Sangareddy District Latest News
-
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు పదిమంది తమ సమస్యలపై అందించిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వాటిని నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు పంపించారు. పరిష్కారానికి అనువుగా ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సివిల్ సప్లై, సోషల్వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి మరోమారు భగ్గుమంది. మండలాల పార్టీ అధ్యక్షుల నియామకాలతో రేగిన అసమ్మతి సోమవారం గాంధీభవన్కు చేరింది. నియామకాలు ఏకపక్షంగా జరిగాయంటూ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు 300 మంది వరకు గాంధీభవన్కు తరలివెళ్లి ఆయా మండలాల అధ్యక్షుల నియామకాల పట్ల అభ్యంతరం తెలిపారు. పార్టీ సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరమే అధ్యక్షులను నియమించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఏకపక్షంగా ప్రకటించడం ఏమిటని పార్టీ పెద్దలను నిలదీశారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి, కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యనేతల భేటీ అసమ్మతి సెగ గాంధీభవన్ చేరడంతో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి పార్టీ ముఖ్య నేతలను గాంధీభవన్కు పిలిపించి సమావేశమయ్యారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు అజ్మత్లతోపాటు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకుండా, అభిప్రాయాలు సేకరించకుండా పార్టీ అధ్యక్ష పదవులను ఎలా ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు సమావేశంలో నిలదీయడంతో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలను నిలిపివేస్తున్నట్లు అజ్మత్ ప్రకటించారు. తిరిగి వారం రోజుల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అధ్యక్షుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. దీంతో పార్టీ శ్రేణులు శాంతించాయి. పార్టీలో రెండేళ్లుగా అసమ్మతి రాగం జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసంతృప్తి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. పార్టీ మండలాల అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా తిరిగి భగ్గుమన్నాయి. పార్టీలో నాలుగు గ్రూపులు కొనసాగుతున్నట్లు పార్టీ నేతలు, కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గాంధీభవన్ సాక్షిగా ఇది నిజమే అని మరోమారు రుజువైంది. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, పార్టీ కార్యకర్తలకు ఉన్న స్వేచ్ఛతోనే తమ బాధను చెప్పుకున్నారని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి గ్రూపు రాజకీయాలను, అసమ్మతిని పార్టీ పెద్దలు ఎలా తెరదించుతారో వేచి చూడాల్సిందే. మండలాల అధ్యక్షుల ప్రకటనతో వెల్లువెత్తిన అసమ్మతి జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల నియామకాల నిలిపివేత గాంధీభవన్లో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం -
గ్రామాభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగు, బొంతపల్లి గ్రామాల్లో న్యూలాండ్ ఫౌండేషన్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 8 గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 14 బయోగ్యాస్ యూనిట్లు, రూ.6 లక్షల వ్యయంతో 16 వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, కృష్ణ, చక్రపాణి, కుమార్ గౌడ్, జైపాల్ రెడ్డి, నాయకులు మహేష్, శేఖర్ రెడ్డి, హుస్సేన్, న్యూలాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ హెడ్ రవి, ప్రతాప్ సింగ్, హెచ్ఆర్ హెడ్ సూర్యభగవాన్ పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
జహీరాబాద్ టౌన్: నిబంధనలు ఉల్లంఘిస్తే స్క్రాప్ దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని మున్సిపల్ చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ హెచ్చరించారు. మున్సిపల్ సమావేశ మందిరంలో పట్టణంలోని స్క్రాప్ దుకాణాల యాజమాన్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్, చైర్మన్లు మాట్లాడుతూ స్క్రాప్ దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దుకాణాల వస్తువులు రహదారులు, ఫుట్పాత్పైకి రాకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్, రసాయనాలు, పెట్రోల్, డీజిల్ లాంటి మండే స్వభావం ఉన్న వ్యర్థాలను నిల్వ చేయరాదన్నారు. అనంతరం ఎస్ఐ లవకుమార్ మాట్లాడుతూ దొంగలించిన వస్తువులను కొనుగోలు చేయరాదన్నారు. అలాగే లైసెన్స్లు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
ట్రక్కు ఢీకొని ఒకరు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో బీదర్–జహీరాబాద్ రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... కర్నాటక, బీదర్ పట్టణానికి చెందిన రెహమాన్(22), చిన్నాన్న హజ్మత్ హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం బైకుపై బీదర్కు వస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో నారింజ వాగు వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రెహమాన్ ట్రక్కు టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హజ్మత్కు తీవ్ర గాయాలు కాగా బీదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. బాధిత కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొంతకాలంగా బీదర్–జహీరాబాద్ రోడ్డు అధ్వానంగా ఉందని ఖలీల్పూర్, మిర్జాపూర్(బి), కోత్తూర్, రేజింతల్ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంత్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ● మరొకరికి తీవ్ర గాయాలు ● ఖలీల్పూర్ గ్రామ శివారులో ఘటన -
మోగిన బడి గంట
● తొలిరోజు అంతంత మాత్రమే హాజరు ● అంగన్వాడీల్లో స్వాగత తోరణాలు ● చిన్నారులకు పూలతో టీచర్లు స్వాగతం ● విద్యార్థులకు పుస్తకాల అందజేతసంగారెడ్డి ఎడ్యుకేషన్: వేసవి సెలవుల అనంతరం సోమవారం బడులు తెరుచుకున్నాయి. తొలిరోజు పాఠశాలకు అంతంతమాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. చాలారోజుల తర్వాత పాఠశాలకు రావడంతో చిన్నారులు కొంతసేపు ఏడుస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత మిగతా చిన్నారులతో కలిసి ఆడుకుంటూ మధ్యాహ్నం వరకు హాయిగా గడిపారు. కొద్దిమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని వచ్చారు. చాలాచోట్ల తొలిరోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుస్తకాలను అందజేశారు. అమావాస్య ప్రభావం! తమ చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సోమవారం పెద్దగా ముందుకురాలేదు. అమావాస్య రోజున బడులు ప్రారంభం కావడంతోనే పిల్లల్ని బడుల్లో చేర్పించేందుకు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ మొత్తంలో అడ్మిషన్లు వచ్చినట్లు సమాచారం. మంగళవారం నుంచి పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. అంగన్వాడీల్లో స్వాగత తోరణాలు జీవితంలో మొదటిరోజు బడికి వస్తున్న చిన్నారులకు ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. కొండాపూర్ మండలం హరిదాస్పూర్, గొల్లపల్లితోపాటు చాలా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాలకు విచ్చేసిన చిన్నారులకు పూలను అందజేసి స్వాగతం పలికారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
పటాన్చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం స్థానిక డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో అమీన్ పూర్, పటాన్ చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలోని 9 డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున.. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొల్లారం స్టేడియం, పాటి వివేకానంద స్టేడియంల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు సర్కిళ్లకు సంబంధించిన రూ.250 కోట్ల నిధులు తిరిగి డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటాయించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్కు విన్నవించామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈలు ఫైజాన్, లావణ్య పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
జోగిపేట(అందోల్): పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ చేసినట్లు అందోలు ఎంఈఓ బండి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నరేష్ కుమార్, ఉపాధ్యాయులు మాణయ్య, మంజ్యా నాయక్, రాములు, త్రినాధ్ రావు, అనిల్ కుమార్, నరోత్తం కుమార్, లక్ష్మణ్, సీహెచ్ చంద్రశేఖర్, రజినీ కాంత్, వీబీ శ్రీనివాస్, రవికుమార్, వెంకటేశం, చంద్రశేఖర్, మజీద్ పాల్గొన్నారు. వైభవంగా లక్ష్మీ సుదర్శన యాగం నారాయణఖేడ్: ప్రేమ, భక్తితోనే మాన జీవితానికి మోక్షం లభిస్తుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాదవానంద సరస్వతీస్వామి తెలిపారు. పట్టణంలోని మహతి జ్యోతిష్యాలయంలో సోమవారం నిర్వహించిన లక్ష్మీ సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. యాగం ద్వారా దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఎమ్మెల్యే, అనుపమారెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి వినోద్ పాటిల్, మహతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు గురురాజ్శర్మ పాల్గొన్నారు. ముమ్మరంగా పూడికతీత పనులు జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రధాన మురుగు కాల్వల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వరద ముంపు నివారణతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా చర్యగా జేసీబీలతో పనులు చేపడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ సోమవారం పనులను పర్యవేక్షించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భగవద్గీతపై ప్రచారం జిన్నారం (పటాన్చెరు): మండలంలోని జంగంపేట, లక్ష్మీపతిగూడెంలలో సోమవారం త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు అనుబంధ గ్రంథాల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ గిరి, ఎన్ఎస్ కుమార్, మధు, నరసింహాచారి, నర్సింహరావు, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ శ్రేష్టి, జస్విత్, అంజి, ప్రదం, సైదులు, మహేశ్, గోపాల్ పాల్గొన్నారు. -
రా‘బడి’దారిలో అడ్మిషన్ల వేట
ప్రైవేటు టీచర్లపై యాజమాన్యాల ఒత్తిడి ● విద్యార్థుల్ని చేర్పించకపోతే కొలువుపై వేటుకార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి బతక లేక బడిపంతులుగా మారింది. ప్రతీరోజు 14 గంటలు పని చేస్తున్నా వారికి కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా అమలు కావడం లేదు. ఐఐటీ, సీబీఎస్ఈ సిలబస్ బోధించడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులపై కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించలేక, మరో ఇతర పనిని చేయలేక ఉపాధ్యాయ వృత్తిలో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రతీ ఏటా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. దీంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు మరో కొత్త పంథాను ఎంచుకున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం మొదలు విద్యార్థుల్ని పాఠశాలల్లో చేర్పిస్తేనే ఉద్యోగం భద్రంగా ఉంటుంది లేదంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తామంటూ ఉపాధ్యాయులకు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పాఠశాలలో జాయిన్ అయితే ఫీజు తగ్గిస్తామంటూ తల్లిదండ్రులను బుజ్జగించి మరీ అడ్మిషన్లు చేయిస్తున్నారు. రోజుకో కొత్త పుస్తకం కొన్ని పాఠశాలలు సెంట్రల్ సిలబస్, మరి కొన్ని పాఠశాలలు స్టేట్ సిలబస్, ఇంకొన్ని పాఠశాలలు ఐఐటీ, సీబీఎస్ఈ సిలబస్ అంటూ నిత్యం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టుతున్నారు. మార్కెట్లోకి ఏ పుస్తకాలు వచ్చినా ముందుగా బోధించేది ఉపాధ్యాయులే. వాటిని అర్థం చేసుకుని విద్యార్థులకు చెప్పేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ముందురోజు ప్రిపేర్ కాకపోతే తర్వాత రోజు పిల్లలకు బోధించడం కష్టమే. దీంతో చాలామంది ఉపాధ్యాయులు మానసికంగా కుంగిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల్ని చేర్పిస్తేనే ఉద్యోగం సంగారెడ్డిలోని ఓ కార్పోరేట్ స్కూల్లో ఇంగ్లీషు సబ్జెక్టు బోధించాను. వేతనం చాలా తక్కువ. అడ్మిషన్లు తీసుకువస్తేనే మీ ఉద్యోగం ఉంటుంది అని యాజమాన్యం చెబుతోంది. మనం తీసుకొచ్చిన విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ ఫీజు విద్యార్థి చెల్లించలేకపోతే ఉపాధ్యాయుడు వేతనం నుంచి కట్ చేస్తారు. – శ్రవణ్కుమార్ (పేరు మార్చాం), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, సంగారెడ్డికొత్త సిలబస్తో తప్పని ఇబ్బందులు ర్యాంకుల కోసం స్టేట్, సెంట్రల్ సిలబస్ అంటూ ప్రతీ ఏటా కొత్త సిలబస్ను తీసుకువస్తున్నారు. కొత్తగా వచ్చే సిలబస్ ఎంతో కఠినంగా ఉండటంతో ముందుగా ఒక రోజు ప్రిపేర్ కావాల్సిందే. – హరినాథ్ గౌడ్ (పేరు మార్చాం), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడుచాలీ చాలని జీతం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. నర్సరీలోనే రూ.25 వేలకు పైగా వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలు మాత్రం రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులకు వేతనాలు అందించేలా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
అక్రమ చెరువులు ధ్వంసం
వట్పల్లి(అందోల్): అనుమతుల్లేకుండా సింగూరు ప్రాజెక్టు శివారు ప్రాంతంలోని అక్రమంగా తవ్విన చేపల చెరువులను సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. ఈ అక్రమ చేపల చెరువుల ఏర్పాటుపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 14 అక్రమ చెరువులను గుర్తించింది. దీంతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు మండలంలోని ఖాదిరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకుని 14 చెరువులను జేసీబీలతో ధ్వంసం చేశారు. అటు తర్వాత ఉసిరికపల్లి గ్రామంలో అక్రమ చెరువులను కూడా ధ్వంసం చేశారు. ఇరిగేషన్శాఖ ఈఈ భీమ్, సింగూరు ప్రాజెక్టు డీఈ మధుసూధన్, ఏఈ పరుశరాం, డిప్యూటీ ఈఈ రవికుమార్, అందోలు ఏఈ రోహిత్ విశ్వశర్మలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాళ్లా వేళ్లా పడ్డ నిర్వాహకులు ఈ క్రమంలో చేపలు పూర్తిస్థాయిలో పెరగకముందే మధ్యలోనే చెరువులను ధ్వంసం చేయడంపై చెరువుల నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. తమ భార్యల బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షల వ్యయంతో చేపల చెరువుల తవ్వించామని, వాటిలో చేపలను మరోచోటకు తరలించేందుకు మూడు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులను ధ్వంసం చేసేశారు. సింగూరు శివారులో 14 చేపల చెరువులు స్థానికుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం -
నేటి నుంచి ఆటో చార్జీల పెంపు
ఆటో యూనియన్ నాయకుల వెల్లడి సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం నుంచి ఆటో చార్జీలు పెంచుతున్నట్లు సంగారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్లడించింది. యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాయార్ పాషా, టౌన్ ప్రెసిడెంట్ బాబా మాట్లాడుతూ..ఓల్డ్ బస్టాండ్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు, బసవేశ్వర విగ్రహం వరకు రూ.15 నుంచి రూ.20పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఓల్డ్ బస్టాండ్ నుంచి మల్కాపూర్, చింతల్, కంది వరకు రూ.25నిర్ణయించారు. ఓల్డ్ బస్టాండ్ నుంచి ఫసల్వాది, ఎమ్మెన్నార్ చౌరస్తా వరకు రూ.20 తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు రూ.10 చొప్పున తీసుకుంటామని తెలిపారు. క్షయ వ్యాధిని నిర్మూలించాలి: డీఎంహెచ్ఓసంగారెడ్డి: సమాజంలో క్షయ (టీబీ)వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి స్పష్టం చేశారు. జిల్లాలోని టెస్టింగ్ సెంటర్లు, పీల్స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలు సలహాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రిలో నమోదయ్యే టీబీ కేసులు తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలిసేలా నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీబీ జిల్లా అధికారి అరుణకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాత శిశు మరణాలు తగ్గించాలిజిల్లాలో మాత శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గించాలని డీఎంహెచ్ఓ సూచించారు. హత్నూర, దౌల్తాబాద్, కసర్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదైన మాతా మరణాల కేసులను సమీక్షించారు. అధిక ప్రమాద గర్భిణీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి, రిఫరల్ వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
తాపీ మేసీ్త్రలకూ ప్రమాద బీమా పత్రాలు
సంగారెడ్డి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపుకి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతుందని ఆ సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ అన్నారు. చౌటకూర్లోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు సోమవారం సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికాట్ గ్రూప్ కంపెనీస్ ప్రపంచంలో 12 దేశాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అనంతరం డీలర్ అభిలాష్ మాట్లాడుతూ భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని, అధికంగా సేల్స్ అవుతుందని తెలియజేశారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా పత్రాలను ఆ సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ అందజేశారు. ఈ సమావేశంలో భారతి సిమెంట్ డీలర్ అభిలాష్, ట్రేడర్స్ యజమాని, 50 మంది తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
బురదయాతన..!
● చెరువులను తలపిస్తున్న రహదారి గుంతలు ● ప్రయాణికులకు తప్పని తిప్పలుకంది (సంగారెడ్డి): మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన పైప్లైన్ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. కొంతకాలంగా ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కంకర తేలి, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గుంతలన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 38 ఏళ్ల క్రితం మంజీరా పైపులైను వెంట ఈ రహదారిని ఏర్పాటు చేశారు. అప్పట్లో వేసిన ఈ రోడ్డు ప్రస్తుతం సంరక్షణ కరువై పూర్తిగా పాడైపోయింది. ఈ రహదారి వెంట నిత్యం కోతలాపూర్, మక్తఆల్లూర్, కలివేముల, చెర్లగూడెం, జుల్కల్, ఎద్దుమైలారం తదితర గ్రామాల ప్రజలు తమ నిత్య అవసరాల కోసం, ఉద్యోగాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే, చుట్టుపక్కల ఉండే పొలాలకు వెళ్లే రైతులు కూడా నిత్యం ఈ రహదారి వెంటనే ప్రయాణించాల్సి వస్తోంది. కష్టాల్లో వాహనదారులు, రైతులు: రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. బురద రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడపడం అత్యంత కష్టంగా మారిందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ దారిలోనే ప్రయాణించే రైతులు సైతం తమ వ్యవసాయ సామగ్రిని, పంటలను తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పైప్లైన్ రోడ్డును పాలకులతో పాటు అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మద్యానికి బానిసై మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిధిలోని కల్వకుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కల్వకుంట గ్రామానికి చెందిన రావిపల్లి ప్రభాకర్ రెడ్డి(72) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన పాత ఇంట్లో ఉన్న దూలానికి దోతి సహాయంతో ఉరివేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో మద్యపానానికి బానిసై కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాశాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పారట్ల కుమార్ (30) గ్రామ సమీపంలోని నీలగిరి చెట్లలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో మహిళ.. చేగుంట(తూప్రాన్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాసాయిపేట మండలం పులిగుట్ట తండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తండాకు చెందిన మాలోత్ సోనీ(50) తన భర్త కాశీరాంలు శనివారం రాత్రి గొడవపడ్డారు. ఈ క్రమంలో అదే రాత్రి సోనీ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. ఆదివారం సమీప రైతులు పొలంలో పడిపోయి ఉన్న సోనీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తండాకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానసిక ఆందోళనతో మనస్తాపానికి గురై.. జిన్నారం (పటాన్చెరు): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి కథనం ప్రకారం... శివంపేట్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన రాజు(50) గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగులో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన నివాసంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పాటు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భార్యతో గొడవపడి భర్త.. హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్లో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన గడ్డి మైసయ్య(55)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు మైసయ్య, కంసమ్మలు వేరుగా నివాసముంటున్నారు. సంసారం విషయంలో రెండు రోజుల క్రితం గొడవపడి భార్య మెదక్లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మైసయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన కుమారులు తలుపులు తీసి చూసేసరికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు.. వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో ఓ బావిలో శవమై తేలింది. ఈ ఘటన మండలంలోని శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిన్నింగి వెంకమ్మ(75) రెండేళ్ల క్రితం కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉంది. రోజూ మాదిరిగా కోడలు లక్ష్మి శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం ఇచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం చూసేసరికి వెంకమ్మ తన గదిలో లేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఆందోళన చెందిన కోడలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్తులతో కలిసి పోలీసులు శివారులో వెతుకుతుండగా ఓ బావిలో శవమై కనిపించింది. వృద్ధురాలి ఒంటిపై ఉండే బంగారు నగల కోసం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు మొదట అనుమానించినా, మృతదేహంపై నగలు ఉన్నాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు బావి వద్దకు ఎలా వెళ్లింది? ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రభుత్వ బడికి క్రేజ్
● ఉత్తమ బోధనతోనే భారీగా అడ్మిషన్లు ● ప్రతీ యేటా ఇదే సీన్నారాయణఖేడ్: నారాయణఖేడ్లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సీటుకోసం పోటీ నెలకొనడంతోపాటు కొన్ని రోజుల్లోనే అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు తగిలిస్తారు. ఉన్న తక్కువ గదుల్లోనే టీచర్లు అత్యుత్తమ బోధన చేపడుతుండటంతో ఈ పాఠశాలకు క్రేజ్ నెలకొంది. తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు పోటీపడతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పదోతరగతి వరకు బోధన జరుగుతుండగా 880 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 గదులు ఉండగా 22మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2022– 23లో 756, 2023– 24లో 800, 2024–25లో 880మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది 100మంది పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. కాగా గతేడాది జులైలోనే అడ్మిషన్లు పూర్తి చేసి సుమారు 200మంది పైగా విద్యార్థులను వెనక్కి పంపించారు. ఈ ఏడు జులై మొదటి వారంలోనే 350పైగా అడ్మిషన్లు రాగా అందులో 150పైగా అడ్మిషన్లు ప్రైవేట్ పాఠశాలల నుంచే వచ్చాయి. ఉన్న గదులు, సదుపాయాల మేరకు దాదాపు పూర్తి స్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. చాలా గదుల్లో విద్యార్థులు పట్టక ఇరుకుగా కూర్చుంటున్నారు. పాఠశాలలో చదువుతోపాటు యోగా, క్రీడలు, బ్యూటీషియన్, సంగీతం, కంప్యూటర్ లాంటి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ప్రతీ ఏడు ట్రిపుల్ఐటీ బాసరకు పలువురు విద్యార్థులు ఎంపికవుతుంటారు. పాఠశాలకు దాతల సహకారం కూడా బాగానే ఉంది. సేవోద్గం ఫౌండేషన్, డిగ్నిటీ ఫౌండేషన్ల ద్వారా హిందీ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సహకారంతో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, విద్యార్థులు అందరికీ బ్యాగులు, విద్యాసామగ్రి, ఇతర సదుపాయాలు ప్రతీ ఏడు కల్పిస్తున్నారు. -
బైక్ ఢీకొని కార్మికుడికి తీవ్ర గాయాలు
హత్నూర(సంగారెడ్డి): నడుచుకుంటూ వస్తున్న కార్మికుడిని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సంగారెడ్డి దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జార్ఖండ్కు చెందిన ఠాగూర్ గుండ్ల మాచునూరు గ్రామ శివారులోని కోవలెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. పరిశ్రమ నుంచి అద్దె గదికి వెళ్తున్న క్రమంలో కొండాపూర్కు చెందిన శివ, ప్రసాద్ ఇద్దరు బైకుపై ఏడుపాయల ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఠాగూర్ను ఢీకొట్టారు. దీంతో కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. తోటి కార్మికులు గమనించి వెంటనే బైక్తో పాటు ఇద్దరు యువకులను తీవ్రంగా మందలించారు. అంబులెన్స్లో గాయపడిన కార్మికుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సైతం పరిశీలించారు. -
అంతర్జాతీయ భాగస్వామ్యంతో పరిశోధనలు
● కావేరి వైస్చాన్స్లర్ డాక్టర్ ప్రవీణ్రావు ● వర్సిటీని సందర్శించిన బ్రెజిల్ విద్యావేత్త డాక్టర్ ఫ్లావియో మైడెరోస్ వర్గల్(గజ్వేల్): బ్రెజిల్లోని లావ్రాస్, కావేరి వర్సిటీల మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచస్థాయి అవకాశాలతోపాటు, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత బలం చేకూరుతుందని కావేరి వైస్చాన్స్లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావు పేర్కొన్నారు. ఆదివారం లావ్రాస్ ఫెడరల్ యూనివర్సిటీ (యూఎఫ్ఎల్ఏ) ప్లాంట్ పాథాలజీ విభాగం ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ ఫ్లావియో మైడెరోస్ గౌరారంలోని కావేరి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వీసీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయంలోని ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన క్షేత్రాలు, సమగ్ర పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. విద్యా, పరిశోధన సదుపాయాలు అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థుల మొబిలిటీ కార్యక్రమాలు, విద్యాపరమైన సహకారం, పరిశోధనలు, అవుట్రీచ్ కార్యక్రమాలు, అధ్యాపకుల అభివృద్ధి తదితర రంగాల్లో రెండు వర్సిటీల పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బీ.శ్రీనివాసులు, డీన్ డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వారితో అంతర్జాతీయ విద్య, పరిశోధన, అకాడమిక్ సహకార అవకాశాల పై విస్తృతంగా చర్చించారు. -
అర్ధరాత్రి చైన్ స్నాచింగ్
