల అభివృద్ధిని అడ్డుకుంటే సమాజానికే నష్టం వాటిల్లుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి రజిని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సామాజిక గమనం–మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై గజ్వేల్లోని ఓ గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రజిని మాట్లాడుతూ .. సరైన గౌరవం దక్కకపోతే మహిళలు అసహనం ప్రదర్శించి తిరుగుబాటు కూడా చేస్తారనే సంకేతాన్ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా మహిళ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న మహిళలు గ్రామాల్లో సామాజిక అంశాలపై పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే.విరాహత్ అలీ పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి, ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంబదాస్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్ స్వప్న పాల్గొన్నారు.హైకోర్టు రిటైర్డ్ జడ్జి రజిని -
కూలీ పనులకు వెళ్లి శవమై..
పాపన్నపేట(మెదక్): కూలీ పనులకు వెళ్లిన మహిళ శవమైంది. వివరాలు ఇలా.. మండలంలోని కొడుపాకకు చెందిన బేగరి సులోచన (35)భర్త దుర్గయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు కుమారుడు రాజేశ్ ఉన్నాడు. సోమవారం ఆమె పని కోసం మెదక్కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కొడుకు బంధువులకు సమాచారం అందించాడు. కాగా మంగళవారం ఏడుపాయల్లోని చెలిమల కుంట వద్ద, గుర్తు తెలియని మహిళ శవం ఉందన్న సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయి. ఆమె సెల్ఫోన్, సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ.. అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని నార్సింగిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దారబోయిన క్రిష్ణకు , హవేలిఘనపూర్ మండలం ముత్తాయికోటకు చెందిన మాధవి(27)ని ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు. కాగా కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం క్రిష్ణ మందు చల్లేందుకు పొలానికి వెళ్లాడు. అత్త మనవడిని తీసుకొని పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవి ఉరివేసుకుంది. ఇంటికి వచ్చి చూసిన అత్త వెంటనే కొడుకుకు చెప్పింది. కాగా మాధవి తరపు వారు వచ్చి గొడవకు దిగారు. ఎస్సై సంఘటనా స్థలికి వెళ్లి నచ్చజెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాల ప్రహరీ కూల్చివేత
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని బిజిలీపూర్లో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూల్చడం వివాదాస్పదమైంది. వివరాలు ఇలా.. గ్రామంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మంగళవారం పాఠశాల ప్రహరి గోడను కూల్చివేశారు. దీంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రహరీ పక్కనే ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పిల్లరు వేశారు. శివాజీ జయంతి ఉత్సవాల సమయాల్లో తమకు ఇబ్బందిగా ఉంటుందని శివాజీ సేన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంఈఓ రంజిత్కుమార్ను వివరణ కోరగా.. పాఠశాల ప్రహరీ కూల్చివేత విషయం తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఐజల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రహరీ గోడను కూల్చడంపై గ్రామస్తులు వ్యతిరేకించిన విషయం వాస్తవమే. ప్లాంట్ పూర్తయిన తర్వాత ప్రహరీని పునరుద్ధరించే పనులు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి మహ్మద్ నవీద్ అహ్మద్ తెలిపారు. -
ఉపాధి సిబ్బంది పనిచేయకుంటే చర్యలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)లు సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఉదయం 6గంటలకే పనికి వచ్చి 10గంటలకు పనులు పూర్తి చేసి వెళ్లాలన్నారు. ఎవరి పనులు వారే చేసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో మంచినీరు, నీడ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానోతు జయరాం, ఉపాధి హామీ ఏపీఓ ప్రభాకర్, సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ పరందాములు, టీఏలు ఉమేశ్, రైతులు పాల్గొన్నారు.డీఆర్డీఓ జయదేవ్ ఆర్య -
వెయ్యి కోట్లు కేటాయించాలి
హుస్నాబాద్: తెలంగాణ విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీలకు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ బడ్జెట్ను కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొవిటి సదానంద చారి మంత్రి పొన్నం ప్రభాకర్కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. సొసైటీల ద్వారా విశ్వబ్రాహ్మణులకు ఉపాధి, వృత్తి పరంగా ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు కిరణ్ కుమార్, రాజ్ కుమార్, శ్రీనివాస్, కవిత ఉన్నారు. భారీ ఇసుక డంప్ సీజ్వెల్దుర్తి(తూప్రాన్): అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంప్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా... విశ్వసనీయ సమాచారం మేరకు తహసీల్దార్ శ్రీనివాస్, గిర్దావర్ నర్సింగ్యాదవ్ మండలంలోని ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో నిల్వ ఉంచిన సుమారు 50 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు. హల్దీవాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించడం నేరమని, ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని తహసీల్దార్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రెండు లక్షలకు పైగా ఉంటుందని, త్వరలోనే వేలం వేయనున్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధంగజ్వేల్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని పిడిచెడ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సందమైన జ్యోతి కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి సామగ్రి కాలిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న వారు మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 10లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాఽధితురాలు తెలిపింది. ఆలయంలో చోరీ..