breaking news
Sangareddy District Latest News
-
సమన్వయంతో పనిచేయండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికొల్చారం(నర్సాపూర్): సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం సమన్వయంతో పనిచేసి మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుపొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమ వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమన్నారు. అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్క ఓటు అమూల్యమని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ15 రోజులు పార్టీ నాయకులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన విధానాన్ని, ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లి ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరు అభ్యర్థిగా నిలబడిన సమన్వయంతో గెలిపించుకోవాలని, అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సీనియర్ నాయకుడు ఉమన్నగారి దేవేందర్రెడ్డి, మండల యువత అధ్యక్షుడు సంతోశ్రావు, మంజుల, మేఘమాల, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బాగారెడ్డి, యాదయ్య, గోదావరి, రవితేజరెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగిరేసులో కిరికిరి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్పంచ్ పదవుల కోసం అధికార కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. ఒక్కో గ్రామంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు నాయకులు బరిలోకి దిగుతుండటం ముఖ్య నాయకులకు తలనొప్పిగా తయారైంది. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే గ్రామంలోని పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచే అవకాశాలుంటాయి. దీంతో ఎలాగైన తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీకి చెందిన ఒక్కరే నామినేషన్ వేసేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతలను హస్తం పార్టీ గ్రామ, మండల నాయకులు తీసుకున్నారు. గ్రామంలో కాంగ్రెస్ కేడర్ అంతా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి సమన్వయం చేసే ప్రయత్నాలు చేస్తుండటం పలు గ్రామాల్లో పరిపాటైపోయింది. ఎవరైనా నామినేషన్ వేసేందుకు సిద్ధమైతే వారిని బుజ్జగిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు లొంగకుండా తొలివిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా సంబంధిత కుల సంఘాల పెద్దలు, సన్నిహితులతో మాట్లాడి ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైన ఎంపీటీసీ పదవులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ వినని పక్షంలో ఉప సర్పంచ్ పదవి ఇస్తామని, అవసరమైతే వార్డు సభ్యునిగానైనా బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. గులాబీ ముఖ్య నేతల సమన్వయం కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్కు సర్పంచ్ల పదవులకు తిరుగుబాటు అభ్యర్థుల తలనొప్పి కాస్త తక్కువేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. గ్రామంలో పట్టున్న వారిని, పైగా ఆర్థికంగా బలంగా ఉన్న వారిని బరిలోకి దించుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు దీటుగా అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఈ విషయంలో మండల స్థాయి నాయకులతో పాటు, అవసరమైన చోట్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి సర్పంచ్ అభ్యర్థుల విషయంలో గ్రామ కేడర్తో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కమలంలో యువ ఉత్సాహం బలమైన అభ్యర్థులను బరిలో దింపుతున్న బీఆర్ఎస్ దీటైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషణ పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు మరోవైపు బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ గ్రామాల్లో అన్వేషిస్తోంది. గ్రామాల్లో యువత చాలా మట్టుకు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. యువ ఓటర్లలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు దీటుగా తమ పార్టీ నాయకులను సర్పంచ్ పదవికి పోటీలో నిలుపుతోంది. ఆ పార్టీకి చెందిన మండల నాయకులు, గ్రామస్థాయి నేతలు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. మొత్తం మీద రాజకీయ పార్టీల గుర్తులకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండటంతో గ్రామ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. -
ఎన్నికల ప్రచార ఖర్చులు ఇలా..
జహీరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులు రోజువారీ వివరాలను అధికారులకు ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా పదవులను బట్టి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం కోసం సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ. 400, ఆటోరిక్షా అయితే రూ.1,500, టాటాఏస్ అయితే రూ. 1,600గా నిర్ణయించారు. 100 యాంప్స్ మైక్సెట్కు రూ. 2,500, వెయ్యి వాల్ పోస్టర్లకు రూ. 5 వేలు ప్రకటించారు. తలపై ధరించే టోపీకి రూ. 40, టీ షర్టుకు రూ.100 వంతున ఖర్చు చూపాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఒక రోజు కారు అద్దెను రూ. 2,500, ఇన్నోవాకు రూ. 3,500 చూపాలి. ఒక్కో కుర్చీకి రోజుకు రూ. 20 గా, వీఐపీ కుర్చీ అయితే రూ.100గా అద్దెను నిర్ణయించారు. కూల్డ్రింక్ రూ. 20 వంతున, వాటర్ ప్యాకెట్కు రూపాయి, చాయ్ రూ. 10, కాఫీకి రూ. 15 వంతున ధరలను లెక్కలో చూపాల్సి ఉంటుంది. కిలో బరువు ఉన్న బాణాసంచాకు రూ. 800 వంతున, ఒక డప్పుకు రూ. 700 వంతున లెక్కకట్టాల్సి ఉంటుంది. సాదా భోజనానికి రూ. 80, మటన్ బిర్యానీకి రూ. 150, చికెన్ బిర్యానీకి రూ. 100 చొప్పున బిల్లు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
సిగాచి బాధితులను ఆదుకోండి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్సంగారెడ్డి: సిగాచి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు, ఎస్పీ పరితోష్ పంకజ్కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. నాలుగు నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. ఆగమేఘాల మీద రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి తర్వాత చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల నష్ట పరిహారం సైతం ఇప్పటివరకు అందలేదన్నారు. గత ప్రభుత్వం పరిహారాలు వెంటనే విడుదల చేసేదని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారం వెంటనే బాధితులకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గడిల శ్రీకాంత్గౌడ్, మోహిజ్ఖాన్, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు 12 క్వింటాళ్లు..
నారాయణఖేడ్: పత్తి కొనుగోలుపై కేంద్రం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇక ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు సీసీఐకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటి నుంచి ఆంక్షలు లేకుండా రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయనుంది. గత ఏడాది 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ ఈ ఏడాది 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో సుమారు నెల రోజులపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో ఇబ్బందులు తొలగనున్నాయి. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడులు వచ్చినట్లు రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో సంబంధిత ఏఈఓలను సంప్రదిస్తే వారు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇలా నమోదు చేయించుకున్న అనంతరం రైతులు స్లాట్ బుక్ చేసుకొని తమకు కేటాయించిన తేదీన సంబంధిత మిల్లుకు తీసుకెళితే పత్తిని కొనుగోలు చేస్తారు. నేరుగా వెళితే 7క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తారు. దిగుబడులపై తప్పకుండా ఏఈఓలు లేదా ఏఓల ధ్రువీకరణ తప్పనిసరి. రైతులు వారిని సంప్రదిస్తే.. విచారణ జరిపిన వివరాలు ఉండటంతో సదరు రైతు చేనులో ఎంత దిగుబడి వచ్చిందనే అంశాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. దిగుబడిపై కలెక్టర్ల నివేదిక ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొలుగోలు చేయాలని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ నివేదిక ఇవ్వగా.. దాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర జౌళిశాఖ ఆ మేరకే సేకరించాలని సీసీఐని ఆదేశించింది. ఈ నిబంధనలతో పత్తి రైతులు నెల రోజులపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే పంటలు దెబ్బతిని నష్టపోగా కేంద్రం నిబంధనలతో మరింత ఇక్కట్ల పాలయ్యారు. కొనుగోలుపై సమస్య ఉత్పన్నం కావడంతో రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడులపై నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కలెక్టర్లను ఆదేశించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు నివేదికలు సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయని ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు నివేదిక అందజేశారు.కపాస్ కిసాన్ యాప్తో ఇబ్బందులు రైతులకు సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్లో పత్తి దిగుబడి, తేమ శాతం, తరలించే మిల్లు తదితర వివరాలను నమోదు చేయాలి. ఈ విధానం రైతులకు భారంగా మారింది. ఫలితంగా ఇబ్బందుల దృష్ట్యా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ను తొలగించి పాత పద్ధతిలోనే పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పత్తి పంటకు ఎమ్మెస్పీ మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చెల్లిస్తున్నారు. రైతులు దళారులు రూ.6,500 నుంచి రూ.7వేల లోపే అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలుపై ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. పత్తి కొనుగోలుపై సీసీఐకి అనుమతులిచ్చిన జౌళీ శాఖ -
ఇసుక దొరకక.. ఇళ్లు కట్టలేక!
● మెదక్లో ప్రారంభం కాని శాండ్బజార్ ● ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు మెదక్ నియోజకవర్గంలో శాండ్బజార్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ కేవలం అది ప్రకటనలకే పరిమితం అయింది. నర్సాపూర్ నుంచి ఇసుకను నియోజకవర్గంలోని మారుమూల గ్రామానికి తీసుకురావాలంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఒక్క ట్రాక్టర్ కిరాయి ఆ దూరానికి రూ. 8 వేల పైచిలుకు ఉంటుంది. శాండ్బజార్లో టన్ను ఇసుకకు రూ. 1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ట్రాక్టర్లో 4 టన్నుల ఇసుక మాత్రమే వస్తుండగా, రూ. 12,800 ఖర్చు అవుతుంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఇసుక అవసరం కాగా, ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల్లో ఇసుకకే రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ పరిధిలో వారం క్రితం కరీంనగర్ నుంచి కొంత ఇసుకను తెచ్చి నిల్వ చేశారు. ఎప్పుడు ప్రారంభిస్తారని లబ్ధిదారులు అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని ఓ అధికారి అంటుంటే, మరో అధికారి ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు సమయం ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇసుకను సకాలంలో అందిస్తే ఇళ్ల నిర్మాణాలు చేపడతామని పేర్కొంటున్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 9,209 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో ఇప్పటివరకు 4,327 మాత్రమే ప్రారంభించారు. మిగితా 4,882 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇసుక అందుబాటులో లేకపోవటమేనని తెలుస్తోంది. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, రెండుచోట్ల శాండ్బజార్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఒక్క నర్సాపూర్లో మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న మండలాల లబ్ధిదారులు మాత్రమే ఇసుక కొనుగోలు చేస్తున్నారు. మిగితా వారు అవస్థలు పడుతున్నారు. కాగా నిర్మాణాలు ప్రారంభించకుంటే మంజూరు చేసిన ఇళ్లు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.ప్రకటనలకే పరిమితం -
నీ వెంటే నేను..
సంగారెడ్డి టౌన్: వానరాలు గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాదు రోడ్లపై వెళ్లే వాహనదా రులను సైతం ఇబ్బందులకు గురి చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా వానరం అతడి భుజాలపై కూ ర్చుంది. బైక్పై కొద్దిసేపు అలా వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. కోతి విన్యాసాలను చూసిన ప్రతి ఒక్కరు ఒక్కో రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వానరా ఏమి కోరిక అంటూ ఫొటో కింద క్యాప్షన్ జత చేస్తూ వైరల్ చేశారు. -
సరిహద్దులు కట్టుదిట్టం
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిఘా ● మద్యం, డబ్బు తరలింపుపై దృష్టి ● తనిఖీలు ముమ్మరం చేసిన పోలీస్శాఖ జహీరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి వద్ద, బీదర్ రహదారిపై హుసెళ్లి వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో సీఐ శివలింగం పర్యవేక్షణలో ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో చెక్పోస్టులో పోలీసులతో పాటు ఆయాశాఖల సిబ్బందిని నియమించారు. అంతేకాకుండా ఆయా మండలాల్లోని ఎస్ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్లతో పాటు అక్రమాలపై నిఘా పెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును కలిగి ఉన్నా, అనుమతులు లేకుండా వస్తువులను తరలించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారు తగిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కర్ణాటకలో కొనుగోలు చేసి రాష్ట్రంలోకి తరలిస్తే బిల్లులు, పన్నులు చెల్లించిన పత్రాలు ఉండాలని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 65 విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ రహదారి విస్తరణ, విద్యుత్, ట్రాఫిక్ పోలీస్శాఖ అధికారులతో రహదారి విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విస్తరణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్రావు, జాతీయ రహదారి ఎస్ఈ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: 11వ అంతర్ జిల్లా సీనియర్ బాస్కెట్బాల్ ముగింపు కార్యక్రమం పట్టణంలోని అంబేడ్కర్ మైదానంలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలారెడ్డి విజేతలకు టోఫ్రీని బహూకరించారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానం, రెండోస్థానంలో రంగారెడ్డి, ముడోస్థానంలో మేడ్చల్ జిల్లా జట్టు నిలిచింది. మహిళల విభాగంలో మొదటిస్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, రెండో స్థానంలో హైదరాబాద్, మూడోస్థానంలో రంగారెడ్డి జట్టు నిలిచింది. ఈసందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజం అని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి ఆనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్: మండలంలోని భానూర్ పంచాయతీ పరిధిలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్లను సోమవారం ఏడు మండలాలకు తరలించారు. నోడల్ ఆఫీసర్ అఖిలేష్, డీఎల్పీఓ అనిత ఆధ్వర్యంలో తరలించారు. ఈసందర్భంగా అఖిలేష్రెడ్డి మాట్లాడుతూ... గుమ్మడిదల, పటాన్చెరు, హత్నూర, సదాశివపేట, సంగారెడ్డి, కొండాపూర్, కంది మండలాలకు చెందిన 1,872 బాక్స్లను ఆయా మండలాలకు పంపనున్నట్లు తెలిపారు. వీటిలో 1,134 పెద్ద, 188 చిన్నబాక్స్లు ఉన్నాయి. చిన్నబాక్స్లో 75 ఓట్ల కంటే తక్కువ ఉన్న పోలింగ్స్టేషన్లకు పంపనున్నట్లు తెలిపారు. పటాన్చెరు టౌన్: కుటుంబ నియంత్రణ పాటించాలని జిల్లా వైద్యాధికారి వసంత్రావు అన్నారు. సోమవారం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన వ్యాసెక్టమీ ఆపరేషన్ క్యాంప్ను ఆయన సందర్శించి మాట్లాడారు. కు టు ంబ నియంత్రణలో భాగంగా అర్హులైన పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి అవగాహన కల్పించామన్నారు. తిరిగి శిబిరం 4వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. వ్యాసెక్టమీ చేయించుకుందాం అనుకునేవారు 3వ తే దీన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం: సీఐటీయూ జహీరాబాద్ టౌన్: ఐక్యతతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మండలంలోని బూచినెల్లి పారిశ్రామిక వాడలో గల సీఐఈ పరిశ్రమలో సోమవారం వేతన ఒప్పదం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల పక్షాన ఉంటూ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు, త దితరులు పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె
మెదక్ కలెక్టరేట్: జిల్లా స్థాయి శాసీ్త్రయ వైజ్ఞానిక ప్రదర్శనకు వేళైంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక వైజ్ఞానిక సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి యేటా సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 4,5వ తేదీల్లో నిర్వహిహించే ప్రదర్శనలకు మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాల వేదిక కానుంది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణం, గణితం, వైజ్ఞానిక అంశాలపై రూపొందించిన ఎగ్జిబిట్లను ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించనున్నారు. రెండు రోజులు మాత్రమే.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాల్సిన వైజ్ఞానిక ప్రదర్శనను 4, 5తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు మాత్రమే హాజరు కావాలి. ఇందులో పాల్గొనే 6,7, 8వ తరగతుల విద్యార్థులను జూనియర్లు, 9,10 తరగతులను సీనియర్లుగా పరిగణిస్తారు. గత ఏడాది 54 మంది ఎంపిక గత ఏడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 54 మంది ఇన్స్పైర్ అవార్డ్కు ఎంపికయ్యారు. వారు మరింత మెరుగైన ఎగ్జిబిట్లు రూపొందించేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. వాటితో మరింత మెరుగైన ఎగ్జిబిట్లు రూపొందించి త్వరలో జరగనున్న ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంది. 4, 5వ తేదీల్లో జిల్లా స్థాయి నైపుణ్య ప్రదర్శన గురువారం ప్రారంభం ఈనెల 4న కలెక్టర్ చేతుల మీదుగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించనున్నారు. అయితే ఒక ప్రాజెక్టుకు ఒక విద్యార్థి మాత్రమే హాజరు కావాలి. గురువారం ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 5 తేదీన సాయంత్రం 4 గంటల నుంచి విజేతలకు బహుమతులు అందజేస్తారు. వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన వారు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారు. -
మెదక్ను సుందరంగా తీర్చిదిద్దుతా
ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ మున్సిపాలిటీ: మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 7, 8, 20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. ఇటీవల పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ. 55 కోట్లు వచ్చాయని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీలేదని, నియోజకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్ష అన్నారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి రూ. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్రావు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, మమత, శ్రీధర్ యాదవ్, దొంతి ముత్యంగౌడ్, లింగం అంజాద్, గంగాధర్, శివరామకృష్ణ, పురం వెంకటనారాయణ, హరిత నర్సింగ్రావు, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయాసాగర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. » -
టైరు పేలి.. పల్టీ కొట్టిన వాహనం
● పది మందికి గాయాలు ● డ్రైవర్ పరిస్థితి విషమంజహీరాబాద్ టౌన్: జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ప్యాసింజర్ వాహనం టైరు పేలడంతో పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలతో సహ పదిమందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని బీదర్, ఔరాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులను తీసుకుని తుపాన్ వాహనం సోమవారం హైదరాబాద్కు వెళ్తుంది. మండలంలోని హుగ్గెల్లి గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద వాహనం ముందు టైర్ పేలింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఆ వాహనంలో ఉన్న నలుగురు పిల్లలతో సహ పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరు జహీరాబాద్, మరికొంత మందిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ గిరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అతడ్ని హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సజావుగా నామినేషన్ ప్రక్రియ
అదనపు కలెక్టర్ నగేశ్నిజాంపేట(మెదక్): నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలాంటి పొరపాట్లు జరగకుండా, నామినేషన్ కార్యాలయం వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని తెలిపారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంట అధికారులు ఉన్నారు. అలాగే నామినేషన్ ప్రక్రియను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. డీఎస్పీ వెంట ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎంపీడీఒ రాజిరెడ్డి, సీఐ వెంకటరాజాగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేశ్ పాల్గొన్నారు. -
పొలం బడిని సద్వినియోగం చేసుకోవాలి
సస్యరక్షణ కేంద్రం అధికారి ఉదయ్శంకర్చిలప్చెడ్(నర్సాపూర్): వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే పొలం బడి ముఖ్య ఉద్దేశమని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సస్యరక్షణ కేంద్రం అధికారి ఉదయ్శంకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చిలప్చెడ్ రైతువేదికలో రైతుల ఆధ్వర్యంలో పొలం బడిని ప్రారంభించి, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంబడి రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, ఉత్పత్తిని పెంచుతుందన్నారు. మిత్ర పురుగులు, లింగాకర్షక బుట్ట లు, ఎన్ఎస్పీపీ మొబైల్ యాప్స్ వంటి అనేక విషయాల గురించి విస్తరించి, వాటిపై విపులంగా అవగాహన కల్పిస్తామన్నారు. వారంలో ఒక రోజు నిర్వహించే పొలం బడి కార్యక్రమానికి ప్రతి రైతు హాజరవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సస్యరక్షణ కేంద్రం సిబ్బంది హోన్నప్పగౌడ, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్గౌడ్, ఏఈఓలు అనిత, కృష్ణవేణి, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సహకరించాలి
ఎస్పీ శ్రీనివాస్రావుచిన్నశంకరంపేట(మెదక్): గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. సోమవారం చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 492 గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో అందరం ఎల్లప్పుడు కలిసి ఉంటామని గుర్తుంచుకుని స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ శ్రీనివాస్రావు, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, ఎస్ఐ నారాయణగౌడ్కు పలు సూచనలు చేశారు. -
అంతర్జాతీయ పోటీలకు విద్యార్థులు
టేక్మాల్(మెదక్): రంగోత్సవ్ ముంబై ఆధ్వర్యంలో అక్టోబర్లో నిర్వహించిన కళాపోటీల్లో టేక్మాల్ ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ సాయిలు, ఆర్ట్ కో–ఆర్డినేటర్ జలీల్ తెలిపారు. 55 మంది జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించి అంతర్జాతీయ కళాపోటీలకు ఎంపికయ్యారు. 27 మంది బంగారు, 15 మంది కాంస్యం, 10 మంది రజత పతకాలు సాధించారు. కాగా ఈ పోటీల్లో శిరీష ద్వితీయ, అనన్య ఫైవ్స్టార్ బ్రిలియంట్ బహుమతులు పొందారు. వివిధ అంశాలైన గ్రీటింగ్ కార్డ్ , టాటూ, కార్టూన్ మేకింగ్, హ్యాండ్ రైటింగ్, స్కెచింగ్, పలు అంశాల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం బహుమతులు అందించారు. ఉపాధ్యాయుడు జలీల్ను అభినందించారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కేసు నమోదు కొండపాక(గజ్వేల్): ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి గుడి ఆవరణలో సమావేశం నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... కొండపాకలోని రామాలయం గుడి ఆవరణలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు అనంతుల ప్రశాంత్, నూనె కుమార్, బొద్దుల తిరుపతి,అంబటి బాల్చందర్గౌడ్, దొమ్మాట మహిపాల్రెడ్డిలతో పాటు మరి కొందరు కలిసి త్వరలో జరిగే ఎన్నికల విషయంలో నామినేషన్లు వేయడానికి సమావేశమయ్యారు. కోడ్ను ఉల్లంఘిస్తూ సమావేశం ఏర్పాటు చేసిన దృష్ట్యా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎఫ్ఎస్టీ టీం వెళ్లి గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాహన తనిఖీల్లో రూ.5 లక్షలు స్వాధీనం మనోహరాబాద్(తూప్రాన్): ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మండలంలోని కాళ్లకల్ శివారులో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీల్లో మండలంలోని కూచారం గ్రామానికి చెందిన మనోజ్కుమార్ తన బైక్పై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షల నగదును పంచనామా నిర్వహించి పోలీసులు సీజ్ చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న నగదును ఆర్డీఓకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తూప్రాన్ సీఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎవరైనా అక్రమంగా నగదును తరలిస్తే వారిపైఎన్నికల ఉల్లంఘన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికలయ్యే వరకు తనిఖీలను నిత్యం కొనసాగిస్తామన్నారు. ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ! రాయికోడ్(అందోల్): మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలుండగా ప్రజల్లో మంచి పేరున్న కనీసం 3,4 పంచాయతీల్లోని అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలనే పట్టుదలలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి జైలు కొమురవెల్లి(సిద్దిపేట): డ్రంకెన్డ్రైవ్ కేసులో సిద్దిపేట మెజిస్ట్రేట్ ఒకరికి జైలు శిక్ష విధించినట్లు సోమవారం ఎస్ఐ మహేశ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన కొండపాకకు చెందిన ప్రేమ్దాస్ను కోర్టులో హాజరుపరుచగా మెజిస్ట్రేట్ అతనికి మూడు రోజుల జైలు శిక్ష విధించాడు. 15 మందికి జరిమానా సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా , బైపాస్లోని గుర్రపు బొమ్మ, పాత బస్టాండ్, స్థానిక ఐబీ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఐదుగురురికి రూ.1500, పది మందికి రూ. వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఉచిత చేప పిల్లలు పంపిణీ వెల్దుర్తి(తూప్రాన్): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే మండల కేంద్రంలోని వెల్దుర్తి దేవతల చెరువు, కుడి చెరువులకు ప్రభుత్వం సుమారు 5.40 లక్షలు చేప పిల్లలు అందజేయగా వాటిని స్థానిక మత్స్య సహకార సంఘం సభ్యులు ఆయా చెరువుల్లో వదిలారు. కార్యక్రమంలో ఎఫ్ఎఫ్ఓ సంతోష్కుమార్, ఫీ ల్డ్ అసిస్టెంట్ బాలాజీ, ఫీల్డ్మెన్ శేఖర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బాలరాజ్, శ్రీనివాస్, అశోక్, ఏఈఓ మజీద్ పాల్గొన్నారు. -
అవగాహనతోనే నియంత్రణ
● జిల్లాలో పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు ● నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సంగారెడ్డి క్రైమ్: అవగాహనే ఎయిడ్స్ నియంత్రణకు సరైన టీకా అని వైద్యులు పేర్కొంటున్నారు. హెచ్ఐవి అని తెలియగానే అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు అని వైద్యాధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ఎయిడ్స్కు.. మధుమేహం, బీపీ, ఆస్తమా రోగాల మాదిరిగానే మందులు వాడటం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు. హెచ్ఐవి ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టి మందులు వాడితే పుట్టబోయే పిల్లలకు ఎలాంటి రోగాలు లేకుండా జన్మనివ్వొచ్చు. ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెచ్ఐవి నిర్ధారణ ఇలా.. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ వైరస్) అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకితే మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా ఎయిడ్స్ వ్యాధులు వస్తాయి. హెచ్ఐవి వైరస్ ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. అవి శరీరం లోపల కొన్ని నెలల పాటు ( 6 నుంచి 7 నెలలు) ఆర్యోగంగా ఉన్న మానవ రోగనిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. రక్త పరీక్ష చేసిన సమయంలో రోగనిరోధక శక్తి క్షీణించినప్పుడు వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడతాయి. వీటి నిర్ధారణకు ఏఆర్టీ సెంటర్ పరీక్షలో కణాల సంఖ్య 25 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకినట్లుగా వైద్యులు గుర్తిస్తారు. అవగాహన కల్పిస్తున్నా.. జిల్లాలో హెచ్ఐవి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డితో కలిపి మొత్తం 5 ఏఆర్టీ కేంద్రాలున్నాయి. (నర్సాపూర్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ) ఇక్కడి నుంచి హెచ్ఐవి రోగులకు మందులు పంపిణీ చేస్తారు. సంగారెడ్డి నోడల్ మెడికల్ అధికారులతో పాటు కౌన్సిలర్లు, డాటా ఎంట్రీ, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో మందులు పంపిణీ చేస్తున్నారు. అలాగే హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం రూ.200 నుంచి రూ.వెయ్యి ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రభుత్వం ఒక్కొక్క బాధితుడిపై దాదాపు రూ.లక్ష సంవత్సరానికి ఖర్చు చేస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఎయిడ్స్పై అవగాహన అవసరం. స్వీయ నియంత్రణ లేకపోవడంతో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, ఎన్జీఓలతో కలిసి గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. బాధితులు వైద్యుల సలహా మేరకు టెస్ట్లు చేసుకొని మందులు వాడాలి. – డాక్టర్ సీహెచ్ మృత్యుంజయ రావు, ప్రభుత్వ ఆస్పత్రి, సంగారెడ్డి -
రాష్ట్రస్థాయి రగ్బీలో తృతీయస్థానం
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర స్థాయి బాల,బాలికల రగ్బీలో ఉమ్మడి మెదక్ జిల్లా తృతీయస్థానం సాధించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో రాష్ట్రస్థాయి అండర్–17 బాల బాలికల రగ్బీ టోర్నమెంట్ నిర్వహించారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇరు జట్లు తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. బాలుర విభాగంలో కరీంనగర్, మెదక్ జిల్లా మధ్య సాగిన మ్యాచ్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు 29–7 పాయింట్స్ తేడాతో విజయం సాధించి తృతీయ స్థానం దక్కించుకుంది. బాలికల విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు 7–0 పాయింట్స్ తేడాతో నల్లగొండ జట్టుపై విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయ క్రీడాకారులను, మెదక్ జిల్లా జట్టు మేనేజర్ శారద, శిక్షకులు నవీన్, మహేశ్ను అభినందించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ కలెక్టర్ ప్రోత్సాహంతో బాలికలు వివిధ క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. -
మద్యం తాగేందుకు తీసుకెళ్లి..