మహిళ మెడలోంచి తస్కరణ దొంగల కోసం గాలిస్తుండగా.. శివ్వంపేట(నర్సాపూర్): అర్ధరాత్రి దొంగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన మినంచంపేట జ్యోతికి మాటలు రావు. భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రోజువారిగానే మొదటి అంతస్తులో తల్లిదండ్రులు లక్ష్మి, నర్సింహులుతో కలిసి జ్యోతి పడుకుంది. మొదటి అంతస్తులో టాయిలెట్స్ లేకపోవడంతో జ్యోతి బాత్రూం కోసం అర్ధరాత్రి కిందకి దిగింది. ముఖాలకు మాస్క్లు వేసుకొని ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోతుండటంతో ఆమె అరిచింది. ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు, పైఅంతస్తులోని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు లేచి దొంగల కోసం గాలించగా కొద్ది దూరంలో చోరీ చేసిన బంగారు గొలుసు కిందపడి ఉంది. కాగా చోరీ అనంతరం జ్యోతి అరవడంతో దొంగలు హడావిడిలో వెళ్తున్న క్రమంలోనే బంగారు గొలుసు కిందపడి ఉండవచ్చని కాలనీవాసులు తెలిపారు. అర్ధరాత్రి దొంగల కోసం గాలించినా దొరకలేదు. నార్లాపూర్ గ్రామంలో.. నిజాంపేట(మెదక్): మహిళ మెడలో బంగారు పుస్తెలతాడును స్కూటీపై వచ్చిన వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన అంబటి పెంటమ్మ తన ఇంటి ముందు కూర్చుంది. కాగా తెలుపు రంగు స్కూటీపై గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగినట్లు నటించి మెడలోని బంగారు పుస్తెలతాడును లాగుతుండగా.. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించింది. దీంతో సుమారు అర తులం బంగారు పుస్తెను లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు ఢీకొని విద్యార్థి మృతి సంగారెడ్డి : కొన్ని గంటలైతే బర్త్ డే పార్టీలో అనందంగా గడపాల్సిన విద్యార్థినిని మృత్యురూపంలో ఆర్టీసీ బస్సు కబలించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ కథనం ప్రకారం... సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పుర్ర వైష్ణవి(13) ఏడో తరగతి పూర్తయింది. ఆదివారం పుల్కల్ మండలం మీన్పూర్ గ్రామం అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర తన మామ కూతురు పుట్టినరోజు వేడుకకు వచ్చింది. కాగా గ్రామంలోని పక్కింట్లో ఉన్న రమ్యశ్రీ సల్వాది విద్యాపీఠంలో భరతనాట్యం నేర్చుకుంటుండగా, ఆమెతో కలిసి వైష్ణవి, రమ్యశ్రీ తండ్రి బైక్పై పసల్ వాదికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జోగిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు శివంపేట టోల్ ప్లాజా దాటిన తర్వాత హోన్నపూర్ శివారులో బైకును వెనక నుంచి ఢీకొట్టింది. బైక్పై ఉన్న వైష్ణవి రోడ్డుపై పడటంతో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆమె పైనుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిస్తున్న బాలరాజ్, అతని కూతురు గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వైష్ణవి మృతితో పుల్కల్, సదాశివపేట మండలాల్లో విషాదం నెలకొంది. వైష్ణవి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ సిద్దిపేటఅర్బన్: సామాన్య ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యంను అందుబాటులోకి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక భవన్లో జరుగుతున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు రెండోరోజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధిక ఫీజులు, డొనేషన్ల రూపంలో వేలాది కోట్లు కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు దండుకుంటున్నాయన్నారు. శిక్షణ తరగతుల్లో సీపీఎం నాయకులు మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, కృష్ణారెడ్డి, వెంకట్, రవికుమార్, యాదగిరి పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్కు చెందిన గౌరమ్మ (70) శనివారం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి అదృశ్యంపై కూతురు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పనికి వెళ్లిన వ్యక్తి.. పనికి వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన సురేంద్ర ప్రసాద్ (33) మే 22న కూలి పని కోసం వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అయితే గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. రోజులు గడిచినా కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి నిరంజన్ ప్రసాద్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వర్గల్ మండలంలో మహిళ.. వర్గల్(గజ్వేల్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని అంబర్పేటలో చోటు చేసుకుంది. గౌరారం ఏఎస్ఐ పోచగౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లపురం రామయ్యకు భార్య బుచ్చమ్మ(55), ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 9న ఇంట్లో గొడవ జరగగా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో భర్త రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
పరిస్థితి విషమం నర్సాపూర్ రూరల్: మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన మన్నే రమేశ్, చెన్నం రెడ్డి గ్రామంలోని బెల్ట్ షాపు వద్దకు ఆదివారం మద్యం కోసం వెళ్లారు. తాగిన మత్తులో బెల్ట్ షాపు ఎదురుగా ఉన్న పాన్షాప్ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చెన్నం రెడ్డి , రమేశ్పై కత్తితో పలుచోట్ల దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమేశ్ను ఆస్పత్రికి తరలించారు. రమేశ్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చెన్నం రెడ్డిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వర్ష బీభత్సం
కొండాపూర్(సంగారెడ్డి)/నారాయణఖేడ్: మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోనే కొండాపూర్లో అత్యధికంగా 11.4 వర్షపాతం నమోదైంది. దీంతో గ్రామాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. విద్యుత్ స్థంభాలు నేలకొరగడం, విద్యుత్ వైరులు తెగిపోవడంతో చాలా గ్రామాలు శనివారం రాత్రి అంధకారంలోనే ఉన్నాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. చెర్ల గోపులారంలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాత్రంతా ఆ గ్రామం అంధకారంలోనే ఉంది. అదే గ్రామానికి చెందిన బాల్రాజ్గౌడ్కు సంబంధించిన భవనంపై గోడ కూలిపోయింది. మరో ముగ్గురికి సంబంధించిన రేకుల ఇల్లు నేల మట్టమయ్యాయి. ఇదే కాకుండా గిర్మాపూర్లో కూడా రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గొల్లపల్లిలో గౌరమ్మ, నడిమింటి స్వరూపలకు సంబంధించిన రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయాయి. వీరికి సంబంధించిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఆదివారం సంఘటన స్థలాన్ని తహసీల్దార్ అశోక్ పరిశీలించి వారికి పునరావసం కల్పించారు. నెలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చూస్తానని భరోసా కల్పించారు. అదేవిధంగా మండల కేంద్రమైన కొండాపూర్, అలియాబాద్ గ్రామాల్లో కూడా రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలకు విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలుగడంతో మనూరు మండలం బోరంచ ఇన్టెక్వెల్ నుంచి పలు గ్రామాలకు తాగునీటి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
రైతన్నకు దిక్సూచి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రతీ ఏటా అకాల వర్షాలు అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వరుణుడి కోసం ఎదురుచూస్తూ పంటల సాగును చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకు చల్లని కబురు తీసుకొచ్చింది. సకాలంలో రైతులకు వాతావరణ సూచనలు, వర్షాలు, పిడుగుల సమాచారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలు ఐఎండీ, ఐకార్ సహకారంతో పలు రకాల యాప్లను రూపొందించింది. ఇందులోభాగంగా మేఘ్దూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్లను రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని యాప్లు ముందస్తు సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి. మేఘ్దూత్లో ముందస్తు సమాచారం మేఘ్దూత్ యాప్లో రానున్న నాలుగు రోజుల వాతావరణ సమాచారాన్ని రైతులు ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్లో వారం క్రితం నాటి సమాచారంతోపాటుగా ప్రస్తుత సమయంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం సమాచారాన్ని పొందవచ్చు. ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఈ యాప్ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వర్ష సూచనలను నిరంతరం తెలుసుకునేందుకు రెయిన్ అలారం, కిసాన్ సువిధ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. వాతావరణంతోపాటుగా మార్కెట్ ధరలు, పంటల భీమా సమాచారం, విత్తనాలు,ఎరువులు,నీటి నిర్వహణపై పలు సూచనలు ఈ యాప్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలతోపాటుగా తెలుగు భాషలోనూ రైతులకు యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. దామిని యాప్లో పిడుగుల సమాచారం ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని దామిని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులు ఎక్కడ పడే అవకాశం ఉందో ఈ యాప్ రైతులకు సూచిస్తూ ప్రాణాలను కాపాడుతుంది. పిడుగు పడే సమయంలో రైతులు తగు జాగ్రత్తలను తీసుకుని రక్షణ పొందవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి రైతుల ఉపయోగార్థం ప్రభుత్వం రూపొందించిన మేఘ్ధూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ యాప్లతో పంటల సాగులో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా రైతులకు ప్రాణ రక్షణకు దోహదపడుతుంది. – వెంకటలక్ష్మి, ఏడీఏ సంగారెడ్డి -
ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
నారాయణఖేడ్: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండటం ఎంతో కీలకమని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సంవత్ పేర్కొన్నారు. ఖేడ్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని బూత్స్థాయి ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓటుహక్కు రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన విలువైన ప్రజాస్వామ్య హక్కన్నారు. 18 ఏళ్లు నిండిన వారిపేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. వలసలు, మరణాలు, చిరునామా మార్పులవంటి అంశాలపై పూర్తి సమాచారంతో ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని చెప్పారు. ప్రజల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. అర్హుల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్రియకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, జిల్లా ఇన్చార్జి ఫయీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యంగా ఉద్యమిద్దాం
తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని మాధవసదన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేతన, సర్వీస్ నిబంధనలు, ఉద్యోగ భద్రత, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు తపస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, చంద్రశేఖర్, విజయ్కుమార్, నరసింహులు, తుక్కప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు రూ.15 వేలు పింఛన్రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ పటాన్చెరు టౌన్: తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు రూ.15 వేలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం దివ్యాంగులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్లో 80% పైగా వైకల్యం కలిగిన వారికి దాదాపు రూ.15 వేలు పెన్షన్ అందిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి తీవ్ర వైకల్యం కలిగిన వారు 4 నుంచి 5 వేల మంది మాత్రమే ఉంటారని, వారికి రూ.15 వేలు చొప్పున పెన్షన్ ఇచ్చినా ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రవికుమార్, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్జహీరాబాద్ టౌన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ తుది దశ ప్రక్రియ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రంజోల్ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మునిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొదటి దశలో హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ 15న స్లాట్ బుకింగ్, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేపట్టి 23 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాలిసెట్ పరీక్షలకు హాజరై ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు త్వరగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్లైన్ కేంద్రంలో సంప్రదించాలని మునిగుప్తా పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలేస్కూల్ బస్సు డ్రైవర్ల సమావేశంలో డీఎస్పీ జహీరాబాద్ టౌన్: విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ బస్సు డ్రైవర్లకు డీఎస్పీ సైదానాయక్ హెచ్చరించారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్లో స్కూల్ బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపరాదన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడటం, మేసేజ్లు పంపడం చేయరాదని సూచించారు. ప్రధాన కూడళ్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్, అతివేగంగా వెళ్లడం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులను ఎక్కించేటప్పుడు..దింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్సైలు లవకుమార్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
స్నేహితులను కలుసుకోవడం భలే ఉండేది
సంగారెడ్డి టౌన్: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడం మొదటిరోజే బడికి వెళ్లి తోటి స్నేహితులను, ఉపాధ్యాయులను కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చేది. పాత ఉపాధ్యాయుల దీవెనలు, కొత్త తరగతి ఉపాధ్యాయుల పరిచయం, వారి పాఠాలు మొదలయ్యే విధానం అన్నీ ఒక మధురమైన జ్ఞాపకం. పాఠశాలకు హాజరయ్యే పిల్లలకు స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకునేలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. – సౌజన్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి -
బడి గంటకు వేళాయె..
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు ● ఈ సారి 130 స్కూళ్లల్లో ప్రీ ప్రైమరీ వేసవి సెలవులతో బిజీబిజీగా గడిపిన చిన్నారులు సోమవారం నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. స్కూళ్లను అందంగా అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలనున్నారు. ప్రభుత్వ బడుల్లో 1వ తరగతి నుంచి ప్రారంభమవుతుండటంతో గ్రామాల్లో చిన్నారులను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్:పాఠశాల మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా పుస్తకాలు చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 7,14,660 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 6,95,220 పుస్తకాలు వచ్చాయి. ఇప్పటివరకు 5,90,000 పుస్తకాలను ఆయా మండలాలకు సంబంధించిన ఎంఆర్సీ కార్యాలయాలకు పంపిణీ చేశారు. 7వ తరగతికి సంబంధించిన హిందీ పుస్తకాలు మాత్రమే రాలేదు. అవి కూడా రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు 7,76,658 నోట్ బుక్లు అవసరం కాగా కొండాపూర్, మనూర్, నాగలిగిద్ద, నిజాంపేట, మొగుడంపల్లి మండలాలకు మినహా మిగతా అన్నిచోట్లకు నోట్పుస్తకాలు అందాయి. ఎంఆర్సీలోనే పాఠ్యపుస్తకాలు గత మూడేళ్లుగా ప్రవేశాలిలా.. సంవత్సరం 1వ తరగతి 6వ తరగతి 2023–24 10,647 11,4002024–25 11,105 9,7282025–26 11,230 10,438 -
ఇక పంచాయతీల విభజన
● ఆదాయం ఆధారంగా గ్రేడింగ్ ● కార్యదర్శుల పదోన్నతులకు అవకాశం ● బలోపేతం కానున్న పంచాయతీలుసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ పాలన మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందులోభాగంగా పంచాయతీలను ఆదాయం ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లు గ్రామ పంచాయతీల వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయించారు. రూ.19 లక్షల కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్–1గా, రూ.13 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉన్న వాటిని గ్రేడ్–2, రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్–3, రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్–4గా విభజించనున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, 46 జీపీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంతోపాటు కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 12 కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 613 పంచాయతీలున్నాయి. గ్రేడ్– 1 పరిధిలోకి 40, గ్రేడ్–2 లోకి 53, గ్రేడ్ –3 లోకి 164, గ్రేడ్–4 లోకి 356 గ్రామపంచాయతీలను విభజించనున్నారు. పదోన్నతులకు అవకాశం గ్రామ పంచాయతీల గ్రేడింగ్లుగా విభజన ప్రక్రియ పూర్తయితే జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. గ్రేడింగ్ విభజనతో క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియను సైతం సవరణ చేయనున్నారు. మెరుగుపడనున్న పంచాయతీ పాలన గ్రేడింగ్ విధానం అమలుతో పంచాయతీల పాలన వ్యవస్థ మెరుగు పడనుంది. ప్రస్తుతం జిల్లాలో ఇష్టారీతిగా కార్యదర్శులకు పంచాయతీలను కేటాయించారు. ఔట్ సోర్సింగ్, జూనియర్ కార్యదర్శులకు అధిక ఆదాయం వచ్చే పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, పంచాయతీల గ్రేడింగ్ వ్యవస్థను కార్యదర్శులు స్వాగతిస్తున్నారు.జిల్లాలో గ్రేడ్ల వారీగా విభజన కానున్న గ్రామ పంచాయతీలుగ్రేడ్ రకం పంచాయతీలుగ్రేడ్–1 40 గ్రేడ్–2 53 గ్రేడ్–3 164 గ్రేడ్–4 356 -
ఉత్సాహంగా.. భయం భయంగా
సంగారెడ్డి జోన్: నా చిన్నతనంలో తొలి రోజు పాఠశాలకు చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. కొత్త స్నేహితులు, ఉపాధ్యాయులు కలుసుకుంటారని సంతోషం ఉండేది. మొదటి రోజు పాఠశాల అంటే ఏ విధంగా ఉంటుందోననే భయంతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లేదాన్ని. సెలవుల తర్వాత స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తుంటే అదో మధురానుభూతి. కొత్త పుస్తకాలు, బ్యాగు, షూస్ వేసుకుని అందరితో వెళ్లేవాళ్లం. పుస్తకాలకు ర్యాపర్స్ వేసుకుని వాళ్లం. ప్రతీ ఒక్కరు బాగా చదువుకోవాలి. ఉన్నత లక్ష్యాలను నిర్దేషించుకుని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. – టీఎల్. సంగీత, అదనపు కలెక్టర్, సంగారెడ్డి -
బుల్లెట్ రైల్ కోసం మంత్రి దామోదరకు వినతి
మెదక్ ఎంపీ రఘునందన్తోనూ ఎమ్మెల్యే భేటీ జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్ రైలును జహీరాబాద్ మీదుగా నడిపేలా డీపీఆర్ను రూపొందించేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను అఖిలపక్షం నాయకులు కోరారు. ఎమ్మెల్యే కె.మాణిక్రావు, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డిల ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు మంత్రి దామోదర రాజనర్సింహను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మొదటి విడత డీపీఆర్ అలైన్మెంట్లో బుల్లెట్ రైలు మార్గాన్ని జహీరాబాద్ మీదుగా ఖరారు చేసినప్పటికీ ఇటీవల ఆమోదం పొందిన తుది డీపీఆర్లో ఆ మార్గాన్ని కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్ల మీదుగా మార్చడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారనుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఇదిలాఉంటే మెదక్ ఎంపీ రఘునందన్రావుతో సైతం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రఘునందన్రావు స్పందిస్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, బీజేపీ నాయకులు పాండురంగారెడ్డి, సుభాష్రెడ్డి, విజేందర్రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. -
నేడు ’సర్’పై అవగాహన సదస్సు
నారాయణఖేడ్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)పై ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని జీవన్ ఫంక్షన్హాలులో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తనతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, ముఖ్య శిక్షకులు రాజీవ్ పాల్గొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై, బూత్ స్థాయి ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని బూత్ స్థాయి ఏజెంట్లు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల బాధ్యులు, గ్రామస్థాయి యువ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో ఆర్టీసీలో ఎన్నికలురీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ సంగారెడ్డి టౌన్: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో భక్తజన సందడి శివ్వంపేట(నర్సాపూర్): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ కోరారు. ఈకేవైసీ తప్పనిసరి నెలాఖరుతో ముగియనున్న గడువు గ్యాస్ లబ్ధిదారులు సైతం.. -
నిందితుడికి రిమాండ్
దుబ్బాకటౌన్: అన్నపై దాడి చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాయపోల్ ఎస్ఐ కె.మానస కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తిప్పుగొని మహేశ్ గౌడ్ అతని తమ్ముడు శ్రీకాంత్ మధ్య ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం నెలకొంది. ఈ క్రమంలో మే 29న ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన శ్రీకాంత్, మహేశ్పై కట్టెతో దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకొని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
చెట్లు తెంచిన తంటా
పవర్ వర్సెస్ ఫారెస్ట్శాఖ హవేళిఘణాపూర్(మెదక్): చెట్ల కొమ్మలను తొలగించే విషయం విద్యుత్, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మండల పరిధిలోని జక్కన్నపేట– బూర్గుపల్లికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను శనివారం విద్యుత్శాఖ అధికారులు నరికివేస్తుండగా, తమ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారంటూ అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
చెరువులో మునిగి వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): చెరువులో స్నానం చేస్తుండగా కాలుజారి నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బచ్చురాజ్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... బచ్చురాజ్పల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లయ్య (48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఇటీవల మరణించిన కులస్తుడి దశదిన కార్యక్రమం నిమిత్తం మల్లయ్య స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి వారు వెంటనే చెరువులో గాలించారు. దురదృష్టవశాత్తు అప్పటికే మల్లయ్య ప్రాణాలు కోల్పోవడంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అంత్యక్రియలకు ఆపన్నహస్తం
● బాలసదనంలో కన్న పిల్లలు ● అనారోగ్యంతో తండ్రి మృతి ● ఆఖరి క్రతువుకు అండగా నిలిచిన దాతసిద్దిపేటజోన్: తండ్రి అంత్యక్రియల ప్రక్రియ జరిపించలేని చిన్నారులకు దాత ఆపన్నహస్తం అందించారు. జిల్లా అధికారుల సమక్షంలో దాత సహాయంతో అంత్యక్రియల క్రతువు పూర్తయింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా నుంచి శివ, అంజలి దంపతులు నలుగురు పిల్లలతో బతుకుదెరువు కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని జీవనం సాగించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో 2018లో పిల్లలను బాలసదనం అక్కున చేర్చుకుంది. ఈ నేపథ్యంలో తల్లి అంజలి మూడేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి చిన్న చిన్న పనులు చేస్తూ పట్టణంలో ఫుట్పాత్, బస్టాండ్ ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాడు. అనారోగ్యం, మద్యానికి బానిసై దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ శుక్రవారం రాత్రి పట్టణంలో ఫుట్పాత్పై శివ చనిపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి రాము శవాన్ని మార్చురీకి తరలించారు. శివ పిల్లలకు సమాచారం అందించారు. ఆపన్నహస్తం కోసం.. కన్న తల్లి చనిపోయి, ప్రస్తుతం తండ్రి అనాథ శవంగా మార్చురీలో ఉండడం, బంధువులు, ఆప్తులు ఎవ్వరూ లేకపోవడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. కాగా దహన సంస్కారాల నిర్వహణ ప్రశ్నగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతా రత్నాకర్ సాయం చేశారు. దీంతో శ్రీరామకుంట శ్మశానవాటికలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. -
తిరుపతిలో తప్పిపోయిన బాలుడు
చేగుంట(తూప్రాన్): తిరుపతి దర్శనం కోసం వెళ్లిన ఆరేళ్ల బాలుడు తప్పిపోయాడు. వివరాలు ఇలా.. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామ పంచాయతీ పులిగుట్ట తండాకు చెందిన రతన్ మొదటి భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. అతడి రెండో భార్య కాజల్ ఆమె కుమారుడితో పాటు మొదటి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరుపతిలో రతన్ మొదటి భార్య కుమారుడు నేరు (6) తప్పిపోయాడు. శుక్రవారం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్న రతన్ తన కుమారుడు తిరుపతిలో తప్పిపోయినట్లు హంగామా చేసినట్లు తండా వాసులు పేర్కొన్నారు. తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాబు ఆచూకీ దొరుకుతుందని స్టేషన్లోని రైల్వే పోలీసులు రతన్కు సూచించినట్లు సమాచారం. కాగా దర్శనానికి వెళ్లిన కుటుంబంలోని బాలుడు మాత్రమే తప్పిపోవడంపై తండా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండా నాయకులు మనోహర్తో పాటు యువకులు బాలుడి ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రయత్నాలు ప్రారంభించారు. తల్లి, కూతురు అదృశ్యంపటాన్చెరు టౌన్: వివాహిత తన కూతురుతో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరులో ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 10న రాత్రి సంసారం విషయంలో భార్య (31)తో గొడవపడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం భార్య, మూడేళ్ల కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. భార్య, కూతురు అదృశ్యంపై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేలిన ఆక్సిజన్ సిలిండర్
ముగ్గురికి స్వల్పగాయాలు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగికి ఆక్సిజన్ పెడుతున్న క్రమంలో వాల్ ఒక్కసారిగా వేగంగా తెరవడంతో రెగ్యులేటర్ పేలింది. దీంతో డాక్టర్, నర్సుతో పాటు వాచ్మెన్, అంబులెన్స్ డ్రైవర్లకు స్వల్ప గాయాలై ప్రమాదం తప్పింది. కోహీర్కు చెందిన ఓ రోగి వైద్యం కోసం శనివారం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. రోగికి ఆక్సిజన్ పెట్టాల్సిరావడంతో డాక్టర్ రవికుమార్, సెక్యూరిటీ గార్డ్ రాములు, అంబులెన్స్ డ్రైవర్ ఖాజా మరో నర్సు కలిసి సిలిండర్ వాల్ను ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారిగా వాల్ వేగంగా తెరవడంతో పీడనం వల్ల రెగ్యులేటర్ పేలిపోయింది. రెగ్యులేటర్ ముక్కలు కావడంతో రాములు, ఖాజా, డాక్టర్ రవికుమార్లకు తగిలి స్వల్ప గాయాలయ్యా యి. వెంటనే అప్రమత్తమైన వారు సిలిండర్ను పక్కకు తీసుకెళ్లి వాల్ను మూసివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. డబుల్ బెడ్రూం భవనం పైనుంచి దూకి... గర్భిణి బలవన్మరణం జహీరాబాద్ టౌన్: కుటుంబ గొడవలతో ఓ నిండు గర్భిణి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం... జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్లోని బుడగ జంగాలకు చెందిన పూజ(23)కు హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీలో ఇల్లు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కాలనీలో రెండవ అంతస్తులో నివాసం ఉంటుంది. ఆమెకు కూతురు ఉండగా ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. మద్యానికి అలవాటు పడిన భర్తతో పాటు అత్త ఆమెతో తరుచూ గొడవపడే వారని.. శుక్రవారం రాత్రి కూడా గొడవపడ్డాడని తెలిసింది. భర్త ఆమెను కొట్టడంతో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పూజ రెండంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయాలైన ఆమెను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ముంబైలో ఉంటుంది. ఆమె వచ్చే వరకు శవాన్ని ఆస్పత్రిలో భద్రపరిచారు. ఈ మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెదక్లో 50 మంది ప్రాణదాతలు