రామచంద్రాపురం(పటాన్చెరు): ఆలయం తాళాలు పగులగొట్టి దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రామచంద్రాపురం పట్టణంలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం... పట్టణంలోని అశోక్నగర్లో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి పరిశీలించగా ఆరు తులాల బంగారు ఆభరణాలు, సుమారు ఎనిమిది కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగలు హుండీని సైతం పగులగొట్టారు. కాగా ఆలయ ప్రాంగణంలో రూ.90వేల నగదు లభించింది. క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మొబైల్ షాపులో.. చేర్యాల(సిద్దిపేట): మొబైల్ షాపులో ఫోన్లు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని గాంధీ సెంటర్ సమీపంలో బింగి భాస్కర్ మొబైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసి వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం వచ్చి చూడగా షాపులో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సుమారు రూ.40 వేల విలువైన ఫోన్లు చోరీ చేశారని తెలిపాడు. -
విద్యార్థులను చితకబాదిన హెచ్ఓడీ
హత్నూర(సంగారెడ్డి): హోంవర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థులపై హెచ్ఓడీ చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మండలంలోని తురకల ఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చోటు చేసుకుంది. వివరాలు... కళాశాలలో సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను హోంవర్క్ చేయలేదని సుమారు 15 మందిని ఇష్టం వచ్చినట్లు హెచ్ఓడీ శివారెడ్డి కొట్టడంతో తీవ్ర గాయాలయ్యియి. హోంవర్క్ చేయలేదన్న సాకుతో హెచ్ఓడీ కేబుల్ వైర్తో విద్యార్థులను కొట్టారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రత్నపురి విద్యాసంస్థల ప్రతినిధి రఘును సాక్షి వివరణ కోరగా విద్యార్థులపై దాడి చేయడం విచారకరమని తెలిపారు. విద్యార్థులను కొట్టిన హెచ్ఓడీపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి యశోదటేక్మాల్(మెదక్): వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. సోమవారం మండలంలోని కాద్లూర్ గ్రామంలో నిర్వహించిన వికలాంగుల సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ వికలాంగులకు రూ. 6వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. పింఛన్తోపాటు చేయూత పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో వికలాంగులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, సభ్యులు చంద్రమ్మ, కేశమ్మ, ఎల్లమ్మ, రమేశ్, మల్లయ్య, కిష్టయ్య, చిన్న నవీన్ పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా రవాణా శాఖాధికారి మెదక్జోన్: పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఇది అందరి బాధ్యతని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు రూ.45 లక్షల నిధులు సీసీ రోడ్లకు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నార్సింగికి రూ. 25 లక్షలు, నర్సంపల్లి, వల్లూర్ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నిధుల మంజూరుకు సహకరించిన ఇన్చార్జి మంత్రి వివేక్, దుబ్బాక నియోజవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్ మండల నాయకులు రాజేందర్రెడ్డి, సంపత్రెడ్డి, రాజేశ్, బాల్రాజ్గౌడ్, వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. -
బైక్ చోరీ నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన గజ్వేల్ ఏసీపీగజ్వేల్రూరల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాలాజీ ఎన్క్లేవ్కు చెందిన ప్రవీణ్ తన ఇంటిముందు ఉంచిన బైక్ చోరీకి గురైనట్లు ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని పిడిచెడ్ రోడ్డు నుంచి ప్రభుత్వాస్పత్రి వైపు అనుమానాస్పదంగా పల్సర్ బైక్పై వస్తున్న వ్యక్తులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి పారిపోగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి స్వామి, బూర్గుపల్లి మల్లేశ్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో అపహరించిన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీ కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ ఎస్హెచ్వో రవి, అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్ఐ ప్రేమ్దీప్, క్రైమ్ సిబ్బంది వెంకటేశ్, రవి, దివ్య, స్వామి, వెంకన్నను ఏసీపీ అభినందించారు. -
నూతన విద్యా విధానం అమలు చేయాలి
తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెదక్జోన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మెదక్కు వచ్చిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నివేదిక అశాసీ్త్రయమైనదని, ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో విద్యా విధానం ఎలా ఉందో అవగాహన లేని వ్యక్తులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో యథావిధిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాధవరెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళాశక్తితో అద్భుత ఫలితాలు