గజ్వేల్: దొంగతనం కేసులో నిందితున్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం గజ్వేల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ రవికుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 26న దౌల్తాబాద్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్యను నిందితుడు పొత్తుల నాగరాజు కలిశాడు. మద్యం తాగుదామని పట్టణంలోని ఓ వైన్స్కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి జాలిగామ బైపాస్ వైపు ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత నర్సయ్య వద్ద ఉన్న రెండు వెండి కడియాలు, రెండు వెండి ఉంగరాలు, ఒక బంగారు బాలిపోగును నాగరాజు చోరీ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడానికి కృషి చేసిన గజ్వేల్ అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రవి, సురేందర్, దివ్య, వెంకటేశ్, నాగేశ్ను ఏసీపీ నర్సింహులు అభినందించినట్లు తెలిపారు. మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ సిద్దిపేటకమాన్: డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన గడ్డం ప్రసాద్ 2025 మార్చిలో కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బూర అమలకు కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని రూ.2లక్షల 50 వేలు తీసుకున్నాడు. కానీ ఇల్లు మాత్రం ఇప్పించలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈనెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. 14రోజుల రిమాండ్ విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. గతంలో కూడా పలువురిని మోసం చేశాడని, ఒక కేసు కూడా నమోదైనట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. మట్టిని అక్రమంగా అమ్మిన వ్యక్తి.. సిద్దిపేటకమాన్: ప్రభుత్వ భూమిలోని మట్టిని అక్రమంగా అమ్ముకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం... మందపల్లి శివార్లలోని ప్రభుత్వ భూమి సర్వే నం. 382/87లోని మట్టిని 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో గాంధీ రెడ్డి, వంశీ కృష్ణ ఒక ప్రైవేటు కంపెనీకి గోనెపల్లి గ్రామానికి చెందిన రాజు, యాదగిరి సహకారంతో విక్రయించారు. ఈ క్రమంలో మందపల్లి గ్రామ పరిపాలన అధికారి కరుణాకర్ ఈనెల 10న పొలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం పోలీసులు మండపల్లికి చెందిన గాంధీ రెడ్డిని అరెస్ట్ చేశారు. త్వరలో మిగతా వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. చోరీ కేసులో నిందితుని అరెస్ట్ -
ఐక్యత మార్చ్లో సిద్దిపేట వాసి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించిన ఐక్యత మార్చ్లో జిల్లాకు చెందిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నాడు. ఆదివారం వడోదరలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ మార్చ్లో ఆయన పాల్గొన్నట్లు తెలిపారు. దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు కొలుకూరి భాస్కర్ రెడ్డి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కు రెండోసారి ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం ప్రమీల ఆదివారం తెలిపారు. 2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకుల క్యాంపస్లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫర్ అస్పైరింగ్ ఇండియా సైన్స్ సఫారీ, గేమ్స్, అడ్వెంచర్స్ వర్క్షాప్లో ప్రతినిధిగా పాల్గొననున్నా రు. సైన్స్ బోధనలో వినూత్న పద్ధతులు, ఆవిష్కరణలను ఆయన ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం ప్రమీల, ఉపాధ్యాయ బృందం ఆయనను అభినందించారు. ఒకరికి తీవ్ర గాయాలు రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన రియాజ్ (32), నార్సింగికి చెందిన స్నేహితుడు ఇస్మాయిల్తో కలిసి బైక్పై రామాయంపేటకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో అతి వేగంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా, రియాజ్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొట్టిన ఘటనలో.. మనోహరాబాద్(తూప్రాన్): ముందు వెళ్తున్న లారీని బైక్తో ఢీకొట్టి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కాళ్లకల్ శివారులో జాతీయ రహదారి–44పై ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బైక్పై వచ్చిన వ్యక్తి అదుపుతప్పి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేటకమాన్: బాధితులను ఆదుకోవాలని గొర్రెల కాపరులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాలిటీ లింగారెడ్డిపల్లిలో విద్యుత్ షాక్తో 15 మేకలు చనిపోయాయి. కాగా ఆ యజమానులను ఆయన పరామర్శించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో విద్యుత్ వైర్లు తెగి మంద చుట్టూ ఉన్న పెన్సింగ్ మేకలపై పడటంతో విద్యుత్ షాక్తో చనిపోయాయని తెలిపారు. బాధితులు దర్గయ్య, నర్సింలును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేకకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు రాజమల్లయ్య,యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాము, శ్రీకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
రైతులపై టార్పాలిన్ల భారం
● రోజుల తరబడి కల్లాల్లోనే వరిధాన్యం ● కిరాయి చెల్లిస్తున్న అన్నదాతలు దుబ్బాకటౌన్: కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ టార్పాలిన్ కవర్లు రాకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకొని వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్ కవర్లే దిక్కు కావడంతో వేల రూపాయల కిరాయి చెల్లిస్తున్నామని అన్నదాతలు వాపోతున్నారు. అయితే గతంలో వ్యవసాయ సహకార సంఘం నుంచి ప్రతి రైతుకు సబ్సిడీ ద్వారా టార్పాలిన్ కవర్లు అందజేసేవారని, అవి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. రైతులు వరి కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటి నుంచి వడ్లను ఆరబోయడానికి, వడ్లపై కప్పి ఉంచడానికి టార్పాలిన్ కవర్లను వాడుతారు. వాటిని ఆయా గ్రామాల్లో ఉన్న వ్యక్తుల వద్ద కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఒక్కో టార్పాలిన్ కవర్ కిరాయి ఒకరోజుకు రూ.30 ఉంటుంది. ఎకరానికి 5 టార్పాలిన్ కవర్ల అవసరం ఉంటుంది. దీంతో ఒక రైతు ఒక రోజుకు కిరాయి రూ.150 చెల్లిస్తున్నాడు. ఇదే విధంగా ఒక్కో రైతు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే 7 నుంచి 10 రోజులు కల్లాల్లోనే వడ్లను ఉంచారు. దీంతో ఒక్కో రైతుపై అదనంగా భారంగా పడుతోంది. ఈ టార్పాలిన్ల కిరాయిలు చెల్లించలేక నానా అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రాయితీ టార్పాలిన్ కవర్లేవి? కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖకు టార్పాలిన్ కవర్లు అందజేసి రైతులకు సబ్సిడీలో ఇచ్చేవారు. ప్రతి రైతు వాటిని కొనుగోలు చేసి రాయితీ పొందేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ప్రతి సీజన్లో రైతులు సబ్సిడీలో టార్పాలిన్ కవర్లు వస్తాయేమో అని వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు టార్పాలిన్ల కిరాయిలు చెల్లిస్తూ మరింత భారం మోయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థినులు
రామాయంపేట(మెదక్): పాపన్నపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన జూనియర్ కబడ్డీ పోటీల్లో మండలంలోని ప్రగతి ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రాఘవి, పవిత్రను గ్రామస్తులతోపాటు ఉపాధ్యాయులు ప్రశంసించారు. డిసెంబర్ 2 నుంచి నాలుగు వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. భుజిరంపేట విద్యార్థులు.. కౌడిపల్లి(నర్సాపూర్): కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు మండలంలోని భుజిరంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఎస్. దీక్ష, కే.పూజిత ఎంపికై నట్లు హెచ్ఎం సునీత, పీడీ శేఖర్ తెలిపారు. ఆదివారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 2నుంచి 4వ తేదీ వరకు నాగార్జునసాగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
ఉపాధ్యాయులతోనే దేశ భవిష్యత్
ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిన్నారం (పటాన్చెరు): ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రయోజనాలను వెంటనే అందించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం పట్టణం మాదారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ ఉద్యోగ విరమణ అభినందన సభకు ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, పోలీసులు, లాయర్లను తయారు చేసేది ఉపాధ్యాయులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, దేశ భవిష్యత్తుకు వారే పునాదులు నిర్మిస్తారన్నారు. ఉద్యోగరీత్యా సేవలందించిన ఉద్యోగులకు ప్రభుత్వం విరమణ ప్రయోజనాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఎంఈఓ కుమారస్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. -
మహిళదే పైచేయి
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● పంచాయతీపోరులో పెరగనున్న ప్రాతినిధ్యం● జనరల్ స్థానాలకు సైతం అవకాశంసంగారెడ్డి జోన్: జిల్లాలో గ్రామపంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఓటములతోపాటు ప్రాతినిధ్యం వహించడంలోనూ మహిళలే కీలకంగా మారుతున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలకే అగ్రపీఠం దక్కనుంది. చాలా గ్రామపంచాయతీల్లో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారి పాలించే అవకాశం కలగనుంది. మహిళలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో సైతం వారు పోటీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డు స్థానాలు ఉండగా 283 సర్పంచ్, 2,404 వార్డు స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటితో పాటు జనరల్ స్థానాలలో సైతం మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. 0 50% వరకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు 50% వరకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఓట్ల పరంగానే కాకుండా సీట్లలో కూడా మహిళలే ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో ఆందోల్, ఖేడ్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. ఖేడ్ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 3,75,843 ఉండగా పురుషులు 3,68,270 మంది ఓటర్లు ఉన్నారు. 7,500కు పైగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలే కాకుండా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం మహిళలే గెలుపోటములు నిర్ణయించనున్నారు. -
హుస్నాబాద్ను కోనసీమగా తీర్చిదిద్దుతా
హుస్నాబాద్: నియోజకవర్గాన్ని, ఆదర్శవంతంగా, మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలిలో విలేకరులతో మాట్లాడారు. 3న సీఎం రేవంత్రెడ్డితో పాటు సహచర మంత్రులను హుస్నాబాద్కు ఆహ్వానించినట్లు తెలిపారు. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణం, ఏటీసీ, రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రహదారి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్టీఏ కార్యాలయ భవనం, ఇందిరా మహిళా శక్తి బజార్, ఉమ్మాపూర్లో అర్బన్ పార్క్ ఏర్పాటు, మహిళా సంఘాలకు బస్సులు, హైదరాబాద్ నుంచి హుస్నాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభిస్తారని పొన్నం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 70 సైకిళ్లు పంపిణీ చేయనున్నారన్నారు. మొత్తంగా రూ.480.36 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం కలెక్టర్ హైమావతితో కలిసి సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేద్దాం.. సర్పంచ్ ఎన్నికలపై నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనను విజయవంతం కోసం జన సమీకరణలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు క్లీన్స్విప్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి ఒక్కరే ఉండి, వారి గెలుపు కోసం మిగిలిన నేతలంతా ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్త చైర్మన్ కేడం లింగమూర్తి, రాష్ట్ర హౌస్ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 3న సీఎం రేవంత్ రాక రూ.480.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడి -
దత్తాచల క్షేత్రాభివృద్ధికి కృషి
మాజీ గవర్నర్ దత్తాత్రేయ హత్నూర(సంగారెడ్డి): దత్తాచల క్షేత్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హత్నూర మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో దత్త జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాచల క్షేత్రాభివృద్ధి కోసం తనవంతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రపతి సభాపతి శర్మ దత్తాత్రేయను స్వామివారి ప్రసాదం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్యాదవ్, రఘువీరారెడ్డి, నాగప్రభుగౌడ్, డాక్టర్ రాజుగౌడ్, రాజేందర్, సతీశ్తోపాటు పలువురున్నారు. పీఆర్సీ అమలు చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ వెంటనే అమలు చేయడంతోపాటు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ఉపాధ్యాయభవన్లో ఆదివారం టీపీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ...2023 జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ రెండేళ్లు దాటినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. పెరుగుతున్న మార్కెట్ ధరలకనుగుణంగా ఐదేళ్లకొకసారి అమలు చేయాల్సిన వేతన సవరణ గడువు ముగిసి చాలా రోజులైందని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంపుతోపాటు ప్రతీనెల చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్,రాష్ట్ర కౌన్సిలర్ సంజీవయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నాజర్ పటేల్, మల్లికార్జున్ జిల్లా కార్యదర్శులు మేకల శ్రీనివాస్, జగన్నాథం, బాణోత్ రవీందర్, శ్రీశైలం పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలిసంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ వట్పల్లి(అందోల్): ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అందోల్ అక్సాన్పల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంతోపాటు, వట్పల్లి మండలంలోని గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా, సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జోగిపేట సీఐ అనిల్కుమార్, ఎస్ఐలు పాండు, లవకుమార్ పాల్గొన్నారు. కార్మిక సమస్యలపై నిరంతర పోరాటంసదాశివపేట(సంగారెడ్డి): కార్మికవర్గ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ పట్టణంలో డిసెంబర్ 7,8,9 తేదీల్లో మూడురోజులపాటు జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): జిల్లా సాగుకోసం బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించని పక్షంలో త్వరలో పాదయాత్రతోపాటు ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఖేడ్ మండలం అనంతసాగర్లో ఆదివారం మల్లన్నస్వామి, సిర్గాపూర్లో బీరప్పస్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఖేడ్ మండలం మాద్వార్కు చెందిన తాజా మాజీ సర్పంచ్ స్వరూప రాములు బీజేపీలోంచి, తుర్కాపల్లికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ అనుచరులతో హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలోని పలు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని ఆయా ఎత్తిపోతల పనులను బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేసిందన్నారు. జిల్లాపై ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ప్రస్తుతం పంచాయతీల ట్రాక్టర్లు మూలనపడి, గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాగా, కాంగ్రెస్ చెత్త ప్రభుత్వమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 1.30 కోట్లమంది మహిళలకు చీరలను పంపిణీ చేయగా ప్రస్తుతం డ్వాక్రా సంఘాల సభ్యులకే అదీ ఏకరూపదుస్తుల్లా పంపిణీ చేస్తున్నారన్నారు. మహలక్ష్మి కింద ఒక్కోమహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. బీఆర్ఎస్ హయాంలో 8 చెరువులను మంజూరుచేసి భూసేకరణ, తండాలకు రోడ్ల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసినా పనులు చేపట్టడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదవులకు అన్ని విధాలుగా గౌరవం లభించిందన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో గొర్రెల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, రాష్ట్రనాయకులు మోహిద్ఖాన్, పరమేశ్వర్, సంగప్ప, అభిషేక్ షెట్కార్, నగేష్, గీతారెడ్డి పాల్గొన్నారు. బసవేశ్వర, సంగమేశ్వరచేపట్టకుంటే ఉద్యమమే త్వరలో పాదయాత్ర మాజీమంత్రి హరీశ్రావు -
గుర్రంపై వచ్చి.. నామినేషన్ వేసి
వట్పల్లి(అందోల్): అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పట్లోళ్ల వీరారెడ్డి ఆదివారం గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండవ విడతగా జరుగనున్న ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు నామినేషన్ను అక్సాన్పల్లి క్లస్టర్లో దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ కోసం రెండు గుర్రాలను రూ.20వేలు వెచ్చించి తీసుకువచ్చారు. తాడ్మన్నూర్ గ్రామం నుంచి అక్సాన్పల్లి క్లస్టర్ వరకు వందలాది మంది కార్యకర్తలుతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్ను సమర్పించారు. -
పర్యావరణహితానికి పాటుపడాలి
ఎంపీ రఘునందన్రావుకంది(సంగారెడ్డి): వాసవీ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవలను అందించడం అభినందనీయమని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్రహిత వ్యాపారాన్ని చేయడం ద్వారా పర్యావరణహితానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రమైన కందిలో క్లబ్ జిల్లా గవర్నర్ ఇరుకుల్ల ప్రదీప్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్వదీపోత్సవంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ...వాసవీక్లబ్ కేవలం తమ వారికే కాకుండా సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అభినందించారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ వాసవీ క్లబ్ కు తనవంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..వ్యాపారస్తులు కేవలం డబ్బు సంపాదనకే ప్రాముఖ్యత ఇస్తారని అనుకోవడం సరికాదని క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ, పాఠశాలలకు బల్లలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్,వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్య ప్రకాశరావు, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కెమిస్ట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్ కుమార్, సభ్యులు చందు గుప్తా,నరేందర్, పుట్నాల లక్ష్మణ్, కటకం శ్రీనివాస్, శ్రీరాం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆకట్టుకున్న బండి షిడి
ఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ముఖ్యంగా జాతర సందర్భంగా నిర్వహించిన బండి షిడి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దైవభక్తితో పొడవాటి కర్రతో భక్తుడి కాలు చివరన కట్టి వేలాడదీసి దేవాలయం చుట్టూ తిప్పడమే షిడి ప్రదర్శన. షిడికి కట్టిన భక్తుడు చేతిలో కర్ర పట్టుకుని మరో చేతితో భక్తులపై కుంకుమ, పసుపును చల్లుతుంటాడు. బండి షిడి వీక్షించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కాగా, మల్లన్న జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నారాయణఖేడ్ -
మహిళలపై హింసను అరికట్టాలి
రామాయంపేట(మెదక్): మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ సంతోషి సూచించారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారిత కేంద్రం మెదక్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని లక్ష్మాపూర్లో జరిగిన అవగాహన శిబిరంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. లింగ ఆధారిత హింసను అరికట్టడానికి గాను ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుంచి డిసెంబర్ పది వరకు అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్ల తెలిపారు. హింసకు సంబంధించి చట్టపరమైన రక్షణ, కుటుంబాల్లో సమానత్వం, మహిళా భద్రత అంశాలపై మహిళలకు చైతన్యం కల్పించారు. మిషన్ సభ్యులు భాతరి, నాగమణి, గంగమణి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కోఆర్డినేటర్ సంతోషి -
ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ధీరుడు
● కేసీఆర్ చరిత్రను చెరిపేయలేరు ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కంది(సంగారెడ్డి): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన తరమికొట్టాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా శనివారం మండలంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఎంతో కీలకమైన రోజు అన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారని, చరిత్రను ఎవరు చెరిపేయలేరన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ధీరుడు కేసీఆర్ అని కొనియా డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజీ సీడీసీ చైర్మన్ కాసాలా బుచ్చిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 2022–23–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రవీణ, వాణిజ్యవిభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేంద్ర అకాడమిక్ అడ్వయిజర్లుగా వ్యవహరించారు. కళాశాలలోని 15 విభాగాల పనితీరు, ప్రగతిని సమీక్షించారు. ఆధునిక బోధనకు అనుగుణంగా అధ్యాపకులు తమను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అస్లం ఫారూకి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్ వల్ల కళాశాలలకు ఎంతో మేలు జరుగుతుందని, లోటు పాట్లు తెలుసుకోడానికి దోహదపడుతుందని చెప్పారు. -
సేంద్రియ సాగు.. అద్భుత ఫలితాలు..
సేంద్రియ సాగులోనూ నరేందర్రెడ్డి దిట్ట. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో వ్యవసాయోత్పత్తులు కలుషితమవుతున్న వేళ...సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించడానికి తనవంతు కృషి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన పొలంలో ఎకరా విస్తీర్ణంలో బొప్పాయి సాగు చేశాడు. ఇందులో అంతర పంటలుగా అల్లం, పసుపు, అరటి సాగు చేస్తున్నాడు. మరో రెండెకరాల్లో పందిరి పద్ధతిలో బీర, కాకర, సొరకాయను సాగుచేశాడు. ఎక ఎకరం పొలాన్ని నర్సరీకి లీజుకిచ్చాడు. మిగిలిన మూడెకరాల్లో వరి పంటను సాగు చేస్తాడు. కొన్నేళ్లుగా రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలికాడు. తన పొలంలోనే కోకోఫిట్(పడేసిన కొబ్బరి బోండాలు), పశువుల పేడ, వానపాములతో ఏటా 30 టన్నులకుపైగా సేంద్రియ ఎరువును సొంతంగా తయారు చేసుకొని పంటలకు వేస్తాడు. దీని ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాడు. అంతేకాకుండా పురుగు మందుల వాడకాన్ని తగ్గించాడు. సహజమైన పద్ధతుల్లో పురుగు మందుల నివారణకు మందులు తయారుచేసి పిచికారీ చేస్తాడు. పందిరి సాగులోని బీర, సొరకాయలకు పురుగులు రాకుండా కవర్లను కూడా కడతారు. పూర్తిస్థాయి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న నరేందర్రెడ్డి పంటలకు మార్కెట్లో భలే గిరాకీ ఉంది. ఈ పంటల ద్వారా ఏటా రూ.10 లక్షల వరకు ఆయన ఆదాయాన్ని పొందుతున్నాడు.పందిరి విధానంలో కాకర, బీర తోటల సాగురైతు నరేందర్రెడ్డికి ఆధారమైన బావి ఇదే -
సత్వర న్యాయం చేస్తాం
మెదక్ మున్సిపాలిటీ: ఎలాంటి కేసులైన వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం చేయడమే మా డ్యూటీ అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో ఇటీవల ఓ పెళ్లింట్లో 10 తులాల బంగారం చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికతను ఉపయోగించి రెండురోజుల్లో కేసు చేధించారు. చోరీకి పాల్పడిన నిందితురాలిని అరెస్ట్ చేసి బంగారాన్ని కోర్టు ద్వారా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాఽధిత కుటుంబీకులు శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీని సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు. రెండు రోజుల్లో కేసు ఛేదించిన ఇన్స్పెక్టర్ మహేశ్ను ఎస్పీ అభినందించారు. మహిళల భద్రతకే షీ టీమ్స్.. మెదక్ మున్సిపాలిటీ: మహిళలు, బాలికల భద్రత కోసమే షీటీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్లో జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివరాలను ఆయన శనివారం వివరించారు. మెదక్, తూప్రాన్ రెండు డివిజన్లలో షీటీమ్స్ ముమ్మరంగా పర్యటించాయని చెప్పారు. మెదక్ డివిజన్ పరిధిలో 5 ఎఫ్ఐఆర్లు, 8 ఈ – పిటి కేసులు, తూప్రాన్లో 3 ఎఫ్ఐఆర్లు, 7 ఈ –పిటి కేసులు నమోదు చేశారన్నారు. మొత్తం 84 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ చేశామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో నెలరోజుల్లో 55 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. బాలికలు, మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 57963, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
జిన్నారం (పటాన్చెరు): తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన రూపేరావు సునీత(52) కుటుంబ సభ్యులతో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం క్యూలైన్లో ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత శనివారం మృతి చెందింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా కిష్టయ్యపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహనం ఢీకొని వృద్ధురాలు.. కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మారెడ్డిపల్లిలో మార్వాడి మమత భర్త దేవదానం సుమారు నెల రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కొమురవెళ్లి మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన భూదవ్వ (75) మనవరాలు మమత వద్దే ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ఉదయం రాంసాగర్కు వెళ్లి తిరిగి వస్తుంది. ఈ క్రమంలో తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న ఐనాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు దిగింది. మనుమరాలి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మనవరాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి .. చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన ధర్మారం రాములు(30) ఈ నెల 11న తల్లిని ఆస్పత్రిలో చూపించి, బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి బాలమణి అక్కడికక్కడే మృతి చెందగా, రాములుకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు శనివారం మృతి చెందాడు. వాహనం ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తల్లి మృతి చెందిన 14 రోజులకు కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సకాలంలో విదేశానికి జనరేటర్
రామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం యూనిట్లో తయారైన ఎయిర్ కూల్డ్ జనరేటర్ను విదేశాలకు పంపించారు. శనివారం భెల్ ఈడి వై.శ్రీనివాసరావు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోట్స్వానా దేశంలోని జిందాలు మమాబులా ఎనర్జీ ప్రాజెక్ట్కు సంబంధించిన ఈ ఆర్డర్ను డూసాన్ స్కోడా సంస్థ 14నెలల్లో అందించాలని సూచించిందని తెలిపారు. భెల్ యాజమాన్యం సకాలంలో నాణ్యమైన ఎయిర్ కూల్డ్ జనరేటర్ను విజయవంతంగా తయారు చేసి పంపించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు విజయానికి కృషి చేసిన అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. వసురాం తండాలో తల్లీకూతురు, సంగారెడ్డి పట్టణంలోని రాజపేటకు చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. నర్సాపూర్ రూరల్: ఓ తల్లీ కూతురుతో అదృశ్యమైంది. ఈ సంఘటన నర్సాపూర్ మండలం తుజాల్ పూర్ పంచాయతీ పరిధిలోని వసురాం తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం.. వసురాం తండాకు చెందిన ఆటో డ్రైవర్ దేవవత్ రాములుకు భార్య కావేరి, కూతురు భావన ఉన్నారు. శుక్రవారం ఉదయం కావేరికి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పగా రాము ఆటోలో నర్సాపూర్కు తీసుకువచ్చి ఆస్పత్రిలో వైద్యం చేయించాడు. అతడికి ఆటో గిరాకీ రావడంతో హైదరాబాద్కు వెళ్తున్నానని, భార్య, కూతురును ఇతరుల ఆటోలో ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో రాము ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులకి ఫోన్ చేయగా ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో నర్సాపూర్తో పాటు బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. శనివారం నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజంపేటలో వివాహిత.. సంగారెడ్డి క్రైమ్: ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాము నాయుడు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాజంపేట్కు చెందిన దానరాం వీరప్రతాప్, భార్య రేణుక(32) దంపతులు. వీరికి పిల్లలు ఉన్నారు. ఇద్దరు వృత్తి రీత్యా ప్రైవేటు జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు పెరిగిపోవడంతో కుటుంబసభ్యులు పలుమార్లు ఇరువురిని మందలించారు. కోపంతో గత నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేణుక తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిస్తే 87126 61830 నంబర్లకు తెలియజేయాలని సీఐ సూచించారు. -
అనారోగ్యంతో మాజీ మావోయిస్టు మృతి
పలువురు మాజీ మావోయిస్టుల నివాళులు కొండపాక(గజ్వేల్): కొండపాక గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు పంబాల బాలనర్సయ్య (48) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. పలువురు మాజీ మావోయిస్టులు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబీకులను ఓదార్చారు. 2002 సంవత్సరంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడయ్యాడు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లో బాలనర్సయ్య పాల్గొన్నారు. 20 సంవత్సరాల పాటు మావోయిస్టుగా పని చేస్తున్న క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆర్కే(రామకృష్ణ)కు సెక్యూరిటీ ఇన్చార్జిగా పని చేశాడు. అన్ని వర్గాల ప్రజలతో కలుపుగోలుగా ఉంటూ పేదల సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ చూపేవారు. 2010లో లొంగిపోయి ఇంటి వద్దే ఉంటూ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురి కాగా చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల్లో మాజీ మావోయిస్టు పార్టీ నేతలు విమలక్క, నర్సింలు, షకీల్, రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మల్లేశం, భాను, చందు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా అభ్యర్థుల కోసం అన్వేషణ
జహీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించడంతో సర్పంచ్ పదవులకు సమర్థులైన అభ్యర్థుల కోసం నేతలు అన్వేషిస్తున్నారు. సర్పంచ్ పదవులతో పాటు వార్డు పదవులకు పోటీ చేయించేందుకు తగిన అభ్యర్థులను వెతకడం నేతలకు తలనొప్పిగా మారింది. క్రియాశీల రాజకీయాల్లో మహిళలు అంతంత మాత్రమే పాల్గొంటుండడంతో అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల నేతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్, వార్డుల రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా ఆయా పదవులకు అభ్యర్థులను గుర్తించే బాధ్యతను గ్రామ స్థాయి నేతలకు అప్పగించారు. సర్పంచ్ పదవులకు మాత్రం సరైన అభ్యర్థి ఎంపికను మాత్రం ముఖ్య నాయకులు బాధ్యతలు తీసుకుంటున్నారు. ఏయే గ్రామాల సర్పంచ్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి, రిజర్వు అయిన పదవులు ఏయే కేటగిరీల వారికి కేటాయించారనే వివరాలను చార్టుల ద్వారా చూసుకుని అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. సరైన అభ్యర్థులు దొరకని పక్షంలో అయిదారుగురిచే నామినేషన్లు వేయించి, వారిలో ప్రజల్లో తగిన గుర్తింపు ఉన్న వారికి పార్టీ మద్ధతు ప్రకటించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పతుల స్థానంలో సతులు సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు ముందస్తు నుంచి సిద్ధంగా ఉన్న నేతలకు రిజర్వేషన్లు అనుకూలంగా రాక పోవడంతో వారి సతులను సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్లు వేయించేందుకు అవసరమైన ధృవ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా పలువురు తమ సతులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించేందుకు వీలుగా నామినేషన్లు వేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో మహిళలకు రిజర్వు అయిన గ్రామాల్లో ఎన్నికలు రసవత్తరంగా, ఆసక్తి కరంగా మారనున్నాయి. సర్పంచ్ పదవులకు పలానా వ్యక్తి తల్లి లేదా భార్య పోటీ చేస్తారంటా అనే విషయాలు రచ్చబండ వద్ద చర్చకు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికలు మరింత ఆసక్తి కలిగించనున్నాయి. సతులను పోటీ చేయించేందుకు పతుల ఆరాటం 50 శాతం సీట్ల కేటాయింపుతో తగిన వారి కోసం ప్రయత్నాలు రసవత్తరంగా మారనున్న పంచాయతీ ఎన్నికలు -
జీవితంపై విరక్తి చెంది..