మెదక్ జిల్లా వ్యాప్తంగా 50 మంది రక్తదాత లు ఉండగా 49 మంది పేర్లు వారి(బ్లడ్గ్రూప్), ఫోన్ నంబర్ల వివరాలను అధికారులు భద్రపరిచారు. ఎవరికై నా రోడ్డు ప్రమాదం జరిగి రక్తం కావాల్సి వస్తే వెంటనే వారికి ఫోన్ చేస్తే వచ్చి స్వచ్ఛందంగా రక్తాన్నిచ్చి ప్రాణదాతలుగా నిలు స్తున్నారు. జనాభాలో 50 శాతానికిపైగా ప్రజలకు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాగా జిల్లాలో తలసేమి యా వ్యాధితో బాధపడే వారిలో ఎక్కువగా ఓ పాజిటివ్ వారు ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మెదక్ రక్తనిధి సెంటర్ -
క్రీడల్లో గెలుపోటములు సహజం
అక్కన్నపేట(హుస్నాబాద్): అస్మిత క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. మండలంలోని అంతక్కపేటలో శనివారం నిర్వహించిన అస్మిత ఉమెన్స్ లీగ్ సైకిల్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరై పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు చేయూతనిచ్చేందుకే క్రీడా పోటీలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకేనని కొనియాడారు. క్రీడల్లో గెలుపు, ఓటములు అనేది సహజమన్నారు. మహిళా సైక్లింగ్ పోటీలకు 30మంది మహిళలు పాల్గొనడం గర్వకారణమన్నారు. అంతక్కపేట గ్రామ శివారులోని కట్కూర్ క్రాసింగ్ నుంచి అండర్–16, 18, 20 విభాగాల్లో 5, 10, 15కిలో మీటర్ల సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సర్పంచ్ సృజన్కుమార్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటనర్సయ్య, సైక్లింగ్ అసోసియేషన్ ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రవీందర్, ఓం ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ పథకం పనుల్లో జాప్యం
● నిధుల లేమితో సమస్యలు ● గడువులోపు పూర్తికాని పనులుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను మెరుగుపర్చడానికి చేపడుతున్న అమృత్ తాగునీటి పథకం పనుల్లో జాప్యం జరుగుతోంది. చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వేసవిలో ప్రజలు తాగు నీటి కోసం తంటాలు పడక తప్పలేదు. జహీరాబాద్ మున్సిపాలిటీ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. పట్టణం చుట్టూ ఉన్న పస్తాపూర్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతి(కె) ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో జనాభా సుమారు 1.25 లక్షలకు చేరుకొగా వార్డుల సంఖ్య 24 నుంచి 37 వార్డులకు పెరిగింది. ప్రజల నీటి అవసరాలు కూడా పెరిగాయి. పట్టణ ప్రజలకు ప్రతి రోజు 1.70 కోట్ల లీటర్ నీటి అవసరం కాగా మిషన్భగీరథ పథకం కింద సుమారు 80 లక్షలు, బోరు మోటార్ల ద్వారా మరో 20 లక్షల లీటర్లు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. కానీ పలు కారణాల వల్ల 70 లక్షల లీటర్ల నీటి సరఫరా కూడా జరగడం లేదు.రూ.66 కోట్లు మంజూరు పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో అమృత్ 2.0 పథకం కింద రూ. 66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాయికోడ్ మండలంలోని ఇటికెపల్లి వద్ద గల మంజీరా నది నుంచి అమృత్ పథకం పైపులైన్ పనులు ప్రారంభించారు. సుమారు 50 కిలో మీటరు మేర కొత్త పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం పనులు మాత్రమే పూర్తిచేయడం జరిగింది. ఇంకా పైపులైన్, ట్యాంక్ల పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనుల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి, ఇప్పటికై నా అధికారులు స్పందించి అమృతి పథకం పనులు పూర్తి చేయాలిని ప్రజలు కోరుతున్నారు. -
ఏం చేద్దాం..?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూముల రీ సర్వేలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు వట్పల్లి మండలం షాద్నగర్లో చేపట్టిన రీ సర్వే విధానాన్ని అమలు చేసే అంశంపై రెవెన్యూశాఖ ఎటూ తేల్చడం లేదు. ఈ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా దీని అమలుపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారులు ఈ గ్రామ పరిధిలో ఉన్న 593 ఎకరాల భూమిని రీ సర్వే పూర్తి చేశారు. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్ పార్సిల్ మ్యాపు (ఎల్పీఎం)లు తయారు చేశారు. ఆయా భూములకు సంబంధించి పాత సర్వే నంబర్లు, కొత్త సర్వే నంబర్లకు సంబంధించిన కోరిలేషన్ స్టేట్మెంట్లను కూడా సిద్ధం చేశారు. గూగుల్ ఇమేజ్తో కూడిన నక్షాలు.. ఇలా అన్ని రకాల రికార్డులు తయారు చేసి రెవెన్యూశాఖకు అప్పగించారు. ఈ రికార్డులను భూభారతి పోర్టల్లో నమోదు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో దాదాపు సర్కార్ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. అయితే ఈ రీ సర్వే రికార్డులను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై రెవెన్యూశాఖ లోతైన పరిశీలన చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తెచ్చిన విషయం విదితమే. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి భూముల రీ సర్వే చేసింది. సంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్తో పాటు, కోస్గి (నారాయణపేట జిల్లా), ఆమనగల్లు (రంగారెడ్డి), కూసుమంచి (ఖమ్మం), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లోని ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామంలోని భూములన్నింటినీ రీ సర్వే చేశారు.భూముల రీ సర్వే రికార్డుల అమలుపై లోతైన పరిశీలన రైతుల నుంచి అభిప్రాయం రీ సర్వే సంబంధించి గ్రామంలో పట్టాదారుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు కోరారు. కొందరు రైతులు ఈ రీ సర్వేపై అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను నివృత్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రీ సర్వేకు సంబంధించి రికార్డులు ఏప్రిల్ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంకా అమలు విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. -
మంచుకొండల్లో తెలంగాణ రుచులు
● 15వ సారి అమర్నాథ్ యాత్రికులకు అన్నదానం ● ఈ నెల 15న సరుకులతో వెళ్లనున్న లారీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): మంచు కొండల్లో తెలంగాణ రుచులను అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు అందించనున్నట్లు, అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థ చైర్మన్ మధు, అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మంచుకొండల్లో అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు 15వ సారి దక్షిణాది రుచులను అందించడానికి ఈనెల 15న సరుకుల లారీలు వెళ్తున్నట్లు తెలిపారు. భక్తులకు బాల్తాల్, పంచతరని, అమర్నాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు. సరుకుల లారీలను 15న సిద్దిపేట శరబేశ్వర ఆలయంలో శివకల్యాణం అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు, ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్కుమార్, శ్రీనివాస్, కాశీనాథం, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
కొండాపూర్లో కుండపోత
రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీ రికార్డు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వానసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 4.7 సెం.మీలు, పుల్కల్ 3.4 సెం.మీలు, మునిపల్లిలో 3.2 సెం.మీలు, రామచంద్రాపూరం బీహెచ్ఈఎల్లో 3.0 సెం.మీలు, సదాశివపేటలో 2.3 సెం.మీలు, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో 1.5 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్ష పాతం రికార్డు అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ముసురు పెట్టింది. అలాగే పటాన్చెరు, తెల్లాపూర్, అమీన్పూర్లలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడగా, మరోవైపు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వర్షం వల్ల వేసిన పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 3,82,511 ఎకరాల్లో పత్తి, 1,59,070 ఎకరాల్లో వరి, 75,557 ఎకరాల్లో కంది, 61,312 ఎకరాల్లో సోయాబీన్, 27,986 ఎకరాల్లో చెరకు, 56,144 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికంగా పత్తి విత్తనాలను విత్తారు. ముందుగా విత్తుకున్న విత్తనాలు సైతం మొలకెత్తాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవకపోడంతో మొలకెత్తిన పంట దెబ్బతింటుంది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బోరు బావులు ఉన్న రైతులు స్ప్రీంకర్ల ద్వారా పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలి
రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ నర్సాపూర్: ఓరియంటేషన్ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ సూచించారు. శనివారం స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో గురుకులాలకు చెందిన పీఈటీ, పీడీలకు రెండు రోజుల ఓరియంటేషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేర్చుకున్న అన్ని అంశాలను విద్యార్థులకు నేర్పించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని సూచించారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు నర్సాపూర్: పలు చోట్ల కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నర్సాపూర్లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో, నాల్గవ వార్డులో ఇద్దరు బాలురను కోతులు కరిచాయి. కోతుల దాడిలో పిల్లలకు చేతులకు ,కాళ్లకు, తలపై గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసి ఇంటికి పంపించారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేగుంట(తూప్రాన్): మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చేగుంటలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన అల్లెంకి ధనలక్ష్మి ప్రతి రోజూ బస్టాండ్ సమీపంలో వెంచర్లో మార్నింగ్ వాక్ చేస్తుండేది. శనివారం మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమంలో ఆమె వద్దకు వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మెడలోని బంగారు గొలుసును బలంగా లాగడంతో ధనలక్ష్మి గొలుసును గట్టిగాపట్టుకుంది. దీంతో పెనుగులాటలో సగం గొలుసు దొంగ చేతికి చిక్కి మిగతా సగం ఆమె చేతిలో మిగిలింది. మరో వ్యక్తి బైక్ నడుపుతుండగా గొలుసు దొంగిలించిన వ్యక్తి ఇద్దరు బైక్పై పారిపోయారు. ఐదు తులాల గొలుసులో సుమారు మూడు తులాల గొలుసు చోరీ అయిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై దాడులు 9 మంది పై కేసు నమోదు పటాన్చెరు టౌన్: పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ చెరువు పక్కన ఖాళీ స్థలంలో శుక్రవారం రాత్రి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ. 10,200 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యమా?
జహీరాబాద్: నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించడంతో అవి నిరుపయోగంగా మారాయని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం అన్నారు. శనివారం సాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 76వరకు సాగునీటి వనరులు ఉన్నాయని, వీటి ద్వారా 12వేలకు పైగా ఎకరాల భూములు సాగు కావాల్సి ఉందన్నారు. అయినా మూడువేల ఎకరాలకు మించి సాగు కావడం లేదన్నారు. ఈఈ కార్యాలయం ఏర్పాటు చేసి 45 మంది వరకు అధికారులు, సిబ్బందిని నియమించినా పనులు ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. వీరికి వేతనాల రూపంలో నెలకు రూ.4కోట్ల మేర ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని సంగమేశ్వర ప్రాజెక్టు కింద 1.05లక్షల ఎకరాలకు, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 2.10లక్షల ఎకరాలకు బసవేశ్వర ఎత్తిపోతల పథకాల కింద సాగు నీరందించాలని నిర్ణయించినా ఇది ముందుకు సాగడం లేదన్నారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటిని అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రైతులు శివకుమార్, ఎస్.గోపాల్, వెంకట్, వీర్శెట్టి, మేఘనాథ్ పాల్గొన్నారు.ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం -
మహిళలు స్వశక్తితో ఎదగాలి
సంగారెడ్డి: స్వశక్తితో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదిగాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అమ్మవారి గెటప్, భారతమాత గెటప్తో పాటు వివిధ సాంప్రదాయ అలంకరణలతో శిక్షణార్థినులు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించాలని, తమ హక్కుల కోసం నిలబడాలని సూచించారు. మధ్యలో వదిలేయకుండా నిరంతరం సాధన చేస్తూ స్వయం ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. డైరెక్టర్ ఎం.రాజేష్ కుమార్ సంస్థ కార్యకలాపాలు, శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్ నాయక్, సంస్థ కో–ఆర్డినేటర్లు శివశంకర్, నర్సింలు, జేఆర్పీ లక్ష్మిప్రియ, దుర్గ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
సంగారెడ్డి టౌన్: విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన తలారి రంజిత్ కుమార్(34) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని సమాచారం అందడంతో వెళ్లాడు. ఈ క్రమంలో ఫ్యూజ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 11 కేవీ విద్యుత్ లైన్కు కుడి చేయి తగలడంతో షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. కంది మండలంలో యువకుడు.. కంది(సంగారెడ్డి): విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన కందిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం... పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ (23) శనివారం మోటారు ఆన్ చేసి నీటితో వాకిలిని శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో పని పూర్తయ్యాక మోటారు నుంచి వైరును తీస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలిసి మెలిసి ఉండే ఆరిఫ్ మృతి చెందడం అందరిని కలచివేసింది. లక్ష్మీనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బుల్లెట్ రైలు నడపాలి
జహీరాబాద్: బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటుకు జహీరాబాద్ అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సరైంది కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో 12వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోందని, దీంతో భారీ పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రాజెక్టు సాధనలో భాగంగా ఈనెల 15వ తేదీన జహీరాబాద్ ఎంపీ సురేష్శెట్కార్ ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహాలను కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఢిల్లీ స్థాయిలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అనంతరం రైల్వే స్టేషన్కు ర్యాలీగా వెళ్లి స్టేషన్ మేనేజర్ మాధవకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ తన్వీర్, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, మున్సిపల్ చైర్మన్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం.. దైన్యం
హవేళిఘణాపూర్(మెదక్): ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. లారీల కొరత.. ధాన్యం తరలింపులో కాలయాపనతో వడ్లు కల్లాల్లోనే మూలుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తూకం వేసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల బస్తాల కిందకు నీరు చేరడంతో రంగుమారి మొలకలు వచ్చాయి. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు సంబంధించిన ధాన్యం మంభోజిపల్లి ఎన్డీఎస్ఎల్ గోదాంకు తరలిస్తున్నారు. అక్కడ అన్లోడింగ్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిచిపోయాయి. హమాలీల సంఖ్య పెంచి అన్లోడింగ్ త్వరగా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలి
● ఎస్పీ పరితోష్ పంకజ్ ● పోలీసు అధికారుల పిల్లలతో భేటీసంగారెడ్డి జోన్: పోలీసు అధికారుల పిల్లలు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. స్పార్క్ కార్యక్రమంలో భాగంగా శనివారం తన కార్యాలయంలో పోలీసు కుటుంబాల పిల్లలతో సమావేశమయ్యారు. ఐఐటీ అడ్వానన్స్లో ర్యాంక్ సాధించిన వినయ్ నాయక్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికావద్దని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే క్రమ పద్ధతిలో విద్యను అభ్యసించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అభిజ్ఞ, ప్రకతి వర్మ, సాయి శ్రీహిత, తదితరులు పాల్గొన్నారు. -
వేతనాల బకాయిలు చెల్లించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు చెల్లించడంతో పాటు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తున్న నేటికీ వారికి కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న మూడు నెలల బకాయి విత్తనాలను చెల్లించడంతో పాటు ఈఎస్, పీఎఫ్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదగిరి, ప్రవీణ్, శంకర్, పంచాయతీ కార్మికులు సత్తయ్య, దశరథ్, పోచయ్య, మహేశ్, యాదమ్మ, విజయేందర్, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లుగా తైబేజార్..!
● టెండర్లు లేక ఏటా రూ.7లక్షల నష్టం ● ఆదాయం అంతంత మాత్రమే.. ● ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ తీరుజోగిపేటలోని కూరగాయల మార్కెట్ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న తైబజార్ వేలంపాటలను ఆరేళ్లుగా నిర్వహించకపోవడంతో ప్రతీ ఏటా రూ. 7 లక్షల చొప్పున మున్సిపల్ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. జోగిపేట: మున్సిపాలిటీ పరిధిలో గత ఆరేళ్లుగా తైబజార్ టెండర్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. గత పాలకవర్గంలో మూడుసార్లు, కొత్త పాలకవర్గం వచ్చాక మరో మూడుసార్లు పత్రికల్లో టెండర్ల ప్రకటనలు జారీ చేసినప్పటికీ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. దీంతో మున్సిపల్ సిబ్బందితోనే రోజువారీగా రూ.2 నుంచి 3 వేల వరకు వసూళ్లు చేపడుతున్నారు. ఇటీవల తైబజారు రేట్లను రూ. 20 నుంచి రూ. 30కి పెంచినప్పటికీ ఆశించిన ఆదాయం రావడం లేదు. గతంలో తైబజారు, పశువుల సంత, మేకల సంతల ద్వారా ఏడాదికి రూ. 12 నుంచి రూ. 15 లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం అది కేవలం రూ. 7 నుంచి రూ. 8 లక్షలకే పరిమితమైంది. కొత్త రోడ్డుతో తగ్గిన వ్యాపారం పట్టణంలో వ్యాపారాలు క్షీణించడానికి ప్రధాన కారణం సంగుపేట మీదుగా ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు. ఈ కొత్త రోడ్డు కారణంగా ఇతర ప్రాంతాల వ్యాపారులు.. కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి జోగిపేటకు రావడం లేదు. అయితే ఆశించిన స్థాయిలో డబ్బులు రావనే ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లు టెండర్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం మున్సిపాలిటీకి ఆదాయం అంతంత మాత్రమే ఉంది. 35 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకే నెలకు రూ. 5.60 లక్షలు అవసరమవుతున్నాయి. మంత్రి దామోదర సొంత నియోజకవర్గం కావడంతో ఇతర ఖర్చులు కూడా తోడవుతున్నాయని, టెండర్లకు ఎవరూ రాకపోవడంతో సిబ్బందితోనే నెట్టుకొస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. సొంత స్థలం కరువు మరోవైపు, పశువుల సంత, మేకల సంతలను నిర్వహించడానికి మున్సిపాలిటీకి సొంత స్థలం లేదు. దీంతో వీటిని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా, ఆ సంతల ద్వారా వచ్చే లక్షల రూపాయల ఆదాయం మార్కెట్ శాఖ ఖాతాలోకి వెళ్తోంది. ఈ స్థలాన్ని మార్చాలని మున్సిపల్ అధికారులు ఆలోచిస్తున్నారు.గత ఆరేళ్లుగా ఆరుసార్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా తైబజారు వేలంపాటల టెండర్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అందుకే మున్సిపల్ సిబ్బందితోనే వసూళ్లు చేయిస్తున్నాం. పశువుల సంత నిర్వహణకు సొంత స్థలం లేకపోవడంతో మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్నాం. దీంతో ఆ ఆదాయం మార్కెట్ శాఖకే వెళ్తోంది. – తిరుపతి, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ -
దమ్ముంటే ఇంటి దొంగను బయటపెట్టండి
● మీనాక్షికి ద్రోహం చేసింది కాంగ్రెస్ వారే.. ● ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మీనాక్షి నటరాజన్కు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ వారేనని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ ఆరోపించారు. ఆమె నామినేషన్ను తిరస్కరించేలా సమాచారం ఇచ్చింది ఆ పార్టీ నాయకులేనన్న ఆరోపణలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ ఇంటి దొంగ పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు అవినీతి అక్రమాలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడుతుంటే వాటికి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తన పదవి కోసమే జగ్గారెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షికి ద్రోహం చేసింది సీఎం వర్గమే అని తెలిసినా జగ్గారెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. సంగారెడ్డి ప్రజల చేతిలో ఓటమి పాలైన జగ్గారెడ్డికి, ప్రజల గుండెల్లో ఉండే హరీశ్రావును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోడ్కల్ తీస్తామన్న జగ్గారెడ్డి.. సీఎం అనుచరుడైన కోవర్టు పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి టీడీపీ కోవర్టు అని, పార్టీని నాశనం చేసేందుకు వచ్చాడని, బ్లాక్ మెయిలర్ అంటూ తిట్టిన జగ్గారెడ్డి.. ఇప్పుడు పదవిని కాపాడుకునేందుకు రేవంత్రెడ్డికి వంత పాడుతున్నారని విమర్శించారు. -
వర్గల్ పూలే డిగ్రీ కళాశాలలో 15న స్పాట్ అడ్మిషన్లు
వర్గల్(గజ్వేల్): వర్గల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం వివిధ కోర్సులలో ప్రవేశానికి ఈనెల 15న స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. ఎంజేపీలో దరఖాస్తు చేసుకున్నా, చేసుకోలేకపోయినా స్పాట్ అడ్మిషన్ కోసం విద్యార్థినులు సోమవారం ఉదయం 11గంటలలోపు కళాశాలలో తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 12 గంటల నుంచి మెరిట్ ప్రాతిపదికన వీరికి సీటు కేటాయిస్తామన్నారు. అభ్యర్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ ఫామ్–2026, ఒరిజినల్ టెన్త్, ఇంటర్ మెమోలు, ఇంటర్ టీసీ, కులం, ఆదాయం(లేటెస్ట్) సర్టిఫికెట్ తీసుకొనిరావాలన్నారు. వివరాల కోసం 97035 29664 నంబర్లో సంప్రదించాలన్నారు. మహిళ అదృశ్యం సంగారెడ్డి క్రైమ్: కుమార్తె వద్దకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వీరదాస్ నయోమి (45) నాలుగేళ్లుగా సంగారెడ్డిలోని గొల్లగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే పట్టణంలోని అహ్మద్ నగర్లోని తన కుమార్తె వద్దకు వెళ్తానని ఈ నెల 9వ తేదిన ఇంటి నుంచి బయలుదేరి తిరిగిరాలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేగుంటకులో ఆటో డ్రైవర్ చేగుంట(తూప్రాన్): ఓ ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ద్దిపేట జిల్లా సూరంపల్లికి చెందిన పాములపర్తి స్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం తన ఆటోను తీసుకొని చేగుంటకు వచ్చి బంధువుల ఇంటి వద్ద పార్కింగ్ చేసి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్చాఫ్ ఉంది. బంధువుల వద్ద వెతికినా చేస్తున్నట్లు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. క్యాన్సర్తో వ్యక్తి ఆత్మహత్య నర్సాపూర్ రూరల్: క్యాన్సర్ కారణంగా గొంతు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్కి చెందిన పుల్కంటి పెద్దిరాజు (41) కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇటీవల గొంతు నొప్పి ఎక్కువగా రావడంతో బసవతారకంతో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినప్పటికీ గొంతు నొప్పి తగ్గకపోవడంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి జిన్నారం(పటాన్చెరు): ఓ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ యువకుడు మృతిచెందిన ఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం కాసాలకు చెందిన ప్రవీణ్ కుమార్ (26) బొంతపల్లి పారిశ్రామికవాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఈనెల 3న విధులు నిర్వరిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం కార్మికుడిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరుసటి రోజు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు పరిశ్రమ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.80 లక్షలతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించేలా ఒప్పందం కుదిరింది. కాగా గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వైద్యులు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి తండ్రి నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపండి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపాలని కోరుతూ మహిళలు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్టాఫీసు నుంచి ఉత్తరాలను పీఎం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్రవంతి మాట్లాడుతూ జహీరాబాద్ అభివృద్ధి చెందుతుందని, నిమ్జ్కు వేల ఎకరాల భూములు ఇక్కడి రైతులు ఇచ్చారన్నారు. మొదటి బుల్లెట్ రైలు జహీరాబాద్ మీదుగా నడపాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఏమీ జరిగిందో తెలియదు కానీ తరువాత డీపీఆర్ మార్చి వికారాబాద్కు మళ్లించారని వాపోయారు. వాపోయారు. జహీరాబాద్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ను రద్దు చేసిన జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలును నడపాలని ఆమె కోరారు.ప్రధానికి మహిళల లేఖ -
ప్రీమియం చెల్లించినా.. అందని వైద్యం
ఉద్యోగులకు హెల్త్కార్డులు ఇచ్చేదెన్నడో?జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు జూన్ మాసంలో హెల్త్ కార్డుల పంపిణీ కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగుల వేతనాల్లో 1.5 శాతం కోత విధించినా ఉచిత వైద్యం అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటు చేస్తామని, ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తామని, పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా నిలబెట్టుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1న ప్రభుత్వం హామీ ఇవ్వగా, 4వ తేదీకి గడువు ముగిసింది. 11వ తేదీ వచ్చింది. కానీ ఇంతవరకు ట్రస్టును ఏర్పాటు చేయలేదు. అలాగే ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో హెల్త్కార్డు ఇచ్చేదెప్పుడో? ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేదెప్పుడో? అని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం మే నుంచే ప్రీమియం పేరుతో కోత విధించింది. ఈ నెల ప్రీమియం చెల్లించినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మే నెల వేతనంలోనే కోత జూన్ 2 దాటినా కానరాని కార్డులు ట్రస్టు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వంఎదురు చూపులు -
కట్టుబాట్ల కొరడా!