● కావేరి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు ● వివిధ రంగాల ప్రముఖులకు సత్కారం వర్గల్(గజ్వేల్): మహిళాశక్తి అపారమని అవకాశం దక్కితే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని కావేరి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని గౌరారం కావేరి యూనివర్సిటీలో ‘శక్తి నేషనల్ లీడర్షిప్ కాంక్లేవ్–2026’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులలో స్ఫూర్తిని నింపడమే ధ్యేయంగా వివిధ రంగాల ప్రముఖ మహిళా సాధకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఉపన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖాముఖి సెషన్ ద్వారా మహిళా నాయకత్వం, ఆత్మస్థైర్యం, సమాజానికి అందించిన సేవలు పేర్కొంటూ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. ప్రముఖ మహిళలతో ‘శక్తి’ కార్యక్రమం విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ప్రేరణగా నిలుస్తుందని వీసీ పేర్కొన్నారు. ఆభాస రిహాబ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ గాయత్రి అరవింద్, ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మంజులరావు, ఐకార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ విశారద, లాంగ్ డిస్టెన్స్ రన్నర్, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ సోఫియా సూఫీ, స్ట్రాటజీ, బిజినెస్ మెర్క్సియస్ మాజీ సీఈఓ వైశాలి నియోజియా, క్లాసికల్ డ్యాన్సర్ విదుషి దీక్ష తమ అనుభవాలను వివరించారు. విద్యార్థులు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం చూడకుండా తామే ఉద్యోగాలు సృష్టించేలా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా అంజలి బృందం సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పోలసాని, డీన్లు డాక్టర్ కొండ శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో సిద్దిపేట విద్యార్థుల ప్రభంజనం
39 గోల్డ్ , 26 సిల్వర్ మెడల్స్ సొంతందుబ్బాక/మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయస్థాయి కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 65 మంది విద్యార్థులు ప్రతిభ చాటి 39 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్ సాధించారు. కిక్కెర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో 3వ జాతీయస్థాయి మార్షల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువస్పోర్ట్స్ కరాటే అకాడమి తెలంగాణ వ్యవస్థాపకుడు బురాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 2 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక మండలం రామక్కపేట గురుకులానికి చెందిన బాలికలు 20 గోల్డ్, 22 సిల్వర్ , లచ్చపేట మాడల్ స్కూల్ విద్యార్థులు మూడు గోల్డ్ , 1 సిల్వర్, దుబ్బాక కేజీవీబీ మూడు గోల్డ్, 1 సిల్వర్, సిద్దిపేట స్ప్రింగ్ డయల్ స్కూల్ 1 గోల్డ్ , దిశ స్కూల్ 1 సిల్వర్, మాస్టర్ మైండ్స్ స్కూల్ 4 గోల్డ్ , 1 సిల్వర్ , మిరుదొడ్డి కేజీవీబీ బాలికల పాఠశాల విద్యార్థులు 8 గోల్డ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ చాటి జిల్లాకు పేరు తెచ్చిన విద్యార్థులను డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీసీడీఓ నర్మద, డీసీఓ శారద, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు అభినందించారు. -
ఐఐటీ పరీక్షలో ఆరాధ్యకు ఫస్ట్ ర్యాంక్
హుస్నాబాద్: ఏకలవ్య ఐఐటీ బుక్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఐఐటీ పరీక్షల్లో హుస్నాబాద్కు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ సాధించారు. హైదరాబాద్లోని దోమలగూడ రామకృష్ణ మఠంలో ఆదివారం ఏకలవ్య ఐఐటీ అకాడమి స్కూల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర అవార్డులను ప్రదానం చేశారు. 6వ తరగతి చదువుతున్న ఆరాధ్యకు ప్రథమ శ్రేణి అవార్డు, ద్వితీయ శ్రేణి అవార్డు ఎల్.వైష్ణవి, రామ్ చరణ్, సాయి హవీస్ అందుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు విద్యార్ధులను అభినందించారు. -
సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తం
సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్మెదక్జోన్: సోషల్ మీడియాలో కొనసాగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళా శాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ ప్రొఫైల్స్ ద్వారా జరిగే మోసాలు, తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం సిబ్బంది సతీశ్, సయ్యద్, స్వప్న, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వ్యాసరచనలో విద్యార్థి ప్రతిభ
చేగుంట(తూప్రాన్): లయన్స్ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని హాశ్విక మొదటి బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ రేణుక తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ డీ320 ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా విద్యార్థిని ప్రతిభ చాటింది. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బాబూరావు, అమర్నాథ్రావు, గాయత్రి విద్యార్థినికి ప్రశంసాపత్రం, మెమెంటో అందజేశారు. నర్సాపూర్: నర్సాపూర్ – సంగారెడ్డి మార్గంలో పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద భగీరథ పథకం పైపులైను ఎయిర్ వాల్వ్కు సోమవారం లీకేజీ ఏర్పడింది. దీంతో నీరంతా కొంత సేపు వృథాగా పోయాయి. ఈ విషయమై మిషన్ భగీరథ పథకం డీఈఈ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తమకు సమాచారం రాగానే స్పందించి నీటి సరఫరా నిలిపి వేసి వాల్వ్కు మరమ్మతులు చేయించామని చెప్పారు. మరమ్మతుల అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించామని ఆయన తెలిపారు. అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 108 అంబులెన్స్ వాహనాన్ని సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ను మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పైలట్ రవితేజ, ఈఎంటీ శోభన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెల్లాపూర్లో కమిషనర్ పర్యటన రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు సర్కిల్ పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ను సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సందర్శించారు. గోపన్పల్లి నుంచి తెల్లాపూర్ వరకు నడుస్తున్న రోడ్డు సర్వే పనులను ఆమె పరిశీలించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా డివిజన్లో జరుగుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ జ్యోతి రెడ్డి, డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసినినర్సాపూర్ రూరల్: కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని చిప్పల్తుర్తి కేజీబీవీ వద్ద టీఎస్ యూటీఎఫ్, కేజీబీవీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుహాసిని, టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడారు. కేజీబీవీ, యుఆర్ఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారికి వెంటనే సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలన్నారు. సర్వీస్ రక్షణ కల్పిస్తూ, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీలత, జబీనా సుల్తానా, పుణ్యవతి, షమీం, ఇందిరా, జ్యోతి, మంజుల, స్వరూప, శృతి పాల్గొన్నారు. -
భార్య మందలించడంతో..
ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త పటాన్చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్కు చెందిన నాగేశ్ ఏ పని చేయకుండా తాగి ఇంటికి వస్తుండటంతో భార్య సుజ మందలించింది. దీంతో భార్యకు చెప్పకుండా ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘ప్రజావాణి’కి అధికారులు రావాల్సిందే
అదనపు కలెక్టర్ పాండు సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 41 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరు కాకుండా తమ సహాయకులను పంపించడంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి పాల్గొన్నారు. -
తప్పుడు మార్గంలో వెళ్లితే తిప్పలు తప్పవ్
● చట్టాలపై విద్యార్థులకు అవగాహన ● సీనియర్ సివిల్ జడ్జి సౌజన్యహత్నూర(సంగారెడ్డి): విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళితే ఇబ్బందులు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య అన్నారు. సోమవారం హత్నూర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దని, అలాంటివారు కటకటాలపాలై జీవితాలు విచ్ఛినం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బాల్యవివాహాలు, ప్రేమ పేరుతో వేధింపులు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, కేవలం పుస్తకాలపైనే దృష్టి సారించి చదువులో రాణించాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు.. అంతకుముందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంపై అసహనం: గురుకుల పాఠశాలను సందర్శించిన ఆమె. విద్యార్థులకు వండుతున్న వంటశాలను పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు ఎలా చేస్తున్నారని, దీనివల్ల రోగాలు ప్రబలే అవకా శం ఉందని సిబ్బందిని మందలించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై శ్రీధర్ రెడ్డి, వైద్యురాలు రజిని, సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పంట రుణం ఏదీ..?
● నిర్దేశిత లక్ష్యంలో 65 శాతమే మంజూరు ● విమర్శలకు దారితీస్తున్న బ్యాంకర్ల తీరు ● అధిక వడ్డీలు వచ్చే పర్సనల్ లోన్లకు జారీకే ప్రాధాన్యత ● రైతులకు ఇచ్చే రుణాల్లో తీవ్ర జాప్యం ● 20 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● డీఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్ల తీరుపై మండిపాటు పరిశుభ్రతలో కార్మికుల పాత్ర కీలకం బ్యాంకర్ల తీరుపై అధికారుల మండిపాటుబ్యాంకర్ల పనితీరును సమీక్షించే డీసీసీ (జిల్లా సంప్రదింపుల కమిటీ), డీఎల్ఆర్సీ (జిల్లా స్థాయి సమీక్ష కమిటీ) సమావేశం సోమ వారం లీడ్బ్యాంక్ మేనేజర్ నర్సింగ్రావు సమన్వయంతో కలెక్టరేట్లో జరిగింది. అధికారులు ఆయా బ్యాంకుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. ఆర్బీ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎంజేడీవై, పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై, ఏపీవై వంటి పథకాలపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, కిసాన్క్రెడిట్ కార్డులు వంటి వాటికి మరింతగా రుణాలు మంజూరు చేయా లని నాబార్డు ఏజీఎం కృష్ణాతేజ పేర్కొన్నారు.సదాశివపేట(సంగారెడ్డి): పట్టణాన్ని పరిశు భ్రంగా ఉంచడంలో శానిటేషన్ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమ వారం సమావేశ మందిరంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పదవీ విరమణ పొందిన చంద్రయ్య, లలితను సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, వైస్ చైర్ పర్సన్ రేణుక, కౌన్సిలర్లు శంకర్గౌడ్, అరుణ్కుమార్, శ్రీశైలం, వాజీద్, సెజ్జీ, అనిత, మమత, నికిత, లక్ష్మిప్రియా, రోజా, ప్రియాంక, లావణ్య, గౌరిదేవి పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంట రుణాల మంజూరులో బ్యాంకులు తమ తీరు మార్చుకోవడం లేదు. రుణాలు ఎగవేసే బడాబాబులకు రూ. కోట్ల లో రుణాలు కట్టబెడుతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకర్లు.. రైతులకు ఇచ్చే పంట రుణాల మంజూరులో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడమే ఇందు కు నిదర్శనం. 