ఆటో డ్రైవర్ ఆత్మహత్య తూప్రాన్: జీవితంపై విరక్తి చెందిన ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... పట్టణంలోని గాంధీనగర్లోని హనుమాన్ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న సాహజీ సుధీర్(38) ఆటో డ్రైవర్. 12 ఏళ్ల క్రితం మహరాష్ట్రకు చెందిన పూజతో వివాహం జరిగింది. కాగా కుటుంబ తగాదాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సుధీర్ ఒంటరిగా ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలో నివాసం ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. బంధువులు ఇంటికి వచ్చి చూసేసరికి ఉరివేసుకున్నాడు. ఈ విషయం గుర్తించిన బంధువులు చుట్టుపక్కల వారి సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వ్యక్తిగత కారణాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని వెంకటాపూర్ శివారులో శనివారం చోటు చేసుకుంది.సదాశివపేట సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల మేరకు... కోహిర్ మండలంలోని మనీయార్పల్లి గ్రామానికి చెందిన పుర్రె దినకర్(31) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ నెల 28న బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన బైక్పై వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి శనివారం వెంకటాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.ఇంట్లోకి చొరబడి.. చైన్ స్నాచింగ్కొమురవెల్లి(సిద్దిపేట): వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసును గుర్తు తెలియని దండుగుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... మండల కేంద్రంలో సాములపల్లి అనసూర్య తన ఇంట్లో మెదటి అంతస్తులో నిద్రిస్తుంది. ఉదయం 5.30 నిమిషాల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెల్లాడు. వెంటనే ఆమె అరవడంతో దొంగ పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్, చేర్యాల సీఐ శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. 25 మంది బైండోవర్హుస్నాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి శనివారం తెలిపారు. శనివారం మండలంలో 25 మంది పాత నేరస్తులను తహసీల్దారు ముందు బైండోవర్ చేసినట్లు చెప్పారు. మిగితా నేరస్తులకు అరెస్టు వారెంట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు యువత, రాజకీయ నాయకులు సహకరించాలన్నారు. గంజాయి స్వాధీనం రాయికోడ్(అందోల్): మండలంలోని ఇటికేపల్లిలో ఎకై ్సజ్ శాఖ అధికారులు శనివారం నిర్వహించిన దాడుల్లో 230 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల మేరకు.. పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఇటికేపల్లి గ్రామ సమీపంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన శరణప్పతో గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. -
షరా మామూలే!
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తెరుచుకోని ఎమర్జెన్సీ డోర్లు ● భద్రత నిబంధనలు గాలికొదిలేసిన యాజమాన్యాలు ● విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి లోపాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతాలోపాలు షారా మామూలైపోయాయి. కర్నూలు వద్ద గత నెలలో జరిగిన ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన విషయం విధితమే. ఈ ఘటన తర్వాత రవాణాశాఖ అధికారులు తనిఖీల పేరుతో కాస్త హడావుడి చేశారు. ఈ ఘటన కాస్త మరచిపోయినట్లు కాగానే ప్రస్తుతం ట్రావెల్స్ బస్సులు ఎప్పటిలాగే భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశాయి. చాలా బస్సుల్లో వెనుక వైపు ఉన్న అత్యవసర ద్వారాన్ని పూర్తిగా మూసి వేసి.. దాని వద్ద ఒక సీటును బిగించి నడుపుతున్నారు. కొన్ని బస్సులకు ఈ అత్యవసర ద్వారం ఉన్నప్పటికీ, అది ఎంత తెరిచినా తెరుచుకోవడం లేదు. సాధారణ పరిస్థితుల్లోనే ఈ ద్వారం తెరుచుకోకపోతే, ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. కాసులకు కక్కుర్తి పడిన కొన్ని యాజమాన్యాలు కొన్ని బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ కంటే రెండు, మూడు సీట్లు అధికంగా బిగించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో సీట్ల మధ్య దూరం తగ్గి ఇరుకుగా తయారైంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఉంచే పరికరాల వినియోగంపై బస్సు సిబ్బందికి కనీస అవగాహన కూడా లేదని తనిఖీ అధికారులు గమనించారు. రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల జిల్లాలోని ముంబై హైవేపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన ఈ తనిఖీల్లో ఈ ట్రావెల్స్ బస్సుల్లోని భద్రతా లోపాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. ఇలా భద్రతా లోపాలతో నడుపుతున్న బస్సులు ఒక్కరోజే తొమ్మిదింటిని గుర్తించారు. వీటిపై కేసులు నమోదు చేసి రూ. 1.90 లక్షల జరిమానా విధించారు. ప్రతి పది బస్సులను తనిఖీలు చేస్తే భద్రతా ప్రమాణాలున్న బస్సులు కనీసం రెండు, మూడు కూడా ఉండటం లేదు. దీంతో ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించే వారి భద్రత ఎప్పటిలాగే గాలిలో దీపాలైపోయాయి. అత్యధిక బస్సులు ఇక్కడి నుంచే ప్రారంభంఏపీలోని విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాలతో పాటు, మహారాష్ట్రలోని షిర్డీ వంటి క్షేత్రాలు నిత్యం వందలాది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెళుతుంటాయి. ఇందులో సగానికి పైగా బస్సులు జిల్లాలోని పటాన్చెరు, ఇస్నాపూర్ ప్రాంతం నుంచే ప్రారంభమవుతాయి. కొన్ని సంగారెడ్డి నుంచి నడుపుతుంటారు. సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, పటాన్చెరు, బీరంగూడ, రామచంద్రాపురం ఇలా ముంబై హైవేపై పికప్ పాయింట్లు ఉంటున్నాయి. అయితే ఈ బస్సులను రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్న ఈ శాఖ అధికారులు కొన్ని రోజులకే ఈ తనిఖీలను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ట్రావెల్స్ బస్సుల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రెండో విడతకు సన్నద్ధం
సంగారెడ్డి జోన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నుంచి రెండో విడత ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగానే కేటాయించిన క్లస్టర్ల వారిగా నోటిఫికేషన్ విడుదల చేసి ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. మూడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 10 మండలాల పరిధిలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 243 గ్రామపంచాయతీలు, 2,146 వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ రూపొందించారు. అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఆయా మండలాల్లో 55 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారిగా కేటాయించిన ఆయా గ్రామాలలోని మండల పరిషత్ రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గుర్తించారు. కాగా, నామినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు స్టేజ్–1 అధికారులకు అవసరమయ్యే మెటీరియల్ సరఫరా చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు స్టేషనరీ, బ్యానర్లు తదితర సామగ్రిని నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించేందుకు హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేశారు. -
దత్తత.. ఉత్తదే..!
కాగితాలకే పరిమితమైన హామీలు సమస్యలతో ఈదుతున్న ఈదులపల్లి పటాన్చెరు: లక్డారం గ్రామాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దత్తత తీసుకున్న సమయంలో అధికారుల, పార్టీ కార్యకర్తల హడావిడి అంతాఇంతా కాదు. గ్రామంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అప్పట్లో అధికారులు రూ.10కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఒక్క పని నోచుకోలేదు. గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బండ రాళ్ల పగుల గొట్టేందుకు పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారని, వాటి ధాటికి తమ ఇళ్లు కూలుతున్నాయని శబ్ధ, వాయు కాలుష్య సమస్యలతో బాధ పడుతున్నామని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన ఎంపీ.. తర్వాత ఒక్కసారి కూడా అటువైపు మళ్లిచూడలేదు. రోడ్లు, వీధి దీపాల కోసం చేసిన ప్రతిపాదనలూ పడేశాయి. లక్డారం గేటు వరకు డివైడర్తో రోడ్డు వేస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ జరిగినా డివైడర్ వేసేంత విశాలంగా ఆ రోడ్డు నేటికీ రూపాంతరం చెందలేదు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి రచించిన ప్రణాళికలను ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి కాలేదు. గ్రామ పంచాయతీ నిధులు, ఇతర మైనింగ్ సంస్థల ఇచ్చిన విరాళాలతో గ్రామంలో ఆ తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి కానీ, ఎంపీగా అప్పట్లో పని చేసిన కొత్త ప్రభాకర్రెడ్డి చేసిన హామీలు ఏవీ అమలు కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం, ఇంటింటికి సోలార్ లాంతర్లు ఇప్పిస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ‘గ్రామజ్యోతి’పథకంలో భాగంగా ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పించాలి. గ్రామ రూపురేఖలు మార్చాలన్నది ఈ పథకం ఉద్దేశం. అప్పటి ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డిలు కూడా తమ వంతు గ్రామాలను దత్తత తీసుకున్నారు. బీబీ పాటిల్ ఝరాసంగం మండలం ఈదులపల్లిని, కొత్త ప్రభాకర్రెడ్డి పటాన్చెరు మండలం లక్డారం గ్రామాలను దత్తత తీసుకున్నారు. దీంతో ఆయా గ్రామ ప్రజలు తెగ సంబరపడి పోయారు. ఇక తమ గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మారుతాయని కలలుగన్నారు. సీన్కట్ చేస్తే.. ఆ రెండు గ్రామాల్లో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రెండింతలు సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లాలోని ఆ రెండు దత్తత గ్రామాలపై సాక్షి కథనం. ఏమీ చేయలేదుఅప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి గ్రామాన్నీ దతత్త తీసుకొని ఎలాంటి అభివృద్ది చేయలేదు. నేటికీ అవే సమస్యలతో సతమతమవుతున్నాం. క్రషర్ల కారణంగా పౌరుల జీవనం అధ్వానంగా మారింది. పగటి పూట వేలాది కంకర లారీల రాకపోకలతో దుమ్ముతూ గ్రామంతా మునిగిపోతుంది. రాత్రి పూట పేలుళ్లతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఆ సమస్యలతో జీవించడం అలవాటుగా మారింది. ఏ నాయకుడు మా గ్రామానికి చేసిందేమీ లేదు. – భరత్, లక్డారంఝరాసంగం(జహీరాబాద్): అప్పటి బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మండల పరిధిలోని ఈదులపల్లిని దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే ప్రణాళికలను జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించి సిద్ధం చేశారు. అదే ఏడాది వేసవికాలంలో గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరతను తీరుస్తారని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే విధంగా గ్రామంలో ప్రధానంగా రహదారి మధ్యలో చిన్నపాటి వంతెన అవసరం ఉంది. దీని నిర్మాణం సైతం చేపట్టకపోవడంతో మురుగు రహదారిపైనే ప్రవహిస్తుంది. దీంతోపాటు మురికి కాల్వలు, సీసీ రహదారులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటిని కాగితాలకే పరిమితమయ్యాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. -
పల్లెపోరుపై నిఘా
● రూ.50 వేలకు మించి నగదు తీసుకెళితే సీజ్ ● సమస్యల పరిష్కారానికి హెల్ప్డెస్క్ ఏర్పాటు ● హిస్టరీ షీట్లు ఉన్నవారికి బైండోవర్ ప్రశాంత ఎన్నికల కోసం అధికారుల చర్యలు నారాయణఖేడ్: జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీం (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్ఎస్టీ) టీంలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ఈ బృందాలు నగదు రవాణా, మద్యం తరలింపు, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివి అడ్డుకోవడంతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోనున్నారు. 50 వేల లోపే నగదు తరలింపు ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు రూ.50 వేల కంటే అధికంగా డబ్బును తరలించకూడదు, అలా తరలిస్తే అధికారులు డబ్బును సీజ్ చేస్తారు. ఒకవేళ రూ.50వేల కంటే అధికంగా నగదు తీసుకెళితే రశీదులు, సరైన ఆధారాలు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో చీరలు, మద్యం, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా వాటి ఆధారాలు చూపించని పక్షంలో వాటిని సీజ్ చేస్తారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ తనిఖీలు మండలానికి ఒకటి చొప్పున ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై వీరు స్పందిస్తారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. ఈ బృందంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి, నగులు పోలీసులు, వీడియోగ్రాఫర్ ఉండి వాహనాల రాకపోకలపై నిఘా పెడతారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఎస్హెచ్ఓలు తమ పరిధిలోగల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని ప్రశాంత ఎన్నికల దృష్ట్యా ముందస్తు బైండోవర్లు చేయనున్నారు. కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకాచం చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.హెల్ప్డెస్క్ ఏర్పాటు -
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
ఎన్నికల పరిశీలకులు కార్తీక్ రెడ్డి, రాకేష్ సంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికలలో తమకు కేటాయించిన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కార్తీక్ రెడ్డి, రాకేష్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నోడల్ అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జానకి రెడ్డి పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోండినారాయణఖేడ్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని అన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని తల్లిదండ్రులకూ చెప్పాలన్నారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాగా చదువుతూ తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాలని సూచించారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, సీనియర్ న్యాయవాది మారుతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలనజహీరాబాద్: రెండో విడతకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. శనివారం మండలంలోని హోతి(బి) కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల కౌంటర్లను చూశారు. అభ్యర్థులకు కేంద్రాల వద్ద తగిన వసతులు ఉన్నదీ లేనిదీ ఆరా తీశారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, ఎంపీడీఓ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్సీ రిజర్వేషన్కు నోచుకోని పంచాయతీలు
నోటుకు ఓటు అమ్ముకోవద్దు చిన్నకోడూరు(సిద్దిపేట): నోటుకు ఓటును అమ్ముకోకండి. నిజమైన సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోండి అంటూ గోడలపై పేయింటింగ్ వేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాడో విద్యావేత్త. మండల పరిధిలోని గోనెపల్లికి చెందిన విద్యావేత్త కూర రాజేందర్ రెడ్డి ఎన్నికల్లో ఓటు ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. డబ్బుకు, మద్యానికి లొంగితే జరగబోయే దుష్పరిణామానలపై అవగాహన కల్పిస్తున్నారు.అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు సర్పంచ్ స్థానానికి ఎస్సీ రిజర్వ్డ్ కాలేదు. 35 ఏళ్లుగా బీసీ, జనరల్ కేటగిరీలకు మాత్రమే దక్కుతున్నాయి. అప్పాజీపల్లి పంచాయతీలో 240, రాంపూర్ పంచాయతీ లో 250, రెడ్డిపల్లిలో 200 వరకు దళిత ఓట్లు ఉన్నాయి. ఎక్కువ జనాభా ఉన్నా ఎందుకు త మకు సర్పంచ్ పదవి వరించడం లేదో అర్థం కా వడం లేదని దళితులు వాపోతున్నారు. రెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం దేవుడెరుగు గానీ.. ఈసారి ఎస్సీలకు ఒకటే వార్డు స్థానం దక్కడం గమనార్హం. పంతులూ.. నేను గెలుస్తానా..!దుబ్బాక: పంతులూ.. ఎన్నికల బరిలోకి దిగితే గెలుస్తానా.. నా జాతకచక్రం ఎలా ఉందంటూ ఆశావహులు జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. మాకు అనుకూలంగా రిజర్వేషన్ ఉంది. సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. పోటీ చేయాలనుకున్నా.. ఇంతకు నా జాతకం బాగుందా..? నామినేషన్ ఎప్పుడు వేయాలి. పక్కా గెలుస్తానా అని ఆరా తీస్తున్నారు. ఫలానా పంతులు బాగా చెబుతాడు అంటే అక్కడికి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంతుళ్లు, జ్యోతిషులు సూచన మేరకు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు, యాగాలు చేయిస్తున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు ఆశావహులను గుళ్లు, గోపురాలు, జ్యోతిషుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తుండడం విశేషం. జ్యోతిషులను ఆశ్రయిస్తున్నా అభ్యర్థులు -
పొగ మంచుతో జరభద్రం
సంగారెడ్డి జోన్: వారం రోజులుగా చలి తీవ్రతతో పాటు పొగ మంచు విపరీతంగా పెరుగుతోంది. ఈనెల ప్రారంభం నుండే పెరిగిన చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగ మంచు కురుస్తుంది. వేకువ జామున సమయంలో ప్రయాణాలు సాగించే వాహనదారులతోపాటు వ్యాపారస్తులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతాకాలం కావడంతో ఉదయం సమయంలో కురుస్తున్న పొగ మంచు రహదారులను పూర్తిగా కమ్మేస్తుంది. ఉదయం 8:00 దాటిన పొగ మంచు తగ్గటం లేదు. దీంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం సమయంలో వివిధ పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగస్తులు, వ్యాపారాలు నిర్వహించే వర్తక, వాణిజ్యదారులు ప్రయాణాలు సాగించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే దగ్గరకు వచ్చేంతవరకు వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుని స్వల్ప గాయాల పాలవుతున్నారు. తప్పని పరిస్థితులలో తమ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణాలు చేయాలని, రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. రాత్రుల సమయం నుండే పొగ మంచు దట్టంగా కురవడంతో దూర ప్రయాణాలు సాగించే కంటైనర్లు, లారీలు రహదారుల పక్కనే నిలబెట్టుకుంటున్నారు. పోలీసుల సూచనలు ● ప్రజలు పొగ మంచులో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ● పొగమంచు దట్టంగా కమ్ముకోవటంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ● పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తూ సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పరిమిత వేగంలో ఉంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ● వాహనాలు నడుపేటప్పుడు హెడ్లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఆనన్లో ఉంచాలి. అత్యవసరమైతే తప్ప రాత్రులలో, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సెట్ బెల్ట్ ధరించాలి. ● కారులో ప్రయాణించేటప్పుడు హీటర్ ఉపయోగించాలి. దీంతో ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఎదుటి వాహనాలను సరిగ్గా గమనించేందుకు వీలు ఉంటుంది. కనిష్ట సాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఉదయం 9గంటల వరకు తగ్గని పొగ మంచు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయాలి ప్రస్తుతం శీతాకాలం కావడంతో ప్రతిరోజు విపరీతంగా దట్టమైన పొగ మంచు కురుస్తుంది. రహదారులపై మంచు కురవడంతో అత్యవసర సమయంలో మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలి. ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. –పరితోష్ పంకజ్, ఎస్పీ, సంగారెడ్డి -
చోరీ నిందితుడు అరెస్టు
తూప్రాన్: రెండు రోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రంగాకృష్ణ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని నర్సాపూర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. వెంబడించి పట్టుకొని విచారించగా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటకు చెందిన కట్ట నవీన్ (26)గా తెలిసిందన్నారు. పెయింటర్గా నవీన్ ఈనెల 25న తూప్రాన్ పట్టణ కేంద్రంలో తాళం వేసిన మహ్మద్ అస్రఫ్ అలీ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పాడు. నిందితుడి వద్ద ఏడు తులాల బంగారు ఆభరణాలు, 37 తులాల వెండి, విలువైన రెండు చేతి గడియరాలు, రూ. 20 వేల నగదును నిందితుడి నుంచి రికవరీ చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు
సంగారెడ్డి టౌన్: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి మొదటి క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి చెప్పారు. మెదక్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరి కిషన్ కథనం ప్రకారం.. 2021 ఫిబ్రవరిలో 102 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా.. జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ హెచ్ఏ మోహన్కుమార్ రమేష్ రెడ్డి గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసును జహీరాబాద్ ఎకై ్సజ్ స్టేషన్లో ఎస్ఐ ఎంటి కుమార్ కేసు నమోదు చేశారని డీసీ తెలిపారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి జయంతి.. రాథోడ్ మోహ్, రాథోడ్ వెంకట్, కేతావత్ పాండు నాయక్, రాథోడ్ మోతిరాంలకు పది సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమాన విధించారు. మరో నిందితుడికి ఐదేళ్ల జైలు ఒడిశా నుంచి ఐదు కిలోల గంజాయిని అక్రమ రవాణా చేసిన సరజిత బిశ్వాస్ (36) అదే రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన నిందితుడికి సంగారెడ్డి మొదటి క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా శుక్రవారం విధించారు. 2019లో ఒడిశా నుంచి గంజాయిని సంగారెడ్డిలో అమ్మకానికి తీసుకొచ్చిన బిశ్వాస్ను ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై హెచ్ఏ మోహన్న్కుమార్ పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. సంగారెడ్డిలో రెండు కేసుల్లో ఐదుగురికి శిక్షలు పడడానికి కృషి చేసిన ఎకై ్సజ్ సిబ్బందిని మెదక్ డిప్యూటీ కమిషనర్ జె.హరి కిషన్న్, ఈఎస్ శ్రీనివాసరావులు అభినందించారు. -
పరిశీలించి.. సూచనలు ఇచ్చి
హవేళిఘణాపూర్(మెదక్): హవేళిఘణాపూర్ ఎంజేపీ బాలుర బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ ఓఎస్డీ దిలీప్రెడ్డి శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సంక్షేమ వసతులను పర్యవేక్షించి వారితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువు పట్ల ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాగజైన్ను పరిశీలించి అభినందించారు. అనంతరం పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట పాఠశాల ఏటీపీ సంతోష్, లైబ్రేరియన్ బుర్ర సంతోష్, శ్రీను, కవిత విద్యార్థులు ఉన్నారు. -
చెరువులో పడి చావు..!
● కూతురుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం ● కాపాడిన పోలీసులుతూప్రాన్: కుటుంబ తగదాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి, కూతురును పోలీసులు రక్షించారు. ఈ సంఘటన తూప్రాన్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన రాణి, శివశంకర్ దంపతులు. వీరికి కూతురు ఉంది. శివశంకర్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య, కూతురును దుర్భాషలాడుతున్నాడు. ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తాగుడుకే పెడుతున్నాడు. ఓ శుభ కార్యానికి వెళ్లి వచ్చిన రాణికి ఇంటికి తాళం వేసి ఉంది. భర్తకు ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్లు తిడుతూ చెరువులో పడి చావుమని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన రాణి, కూతురుతో కలసి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. పట్టణ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు 100 నంబర్కు డయల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రవి, శ్రీకాంత్ చెరువు కట్ట వద్దకు వెళ్లి తల్లి, కూతురుకు నచ్చజెప్పి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. భర్తను కౌన్సెలింగ్ ఇచ్చారు. -
బాల రచయితల సమ్మేళనానికి ఎంపిక
హవేళిఘణాపూర్(మెదక్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచ సాహిత్య వేదిక కార్యక్రమానికి హవేళిఘణాపూర్ విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్ఎం కరుణాకర్ శుక్రవారం తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా ఈనెల 30న కార్యక్రమం నిర్వహించనుందని పేర్కొన్నారు. బాలసాహిత్య భేరి పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఎంతోషంగా ఉందన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాలసాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొననున్న కార్యక్రమంలో విద్యార్థులు కీర్తన, అర్పిత, అదీబ, నవదీప్, నవ్య ఎంపికై నట్లు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన ధాన్యం కుప్ప
చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్ౖప రైతు ప్రాణం తీసింది. చీకట్లో బైక్ ధాన్యం కుప్పపైకి ఎక్కగా అదుపుతప్పి కింద పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గంగాపూర్ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు...రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువారిపల్లెకు చెందిన వంచ రవీందర్ రెడ్డి(45) శుక్రవారం ఉదయం బైక్ మీద పని నిమిత్తం సిద్దిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో గంగాపూర్ వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలపైకి బైక్ ఎక్కి కిందపడిపోయాడు. పక్కనే ఉన్న బండరాళ్లపై పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సైఫ్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టగం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సుప్రియ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బైక్పై నుండి పడి రైతు మృతి -
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
తూప్రాన్: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పరిశీలకుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం కంప్యూటర్ విద్యను పర్యవేక్షించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుల బోధన తీరును ప్రశంసించారు. సమావేశంలో ఎంఈఓ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): రాష్ట్రస్థాయిలో సత్తా చాటి జిల్లా పేరును నిలపాలని విద్యాశాఖ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్లో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొనే అండర్–17 క్రీడాకారులకు చేగుంట ఉన్నత పాఠశాలలో క్రీడా కిట్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు డీకాన్ ప్లానర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు క్రీడాకారులకు కిట్లను సమకూర్చినట్లు తెలిపారు. తనువు చాలించిన భర్త కౌడిపల్లి(నర్సాపూర్): దంపతుల మధ్య జరిగిన చిన్నగొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. ఈసంఘటన మండలంలోని తునికిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతాత స్వాతికి హత్నూర మండలం మంగాపూర్కు చెందిన చైతన్య(24)ను ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అనంతరం ఇల్లరికం అల్లుడిగా తీసుకువచ్చారు. ప్రస్తుతం వీరికి పాప ఉంది. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో శుక్రవారం దంపతుల మధ్య సంసారం, డబ్బుల విషయంతో గొడవ జరిగింది. దీంతో చైతన్య మంగాపూర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి గ్రామ శివారులోని ఖలీల్సాగర్ చెరువులో దూకి చనిపోతున్నానని వేరే వ్యక్తి మొబైల్తో భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే చెరువులో దూకాడు. మృతదేహాన్ని వెతికితీసి బోరున విలపించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
● రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు ● సంగారెడ్డిలో ఘటన సంగారెడ్డి క్రైమ్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరువు మండలం భానూర్ గ్రామానికి చెందిన మొగిలిగారి ద్వారకేశ్వరీ (52) రెండు రోజులు క్రితం కొంపూర్ మండలం మాల్కాపూర్లో ఉండే తన చెల్లెలి ఇంటి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో ఉండే తన మేల్లుడు హరిచంద్ర రెడ్డి ఇంటికి బయలుదేరింది. శుక్రవారం ఉదయం పోతిరెడ్డిపల్లి నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గంలో స్దానిక స్టార్ ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు మహిళను ఢీకొట్టింది. ఆమె తలకు దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది. -
శతాధిక వృద్ధురాలు కన్నుమూత
దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లికి చెందిన అధికం సత్తవ్వ(108) శుక్రవారం కన్నుమూశారు. ఆఖరి వరకు తన పని తానే చేసుకుంటూ హుషారులగా ఉండేది. సత్తవ్వకు ముగ్గురు కుమారులు. కాగా మాజీ ఎమ్మెల్సీ షారూఖ్హుస్సేన్ సత్వవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. మహిళకు తీవ్ర గాయాలు శివ్వంపేట(నర్సాపూర్): కోతుల మంద వెంటబడడంతో తప్పించుకునే క్రమంలో ఓ మహిళ కిందపడి కాలు విరిగింది. ఈ ఘటన మండల పరిధి చండీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఉప్పరి హంసమ్మకు చెందిన వరిధాన్యం గ్రామ శివారులో ఆరబెట్టారు. సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా కోతుల మంద వెంటబడివంది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పరుగెత్తుతుండగా అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. గుర్తించిన స్థానికులు కోతులను తరిమేసి హంసమ్మను చికిత్స నిమిత్తం తూప్రాన్కు తరలించారు. కుడికాలు బొక్క విరిగిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ మహిళా మృతి చెందింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీకి చెందిన నీరుడి దినేష్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం ఇంటి తలుపులు కిటికీలకు వేసేందుకు టర్పెంట్ ఆయిల్ తీసుకొచ్చి మిగిలిన ఆయిల్ను వంట గదిలో సజ్జపై ఉంచాడు. ఈ క్రమంలో 27న ఉదయం తన తల్లి నీరుడి లక్ష్మి వంటగదిలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు టర్పెంట్ ఆయిల్ ఆమైపె పడి మంటలు అంటుకోవడంతో అరుస్తూ బయటకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వంటిమామిడి చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందం రూ. 3.20 లక్షల నగదు పట్టుకుంది. తనిఖీలో భాగంగా శుక్రవారం ఒక వక్తి వద్ద నగదును స్వాధీన ం చేసుకున్నట్లు ఎస్ఎస్టీ అధికారి తెలిపారు. అల్వాల్ నుంచి కరీంనగర్ వైపు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఆ వ్యక్తి వద్ద డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్చేసి పైఅధికారులకు అప్పగించినట్లు తెలిపారు. పటాన్చెరు టౌన్: గప్ చుప్ తిని వస్తానని వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని కటికబస్తీకి చెందిన ముస్లిం యువతి(20) 27న రాత్రి ఇంట్లో నుంచి గప్చుప్ తిని వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూప్రాన్: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో చీరతో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వెంకటాయిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కురుమ తిరుపతి (33) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరి లేని సమయంలో దులానికి చీరతో ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించా రు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
కొత్త పంచాయతీల్లో ఎన్నికళ
తొలిసారిగా ఎన్నికలు ● తండాల్లో పండుగ వాతావరణం ● బరిలో నిలిచేందుకు యువత ఆసక్తిహుస్నాబాద్: కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అవకాశం రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలంలో ఆరు గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దాస్ తండా, కెప్టెన్ చౌట్తండా, చౌటకుంట తండా, హరిరామ్ అంబానాయక్ తండా, శ్రీరామ్ తండా, సేవాలాల్ మహరాజ్ తండాలు నూతనంగా గ్రామ పంచాయతీలుగా మారాయి. ఇందులో సర్పంచ్ స్థానాలు ఎస్టీ రిజర్వుడ్ అయ్యాయి. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి సారి సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఎన్నిక అయ్యేందుకు చాలా మంది యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సర్పంచ్గా మొదటి సారి ఎన్నికై తే తమ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. ఎన్నికల క్షేత్రంలోకి యువకులు.. మొదటి సారిగా ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో యువకులు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే పడిలోపడ్డారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పరాయి పంచాయతీ పాలనలో తండాలు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందుగా ఆ గ్రామానికి వెచ్చించిన తర్వాతే తండాలకు కేటాయించే వారని, దీంతో అభివృద్ధిలో వెనుకబడి పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సేవాలాల్ మహరాజ్ తండా -
దేఖ్లేంగే.!