● చేపలు పడితే జరిమానా ● కుల సంఘం పెద్దల హుకుంచిన్నకోడూరు(సిద్దిపేట): చేపలు పట్టే హక్కుపై కట్టుబాట్లు కట్టడి చేస్తున్నాయి. ఇటీవల రంగనాయక సాగర్ రిజర్వాయర్లో చేపలు పట్టడానికి ఒక కుల సంఘం పెద్దలు నిషేధం విధించారు. నిబంధనలు తెలియని నలుగురు యువకులు శుక్రవారం సాగర్లో చేపలు పట్టడానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన కుల సంఘం పెద్దలు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 40 వేలు జరిమానా విధించారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో చేపల వేట విషయంలో మత్స్యకారులు, ముదిరాజ్ల మధ్య వివాదం జరుగుతోంది. చేపలు పట్టే హక్కు తమదేనని మత్స్యకారులు, ముదిరాజ్లు వాదిస్తున్నారు. సంబంధిత అధికారులు ఎటూ తేల్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో కుల సంఘాల పెద్దలు రంగనాయక సాగర్లో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే జరిమానాలు విధిస్తామంటూ తీర్మానాలు చేశారు. రూ.లక్ష జరిమానా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండల పరిధిలోని చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతున్నారు. అలాగే ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందులో ఉచితంగా చేప పిల్లలను వదులుతోంది. చేపలు పట్టే హక్కు కోసం చిన్నకోడూరు, పెద్దకోడూరు, చంద్లాపూర్, రామంచ, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులు, ముదిరాజ్లు లైసెన్స్ కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు హక్కులు ఎవ్వరికీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కుల సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సాగర్లో ఎవ్వరు చేపలు పట్టినా వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామని హుకుం జూరీ చేశారు. విషయం తెలియక చంద్లాపూర్కు చెందిన నలుగురు యువకులు సాగర్లో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక కుల సంఘం పెద్దలు వారిని అడ్డుకుని ఒక్కో యువకునికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు సమాచారం.రంగనాయక సాగర్ -
హక్కులు హరిస్తున్న కేంద్రం
కొమురవెల్లి(సిద్దిపేట): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్ మాట్లాడుతూ వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు బగ్గుమంటున్నాయని అన్నారు. దీంతో పేదల బతుకులు భారంగా మారాయన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, ఎన్డీఏ ప్రభుత్వం జీ రామ్ జీ చట్టాన్ని తెచ్చి పేదల పొట్ట కొడుతోందన్నారు. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను హరించేందుకే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, కాముని గోపాలస్వామి, అరుణ్ కుమార్, తాటోజు రవీంద్ర చారి, పొట్టేళ్ల స్వామి, ఉల్లంపల్లి సాయిలు, తాడూరి కవిత, బోయని మల్లేశం, బాలకృష్ణ, రవీందర్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. పెట్రో ధరల పెంపుతో పేదలకు భారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ -
చెప్పా పెట్టకుండా వెళ్లి..
తరచూ ఇంట్లో గొడవలు జరిగే సమయాల్లో పిల్లలను తీసుకొని వెళ్లి రాత్రి 11లోపు ఇంటికి చేరుకునే వాడు. గురువారం ఉదయం 9.40గంటల ప్రాంతంలో పిల్లలను తీసుకొని వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి చేరుకోలేదు. భార్య ఫోన్ చేస్తే స్పందించలేదు. నిజాంపేటకు వచ్చిన కృష్ణ.. బైక్ తీసుకొని నిజాంసాగర్కు చేరుకున్నాడు. పిల్లలకు ఆహారం కొనిచ్చి తినిపించాడు. కొద్దిసేపు నీటిలో ఆడించాడు. చేపలు పట్టేందుకు వాడే తెప్పపై పిల్లలను కూర్చోబెట్టుకొని నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి ఆడించి వారిని నీటిలో తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
పశువుల కంటైనర్ పట్టివేత
ములుగు(గజ్వేల్): హైదరాబాద్కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక కంటైనర్ వాహనాన్ని ములుగు రాజీవ్రహదారిపై శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రఘుపతి కథనం ప్రకారం.. ములుగు క్రాస్రోడ్డు వద్ద రాజీవ్రహదారిపై ఎస్ఐ సిబ్బందితో కలసి ట్రాఫిక్ నియంత్రిస్తున్న క్రమంలో హైదరాబాద్ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కంటైనర్ను ఆపి తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సర్వర్, ఇప్తేకార్, వాజీద్ అనే వ్యక్తులు సంగారెడ్డికి చెందిన రఫీక్కు సంబంధించిన వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా 80 పశువులను తరలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
హుస్నాబాద్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని తిరుమల గార్డెన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన(అరైవ్, అలైవ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్లు పాల్గొన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో పోలీసులు వీడియో రూపంలో చూపించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ వాహనాలు వేగంగా నడపడం, మొబైల్ మాట్లాడటం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదం అయిన మొదటి గంటల్లోనే ఆస్పత్రికి చేర్పించిన వారికి రూ.25వేలు ఇవ్వడమేకాకుండా.. రహవీర్ అవార్డు ఇచ్చి సన్మానించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఒక కుటుంబంలో కీలక సభ్యుడు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, ప్రాణాలు కాపాడే రక్షణ కవచం అని అన్నారు. హెల్మెల్, సీట్ బెల్ట్ వినియోగాన్ని రోజు వారి అలవాటుగా మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
కెరీర్ గైడెన్స్పై అవగాహన
జహీరాబాద్ టౌన్: విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన అవసరమని టాస్క్ ట్రైనర్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. టాస్క్ ద్వారా ఇచ్చే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటే మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయన్నారు. అనంతరం కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్, వే ఆఫ్ అండర్స్టాండింగ్, లిజినింగ్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరికుమార్, డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ నర్సింలు అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యాహక్కు చట్టంపై అవగాహన అవసరం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: విద్యాహక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దన్నారు. బాలల సంక్షేమం, భద్రత హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: పెండింగ్లో ఉన్న కేసులను తక్షణం పరిష్కరించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వారికి భరోసా కల్పించాలన్నారు. ప్రతి గ్రామానికి పోలీసు అధికారులు నియమించి, గ్రామాలలో ముందస్తుగా సమాచారం సేకరించాలని కోరారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 16న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి రవికిరణ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ, అపోలో ఫార్మసీలో వివిధ శాఖల్లో కేటగిరీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పూర్తి బయోడేటాతో సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 08455271010 నంబర్ను సంప్రదించాలన్నారు. సంగారెడ్డి జోన్: జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు రెండు రోజులపాటు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారు. జాతీయ ఆయిల్ పామ్ మిషన్లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే ఈ యాత్రకు జిల్లా నుంచి ఆసక్తి ఉన్న 22 మంది రైతులను ఎంపిక చేసి పంపించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ సంగీత జెండా ఊపి ప్రారంభించారు. శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేసేందుకు కొనిజర్ల మండలంలో రెండు రోజులపాటు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట(సంగారెడ్డి): ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఏడీఏ వెంకటలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ఎరువు దోపిడీ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలతోపాటు గోదాంలను సహాయ వ్యవసాయ సంచాలకురాలు వెంకటలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. దుకాణాల్లో స్టాక్బోర్డులో ఎరువులు, విత్తనాల నిల్వలను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రమేష్, మంజీర రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు. -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఏడీఏ సత్యనారాయణ వట్పల్లి(అందోల్): ఎవరైనా ఎరువుల కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయికోడ్ ఏడీఏ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం వట్పల్లిలోని పలు ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు, ధరల పట్టికను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలు ఉండే లైసెన్సులను రద్దుచేసి దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
ధర లేక మామిఢీలా!
విక్రయాలు లేక మార్కెట్లో మురుగుతున్న పండ్లుజహీరాబాద్: ఫలాల్లో రారాజుగా చెప్పుకునే మామిడికి డిమాండ్ తగ్గింది. ఒక వైపు ప్రకృతి సహకరించక పోవడం, పండ్లలో నాణ్యత కొరవడంతో ఇతర దేశాల్లో డిమాండ్ లేక పోవడం, మరో వైపు ఇరాన్ యుద్ధ ప్రభావం మామిడి పండ్లపై పడింది. జహీరాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 20వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జహీరాబాద్ పండ్ల మార్కెట్కు నిత్యం 20 నుంచి 25 టన్నుల మేర తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు పండ్లను అమ్మకానికి తెస్తున్నారు. పెద్ద వ్యాపారులు మాత్రం హైదరాబాద్కు తరలిస్తున్నారు. పలు కారణాల చేత ప్రజలు మామిడి పండ్లను తినేందుకు అంతగా ఆసక్తి చూపక పోవడంతో చిల్లవ వ్యాపారాలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. దీంతో మార్కెట్కు విక్రయం నిమిత్తం తీసుకువస్తున్న పండ్లు పూర్తి స్థాయిలో విక్రయాలు జరగక మిగిలి పోవడంతో అక్కడే మురిగి పోతున్నాయి. దీంతో వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదు. ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఇరాన్ యుద్ధం ప్రభావం మామిడి ఉత్పత్తులపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అలాగే.. నాణ్యవంతమైన పండ్లు రాక పోవడం, రసాయనిక మందులను మామిడి పంటలపై పిచికారి చేయడం, పండ్లలో పురుగులు కావడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మామిడి ఉత్పత్తులు జపాన్, లండన్, అమెరికా, సౌదీ, దుబాయ్ తదితర దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం కూడా ధరలు పడిపోవడానికి కారణంగా పేర్కొంటున్నారు. మల్చల్మ, శేఖాపూర్, డప్పూర్ తదితర గ్రామాల్లోని రైతుల వద్ద మామిడి తోటలను కొనుగోలు చేసుకుని నగదు డబ్బులు చెల్లించా. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పండ్లకు ఆశించిన మేర డిమాండ్ లేదు. పండ్లు కొనే వారు కరువయ్యారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కూడా నేల రాలింది. ఇలా పలు కారణాలతో రూ.5లక్షల మేర నష్టపోయాను. వ్యాపారం చేయాలంటేనే భయమేస్తోంది. –సయ్యద్అలీ, వ్యాపారి, శేఖాపూర్ మార్కెట్లో పరిమితంగా అమ్మకాలు జరుగుతున్నాయి. పరిసర మండలాల నుంచి వ్యాపారులు ప్రతి నిత్యం 20 టన్నుల వరకు మామిడి పండ్లు అమ్మకానికి తెస్తున్నారు. పండ్లను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపక పోవడం వల్ల పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో మిగిలి పోతున్నాయి. ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరగడం లేదు. ఫలితంగా ధరలు పడిపోయి వ్యాపారులు నష్టపోతున్నారు. – యూసుఫ్ షరీఫ్, ఫ్రూట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జహీరాబాద్ ఎగుమతులు లేక కష్టాల్లో వ్యాపారులు సహకరించని వాతావరణం యుద్ధ ప్రభావం కూడా ఒక కారణం తీవ్ర నష్టాల్లో వ్యాపారులు -
రాజీయే రాజ మార్గం
సంగారెడ్డిటౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. గురువారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావా లని సూచించారు. ఈనెల 20న నిర్వహించే జా తీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 9,073 మంది విద్యార్థులు హాజరుకాగా, 5,661 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 4,518 మందికి గానూ 2,506 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,555 మందికి గానూ 3,155 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 587 మంది బాలురకు గానూ 391 మంది, బాలికలు 234 మందికి గానూ 172 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో 4,648 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,217 మంది పాసయ్యారు. బాలుర విభాగంలో 2,618 మందికి గానూ 1,206 మంది, బాలికలు 2,030 మందికి గానూ 1,011 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 319 మంది బాలురకు గానూ 228 మంది ఉత్తీర్ణత సాధించగా, 171 మంది బాలికలకు గానూ 120 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. గురువారం పట్టణంలోని శిశు గృహ, సఖి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సఖి కేంద్రాన్ని సందర్శించే బాధితుల సమస్యలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాలల హక్కుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): సర్వ శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించిందన్నారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు సైతం అందించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
చికిత్స పొందుతూ పంచాయతీ కార్మికుడు మృతి
వెల్దుర్తి(తూప్రాన్): వీధి దీపాలు మరమ్మతులు చేస్తుండగా స్తంభంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదకర ఘటన మండలంలోని హస్తాల్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన గడ్డె నాగరాజు(45) గ్రామ పంచాయతీ కార్యాలయంలో వర్కర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 2న గ్రామంలో వీధి లైట్లు మరమ్మతులు చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో సీసీ రోడ్డుపై పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతికి గ్రామ పంచాయతీ అధికారులు, పాలకవర్గం బాధ్యత వహించి నష్టపరిహారం ఇవ్వాలంటూ మృతుడి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నడి రోడ్డుపై కారు బీభత్సం
● బైక్కు, బాటసారికి ఢీకొనడంతో ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● వెంకట్రావ్పేటగేట్ వద్ద సంఘటన కౌడిపల్లి(నర్సాపూర్): అతివేగంగా వచ్చిన కారు నడిరోడ్డుపై భీభత్సం సృష్టించింది. రోడ్దు దాటుతున్న బైక్ను ఢీకొడంతోపాటు నడుచుకుంటూ వస్తున్న ఓ బాటసారిని ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావ్పేటగేట్ వద్ద 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ అమరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం అహ్మద్నగర్కు చెందిన చింతకుంట మల్లేశం(46) తన బైక్పై ముట్రాజ్పల్లి వైపు నుంచి వెంకట్రావ్పేటవైపు వస్తు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో మెదక్ జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారిని నర్సాపూర్ వైపు నుంచి కారులలో మెదక్ వస్తుండగా డ్రైవర్ కుశంత్ నడుపుతున్నాడు. కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. దీంతో బైక్తోపాటు బైక్పైఉన్న మల్లేశం ఎగిరి ఎదురుగా వస్తున్న బాటసారి వెంకట్రావ్పేటకు చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ డప్పు కుమార్పై పడి అతన్నిసైతం కారుఢీకొంది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. డప్పు కుమార్కు కాలు విరగగా తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహంతో ధర్నా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని తిరిగి నర్సాపూర్ నుంచి వెంకట్రావ్పేటగేట్ వద్దకు తీసుకువచ్చారు. రోడ్డుపై ధర్నా, రాస్తారోకోకు ప్రయత్నం చేయగా.. ఎస్ఐ బాధితులకు నచ్చచెప్పారు. గొడవ జరగకుండా ముందస్తుగా అదనపు పోలీసులను రప్పించాడు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మృతదేహాన్ని నర్సాపూర్ పంపించారు. కూలీల హాజరు వేసి.. మరో వనివద్దకు వెళుతుండగా .. వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన డప్పు కుమార్ ఉపాధిహామి ఫీల్డ్అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం పనిచేసే కూలీల అటెండెన్స్ వేసి మరోచోట పనులు జరుగుతుండటంతో అక్కడికి వెల్లేందుకు రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో కారు బైక్ను ఢీకొట్టి అతన్ని ఢీకొంది. తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని సర్పంచ్ ఖుత్బుద్దీన్ గ్రామస్తులు చికిత్స నిమిత్తం నర్సాపూర్కు అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘సర్’పై అసత్య ప్రచారం సిగ్గుచేటు
● నకిలీ ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కొండపాక(గజ్వేల్): నకిలీ ఓటర్లను తొలగించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై అధికార, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడమేకాక, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుండటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మాత్పల్లి శివారులో గల ఓ రిసార్టులో జరుగుతున్న పండిట్ దీన్దయాళ్ శిక్షణ తరగతులకు గురువారం ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా చనిపోయిన వారి పేర్లు, నకిలీ ఓటర్లు, ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ చేపడుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా చూస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఎస్ఐఆర్ ఉద్దేశ్యాన్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యవహరించడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 1952 నుంచి 2026 వరకు సుమారు పదిమార్లు ఓటరు జాబితా సవరణలు జరిగాయన్న విషయాన్ని మర్చిపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ పట్టణంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు ఓటర్లుగా నమోదు అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే భారత పౌరుల ఓటు హక్కుకు భంగం రాకుండా చూసేలా ఎస్ఐఆర్ ఓటరు జాబితా సవరణ చేపట్టిందన్నారు. పచ్చిమ బెంగాల్, కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం ఇదే రకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తారన్న విషయాన్ని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు. జమిలీ ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్నీ అప్పులే.. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, రైతులకు భరోసా లేకుండా అప్పుల భారాన్ని మిగిల్చిందని ఆరోపించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హుడైన ప్రతీ ఓటరుకు ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేష్గౌడ్,నాయకులు విభీషణ్రెడ్డి, విద్యాసాగర్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, ఐలయ్య, మనోహర్, వెంకట్రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఏకరూపం.. బహుదూరం!
నారాయణఖేడ్: పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటివరకు జిల్లాకు యూనిఫాం వస్త్రం సరఫరా కాలేదు. దీంతో ఏకరూప దుస్తుల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. కాగా, ఈనెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా, విద్యార్థులు పాత యూనిఫాంతోనే బడికి హాజరు కానున్నారు. జిల్లాలో 864 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత, 10 ఆదర్శ పాఠశాలల ఉన్నాయి. గతేడాది వేసవి సెలవులకు ముందే పాఠశాలల్లో విద్యార్థుల కొలతలను విద్యాశాఖ అధికారులు తీసుకున్నారు. ఏప్రిల్లోనే మహిళా సంఘాల సభ్యులకు వస్త్రం సరఫరా చేసి వేసవి సెలవుల్లోనే కుట్టే పనులు ప్రారంభించారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత ఏకరూప దుస్తులను అందించారు. కానీ ఏడాది ఇంకా మహిళా సంఘాల సభ్యులకు వస్త్రాల సరఫరానే కాలేదు. మరో పక్షం రోజుల తర్వాత వస్త్రం జిల్లాకు రానుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిని మహిళా సంఘం సభ్యులకు సరఫరా చేసి విద్యార్థుల కొలతలు తీసుకొని కుట్టి ఇచ్చే సరికి కనీసం రెండు నెలలపైగా పడుతుంది. మొదటి జత పరిస్థితే ఇలా ఉంటే ఇక రెండో జత యూనిఫాం ఎప్పటికి ఇస్తారో అధికారులకే తెలియని పరిస్థితి. ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అధ్యాపకులు పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. జిల్లాకు సరఫరా అయిన పుస్తకాలు మండల స్థాయికి పంపించి, అక్కడి నుంచి ఇప్పటికే పాఠశాలలకు చేరవేశారు. జిల్లాకు 7,14 లక్షల పుస్తకాలు అవసరం కాగా, 6.95 లక్షలు సరఫరా అయ్యాయి. ఇందులో 97 శాతంగా 5.50 లక్షల పుస్తకాలను పాఠశాలలకు పంపించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు సరఫరా కావడం వల్ల బోధనా పరంగా విద్యార్థులకు ఇబ్బందులు తీరనున్నాయి. వచ్చేదెప్పుడు.. కుట్టేదెప్పుడు.. ఇచ్చేదెప్పుడు..! వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు పాత యూనిఫాంతోనే బడికి ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత యూనిఫామ్ నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. రంగు వెలిసిపోవడం, క్లాత్ నాసిరకంగా ఉండటంతో పాటు మహిళా సంఘాలు కుట్టే దుస్తులు విద్యార్థులకు సరిగా సరిపోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యార్థికి సరిగా ఫిట్ అయ్యే దుస్తులు ఇవ్వాలని కోరుతున్నారు. అవి ప్రభుత్వం నుంచి వచ్చిన దుస్తులనీ, తామేమీ చేయలేమని టీచర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల సైజుకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. -
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026
ఎరువు దోపిడీఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలుప్రధానంగా పత్తి సాగు చేసే రైతులు విత్తనాలతో పాటు పంటకు బలాన్ని ఇచ్చే 20:20 ఎరువును కూడా వేస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20: 20 ఎరువుల బస్తాను డీలర్లు కొందరు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఎరువును 1,500 బస్తా చొప్పున అమ్మాలి. కానీ ఒక్కో బస్తాపై రూ.1700 వరకు విక్రయిస్తున్నారు. ఎవరైనా రైతులు ఇదేమని ప్రశ్నిస్తే అసలు స్టాక్ లేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక డీలర్లు చెప్పిన ధరకే ఎరువును కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ధరలు పెరుగుతున్నాయంటూ.. కొందరు వ్యాపారులు వారం రోజుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయంటూ కూడా రైతులను మభ్య పెడుతున్నారు. అయితే కొన్ని ఎరువుల ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం పాత స్టాక్ను బస్తాపై ఉన్న ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలి. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీలు లేదు. అయితే చాలా మంది డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంది. ఈ స్టాక్ మొత్తాన్ని పాత ధరలకే విక్రయించాలి. కానీ ఈ పాత స్టాక్ను కొందరు డీలర్లు పెరిగిన కొత్త స్టాక్ ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే అన్నదాతలను దోపిడీ చేయడం షురూవైంది. కొందరు వ్యాపారులు, డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) కంటే ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీ కంటే సుమారు రూ. 200 వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఒక్కో బస్తాపై రూ.200 వరకు అదనంగా వసూలు పాత స్టాక్ను పెరిగిన ధరలతో విక్రయాలు ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే షురూ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న డీలర్లు రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఎవరైన రైతులు ఎరువులకు సంబంధించిన బిల్లులు అడిగితే అసలు స్టాకే లేదంటూ బుకాయిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక బిల్లులు లేకుండా డీలర్లు చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. -
గొర్రెను కాపాడబోయి..
కాపరి మృత్యువాత ● కొట్టాలలో విషాదంకౌడిపల్లి(నర్సాపూర్): చెరువులోకి దిగిన గొర్రెను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఓ కాపరి యత్నించి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొట్టాలలో గురువారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పద్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త రెండేళ్ల క్రితం కరెంట్షాతో మృతి చెందగా.. తల్లి పిల్లలను పోషిస్తుంది. పెద్దకొడుకు బన్నీ(16) గ్రామంలోని తెలిసిన వారి మేకలు మేపేందుకు చౌదరి చెరువు వైపు వెళ్లాడు. అక్కడే లింగంపల్లికి చెందిన పలువురు వ్యక్తులు గొర్రెలు మేపుతున్నారు. అందరూ కలిసి అక్కడే మేపుతున్నారు. కాగా అక్కడ ఒక గొర్రె చెరువులోకి దిగగా.. లింగంపల్లి గొర్రెల కాపరులు బన్నీతో గొర్రెను ఒడ్డుకు కొట్టుకు రమ్మని చెప్పడంతో చెరువులోకి దిగాడు. చెరువులో జేసీబీ గుంతలు ఉండటంతో బన్నీకి ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
గౌరవెల్లిని సందర్శించిన సీఈ
ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్టతో పాటు పంప్హౌస్ను గురువారం ప్రాజెక్టు నూతన చీఫ్ ఇంజనీర్(సీఈ) సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా రేగొండ వద్ద నిర్మించిన పంప్హౌస్ను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన ప్రొజెక్టర్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయో..ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగితెలుసుకున్నారు. చివరి దశలో పనులు ఎందుకు నిలిచిపోయాయి? భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా ఇవ్వాల్సి ఉందా? తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రాజెక్టు కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమోరాలు ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ సుమతి దేవి, ఈఈ రాములునాయక్, డీఈఈ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నా.. పాలన ఏదీ?