2025–26లో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.3,404.51 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళికలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ నిర్దేశిత లక్ష్యంలో కేవలం రూ.2,244 కోట్లు మాత్రమే పంట రుణాలను ఇవ్వగలిగాయి. అంటే 2025 డిసెంబర్ నాటికి నిర్దేశిత లక్ష్యంలో 65 శాతం మాత్రమే రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో కలిపి జిల్లాలో మొత్తం 28 బ్యాంకులకు సంబందించి 258 బ్రాంచ్ లు ఉన్నాయి. ఈ పంట రుణాల మంజూరు విషయంలో ప్రైవేట్ బ్యాంకుల తీరు మరీ దారుణంగా ఉంది. సుమారు 12కు పైగా ప్రైవేటు బ్యాంకులు నిర్దేశిత లక్ష్యంలో 50 శాతం కూడా పంటరుణాలు ఇవ్వలేదంటే ఈ బ్యాంకుల తీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఖరీఫ్ పంట కాలం పూర్తయింది. యాసంగి పంటలు కూడా మరో నెలలో చేతికందుతాయి. కానీ ఈ పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం తీవ్ర విమర్శ లకు దారితీస్తోంది. సకాలంలో పంట రుణాలు అందకపోవడంతో అన్నదాతలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో అన్నదాతలు ప్రైవేటు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో 20 రోజుల్లో 31 మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది. ఈ 20 రోజుల్లో ఎంత మేరకు రుణాలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పంట రుణాల కంటే అధిక వడ్డీ వచ్చే పర్సనల్లోన్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పర్సనల్ లోన్ల విషయంలో నిర్దేశిత లక్ష్యంలో ఏకంగా 164 శాతం లోన్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పర్సనల్ లోన్లు రూ.1,376 కోట్లు ఇవ్వాలని ఆయా బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులకు అధిక వడ్డీ వస్తుందనే కారణంగా ఈ రుణాలు ఏకంగా రూ.2,262 కోట్లు ఇచ్చారు. అలాగే హౌసింగ్ లోన్ల విషయంలోనూ బ్యాంకులు నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు ఇచ్చాయి. ఈ ఏడాది రూ.148 కోట్లు హౌసింగ్ లోన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే రూ.256 కోట్లు ఇచ్చేశారు. అంటే నిర్దశిత లక్ష్యం కంటే 73 శాతం ఎక్కువ రుణాలు ఇచ్చారు. -
12 ఏళ్ల తర్వాత సరికొత్త ‘బాట’
వట్పల్లి(అందోల్): 12 ఏళ్ల తర్వాత అందోల్ మండలంలోని జోగిపేట–మాసానిపల్లి రోడ్డు ఎట్టకేలకు బీటీ సొగసులు రూపుదిద్దుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనర్సింహ మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టారు. అప్పటినుంచి మొన్నటి వరకు కూడా ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో గుంతలమయంగా మారి.. కంకర తేలిన రోడ్డుపై ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు చాలా మంది ప్రమాదాలకు గురై అంగవైకల్యం పొందిన వారు కూడా ఉన్నారు. 3 కి.మీ రోడ్డుకు రూ.1.68 కోట్లతో రెండు లేయర్ల బీటీ రోడ్డును చేపట్టారు. దీంతో మరో పదేళ్ల వరకు ఢోకా ఉండదన్న అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. నిధులను మంజూరు చేయించిన మంత్రి దామోదరకు ఆత్మకమిటీ డైరెక్టర్ అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్లు కృతజ్ఞతలు తెలిపారు. -
తాగునీటి కోసం నిధులు కేటాయించండి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని తాగు నీటి సమస్య నివారణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ యూనుస్, కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ పాండును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ చెడిపోవడంతో నీటి సరఫరాకు అటంకం కల్గుతోందని చెప్పారు. శివారు గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.పైపులైన్ల లీకేజీలు అరికట్టాలని, అవసరం ఉన్న చోట కొత్త పైపులైన్లు వేసి వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. -
ఉపాధ్యాయుల గైర్హాజరుపై గరం
● హెచ్ఎం, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిక పటాన్చెరు టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇస్నాపూర్లోని జెడ్పీ హైస్కూల్, డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు రివిజన్ చేస్తున్నారా అని అని అడిగారు. ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్యూల్ సరిగా అమలు కావడం లేదని గుర్తించిన కలెక్టర్.. సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గుడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరవడంపై, అలాగే.. పర్యవేక్షణ లోపించినందుకు ఎంఈఓకు కూడా షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డైనింగ్ హాలు సరిగా శుభ్రం చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. అక్కడ మంటలు చెలరేగిన ప్రాంతాన్ని 24 గంటల్లో వాటర్ ట్యాంకర్ల సహాయంతో పూర్తిగా ఆర్పివేయాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమంగా చెత్త వేయకుండా పర్యవేక్షణ ఉండేలా ఒక కార్మికుడిని నియమించాలని చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్ రావు, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం తగదు