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉండే గ్రామాల్లో పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామాల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు, వాణిజ్యపరమైన నిర్మాణాలు అధికంగా ఉండే గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు అవసరమైతే రూ.కోటి వరకు కూడా ఖర్చుకు వెనుకాడటం లేదనే చర్చ జరుగుతోంది. మారుమూల గ్రామ పంచాయతీలతో పోల్చితే ఈ గ్రామాల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం అనేక రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. సర్పంచ్ పదవి అంటేనే సమాజంలో ప్రత్యేక విలువ ఉంటుంది. దీంతో చాలా మంది ప్రతిష్ట కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునే వారికి ఈ సర్పంచు పదవి ఉంటే ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. దీంతో నేతలు ఈ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు అతికొద్ది మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘రియల్’ గ్రామాలు.. జనరల్ స్థానాలు జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా, తొలి విడతలో 136 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, హత్నూర, గుమ్మడిదల, పటాన్చెరు మండలాల్లో ఈ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ మండలాల్లో సుమారు 40 శాతానికి పైగా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు అధికంగా ఉన్నాయి. పరిశ్రమలతో పాటు, వాణిజ్యపరమైన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామ పంచాయతీల్లో సర్పంచు పదవులను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగే గ్రామాలు చాలా మటుకు జనరల్కు రిజర్వు అయ్యాయి. దీంతో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించడంతో రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేసే నేతలు, ఆర్థిక, అంగబలం ఉన్న నాయకులు బరిలో నిలుస్తున్నారు. దీంతో ఈ గ్రామాల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. వార్డు సభ్యులు సైతం ఖర్చు సై.. ‘రియల్’ గ్రామాల్లో పల్లెపోరు ఆసక్తికరం పెద్ద గ్రామ పంచాయతీల్లో సర్పంచు పదవులే కాదు, వార్డు సభ్యుల పదవులకు సైతం పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంది వంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడి పదవి కూడా ప్రతిష్టాత్మకంగానే మారుతోంది. దీంతో ఈ అభ్యర్థులు రూ.పది లక్షల వరకు కూడా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డిపాజిట్ దక్కితేనే పరువు!
జహీరాబాద్: ఎన్నికల్లో ప్రధానంగా డిపాజిట్ అనే అంశం తరచూ చర్చకు వస్తుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల నేతలు డిపాజిట్ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. డిపాజిట్ దక్కించుకుని అయినా పరువు కాపాడుకో అనే విషయాన్ని ఎదుటి పార్టీల అభ్యర్థులపై సైటెర్లు వేస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం డిపాజిట్ అనే పదానికి ప్రాముఖ్యత ఉంది. డిపాజిట్ కూడా రాకున్నా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడంటూ ప్రత్యర్థులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటారు. కొందరు ఎన్నికల్లో డిపాజిట్ దక్కదని తెలిసినా ఎదుటి వ్యక్తిని ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు అయినా పోటీకి దిగుతుంటారు. ఎన్నికల్లో గెలువకున్నా కనీసం డిపాజిట్ను అయినా దక్కించుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. డిపాజిట్ కథ గురించి తెలుసుకుంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధకారికి నగదు రూపంలో కొంత డబ్బు డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది. డిపాజిట్కు సంబంధించిన రశీదును పొందిన తర్వాత నామినేషన్ పత్రానికి జత చేయాలి. లేని పక్షంలో నామినేషన్ పత్రాన్ని తిరస్కరిస్తారు. సర్పంచ్గా పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000 వంతున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 1/6వ వంతు ఓట్లు రాకుంటే డిపాజిట్ గల్లంతే... ఎన్నికలు జరిగిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థులకు పోలై, చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. అంతకన్నా తక్కువ వస్తే అతను డిపాజిట్ కోల్పోయినట్లు గుర్తిస్తారు. ఉదాహరణకు 500 ఓట్లు పోలై అన్ని చెల్లుబాటు అయ్యాయనుకుంటే పోటీచేసిన వారికి ఒక్కొక్కరికి 1/6వ వంతు అంటే 80 ఓట్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు అతడికి డిపాజిట్ దక్కినట్లు. లేకపోతే డిపాజిట్ దక్కనట్లు అర్థం. 1/6వ వంతు లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీ చేసిన సమయంలో డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇస్తారు. 1/6వ వంతు కన్నా తక్కువ వచ్చిన వారి డిపాజిట్ డబ్బులను ఇవ్వకుండా వాటిని పంచాయతీ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేస్తారు. -
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని 85003 76267 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో న్యాయవాదులు, ఇన్సూరెనన్స్ అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. మొండి బకాయిలు, యాక్సిడెంట్ కేసులు, చిట్ఫండ్ కేసులు వంటివి రాజీపడే అన్ని కేసులను పరిష్కారమయ్యే విధంగా సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు మీడియా సహకరించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీపీఆర్ఓ విజయలక్ష్మి, అడిషనల్ డీపీఆర్ఓ ఏడుకొండలు తదతరులు పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీల్లో ‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ జహీరాబాద్: గత సెప్టెంబర్లో ముంబయికి చెందిన మాస్టర్ ఆర్ట్ వారు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 16 మంది ఉత్తమ ప్రతిభను కనబర్చి పతకాలు సాధించారు. వీరిలో ఐదుగురు గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎల్.రాములు, వైస్ ప్రిన్సిపాల్ కె.కుమార్, ఆర్ట్ ఉపాధ్యాయుడు శ్రీపాద్లు పేర్కొన్నారు. ఆర్.శివరాం స్కెచింగ్ అండ్ డ్రాయింగ్లో 4వ బహుమతి సాధించారన్నారు. బి.రవీందర్కు మాస్ట్రో అవార్డు, ట్రోఫీ లభించిందని తెలిపారు. నేడు విద్యుత్ సరఫరా అంతరాయంపటాన్చెరు టౌన్: చెట్ల కొమ్మలు తొలగింపు నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని ఏఈ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐనోల్, పటేల్గూడ సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 11 నుండి 11:30 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు. -
‘అష్టమి’ ఎఫెక్ట్..
‘నవమి’ కోసం వేచిచూసి చీకటిపడిన తరువాతకొనసాగిన నామినేషన్ల సందడివర్గల్(గజ్వేల్): పంచాయతీ సంగ్రామంలో నిలబడే అభ్యర్థులు శుభముహుర్తాలు చూసుకుంటున్నారు. ‘శుక్రవారం అష్టమి బాగుండదు, సాయంత్రం నవమి వచ్చేదాకా వేచిచూద్దామన్నట్లు’ చాలా వరకు అభ్యర్థులు వ్యవహరించారు. నవమి తిథికి అనుగుణంగా సాయంత్రం 5 గంటలలోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కొక్కరుగా నామినేషన్లు వేశారు. దీంతో వర్గల్ మండలంలోని నెంటూరు, వర్గల్, మీనాజీపేట క్లస్టర్ కేంద్రాలలో చీకటి పడిన తరువాత కూడా అభ్యర్థుల నామినేషన్ల సందడి కొనసాగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోగా కేంద్రానికి వచ్చిన వారందరికి చీకటిపడినప్పటికీ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించామని ఈ సందర్భంగా వర్గల్ ఎంపీడీఓ మచ్చేందర్ పేర్కొన్నారు. -
ఏకగ్రీవం.. చట్టవిరుద్ధం
● నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు ● సీపీ విజయ్కుమార్హుస్నాబాద్: గ్రామ పంచాయతీల్లో వేలం పాట ద్వారా సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్ట విరుద్ధమని సీపీ విజయ్కుమార్ అన్నారు. వచ్చే నెల 3న సీఎం రేవంత్రెడ్డి హుస్నాబాద్లో పర్యటించనున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఎన్నిక నిబంధనల పరంగా జరగాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం కోసం డబ్బులు, వస్తువులు, భూములు ఇవ్వాలని డిమాండ్ చేసి, మిగిలిన ఆశావహులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. దీంతో ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. వేలం పాట వేయడం, బెదిరించడం, స్వచ్ఛందగా నామినేషన్లు వేసే వారిని ఎవరూ అడ్డుకోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు, రౌడీషీటర్లు, కేసులు ఉన్నవారిని, గొడవలు చేసే వారిని బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో డబ్బులు, మద్యం, గిఫ్ట్ వస్తువులు పంచరాదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు. -
గుట్టుగా.. గుట్కా!
● యథేచ్చగా సాగుతున్న వ్యాపారం ● మొక్కుబడిగా అధికారుల తనిఖీలు ● అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు జహీరాబాద్ టౌన్: జిల్లా వ్యాప్తంగా గుట్టుగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని నిషేధించినా విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కిరాణ దుకాణాలు, పాన్ షాపుల్లో బహిరంగంగా విక్రహిస్తున్నారు. సంబంధిత అధికారుల మొక్కుబడిగా తనిఖీలు చేయడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దీంతో నిషేధించిన గుట్కా దందా జిల్లాలో యఽథేచ్చగా సాగుతుంది. వివరాల ప్రకారం.. గుట్కాను ప్రభుత్వం నిషేధించగా కొంత మంది కర్ణాటక నుంచి జిల్లాలో గుట్కా విక్రయించి రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులోని బీదర్ నుంచి వాహనాల్లో గుట్కా ప్యాకెట్లు మార్కెట్లోకి చేరుతున్నాయి. హోల్సేల్ వ్యాపారులు సిగరెట్లు, బీడీలు విక్రహించే వీధి వ్యాపారుల ద్యారా చిన్న దుకాణాలు, పాన్ షాపులకు సరపరా చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో తయారైన సాగర్, గోవా, మాణిక్చంద్, తదితర పేర్లతో జిల్లా అంతటా దర్శనమిస్తున్నాయి. ప్రతి కిరాణ, పాన్ షాపుల్లో గుట్కా, కై నీ, పాన్ మసాలా వంటి వాటివి విక్రయిస్తున్నా.. అధికారులు తనిఖీ సమయాల్లో మాత్రం కనిపించడం లేదు. యువత గుట్కాకు బానిస అవుతుండగా దీనిని అదనుగా చేసుకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రూ.10కి లభించే గుట్కా మసాలా రూ.20 నుంచి రూ. 30 వరకు అమ్ముతున్నారు. రూ.లక్షల్లో ఆదాయం గుట్కా బిజినెస్లో వ్యాపారులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక్క గుట్కా లారీ వ్యాపారి వద్దకు వస్తే కనీసం రూ. 20 లక్షల వరకు సంపాదన వచ్చినట్టే. ఈ నెల 10న బీదర్ పట్టణం నుంచి జహీరాబాద్ వస్తున్న గుట్కా లారీని కొంత మంది దుండగులు గంగ్వార్ వద్ద నిలిపి అపహరించారు. దోపిడికి పాల్పడిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రూ. 20 లక్షలకు పైగా విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఉక్కుపాదం మోపాలి గుట్కాకు యువత బానిస అవుతోంది. గుట్కాకు అలవాటు పడిన వారు మానే పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం లేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకు నోటిలో గుట్కా ఉంటుంది. గుట్కా, పాన్ మసాలా తినే వారు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా మంది రోగాల బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికార యంత్రాగం ప్రజా ఆరోగాన్ని హాని చేసే గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపుతానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం పట్టణంలోని 11వ వార్డులో రూ.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎంపీ ప్రారంభించారు. అనంతరం పెద్దమఠం సందర్శించి జగద్గురువు గది, మఠం నిర్మాణ భవనాన్ని పరిశీలించారు. అయితే పురాతనమైన మఠం నిర్మాణం శిఽథిలావస్థకు చేరడంతో మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని మఠం నిర్వాహకులు మఠం లింగానందస్వామి ఎంపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం మఠం తరపున ఎంపీ రఘునందన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శివాజీ, మాజీ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, బీజేపీ నాయకులు దేశ్పాండే, మాణిక్రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు సతీష్, సంగమేశ్వర్, సాంబశివ, నవీన్కుమార్, విజయ్కుమార్ పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
ఉచిత మెగా వైద్య శిబిరం
జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి శివారులో గల జీఎంఆర్ కాలనీలో ఆర్వీఎం ఆస్పత్రి సౌజన్యంతో స్థానిక ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ దండే రమాకాంత్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చొద్దు
సంగారెడ్డి టౌన్: పంట కోతల తర్వాత వ్యర్థాలను కాల్చడంతో భూసారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా అదనపు వ్యవసాయశాఖ అధికారి వెంకటలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వరి కొయ్యలు కాల్చడం–నష్ట నివారణ చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. రైతులు పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి కొయ్యలు తగలపెట్టవద్దు కల్హేర్(నారాయణఖేడ్): వరి కోతలు పూర్తి చేశాక కొయ్యలను తగలబెట్టవద్దని ఖేడ్ డివిజన్ ఏడీఏ నూతన్కుమార్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని బీబీపేట్లో పర్యటించారు. వరి కొయ్యలు కాల్చితే నేలలోని సేంద్రియ పదర్థాలు, పోషకాలు నశిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, రైతులు రామకృష్ణగౌడ్, సంగమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. వరి కొయ్యలను కాల్చొద్దు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలంలోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలను కాల్చొద్దని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ... వ్యవసాయ క్షేత్రాల్లో కూలీల కొరత నేపథ్యంలో రైతులు వరి కోత యంత్రాలైన ఆర్వెస్టర్లను వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీంతో పశుసంపద గడ్డిని సేకరించకుండా వదిలేస్తున్నారన్నారు. దీంతో గడ్డిని దహనం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దహనం చేయడంతో ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి వెంకటలక్ష్మి -
విద్యాసామగ్రి అందజేత
నారాయణఖేడ్: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 80 మంది విద్యార్థులకు గురువారం ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్రావు, ఝాన్సీలక్ష్మిలు అమెరికాలో ఉన్న తమ కూతురు బిందు సాహితీ, సంతోష్ల సహకారంతో నోట్బుక్స్, పెన్నులు, ఇతర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయసాధనలో విద్యార్థులు ముందుండాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మన్మథకిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, హామీద్, చంద్రశేఖర్, ఆర్టీసీ సిబ్బంది భాస్కర్, శివకుమార్ పాల్గొన్నారు. తపస్ నూతన కమిటీ ఎన్నిక నారాయణఖేడ్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారులు, పరిశీలకులుగా రాష్ట్ర బాధ్యులు పెంటారెడ్డి, సునార్ రమేష్, దత్తాత్రి, సుధాకర్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా రతన్సింగ్, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి కిరణ్కుమార్, గౌరవ అధ్యక్షుడిగా వడ్ల రాజయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా నందప్ప, ప్రతాప్, మహిళా కార్యదర్శిగా మహాదేవి, కోశాధికారిగా యోగేశ్, చాప్టా(కె) కాంప్లెక్స్ కన్వీనర్గా అనంత పద్మనాభం, సంజీవన్రావుపేట కాంప్లెక్స్ కన్వీనర్గా సుదర్శన్, ఖేడ్ కాంప్లెక్స్ కన్వీనర్గా జగదీశ్ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే నివాసంలో మహాపడిపూజ నారాయణఖేడ్: ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో గురువారం పురోహితులు మలమంచి మోహన్ జ్యోషి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, అయ్యప్పస్వామి దీక్షాధారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమారులు, భక్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు ఎమ్మెల్యే సునీత రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గురువారం ఆయనతోపాటు పార్టీలో చేరిన తన అనుచరులకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కాసాలకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. దోమల నివారణకు చర్యలు జిన్నారం(పటాన్చెరు): బొల్లారం పట్టణ పరిధిలోని 19వ వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కార్మికులు దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా వార్డులోని ఇళ్లు, పరిసరాలు, రోడ్లు తదితర ప్రాంతాల్లో మిషన్తో ఫాగింగ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక నిజాంపేట(మెదక్): 69 ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా తూప్రాన్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలెక్షన్న్ అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు నిజాంపేట విద్యార్థి బద్రీనాథ్ ఎంపికయ్యారు. మహబూబాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోధ్యాయులు మహేందర్ తెలిపారు. కార్యక్రమంలో పీడీ ప్రవీణ్, ఇతర ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. భోంగోండేశ్వర విగ్రహావిష్కరణ కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని నాగుర్(బీ)లో గురువారం కుర్మ సంఘం కుల బాధ్యులు ఏర్పాటు చేసిన మహాత్మ భోంగొండేశ్వర విగ్రహాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపుమల్శెట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రసాద్, ఖేడ్ ఉపాధ్యక్షుడు బీర్గొండ మండల అధ్యక్షుడు చంద్రుగొండ తదితరులు పాల్గొన్నారు. -
అధిక సాంద్రత పత్తి సాగుపై క్షేత్ర ప్రదర్శన
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని చింతకుంటలో గురువారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగుపేట్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగుపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సాంద్రత పద్ధతిలో వేసిన పత్తి పంటపై రైతులతో రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ మాట్లాడారు. సాధారణ పత్తి కంటే ఈ అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో సాగు చేస్తే మేలైన దిగుబడితో పాటు తక్కువ పంటకాలంతో పంట తొందరగా చేతికి వస్తుందన్నారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు రామాదేవి మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతిలో రైతులు మొదటి పంట పూర్తికాగానే రెండవ పంట విత్తుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్–2 రేఖా మనోజ్, యంగ్ ప్రొఫెషనల్–1 ఎస్. శ్రీకాంత్, కె.ఆకాష్, వేద సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్ బాలాజీ, రైతులు తమ్మలి రాములు, సీతారాల మల్లేశం, పుట్టి మల్లేశం, కొత్తపల్లి దుర్గయ్య, వెంకయ్య, ఒగ్గు లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
హత్నూర(సంగారెడ్డి): మండలంలోని బోరపట్లలో స్థానిక ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కంగ్టి(నారాయణఖేడ్): స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓ సత్తయ్యతో పాటు ఎస్ఐ దుర్గారెడ్డి గురువారం పరిశీలించారు. మండలంలోని ఎన్కెమురి, దామర్గిద్దా, జమ్గి(కే), బాన్సువాడ తదితర గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సరిపడా భవనాలు, ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు రావడానికి ర్యాంప్లు పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలిరోజు నామినేషన్లు షురూ
సంగారెడ్డి టౌన్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల హడావిడి మొదలైంది. మొదటి విడతలో భాగంగా జిల్లాలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి మండలంలోని 11 గ్రామాల్లో ఎన్నికల జోరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆశవాహులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లను వేసేందుకు సిద్ధమయ్యారు. మండలంలో నాలుగు క్లస్టర్లలో నామినేషన్లను అందజేస్తున్నారు. ఇస్మాయిల్ ఖాన్ పేటలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మంజుల నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలని ఎస్పీ పంకజ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట డీఎస్పీ సత్తయ్య, ఎంపీడీఓ నిహారిక, తహసీల్దార్ జయరాం, మండల అధికారులు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నామినేషన్ల పర్వం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలైంది. మండలంలోని వెల్టూర్, వెంకటాపూర్, పెద్దాపూర్, ఆరూర్, మద్దికుంట, ఆత్మకూర్, కంభాలపల్లి క్లస్టర్లలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా క్లస్టర్లలో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా వార్డ్ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నామినేషన్లు జోరు హత్నూర (సంగారెడ్డి): మండలంలో 38 గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి రోజు 20 సర్పంచ్ నామినేషన్లను అభ్యర్థులు వేసినట్లు ఎంపీడీఓ శంకర్ తెలిపారు. మండల వ్యాప్తంగా 11 క్లస్టర్లు ఏర్పాటు చేయగా సర్పంచ్ అభ్యర్థుల కోసం 20 నామినేషన్లు, వార్డు మెంబర్ల కోసం 29 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ షురూ జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గ్రామపంచాయతీకి సంబంధించి 2 సర్పంచ్ స్థానాలు, రెండు వార్డు స్థానాలు, మంబాపూర్ రెండు, నాగిరెడ్డిగూడెంకు ఒక వార్డు, రామిరెడ్డిబావికి 1 సర్పంచ్ స్థానం, మొత్తం 5 సర్పంచి స్థానాలకు, 3 వార్డు స్థానాలకు మొదటి రోజు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ తెలిపారు. 3 గ్రామాలకు 6 నామినేషన్లు.. పటాన్చెరు టౌన్: మండల పరిధిలోని నందిగామ, భానూర్, క్యాసారం మూడు గ్రామాలకు 6 మంది సర్పంచుల నామినేషన్లు దాఖలు చేయగా.. మూడు గ్రామాల వార్డుల స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు మండల ప్రత్యేక అధికారి ఐనీష్, ఎంపీడీఓ యాదగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎన్నికలకు పైసలెట్ల..?
‘పంచాయతీ’పై ‘రియల్’ ప్రభావంగజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండేవి. కొంతకాలం నుంచి పరిస్థితి భిన్నంగా మారింది. ఈక్రమంలోనే ఆశావహుల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆశావహులందరూ ఎన్నికల బరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు కీలకం. కనుక ఏమీ చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరూ ఎక్కువ ఖర్చు పెడితే..వారు గ్రామాల్లో పట్టునిలుపుకుంటారనే పరిస్థితి రావడంతో ఇది పోటీదారులకు ఛాలెంజ్గా మారింది. జోరుగా నడిచిన కాలంలో.. ‘రియల్’ వ్యాపారం జోరుగా నడిచిన కాలంలో ప్రధాన రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో ఒకటి, రెండు గుంటలు అమ్ముకుంటే చాలు.. ఎన్నికల ఖర్చు సమకూరుతుందనే ధీమాలో ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ముచ్చుకై నా కనిపించడం లేదు. ఒక వేళ కొనుగోలు చేస్తామని ఎవరైనా వచ్చినా...అత్తెసరు ధరకు కొంటామని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరైతే ఎలాగైనా సర్పంచ్గా ఎన్నికై గ్రామంలో పట్టు సాధించాలనే సంకల్పంతో.. వాస్తవ ధరకు 50శాతం తగ్గినా అమ్మడానికి వెనుకాడటం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సిద్ధమైన ఓ పార్టీ నాయకుడు ఇప్పటికే తక్కువ ధరకు భూమిని అమ్ముకొని డబ్బులు సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలో సన్నిహితులు, స్నేహితుల ఎంత వారించినా వినకుండా ముందుకుసాగుతున్నారు. తాకట్టు రుణాల వైపు పరుగు డబ్బులను ఇన్స్టంట్గా పొందడానికి సర్పంచ్ పోటీదారులు వేరే దారిలేక... తాకట్టు రుణాలవైపు పరుగు తీస్తున్నారు. బంగారం మొదలుకొని ఇళ్లు, పొలాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ బ్యాంకులో రోజువారీగా 5 గోల్డ్ లోన్లు చేయడమే గగనంగా ఉండేది. నేడు సీను మారిపోయింది. సర్పంచ్ ఔత్సాహికుల వల్ల నిత్యం 20కిపైగా గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. బంగారం లేని వ్యక్తులు ఇళ్లు, పొలాలు, ప్లాట్లు వడ్డీ వ్యాపారులకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండ్రోజులుగా ఈ వ్యవహారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. భూములు, ప్లాట్ల ధరలు పడిపోవడంతో ఆశావహుల్లో నిరాశ అమ్మకాల్లేక నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు -
సమయపాలన పాటించాలి
● కలెక్టర్ ప్రావీణ్య● పకడ్బందీగా ఎన్నికలనియమావళి అమలు ● ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశంసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధి నిర్వహణలో అధికారులు తప్ప నిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు ఎస్పీ పరితోష్ పంకజ్, అధికారులు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం 10 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు. 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు మొదటి దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు, ఇతర డేటాలను వెంటనే టీపోల్ వెబ్సైట్, యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందనరావు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. ముమ్మర తనిఖీలు చేయండి సంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్హెచ్ఓలు తమ పరిధిలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో మార్కు చేయించాలని, వీడియో రికార్డింగ్ చేయించాలని పేర్కొన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు. -
ఇక సంగ్రామమే..!