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో పరిపాలన గందరగోళంగా మారుతోంది. ఆలయ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాల్సిన కార్యనిర్వహణాధికారులు (ఈఓ) తరచూ మారుతుండటం, పైగా ఇన్చార్జులుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు ఆలయ పరిపాలనపై దేవాదాయ శాఖ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –సాక్షి, సిద్దిపేట కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి లేకపోవడంతో పర్యవేక్షణ కరువవుతోంది. 1967 నుంచి ఇప్పటి వరకు 70 ఈఓలు కొనసాగగా అందులో 25 మంది ఇన్చార్జులుగా వ్యవహరించారు. ఇన్చార్జి కావడంతో వారంలో కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. దీంతో దేవాలయంలో జరిగే అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే దేవాలయ బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. దర్శనం పాస్లు సైతం విక్రయిస్తుండటం గమనార్హం. పదవీ విరమణలు ఇక్కడే.. కొమురవెల్లిలో ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తించిన బాలాజీ డిసెంబర్ 31, 2024న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ ఇన్చార్జి ఈఓగా పని చేస్తూ ఆగస్టు 31, 2025న పదవీ విరమణ పొందారు. వెంకటేశ్ సైతం ఫిబ్రవరి 28, 2026న పదవీ విరమణ ఇక్కడే చేశారు. ఇలా పదవీ విరమణ పొందే వారిని ఈఓలుగా, ఇన్చార్జి ఈఓలుగా నియమిస్తున్నారు. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారగా ఐదో ఈఓ సైతం ఇన్చార్జినే నియమించారు. ప్రస్తుతం పని చేస్తున్న సుధాకర్రెడ్డి రెగ్యులర్ ఈఓ కీసర గుట్టలో పని చేస్తూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఈఓగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్చార్జిలు రెండు నుంచి నాలుగు నెలల పాటు చేయడంతో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దృష్టిసారించని ఇన్చార్జులు అభివృద్ధి పనులపై కొరవడిన పర్యవేక్షణ కనీస సౌకర్యాలు సైతం కరువు వేలాది మంది భక్తులకు తప్పని తిప్పలుపూర్తి స్థాయి ఈఓలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం బండ్ల గుట్టపై 50 గదుల నిర్మాణం చేపట్టారు. అది ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ అధికారులు సైతం ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పూర్తి స్థాయిలో అధికారి ఉండి పర్యవేక్షిస్తే ఎప్పుడో పూర్తి అయ్యేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. గదుల కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవాలయానికి సమీపంలో దాసరి గుట్టపైన కాటేజీల నిర్మాణం కోసం రూ.6కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు సైతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్యూ కాంప్లెక్స్ పనులు సైతం పూర్తి కాలేదు. అదే విధంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై సరైన మానిటరింగ్ లేకపోవడంతో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నత అధికారులు స్పందించి పూర్తి స్థాయి ఈఓను నియమించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
అల్లుకున్న నిర్లక్ష్యం
జిల్లాలోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల వద్ద బోర్లకు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. వర్షాలు ప్రారంభం కావటంతో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంది. విద్యుత్షాక్తో మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
క్యాన్సర్ కోరల్లో బాలుడు
పాపన్నపేట(మెదక్): ఆడి పాడాల్సిన బాల్యం.. ఆసుపత్రుల్లో గడుస్తోంది. ఏడేళ్లు నిండని చిన్నారిని క్యాన్సర్ వ్యాధి సోకింది. తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబానికి ఖరీదైన వైద్యం భారంగా మారుతోంది. పొత్తిళ్లలోనే ఇద్దరు కొడుకులు పోగా.. మిగిలిన ఒక్క కొడుకును చూసుకొని బతుకు ఈడుద్దామంటే.. భయంకరమైన వ్యాధి తల్లి దండ్రుల ఆశలను ఆవిరి చేసింది. మనవడి దీనావస్థను భరించే శక్తి లేక.. మనోవ్యాధితో మంచం పట్టి తాత గంగారాం కన్ను మూశాడు. చిన్న పాటి జ్వరం వచ్చినా.. పట్నం వెళ్లాలి. ప్రతి నెలా మందుల కోసం పరుగులు తీయాలి. పూట గడువని స్థితిలో ఖరీదైన వైద్యం కోసం ఇవాన్ష్ జీవన పోరాటం చేస్తున్నాడు. పాపన్నపేటకు చెందిన సాయిబాబ, శోభ దంపతులకు ఎకరా పొలమే జీవనాధారం. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్న దంపతుల సంసారంపై విధి పంజా విసిరింది. ఇంటిళ/్లపాదిని అనునిత్యం అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 2015లో వారి పెళ్లి కాగా, 2016లో మొదటి బాబు జన్మించిన ఐదు రోజుల్లోనే చనిపోవడంతో వారి ఆనందం ఆవిరైంది. 2019లో ఇవాన్ష్ జన్మించాడు. 2024లో మరో బాబు పుట్టిన వారం రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. అనంతరం 2025లో యశస్విని జన్మించింది. ప్రసూతి సమయంలో శోభ తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, రూ.6 లక్షల అప్పులు చేసి, భార్యను కాపాడుకున్నాడు సాయిబాబ. కాగా పాఠశాలకు వెళ్తున్న తరుణంలో ‘గోటి చుట్టుపై రోకటి పోటులా’2024లో ఇవాన్ష్ బ్లడ్ క్యాన్సన్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నాడు. మందులు ఉచితంగానే ఇస్తున్నా, నెలకోసారి వీరు వెళ్లినప్పుడు అక్కడ మందులు లేక పోతే రూ.10 వేలు పెట్టి, బయట ప్రైవేట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. అలాగే నెలకోసారి తప్పకుండా పరీక్షల కోసం పట్నం వెళ్లాలి. ఇక చిన్న జ్వరం వచ్చినా, జలుబు అయినా, స్థానిక వైద్యాన్ని ఆశ్రయించకుండా, విధిగా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని సాయిబాబ కన్నీరు పెట్టాడు. అందరి పిల్లల్లా ఆడుకోవాల్సిన తన బిడ్డ జీవితం ఇలా, గాజు బొమ్మలా మారిందని వాపోయారు. మనసున్న మా రాజులు ఎవరైనా ఉంటే 8096106545 నంబర్కు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. -
శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ
సంగారెడ్డి జోన్: సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణను శాసీ్త్రయ పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం, కాల్చివేయడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. భారీ స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఫంక్షన్హాళ్లను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా గుర్తించాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పనపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన బట్ట సంచులను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
ప్రతి రంగంలోనూ భారత్ అగ్రగామి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: టీ అమ్ముకునే సామాన్య కార్యకర్త ప్రధాని అయ్యి దేశాన్ని ఎక్కువ రోజులు పాలించి నెహ్రూ రికార్డును తిరగరాయడం గర్వ కారణంగా ఉందని మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అట్టడుగు వర్గాల సంక్షేమం మొదలుకొని దేశ రక్షణ, డిజిటల్ విప్లవం, ఆర్థిక సంస్కరణల వరకు ప్రతి రంగంలోనూ భారత్ను అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదేనని కొనియాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 4,399 రోజుల్లో ఒక్క రోజు కూడా విరామం లేకుండా మోదీ పని చేస్తున్నారని, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
పైసలిస్తేనే.. ఇందిరమ్మ ఇల్లు
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లికి చెందిన ఓ వృద్ధ మహిళకు మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. పైసా పైసా కూడబెట్టి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. బేస్మెట్ పూర్తి కావడంతో మొదటి బిల్లు ఖాతాలో జమ అయింది. బిల్లు పడిన విషయం తెలుసుకున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహిళను సంప్రదించారు. ఇల్లు మంజూరు, బిల్లు వచ్చినందుకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని, రూ.2 వేలు ఇస్తానని ఇవ్వగా తీసుకున్నారు. ఇలా గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటున్న ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు గుంజుతున్నారు. రూ. వేలల్లో వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 10,898 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,120 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,068 ఇళ్లు పూర్తయ్యాయి. ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయానికి తోడు కొంత డబ్బు జమ చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాజకీయ పలుకుబడి లేని నిరుపేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని డబ్బులిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేపిస్తామని కమిటీ సభ్యులు రూ.వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఏకంగా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న ఇంటి అప్డేట్ను హౌసింగ్ ఏఈలు యాప్లో అప్లోడ్ చేయడానికి వెళ్తే తమకు చెప్పకుండా యాప్లో ఎలా అప్లోడ్ చేస్తారని, తమ అనుమతి లేకుండా ఊరిలోకి రావొద్దని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులను బెదిరిస్తున్న ఘటనలూ ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లునిర్మాణం పూర్తి చేసుకుని..సిద్దిపేట జిల్లాలో కమిటీ సభ్యుల వసూళ్ల పర్వం నిబంధనలు గాలికి... ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులు తీసుకుంటూ అనర్హులకు ఇల్లు మంజూరు చేపిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారు, ఫోర్ వీలర్ ఉన్న వారు, ఇన్కం ట్యాక్స్ కట్టే వారు అనర్హులు. కానీ అన్నీ ఉన్న వారిని సైతం అర్హులుగా గుర్తిస్తుండటం గమనార్హం.ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరు అవుతుందనేది తప్పు. మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, హౌసింగ్ పీడీ -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తూప్రాన్/చేగుంట: ప్రమాదవశాత్తు నడుస్తున రైలు నుంచి యువకుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన డివిజన్ పరిధిలోని స్టేషన్మాసాయిపేటలోని రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్లాంపూర్కు చెందిన దుందిగల్ల నిరంజన్దాస్(36)గా మేడ్చల్లోని ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం స్టేషన్ మాసాయిపేటలో రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో శరీరం ఛిద్రమైంది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య కల్యాణి, ఇద్దరు కొడుకులు లోకేష్ నితిన్ ఉన్నారు. దీంతో కుటుంబంలో విషాదం ఆలుముకుంది. -
డెకరేషన్ సామగ్రి దగ్ధం
మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని డెకరేషన్ సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని తాజ్మహల్ గార్డెన్ఫంక్షన్హాల్ పక్కనే ఉన్న పొలంలో వరికొయ్యలకు రైతు నిప్పు పెట్టగా వరి కొయ్యలతో పాటు ఫంక్షన్హాల్ వద్ద నిల్వ చేసిన సుమారు రూ.9లక్షల డెకరేషన్ సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. అదేవిధంగా మరో రైతుకు చెందిన పైపులు, విద్యుత్వైర్లు కాలిపోయాయి. డెకరేషన్ సామగ్రి దగ్ధమవడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు. అత్యాచార నిందితునికి జైలు చిన్నకోడూరు(సిద్దిపేట): వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మండల పరిధిలోని అనంతసాగర్కు చెందిన వివాహిత ఇంట్లోకి 2020 అక్టోబర్ 9న అదే గ్రామానికి చెందిన మెదుల బాల్రాజు(40) చొరబడ్డారు. ఆమైపె అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలువెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఎల్కపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాతెల్లి నవీన్, కానికె రమేశ్ బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు గుంతలమయమైన రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రేషన్ బియ్యం పట్టివేత శివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. మండల పరిధి లింగోజిగూడ వద్ద తండాకు చెందిన పాండు తక్కువ ధరకు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఎనిమిది సంచుల రేషన్ బియ్యం ఆటోలో తరలిస్తుండగా గురువారం పట్టుకున్నట్లు చెప్పారు. సేకరించిన బియ్యాన్ని ఇటుక బట్టిల కూలీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆటోతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించి సివిల్ సంప్లయ్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టుమద్దూరు(హుస్నాబాద్): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్ఐ మహ్మద్ ఆసిఫ్ తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈనెల 10న మండలంలోని వల్లంపట్ల గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. గాగ్గిళ్లాపూర్కు చెందిన మాచర్ల చరణ్ పాటు వల్లంపట్ల గ్రామానికి చెందిన ఓ మైనర్ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని తనిఖీ చేసినట్లు తెలిపారు. వారి వద్ద 51 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, స్కూటీ, రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. -
దోస్త్ను సద్వినియోగం చేసుకోండి
● ఇంటర్ విద్యార్థులకు చక్కని అవకాశం ● అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సునీతసిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్ మూడో విడత ప్రవేశాల ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో చేరాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కోరారు. గురువారం కళాశాలలోని జిల్లా దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ ద్వారా పలువురు విద్యారుల వివరాలను ప్రవేశాల కోసం నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఇప్పటికే కొనసాగుతున్న హెల్త్కేర్ (ఏఈడీపీ)అప్రెంటిషిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కోర్సుతో పాటు ఈ విద్యాసంవత్సరం నూతనంగా బీఎస్సీ ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ (ఏఈడీపీ) కోర్సులు ప్రారంభం అయినట్లు చెప్పారు. ఈ కోర్సులలో చేరిన విద్యార్థులకు డిగ్రీ ఫైనలియర్లో పరిశ్రమలలో శిక్షణను అందిస్తూ ప్రతి నెల రూ.9000 పారితోషికాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు సకల సౌకర్యాలు గల ప్రయోగశాలలు, లైబ్రరీ, విశాలమైన మైదానం అందుబాటులో ఉన్నాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలను సందర్శించి వవరాలు తెలుసుకుని దోస్త్ ద్వారా తమ కళాశాలలో చేరాలని కోరారు. ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులతో పాటు ఇప్పటికి మొదటి, రెండో విడుతలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమస్యలు వస్తే కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బాలుడు అదృశ్యం
పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాంనగర్ కానికి చెందిన బాలుడు(17) ఇంట్లో గేమ్ ఆడుతున్నాడని మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో బుధవారం ఉదయం కిరణ షాప్కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలుడి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి గజ్వేల్రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని జాలిగామ రింగురోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి పడిఉన్నట్లు స్థానికులు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వయసు 46ఏళ్లు ఉండవచ్చని, మృతుడిని ఎవరైనా గుర్తు పడితే 8712667460 నంబరులో సంప్రదించాలని గజ్వేల్ పోలీసులు సూచించారు. -
జీవితంపై విరక్తితో.. గృహిణి ఆత్మహత్య
వర్గల్(గజ్వేల్): అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తిచెంది, గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం గౌరారంలో వెలుగుచూసింది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నగరం శంకర్గౌడ్, లక్ష్మి(47) దంపతులకు రాజేష్, రాకేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. లక్ష్మి గృహిణి కాగా భర్త, కుమారులు ప్రైవేటు ఉద్యోగులు. కొంతకాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఆమె బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక నీళ్లతో కూడిన పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములోకి దూకి బలవన్మరణం చెందింది. భర్త శంకర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య హవేళిఘణాపూర్(మెదక్): అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ మండలం శివాయిపల్లిలో గురువా రం వెలుగు చూసింది. వివ రాలిలా ఉన్నాయి. గ్రామాని కి చెందిన రైతు తుపాకుల నవీన్(28) ఇటీవలే తన తమ్ముడు నరేశ్ వారం రోజు ల క్రితం వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దీంతో నవీన్కు వ్యవసాయం, ఇంటి అవసరాల కోసం రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. నవీన్ గురువారం ఏడుపాయల్లో వారి బంధువుల వింధు ఉండగా భార్య సరిత, కుమారుడిని అక్కడి వదిలి వేసి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. తిరిగి మెదక్ మండలం మల్కాపూర్ తండా పలుగు వెనుకల చెట్టుకు ఉరి వేసుకున్నాడని కుటుంబీకులకు మధ్యాహ్నం గ్రామస్తులు సమాచారం అందించా రు. వారెళ్లి చూడగా నవీన్ చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతుడు నవీన్ తనకు అప్పు ఉందని బాధపడుతూ ఉండేవాడని, మనస్తాపంతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య సరిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయం
● 15న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం ● త్వరగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి ● రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ సముదాయాలను నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ సేకరించాలన్నారు. ఈ నెల 15న స్కూల్ను ప్రారంభించి నూతన అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, క్రీడామైదానాలు, ఇండోర్ స్పోర్ట్స్ సదుపాయాలు, ప్రీ ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు సమగ్ర విద్యావ్యవస్థ, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఇద్దరు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయు లు, ఎడుగురు ఎస్జీటీలు, ఎడుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఒక పీఈటీ, ఒక పీడీని నియమించాలని జిల్లా విద్యాధికారి శాసీ్త్రకి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు రవాణా సదుపాయాలతో పాటు ఈ నెల 15 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ షఫీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి, తహసీల్దార్ సరిత, మండల విద్యాధికారులు ఉదయ్ భాస్కర్ రెడ్డి, సైదులు, డీఈ నాగరాజు, ఏఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు -
విజ్ఞానజ్యోతి డైరెక్టర్కు సైన్స్ డిగ్రీ ప్రదానం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ, వ్యవసాయ కళాశాల డైరెక్టర్ ఎం.దేవేందర్రెడ్డికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్స్లర్ వరదారెడ్డి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మంగళవారం ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. 40 ఏళ్లుగా ఆయన వ్యవసాయ శాస్త్రం, జలవనరుల నిర్వాహణ, సుస్థిర వ్యవసాయం, అభివృద్ధి, రైతు సంక్షేమం, నవీన ఆవిష్కరణల్లో ఆయన చేస్తున్న సేవలకు సెన్స్ డిగ్రీని అందజేశారు. కార్యక్రమంలో ఢిల్లీ ఐఐటీ వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ వి.రాంగోపాలరావు, జాతీయ సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ అవార్డు గ్రహిత దీపికరెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ దీపక్ పాల్గొన్నారు. -
చస్తే కానీ.. ధాన్యం అన్లోడింగ్ చేయరా!
కొల్చారం(నర్సాపూర్): ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సంగాయిపేట గ్రామానికి చెందిన 8 మంది రైతులకు సంబంధించి 665 బస్తాల ధాన్యాన్ని మే 26న తూకం వేసి, కౌడిపల్లికి చెందిన శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్మిల్ పేరుతో మండలంలోని వరిగుంతం శివారులోని గోదాంకు తరలించారు. ధాన్యం రంగు మారిందని సదరు రైస్ మిల్ యజమాని అన్లోడింగ్ చేసేందుకు నిరాకరించాడు. అక్కడి నుంచి రైతులు ధాన్యాన్ని నర్సాపూర్లోని మరో రైస్ మిల్లుకు తీసుకెళ్లారు. అక్కడ సైతం ధాన్యం అన్లోడింగ్ చేసుకోలేదు. తూకం వేసి అప్పటికే 15 రోజులు అవుతున్న అన్లోడింగ్ కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ శ్రీనివాస్ చారి దృష్టికి తీసుకెళ్లి తమ గోడును విన్నవించినా అన్లోడింగ్ కానీ పరిస్థితి. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పెట్రోల్ బాటిళ్లను చేతబట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామానికి చెందిన ఎఫ్ఈఓ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తహసీల్దార్కు, అటు రైతులకు నచ్చజెప్పారు. బుధవారం సాయంత్రంలోపు అన్లోడింగ్ చేయిస్తానని తహసీల్దార్ రైతులకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ రైతు ఆవేదన.. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి. ధాన్యం తూకం పెట్టి రైస్ మిల్లుకు తరలించి 15 రోజులవుతుంది. ధాన్యం రంగు మారిందంటూ ఒక రైస్ మిల్ నుంచి మరో రైస్ మిల్లుకు తిప్పుతూ అన్లోడింగ్ చేయడం లేదు. డబ్బులు సకాలంలో రాకుంటే బిడ్డ పెళ్లి ఎలా చేసేది అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ, నెత్తి నోరు మొత్తుకున్న పట్టించుకోవడం లేదని వాపోయాడు. ధాన్యం కాంటా వేయడం లేదని.. కొల్చారం(నర్సాపూర్): రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదని రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. పైతర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగంపేట సహకార సంఘం ఏర్పాటు చేసింది. ధాన్యం సకాలంలో కాంటాలు వేయకపోవడం, తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదు. గ్రామానికి చెందిన రైతు ఎర్ర మోష నెల క్రితం ధాన్యం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి తూకం వేయలేదు. మధ్యాహ్నం సహకార సంఘం ఆవరణలో మోష ధాన్యాన్ని తూకం వేస్తారా ? లేదా? అని సంఘం సిబ్బందిని నిలదీశాడు. అనంతరం పెట్రోల్ పోసుకున్నాడు. కార్యాలయంలో రైతులతో మాట్లాడుతున్న సంఘం చైర్మన్ రమేశ్ కుమార్ వెంటనే బయటకు వచ్చి మోషను వారించాడు. దీంతో అక్కడే ఉన్న పలువురు ఒంటిపై ఉన్న పెట్రోల్ను కడిగారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. -
వ్యాపారాలకు విస్తరణ దెబ్బ
ఖేడ్లో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లకు నంబర్లు నారాయణఖేడ్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న రీతిలో ఖేడ్లో రహదారి విస్తరణ పనులు కాస్తా స్థానిక వ్యాపారులకు, రోడ్డు పక్కనివాసితులకు కష్టాల్ని తీసుకొచ్చాయి. ఖేడ్లో రహదారి విస్తరణకుగాను కేంద్రం నుంచి రూ.46కోట్ల పైచిలుకు నిధులు విడుదల జరగగా టెండర్ల దశలో ఉంది. రహదారి విస్తరణ పేరుతో రోడ్డుకిరువైపులా ఉండే వ్యాపార దుకాణాలు, నివాసాలను పాక్షికంగా కూల్చివేతలు జరుగుతాయనే ప్రచారం స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రచారానికి తగ్గట్లుగానే జాతీయ రోడ్లు ప్రాధికారిక సంస్థకు చెందిన సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు 50 అడుగుల చొప్పున మార్కింగ్తోపాటు సీరియల్ నంబర్లను వేశారు. దీంతో గతానికి భిన్నంగా రహదారులను విస్తరించి కూల్చివేతలు జరుగుతాయన్న ప్రచారంతో ఖేడ్ పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 30 అడుగులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పట్టణ వాసులతో సమావేశమై మెజార్టీ ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రజల కోరిక మేరకు 30 ఫీట్ల వరకు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. మెజార్టీ నష్టం జరిగే వారికి ప్రత్యామ్నాయంగా పాట్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు నివాసాల వారు అంగీకరించారు. అదే సమయంలో రాజీవ్చౌక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు డివైడర్లను నిర్మించారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. కొత్తగా 50 ఫీట్ల ప్రచారం కాగా, ప్రస్తుతం 50 ఫీట్ల మేర విస్తరిస్తామని ప్రచారం జరగడం, మార్కింగ్ వేయడంతో వ్యాపారులు, నివాసితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజాంపేట్–నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు 161బీ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. పట్టణం నుంచి రహదారి నిర్మిస్తే భారీ నష్టం వాటిల్లుతుందని భావించి పట్టణ సమీపం నుంచి నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు ఖేడ్ పట్టణానికి రెండు బైపాస్ రోడ్లున్నాయి. నూతనంగా రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. ఇన్ని రహదారులు ఉండగా పాత రహదారి విస్తరణ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు చేపడితే వందల భవనాలకు నష్టం వాటిల్లుతుంది. వ్యాపార, నివాసాల వారికి కోట్లలో నష్టం జరిగి, చాలామంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. 30 ఫీట్లలోపే విస్తరించాలి కాగా, పట్టణ వ్యాపారులు, నివాసాల వారు ఇటీవల సమావేశం నిర్వహించి 30 ఫీట్ల వరకే విస్తరించి వ్యాపార, నివాస సముదాయాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. అంతకుమించి కూల్చివేతలు చేపడితే భారీగా నష్టం వాటిల్లడంతోపాటు మార్కెట్ కోలుకోలేని దెబ్బతింటుందని పేర్కొన్నారు. 161బీ జాతీయ రహదారి, రెండు బైపాస్, రింగ్ రోడ్డుల నిర్మాణం జరగడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ భారీగా తగ్గిపోగలదని పేర్కొంటున్నారు. 50 ఫీట్ల విస్తరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డివైడర్ల వల్ల ఇప్పటికే వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా మార్కింగ్లు వ్యాపారులు, నివాసితుల ఆందోళన గతంలో 30 ఫీట్లు.. ప్రస్తుతం 50 ఫీట్లు అంటూ హడావుడి -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణాలు సీజ్
హుస్నాబాద్రూరల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని ఏఓ పూజ, ఎస్సై లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘రైతులపై సీడ్ పంజా’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. హుస్నాబాద్ పట్టణంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, విత్తనాలనే రైతులకు విక్రయించాలని, లాభాల కోసం అనుమతి లేని కొత్త రకం క్రిమిసంహారక మందులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆమోదిత వరి సన్న రకాలను విక్రయించాలని సూచించారు. దిగుబడులు వస్తాయని రైతులకు ఆశ చూపి సీడ్ కంపెనీల ఏజెట్ల దగ్గర విత్తనాలు తీసుకొని అమ్మితే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అమ్మిన ప్రతి వస్తువుకూ రైతులకు రసీదు ఇవ్వాలన్నారు. ఎరువులు, విత్తనాల వివరాలను దుకాణం ఎదుట స్టాక్ బోర్డులో పెట్టాలని ఆదేశించారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించండి
సంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన ‘ఛలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని శివ ఫంక్షన్హాల్లో మంగళవారం ‘ఛలో హైదరాబాద్’కు సంబంధించిన నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘ఛలో హైదరాబాద్’కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ...మూడేళ్లుగా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు లు చెల్లించకపోవడంతో అనేకమంది అప్పుల పాలై వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు పాల్పడుతుండగా మరికొందరు ఒత్తిడి కారణంగా గుండెనొప్పితో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయాలంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారని వ్యాఖ్యానించారు. బిల్లులు సకాలంలో అందక కాంట్రాకర్ల వద్ద డబ్బులు లేక అనేక పను లు అర్థాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. ఓ వైపు కార్పొరేట్ కాంట్రాక్ట్ కంపెనీలు రాకతో చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడుతుంటే పెండింగ్ బిల్లులు రాక అప్పుల భారంతో మరింత కుదేలవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ముఖ్య సలహాదారులు పి.భాస్కర్ రెడ్డి, సుధాకర్, సత్యమయ్య, రాములుగౌడ్, చీల మల్లన్న, విష్ణువర్ధన్రెడ్డి, జిన్న శ్రీధర్రెడ్డి, మనోజ్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి సమస్యలపై ఈనెల 18నచలో హైదరాబాద్ సంగారెడ్డి సమావేశానికి హాజరైనమూడు జిల్లాల కాంట్రాక్టర్లు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
డీఎస్పీ సైదానాయక్జహీరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడాలని డీఎస్పీ సైదానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీషారెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎస్వీ ఫంక్షన్హాలులో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్, న్యాల్కల్ మండలాలకు చెందిన 120 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా సహాయంతో అందజేసిన కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి వద్దే ఉండి బట్టలు కుట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. గత ఏడాది నిర్వహించిన మొదటి విడతలో 800 మందికి ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారని తెలిపారు. ఈ ఏడాది 700 మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శుక్లవర్ధన్రెడ్డి, కో–ఆర్డినేటర్ సురేందర్రెడ్డి, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రాంచంద్రారెడ్డి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఏఈడీపీ కోర్సులతో అవకాశాలు పుష్కలం
వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డిసిద్దిపేటఎడ్యుకేషన్: ఉపాధి శిక్షణతో కూడిన డిగ్రీ కోర్సులు(ఏఈడీపీ)తో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏఈడీపీ నూతన కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అయోధ్యరెడ్డి మాట్లాడుతూ... ఏఈడీపీలో భాగంగా బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కోర్సుతో విద్యార్థులు సాధారణ డిగ్రీతో పాటు చేపల పెంపకం, ఆక్వా కల్చర్ నిర్వహణ, చెరువుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి సాంకేతికతలు వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ పొందుతారన్నారు. ఇంటర్మీడియెట్లో బైపీసీ, లేదా ఎంఎల్టీ ఒకేషన్ కోర్సును బ్రిడ్జి కోర్సుతో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వనాథం, మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు వైకుంఠం, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, కనకచంద్రం, వేంకటరమణ, రఘురాజ్, గంగాధర్, నరేందర్రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు. -
రాజీపడే కేసులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి
జహీరాబాద్ టౌన్: రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి.కవితా దేవి సూచించారు. ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని పోలీసు అధికారులు, న్యాయవాదులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. రాజీ పడదగిన కేసులను ముందుగా గుర్తించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని, లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. చిన్న చిన్న కేసులతో కక్ష పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులను వృథా చేసుకోవద్దని కక్షిదారులకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి ఎండీ అబ్దుల్ ఖలీల్, డీఎస్పీ సైదానాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ.హన్మంత్, ఎస్ఐలు లవకుమార్, కాశీనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఏజీపీ దత్తాత్రేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి
సంగారెడ్డి /పటాన్చెరు టౌన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోఎస్ మంత్రి వివేక్కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్ను టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్అలీ, కార్యదర్శి వేల్పూరు రవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సేవా సంబంధిత అంశాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో నాయకులు సమర్పించిన వినతులను మంత్రి విని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీనిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇస్నాపూర్కు ప్రత్యేక నిధులివ్వండి ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మంత్రి వివేక్ను కోరారు. సంగారెడ్డిలో జరిగిన సమీక్షకు హాజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ను ఇస్నాపూర్ చౌరస్తాలో కలిసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించారు. నేషనల్ హైవే నుంచి లక్డారం– బ్యాతోల్ – రుద్రారం – ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.మంత్రిని కలిసిన టీఎన్జీఓ నేతలు -
ధర్నాలు చేస్తేనే జొన్నలు కొంటారా..?