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు హత్నూర (సంగారెడ్డి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. సోమవారం హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించాలన్నా రు. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది రోగులు వస్తున్నారు. ఎలాంటి రోగులు వస్తున్నారు .అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రజిని సిబ్బంది పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసననారాయణఖేడ్: కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం విడనాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి హరిసింగ్, మండల శాఖ అధ్యక్షుడు ఏసుదాస్ సూచించారు. సోమవారం నారాయణఖేడ్లోని ఎమ్మార్సీ, కేజీబీవీ పాఠశాల వద్ద భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 16న డివిజన్, జిల్లా కేంద్రంలో, 20న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ఖేడ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్నాయక్, నాయకులు హరిసింగ్ పాల్గొన్నారు. 13న జాబ్ మేళాసంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంద్ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ మహీంద్రా – మహీంద్రా ట్రాక్టర్ తయారీ యూనిట్ జహీరాబాద్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జానాయక్ తెలిపారు. ఈ నెల 13న సంగారెడ్డి మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ మేళా ఉంటుందని చెప్పారు. 800కు పైగా ఖాళీలను ట్రెయినీ, అప్రెంటిస్ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారని తెలిపారు. ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన యువత తమ విద్యా ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, ఇతర అవసరమైన ధ్రువ పత్రాలతో జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఆయన కోరారు. కేసీఆర్ను కలిసిన సింధురామచంద్రాపురం(పటాన్చెరు): ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం మాజీ కార్పొరేటర్ వి.సింధురెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియెజకవర్గ కోఆర్డినేటర్ వి.ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. జాతరలు సంస్కృతికి ప్రతీకలు జిన్నారం(పటాన్చెరు): పట్టణ పరిధిలోని శివానగర్ లో నిర్వహించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం, జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని అన్నా రు. కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, కృష్ణ, నాయకులు పూజారి రాజు పాల్గొన్నారు. -
కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు: అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనతోపాటు సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని శంకర్ గ్రీన్ హోమ్స్లో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంజనేయస్వామి, అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు. దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శత చండీ యాగంలో ఎమ్మెల్యే బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం శ్రీ మహాలక్ష్మి చండీకేశ్వరి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహి సహిత శత చండీ యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యాక్సినేషన్తో వ్యాధుల నుంచి రక్షణ హెచ్పీవీ వ్యాక్సినేషన్తో ఆడపిల్లలకు వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వాస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహిపాల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగలక్ష్మి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కంకర శీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పది విద్యార్థులకు వీడ్కోలు
ముగిసిన శిక్షణ మునిపల్లి(అందోల్): విధులు, బాధ్యతలు, హక్కులపై వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆదివారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో ఈ నెల 4 నుంచి ఆయా గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ అంజయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించాలి సంగారెడ్డి: పట్టణంలోని కాలనీలు వాణిజ్యసముదాయాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సకాలంలో పనులు చెల్లించి పట్టణాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అలాగే, రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలిగే వాణిజ్యసముదాయలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ సజీద్ అలీ, బిల్ కలెక్టర్లు ఉన్నారు. విద్యార్థులకు టీషర్టుల పంపిణీ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని వీరన్నగూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందమైన పూలతో అలంకరించారు. మొదటిరోజు జరిగిన పూజ ల్లో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు వీరభద్ర స్వా మికి అభిషేకాలు, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన పూజలు భక్తులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్తా, భక్తులు పాల్గొన్నారు. -
ఘనంగా స్వయంపాలన దినోత్సవం
రాయికోడ్(అందోల్): మండల కేంద్రం రాయికోడ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి కిందిస్థాయి తరగతులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు బోధించే తరగతులను జెడ్పీహెచ్ఎస్, పీఎస్ ప్రధానోపాధ్యాయులు నగేష్, బి.శ్రీనివాస్ పర్యవేక్షించారు. స్వయం పాలన దినోత్సవ కార్యక్రమంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని హెచ్ఎంలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభ, తులసి, శ్రావణి, సల్మా, యాదవులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. -
3 నెలల రేషన్ ముందుగానే..