నేటి నుంచి నామినేషన్లు ● 36 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ● 7 మండలాలలో ఎన్నికల నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగంసంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టానికి వేళయింది. గురువారం ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. మూడు రోజులపాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాలలో అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 136 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఏడు మండలాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 136 గ్రామపంచాయతీలు, 1246 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 21 సంవత్సరాలు నిండి అదే గ్రామం పంచాయతీలో ఓటరు అయి ఉండాలి. అలాగే.. ప్రతిపాదించే వ్యక్తి సైతం అదే ఓటరు జాబితాలో నమోదై ఉండాలి. 36 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు మొదటి విడతలో భాగంగా ఏడు మండలాల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల కొరకు 36 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో మండల కేంద్రాలలో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరించేవారు. ప్రస్తుతం మండలంలో క్లస్టర్లుగా విభజించి ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలలోని మండల పరిషత్, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గుర్తించారు. దీంతో దూర భారంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఒకే ప్రదేశంలో అన్ని కేంద్రాలు ఉంటే అందరూ ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. సజావుగా సాగేందుకు స్థానికంగానే కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన డిపాజిట్ తప్పనిసరి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దేశించిన డిపాజిట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్క్ పోటీ చేసే అభ్యర్థి అన్ రిజర్వ్ అయితే రూ.2వేలు, రిజర్వ్ అయితే రూ.1000, వార్డుకు పోటీ చేసే అభ్యర్థి రూ.500, రిజర్వ్ అయితే రూ.250 నిర్ణయించారు. పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పన్ను చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ పొందాలి. 7 మండలాల్లో ఓటర్ల వివరాలు మండలం పంచాయతీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులు హత్నూర 38 334 20841 22051 2 గుమ్మడిదల 8 66 4318 4716 2 పటాన్చెరు 3 36 6487 6511 0 కంది 22 212 18616 19181 2 కొండాపూర్ 24 222 17545 18325 1 సదాశివపేట 30 272 19933 21083 0 సంగారెడ్డి 11 104 9273 9757 1 -
చెరకు రైతుకు తీపి కబురు
జహీరాబాద్: జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఈ విషయమై యాజమాన్యం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. మహారాష్ట్రకు చెందిన ఓ బడా సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో క్రషింగ్ను చేపట్టేందుకు వీలుగా కొత్త యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్మాగారంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయాన్ని కార్మిక వర్గాలు సైతం ధృవీకరించాయి. కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం చేతులెత్తేయడంతో మూడేళ్లుగా మూత పడింది. దీంతో జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న సుమారు 8లక్షల టన్నుల చెరకు పంట రాష్ట్రంలోని గణపతి, కొత్తకోట, మాగి తదితర కర్మాగారాలకు తరలించారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం రైతులు చెరకు ఉత్పత్తులను తరలించుకుని విక్రయాలు చేసుకోక తప్పలేదు. 2020–21 సీజన్లో ట్రైడెంట్ యాజమాన్యంలో క్రషింగ్ చేపట్టక పోవడంతో మూతపడింది. 2022–23 సీజన్కు గాను కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించారు. అప్పట్లో 2.55లక్షల టన్నుల చెరకును కర్మాగారం క్రషింగ్ జరిపింది. అనంతరం యాజమాన్యం రైతులకు బిల్లులు వాయిదాల రూపంలో చెల్లిస్తూ పోయింది. అయినా రూ.9 కోట్ల బిల్లులు రైతులకు బకాయి పడింది. దీంతో అధికార యంత్రాంగం కర్మాగారాన్ని వేలం వేసి రైతులకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధపడింది. దీంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఎట్టకేలకు యాజమాన్యం స్పందించి బకాయిలు చెల్లిస్తూ వచ్చింది. ఇప్పటికీ ఇంకా రూ.9లక్షల మేర రైతుల బిల్లులు బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కర్మాగారాన్ని నడిపే పరిస్థితుల్లో యాజమాన్యం లేక పోవడంతో మూడు సీజన్ల పాటు క్రషింగ్ను చేపట్టక మూత పడేశారు. 2013–24, 2024–25, 2025–26 సీజన్కు గాను కర్మాగారం మూత పడింది. దీంతో అధికారులు జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకు పంటను తరలించుకునేందుకు ఆయా కర్మాగారాలకు అలాట్ చేశారు.పూర్తిస్థాయిలో క్రషింగ్ కర్మాగారంలో ఉన్న యంత్రాలను యాజమాన్యం తరలించే ప్రయత్నం చేయడంతో తాము అభ్యంతరం చెప్పి నిలిపివేసినట్లు జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ వెల్లడించారు. ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కర్మాగారంలో మరమ్మతులు పనులు ప్రారంభం అయ్యాయని, జనవరిలో క్రషింగ్ను మొదలు పెట్టే విధంగా కొత్త యాజమాన్యం కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. వచ్చే సీజన్లో పూర్తి స్థాయిలో క్రషింగ్ నిర్వహిస్తామన్నారు.ఇప్పటికే మరమ్మతు పనులు షురూ జనవరిలో క్రషింగ్కు కసరత్తు కొత్త యాజమాన్యం చేతుల్లోకి ‘ట్రైడెంట్’ -
నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి
● నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుచుక్కా రాములు డిమాండ్సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. బుధవారం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే దేశ స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వావలంబనను తాకట్టు పెడుతుందన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్గా మార్చిందన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఈ పని చేసిందన్నారు. ఈ కోడ్ల వల్ల కార్మికులకు అనేక సౌకర్యాలను కాలరాస్తుందని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టానికి సైతం కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ప్రసాద్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జయరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్, సాయి ఐఎన్టీయూసీ నాయకులు రాజేందర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు రాజయ్య ప్రజాసంఘాల నాయకులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు కీలక పోస్టుల భర్తీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్శాఖలో కొంత కాలంగా ఖాళీగా ఉన్న కీలక ఉన్నతాధికారుల పోస్టులు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి. ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులను నియమిస్తూ ఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పర్యవేక్షక ఇంజనీర్గా పనిచేసిన శ్రీనాథ్ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇన్చార్జిగా మేడ్చల్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కామేశ్కు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ జిల్లాలో పనిచేసే అధికారి ఇక్కడ పూర్తి స్థాయిలో పనులను పర్యవేక్షించడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ పోస్టులో సుధీర్కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో పనిచేస్తున్న సుధీర్కుమార్ ఇక్కడికి పదోన్నతిపై వచ్చారు. బుధవారం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. డీఈగా నెహ్రూనాయక్ సంగారెడ్డి డీఈగా నెహ్రూనాయక్ నియమితులయ్యారు. ఇక్కడ డీఈగా పనిచేసిన సురేందర్రెడ్డి ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టులో ఇన్చార్జి అధికారే కొనసాగుతున్నారు. ఎట్టకేలకు దాదాపు ఆరునెలల తర్వాత ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిని నియమించారు. సైఫాబాద్లో పనిచేస్తున్న నెహ్రూనాయక్ కూడా పదోన్నతిపై సంగారెడ్డి డీఈగా వచ్చారు. ఆయన కూడా బుధవారం విధుల్లో చేరారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న పలువురు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు పదోన్నతులు వచ్చాయి. ఇలా పదోన్నతులు పొందిన వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించింది. మరో ఇద్దరు ఏడీఈలకు పదోన్నతులు, బదిలీలు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఏడీఈలకు పదోన్నతులు లభించాయి. కన్స్ట్రక్షన్ విభాగంలో ఏడీఈగా పనిచేస్తున్న రామేశ్వర స్వామికి డీఈగా పదోన్నతి వచ్చింది. ఆయన్ను మెదక్ జిల్లా ఆపరేషన్ విభాగం డీఈగా బదిలీ చేసింది. అలాగే హెచ్టీ విభాగంలో పనిచేస్తున్న మరో ఏడీఈ వేణుకు కూడా ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ సౌత్ డివిజన్ డీఈగా ఆయన్ను బదిలీ చేశారు. చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారిని నియమించారు. -
ఎస్సై సారు నన్ను కాపాడిండు
● ఆయనకు రుణపడి ఉంటా ● హత్యాయత్నం నుంచి బయటపడిన ఫిర్యాదుదారుడి ఆవేదన సిద్దిపేటరూరల్: సుపారీ తీసుకుని తనను చంపేందుకు ప్రయత్నించిన వారి నుంచి ఎస్ఐ సారు కాపాడిండు. సారుకు చచ్చేదాకా రుణపడి ఉంటానని ఓ ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల చిన్న గుండవెల్లి గ్రామానికి చెందిన పుల్లగూర్ల ఎల్లారెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఎస్ఐ రాజేశ్ చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు. వారిని పట్టుకోకపోతే నా ప్రాణాలు తీసే వారని, మీరు లేకపోతే నా కుటుంబం రోడ్డు పాలయ్యేదని ఎస్ఐని పట్టుకొని బాధను వ్యక్తం చేశాడు. తాను తన కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్ఐ పనితీరు బాగుందంటూ పలువురు అభినందనలు తెలిపారు. -
భూ సేకరణలో చేతివాటం!
● నలుగురు బినామీల పేరిట రూ.35 లక్షలు స్వాహా ● నష్టపోయిన రైతులకు మాత్రం మొండిచేయి ● పంపకాల్లో తేడాలతో విషయం బయటకురోడ్డు విస్తరణలో భూములు పోనివారికి పరిహారం ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ రైతు పేరు మేఘావత్ పంగి. మెదక్ జిల్లాలోని హవేళిఘనాపూర్ మండలం సోచమ్మరాళ్ గ్రామం. మెదక్–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి విస్తరణలో 10 గుంటల భూమి పోయింది. కానీ ఆమెకు ఇప్పటికి పైసా పరిహారం అందలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈమెతో పాటు అర్హులైన ఎంతోమంది బాధితులకు పరిహారం ఇవ్వలేదు. కానీ అసలు భూమిపోని వారికి మాత్రం పరిహారం ఇచ్చారు. మెదక్జోన్: మెదక్ నుంచి నిజామాబాద్ జిల్లాను కలిపే–ఎల్లారెడ్డి, రుద్రూర్ 765(డీ) రహదారి డబుల్రోడ్డు నిర్మాణం కోసం 2021 నోటిఫి కేషన్ విడుదల కాగా.. అదే ఏడాది అక్టోబర్ 22లో జాతీయరహదారుల అథారిటీ గెజిట్ను విడుదల చేసింది. ఈ రోడ్డు 62.92 కిలోమీటర్లకు గాను రూ.426.52 కోట్ల అంచనాతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా పరిధి, మెదక్ పట్టణం ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వరకు 44 కిలోమీటర్లకు టెండర్ దక్కించుకుని పనులు కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణం 2026 వరకు పూర్తి కావాల్సి ఉంది. భూమి పోని రైతులకు పరిహారం! రహదారి విస్తరణలో భాగంగా పోచమ్మరాళ్ గ్రామంలో భూమి పోని ఆరుగురు రైతులకు రూ. 47లక్షల పైచిలుకు చెల్లించారు. కాగా ఆ రైతులకు సంబంధించిన భూమి గ్రామ పరిసర ప్రాంతంలో ఉంది. అసలు రోడ్డు విస్తరణలో భూమే పోలేదు. కాగా ఓ మహిళా రైతుకు రూ. 13.50 లక్షల పరిహారం మంజూరి కాగా సదరు మహిళ భూమి పోలేదని అదే గ్రామానికి చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఆమె డబ్బులను చెల్లించకుండా బ్యాంకులోనే నిలిపివేశారు. మరో ముగ్గురు రైతుల భూమి పోకున్నా 10 గుంటల భూమి పోతుందని తప్పుడు రికార్డులు సృష్టించి ఓ మధ్యవర్తి ద్వారా అధికారులు వారి అకౌంట్లో రూ. 35 లక్షలు జమచేశారు. తరువాత ఆ డబ్బులను తీసుకున్నట్లు తెలిసింది. కాగా వీటి పంపకాల్లో అధికారులకు, సదరు మధ్యవర్తికి తేడా రావటంతో ఈ విషయం బయటకు పొక్కింది. భూ సేకరణలో అవకతవకలు! మెదక్ నుంచి జిల్లా సరిహద్దు గ్రామం పోచమ్మరాళ్ వరకు రోడ్డు విస్తరణ కోసం అవసరమైన 11.65 హెక్టార్ల భూమి సేకరించేందుకు 84 మంది రైతులకు నోటీసులు అందించారు. ఇందులో 10.39 హెక్టార్ల భూమి తీసుకునేందుకు రైతులను ఒప్పించారు. ఎకరాకు రూ.8.34 లక్షలుగా ధర నిర్ణయించారు. కాగా పట్టాభూమి, అసైన్డ్ భూమికి సైతం ఒకే ధరను నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోచమ్మరాళ్ గ్రామంలో 29 మంది రైతులకు చెందిన 5 ఎకరాల భూమి పైచిలుకు సంబంధించి పరిహారంగా రూ.14.83 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా 24 మంది రైతులకు రూ.12.64 కోట్ల పరిహారం చెల్లించారు. ఫిర్యాదు రావటంతో ఆపాం పోచమ్మరాళ్ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు భూమి పోకున్నా ఆమె ఖాతాలో రూ.13.50 లక్షలు పడ్డాయి. అది తప్పు అని ఫిర్యాదు రావటంతో నిలిపి వేశాం. – సింధూరేణుక, తహసీల్దార్, హవేళిఘనాపూర్ నిర్మాణంలో ఉన్న మెదక్–ఎల్లారెడ్డి రహదారి -
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
సిద్దిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనసిద్దిపేటఅర్బన్: మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి సమీర్ రాజ్ కృష్ణ, అతని తల్లి వీణ తెలిపిన వివరాల ప్రకారం.. సమీర్ రాజ్ కృష్ణ మొదటి సంవత్సరం చదువుతుండగా అదే కళాశాలకు చెందిన సెకండ్, థర్డ్ ఇయర్కు చెందిన నలుగురు విద్యార్థులు కలిసి ఈ నెల 17న లైబ్రరీకి రావద్దు, గడ్డం ఎందుకు పెంచుకున్నావ్ తీసేసుకో అంటూ బలవంతంగా గడ్డం తీసేయించారు. ఈ విషయాన్ని తన తల్లి వీణకు తెలపగా కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి చెప్పాలని సూచించగా కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కమిటీకి ఎందుకు ఫిర్యాదు చేశావంటూ మరోసారి ర్యాగింగ్కు పాల్పడ్డారు. ర్యాగింగ్ కమిటీ రెండవ సారి విచారిస్తామని చెప్పగా బాధిత విద్యార్థి తల్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా తనను పట్టించుకోలేదని, ర్యాగింగ్ చేసిన విద్యార్థులకే సపోర్ట్గా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ర్యాగింగ్కు పాల్పడకుండా విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధిత విద్యార్థి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు త్రీటౌన్ సీఐ తెలిపారు. -
ఆధ్యాత్మికతతో పరిపూర్ణమైన శాంతి
● టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ● శ్రీరాంపూర్లో దుర్గమ్మ ఆలయానికి భూమిపూజములుగు(గజ్వేల్): ఆధ్యాత్మిక మార్గం శాంతియుత జీవనానికి దోహదపడుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ములుగు మండలం శ్రీరాంపూర్లో బుధవారం దుర్గమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మరలినప్పుడే శాంతిని, భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్గుప్తా, డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు దేవేందర్రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లె ప్రగతి ఎలా ఉంది?
జార్ఖండ్ అధికారుల బృందం ఆరాగజ్వేల్రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జార్ఖండ్ అధికారుల బృందం పరిశీలించింది. బుధవారం ఎన్ఐఆర్డీలోని రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన 26 మంది అధికారుల బృందం ఫీల్డ్ విజిట్లో భాగంగా టీమ్ లీడర్ నిహాల్, ఎన్ఐఆర్డీ కోఆర్డినేటర్ ఆరీఫ్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని దిలాల్పూర్లో పల్లె ప్రకృతివనం, సోక్పిట్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, వైకుంఠధామం, పండ్లతోటల్లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్, బెజుగామలో పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, బయ్యారంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ బృందం సభ్యులకు నోడల్ అధికారి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఏపీవో సురేందర్ స్థానికంగా జరిగిన పనులకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వస్త్రాల తయారీలో నేతన్నల కృషి భేష్
గజ్వేల్లో పర్యటించిన రష్యాకు చెందిన ప్రొఫెసర్ల బృందం గజ్వేల్రూరల్: చేనేత వస్త్రాల తయారీలో నేతన్నల కృషి అభినందనీయమని, ఈ వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందని నొసిబిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొనియాడారు. రష్యాలోని నోసిబిల్ యూనివర్సిటీకి చెందిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రొఫెసర్ ఆండ్రీ, ప్రొఫెసర్ లూపా, ప్రొఫెసర్ అలీనాలు ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్న ఏఐ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి అనూప్ ఆధ్వర్యంలో బుధవారం గజ్వేల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పద్మశాలి చేనేత సహకార సంఘం భవనంలో వస్త్రాల తయారీని పరిశీలించారు. వీరికి పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవదాసు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని వివరించారు. అనంతరం పట్టణంలోని భగవాన్ సత్యసాయి దేవాలయాన్ని దర్శించుకొని తెలుగులో శ్లోకాలను పాడి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ప్రొఫెసర్ల బృందం సభ్యులచే రామనామాలను లిఖింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇండియా–రష్యా మిత్రదేశాల మాదిరిగా మోడీ, పుతిన్లు మంచి మిత్రులన్నారు. భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలంటే తమకు ఇష్టమని, ఇక్కడి ఆచారాలంటే తమకు గౌరవమని అన్నారు. కాగా సాయంత్రం వేళ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంను సందర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వీరి వెంట పద్మశాలి యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రేమ్కుమార్తో పాటు పద్మశాలి, యువజన సంఘం సభ్యులు ఉన్నారు. -
మొగ్గు మున్సిపాలిటీకే
సంగారెడ్డి జోన్: మున్సిపపాలిటీలలో విలీనమైన గ్రామపంచాయతీల కార్యదర్శులు మున్సిపల్ శాఖలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పలు గ్రామపంచాయతీలను కలుపుతూ నాలుగు విడతల్లో కొత్త మున్సిపాలిటీలను ఏర్పా టు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ విలీన కార్యదర్శులు నేటి వరకు మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ ద్వా రా వేతనాలు పొందుతున్నారు. వీరు పీఆర్ శాఖలోనే కొనసాగుతారా? లేక మున్సిపల్ శాఖలోకి మారుతారో తమ నిర్ణయాన్ని తెలపాలంటూ ఐదు రోజుల క్రితం విలీన కార్యదర్శులకు ప్రభు త్వం ఆదేశించింది. గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, కోహీర్ కొత్తగా మున్సిపల్గా ఏర్పా టు కాగా అమీన్పూర్, తెల్లాపూర్లో పలు పంచాయతీలు వీలినం అయిన సంగతి తెలిసిందే. మున్సిపల్ శాఖలోనే పనిచేసేందుకు ఆసక్తి జిల్లాలో 45 గ్రామ పంచాయతీలు విలీనం కాగా ప్రస్తుతానికి మొదటి రెండు విడతల్లో విలీనమైన కార్యదర్శుల నుంచి మాత్రమే వివరాలు సేకరించింది. అయితే ఇందులో మొదటి రెండు విడతల్లో 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వారి నుంచి ఆప్షన్లు సేకరించే నాటికి ఒకరు పదవీ విరమణ చెందారు. మరొకరు గ్రూప్ 2 ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మరో నలుగురు డిప్యూటేషన్పై విధులు నిర్వహించడంతో తిరిగి యథా స్థానాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 19 మంది కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించ గా 14 మంది మున్సిపల్లోకి, ఐదుగురు పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతూ తమ నిర్ణయం తెలిపారు. ము న్సిపల్ శాఖలో పదోన్నతులు త్వరితగతిన లభి స్తాయని ఆలోచనతో ఆ శాఖపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. గ్రేడ్ల ఆధారంగా త్వరితగతిన మున్సిపల్ కమిషనర్ వరకు అవకాశాలు లభిస్తా యని చెబుతున్నారు. అభిప్రాయ సేకరణ పూర్తి కావడంతో మరో పది రోజుల్లో కోరుకున్న విధంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలో విధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
● డ్రైవర్ అప్రమత్తతతో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ● సమయస్ఫూర్తిపై ప్రశంసలు ● సత్కరించిన యాజమాన్యం
శభాష్.. దత్తన్న జహీరాబాద్: విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ స్కూల్ బస్కు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రావూస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిధిన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సులో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా మంటలు వ్యాపించాయన్నారు. వెంటనే డ్రైవర్ దత్తు అప్రమత్తమై బస్సును నిలిపివేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. అనంతరం మరో బస్సులో విద్యార్థులను తమ ఇళ్లకు తరలించారని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించినందుకు యాజమాన్యం ఆయనను సత్కరించి నగదు పారితోషికం అందజేసింది. ఈ సమావేశంలో అడ్మిన్ డైరెక్టర్ విశ్వాస్రావు, స్టేట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ విజయ, వైస్ ప్రిన్సిపాల్ రేణుక పాల్గొన్నారు. -
రూ.63 లక్షలు వడ్డీలేని రుణాలు
జహీరాబాద్ టౌన్: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జహీరాబాద్ ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. పట్టణ సమీపంలో గల పస్తాపూర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మహిళా సంఘాలకు రూ.63లక్షల వడ్డీలేని రుణాలను చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలన్నారు. వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యేపెద్దశంకరంపేట(మెదక్)/నారాయణఖేడ్: స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీతో అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకాంక్షించారు. పెద్దశంకరంపేటలో మంగళవారం కల్యాణలక్ష్మి, రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.25 లక్షలతో మరమ్మతుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఖేడ్లోని సాయిబాబా ఫంక్షన్హాల్లో వడ్డీ రాయితీ కింద ఖేడ్ మండలానికి రూ.78.77లక్షలు, మనూరుకు రూ.32.34లక్షలు, నాగల్గిద్దకు రూ.22.28లక్షలు, సిర్గాపూర్కు రూ.39,08లక్షలు, కంగ్టికి రూ.35.37లక్షలు, కల్హేర్కు రూ.48.81లక్షలకు సంబంధించిన చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి అందజేశారు. -
మహిళాసాధికారతతోనే అభివృద్ధి
సంగారెడ్డి: మహిళా సాధికారతతోనే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందోల్ నియోజకవర్గంలోని 4,039 మహిళా సంఘాలకు రూ.4.52 కోట్లు, జిల్లాలో 15,909 సంఘాలకు మొత్తం రూ.18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పావలా వడ్డీ రుణాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని గుర్తు చేశారు. అయితే గత పదేళ్లుగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల గురించిన మాటే లేకుండా పోయిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రూ.50 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుందని తెలిపారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలే
మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరికనర్సాపూర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ఇసుక బజార్ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇందిరమ్మ లబ్ధిదారులకు, ప్రభుత్వ ప్రాజె క్టులు, నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా స్థానిక ఇసుక బజార్లో స్టాకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారానే అనుమతించాలని, టిప్పర్ల కదలికలు, ఇతర వివరాలు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్లు ఉన్నారు. -
ఉజ్వల్ వైపే మొగ్గు!
● సీఎం రేవంత్రెడ్డిని కలిసిన దామోదర ● సంగారెడ్డి డీసీసీ పదవి విషయంపై చర్చ! ● రెండు, మూడు రోజుల్లో ప్రకటన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి పీటముడి వీడనుంది. ఈ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఉజ్వల్రెడ్డికే ఈ పదవి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అధినాయకత్వం నుంచి ప్రకటన వెలువడనుందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పదవి విషయంలో మొదటినుంచి ఉజ్వల్రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఉజ్వల్రెడ్డిని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్లిన దామోదర ఈ పదవి విషయంలో సీఎంతో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జునఖర్గేతో కూడా మంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డితోపాటు, పెండింగ్లో ఉన్న రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవులపై రెండు రోజుల్లో అధిష్టానం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఉజ్వల్కు దామోదర బాసట రానున్న రోజుల్లో ఎంతో కీలకంగా మారనున్న డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఉజ్వల్రెడ్డి వైపే మంత్రి దామోదర మొగ్గు చూపుతున్నారు. అనూహ్యంగా ఈ పదవి నియామకం విషయంలో అధినాయకత్వం ఈసారి అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం విదితమే. అన్ని జిల్లాల డీసీసీలను ప్రకటించిన అధిష్టానం సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను పెండింగ్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒకవిధంగా మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రతిష్టాత్మక అంశంగా మారింది. -
కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి/కొండాపూర్(సంగారెడ్డి): కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను, నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుని రావాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లోకి వచ్చిన వారికి సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని వెంకటేశ్వర గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వచ్చిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే ఆ గ్రామానికి చెందిన ముఖ్యనాయకులు ఆ అభ్యర్థి విజయానికి పూర్తి సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీల్లో గెలిస్తే వారిని సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్లి..ఆయా గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీఇచ్చారు. సంగారెడ్డి నుంచి పోటీ చేయను మరో మూడేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని జగ్గారెడ్డి మరోమారు స్పష్టం చేశారు. -
లాభమా.. నష్టమా..!
● గ్రేటర్లో మూడు మున్సిపాలిటీలు విలీనం ● తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారంలో చర్చ ● పన్నులు తప్ప ఒరిగిందేమి ఉండదని భావన ● నైరాశ్యంలో రాజకీయ నేతలు పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విలీన ప్రక్రియతో లాభమా.. నష్టమా అనే విషయమై బేరీజు వేసుకుంటున్నారు. ప్రగతి పరుగులు పెడుతోందని కొందరు వాదిస్తుండగా.. తమకు మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తోందని, తమ ఆశలు అడియాసలయ్యాని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళితే.. వెంటనే పరిష్కారమయ్యేదని, అదే జీహెచ్ఎంసీ అయితే అధికారులు దొరకడమే గగనమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విలీనంపై అనేక భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మున్సిపల్ పాలక వర్గాల గుడువు ముగిసి దాదాపు రెండేళ్లు పూర్తి అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. గ్రేటర్ విలీనం కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారనే చర్చ కూడా సాగింది. ఈ ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి లేదా గచ్చిబౌలి ప్రాంతంలోని ఇతర వార్డులను కలిపి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారనే చర్చ జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటుపై స్థానిక నాయకులు ఎమ్మెల్యేతో గతంలో చర్చించారు. అన్ని ఊహాగానాలకు తెర దించుతూ ప్రభుత్వం ఆ మూడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీన నిర్ణయాన్ని ఆమోదించింది. జీహెచ్ఎంసీ పాలనలో పట్టణాల అభివృద్ధి అంత సాఫీగా జరగదనే అపప్రద ఈ ప్రాంతంలో నెలకొంది. పటాన్చెరును పంచాయతీ నుంచి గ్రేటర్లో కలిపినప్పటి నుంచి పౌరులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కాలంలో వేసిన రోడ్లు, ఇతర అభివృద్ధి తప్పితే కొత్తగా ఒరిగిందేమీ లేదనే చర్చించుకుంటున్నారు. ప్రజలపై పన్నుల భారం తప్పితే జీహెచ్ఎంసీలో విలీనంతో అభివృద్ధి కుంటుపడుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ చైర్మన్లు, కౌన్సిలర్లుగా ఉన్న నాయకులు తమ రాజకీయ భవితపై దృష్టి పెట్టారు. అయితే కాలనీల్లో కొత్త ఓటర్లు, సామాజిక స్పృహ ఉన్న ఇతర వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నేతల రాజకీయాలకు చెక్ పడే అవకాశం కూడా ఉంది. అమీన్ఫూర్, తెల్లాపూర్లలో గేటెడ్ కమ్యూనిటీలు ఇతర కాలనీ సంఘాల నేతలు క్రియాశీలంగా ఉంటూ కాలనీ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కొత్తగా విలీనమైన ఈ పట్టణాల్లో ఎన్ని కార్పొరేషన్ డివిజన్లు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70 వేల పైగా జనాభా ఉంటుంది. 2019లో పాలకవర్గం ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ రోజారాణి ఆధ్వర్యంలో 22 మంది కౌన్సిల్ సభ్యులతో మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడింది. రింగ్రోడ్డు లోపలున్న ఈ మూడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు కేబినెట్ ఆమోదం తెలపడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో రంగానికి సిద్ధమయ్యారు. ఈ వార్త వారిని నిరాశకు గురిచేసింది. స్థానికుల్లో ఆందోళన తెల్లాపూర్ మున్సిపల్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక నేతల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా విజయం సాధిస్తామని ఆయా పార్టీల కార్యకర్తలు ఐదేళ్లుగా అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంలో వారందరూ అయోమయంలో పడ్డారు. మున్సిపాలిటీగా ఉంటే 17 నుంచి 20మందికి పైగా కౌన్సిలర్లుగా ఉండే అవకాశం ఉంది. కానీ విలీనం కారణంగా ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని వాపోతున్నారు. సుమారు పదేళ్ల క్రితం విలీన ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ఆ సమయంలో నాటి జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయిది. మళ్లీ తెరపైకి రావడంతో చర్చనీయాంశమైంది. -
భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మండలం, సంగారెడ్డి పట్టణం , కంది మండలం, కొండాపూర్ మండలానికి సంబంధించిన 21లక్షల 33వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు కావస్తున్నా మున్సిపాలిటీ, గ్రామాల్లో నయా పైసా అభివృద్ధి లేదన్నారు. ప్రకటనలకు పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో పనులు లేవన్నారు. శంకుస్థాపన చేస్తున్నారే తప్ప పనులు ప్రారంభించడం లేదన్నారు. కాంగ్రెస్ అన్ని రకాలుగా విఫలం అయ్యిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పేద కుటుంబాలకు ఇవ్వాల్సిన చీరలను ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకుంటుందన్నారు. గ్రామాలలో స్థానిక ఎన్నికలు ప్రకటన సందర్భంగా ఎన్ని చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. -
దేశ ఐక్యతకు పాటుపడాలి
జహీరాబాద్ టౌన్: దేశాభివృద్ధి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డీఎస్పీ సైదానాయక్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం ‘జాతీయ ఐక్యత మార్చ్’ను నిర్వహించారు. జిల్లా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కళాశాలల యాజమాన్యా లు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ మైదానంలో డీఎస్పీ సైదానాయక్ జెండా ఊపి మార్చ్ను ప్రారంభించారు. మార్చ్ ప్రధాన రహదారి గుండా పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యుజవన అధికారి రంజిత్రెడ్డి, డీఏఓ వంశీ, రూరల్ సీఐ హన్మంత్నాయక్, ఎస్ఐ వినయ్కుమార్, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హరికుమార్, ఎంఈఓ మాణయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీమా పరిహారం పెంపు
● జిల్లాలో 3 డివిజన్లు ● 25వేల మంది కార్మికులు మెదక్ కలెక్టరేట్: భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రత్యేక బీమా పరిహారాన్ని పెంచింది. గతంలో ప్రమాదవశాత్తు మృత్యువాత పడినా..అంగవైకల్యానికి గురై మంచాన పడినా వారిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడేది. దీంతో కార్మికుల కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పెరిగిన బీమా సొమ్ము.. ఇప్పటికే కార్మికశాఖలో ఆన్లైన్ ద్వారా నమోదు పొందిన కార్మికులకు సాధారణ మరణం పొందితే రూ.1.30లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే కేంద్రం రూ.6లక్షల పరిహారం అందిస్తుంది. ప్రస్తుతం ప్రభు త్వం ఈ బీమా పరిహారాన్ని పెంచింది. కార్మికులు సాధారణ మరణం పొందితే రూ.1.30లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచింది. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు, ప్రమాదవశాత్తు కార్మికుడు పాక్షిక వైకల్యం పాలైతే రూ.4లక్షలు, పూర్తి వైకల్యానికి గురైతే రూ.5లక్షల పరిహారం అందేలా మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ కానీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 వేలతో ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. నమోదు చేసుకుంటే చాలు భవన నిర్మాణ రంగ కార్మికులు ఆన్లైన్లో నమోదు చేసుకొని లేబర్కార్డు పొందితే చాలు బీమా వర్తిస్తుంది. ఆధార్కార్డు, రెండు పాస్పోర్టుసైజు ఫొటోలతో మీసేవ కేంద్రంలో సంప్రదిస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫీజు రూ.110 ఉంటుంది. దాన్ని కలెక్టరేట్లోని కార్మికశాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం కార్డు వస్తుంది. జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట కార్మిక సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న కార్మికులు 25వేల మంది ఉన్నారు. ప్రయోజనాలు ప్రమాద బీమానే కాకుండా కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు, డెలీవరిలకు సైతం కార్మికశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. కార్మికుడు లేదా కార్మికులికి సంబంధించిన మొదటి ఇద్దరు కూతుర్ల పెళ్లికి రూ.30వేల చొప్పున రూ.60వేలు, అనంతరం రెండుసార్లు డెలీవరీలకు రూ.30వేల చొప్పున రూ.60వేలు మొత్తం రూ.1.20లక్షలు అందిస్తుంది. అలాగే కార్మికులు అనారోగ్యానికి గురై మంచాన పడినా కొంత పరిహారం ఇస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి భవన నిర్మాణ కార్మికులు ఆన్లైన్లో నమోదు చేసుకొని లేబర్కార్డు పొందాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. కార్మికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సత్యేంద్ర ప్రసాద్, జిల్లా ఇన్చార్జి సహాయ కార్మిక అధికారిపెరిగిన బీమా పరిహారంపై కార్మికులకు తెలిజేసేందుకు ఈనెల 24న కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్మికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం నుంచి కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 8 వరకు కొనసాగించనున్నారు. -
కాపర్వైర్ దొంగల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: కాపర్వైర్ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకొని రిమాండ్కు పంపించారు. మంగళవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 18న ప్రగతి ధర్మారంలోని మహేశ్వరి బిన్ని రైస్ మిల్లులో షట్టర్ తాళం పగులగొట్టి గుర్తుతెలియని దొంగలు కాపర్ వైర్లు, మోటార్లు, బ్యాటరీలు, ఎర్తింగ్ ప్లేట్లు తదితర విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ బాలరాజు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు రామాయంపేట – ప్రగతి ధర్మారం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గూడ్స్ వాహనంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు రామాయంపేటతో పాటు చేగుంట, మెదక్, తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట, గౌరారం ప్రాంతాల్లో మొత్తం 8 దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన వస్తువులను మేడ్చల్లోని ఒక స్క్రాప్ షాప్కు విక్రయించారు. పట్టుబడిన వారిలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన మొహమ్మద్ సాధిక్ ఖాన్, బహదూర్, అనిల్, రామ్ కేవల్, ప్రదీప్ సహాని, రామ్ కిస్కేవత్ ఉన్నారు. పరారీలో ఉన్న మరోముగ్గురి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితుల నుంచి గూడ్స్ వాహనం, కట్టింగ్ మెషీన్లు, రంచీలు, ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవర్లు, సుమారు 2 కిలోల కాపర్ వైర్లు, రూ.610 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.10లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ, బాలరాజు, కానిస్టేబుళ్లు నాగభూషణం, భాస్కర్ను ఎస్పీ అభినందించారు. -
చోరీ నిందితుడు అరెస్ట్
గజ్వేల్రూరల్: ఎలక్ట్రిక్ వాహనాల సంబంధించిన బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో గజ్వేల్ సీఐ రవికుమార్ కేసు విరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని కార్తికేయ ఇ – వెహికల్స్ గోదాం ఇన్చార్జిగా రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లి గ్రామానికి చెందిన విక్రమ్గౌడ్ పనిచేస్తున్నాడు. ఇటీవల గోదాంలో నుంచి బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయని కార్తికేయ వెహికల్స్ యజమాని మహిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు పర్యవేక్షణలో గజ్వేల్ సీఐ రవికుమార్, డిటెక్టివ్ సీఐ ముత్యంరాజు, ఏఎస్ఐ యాదగిరి, సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కేసును ఛేదించారు. ఈ సందర్భంగా చోరీకి పాల్పడిన వ్యక్తి విక్రమ్గౌడ్ నుంచి రూ. 85వేల నగదు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన రాయవరం గ్రామానికి చెందిన వెంకటేశంతో పాటు మరో వ్యక్తి శేషుల నుంచి రూ. 65వేల నగదు, మొత్తం 25 బ్యాటరీలు, మరో వ్యక్తి నుంచి రూ. 35వేలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అ దుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ నరసింహులు అభినందించారు. -
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఆరు తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు అపహరణ తూప్రాన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీ సొత్తును అపహరించారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని సాయినగర్ కాలనీలో మజీద్ పక్కన మూడో అంతస్తులో అస్రఫ్అలీ నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో కింది అంతస్తులో నిద్రిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇదే అదునుగా భావించిన దొంగలు పైఅంతస్తులోని ఇంటి తాళం కట్టర్తో కట్ చేసి, బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, విదేశీకి చెందిన విలువైన రెండు చేతి గడియరాలు, రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. ఉదయం గమనించిన అస్రఫ్అలీ పోలీసులకు తెలుపడంతో ఎస్సై శివానందం క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా పక్కనే ఉన్న మరో ఇంటి మెట్లపై రక్తం మరకలు ఉండటంతో దొంగలకు గాయాలైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అల్లాదుర్గంలో ఆటో.. అల్లాదుర్గం(మెదక్): ఇంటి ముందు నిలిపిన ఆటోను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం అల్లాదుర్గంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన రాజు ఏపి 23వై 4670 నెంబర్ గల ఆటోను సోమవారం రాత్రి తన ఇంటి ముందు రోడ్డుపై పార్క్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆటోను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
ఎత్తెంత.. బరువెంత..?