తడ్కల్ కేంద్రం వద్ద రైతుల రాస్తారోకో కంగ్టి(నారాయణఖేడ్): రైతులు ధర్నాలు చేస్తేనే జొన్నలు కొనుగోలు చేస్తారా అంటూ రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఎదుట కంగ్టి, తడ్కల్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి జొన్నలు తడిసి మొలకెత్తుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించడంతో శాంతించారు. అనంతరం మధ్యాహ్నం నాలుగు లారీలు పంపి జొన్నలు తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. -
కొత్త కల్వర్టు నిర్మాణం
జహీరాబాద్ టౌన్: ‘ప్రమాదకరంగా కల్వర్టు’శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జహీరాబాద్ పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో దెబ్బతిన్న కల్వర్టుకు స్థానంలో కొత్త నిర్మాణానికి పనులు ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మధ్యలో మురికి కాలువపై వేసిన కల్వర్టు స్లాబ్ ధ్వంసమై గుంతలు పడటంతో ప్రమాదకరంగా తయారైంది. ఇనుప కడ్డీలు పైకి తేలి వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న కల్వర్టు స్థానంలో కొత్తది నిర్మిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలివ్య.కా.సం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ జహీరాబాద్ టౌన్: వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల విలువలను నిర్ణయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. నిమ్జ్ పరిధిలోని రైతులతో మంగళవారం పట్టణంలోని శ్రామిక్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిమ్జ్ ప్రాజెక్టు పరిధిలోని భూములు ప్రస్తుతం ఎకరానికి రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు మార్కెట్ ధర పలుకుతుందన్నారు. ప్రభుత్వం భూమి విలువ కేవలం రూ.4.50 లక్షలు నిర్ణయించడం వల్ల భూ బాధితులు నష్టపోతారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకున్న తర్వాతే భూముల విలువలను సవరించాలని కోరారు. బుల్లెట్ రైల్ జహీరాబాద్ మీదుగా మళ్లించాలిమాజీ ఎంపీ బీబీ పాటిల్కు కౌన్సిలర్ వినతి జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్ రైల్ను జహీరాబాద్ మీదుగా మళ్లించాలని కోరుతూ జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్కు కౌన్సిలర్ వినతిపత్రం అందజేశారు. 27వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నామ స్రవంతి మంగళవారం బీబీ పాటిల్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, నిమ్జ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బీబీ పాటిల్ ఎంపీగా ఉన్న సమయంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జహీరాబాద్స్టేషన్ను చేర్చారని అయితే తాజా డీపీఆర్లో ఆ మార్గాన్ని వికారాబాద్ మీదుగా మళ్లించారని అది సరికాదని వివరించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ స్పందిస్తూ కేంద్ర రైల్వేమంత్రిని, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి డీపీఆర్లో తగిన మార్పులు చేయించి జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలిబీజేపీ నేత ప్రభుకుమార్గౌడ్ సంగారెడ్డి: నాలుగేళ్ల క్రితం చౌటకూర్ గ్రామ పరిధిలోని ఎంపీ డిస్టలరీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు పల్లె ప్రభుకుమార్గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్జైన్కు వినతిపత్రం సమర్పించారు. ప్రమాదంలో మృతి చెందిన దమ్మి కిష్టయ్య కుటుంబానికి ఆ సమయంలో కంపెనీ యాజమాన్యం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో ఆయన కుమారుడు దమ్మి హేమంత్కు శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చిందని తెలిపారు. అయితే నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మాస్టర్ యువర్ మైండ్’ పుస్తకావిష్కరణ
పెద్దశంకరంపేట(మెదక్): మండల ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత బృంగి ప్రసన్నకుమార్ రచించిన మాస్టర్ యువర్ మైండ్ పుస్తకాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆమె మాట్లాడారు. మనిషి ప్రవర్తనలో ప్రత్యేకతలను సరిగ్గా విశ్లేషి ంచడం కష్టమైన పని అన్నారు. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులు, జీవన, వైవాహిక స్థిరత్వా న్ని ఎదుర్కొనే యువతకు, కుటుంబం గురించి ఆలోచించి ఆందోళన పడే పెద్దలకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రచయిత ప్రసన్నకుమార్ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, రాజు, ఎస్ఓ నవీన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ స్వాధీనం చేర్యాల(సిద్దిపేట): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జి.అపూర్వరెడ్డి వివరాల ప్రకారం.. పట్టణ శివారు అకునూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా మట్టిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న టిప్పర్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. వృద్ధుడు అదృశ్యం చిన్నశంకరంపేట(మెదక్): వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నార్సింగి మండలంలోని చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ సృజన కథనం ప్రకారం... సంకాపూర్ దర్గాతండాకు చెందిన పాల్త్యా లింబ్యా(60) పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి భార్య కమల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు కొల్చారం(నర్సాపూర్): పేకాట ఆడుతున్న వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని ఎనగండ్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి రూ.15,100 నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కంది(సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ఈ సంఘటన మండల కేంద్రం కంది శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. కంది సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కింద వ్యక్తి శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతుని వివరాలు తెలియలేదని, శవం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో రెండు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చైన్ స్నాచర్ రిమాండ్
పటాన్చెరు టౌన్: చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, క్రైమ్ సీఐ రాజు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న రుద్రారం అభయాంజనేయ స్వామి దేవాలయంలో పనిచేస్తున్న అంజమ్మ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రుద్రారంలో గొలుసు దొంగతనం తానే చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. చందానగర్లో వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ దుకాణంలో బంగారం కరిగించి రూ.1.03 లక్షలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు 8.07 గ్రాముల బంగారం, దొంగతనానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. కాగా నిందితుడి స్వస్థలం రాయి కోడ్ మండలంలోని హుస్నాబాద్ గ్రామం కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి వెంకట్రావునగర్లో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
నిలదీతలు..!
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026వాగ్వాదాలు..సమగ్రాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి : మంత్రులు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా వెలుగొందుతున్న జిల్లాలను అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. రైతులు పంటల మార్పిడి, ఆయిల్పామ్ సాగు దిశగా ప్రోత్సహించాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతులను నర్సింగ్ విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య మౌలిక వసతులు కల్పించాలన్నారు.ధాన్యం, జొన్నల కొనుగోళ్లలో వైఫల్యాలను ప్రస్తావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల అమలును వివరించగా..రైతుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం..జొన్నల కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్రావు, సునీతారెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీంతో అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తమాషాలు చేస్తోందని వివేక్ వ్యాఖ్యానించడం పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. తక్షణం ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన వైఫల్యాలను మంత్రి వివేక్తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్తు చేశారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల నిలదీతలు..వాగ్వాదాలతో సమావేశంలో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేల కోటా కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్టు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేల కోటా అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో లేవనెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న మాదిరిగానే తమకు కూడా ఇళ్ల కోటాను కేటాయించాలని, తాము కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే ఈ ఇళ్లను తమకు కూడా కోటా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జొన్నల నిల్వలు గోదాముల్లో పేరుకుపోవడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని, దీంతో ఇటు జొన్నల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. మీడియాను అనుమతించని అధికారులు చాలా నెలల తర్వాత జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇతర జిల్లాలకు భిన్నంగా ఇక్కడ మీడియా అనుమతి లేకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. విశాలమైన జిల్లా పరిషత్ సమావేశ హాలు ఉన్నప్పటికీ..ఈ సమావేశాన్ని అంతంత మాత్రంగా ఉన్న వీడియోకాన్ఫరెన్స్ హాలులోనే నిర్వహించడంతో ఇటు అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు సగానికిపైగా శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశం జరుగుతున్న సేపు హాలు బయట పడిగాపులు కాయడం గమనార్హం. సమీక్షలో ఎంపీలు సురేశ్షెట్కార్, రఘునందన్రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోశ్పంకజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న మంత్రి వివేక్ వాడీవేడిగా జిల్లా సమీక్ష -
పంట మార్పిడితో ప్రయోజనాలు
● జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ● ‘సాక్షి’ఫోన్ ఇన్కు విశేష స్పందన ● డీఏఓతో నేరుగా మాట్లాడిన రైతులు ● వానాకాలం పంటల సాగుపై సూచనలు, సలహాలుప్రశ్న: వర్షాభావ ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోమని చెబుతున్నారు. పంట పూత దశలో అధిక వర్షం, తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరి పంట సాగు చేసుకోవచ్చా? – భీమ్ రావు, గ్రా.బాన్సువాడ, మం. కంగ్టి శివప్రసాద్: జూన్, జూలైలో సాధారణం, ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వైరెటీలు సాగు చేసుకోవాలి. వర్షాలను తట్టుకుని చేతికొచ్చే పంట రకం వరిని సాగు చేసుకోవాలి. వర్షాలు తక్కువగా ఉన్నందున తెగుళ్లు తక్కువగా వస్తాయి. సంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్: రైతులు తమ పొలాల్లో ఒకే రకమైన పంటను కాకుండా కాలానికనుగుణంగా పంటలను మార్పిడి చేస్తూ సాగు చేయడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రైతులు నేరుగా ఆయనతో మాట్లాడి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ..ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉండటంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను విత్తుకోవాలని సూచించారు. ప్రశ్న: పత్తిలో అంతర పంటగా సోయా పంటను సాగు చేయాలంటే ఏ రకమైన విత్తనాలు విత్తు కోవాలి? గోపాల్ రెడ్డి, గ్రా.కక్కర్ వాడ,మం. ఝరాసంగం శివప్రసాద్: పత్తిలో అంతర పంటగా జేఎస్ 335 రకం సోయాను సాగు చేసుకోవచ్చు. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పత్తిలో కంది పంటను సాగు చేసుకోవడం చాలా మంచిది. నీటి సౌకర్యం ఉంటే మక్క పంటను కూడా సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: 5 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఏ రకమైన పత్తి విత్తనాలు విత్తు కోవాలి? – మల్లేశం యాదవ్, వినోద్ సింగ్ ఠాకూర్, గ్రా. మం. ఝరాసంగం శివ ప్రసాద్: పత్తిలో అనేక రకాలు మార్కెట్లో ఉన్నాయి. 120 నుంచి 135 రోజుల కాలం ఉన్న పంటలను సాగు చేసుకోవడం మంచిది. ఆగస్టులో వర్షపాతం చాలా తక్కువగా ఉన్నందున త్వరగా పంట చేతికి వచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ప్రశ్న: ఈ ఏడాది కూడా వరి సాగు చేయవచ్చా? – ప్రవీణ్, గ్రా.ఫసల్ వాది, మం.సంగారెడ్డి శివ ప్రసాద్: తక్కువ కాలం ఉన్న కేఎన్ఏం 1638 అనే వైరెటీని సాగు చేసుకోవాలి. నీటి సౌకర్యం ఉంటే వరి సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 32 క్వింటాలు దిగుబడి వస్తుంది. ప్రశ్న: పత్తి విత్తనాలు ఎప్పుడూ విత్తుకోవచ్చు. యూరియా అందుబాటులో ఉందా? – మల్లేశం, గ్రా. ఇసిరాబాద్ మం.సదాశివ పేట శివప్రసాద్: రెండు వానలు బాగా కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకుంటే మంచిది. యూరియా కొరత లేదు. యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలి. ప్రశ్న: ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారు? కొనుగోలు చేసిన వాటికి బిల్లులు కూడా ఇవ్వటం లేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? – నరసింహారెడ్డి, గ్రా. ముంగి, మం. న్యాల్కల్ శివప్రసాద్: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినట్లు రుజువైతే షాప్ను సీజ్ చేస్తాం. కేసులు నమోదు చేస్తాం. కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. ప్రశ్న: పత్తి పంటలో అంతర పంటగా ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి? తెగుళ్లు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – దుర్గేష్, గ్రా. కన్ సాంన్ పల్లి, మం.అందోల్ శివప్రసాద్: మూడు వరుసల పత్తి, ఒక వరుస అంతర పంటగా కంది, సోయాబీన్తో పాటు నీటి సౌకర్యం ఉంటే ఇతర పంటలు వేసుకోవచ్చు. ప్రశ్న: వరి పంట సాగుకు ఏ రకమైన వైరెటీ సాగు చేసుకోవచ్చు? తెగుళ్లు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – విష్ణువర్ధన్ రెడ్డి, గ్రా. మం. గుమ్మడిదల శివ ప్రసాద్: వరిలో సన్నరకం సాగు చేసుకోవాలి. కొత్తగా వచ్చిన కేఎన్ఎం 16:38 రకం బాగుంటుంది. ఒక ఎకరాకు 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షాభావ పరిస్థితులను బట్టి తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. అధికారుల సూచనలు మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. ప్రశ్న: పత్తి పంటలో దిగుబడి తగ్గకుండా ఎలాంటా చర్యలు తీసుకోవాలి? ఆయిల్ పామ్ పంటలో అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చా? ఎలాంటి పంటలు వేసుకోవాలి? – కిషన్, గ్రా.అంకెన్ పల్లి, మం.సదాశివపేట. శివప్రసాద్: వర్షాలు అధికంగా కురవడంతో తెగుళ్లు సోకి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పంట మార్పిడి చేయడంతో ప్రయోజనాలుంటాయి. పంట సాగులో సేంద్రీయ ఎరువులు వినియోగించాలి. పత్తి పంట సాగు చేసినప్పటికీ మేలు రకం విత్తనాలు వాడాలి. ఆయిల్పామ్ పంటలో అంతర పంటగా సోయాబీన్, పెసరతోపాటు ఇతర పంటలు సాగు చేసుకోవచ్చు. -
పాముకాటుతో వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): పాము కాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎలకుర్తి మల్లేశం(39) తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి కుడి చేయి ఉంగరం వేలుకు పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మల్లేశంను మొదట జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా మారడంతో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నదాన సత్రం అద్ధం మీదపడి యాచకురాలు.. చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు అద్దం మీదపడి తీవ్ర గాయాలై యాచకురాలు మృతి చెందింది. ఈ సంఘటన కర్నాల్పల్లి సాయిబాబా ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటకు చెందిన కళవ్వ(70) భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో కర్నాల్పల్లి సాయిబాబా ఆలయ సమీపంలోని అన్నదాన సత్రం అద్దం పగిలి పైఅంతస్తు నుంచి సేద తీరుతున్న కళవ్వపై పడింది. దీంతో ఆమె మెడ, చేతి భాగం తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
దండిగా దరఖాస్తులు
బెస్ట్ అవైలబుల్ పథకంపై పేద విద్యార్థుల ఆసక్తి● మొత్తం ఖాళీలు 120 ● వచ్చిన దరఖాస్తులు 176 ● జిల్లాలో 5 పాఠశాలలు మెదక్ కలెక్టరేట్: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ప్రస్తుతం 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి యేడాది ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులు 10వ తరగతి వరకు ఉచితంగా చదువుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో 5 పాఠశాలలు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకంలో 5 పాఠశాలలు ఉన్నాయి. మెదక్లో సిద్ధార్థ్ విద్యాసంస్థలు, గీతా హైస్కూల్, రామాయంపేటలో మంజీరా విద్యాసంస్థలు, వివేకానంద ఆవాస విద్యాలయం, తూప్రాన్న్లో గీతా స్కూల్ ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పథకం కింద 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. రూ.1.05 కోట్లు చెల్లింపు బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజు చెల్లిస్తుంది. జిల్లాలో మూడేళ్లుగా ట్యూషన్ ఫీజు మొత్తం రూ.1.70 కోట్లు పెండింగ్లో ఉంది. దీంతో గత ఏడాది విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్, డీఈఓ, షెడ్యూల్డ్ కులాల అధికారి విద్యాసంస్థలతో మాట్లాడి సర్ది చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది రూ.1.05 కోట్లు మంజూరు చేయడంతో వారికి అందజేశారు. ఇంకా 40 శాతం అంటే రూ.65లక్షలు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుల వెల్లువ జిల్లాలో ఖాళీగా ఉన్న 120 సీట్ల భర్తీకి ప్రభుత్వం మే 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 8 వరకు 176 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1వ తరగతిలో 59 సీట్లు ఖాళీగా ఉండగా 83 దరఖాస్తులు, 5వ తరగతిలో 61 సీట్లు ఖాళీగా ఉండగా 93 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారులు, తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎస్సీ వర్గీకరణ నూతన రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.విద్యాసంస్థలతో చర్చించాం ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ కింద విద్యార్థులను చేర్పించేందుకు ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించాం. పెండింగ్ బిల్లుల గురించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని, బిల్లులు రాగానే చెల్లిస్తామని యజమాన్యాలకు కలెక్టర్ సూచించారు. వారు కూడా ఇందుకు సమ్మతించారు. విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయి పరిశీలన జరుగుతుంది. త్వరలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక చేస్తారు. – సింధూ, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి, మెదక్. -
వడదెబ్బతో కూలీ మృతి
శివ్వంపేట(నర్సాపూర్): అనారోగ్యం, వడదెబ్బతో కూలీ మృతి చెందాడు ఈ ఘటన మండల పరిధిలోని దొంతిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బణుపురం వెంకటేశ్(37) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి స్థానిక కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో మృతి చెందాడు. అనారోగ్యం, వడదెబ్బ మూలంగా మృతి చెందాడని మృతుడి భార్య మంజుల పీఎస్లో ఫిర్యాదు చేసింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుకర్రెడ్డి తెలిపారు. -
డబుల్.. ట్రబుల్
జహీరాబాద్: స్థానిక మున్సిపల్ పరిధిలోని హోతి(కె) శివారుతో పాటు పస్తాపూర్లోని జర్నలిస్టు కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రక్షణ కరువైంది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోతి(కె)లో 660 ఇళ్లు, పస్తాపూర్ జర్నలిస్టు కాలనీలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. అయితే, ఈ కాలనీల చుట్టూ ప్రహరీ, ప్రధాన గేట్లు నిర్మించలేదు. కాలనీల పరిసరాల్లో వ్యవసాయ భూములు ఉండడంతో తరచూ ఇండ్లలోకి పాములు వస్తూ నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మరోవైపు భద్రత లేకపోవడంతో కాలనీల్లోకి బయటి వ్యక్తుల సంచారం పెరిగింది. ప్రహరీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దుండగులు దొంగలు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటేనే కాలనీవాసులు వణికిపోతున్నారు. రహమత్నగర్ కాలనీ తరహాలోనే తమ కాలనీలకు కూడా ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రహరీలకు నోచుకోని డబుల్ బెడ్రూం ఇళ్లు పాముల సంచారంతో ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని నివాసితుల వేడుకోలు -
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని వీరభద్రీయుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఇస్నాపూర్ వీరభద్రియుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముత్తంగి డివిజన్ పరిధిలో గల భవన నిర్మాణ స్థలంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇస్నాపూర్ వీరభద్రియుల సంక్షేమానికి ఇప్పటికే సొంత నిధులతో 200 గజాల స్థలం అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు భిక్షపతి, కుమార్ గౌడ్, ప్రభాకర్, మేరాజ్ ఖాన్, సందీప్, రామకృష్ణ, సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.. పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మాజీ ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో వర్షపు నీరు తరలించేందుకు ప్రత్యేక డ్రైన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం డీఈ కృష్ణవేణికి ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్ర భిక్షపతి, పృథ్వీరాజ్, శ్రీరాములు, బలవంత్, వెంకటేష్, కాలనీ అధ్యక్షులు అమరేందర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
భౌబోయ్..
వీధి కుక్కల వీర విహారంసంగారెడ్డి జోన్: జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను వెంబడిస్తూ గాయాలపాలు చేస్తున్నాయి. ఎక్కడినుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వీధి కుక్కల స్వైర విహారం ప్రజల ప్రాణాలకు ప్రాణాంతకంగా మారాయి. ప్రజల్లో భయాందోళన మనుషులపై కుక్కలు క్రూరంగా దాడులకు పాల్పడుతున్నాయి. తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడడంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరిగా చిన్నపిల్లల్ని బయటికి పంపించేందుకు జంకుతున్నారు. జిల్లాలో 13,486 శునకాలు 20వ పశుగణన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 13,486 కుక్కలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకు పైగా చేరినట్లు సమాచారం. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోల్లోని పలు మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని రహదారుల పక్కనే మాంసపు వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా పారవేస్తున్నారు. దీంతో ఆయా ప్రదేశాల్లో వాటిని తిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అటుగా వెళ్లే వారిపై కరువడంతో గాయాలతోపాటు మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. నియంత్రణలో విఫలం.. కుక్కల పెరుగుదలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి, కాశీపూర్ గ్రామంలో నియంత్రణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు కుక్కలను నియంత్రణ కేంద్రాలకు తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసి, రేబిస్ టీకా వేసి ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలివేయాల్సి ఉంటుంది. కానీ మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ కార్యాచరణ కాస్తా ముందుకు సాగటం లేదు. ఫలితంగా వీటి బెడద రోజురోజుకూ అధికమవుతుంది. పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర స్థాయిలో గాయాలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.జిల్లాలో కొన్ని ఘటనలు.. ఈనెల 6న కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు సంచరిస్తూ చిన్నారులతోపాటు మహిళలపై దాడి చేశాయి. కాలు, చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈనెల 7న ఝరాసంగం మండలంలోని పూరి నాయక్ తండాకు చెందిన విశాల్ను పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అదే రోజు తుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ముక్కుకు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఆదివారం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ముగ్గురిపై పిచ్చికుక్క దాడి చేయడంతో పెదవులు, చెంపలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. గాయాల పాలవుతున్న చిన్నారులు, వృద్ధులు వాహనదారులను వెంబడిస్తున్న శునకాలు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు నియంత్రణలో అధికారులు విఫలం -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తూప్రాన్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన పట్టణంలోని గీతా మందిరం సమీపంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ వెంకటరాజాగౌడ్ వివరాల ప్రకారం... విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళి తన కుటుంబ సభ్యులతో గత నెల 29న పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి చెరుకొని చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు, ల్యాప్ట్యాప్ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులు ఇంట్లో పెట్టవద్దని సూచించారు. పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ -
దేవాలయాల అభివృద్ధికి సహకారం
పటాన్చెరు టౌన్: దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని మధు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన షెడ్డు నిర్మాణ పనులకు సొంత నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చాలా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి మధు -
టమాటా.. ధరల మంట!