● వేసవి నేపథ్యంలో ఏప్రిల్లో పంపిణీ ● డీలర్లకు సరుకుల నిల్వ సమస్య ● జిల్లాలో 4,13,031 ఆహారభద్రత కార్డులు నారాయణఖేడ్: రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే నెలలో వేసవికి సంబంధించి మూడు నెలల బియ్యం అందనుంది. ఈనెలకు సంబంధించి బియ్యం పంపిణీ కొనసాగుతుంది. కాగా ఏప్రిల్ నెలలో ఆనెల కోటాతోపాటు మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒక్కో లబ్ధిదారుకు ఆరు కిలోలు చొప్పున పంపిణీ జిల్లాలో ఆహార భద్రత కార్డు (ఎఫ్ఎస్సీ) కార్డులు 4,13,031 కాగా వీటిలో లబ్ధిదారులు 14,12,138, వీరికి ఒక్కొక్కరికి 6కిలో చొప్పున ప్రతీనెల 84,72,828 కిలోల బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కింద 26,671 కార్డులు కాగా ఒకరికి 35కిలో చొప్పున 68,537 మంది లబ్ధిదారులకు 9,33,485కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డులు 93 కాగా ఇందులో 95మంది లబ్ధిదారులకు 910కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల కార్డులు 4.39,795 కాగా వీరందరికీ 9,407.243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ లెక్కన కార్డులోని లబ్ధిదారుల సంఖ్య అనుగుణంగా ఒకేసారి మూడునెలల బియ్యం అందజేయనున్నారు. తలెత్తనున్న నిల్వ ఇబ్బందులు రబీ సీజన్ కొనుగోళ్ల వల్ల గోడౌన్లలో బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం పంపిణీ వల్ల నిల్వల సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రసుత్తం గోడౌన్లలోంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వలను లిఫ్ట్ చేసి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా గోడౌన్ల ఖాళీ వల్ల రబీ సీజన్ బియ్యం ఇతర నిత్యావసరాల కొనుగోళ్లు చేపట్టి నిల్వ చేసే సమస్య తీరనుంది. వేసవి ఇబ్బందులూ పరిష్కారం ఈసారి వేసవిలో ఎండలు మండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నాయి. ఎండలు, వాటికి తోడు వేడిగాలులతో జనాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దీంతో మూడునెలలకు సంబంధించి సరుకులు ఒకేసారి పంపిణీ చేయడం వల్ల జనాలు వేసవిలో రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి క్యూకట్టి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. సరుకుల భద్రం సమస్యే వానాకాలంలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సమయంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టాక్ భద్రపర్చేందుకు సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. డీలర్లకు రవాణ ఖర్చులు తగ్గడం, హమాలీ పనిభారం తగ్గడం వంటి అనుకూలతలున్నా స్టాక్ భద్రపర్చడం సమస్యగా మారే అవకాశముంది. బయో మెట్రిక్ విధానంలో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ–పాస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాలి. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడా నికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు మూడు వారాలపాటు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. -
2.20
లక్షల ఎంటీలు..● ఈసారి 221 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ● ఖరారైన ప్రణాళిక ధాన్యం సేకరణ లక్ష్యందొడ్డురకం 2 లక్షల మెట్రిక్ టన్నులు ● 20 వేల ఎంటీలు సన్నరకం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ యాసంగి సీజనులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. గతేడాది యాసంగి కంటే సుమారు 70 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇందులో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం కాగా, 20 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలు సేకరించాల్సి ఉంటుందని భావిస్తోంది. గత ఏడాది యాసంగిలో 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసిన విషయం విధితమే. ఈ యాసంగి ధాన్యం సేకరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ఖరారు చేసింది. జిల్లాలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 83,986 ఎకరాలు. అయితే ఈసారి 92,560 ఎకరాల్లో దొడ్డురకాల వరిని పండిస్తున్నారు. 9,780 ఎకరాల్లో సన్నరకాలను సాగు చేస్తున్నారు. మొత్తం 1.02 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఒక్కో ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. క్రాప్కటింగ్ ఎక్స్పర్మెంట్ ద్వారా దిగుబడిని అంచనా వేస్తారు. ఈ లెక్కన 2.52 లక్షల ధాన్యం పండుతుందని భావిస్తున్నారు. ఇందులో రైతుల సొంత వినియోగం, విత్తనాల కోసం, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం సుమారు 32,916 క్వింటాళ్లుగా ఉండే అవకాశాలున్నాయి. ఈ ధాన్యం మినహాయిస్తే 2.20 లక్షల క్వింటాళ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. 27 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మొత్తం 27 బాయిల్డ్ రైస్మిల్లులను ఎంపిక చేశారు. యాసంగిలో ధాన్యం నూక ఎక్కువయ్యే అవకాశాలుండటంతో కేవలం బాయిల్డ్ మిల్లులకే సీఎంఆర్ కేటాయింపులు చేస్తుంటారు. దీంతో రా రైస్మిల్లులకు ఈ యాసంగి ధాన్యం కేటాయింపులుండే అవకాశాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. -
సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్సంగారెడ్డి: మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని రాజంపేట్ శివాలయంలో బ్రాహ్మణ సహకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతా ప్రభాకర్ హాజరై మహిళలనుద్దేశించి ప్రసంగించారు. మహిళలు కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు సమాజాభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కంది మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్ జలంధర్ రావు, బ్రాహ్మణ సహకార సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తెల్లపూర్లో ఆర్చరీ పోటీలు
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026రామచంద్రపూరం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 286 మంది క్రీడాకారులు తమ సత్తా చాటారు. 80 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు రాష్ట్ర ఆర్చరీ అధ్యక్షుడు రాజు తెలిపారు. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరారు. కార్యక్రమంలో తెల్లాపూర్ ఏకలవ్య స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, కోచ్లు గంగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్యపటాన్చెరు టౌన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెరు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.905 ఉన్న గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నా యుద్ధం విషయంలో మన ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మనకు ఆయిల్ నిక్షేపాలు రష్యా నుంచి వస్తున్నాయని, గతంలో ఇరాన్ నుంచి వచ్చేవని ఇరాన్లో ఉన్న ఆయిల్ నిక్షేపాలన్నింటినీ అమెరికా హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యుడు ఎండీ వాజీద్ అలీ, పాండు రంగారెడ్డి, పెంటయ్య, జార్జ్, రామకృష్ణ, నారాయణ ఇతరులు పాల్గొన్నారు. -
కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కంకర క్రషర్ యూనిట్లపై ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా క్రషర్ యాజమాన్యాలు కొనసాగిస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు సంబంధిత అధికారులను కలిసి హైకోర్టు ఇచ్చిన కాపీలను అందజేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని లేకపోతే పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్తో జీవితాంతం రక్షణ
ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకుంటే ఆడపిల్లలకు జీవితాంతం రక్షణగా ఉంటుందని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పెంచుకోగలిగతే జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఆరోగ్యం, అందం, ఆదాయం కూడా ఇస్తుందన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ చాలా సురక్షితమని, గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందన్నారు. బాలికలందురూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మానస, డీఎస్ఓ డాక్టర్.మనోహర్రెడ్డి, సీహెచ్ఓ.రవికుమార్, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలిజహీరాబాద్ టౌన్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని టీవీఏఈ జేఏసీ జహీరాబాద్ డివిజన్ డిమాండ్ చేసింది. ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం కన్వీనర్ సంతోశ్ ఆదివారం ప్రకటనలో కోరారు. విద్యాకమిషన్ రిపోర్టు లోపభూయిష్టంనారాయణఖేడ్: విద్యా కమిషన్ రిపోర్టు లోపభూయిష్టమని, దాని అమలును వెంటనే మానుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. ఖేడ్లో ఆదివారం జరిగిన సంఘం డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమిషన్లో పేర్కొన్న అంశాలన్నీ విద్యావ్యవస్థను, ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రిపోర్టు కమిషన్ చైర్మన్ వ్యక్తిగత భావాజాలాన్ని ప్రతిబింబించేలా ఉంది తప్ప రాష్ట్ర విద్యావ్యవస్థను అభివృద్ధి పరిచేలా లేదన్నారు. ప్రతీనెల విడుదల చేస్తున్న రూ.700 కోట్ల మొత్తంలో సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను సైతం విడుదల చేయాలన్నారు. సంఘం జిల్లా, రాష్ట్ర, డివిజన్ బాధ్యులు చంద్రశేఖర్, తుక్కప్ప, వినయ్ కుమార్, లక్ష్మణ్, రాజయ్య, మల్లికార్జున్, రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు సన్మానంకేక్ కట్ చేసి, చీరల పంపిణీ పటాన్చెరు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మహిళా కార్మికులను ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సతీమణి తరణం రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కాపాడటంలో జీహెచ్ఎంసీ మహిళా కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వెల కట్టలేనిదన్నారు. కార్యక్రమంలో లక్ష్మి, జ్యోతి, భవానీ, ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆలయ వార్షికోత్సవం సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని కృష్ణనగర్ కాలనీలో గల శ్రీ పంచముఖి వీరహనుమాన్ మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల మాణేమ్మ, పులిమామిడి మమత, అనిత, బీఆర్ఎస్ నాయకులు సాయి, విజయ్, అలయ కమిటీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