చిన్నారుల ఆరోగ్యంపై సర్కార్ దృష్టి ● చూపు, వినికిడి లోపాలపై కూడా.. ● చిన్నారులకూ 100మి.లీ పాలు ● కేంద్రాల ఆవరణల్లో ఆకుకూరల సాగుచిన్నారులను పరిశీలిస్తున్నాం పిల్ల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారా లేదా అన్న విషయాలను పరిశీలిస్తున్నాం. చిన్నారుల్లో వినికిడి లోపం, ఆరోగ్య సమస్యలు కన్పిస్తే గుర్తించి వారి కుటుంబీకులకు తెలియపర్చి తగు చికిత్సలు అందిస్తాం. స్థలాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ వాటికలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు అలాట్ చేశాం. – లలితకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, సంగారెడ్డినారాయణఖేడ్: చిన్నారుల్లో వస్తున్న ఆరోగ్య లోపా లు నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్వాడీలకు వచ్చేది పేద, మధ్యతరగతి చిన్నారులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల వీరు వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడంలేదని, వారి ఎదుగుదల కూడా సరిగ్గాలేని విషయాన్ని మహిళా సీ్త్రశిశుసంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. చిన్నారుల ఆరోగ్యం పరిశీలనతోపాటు వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందజేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణీలకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలను అందజేస్తున్నారు. ఈ తరహాలోనే చిన్నారులకు సైతం 100 మి.లీ చొప్పున పాలను అందజేయనున్నారు. బాల్యం బలహీనం జిల్లాలోని మెజార్టీ అంగన్వాడీ కేంద్రాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో ఉండే చిన్నారుల్లో లోపాలను అధికారులు గుర్తించారు. జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారులు 1,02,755 మంది అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. వీరిలో తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు (ఎస్ఏఎం) 627మందిగా, తక్కువ పోషకాహార లోపం ఉన్న పిల్లలు (ఎంఏఎం) 2,623 మందిని గుర్తించారు. ఇక గర్భవతులు 7,973 మంది, బాలింతలు 6,779మంది కేంద్రాలకు వస్తున్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీనెల చిన్నారుల బరువు, ఎత్తు సక్రమంగా తీస్తున్నదీ లేదా అన్న అంశాలపై మహిళా సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి లలితకుమారి క్రాస్ చెకింగ్ కోసం రెండు నెలల క్రితం జిల్లాలోని సూపర్వైజర్లతో అన్ని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయించారు. ఆరోగ్యంపై దృష్టి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్లలోపు చిన్నారులందరికీ రక్తపరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. వీరితోపాటే కేంద్రలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు కూడా రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్నారులు బలహీనతతోపాటు కంటిచూపు, వినికిడి లోపాలు, వయస్సు ప్రకారం రావాల్సిన మాటలు వస్తున్నదీ లేనిదీ గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కంటిచూపు, వినికిడి లోపాలు, మాటలు సక్రమంగా పలకక పోవడం లాంటివి గుర్తిస్తే తల్లిదండ్రులకు తెలియపర్చి వారికి జిల్లా కేంద్రా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్సలు అందజేయనున్నారు. వారికి శస్త్రచికిత్సలు అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకోనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పోషణ్ వాటిక కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాల ఆవరణల్లో పాలకూర, టమాట, వంకాయ, బెండకాయ, మెంతికూర వంటి పౌష్టిక ఆకు కూరలు, కూరగాయలు పండించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్దేశించిన కేంద్రాలకు రూ.9,500 చొప్పున అందజేస్తున్నారు. జాతీయ పోషణ మిషన్కు అనుబంధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు -
టీసీఏ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మాట్లాడుతున్న టీసీఏ ప్రతినిధులుగజ్వేల్రూరల్: టీసీఏ(తెలంగాణ క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ గోల్డ్కప్ కప్ 2025– టీ20 క్రికెట్ టోర్నమెంట్కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు టీసీఏ జిల్లా కన్వీనర్ చెందిరెడ్డి, కోఆర్డినేటర్ హరి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకే సిద్దిపేట జిల్లా జట్టుకు ఎంపికలు చేపడుతున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ ఫైనల్ పోటీలు హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయం 10గంటలకు సిద్దిపేట మినీస్టేడియంలో, గజ్వేల్లోని ఐవోసీ మైదానంలో సెలక్షన్స్ ఉంటాయని తెలిపారు. అన్ని వయసుల క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని, వివరాలకు 7780 596892, 9704 626760ను సంప్రదించాలని సూచించారు. -
కబ్జా భూములను కాపాడండి
కలెక్టర్కు సీపీఎం నేతల వినతిపటాన్చెరు: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో కబ్జాలకు గురవుతున్న భూమిని కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గ్రామంలో భూసేకరణ చేసిందని, ఎకరాకు రూ.15.70 లక్ష లు నష్టపరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అనేక మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదన్నారు.కార్యక్రమంలో సాయిలు, జంగయ్య, నాగభూషణ, మహిళలు పాల్గొన్నారు. -
ఆరుగురు బైండోవర్
అక్కన్నపేట(హుస్నాబాద్): అనుమతులు లేకుండా గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులను సోమవారం తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు బెల్ట్ షాపు దుకాణదారులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానతో పాటు కేసుల పాలవుతారని హెచ్చరించారు. ఇద్దరిపై కేసు నమోదు మునిపల్లి(అందోల్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బీదర్ నుంచి హైదరాబాద్కు యాక్టీవాపై ఇద్దరు వ్యక్తులు 115 గ్రాముల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్లోని చింతల్ విజయనగర్ కాలనీకి చెందిన దేవరకొండ నాని, చింతల్ ద్వారకానగర్కు చెందిన పల్లి సాయి పవన్ బీదర్ ఇరానీ గల్లీలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు 115 గ్రాముల ఎండు గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, యాక్టీవాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వాహన తనిఖీల్లో పోలీస్ కానిస్టేబుల్ హనీఫ్, సంతోష్, డ్రైవర్ అహ్మద్ పాషా ఉన్నారు. గజ్వేల్రూరల్: మార్కెట్లో తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం గజ్వేల్లో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... మండలంలోని కొల్గూరు గ్రామానికి చెందిన ముత్యాల వినయ్కుమార్ దంపతులు కూతురు మనస్విని(4)తో కలిసి సోమవారం సాయంత్రం గజ్వేల్లోని మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి తప్పిపోవడంతో తండ్రి 100కు డయల్చేశాడు. సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బ్లూకోల్ట్ సిబ్బంది కృష్ణ, కరుణాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి ఆచూకీని గుర్తించారు. అనంతరం వినయ్కుమార్ దంపతులకు అప్పగించారు. -
పేదలకు అత్యాధునిక వైద్యం
● త్వరలో సూపర్ స్పెషాలిటీఆస్పత్రిని ప్రారంభిస్తాం ● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు టౌన్: కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆస్పత్రి వైద్యులు, టీజీఎంఎస్ఐడీసీ విభాగం అధికారులతో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రూ.187 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయిని, త్వరలోనే ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఆస్పత్రి సివిల్ పనులు పూర్తయ్యాయని, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ మెషిన్, ఇతర పరికరాల కోసం రూ.23 కోట్ల 56 లక్షల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పేదలకు సైతం అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఈన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ షరీఫ్, ఈఈ రవీందర్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి డాక్టర్ చంద్రశేఖర్, ఆస్పత్రి సలహా సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పురాతన రాతి నూనె గానుగలు
మిరుదొడ్డి(దుబ్బాక): పురాతన శాసన ఆనవాళ్ల ద్వారా నాటి గ్రామ విధి విధానాలను తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే కోవలో పురాతన కాలం నాటిదిగా చెప్పబడుతున్న రాతి నూనె గానుగ మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని బొమ్మరాజు చెరువు ఆయకట్టులో వెలుగు చూసింది. పురాతన కాలంలో రాతి, సున్నం, చెరుకు రసం గానుగలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. రాతి గానుగలను ఆడించే వారిని గానుగల వారనీ, తైలీకులనీ, గాండ్ల వారని పిలిచేవారని నానుడి. ఇలాంటి నూనె గానుగలు జిల్లాలోని నంగునూరు, కొండపాకలో దర్శనమివ్వడం విశేషం. ఈ గానుగలు గ్రామీణ ప్రాంతాల్లో 50 ఏళ్ల క్రితం వరకు వినియోగంలో ఉండేవనీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవి కనుమరుగైపోయినట్లు తెలంగాణ ఔత్సాహిక చరిత్ర కారులు కొలనుపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి -
తల్లీ, కొడుకుల అదృశ్యం
మెదక్ మున్సిపాలిటీ: నాలుగేళ్ల కొడుకుతోపాటు తల్లీ అదృశ్యమైంది. ఈ సంఘటన మెదక్ పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మహేశ్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన గొలుసుల అనీత నాలుగేళ్ల కొడుకు శివకుమార్ను తీసుకొని ఈనెల 6న ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. ఆరోజు నుంచి బంధువులు, స్థానికంగా వెతికినా వారి ఆచూకీ లభించలేదు. భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయిపల్లిలో రాయిపల్లిలో బాలిక.. రాయికోడ్(అందోల్): కూలీ పనికోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన మండలంలోని రాయిపల్లిలో చోటు చేసుకుంది. రాయికోడ్ ఎస్ఐ చైతన్యకిరణ్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ కుటుంబం గత కొన్ని రోజుల క్రితం పత్తితీత పనులకు రాయిపల్లికి వచ్చారు. గ్రామంలో తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం అనంతరం నిద్రించారు. వేకువ జామున నిద్రలేచి చూసేసరికి 16 ఏళ్ల బాలిక కన్పించకపోవడంతో తండ్రి చుట్టూ పక్కల వారి వద్ద, గ్రామంలో వెతికాడు. ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి మండలంలోని మాసాన్పల్లి చౌరస్తా సమీపంలోని 161 నేషనల్ హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఆరేడు గ్రామానికి చెందిన విఠల్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానికులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. -
రూ. 2,200 కోట్ల రుణాలు
● అధిక వడ్డీతో స్వర్ణనిధి స్కీమ్ ● డిపాజిట్ చేసిన వారికిరూ.5లక్షల ఇన్సూరెన్స్ ● డీసీసీబీ డీజీఎం చంద్రశేఖర్రెడ్డినారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.2,,200కోట్ల రుణాలు అందేశామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్లోని డీసీసీబీ శాఖను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఖాతాదారులతో స్వర్ణనిధి డిపాజిట్ స్కీమ్కు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. పంటరుణాలు రూ.650 కోట్లు, మహిళా సంఘాలకు రూ.490 కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.480కోట్లు, గృహ నిర్మాణ రుణాలు రూ.130కోట్లు అందజేసినట్లు చెప్పారు. రుణాలు పొందిన వారు బకాయిలు సకాలంలో చెల్లించి అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఖేడ్ బ్రాంచిలో 104కోట్లు అన్నిరకాల రుణాలు ఇవ్వగా.. డిపాజిట్ రూపేణా రూ.31కోట్లు సేకరించినట్లు చెప్పారు. ఈ బ్రాంచిలో పెద్ద లాకర్ సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. 10 నిమిషాల్లో ఖాతా, రుణం కూడా.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా అత్యుత్తమ సేవలు అందిస్తూ అన్ని కమర్షియల్ బ్యాంకులంటే అధిక వడ్డీని అందిస్తున్నామని డీజీఎం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. తమ ఖాతాదారులకు ఏటీఎం సదుపాయాలు కల్పిస్తూ డెబిట్ కార్డులు అందిస్తున్నామని, ఫోన్పే, గూగుల్పే తదితర అన్ని సదుపాయాలు పొందవచ్చని అన్నారు. కొత్త ఖాతాదారులకు 10 నిమిషాల్లోనే ఖాతా తెరచి ఇస్తామన్నారు. బంగారు ఆభరణాలు, తులం బంగారంపై రూ.74వేల వరకు రుణాన్ని పదినిమిషాల్లోనే అందజేస్తామన్నారు. బ్యాంకుల్లో లాకర్ సదుపాయాలు ఉన్నాయని, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెలాఖరుతో స్వర్ణనిధి 444 రోజుల ఫిక్స్ డిపాజిట్ నూతన పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఇందులో డిపాజిట్ చేస్తే 7.75శాతం, సీనియర్ సిటిజన్స్కు 8.25శాతం వడ్డీ అందజేస్తామన్నారు. డిపాజిట్ చేసిన వారికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉందన్నారు. సమావేశంలో బ్రాంచి మేనేజరు జాదవ్ కిషన్, రికవరీ అధికారి రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
పనిచేసిన కంపెనీకి కన్నం వేశారు
● మొత్తం 11మంది అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ సిద్దిపేటకమాన్: పని చేసిన కంపెనీలోనే చోరీకి పాల్పడిన ఘటనలో మొత్తం 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సిద్దిపేట వన్టౌన్ సీఐ వాసుదేవరావుతో కలిసి ఏసీపీ రవీందర్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గాడిచర్లపల్లి శివారు మెగా కంపెనీ యార్డులో రంగనాయక సాగర్ కాల్వకు సంబంధించిన ఇనుప పైపులు చోరీకి గురైనట్లు ఉద్యోగి సాగర్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కంపెనీలో గతంలో వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేసిన బీహార్కు చెందిన రోహిత్, పైపులకు పెయింటింగ్ వర్క్ చేసే హైదరాబాద్కు చెందిన చాలమల్ల వెంకట్రెడ్డి, సెక్యూరిటీ గార్డు ములుగు సాయికుమార్తో కలిసి ఇనుప పైపులను దొంగిలించాలని పథకం రచించారు. గత నెల 26,27వ తేదీల్లో రెండు దఫాలుగా పైపులను దొంగిలించి వాటిని ముక్కలుగా చేసి క్రేన్ల సాయంతో లారీల్లో తరలించారు. పట్టణానికి చెందిన స్క్రాప్ షాప్ నిర్వాహకుడి సాయంతో పైపులను మనోహరాబాద్, శంకరంపేట ఐరన్ కంపెనీల్లో విక్రయించి వచ్చిన డబ్బులను రోహిత్, వెంకట్రెడ్డి, సాయిలు, శ్రీనివాస్ పంచుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు వీరికి సహకరించిన శ్రీనివాస్,క్రేన్ యజమానులు, లారీ ౖడ్రైవర్లు, దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఎండీ లియాఖత్, ఎండీ వాజీద్, శ్రీకాంత్, ముంగిస్పల్లీ, రమేశ్, సతీశ్, పవన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.40లక్షల విలువైన 60టన్నుల ఇనుప పైపులు, రూ.3.95లక్షల నగదు, రెండు క్రేన్లు, బొలెరో వాహనం, రెండు లారీలు, గ్యాస్ కటింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. -
149 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ముంబై హైవే, నాందేడ్ అకోల హైవేల పక్కన..సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ వాహనాల (ఈవీ)కు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లను జిల్లాలో విస్తృతంగా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 149 చోట్ల వీటిని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా ముంబై హైవేతో పాటు, నాందేడ్–అకోలా హైవేలపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా వీటిని నెలకొల్పడం ద్వారా వాహనదారులకు ఎంతో సౌకర్యం ఉంటుందని భావిస్తున్నారు. 65వ జాతీయ రహదారి జిల్లాలో రామచంద్రాపురం నుంచి మొగుడంపల్లి మండలం మాడ్గి వరకు ఉంటుంది. సుమారు 104 కి.మీల పొడవున్న ఈ ముంబై హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వీటిలో విద్యుత్ వాహనాలు కూడా ఉంటాయి. ఈ హైవేపై ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తే దూర ప్రయాణాలు చేసే విద్యుత్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే కంది మండల కేంద్రం కల్హేర్ మండలం మాసన్పల్లి చౌరస్తా సుమారు 95 కి.మీల మేరకు 161 జాతీయ రహదారిపై కూడా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రహదారిపైనా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా ఈ రెండు జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాహనదారులు వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. పెరుగుతున్న ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. గతంతో పోల్చితే ఈ వాహనాల ధరలు కొంత మేరకు దిగి వస్తున్నాయి. ప్రారంభంలో అధిక ధరలు ఉండటంతో కొనుగోలు చేయాలంటే కొంత ఆర్థిక భారం పడేది. ఇప్పుడు ధరలు దిగివస్తుండటంతో ఎక్కువ మంది ఈవీ వాహనాలను కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాను న్న రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగే ఈ వాహనాల దృష్ట్యా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కలెక్టర్ ప్రావీణ్య దృష్టి సారించారు.ప్రభుత్వ భూముల గుర్తింపు ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని యోచిస్తున్నారు. వీటి ఏర్పాటుకు అనువుగా ఉన్న స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై దృష్టి సారించనున్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలను గుర్తించి విద్యుత్ శాఖకు అప్పగిస్తే ఆ స్థలాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈవీ స్టేషన్లకు అవసరమైన ప్రత్యేకంగా కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర ఏర్పాట్లు చేస్తామని సంగారెడ్డి విద్యుత్శాఖ సంగారెడ్డి సర్కిల్ చీఫ్ ఇంజనీర్ కామేష్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈవీ స్టేషన్లలో వాహనాలను చార్జింగ్ చేసుకునే వారు ఒక్కో యూనిట్కు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
కౌంట్డౌన్
ముగియనున్న మల్లన్న పాలక మండలి గడువుకొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలక మండలి గడువు డిసెంబర్ 6తో ముగుస్తుంది. ఆలయ నూతన పాలక మండలికి దేవాదాయ శాఖ ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. డిసెంబర్ 14 స్వామి వారి కల్యాణం , జనవరి 18 నుంచి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి నిత్యం వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకునే ఆలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసే పాలక మండలి గురించి దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడంతో స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం చిన్న చూపే.. ఆలయంలో ప్రతిసారి 14 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిసి 15 మందితో పాలక మండలిని దేవాదాయ శాఖ అధికారులు నియమిస్తారు. కానీ గత సంవత్సరం డిసెంబర్ 6న 8మంది ధర్మకర్తలు, ఎక్స్ అఫీషియో సభ్యునితో కలిపి 9మందితో పాలక మండలిని ప్రకటించింది. మిగితా ఆరుగురి కోసం మళ్లి నోటిఫికేషన్ విడుదల చేయగా 43 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా దానిని అధికారులు పట్టించుకోలేదు. డిసెంబర్ 6తో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం కమిటీ ప్రకటించే 45 రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అప్పుడు ఆశావహులు దరఖాస్తు చేసుకున్న అనంతరం పోలీస్శాఖ ఎంకై ్వరీ పూర్తి కాగానే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి సంబంధిత శాఖ మంత్రి 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రకటిస్తారు. కానీ, డిసెంబర్ 6న పాలక మండలి గడువు ముగియడం, 14న స్వామి వారి కల్యాణం జరుగనున్న నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు రెగ్యులర్ కమిటీని నియమించే అవకాశం కనబడటం లేదు. ఉత్సవ కమిటీ నియమించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నా..ఏ అధికారాలు లేని ఉత్సవకమిటీ నియమిస్తుందా?..కమిటీ లేకుండా ఉత్సవాలను దేవాదాయ శాఖ నిర్వహిస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సమీపిస్తున్న కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఉత్సవ కమిటీతో సరిపెట్టే యోచనలో దేవాదాయ శాఖ నూతన మండలికి నోటిఫికేషన్ లేనట్టే! -
వివాహమైన ఐదు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి ● భర్తకు తీవ్ర గాయాలు మిరుదొడ్డి(దుబ్బాక): వివాహ జీవితంలోకి అడుగు పెట్టిన ఐదు నెలలకే నవ వధువును ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన లోక సాయికిరణ్కు, సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కె.ప్రణతి (24)తో ఈ ఏడాది జూలైలో వివాహం అయింది. వృత్తి రీత్యా సాయి కిరణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ.. పటాన్చెరులోని ఇస్నాపూర్లో నివాసం ఉంటున్నారు. కాగా ఈ నెల 23న సాయి కిరణ్ సిద్దిపేటలో అత్తగారింట్లో జరిగిన ఓ శుభకార్యానికి భార్యతో వచ్చాడు. తిరిగి సోమవారం సాయి కిరణ్, ప్రణతిలో కలిసి సిద్దిపేట నుంచి, చేగుంట మీదుగా ఇస్నాపూర్కు బైక్పై బయలు దేరారు. ఈ క్రమంలో చెప్యాల శివారులోకి రాగానే వీరి బైక్ను వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న ప్రణతి కింద పడటంతో అక్కడిక్కడే మృతిచెందింది. సాయి కిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ శ్రీనివాస్, మిరుదొడ్డి ఎస్ఐ సమత ప్రమాద స్థలానికి వెళ్లి అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మామ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాన్నా.. అప్పులతో వేగలేకపోతున్నా
తండ్రికి ఫోన్ చేసి ఉరి వేసుకున్న యువకుడురామాయంపేట(మెదక్): అప్పుల బాధతో చనిపోతున్నానని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన నింగరమైన బాలేశ్ (26) కూలీ పనులు చేసుకుంటూ తన భార్య, ఏడాది వయస్సుగల కుమారున్ని పోషించుకుంటున్నాడు. ఉదయం బాలేశ్కు, భార్య కనకలక్ష్మికి మధ్య అప్పుల విషయమై గొడవ జరిగింది. తరువాత అతడు ఇంటినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అతడు హైదరాబాద్లో ఉంటున్న తన తండ్రి లచ్చయ్యకు ఫోన్ చేసి అప్పుల బాధతో వేగలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సమాచారం అందుకున్న కనకలక్ష్మి, మరి కొందరితో కలిసి తన భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బోయ రాములు వ్యవసాయ క్షేత్రంలో చింతచెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది కనిపించాడు. అప్పులు తీర్చే మార్గం లేకే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
కరాటే కిక్స్లో సత్తా చాటిన దుబ్బాక విద్యార్థులుదుబ్బాకటౌన్: కరాటే కిక్స్లో సత్తా చాటి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో దుబ్బాక విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చాలెంజ్ నిర్వహించారు. ఈ మేరకు యువ స్సోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, మాస్టర్ కరాటే శ్రీకాంత్ సోమవారం వివరాలు వెల్లడించారు. 1200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని గతంలో ఉన్న రికార్డ్ను బద్ధలు కొట్టి 8 లక్షల 50 వేల కిక్స్ నమోదు చేశారని తెలిపారు. ఇందులో విద్యార్థులు లక్షిత, లోకేశ్, నిశాల్, హర్షవర్ధన్, శ్రీహన్స్ ఉన్నారు. విద్యార్థులు, కరాటే మాస్టర్ను తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి అభినందించారు. -
ప్రజావాణికి 76 దరఖాస్తులు
సంగారెడ్డి జోన్: ప్రజావాణికి 76 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల ఎదుట ప్రజలు వాపోయారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. కాగా, ప్రజావాణిలో ట్రైసైకిళ్లు కోసం వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ సత్వరమే స్పందించి, పంపిణీ చేస్తున్నారు. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వంద మందితో కవాతుఉత్సాహంగా ఎన్సీసీ దినోత్సవం పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం 77వ ఎన్సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు వంద మంది క్యాడెట్లతో కవాతు నిర్వహించారు. 1948లో స్థాపించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ), భారతదేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవ, దేశ నిర్మాణాన్ని పెంపొందిస్తున్న విషయం విదితమే. ఈ వేడుకలు క్యాడెట్ల సమావేశం, కవాతుతో ప్రారంభమయ్యాయి. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు జెండా ఎగురవేయగా, క్యాడెట్లు ఎన్సీసీ ప్రతిజ్జ చేసి, విధి, జాతీయ విలువల పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మెరుగైన వైద్యం అందించాలిచీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పద్మజ కంది(సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారందరికీ సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్టేట్ చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ సూచించారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ల్యాబ్లో నిర్వహిస్తున్న రక్తపరీక్షల ఫలితాలను ఎప్పటి కప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిరంజన్, డాక్టర్ కరుణశ్రీతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రణభేరి సభనుజయప్రదం చేయండి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ సంగారెడ్డి టౌన్: గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న సూర్యాపేటలో నిర్వహించనున్న గీతన్నల రణభేరి బహిరంగసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గీత కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, గ్రామాల్లోని బెల్టు షాపులను నిలిపేయాలన్నారు. అనంతరం సంగారెడ్డిలోని ఐబీలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు, గీత కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం రహిత సమాజమే లక్ష్యం కావాలి
ఎకై ్సజ్ అధికారులకు రఘునందన్ హితబోధ పటాన్చెరు: మద్యం రహిత సమాజ నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని మెదక్ ఎంపి రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకి యువత డ్రగ్స్ ,గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతగా పనిచేసి, మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ ఎకై ్సజ్ హరికిషన్, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరెంటెండెంట్ ఎకై ్సజ్ మణెమ్మ, ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. స్ఫూర్తిని రగిలించిన వందేమాతర గీతం పటాన్చెరు టౌన్: స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటి పైకి తెచ్చింది వందేమాతర గీతం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని విద్యా భారతి పాఠశాలలో నిర్వహించిన వందేమాతర గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
చేగుంట(తూప్రాన్): కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మక్కరాజీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేటకు చెందిన మహ్మద్ హర్షద్(40) అత్తగారి గ్రామ మైన చేగుంట మండలం మక్కరాజీపేటలో నివాసం ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ శివారులోని చాన్కన్కుంట వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలు జారి నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య తాహెరా బేగం ఫిర్యా దు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. కుంటలో మునిగి వ్యక్తి మృతి -
పత్తి చేను మేసి 16మేకలు మృతి
ఆదుకోవాలని బాధితుడి వినతి న్యాల్కల్(జహీరాబాద్): మేకలు మేత మేస్తూ ఉన్నట్లుండి మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండల పరిధిలోని మొల్కన్పాడ్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మేతరి సంజీవ్ రోజు మాదిరిగానే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేకలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. ఓ రైతుకు చెందిన (పత్తి తీసిన) చేనులో మేకలను మేపాడు. ఈ క్రమంలో ఉన్నట్లుండి కడుపుబ్బి నురుగలు కక్కుకొని ఒక్కొక్కటిగా 16 మేకలు మృతి చెందాయి. ఈ విషయాన్ని రెవెన్యూ, పశు వైద్యాధికారులకు బాధితుడు తెలిపాడు. ఆర్ఐ శ్యాంరావు, పశు వైద్యాధికారి గణేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన మిగిలిన మేకలకు పశువైద్యుడు చికిత్స అందించాడు. పత్తి చెట్లు, వాటి కాయల్లో విషం ఉంటుందని, వాటిని తినడంతో గాసిపాల్ విషం సోకి మేకలు మృతి చెంది ఉండవచ్చునని వైద్యుడు అనుమానం వ్యక్తం చేశాడు. పోస్టుమార్టంలో మేకల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. కాగా మృతి చెందిన మేకల విలువ సుమారు 2.40 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. మృతి చెందిన మేకలు -
గుర్తు తెలియని వ్యక్తులు మృతి
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాము నాయుడు వివరాల ప్రకారం... ఈ నెల 23న ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. మరో సంఘటనలో... ఈ నెల 24న ఉదయం 9గంటల సమయంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో గల దుకాణాల్లో భిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు 45 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటాయని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ సంగారెడ్డి టౌన్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని మృతుడి బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు, బంధువుల వివరాలు ఇలా... నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్(44) వృత్తిరీత్యా 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ నెల 20న సాయంత్రం విధులు నిర్వహించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా.. హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ శివారులో సంతోష్ను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి గాయాలవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అతడు విధులు నిర్వహిస్తున్న ఎంఎన్ఆర్ ఆసత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కాగా సంతోష్కు ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణించాడని కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యం శనివారం రాత్రి స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆదివారం ఉదయాన్నే భారీగా పోలీసులు మోహరించారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. -
లోగో రూపకల్పనలో గోపీకి అవార్డు
వెల్దుర్తి(తూప్రాన్): తెలంగాణ పోలీస్ వెహికల్ బ్రాండింగ్ లోగో రూపకర్త, మెదక్ జిల్లా, మాసాయిపేట మండలం రామంతాపూర్ తండా మాజీ సర్పంచ్ ఫకీరా అలియాస్ గోపీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ నార్త్ ఈస్ట్ కల్చరల్ ఫెస్టివల్కు సంబంధించి లోగో తయారీకి గతంలో రాష్ట్రవ్యాప్తంగా 190 మంది దరఖా స్తు చేసుకోవడంతో పాటు లోగోను తయా రు చేసి రాజ్భవన్కు పంపించారు. ఇందులో గోపి తయారు చేసిన లోగోను రాజ్భవన్ వర్గాలు ఎంపిక చేశాయి. దీంతో హైదరాబాద్లోని హైటెక్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ గోపీకి ప్రశంసాపత్రం అందజేశారు. లాడ్జిలో వ్యక్తి మృతిసిద్దిపేటజోన్: లాడ్జిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉమ్మరవేణి రాజు(42) రెండు రోజుల క్రితం హైదరాబాద్ రోడ్డులోని ఓ లాడ్జిలో అద్దెకు దిగాడు. ఆదివారం అద్దె కోసం రూమ్ బాయ్ వెళ్లి చూడగా తలుపుపెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా బాత్ రూమ్లో రాజు బోర్లాపడి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఎకరం అమ్మినా అప్పులు తీరకపోవడంతో..