జహీరాబాద్ టౌన్: టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కిలో రూ. 20 పలికిన ధర ప్రస్తుతం జహీరాబాద్ మార్కెట్లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ధరలు పెరగడంతో టమాటా కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వేసవిలో టమాటా సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా లేక ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వారాంతపు సంతలో కూడా టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. జహీరాబాద్ కూరగాయల మార్కెట్లో కొన్ని రోజులకు ముందు రూ.400 పలికిన టమాటా బాక్స్ ప్రస్తుతం రూ. 1,200 వరకు పలుకుతుంది. -
లారీల కోసం రోడ్డెక్కిన అధికారులు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధాన్యం బస్తాలను తరలించేందుకు అవసరమైన లారీల కోసం అధికారులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలో తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం చేగుంట–మెదక్ రోడ్డుపై పద్మనాభస్వామి గుట్ట వద్ద పరిశ్రమల వద్దకు వచ్చిన లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సోమవారం వరకు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజైనా కూడా అధికారులు విధులకు హాజరయ్యారు. కాగా లారీ డ్రైవర్లతో మాట్లాడి మండలంలోని పలు గ్రామాలకు పంపించారు. -
స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తులు
ది స్కౌట్–గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిషనర్ రూయల్ రాజ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని మండలాల వారీగా స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట్ జిల్లా కమిషనర్ ఇస్సారపు రూయల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్కౌట్ మాస్టర్లకు నెలసరి వేతనం రూ.15వేలు ఉంటుందన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 10న సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నారు. వివరాలకు జిల్లా కార్యాలయం ఫోన్ నెం. 77949 30047లో సంప్రదించాలని సూచించారు. సైక్లింగ్తో శారీరక దృఢత్వంజిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి సిద్దిపేటజోన్: పర్యావరణ హితంగా సైక్లింగ్ సాధన చేయాలని, విద్యార్థులు సైక్లింగ్పై ఆసక్తి చూపాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి సూచించారు. ఆదివారం స్టేడియంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎస్వైఓ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యంతోపాటు శారీరక దృఢత్వం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖేల్ ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. చేపలు పట్టడానికి వెళ్లి వృద్ధుడు మృతిదుబ్బాకటౌన్: చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... దుబ్బాక పట్టణానికి చెందిన పర్వతం మల్లయ్య(70) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. గతంలో సైతం మద్యం మత్తులో పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడు. కానీ ఈ సారి మద్యం మత్తులో చేపలు పట్టడానికి బోడినికుంటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. దుర్వాసన వస్తుండడంతో గేదెల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మల్లయ్యగా నిర్ధారించారు. మల్లయ్య కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలు అదృశ్యం సంగారెడ్డి క్రైమ్: వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... పట్టణంలోని హనుమాన్ నగర్ (కింది బజార్)కు చెందిన బుక్క పెంటమ్మ(58) గృహిణి. తన కుమారుడు కుటుంబంతో కలిసి కొన్ని నెలలుగా సంగారెడ్డిలో జీవిస్తుంది. మతిస్థిమితం సరిగాలేని పెంటమ్మ ఈ నెల 6న అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మట్టి తవ్వకాలపై కేసు నమోదుశివ్వంపేట(నర్సాపూర్): అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని దొంతి కుందలమ్మ చెరువులో నుంచి రాత్రి వేళల్లో జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
వైభవంగా నగర సంకీర్తన
జహీరాబాద్: పట్టణంలోని ఎస్బీహెచ్ కాలనీలో ఆదివారం 210వ నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శోభాయాత్ర చేపట్టారు. అనంతరం హనుమాన్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కంది హరేకృష్ణ మందిరం బాధ్యులు విభీషణ్దాస్ మహారాజ్ మాట్లాడారు. సర్వ జగత్ రక్షకుడైన శ్రీమహా విష్ణువే ప్రజాపతి అన్నారు. హరినామ సంకీర్తన చేయడంతో యజ్ఞ ఫలాలు అందుతాయన్నారు. జూలై 18వ తేదీన జగన్నాథ్ రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నహాలు ప్రారంభించాలని సూచించారు. ఇదిలా ఉండగా, హుగ్గెల్లిలో 175 నగర సంకీర్తనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని గొల్లపల్లిలో వెలసిన రేణుక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో లందా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రేణుక పరమేశ్వరి అమ్మవారి విగ్రహ దాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు కలిసి పూజాలో పాల్గొన్నారు. అలాగే ఎస్సీ వాడలో గతేడాదిలో నిర్మించిన రేణుక పరమేశ్వరి అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో యువకులు, పోతరాజులు, శివ సత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కల్కి భగవాన్ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు
సంగారెడ్డి: పట్టణంలో పీఎస్ఆర్ గార్డెన్లో కల్కి భగవాన్ భక్త బందం ఆధ్వర్యంలో కల్కి భగవాన్ మూర్తులకు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు కల్కి భగవాన్ దంపతుల విగ్రహమూర్తులకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని ఆకాక్షించారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా కల్యాణం నిర్వహిస్తున్న కల్కి భగవాన్ భక్త బందాన్ని ఆయన అభినందించారు.కల్కి భగవాన్ ఆలయం కోసం స్థలాన్ని సేకరించామని, ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం తన పూర్తి సహకారాన్ని అందిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కల్కి భక్త బంద సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం బస్తాల ట్రాక్టర్ బోల్తా
మద్దూరు(హుస్నాబాద్): వేర్వేరు చోట్ల ధాన్యం లోడ్తో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. వివరాలు ఇలా... మండలంలోని వల్లంపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఆదివారం గ్రామంలోని రైస్మిల్లుకు ట్రాక్టర్ ధాన్యం లోడ్తో వెళ్తుండగా బోల్తాపడింది. అలాగే రేబర్తి–వల్లంపట్ల గ్రామాల మధ్యలో మరో ధాన్యం ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్న క్రమంలో అవి బోల్తా పడుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సరిపడా లారీలను అందుబాటులో ఉంచి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్, గడ్డి దగ్ధం
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్, గడ్డి వాము దగ్ధం కాగా, లేగదూడ కూడా మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన గుడికందుల మధు తన పొలం వద్ద వరి గడ్డి కట్టలు కట్టి పెట్టాడు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి తన పొలంలోని గడ్డి కట్టలు, పక్కనే ఉన్న ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడే కట్టేసిన ఏడాది లేగదూడ సైతం మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. గమనించిన సమీప రైతులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పినప్పటికీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. లేగదూడ మృతి -
నల్లనిమట్టే పారాణి.. గడ్డిపరకలే బాసింగం
చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది.ఉపాధి పనుల వద్ద ఉత్తుత్తి పెళ్లి సందడి -
రగ్బీలో మెదక్కు మూడో స్థానం
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా బుదేరా మండలం ఆక్సిజన్ యూనివర్సిటీలో రెండురోజుల పాటు అండర్ 18 బాలబాలికల రగ్బీ పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన నవ్యశ్రీ , రోజా, అంజలి, సోనా, అఖిల, షరీబా, గాయత్రి, దివ్య, వర్షశ్రీ, రాణి, సుప్రియ, వందన పాల్గొన్నారు. వీరు ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మల్లీశ్వరీ, పీడీలు, వారద, రంగీల, జయశీల తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మార్క్ఫెడ్లో జొన్నలు అమ్ముకోవాలి
మునిపల్లి(అందోల్): మార్క్ఫెడ్లో రైతులు జొన్నలను అమ్ముకోవాలని మాజీ ఎంపీపీ రాంరెడ్డి రైతులను కోరారు. ఆదివారం మండలంలోని బుదేరా రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలను మార్క్ ఫెడ్లో తీసుకోనున్నట్లు తెలిపారు. క్వింటాళ్ల జొన్నలను ధర రూ.3,669ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, కంకోల్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా తిరు కల్యాణం రామచంద్రాపురం(పటాన్చెరు): స్థానిక డివిజన్ పరిధిలోని కాకతీయనగర్ కాలనీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆంజయ్య, పుష్ప, నాయకులు ఐలేష్, పరమేష్ పాల్గొన్నారు. నూతన బోరు ప్రారంభం నారాయణఖేడ్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పేట్ 3వ వార్డులో కౌన్సిలర్ స్వప్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే బోరువేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయం సాధించడంతో ఇచ్చిన హామీమేరకు వార్డులో బోరును ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం మోటా రు బిగించి పూజ చేసి వార్డు పెద్దలు, కాలనీవాసులతో కలిసి బోరును ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీత గ్రంథాల పంపిణీ జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని వాబిలాలలో ఆదివారం నగరానికి చెందిన త్రైత సిద్ధాంత ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామస్తులకు భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ గిరి ఇంటింటికి వెళ్లి త్రైత సిద్ధాంత జ్ఞాన గ్రంథాలపై ప్రచారం చేశారు. దైవ జ్ఞానం ప్రకారం కులాలు, మతాలు నిషిద్ధమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. భగవద్గీతలోని సారాన్ని కర్మయోగంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కుమార్, నరసింహాచారి, శ్రీనివాస్, నరసింహారావు ప్రదం అశోక్, అంజి, వీరన్న, చంద్రకళ, నాగమణి, లక్ష్మీ, పద్మ, స్వప్న పాల్గొన్నారు. కార్యదర్శికి సన్మానం రామాయంపేట(మెదక్): గ్రామాభివృద్ధిలో ప్రగతి ధర్మారం కార్యదర్శి మహేందర్ ఎనలేని కృషి చేసి అందరి మన్ననలు పొందారు. ఇటీవల ఆయన బదిలీ కాగా ఆదివారం ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు బదిలీలు సహజమే
చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగులకు బదిలీలు సహజమేనని, అయినా చేసిన పనులే గుర్తింపునిస్తాయని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. ఆదివారం స్థానిక డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ ప్రదీప్రెడ్డి బదిలీవ్వగా.. సిబ్బంది అత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన వారు చేసిన సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వాసుదేవ్, సిబ్బంది పాల్గొన్నారు. టీఎన్జీఓ నరేందర్ -
జల్సాలకు అలవాటై చోరీలు
జహీరాబాద్ టౌన్: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జహీరాబాద్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే మూడు తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ లవకుమార్తో కలిసి డీఎస్పీ సైదానాయక్ కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించోళి తాలుకా గరగపల్లి గ్రామానికి చెందిన అమ్రేశ్(22) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. పగలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి విగ్రహం వద్ద ఎస్ఐ.లవకుమార్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించారు. పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలు చేశానని నేరం అంగీకరించాడు. దీంతో అతడ్ని కోర్టులో రిమాండ్ చేశారు. కేసు ఛేదించిన ఎస్ఐ లవకుమార్, పోలీసు సిబ్బంది నర్సింహులు, పృథ్వీ, హరినేత్రలను డీఎస్పీ అభినందించారు. నిందితుడి అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం -
ఓటర్ మ్యాపింగ్ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోమవారంతో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ముగియనుందని, అర్హులైన ఓటర్లంతా తప్పనిసరిగా ఓటరు మ్యాపింగ్ చేసుకోవాలని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు సూచించారు. ఆదివారం పట్టణంలోని జంబికుంట వీధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవాలన్నారు. లేదంటే ఓట్లు తొలగింపబడతాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ అనంతరం ఇంకా మ్యాపింగ్ చేసుకోని ఓటర్లకు నమోదు పత్రాలు ఇస్తామని, వాటి ద్వారా సరి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ హత్నూర(సంగారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. హత్నూర మండలం బోరుపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు రైస్మిల్లును శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లుకు వెళ్లిన ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేసి కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఉందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే మాత్రం అధికారులతోపాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆయనతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ జైశ్రీలాల్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, డీటీ కర్ణాకర్రావు, సీఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
సీహెచ్సీ ప్రారంభించాలని మంత్రికి విజ్ఞప్తి
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన సీహెచ్సీ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని శనివారం హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనరసింహాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్ల పోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు. సీహెచ్సీ నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించి వినియోగంలోనికి తెస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. దీంతోపాటు కౌడిపల్లి గ్రామానికి సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గుప్త, నాయకులు పుండరీకంగౌడ్, మల్లికార్జున్గౌడ్, భూమయ్యపటేల్, వెంకటేశం, దేవెందర్, రమేశ్, ఆరిఫ్, కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు
● త్వరలోనే షెడ్యూల్ ● ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకంనారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది. మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మిక నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇటీవల పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా..కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల అనంతరం సమ్మె విరమించిన విషయం విదితమే. ఇచ్చిన హామీమేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో రిటర్నింగ్ అధికారిగా జంట నగరాల కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ను నియమించింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పోలింగ్ తేదీలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. రీజియన్లో కదలిక.. ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వం, కమిటీ చర్చలు జరిపిన తర్వాతనే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగనుంది. తమను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు చేస్తున్న పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగిరావడం, విలీన ప్రక్రియకు ఎన్నికల నగారాకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. కాగా, మెదక్ రీజియన్ పరిధిలో సైతం కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రీజియన్లో తెలంగాణ మజ్దూర్ యూనియర్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనియన్లలోనే సభ్యత్వ నమోదు గతంలో అధికంగా జరిగేది. 1,950 మంది కార్మికులకు ప్రయోజనం మెదక్ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ కండక్టర్లు 1,014, డ్రైవర్లు 508, మెకానిక్లు, ఏడీసీ, సూపర్వైజర్లు, డీఎం ఆఫీస్స్టాఫ్ తదితరులు కలిపి 428 మందిగా మొత్తం రెగ్యులర్ కార్మికులు 1,950 మంది కొనసాగుతున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ జరిగాక ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించనున్నారు. -
అందమైన అడవోయి.. ఆహ్లాదం అందెనోయి
208 ఎకరాల్లో అర్బన్ పార్కు నిర్మాణం ● రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు మంజూరు ● త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత ప్రజలు ఆహ్లాదం పొందేందుకుగాను అర్బన్ పార్క్ సిద్ధమైంది. దీంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో సేదతీరనున్నారు. ఈ పార్కు మున్సిపాలిటీ వాసులతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65వ జాతీయ రహదారి పక్కనే 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఆరేళ్లకు మోక్షం జహీరాబాద్ పట్టణ శివారులో 65వ జాతీయ రహదారి పక్కన గల మహీంద్ర కర్మాగారం సమీపంలో ఉన్న రిజర్వు ఫారెస్టు భూమిలో ఎకోపార్కు (అర్బన్ పార్కు) రూపొందించేందుకు ఆరేళ్ల క్రితం రూ.4 కోట్లను మంజూరు చేసింది. అయితే నిధుల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను రూ.2కోట్ల నిధులను విడుదల చేసింది. 208 ఎకరాల భారీ విస్తీర్ణంలో లంగ్ స్పేస్(పచ్చని ఊపిరితిత్తులు)గా మార్చాలని సంకల్పించారు. నిధులు సరిపోని కారణంగా పనుల్లో స్తబ్దత ఏర్పడటంతో అటవీశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో పనుల్లో కదలిక వచ్చింది. కాంపన్సేటరీ అఫ్పారెష్ట్రేషన్ (సీఏఎంపీఏ) నిధుల నుంచి రూ.55 లక్షలు కేటాయించడంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యాయి. ప్రజలకు హెల్త్ హబ్గా... ప్రజలకు ఆహ్లాదం పొందేందుకు వీలుగా రూపుదిద్దుకున్న అర్బన్ పార్కు హెల్త్ హబ్గా మారనుంది. ఉదయం పూట వాకింగ్ చేసే వారి కోసం ప్రశాంతమైన నడకదారులు, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా యోగా కేంద్రం, పిల్లలు ఉత్సాహం–ఉల్లాసంగా గడిపేందుకు ప్లే ఏరియాలను రూపొందించారు. పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రదర్శనలు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. పార్కులో చేపట్టిన నిర్మాణాలు.. అర్బన్ పార్కు సందర్శనకు వచ్చే వారికి పలు సౌకర్యాలను కల్పించారు. రూ.22 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. రూ.15లక్షలతో వాచ్ టవర్, రూ.90 లక్షలతో మూడు కిలోమీటర్ల ఇనుప కంచె నిర్మాణం, రూ.6.70 లక్షలతో ప్రధాన ముఖద్వారం, వాచ్మెన్ గది, రూ.9.24లక్షలతో మోగా షెడ్డు, రూ.3.50 లక్షలతో సోలార్ బోరు, రూ.14 లక్షలతో పిల్లల ఆటస్థలం, రూ.2లక్షలతో నాలుగు రచ్చబండల ప్లాట్ఫాంలను ఏర్పాటు చేశారు. అందాలను ఆస్వాదించేలా.. రిజర్వు ఫారెస్టులోని అందాలను ఆస్వాదించేందుకు వీలుగా అర్బన్ పార్కును తీర్చిదిద్దాము. ఇది జహీరాబాద్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా కృషి చేస్తాం. ఉన్న నిధులతో సౌకర్యాలను కల్పించాం. అందుబాటులోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేశాం. –శ్యాంసుందర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్–జహీరాబాద్ -
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలే
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ జహీరాబాద్ టౌన్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ డీలర్లను సూచించారు. రైతువేదికలో శనివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడానికి డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను రైతులు యాప్ ద్వారా పొందాలని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులను చైతన్య పరచాలన్నారు. -
రేపు నిజాంపేటలో చేపప్రసాదం పంపిణీ
నారాయణఖేడ్: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తె పురస్కరించుకుని నిజాంపేట్ మండల కేంద్రంలో ఈనెల 8న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు లింగాగౌడ్, పర్వాగౌడ్, నాగరాజుగౌడ్, శంకర్గౌడ్, వెంకటేశ్గౌడ్, సాయిబాబాగౌడ్ పేర్కొన్నారు. గత 81 ఏళ్లుగా తమ కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నామన్నారు. ఏటా ప్రసాదం కోసం తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి సైతం పెద్దసంఖ్యలో వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలిఝరాసంగం(జహీరాబాద్): గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చిలకపల్లిలో శనివారం నిర్వహించిన గ్రామసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఇష్టానుసారంగా పారేయరాదని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు సహకరించాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, తహసీల్దార్ భాస్కర్, గ్రామ సర్పంచ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఖేడ్ను ఐటీడీఏగా గుర్తించాలినారాయణఖేడ్: జిల్లాలోకెల్ల అత్యధిక గిరిజన జనాభా ఉండి అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమైన ఖేడ్ను ఐటీడీఏగా గుర్తించాలని ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేశ్సింగ్ డిమాండ్ చేశారు. ఖేడ్ నియోజకవర్గంలోని పలు గిరిజన తండాల్లో శనివారం గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..ఉపాధి కరువై ఇక్కడి గిరిజనులు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ఐటీడీఏగా ఏర్పాటుచేసి ఇక్కడి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. పలువురు ఫోరం బాధ్యులు పాల్గొన్నారు. డాక్టర్ పుట్టరాజుకు ఫ్రెండ్ ఆఫ్ కర్ణాటక అవార్డురామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ఆర్.పుట్టరాజుకు ఫ్రెండ్ ఆఫ్ కర్ణాటక అవార్డు లభించింది. బెంగళూరులో శుక్రవారం కళాగ్రామంలో కన్నడ సామాజిక, సాంస్కృతిక శాఖ సహకారంతో కన్నడ మీడియా క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో నటుడు చేతన్అహింస చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం భెల్ కాలనీలో ఆయనను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో పుట్టరాజు మాట్లాడుతూ..అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మద్యం అమ్మకాలపై నిషేధం చేగుంట(తూప్రాన్): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్లో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పాల్గొని ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. -
చిరుధాన్యాల విక్రయ కేంద్రానికి సహకారం
కలెక్టర్ ప్రతీక్జైన్ జహీరాబాద్ టౌన్: చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల విక్రయ కేంద్రం (రిటైల్ యూనిట్)సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని కలెక్టర్ ప్రతీక్జైన్ హామీనిచ్చారు. డీడీఎస్ మహిళా రైతులు సేంద్రియ ఎరువులతో సిరిధాన్యాలు పండించడం అభినందనీయమన్నారు. యూఎన్డీపీ–బయోఫిన్ సంయుక్తంగా జహీరాబాద్ పట్టణ సమీపంలోని డీడీఎస్, కేవీకేలో శనివారం నిర్వహించిన అగ్రోబయోడైవర్సిటీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. ఎరువుల కొరత సమస్య నుంచి కూడా బయటపడతామని వివరించారు. అంతకుముందు కలెక్టర్ డీడీఎస్–కేవీకే ప్రదర్శించిన చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించారు. -
చేపల పంచాయితీ
పెద్ద చెరువువద్ద హైటెన్షన్వట్పల్లి(అందోల్)/అల్లాదుర్గం (మెదక్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, అల్లాదుర్గ్ మండల పరిధిలోని గడిపెద్దాపూర్ గ్రామాల మధ్య విస్తరించి ఉన్న పెద్దచెరువు వద్ద శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు ఇలా... చెరువులో చేపలు పట్టే హక్కు గడిపెద్దాపూర్ గ్రామానికి ఉండటంతో, తమకు దక్కాల్సిన వాటా ప్రకారం సభ్యత్వం కల్పించాలని కన్సాన్పల్లి మత్స్యకారులు గతంలో అధికారులను ఆశ్రయించారు. కాగా 33 మందికి పెద్దాపూర్ మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని గతేడాది అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వారిని సంఘంలో చేర్చుకునే విషయమై పెద్దాపూర్ మత్స్యకారులు వ్యతిరేకించారు. సంఘంలో చేర్చుకోకుంటే వాళ్లు కూడా చేపలు పట్టేది లేదని అధికారులకు కన్సాన్పల్లి మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపూర్ మత్య్సకారుల నుంచి అధికారులు చెరువు పన్ను తీసుకోలేదు. అధికారుల తీరును తప్పుబడుతూ వారు హైకోర్టును ఆశ్రయించి చేపలు పట్టేందుకు అనుమతి తీసుకున్నారు. చెరువు వద్ద హైడ్రామా.. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకే చేపలు పట్టే హక్కు ఉందని పెద్దాపూర్ మత్స్యకారులు శనివారం పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు కన్సాన్పల్లి మత్స్యకారులు కూడా చెరువు వద్దకు వచ్చారు. విషయం తెలిసిన జోగిపేట సీఐ అనీల్కుమార్, అల్లాదుర్గ్ సీఐ రేణుక ఆధ్వర్యంలో పుల్కల్, వట్పల్లి, జోగిపేట పోలీస్స్టేషన్ బల గాలు చెరువు వద్ద మోహరించాయి. వీరితో పాటు మత్స్యశాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఇరు గ్రామాల మత్స్యకారులను పిలిపించి మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమకే చేపలు పట్టేహక్కు ఉందని పెద్దాపూర్ పట్టుబట్టగా, అధికారిక ఉత్తర్వుల ప్రకారం తమకు సంఘంలో సభ్యత్వ వాటా ఇస్తేనే చేపలు పట్టనిస్తామని కన్సాన్పల్లి మత్స్యకారులు అనడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు కలుగజేసుకొని ఇరు గ్రామాల మత్స్యకారులతో గంటపాటు చర్చలు జరిపారు. రెండు రోజుల సమ యం తీసుకొని, మాట్లాడుకొని సామరస్య ధోరణితో ముందుకెళ్లాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జోగిపేట, పుల్కల్, వట్పల్లి ఎస్ఐలు పాండు,విశ్వజన్, శ్రీహరి, ఏఎస్ఐలు అంజయ్య, గౌస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులేమన్నారంటే..