కూలీ ఆత్మహత్యదుబ్బాకరూరల్: అప్పుల బాధ తాళలేక కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఆకారం గ్రామంలో జరిగింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డప్పు చంద్రం(50) కూలీ పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఎకరం భూమి అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. ఇంకా కొన్ని అప్పులు ఉండటంతో తనలో తానే తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడుతుండేవాడు. మనస్తాపానికి గురై శనివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అదృశ్యమై.. కుంటలో శవమై..
మృతుడిపై పలు స్టేషన్లలో కేసులుజిన్నారం (పటాన్చెరు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సమీపంలోని ఎల్లమ్మబండకు చెందిన రాజాసింగ్ (30) ఈ నెల 20న ఆస్పత్రికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదేరోజు బొల్లారం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమీపంలో రాజాసింగ్ కారు, ఎర్రోళ్ల ప్రవీణ్ ద్విచక్రవాహనం ఢీకొన్నట్లు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ వాహనాలను వదిలిపెట్టి ఇద్దరు పరారయ్యారు. ఆ రెండు వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు, కుటుంబ సభ్యు లు రాజాసింగ్ కోసం ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బొల్లారంలోని మాధవనికుంటలో రాజాసింగ్ శవమైతేలాడు. అతడి మృతిపట్ల ఎర్రోళ్ల ప్రవీణ్పై అనుమానం ఉన్నట్లు మృతుడి అన్న గోపీసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మృతుడిపై జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కూకట్పల్లి, అత్తాపూర్, స్టేషన్లలో చోరీ కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. -
పటాన్చెరులో భారీ చోరీ
● 45 తులాల బంగారం, వెండి అపహరణ ● భార్య ప్రసవం కోసం ఊరెళ్లడంతో ఘటనపటాన్చెరు టౌన్: తాళం వేసిన ఇంట్లో భారీ బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...సికింద్రాబాద్కు చెందిన ఉత్తమ్ అతని కుటుంబంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ, పోచారం గ్రామ పరిధిలో ఉన్న సాయి దర్శన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే అతని భార్య ప్రసవం కోసం కుటుంబ సభ్యులందరూ ఈ నెల 16న సికింద్రాబాద్కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 45 తులాల బంగారం, కొద్దిగా వెండిని ఎత్తుకెళ్లారు. అయితే ఉత్తమ్ ఇంటి సీసీ కెమెరాల్లో చూసి చోరీ జరిగినట్లు గుర్తించాడు. కాగా ఇంటికి వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు క్లూస్ టీమ్తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంతర్జాతీయ కరాటేలో చాంపియన్షిప్
మెదక్ మున్సిపాలిటీ: ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో మెదక్ జిల్లా విద్యార్థిని ఓవరాల్ చాంపియన్షిప్ సాఽధించింది. కరాటే మాస్టర్ రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి చెందిన నితన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలో గోల్డ్, నాన్ చాక్ విభాగంలో గోల్డ్తో పాటు చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నవీన్ మాస్టర్, దినకర్ టోర్నమెంట్ ఆర్గనైజర్ షిహన్ సజీద్ రైన్ పాల్గొన్నారు. -
యూనిటీ మార్చ్కు రమేశ్ ఎంపిక
సిద్దిపేటరూరల్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్కు రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గణగోని రమేశ్ ఎంపియ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిటీ మార్చ్ హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రారంభమై నాగపూర్, ఇండోర్ మీదుగా గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద ముగుస్తుందన్నారు. తనను ఎంపిక చేసిన ఎంపీ రఘునందన్రావు, జిల్లా అధ్యక్షుడు శంకర్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. వీధి కుక్కల దాడిఆరుగురు చిన్నారులకు గాయాలు రామాయంపేట(మెదక్): మండలంలోని లక్ష్మాపూర్లో వీధి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. శనివారం ఇద్దరిపై దాడిచేసి గాయపర్చిన కుక్కలు, ఆదివారం మరో నలుగురిపై దాడి చేశాయి. గ్రామంలో పెరిగిపోయిన కుక్కల బెడదతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అరికట్టాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గంజాయి కేసులో ఇద్దరు రిమాండ్ బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులో గంజాయి తాగుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని ముత్తన్నపేటకు చెందిన అజయ్, ఇల్లంతకుంట మండలం సోమారపేట గ్రామానికి చెందిన శేఖర్ గంజాయి తాగుతుండగా పట్టుకున్నారు. వీరిద్దరూ తాగడమే కాకుండా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అజయ్ గతంలో గాంజా కేసులో జైలుకెళ్లాడని, శేఖర్పై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు. రాజ్గోపాల్పేట, చిన్నకోడూర్ ఎస్ఐలు వివేక్, సైఫ్, ఏఎస్ఐ శంకర్రావు ఉన్నారు. దాడి ఘటనలో.. బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు పాత నేరస్తులను దాడి చేసిన ఘటనలో ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. ఈనెల 21న అన్నాడి సాయిరెడ్డి, శ్రీమాన్ వెళ్తున్న కారు అద్దాలను పగులగొట్టి వారిపై దాడి చేశారని నల్వాల శ్రీనివాస్, పైడిపాల మల్లేశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరిద్దరూ నేర చరిత్ర కలిగిన వారని పేర్కొన్నారు. కేసును చిన్నకోడూర్ ఎస్ఐ సైఫ్ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మూగ బాలుడు అదృశ్యం పటాన్చెరు టౌన్: మూగ బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన జలరం పాత్రో కుమారుడు ఆయూకత్ పాత్రో(12) ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూలమలుపు వద్ద అదుపుతప్పి.. కొండపాక(గజ్వేల్): మూలమలుపు వద్ద గూడ్స్ లారీ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి ఓ ఇంటి ముందు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండలంలోని దుద్దెడ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సిద్దిపేట నుంచి హైదరాబాద్కు ఇనుప రాడ్స్తో గూడ్స్ లారీ వెళ్తుంది. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై ఉన్న మూల మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి ఇంటి ముందు గేట్ వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు లేచి భయాందోళనకు గురయ్యారు. టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు వాహనాన్ని బయటకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
తాగి నడిపితే జైలుకే..
నీటి అలలపై తేలియాడుతున్న కలువ పూలు కనువిందు చేస్తున్నాయి. తెలుపు, పసుపు వర్ణంతో మెరిసిపోతూ అర విరిసిన కలువ పూలు ముగ్ధ మనోహరంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ‘వాటర్ వైట్ లిల్లీ ఫ్లవర్స్’గా పిలువబడే ఇవి మంచి నీటి సరస్సులు, చెరువులు, కుంటల్లో పెరుగుతాయి. ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ఆసియా వంటి ప్రాంతాల్లో పెరిగే ఈ కలువ మన దేశంలో అరుదుగా కనిపించడం విశేషం. మిరుదొడ్డిలోని బొమ్మరాజు చెరువులో పెరుగుతున్న ఈ కలువ పూలను ఆదివారం ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష అమలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా రూ.10వేల జరిమాన, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి రూ.10వేల జరిమాన విధింపు గత నెల 6నుంచి అమల్లోకి వచ్చింది. పోలీసు కమిషనర్ విజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సిబ్బంది నిత్యం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో తాగి బైక్ నడుపాలంటే మందుబాబుల వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం తాగి నడపడం వల్ల చోటుచేసుకునేవే. ఒక్కరు చేసిన తప్పుకు కుటుంబాలు రోడ్డు పాలయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. పోలీసు కమిషనరేట్ పరిధిలో సిబ్బంది అక్టోబర్ 6నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో 1,951 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి 1,321 మందికి రూ.60,90,724 జరిమాన విధించారు. మొదటిసారి పట్టుబడితే రూ.10వేల జరిమాన, జరిమాన చెల్లించకపోతే జైలు శిక్ష, రెండేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు. నెల రోజుల్లో 59 మందికి రెండు నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులుకలువల కనువిందుసిద్దిపేట పట్టణం రాజీవ్ రహదారిపై గత నెలలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతున్నాడు. వెనకాలే వస్తున్న వాహనదారుడు గమనించి డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. టూటౌన్ పోలీసులు లారీని ఆపి డ్రైవర్ను బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా మెషీన్ కెపాసిటీ 500శాతం ఉండగా పరీక్షల్లో 471శాతం వచ్చింది. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జైలు శిక్ష విధించింది.జిల్లా కేంద్రం సిద్దిపేటలో నాలుగు రోజుల క్రితం పోలీసుల వాహన తనిఖీల్లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి రూ.10వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించకపోతే జైలు శిక్ష అమలు చేయాలంటూ తీర్పునిచ్చారు.చట్టప్రకారం చర్యలు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వారికి రూ.10వేల జరిమాన అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి. – సుమన్కుమార్, ట్రాఫిక్ ఏసీపీ, సిద్దిపేట -
అమ్మా.. నన్ను కొడుతున్నార ని ఫోన్
యువకుడి అనుమానాస్పద మృతిములుగు(గజ్వేల్): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం మేరకు.. బస్వాపూర్ గ్రామానికి చెందిన నర్సంపల్లి రేణుక, రవి దంపతులకు కార్తీక్, సందీప్(21) ఇద్దరు కుమారులున్నారు. కాగా గతంలో తండ్రి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సందీప్ తుర్కపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 22న ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. తరువాత కొత్తూరులో హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి బైక్పై వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి సందీప్కు ఫోన్ చేస్తే ఇంకా కటింగ్ చేయించుకోలేదని తెలిపాడు. తర్వాత రాత్రి 9.30 గంటలకు తల్లి మళ్లీ ఫోన్ చేస్తే అమ్మా నన్ను కొడుతున్నారంటూ ఫోన్ కట్చేశాడు. తిరిగి రాత్రి 10 గంటలకు సందీప్ తల్లికి ఫోన్ చేసి కొత్తూరులోని పెద్దమ్మ గుడి వెనుకాల మధు, నందు, అరుణ్, అనీల్ కొడుతున్నారని చెప్పాడు. వెంటనే కుటుంబీకులు గుడివద్దకు చేరుకుని వెతికినా కనిపించలేదు. పలుమార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ ఎత్తలేదు. ఈ క్రమంలో కొత్తూరు దాటిన తర్వాత రోడ్డు పక్కన గల ట్రాన్స్ఫార్మర్ వద్ద తీవ్ర రక్త గాయాలై సందీప్ మృతి చెంది ఉన్నాడు. తన కుమారుడు మృతిపట్ల అనుమానం ఉందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కొండెక్కిన ‘కోడిగుడ్డు’
జోగిపేట(అందోల్): కార్తీక మాసం పూర్తికాగానే గుడ్ల ధర మార్కెట్లో ఒక్కసారిగా పెరిగింది. రోజువారీ వినియోగంలో ప్రముఖమైన గుడ్డు, ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది. జిల్లాలో గత వారం వరకు రూ.5.50 నుంచి రూ.6 వద్ద ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.7 దాటింది. కొన్ని చోట్ల అయితే రూ.7.50 లకు విక్రయాలు జరుగుతున్నాయి. కార్తీకంలో డిమాండ్ తగ్గగా, మాసం పూర్తయ్యాక డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ధరలు అలానే పెరిగిపోయాయి. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం కూడా గుడ్ల రేటు పెరుగుదలకు మరో కారణమని పేర్కొంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడం, ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలు కూడా ప్రభా వం చూపుతున్నాయి. చలికాలం మొదలవడంతో గుడ్ల వినియోగం సహజంగానే పెరుగుతుంది. మార్కెట్లో సరఫరా డిమాండ్లో తేడా కారణంగా ధరలు మరో వారం రోజులు ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. రోజూవారీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా గుడ్డు వంటకాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. అల్పాహారం, పోషకాహారంగా గుడ్లను వినియోగించే ప్రజలు ధరలు తగ్గించాలని కోరుతున్నారు. గుడ్ల ధరల పెరుగుదలపై మార్కెట్ అధికారులు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని వినియోగదారు లు వాపోతున్నారు. రేట్లు నియంత్రణలోకి రావాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని అభిప్రాయపడుతున్నారు. మరింత పెరిగే అవకాశం.. ప్రస్తుతం డజను కోడిగుడ్లు ధర రూ.84. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఇప్పుడు ధరలు పెరగడంతో భారమయ్యా యి. కూరగాయలతో పోటీపడి మరీ కోడిగుడ్ల ధర అమాంతం పెరగటం చూస్తుంటే.. మరో నెల, రెండు నెలల్లో డజను వందదాటే అవకాశం ఉంది. చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ కొన్నేండ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వారం పది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. కోడిగుడ్డును ప్రజలు తమ రోజువారీ మెనూలో ఆహారంగా తీసుకుంటున్నారు.ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.84 ధర పెరిగింది కొడిగుడ్డు ధరలు ఒకేసారి పెరిగాయి. మొన్నటి వరకు గుడ్డుకు రూ.5 చొప్పున ఉండగా ఒకేసారి 6.50కి పెరిగింది. మేము హోల్సేల్గా విక్రయిస్తున్నాం. చిన్న చిన్న షాపుల్లో రూ.7 నుంచి రూ.7.50కు విక్రయిస్తున్నారు. మరింతగా పెరిగే అవకాశం ఉంది. గుడ్ల క్రయ, విక్రయాలు తగ్గలేదు. – శేఖర్, వ్యాపారస్తుడు, జోగిపేట -
ఎకరాకు 11.77 క్వింటాళ్లు
నారాయణఖేడ్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎకరాకు సగటున 11.77 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళి శాఖకు నివేదిక సమర్పించింది. కేంద్ర జౌళి శాఖ నుంచి ఎంత సేకరించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని పత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎకరాకు 7 క్వింటాళ్ల మేరకే సీసీఐ సేకరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగుబడులు రెట్టింపుగా ఉన్నాయని, వచ్చిన దిగుబడుల మేరకు కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ వస్తోంది. పత్తి పంట దిగుబడులు ప్రారంభమైన సందర్భంలో గతేడాది తరహాలోనే కపాస్ కిసాన్ యాప్లో ఉండగా ఒక్కసారిగా కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఇన్లైన్లో ఎకరాకు 7 క్వింటాళ్లుగా వచ్చింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. క్షేత్రస్థాయిలో సర్వే.. పంట కొనుగోళ్లపై సమస్య ఉత్పన్నం కావడంతో రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడులపై వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ వారం క్రితం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. పత్తి దిగుబడులు ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ నివేదిక ఇవ్వగా దాన్ని పరిగణలోకి కేంద్ర జౌళి శాఖ రైతుల నుంచి కేవలం 7 క్వింటాళ్ల మేరకే సేకరించాలని సీసీఐని ఆదేశించింది. దీంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట దిగుబడులపై సర్వే చేయాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు వారం రోజుల్లో జిల్లాల వారీగా అయా కలెక్టర్లు నివేదికలు సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దిగుబడులపై కూడా ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు నివేదిక అందజేశారు. దళారుల పరం.. పత్తి పంట కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ విధించిన నిబంధనల కారణంగా రైతులు దళారులకు పత్తి పంటను అమ్ముకుంటున్నారు. ఎమ్మెస్పీ మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 కాగా, దళారులు రూ.6,500 నుంచి రూ.7వేల లోపే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆధారంగా యావరేజ్గా ఎకరాకు 11.77 క్వింటాళ్ల చొప్పున పత్తి సేకరించాలన్న ఆదేశాలకు కేంద్ర జౌళి శాఖ నుంచి సీసీఐకి అందాల్సి ఉంది. త్వరలో ఈ మేరకు ఆదేశాలు అందే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పత్తి దిగుబడిపై కేంద్రజౌళి శాఖకు ప్రభుత్వం నివేదన● ఉమ్మడి జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ● కపాస్ కిసాన్ యాప్లో ఇంకా 7 క్వింటాళ్లే ● జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి నివేదికను తెప్పించారు. ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వానికి నివేదించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో పత్తి సగటున దిగుబడులు ఎకరాకు 11.77 క్వింటాళ్ల మేర ఉందని కేంద్ర జౌళి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కలెక్టర్ల నిర్వహించిన సర్వే వివరాలు, గణాంకాలను అందజేశారు. పత్తి కొనుగోళ్లను ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచాలని అభ్యర్థించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వచ్చినట్లు నివేదిక సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యింది. -
సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు
సంగారెడ్డి జోన్: భక్తి భావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించిన సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి: ఎంపీ షెట్కార్జహీరాబాద్ టౌన్: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆదివారం సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డితో కలిసి మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, చీరలు తదితర పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వారు మహిళలతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్వీర్,హన్మంత్రావు,శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ, ఆర్డీఓ,డీపీఎం,ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి దుప్పట్లు, బెడ్షీట్లు పంపిణీ మానవత్వం చాటుకున్న టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ (టీఏసీసీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేశ్వర్ ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వాసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో టీఏసీసీయూ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీలో పనిచేశారు. రాజేశ్వర్ ఎన్నిక పట్ల ఆదివారం టీజీఓ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
నిబంధనల మేరకే నిర్మించుకోండి
నర్సాపూర్ రూరల్/శివ్వంపేట: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి బిల్లులు వస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఖాజీపేటలో శిలమంతుల మాధవి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కొంతమంది ఇందిరమ్మ లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోవడంతో బిల్లులు రావడంలో జాప్యం జరుగుతుందన్నారు. కాగా కొంతమంది లబ్ధిదారులు బేస్మెంట్, లెంటల్ లెవెల్ బిల్లులు రావడం లేదని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సర్వర్ సమస్య కారణంగా బిల్లులు రావడం లేదని, కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకుడు సుధాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం శివ్వంపేట మండల పరిధిలోని గోమారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. కేవలం మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులకు మా త్రమే చీరలు పంపిణీ చేయడం సరికాదన్నారు. అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాయకులు మాధవరెడ్డి, సంతోష్రెడ్డి, చంద్రగౌడ్, హన్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
పారిశ్రామికానికి ప్రోత్సాహం
అక్కన్నపేట(హుస్నాబాద్): పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమేకాకుండా మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ క్రాసింగ్ వద్ద ఏర్పాటవుతున్న ఇండస్ట్రియల్ పార్కులో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇస్తున్నామన్నారు. అక్కన్నపేటలోని రైతు వేదికలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై పలువురు మహిళలకు బొట్టు పెట్టి చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద ప్రతీ మహిళకు చీర అందిస్తోందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
వేసవికి వెయ్యి మెగావాట్లు
ఈసారి భారీగా పెరగనున్న విద్యుత్లోడ్సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న వేసవిలో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగనున్నట్లు ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. గతేడాది వేసవి కాలం కంటే సుమారు 25% వరకు విద్యుత్ లోడ్ పెరుగుతుందని అంచనా వేశారు. గతేడాది అత్యధికంగా విద్యుత్లోడు 837 మెగావాట్లకు చేరింది. అయితే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలుండటంతో ఏకంగా వెయ్యి మెగావాట్లకు ఈ లోడ్ చేరుకుంటుందని భావిస్తున్నారు. సాధారణంగా లోడ్ పెరిగితే విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలే ర్పడతాయి. ఒక్కోసారి సబ్స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాలన్నింటికీ సరఫరా నిలిచిపోయే అవకాశముంటుంది. వేసవిలో అధిక లోడ్ కారణంగా తలెత్తే సమస్యలను అధిగమించేందుకు విద్యుత్శాఖ సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. రూ.157 కోట్లతో ఈ ప్రణాళికకు ఎన్పీడీసీఎల్ ఆమోద ముద్ర వేసింది. నెలలో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం వేసవిలో ఎక్కువగా ఏసీలు, కూలర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పల్లెల్లో కంటే పట్టణాల్లో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో పట్టణాల్లో విద్యుత్ లోడ్ పెరిగి తరచూ సరఫరాలో అంతరాయం వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఐదు 33 /11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికి ఈ నెలలోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆందోల్, తెల్లాపూర్, ఆరుట్ల, పోచారం, లక్డారంలో ఈ ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి నెల రోజుల్లో పూర్తి చేసి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. నాలుగు కొత్త ఫీడర్లు.. విద్యుత్ సరఫరా చేసే విద్యుత్లైన్ తెగిపోతే సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ప్రత్యామ్నాయ ఫీడర్లు ఉంటే ఒక లైన్ తెగిపోయినా, ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. ఇలా 33 కేవీ సామర్థ్యం కలిగిన నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్లను నిర్మిస్తోంది. వేసవి ప్రారంభంలోగా ఈ లైన్లను అందుబాటులోకి తేవాలని ఆశాఖ భావిస్తోంది. వీటితోపాటు 29 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి చర్యలు చేపట్టారు.పెరగనున్న బోర్ల వినియోగానికి సరిపడా.. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పంటలకు నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా వరికి చివరి తడి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైతులు బోర్లు ఎక్కువగా నడుపుతారు. పంటను కాపాడుకునేందుకు బోరు నీరే ఆధారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్లోడ్ పెరుగుతుంది. ఇటు పట్టణాల్లో గృహ అవసరాల లోడుతోపాటు, గ్రామాల్లో బోర్ల లోడ్ తోడవడంతో ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లపై అధికభారం డుతుంది. ఈ లోడ్ను తట్టుకునేలా ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్శాఖ ఆరు సబ్స్టేషన్లను నిర్మిస్తోంది. ఈ ఆరు సబ్స్టేషన్లు జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న విద్యుత్శాఖ రూ.157 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం జిల్లాలో 11 చోట్ల కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు నాలుగు ప్రత్యామ్నాయ ఫీడర్ల నిర్మాణంపకడ్బందీగా సమ్మర్ యాక్షన్ప్లాన్ అమలు ఎండాకాలంలో ఎలాంటి అంతరాయం 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. పెరగననున్న విద్యుత్ లోడ్కు తట్టుకునేందుకు అవసరమైన సబ్స్టేషన్లు, ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ మేరకు రూ.157 కోట్లతో పనులు చేపట్టాము. ఈ పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – కామేశ్, చీఫ్ ఇంజనీర్, సంగారెడ్డి సర్కిల్ -
బోనమెత్తిన భక్తిధాం తండా
వైభవంగా శివపార్వతుల కల్యాణంకల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట మండలం బల్కంచెల్క(భక్తిధాం) తండాలో శ్రీవిశ్వపాలిని భవానీ సమేత సేవాలాల్ మహరాజ్ మహామందిరంలో ఆదివారం ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రవాణ శాఖ డిప్యూటీ కమిషనర్, మందిరం ధర్మకర్త మూడ్ కిషన్సింగ్–లలితబాయి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణానికి కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్, ఎరక్పల్లికి చెందిన దేవీదాస్ మహారాజు, మందిరం పురోహితులు మనోజ్శర్మ హాజరై లలితా సహస్రనామ కుంకుమార్చన, మహాఅన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో తండా ప్రముఖులు శంకర్, ఖాట్రోత్ జైల్సింగ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాల ఘనత కాంగ్రెస్దే
వట్పల్లి(అందోల్): మహిళలకు వడ్డీలేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మండల పరిధిలోని సంగుపేట వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు ఆత్మసైర్థ్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, తిరిగి వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలను, 2013లో వడ్డీలేని రుణాలను అందించేందుకు శ్రీకారం చుట్టి అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వడ్డీలేని రుణాల సంగతే మరిచిపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 30 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నాయని, ఒక్కో ఆర్టీసీ బస్సుకు ప్రభుత్వం రూ.30 లక్షల గ్రాంటును ఇస్తుందని, సంఘం తరఫున రూ.6 లక్షలు మాత్రమేనని వివరించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ల ద్వారా రూ.1.80 కోట్ల ఆదాయం మహిళ సంఘాలకు వచ్చిందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాకు 3 లక్షల చేనేత చీరలను మంజూరు చేసిందని, మరో 2 లక్షల వరకు చీరలు రానున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో పాటు 18 ఏళ్లు నిండి రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతీ ఆడబిడ్డకు చీరలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్, జిల్లా డీఆర్డీవో సూర్యరావు, ఆర్డీవో పాండు, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఐకేపీ డీపీఎం రమేశ్బాబు, తహశీల్దార్ మధుకర్రెడ్డి, ఎంపీడీవో రాజేశ్, మండల పార్టీ అధ్యక్షులు శివరాజ్తోపాటు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరలు పంపిణీసంగారెడ్డి జోన్: మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశారు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు రూ.590 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ.32కోట్ల వడ్డీ రాయితీ అందించినట్లు తెలిపారు. స్వయం ఉపాధి పథకం ద్వారా ఎంతోమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీసీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలు 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర మంత్రి దామోదర రాజనర్సింహ -
కేక్ తేవడానికి వెళ్తుండగా..