ఈ మట్టి తవ్వకాలకు అక్రమ అనుమతుల జారీ విషయమై నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ను ‘సాక్షి’ప్రతినిధి ఫొన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఆర్డీఓ రామకృష్ణను వివరణ కోరగా..అనుమతుల మంజూరుకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు కావాలంటే నీటిపారుదలశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీతను సంప్రదించగా తాను బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఇచ్చి ఉండవచ్చని, ఫైల్ తెప్పించుకుని వివరాలు తెలుసుకుంటానన్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మంతూరు పోచంపెద్ద చెరువులో పది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు స్థానిక అధికారులు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టారు. వాల్టా చట్టాన్ని, పర్యావరణ నిబంధనలను చెరువులోనే తొక్కేసి ఇచ్చిన ఈ అనుమతుల జారీ వెనుక ఆయా శాఖల అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనేది బహిరంగ రహస్యం. ఈ అడ్డదారిలో పొందిన అనుమతులను ఆసరాగా చేసుకుని ఇక్కడ విచ్చలవిడిగా మట్టి దందా సాగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ కెపాసిటీ కలిగిన జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. ఎన్ని క్యూబిక్మీటర్లు తరలిస్తున్నారనేది లెక్కపెట్టే నాథుడే లేకుండా నిత్యం వందలాది భారీ టిప్పర్లలో విలువైన సహజ సంపదను తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పెద్ద చెరువులోనూ 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో పెద్ద చెరువు గర్భాన్ని తొలిచేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మట్టి అక్రమ దందా మూడు జేసీబీలు..ఆరు టిప్పర్లు అన్నట్లు సాగుతోంది. దొడ్డిదారిన తీసుకున్న నామమాత్ర అనుమతుల పేరుతో రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రీ పగలు తేడా లేకుండా చెరువులను తొలిచేస్తున్నారు. హై కెపాసిటీ కలిగిన జేసీబీలు, ప్రొక్లయినర్లను దించి చెరువులను తొలిచేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో మట్టిని నింపి తరలిస్తున్నారు. అడ్డదారిలో తరలిస్తున్న ఈ మట్టి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.ఇటుక బట్టీలకు తరలింపు.. నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి (సిల్ట్) తవ్వుకోవాలంటే రైతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మట్టిని పొలాల్లో వేసుకుని ఎరువులాగ వాడుకుంటారు. రైతులకు మినహా ఇటు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ గనుల శాఖ నుంచి క్వారీ అనుమతులు మంజూరు చేయించుకోవాలి. అక్కడి నుంచి తరలించే ప్రతీ మట్టి టిప్పర్కు సీనరేజీ చెల్లించి వేబిల్లులతో మట్టిని రవాణా చేయాలి. కానీ గనుల శాఖ నుంచి క్వారీ లీజు మంజూరు లేకుండానే తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీఎంఎఫ్టీకి నామమాత్రంగా డబ్బులు చెల్లించి రూ.కోట్లు విలువ చేసే సహజ సంపదను లూఠీ చేస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ మట్టి అక్రమ దందాకు నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు ప్రత్యక్షంగానే సహకరిస్తుండటం వెనుక రూ.లక్షల్లో ముడుపులే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యథేచ్ఛగా మట్టి దందా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం అల్వ చెరువును కూడా లూఠీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకునే అనుమతులు కట్టబెట్టేందుకు అధికారులు పావులు కదుపుతున్నా రు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమై తెరలేపిన ఈ మట్టి దందా కోసం పాత తేదీల్లో వేలం పాట నిర్వ హించినట్లు రికార్డులు సృష్టించారు. రూ.లక్షల్లో మట్టి ముడుపుల పంపకాలు బయటకుపొక్కడంతో ఈ రెండు పార్టీల్లోని ఒక ప్రత్యర్థివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు గ్రామస్తులు ఈ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదులు చేశారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగితే అడ్డుకున్నారు. అధికార యంత్రాంగం ఇప్పుడు అడ్డదారిలో అనుమతులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్సాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనులు వేగవంతం చేసి ఈ నెల 10లోపు కేంద్రాలను మూసి వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం స్థానికంగా మూతపడిన షుగర్ కంపెనీలోని గోదాంను పరిశీలించి మాట్లాడారు. మండలంలోని అన్ని కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్కు సూచించారు. తూకం వేసిన ధాన్యంను కేంద్రాల నుంచి గోదాంలకు తరలించాలని, లారీలు సరిపోకపోతే ప్రైవేటు వాహనాలు సమకూర్చుకొని వడ్ల బస్తాలు తరలించాలని అవసరమైతే హమాలీలను పెంచుకోవాలన్నారు. కాగా మండలంలో చేపడుతున్న కొనుగోలు వివరాలను ఆర్డీఓ, తహసీల్దార్ ఆయనకు వివరించారు. -
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
ఎస్పీ పరితోశ్ పంకజ్ కొండాపూర్(సంగారెడ్డి): సైబర్ నేరగాళ్లు వేసే వలలో ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు వహించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మండల పరిధిలోని గొల్లపల్లి లో నిర్వహించిన గ్రామసభలో జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు మొదట కొంత డబ్బు వచ్చినట్లు చూపించి, అనంతరం భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి మోసా లకు పాల్పడుతున్నారని వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, తెలియ ని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవద్దన్నారు. సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉన్నారని, వీటిపై అవగాహన పెంచుకుని గ్రామస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న వివిధరకాల నేరాలు, పోక్సో, అత్యాచార కేసుల్లో భరోసా కేంద్రం పనితీరు, మహిళల రక్షణ కోసం షీ–టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నివారణ చర్యలు, అత్యవసర సేవల వినియోగం తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి సంగారెడ్డి జోన్: విద్యార్థులు పోటీ పరీక్షలకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోశ్పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పార్క్ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వారి పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు కృషి, పట్టుదలతో ఉన్నతలక్ష్యాలను అధిరోహించాలన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. ఉన్నత ఉద్యోగాల సాధనకు కృషి, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులను సాధించిన డిప్యూటీ కలెక్టర్ మురళి మాధినేని, ట్రైనీ డీఎస్పీ సుజాత, ఎంబీబీఎస్ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూ ఐఆర్ఎస్ సాధించిన ప్రత్యూష తమ విజయాల తీరును వివరించారు. -
ఈసీ మార్గదర్శకాలు పాటించాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డిసంగారెడ్డి జోన్: ఈవీఎంలు, ఇతర ఎన్నికల పరికరాల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఈవీఎం గోడౌన్ను శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి కలెక్టరేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ..సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం గోడౌన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, మాస, త్రైమాసిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సామగ్రి భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంగీత, ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జైరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
గిన్నిస్ రికార్డు కోసం పరుగు
తూప్రాన్: గిన్నిస్ రికార్డు కోసం ఓ మహిళ 5 వేల కిలోమీటర్ల పరుగు ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సూఫీ సోఫియా కన్యాకుమారి నుంచి కరంకోరం వరకు చేపట్టిన ‘రన్ ఫర్ డ్రీమ్స్’ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వేల కిలోమీటర్లను 80 రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 26 రోజులు పూర్తయినట్లు తెలిపారు. రోజుకు 50 నుంచి 70 కిలోమీటర్లు పరుగెత్తుతున్నట్లు వివరించారు. స్వాగతం పలికిన వారిలో గజ్వేల్ రన్నర్స్ రమేశ్ గౌడ్, మధుసూదన్, నరేశ్, కిరణ్ ఉన్నారు. -
విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్
● కుమారుడికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కోసం డిమాండ్ ● పోలీసుల చొరవతో కిందకు.. చేగుంట(తూప్రాన్): ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేసి , తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మారబోయిన నర్సింహులుకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు అనీల్ మృతి చెందాడు. చిన్న కుమారుడు అరుణ్ చదువుకున్నా ఉపాధి కోసం కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరుతూ వస్తున్నాడు. శనివారం గ్రామ శివారులో విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సాయంత్రం వరకు టవర్ దిగకపోవడంతో రామాయంపేట సీఐ సైదా, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి గ్రామానికి చేరుకొని నర్సింలుకు నచ్చజెప్పినా వినలేదు. ఎంపీడీఓతో మాట్లాడి రెండో విడతలో నర్సింలుకు ఇల్లు మంజూరీ చేయాలని కోరారు. గ్రామ సమీపంలోని ఓ ఫార్మా పరిశ్రమలో అరుణ్కు ఉపాధి కల్పించాలని పరిశ్రమ నిర్వాహకులతో సీఐ మాట్లాడారు. దీంతో శాంతించిన అతడు టవర్పై నుంచి కిందికి దిగాడు. గ్రామస్తులు పోలీసులు ఊపిరి పీల్చుకుని నర్సింహులును ఇంటికి పంపించారు.సెల్ టవర్ ఎక్కిన నర్సింహులు -
మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి
సిద్దిపేటకమాన్: మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం... పట్టణంలోని బోయిగల్లికి చెందిన రాములుగౌడ్ (52) స్థానికంగా లాల్కమాన్ ప్రాంతంలో పానీపురి దుకాణం నిర్వహిస్తున్నాడు. రాములుగౌడ్ శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు శనివారం వేములవాడ కమాన్కు సమీపంలో ఉన్న ఓ వైన్షాప్ పర్మిట్ రూమ్ సమీపంలో మురుగునీటి కాల్వలో రాములుగౌడ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో మురుగు కాలువలో పడి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు భానుప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కొత్త వెర్షన్లో ఎరువుల బుకింగ్ యాప్
జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎరువుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వెర్షన్లో ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ను రూ పొందించినట్లు, జిల్లా వ్యవసాయశాఖ అధి కారి స్వరూపరాణి శనివారం తెలిపారు. ప్రస్తు త వానాకాలం పంట సీజన్న్ను పురస్కరించుకొని రైతులందరికీ యూరియా, ఇతర రసాయన ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ వెర్షన్ యాప్ను అందుబాటులో తీసుకువచ్చిందన్నారు. అందువల్ల రైతులు గతంలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు నూతనంగా మంజూరైన 86 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయు రాలు, ఆయాలుగా విధులు నిర్వహించడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. బోధకులకు గౌరవ వేతనం రూ.8 వేలు, ఆయాలకు రూ.6వేల వేతనం అందించనున్నారు. అర్హత కల్గిన మహి ళా అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 12న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. స్కాలర్షిప్కు ఏడుగురు విద్యార్థులు ఎంపిక చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ వాణికుమారి తెలిపారు. మోడల్ స్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గౌతమ్, బిస్వంత్, భగవత్, దీక్షిత్, పావణి, మాధవి ఎంపికై నట్లు తెలిపారు. వీరికి నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందనుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆమె అభినందించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిజిల్లా వైద్యాధికారి డాక్టర్.లలితా దేవి రామచంద్రాపురం(పటాన్చెరు): సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్.లలితా దేవి అన్నారు. శనివారం రామచంద్రాపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రికార్డులు, నమోదు పుస్తకాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డా.కల్పన తదితరులున్నారు. యువకుడికి దేహశుద్ధి శివ్వంపేట(నర్సాపూర్): వివాహిత స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో వీడియో తీసిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహితను మూడు నెలల నుంచి ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు సాదు సురేశ్ వేధి స్తున్నాడు. శుక్రవారం ఆ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా సురేశ్ సెల్ఫోన్లో వీడియో తీయడంతో గమనించిన ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో సురేశ్ కోసం వెతికారు. కాగా రాత్రి 10 గంటలకు ఇంటికి రావడంతో ప్రశ్నించగా నేను తీయలేదని చెప్పా డు. దీంతో సెల్ఫోన్ చెక్ చేయగా వీడియో ఉండటంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్రెడ్డి తెలిపారు. -
18 మందికి రూ.63లక్షల జరిమానా
సంగారెడ్డి: నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపుల నుంచి తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల నమూనాలు సేకరించారు. వివిధ రకాల 18 మంది వ్యాపారులకు రూ. 63 లక్షల తొమ్మిది వేల జరిమానాను జిల్లా అదనపు కలెక్టర్ సంగీత విధించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపితే టెస్టింగులో నాణ్యత ప్రమాణాలు లోపించాయని పేర్కొన్నారు. దీంతో బాధ్యులకు పెనాల్టీ విధించారని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేశ్ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టునర్సాపూర్: గంజాయి అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం... నర్సాపూర్లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన నరేశ్గౌడ్, మండలంలోని రెడ్డిపల్లికి చెందిన నరేశ్ ఇతర ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని స్థానిక పిల్లల పార్కు ఏరియాలో శనివారం అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండుకు పంపించారు. వారి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఓఆర్ఆర్పై కారు దగ్ధంజిన్నారం (పటాన్చెరు): ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన బొల్లారం పరిధిలోని ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది. గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్కు చెందిన స్కార్పియో కారు మేడ్చల్ నుంచి సుల్తాన్పూర్ వస్తుండగా కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం హద్నూర్ పోలీస్ స్టేషన్లో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ సీఐ హన్మంతు, ఎస్ఐ సుజిత్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మండల పరిధిలోని తేజమ్మ పొలం వద్ద పనులు చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు బెదిరించి మెడలో ఉన్న తులంన్నర బంగారం, చెవుల కమ్మలు, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. అనంతరం బసంత్పూర్లో పొలం వద్ద పనులు చేస్తున్న హిందూమతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం గంగ్వార్ చౌరస్తా వద్ద హద్నూర్ ఎస్ఐ సుజిత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బీదర్ వైపు నుంచి పల్సర్పై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండా వెంబడించి పట్టుకున్నారు. నిందితులను విచారించగా ముంగి, బసంత్పూర్ గ్రామ శివారులో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితులు బీదర్ జిల్లా చొండి తండాకు చెందిన అశోక్ ట్రాక్టర్ డ్రైవర్ కాగా, సురేశ్ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా సంపాదించే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడంతో చోరీల బాటపట్టారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి తులంన్నర బంగారం, రూ.15వేలు నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు పలు చోరీ కేసుల్లో సైతం జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. బంగారం, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన జహీరాబాద్ డీఎస్పీ -
విధులు ముగించుకొని వస్తుండగా..
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మహిపాల్ శివంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని రాత్రి బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ శివారులో సీడ్ కంపెనీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీ ఒక్కసారిగా దూసుకొచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిపాల్ లారీ కింద ఇరుక్కుపోయి గంటసేపు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ఐదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం కోమటిపల్లిలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మృతుని కుటుంబానికి అంత్యక్రియలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఎస్ఐ బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొట్టడంతో మహిళ.. నంగునూరు(సిద్దిపేట): ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ పైనుంచి కారు దూసుకెళ్లడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బడే లక్ష్మి (54) వేసవి కావడంతో రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంటి ముందు పడుకుంది. ఈ క్రమంలో మద్దూర్కు చెందిన సలాది హరికృష్ణ కారులో వేగంగా వెళ్తూ ఆరుబయట నిద్రిస్తున్న లక్ష్మిపై నుంచి వెళ్లాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లుడు అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా బాలుడు.. చిలప్చెడ్(నర్సాపూర్): అనుమానాస్పదంగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ రాములు వివరాల ప్రకారం... కౌడిపల్లి మండలం, పీర్ల తండాకు చెందిన దలావత్ వినోద్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే తండాకు చెందిన దలావత్ సిద్ధార్థకు చిలప్చెడ్ గ్రామంలో బైక్ మెకానిక్ షాపు ఉంది. సెలవులు కావడంతో సిద్ధార్థతో కలిసి, వినోద్ చిలప్చెడ్ మెకానిక్ షాపునకు వచ్చాడు. ద్విచక్ర వాహనాలను కడిగే పైపు సహాయంతో వినోద్, తన బట్టలు ఉతుక్కునే క్రమంలో అకస్మాత్తుగా కిందపడ్డాడు. గమనించిన సిద్ధార్థ చుట్టు పక్కల వారి సహాయంతో వినోద్ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాగా వినోద్ తండ్రి మదన్, సిద్ధార్థను ఆరా తీయగా ఫిట్స్ వచ్చి కిందపడ్డాడని తెలిపాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి -
రాయరావు చెరువుకు మహర్దశ
నర్సాపూర్: స్థానిక రాయరావు చెరువులో బోటింగ్తో పాటు చెరువును సుందరీకరణ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యాటకంగా మరో అడుగు పడనుంది. ఇప్పటికే అటవీ శాఖ స్థానిక అడవుల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేయగా, సందర్శకుల తాకిడితో సందడిగా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నర్సాపూర్ 50 కిలోమీటర్ల చేరువలో ఉంది. నర్సాపూర్, హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న శివారులోని అడవుల్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన అర్బన్ పార్కుకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పార్కు సమీపంలోని అడవులను ఆనుకుని రాయరావు చెరువు ఉంటుంది. చెరువుకు ఒక వైపు రెండు పెద్ద గుట్టలు ఉంటాయి. అవి ఎప్పుడు పచ్చని చెట్లతో దర్శనమిస్తున్నాయి. చెరువులో బోటింగ్ వసతి ఏర్పాటు చేస్తే చెరువును ఆనుకుని ఉన్న గుట్టలు పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి.నర్సాపూర్ రాయరావు చెరువు పర్యాటకంగా అభివృద్ధి బోటింగ్, సుందరీకరణకు నిధులు మంజూరు సుందరీకరణకు నిధులు.. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి కృషితో ప్రభుత్వం చెరువులో బోటింగ్ ఇతర సదుపాయాలు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. కాగా చెరువులో బోటింగ్ సదుపాయం, చెరువు సుందరీకరణ, కట్టపై వాకింగ్ ట్రాక్, మొక్కలు పెంచడం, లైటింగ్ సదుపాయం, పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సదుపాయాలు కల్పించాలని పర్యాటక శాఖ సూచించింది. -
వంటగ్యాస్ కోసం తోపులాట
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో భారత్ గ్యాస్ కార్యాలయం వద్ద గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారుల మధ్య శనివారం తోపులాట చోటు చేసుకుంది. కొద్ది నెలలుగా వంట గ్యాస్ కొరత ఏర్పడటంతో ఆన్లైన్ బుకింగ్తోపాటు వినియోగదారులకు ఓటీపీ విధానంతో గ్యాస్ను సరఫరా చేస్తున్నారు. అయినా సింగిల్ సిలిండర్ ఉన్న వారు గ్యాస్ అయిపోగానే వంటగ్యాస్ తక్షణం అవసరం ఉండటంతో సిలిండర్ బుక్ చేసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ సిలిండర్ ఉన్నవారికి 35 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులకే బుక్ అవుతుందని పేర్కొంటున్నా.. 45 రోజుల తర్వాతనే బుక్ అవుతుందని వినియోగదారులు వాపోయారు. కాగా వంటగ్యాస్ కోసం భారత్గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన ప్రజలు సిలిండర్ల బుకింగ్ కోసం కార్యాలయం వద్ద తోపులాటకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్ మహిపాల్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. ఖేడ్లో 35వేల కనెక్షన్లు ఉన్నాయని, నిత్యం 342 సిలిండర్లు సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతం 1,500 మంది బుక్ చేసుకున్న వారు వెయిటింగ్లో ఉన్నారని తెలిపారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
తొగుట(దుబ్బాక): అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని లింగాపూర్లో శణివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తొంట నర్సింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారికున్న ఎకరం వ్యవసాయ భూమిని సాగు చేస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఏడాది బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేసి పెద్ద కూతురు వివాహం చేశారు. అలాగే ఇళ్లు నిర్మించుకున్నారు. కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి సుమారు రూ.10లక్షలు అయ్యాయి. ఈ క్రమంలో అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని వేధించడంతో తీర్చేమార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పివెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే కుటుంబీకులు 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు. -
సంత.. తీరిన చింత
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామంలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న వారాంతపు సంతకు విశేష స్పందన లభిస్తోంది. సంతలో అన్ని వస్తువులు లభిస్తుండటంతో ప్రజలకు పట్టణానికి వెళ్లే బాధ తప్పింది. మల్చెల్మతోపాటు పరిసర గ్రామాల ప్రజలు కనీసం కూరగాయలు కొనుగోలు చేసేందుకు సైతం జహీరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ సర్పంచ్తోపాటు పెద్దలు నిర్ణయించి వారాంతపు సంత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారాంతపు ప్రారంభించగా తాజా కూరగాయలతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు, పనిముట్లు, బట్టలు, ప్లాస్టిక్ సామగ్రి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు కొనుగోళ్లకు సంతకు రావడంతో మంచి స్పందన వస్తుంది. వారాంతపు సంత వల్ల తమ చింత తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్రిక్తతల మధ్య పాన్డబ్బాకు తాళం
నర్సాపూర్: ఉద్రిక్తతల మధ్య ఆక్రమించి నిర్మించిన పాన్షాపు, షెడ్డుకు రెవెన్యూ శాఖ, పోలీసుల సహాయంతో ఆర్టీసీ అధికారులు శుక్రవారం తాళం వేశారు. వివరాలిలా.. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ను ఆనుకుని నిర్మించిన షెడ్డును స్వాధీనం చేసుకోవాలని ఇటీవల జిల్లా కోర్టు ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపో ఆఫీస్ సూపర్వైజర్ రాధాకృష్ణ, స్థానిక డిపో ఇన్చార్జి లక్ష్మణ్ మండల ఆర్ఐ ప్రభాకర్, పోలీసుల సహాయంతో షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేయడానికి వెళ్లగా యజమాని షర్పోద్దీన్ అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పగా షర్పోద్దీన్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా అక్కడే ఉన్న పోలీసులు ఇతర అధికారులు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఆర్టీసీ ఉద్యోగులు జీవీగౌడ్, శ్రీనివాస్, రాథోడ్ తదితరులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పర్యావరణాన్ని పెంపొందించడంతోపాటు వనమహోత్సవం లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం(పటాన్చెరు): జీవితాంతం కార్మికుల సంక్షేమం, తెలంగాణ కోసం ఆలోచించిన నిస్వార్థ నాయకుడు జి.ఎల్లయ్య అని అందుకే నేడు పార్టీల కతీతంగా అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని మాజీమంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జీ బ్లాక్లో శుక్రవారం జరిగిన కార్మిక నేత జి.ఎల్లయ్య 85వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్లయ్య కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లయ్య కార్మిక నాయకుడిగానే కాకుండా చివరిశ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడన్నారు. భెల్ పరిసర ప్రాంతంలో ఆయన పేరు తెలియని వారు లేరని, ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన జాతీయస్థాయి కార్మిక నేతగా ఎదిగారని వివరించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన ఎల్లయ్య విగ్రహం ఆయన స్థాయికి తగినట్టుగా లేదని త్వరలోనే మంచి స్థలంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దాని బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇస్తున్నట్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్రావు రామచంద్రాపురం(పటాన్చెరు): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, తెల్లాపూర్ను ప్లాస్టిక్రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎంపీ ఎం.రఘునందన్రావు పిలుపునిచ్చారు. తెల్లాపూర్ డివిజన్లో శుక్రవారం సాయంత్రం తేనా గ్రీన్ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగిన అనర్థాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఐటీ ఉద్యోగులు పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ఆర్మీ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించడం హర్షదాయకమన్నారు. కార్యక్ర మంలో దిశ కమిటీ సభ్యడు కాసర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్: పటాన్చెరుకు చెందిన వర్షిణీరెడ్డి ఐదేళ్ల లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకుంది. కేవలం నెలరోజుల పాటు ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఘనత సాధించినట్లు ఆమె వెల్లడించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తండ్రి కొల్కూరి శంకర్సేన్రెడ్డి కోరిక మేరకు లాసెట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపింది. వర్షిణీరెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మనవరాలు కావడం విశేషం. -
అయ్యో పాపం
దుబ్బాక: తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయస్సులో మాయదారి రోగం బారిన పడి ఆరేండ్ల చిన్నారి ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తిపాస్తులు అమ్మి ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. దీంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవ్వడంతో ఆ తల్లిదండ్రులు సాయం చేయాలని దాతలను వేడుకుంటున్నారు. దినదిన గండంగా చిన్నారి.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన శివాంది లింగం, లాస్య దంపతులకు కొడుకు, కూతురు రియాన్షిక(6) ఉన్నారు. లింగం ప్రైవేట్ ఉద్యోగి. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబం. ఈ క్రమంలో రియాన్షిక పుట్టిన నెల రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు పరీక్షించి అరుదైన వ్యాధి తలసేమియాగా గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆ చిన్నారి దినదిన గండంగా మంచానికి పరిమితమై ప్రాణాపాయ స్థితిలో కాలం గడుపుతోంది. బిడ్డను కాపాడుకునేందుకు చిన్నారి తల్లిదండ్రులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ఉన్న ఆస్తిని అమ్మి, అప్పులు చేసి రూ.34 లక్షలకు పైగా ఆస్పత్రుల్లో ఖర్చు చేశారు. చికిత్సకు మరో రూ.30 లక్షల వరకు కావాలని వైద్యులు ఎస్టిమేషన్ వేశారు. మానవతావాదులు, దాతలు ఆర్థికంగా చేయూత నందించాలని రియాన్షిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తలసేమియాతో బాధపడుతున్నఆరేళ్ల రియాన్షిక ఇప్పటికే ట్రీట్మెంట్కు రూ.34 లక్షలు ఖర్చు దాతల సాయం కోసం ఎదురుచూపులు -
నగల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలిని నమ్మించి, బెదిరించి చెవి బంగారు కమ్మలు అపహరించిన కేసులో ఇద్దరిని రిమాండ్ చేశారు. శుక్రవారం తూప్రాన్ సీఐ వెంకట్రాజగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 30న మండలంలోని రామాయిపల్లికి చెందిన రాపర్తి రాజమ్మ ఆరెగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సెంట్రల్ బ్యాంక్ వద్ద వేచి ఉంది. ఈ క్రమంలో నర్సాపూర్కు చెందిన ఆటో డ్రైవర్లు శ్రీకాంత్, శైలని ఆరెగూడెంలో దింపుతామని నమ్మబలికి ఆటోలో ఎక్కించుకున్నారు. ఆరెగూడెం స్టేజీ వద్ద దింపకుండా వృద్ధురాలిని భస్వాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారు చెవి కమ్మలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సాపూర్ తూప్రాన్ బ్రిడ్జి వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును దుండగులు విక్రయించిన కృష్ణ జ్యువెల్లరి, కొత్తూరు నుంచి స్వాధీనం చేసుకొని, ఆటోను సీజ్ చేశారు. -
తొలకరికి ముందే పత్తి విత్తు పనులు
నారాయణఖేడ్: వర్షాకాలం ప్రారంభం కాకముందే రోహిణి కార్తెలోనే రైతులు పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 8న మృగశిర కార్తె ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రైతులు ఆశించి పత్తి సాగు పనులు ప్రారంభించేశారు. నాలుగు రోజుల క్రితం ప్రాంతంలో మోస్తారు వర్షం కురియగా గురువారం భారీ వర్షం కురిసింది. రెండు వర్షాలకు నల్లరేగడి భూములు కాస్త నానడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. నాగల్గిద్ద మండలం డోవూరు శివారులో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తే పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోను పత్తి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి వర్షాలు కాస్త తక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా రైతులు కొంత ముందస్తు వ్యవసాయ పనుల్లో నిగమ్నవుతున్నారు.