మద్దూరు(హుస్నాబాద్): పండుగ వాతావరణం నెలకొన్న ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. కూతురి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలలు కన్న ఆ తండ్రి.. ఆ కలలు నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సింగారం శ్యామ్కుమార్(29) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతడి పెద్ద కూతురు జశ్విత పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకురావడానికి మండలంలోని చౌరస్తాకు పల్సర్ బైక్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో మండల నుంచి లద్నూరు వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో శ్యామ్కుమార్ ప్రమాదవశాత్తు దానిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలైన శ్యామ్కుమార్ను స్థానికులు , పోలీసులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య శ్రావణి, కూతుళ్లు జశ్విత,అన్విత,11నెలల కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్పాల సూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం వల్లే శ్యామ్కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ,గ్రామస్తులు మృతదేహంతో లద్నూరు, ముస్త్యాల రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సంఘటన స్థలానికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం, చేర్యాల సీఐ శ్రీను , తహసీల్దార్ రహీం వచ్చి వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి -
సుపారి గ్యాంగ్ అరెస్ట్
సిద్దిపేటరూరల్: సుపారి తీసుకుని వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించిన 8 మంది గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సిద్దిపేట డివిజనల్ ఏసీపీ ఎం.రవీందర్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన పోలీస్ శ్రీనివాస్రెడ్డి (మాజీ సైనికుడు)కి అదే గ్రామానికి చెందిన పుల్లగూర్ల ఎల్లారెడ్డికి కొంతకాలంగా పొలం దారి విషయంలో భూవివాదాలు జరుగుతున్నాయి. దీంతో విసుగుచెందిన శ్రీనివాస్రెడ్డి భూ తగాదాలను మనసులో పెట్టుకుని ఎల్లారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇర్కోడ్కు చెందిన తన బంధువులైన సాగర్, అతని స్నేహితుడు భరత్కు చెప్పగా, వారు ఇర్కోడ్కు చెందిన పర్శరాములును పరిచయం చేశారు. ఎల్లారెడ్డిని చంపేందుకు పర్శరాములుతో రూ.10లక్షలకు సుపారి మాట్లాడాడు. ఇందుకు శ్రీనివాస్రెడ్డి విడతల వారీగా రూ.5లక్షలు ఇచ్చి వాట్సాప్లో ఎల్లారెడ్డి ఫొటోను పర్శరాములుకు పంపి, తర్వాత డిలీట్ చేశాడు. హత్య చేయడానికి పర్శరాములు తనకు పరిచయం ఉన్న ఫాజిల్ ద్వారా రెండు నెలల క్రితం రౌడీషీట్ ఉన్న కాస స్వామిని కలిశాడు. పర్శరాములు స్వామికి ఎల్లారెడ్డి ఫొటో పంపి యాక్సిండెంట్ చేసి చంపాలని రూ. 3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్వామి భయనాగా రూ. 10వేలు తీసుకోగా, ఫోన్పే, వాట్సాప్ పే ద్వారా రూ. 2లక్షల వరకు స్వామికి పంపించాడు. పరిచయం చేసినందుకు ఫాజిల్కు రూ.12వేలు ఇచ్చాడు. రెండు సార్లు విఫలం.. మూడోసారి ఢీకొట్టారు 8 మంది అరెస్టు.. ఇద్దరు పరారీ వివరాలు వెల్లడించిన ఏసీపీ -
సిద్దిపేటలో...
ఐటీ.. నైట్ షిఫ్ట్ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లో నాలుగు కంపెనీల్లో నైట్ షిఫ్ట్లలో ఐటీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పీపు ల్స్ ప్రేమ్, తోరన్, కల్పన టెక్, అమృత సిస్టమ్ కంపెనీల్లో దాదాపు 80 మంది పని చేస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు విధులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 2.40గంటలకు బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అందరు టీ తాగుతున్నారు. చలిలోనే విధులు పట్టణం అంతా నిద్రలో ఉండగానే పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. మెదక్ రోడ్లో లలిత , రాజమణి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు చలికి వణుకుతూ రోడ్లను ఊడుస్తున్నారు. ఊడ్చిన చెత్తను వెంటనే ఆటోలో వేస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పట్టణంలోని సుభాష్ రోడ్లో ఓ షాపింగ్ మాల్ వద్ద సెక్యూరిటీ గార్డులు శ్రీనివాస్, రమేశ్ చలి, దోమల నుంచి రక్షణ పొందేందుకు కొబ్బరి పీసుతో పొగ పెట్టారు. ఇలా పొట్ట కూటి కోసం ఎముకలు కొరికే చలిలో సైతం విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్, కరీంనగర్కు వెళ్లే ప్రయాణికులు చలి ఎక్కువగా ఉండటంతో పొన్నాల సమీపంలోని కింగ్ ప్యాలెస్ వద్ద గరం గరం చాయ్ తాగారు. -
కారుతో ఢీకొట్టి యువకుడి హత్య
కొండపాక(గజ్వేల్): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షాహెద్(25) శనివారం ద్విచక్ర వాహనంపై కుకునూరుపల్లిలో హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోకి రాగానే చాట్లపల్లికి చెందిన ఖాదర్ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఖదీరియా ఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా అప్పటికే ఎగుర్ల కర్నాకర్ తీవ్ర గాయాలైన షాహెద్ను కారులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం రాత్రి ఖాదర్ ఫోన్ చేసి మృతుడి తల్లి ఖదీరియాను ఇంటికి రమ్మనడంతో వెళ్లింది. నీ కొడుకు షాహెద్ నా భార్యకు మాటి మాటికి ఫోన్ చేస్తూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వెంటనే మానుకోవాలని చెప్పాలని సూచించాడు. లేనిచో చంపుతానని హెచ్చరించాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతోనే తన కొడుకు షాహెద్ను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేశారని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిద్దిపేట సీపీ విజయ్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీరును, గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను అప్రమత్తం చేశారు.పథకం ప్రకారమే హత్య చేశారని తల్లి ఫిర్యాదు -
రేషన్ బియ్యం స్వాధీనం
పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ఇలా...అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ముత్తంగి ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు, రామచంద్రపురం విజిలెన్న్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, గుజరాత్కు లారీలో తరలిస్తున్న (450 బ్యాగులు) 217 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు అక్రమంగా వైద్యనాథ్, లారీ ఓనర్ ఆశిక్, లారీ డ్రైవర్ ఇమ్రాన్ఖాన్పై కేసు నమోదు చేశారు. గ్యాస్ లీకై మంటలుగజ్వేల్రూరల్: పాఠశాలలో విద్యార్థులకు వంటలు చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వచ్చాయి. గమనించిన సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పిన సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... సంగుపల్లిలోని యూపీఎస్ పాఠశాలలో శనివారం ఉదయం మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాగిజావను తయారు చేస్తుండగా సిలిండర్కు ఉన్న రెగ్యులేటరీ వద్ద గ్యాస్ పైపు లీక్ కావడంతో మంటలు వచ్చాయి. సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎంఈవో కృష్ణ, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పాఠశాలకు వచ్చి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కన్సాన్పల్లిలో మొసలి వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి పెద్ద చెరువులో వారం రోజులుగా మొసలి సంచరిస్తోంది. చెరువులో మొసలి తిరుగుతుండగా అటువైపు వెళ్లిన గ్రామస్తులు సెల్ఫోన్లో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం చెరువు ఆయకట్టు కింద వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో చెరువు చుట్టూ పక్కల ఉన్న పత్తి పంట తీత పనులు సాగుతున్నాయి. మొసలి తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతుండటంతో అటువైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. కాగా ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా.. మొసలి గురించి సమాచారం లేదని, నీరు ఖాళీ అయితేనే పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. -
పనికి వెళ్తే.. ఉసురు తీశారు
జహీరాబాద్ టౌన్: కూలి పనులకు వెళ్లిన మహిళను ట్రాక్టర్ మృత్యురూపంలో కబలించింది. ఈ ఘటన మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి పోలీసుల కథనం ప్రకారం... జహీరాబాద్ పట్టణంలోని హమాలీ కాలనీకి చెందిన మంగలి లక్ష్మి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. కాగా ధనసిరి గ్రామంలోని సిద్దప్ప పొలంలో చెరకు పంటను కోసే పనులకు వెళ్లింది. ఈ క్రమంలో చెరుకు కటింగ్ పనులు చేస్తుండగా డ్రైవర్ ట్రాక్టర్ను అజాగ్రత్తగా నడుపుతూ ఆమైపె నుంచి తీసుకెళ్లాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా డ్రైవర్ చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఆమె కేకలు వేసినా అతడికి వినిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మహిళ పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో మృతి -
క్రీడల్లో రాణించాలి
మెదక్జోన్: క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో రాణించాలని డీఈఓ విజయ పేర్కొన్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎజీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాల ,బాలికలు ఖోఖోలో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 23, నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించారు. శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, యూనిఫాంలను డీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో రాణించి, జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ నాగరాజు, పీడీలు ఎ.మాధవరెడ్డి, రూపేందర్, రవి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.డీఈఓ విజయ -
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..
సిద్దిపేటరూరల్: రంగోత్సవ్ సెలెబ్రేషన్ ముంబై ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ చిత్రలేఖనం పోటీల్లో గుర్రాలగోంది సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి శనివారం తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ చిత్రలేఖనం పోటీల్లో పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. కాగా వీరిలో 10 బంగారు పతకాలు, 5 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు , ఒక ఆర్ మెరిట్ పతకాన్ని విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఆక్టివిటీస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రతిభ చాటేలా కృషి చేసిన ఆర్ట్ టీచర్ సుకుమార్చారిని ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ కన్వీనర్గా మహేందర్రెడ్డి మెదక్ కలెక్టరేట్: రాజీవ్గాంధీ పంచాతీరాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శిగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన మహేందర్రెడ్డిని నియమిస్తూ జాతీయ నాయకులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో సంఘటన్ బలోపేతం, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల శక్తివంతం కోసం పనిచేయడానికి ఈ అవకాశం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థికి యంగ్ సైంటిస్ట్ అవార్డు మెదక్ మున్సిపాలిటీ: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాపన్నపేట మండలం చీకోడ్ లింగాయపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన శివ చైతన్య యంగ్ సైంటిస్ట్ అవార్డ్ను సాధించాడు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 52వ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని – 2025 జరిగింది. అయితే 10వ తరగతి విద్యార్థి శివ చైతన్య, గైడ్ టీచర్ కిషన్ ప్రసాద్ సహకారంతో రూపొందించిన మిరాక్యూలస్ మల్టీపర్పస్ మల్టీ కాన్సెప్ట్వల్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఫ్యూచర్ అడ్వాన్న్స్ ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చరల్ ప్రాబ్లెమ్ సాల్వింగ్, అండ్ ఆల్ ఇన్ వన్ వెహికల్ అనే నూతన ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఈ సందర్భంగా పర్యావరణ్ సంస్కృతి సంరక్షణ్ ఎవమ్ మానవ్ కళ్యాణ్ ట్రస్ట్ చైర్మన్ సుశీల్ కుమార్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. కాగా విద్యార్థిని, ఉపాధ్యాయుడిని పలువురు ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
నిశీధిలో నిత్యపోరాటం
చలించని శ్రమైక జీవనం..సంగారెడ్డిలో.. సంగారెడ్డి జోన్: జిల్లాలో సింగిల్ డిజిట్ చలి తీవ్రత నమోదు అవుతున్నప్పటికీ పారిశుధ్య పనులు నిర్వహించడంలో కార్మికులు వెనుకడుగు వేయడం లేదు. ఉదయం 4 గంటలకే వచ్చి ఫేస్ రికగ్నేషన్ ద్వారా హాజరు వేసుకొని విధుల్లోకి వెళ్తున్నారు. చలి ఉన్నా గ్లౌజులు, స్వెటర్లు వేసుకుని, మొహానికి మాస్క్ ధరించి ఇబ్బందులు పడుతూ శుభ్రం చేస్తున్నారు. వణుకుతున్న నిరాశ్రయులు పట్టణంలో నిరాశ్రయులు చలికి వణుకుతున్నారు. బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, రోడ్డు పక్కన, వివిధ ప్రదేశాల్లో దుప్పట్లు కప్పుకొని చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు. నిరాశ్రయులకు షెల్టర్ లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులకు వెళ్తూ.. కూలీలు ప్రస్తుతం పత్తితీత పనులతో పాటు చెరుకు నరికే పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే స్థానికంగా పనులు దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు కూలి పనుల కోసం దుప్పట్లు కప్పుకొని వెళ్తున్నారు. చలి ఉన్నప్పటికీ పనులకు వెళ్లక తప్పడం లేదని, పనులకు వెళితేనే ఫూట గడుస్తుందని రైతు కూలీలు చెప్పారు. 3 గంటల నుంచే టీ.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా చాయి తాగుతుంటారు. ఉదయం 3 గంటలకే టీ దుకాణాలు తెరుచుకుంటున్నాయి. 8 గంటల వరకు టీ దుకాణాలు రద్దీగా ఉంటున్నాయి. అలాగే టిఫిన్ సెంటర్లు సైతం త్వరగా తెరుచుకుంటున్నాయి. పది రోజులుగా వ్యాపారం బాగా జరుగుతుందని టీ నిర్వాహకులు చెబుతున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఉంటే తిప్పలే.. సంగారెడ్డితో పాటు పటాన్ చెరు నియోజకవర్గాల్లో అధికంగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ప్రతిరోజు రెండు నుంచి నాలుగు షిఫ్టులు కొనసాగుతుంటాయి. ఫస్ట్ షిఫ్ట్ వెళ్లే వారికి చలికాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 6 గంటల్లోపు హాజరు వేయాలి. అందుకు ఉదయం నాలుగు గంటలకే లేచి ఐదు గంటలకు బస్సులో ప్రయాణిస్తున్నారు. రైతుల అవస్థలు వ్యవసాయ పొలాల్లో పండించిన కూరగాయలు, పూలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 3 గంటలకే మార్కెట్కు చేరుకుని చలికి వణుకుతూ అక్కడే మంట కాపుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. గ్రామం నుంచి రాకపోకలు సాగించే సమయంలో విపరీతమైన చలి ఉంటుందని అన్నదాతలు వాపోతున్నారు. మీ గమ్యాన్ని చేరుస్తాం.. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటో డీసీఎం వాహనాల డ్రైవర్ల కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలి. చలి తీవ్రత, మంచు కురుస్తున్నప్పటికీ వాహనాలు నడిపించక తప్పడం లేదు.తండ్రిని హైదరాబాద్కు తీసుకెళ్తూ.. తెల్లవారు జామున 3.20గంటలకు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర పెట్రోల్ పంప్ 24 గంటలు మూడు షిఫ్ట్లలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్కు సుదర్శన్ అనే ఆటోడ్రైవర్ తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. కారు అయితే డబ్బులు అధికంగా తీసుకుంటారని సొంత ఆటోలోనే వెళ్తున్నారు. డీజిల్ను రంగధాంపల్లి పెట్రోల్ పంప్లో పోయించుకుని వెళ్లారు. ఏటీఎంకు రక్షణ.. విధులకు సెల్ఫీ.. నర్సాపూర్ చౌరస్తాలోని కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద హరీశ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో ఉన్నట్లు హరీశ్ గంట గంటకు సెల్ఫీ దిగి సెక్యూరిటీ ఆఫీస్ వాట్సప్ గ్రూప్లో ఫొటోను పోస్ట్ చేస్తూ అటెండెన్స్ వేసుకుంటున్నాడు. డ్రంకెన్ డ్రైవ్.. అర్థరాత్రి 12 గంటలకు సిద్దిపేట పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అంతలోనే ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ రావడంతో అతనికి చెక్ చేయగా మద్యం తాగినట్లుగా తేలింది. దీంతో సదరు వాహనదారుని వివరాలు సేకరించారు. అలాగే పలు చోట్ల పెట్రోలింగ్ వాహనాలు దర్శనమిచ్చాయి. చలిలోనూ విధులు, బాధ్యతలు తెల్లవారు జాము నుంచే పోరాటం మెతుకు సీమలో ఉపాధి పోరు -
పెండింగ్లో డీసీసీ పదవి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామకాన్ని అధిష్టానం పెండింగ్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీసీసీలను ప్రకటించిన అధినాయకత్వం ఒక్క సంగారెడ్డితోపాటు, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులను ప్రకటించలేదు. అయితే జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీసీసీ పదవి విషయంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్రెడ్డి పేరు వినిపించింది. అలాగే ఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు పి.చంద్రశేఖర్రెడ్డితో పాటు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఈ డీసీసీ పదవుల నియామకం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిష్టానం ఈసారి నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. ఏఐసీసీ నుంచి ప్రత్యేక పరిశీలకులు సిజరిటతోపాటు, మరో ఇద్దరు పీసీసీ పరిశీలకులతో గత నెలలో అభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగింది. ఈ పదవికి మొత్తం 42 మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న నీలం మధుముదిరాజ్, ఎంపీ సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ వంటి నాయకులు కూడా దరఖాస్తులు చేసుకున్నవారిలో ఉన్నారు. ఎవరికివారుగా ప్రయత్నాలు ఈ డీసీసీ పదవిని ఆశించిన నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉజ్వల్రెడ్డికి మద్దతు తెలిపారు. సంగారెడ్డితోపాటు, ఆందోల్ నియోజకవర్గం పార్టీ శ్రేణులంతా ఉజ్వల్రెడ్డికి డీసీసీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉజ్వల్రెడ్డితోపాటు ఏఐసీసీ అగ్రనేత ఖర్గేను కూడా కలవడం చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రశేఖర్రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి ఆ యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి ప్రయత్నాలు చేసుకున్నారు. ఇలా ఎవరికి వారే డీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఉజ్వల్రెడ్డి నియామకాన్ని జహీరాబాద్కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యతిరేకించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే చంద్రశేఖర్రెడ్డికి డీసీసీ పదవి విషయంలో ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యంతరం తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇలా జిల్లాలోని అగ్రనాయకుల మధ్య సమన్వయ లోపం ఉండటంతో అదిష్టానం ఈ పదవిని పెండింగ్లో పెట్టినట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.జిల్లా అగ్రనేతల మధ్య సమన్వయలోపమే కారణమా! -
తగ్గనున్న బీసీ సా్థనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సర్పంచులు, వార్డుమెంబర్ల పదవులకు తాజా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50%లోపు రిజర్వేషన్లు ఉండేలా మార్చిన శాతానికి తగ్గట్టుగా ఆయా పదవుల రిజర్వేషన్లపై జిల్లా అధికార యంత్రాంగం శనివారం కసరత్తును పూర్తి చేసింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీశాఖతోపాటు, జిల్లా పరిషత్ అధికారు లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు ఈ తాజా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆదివారం ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం లాటరీ ద్వారా నిర్వహించనున్నారు. అనంతరం ఆయా సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ల వివరాలకు సంబంధించిన గెజిట్ను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఈ కసరత్తు జరిగింది. బీసీలకు తగ్గిన స్థానాలు.. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు 5,370 వార్డులున్నాయి. పాత రిజర్వేషన్ల ప్రకారం చూస్తే 613 గ్రామపంచాయతీల్లో 126 గ్రామాల సర్పంచ్ స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. 99 సర్పంచ్ స్థానాలు ఎస్టీలకే కేటాయించారు. బీసీలకు 224 సర్పంచ్ స్థానాలను రిజర్వు చేశారు. మిగిలిన 164 జనరల్గా ప్రకటించారు. మారిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ, బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య తగ్గనుంది. జనరల్ స్థానాల సంఖ్య పెరగనుంది. ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.పెరగనున్న జనరల్ స్థానాలు సర్పంచులు, వార్డు సభ్యుల తాజారిజర్వేషన్లు ఖరారు నేడు మహిళా రిజర్వేషన్ల కోసం లాటరీరెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన.. సర్పంచ్ స్థానాలను రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన ఖరారు చేశారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లు మండలం ప్రాతిపదికన ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకోగా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీఓలోని మార్గదర్శకాల మేరకు ఖరారు చేశారు. -
నిశీధిలో నిత్యపోరాటం
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025చలించని శ్రమైక జీవనంశనివారం వేకువజామున.. శీతల గాలులు వీస్తున్న వేళ.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యం.. పట్టణవాసులు ముసుగు పెట్టి గాఢ నిద్రలో ఉండగా.. కోరలు చాచిన చలిని సైతం లెక్క చేయకుండా వారు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. పొట్ట కూటి కోసం పరుగులు తీస్తుంటారు.. విభిన్న పనులు చేస్తూ బతుకుబండిని లాగుతుంటారు. వారిలో కొందరు.. పొద్దుపొద్దునే నిద్ర లేచేసరికి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతారు.. ఇంకొందరు.. కూరగాయలను మార్కెట్కు తీసుకొస్తారు.. మరికొందరు.. ప్రపంచ సమాచారాన్ని మనకు చేరవేస్తారు.. మొదటి షిప్టు డ్యూటీలో చేరేందుకు ఆర్టీసీ కార్మికుల ఉరుకుల పరుగులు, అర్ధరాత్రి బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చలి కోరల్లో విలవిల్లాడిన ప్రయాణికులు ఎందరో. చాయ్వాలా, పాలన్నల హడావిడి. ఇలా అనేక రంగాల్లో పనిచేసి సూర్యోదయానికి ముందే ఇళ్లకు చేరుకుంటారు. పని చేయనిదే పూటగడవని బడుగుజీవుల జీవన పోరాటంపై మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో తెల్లవారుజామున ‘సాక్షి’ బృందం పరిశీలించింది. నిశీధిలో వారి నిత్య పోరాటంపై ఈ వారం సండే స్పెషల్.సంగారెడ్డి పట్టణంలో స్వెట్టర్ధరించి వెళ్తున్న మహిళ సంగారెడ్డి: చలిలో ఉపశమనం కోసం మంట కాచుకుంటున్న ప్రజలు -
హరీశ్రావుకు జాతర ఆహ్వానం
నారాయణఖేడ్: ఖేడ్ మండలం అనంతసాగర్లో ఈనెల 30న మైలారం మల్లన్న స్వామి కల్యాణం, జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే హరీశ్రావును శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పరమేశ్, అనంతసాగర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు సిద్ధు, సురేశ్గౌడ్, రాజు, కోయల రాజు, రిషిలు ఆహ్వానపత్రికను అందజేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలిజిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటేశ్ నారాయణఖేడ్: టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధి ంచేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటేశ్ సూచించారు. ఖేడ్ పట్టణంలోని గిరిజన బాలికల వసతిగృహం, మండలంలోని జూకల్ శివారులో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అడిగి భోజన నాణ్యత, సదుపాయాలు, విద్యాబోధన వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని వసతిగృహం సంక్షేమ అధికారి బాలమణికి సూచించారు. చెరుకు రైతులకు రాయితీలు ఇవ్వాలిజహీరాబాద్ సీడీసీ చైర్మన్ ముబీన్ జహీరాబాద్: చెరుకు పంటపై రైతులకు పలు రాయితీలు కల్పించాలని జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ముబీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్బాబుకు ఆయన వినతిపత్రం సమర్పించారు. సెక్రటేరియట్లో ఎంపీ సురేశ్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి సమక్షంలో సీడీసీ చైర్మన్ ముబీన్ శనివారం మంత్రి శ్రీధర్బాబును కలిసి చెరుకు సమస్యల గురించి వివరించారు. చెరుకు పంటకు ప్రస్తుత కర్మాగారాలిస్తున్న ధర ఏ మాత్రంగి ట్టు బాటుగా లేదని వివరించారు. పెట్టుబడుల వ్యయం భారీగా అవుతోందని, అందుకు అనుగుణంగా చెరుకు పంటకు గిట్టుబాటు ధరను ఇప్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు, గిట్టుబాటు ధర ఇప్పించడంతోపాటు బోనస్, ప్రధాన డిమాండ్లను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ముబీన్ తెలిపారు. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు మనిషాజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల విద్యార్థి మనిషా సిరివి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మానాక్ అవార్డుకు ఎంపికై ంది. మున్సిపల్ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. మనిషా వృద్ధుల కోసం బరువైన వస్తువులను శారీరక ఒత్తిడి లేకుండా ఎత్తుకునే సులభ యాంత్రిక పద్ధతిలో రూపొందించింది. విద్యార్థిని మేథస్సును గుర్తిస్తూ అవార్డు నిర్వాహకులు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పాఠశాల యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలేఎస్పీ పరితోశ్పంకజ్ సంగారెడ్డి జోన్/కల్హేర్ (నారాయణఖేడ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ పరితోశ్ పంకజ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ పోలీసులకు వారాంతపు పరేడ్ నిర్వహించారు. అనంతరం సిర్గాపూర్ పోలీస్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అధికారులకు ఫిట్నెస్ కీలకమన్నారు. -
4 లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలి
పటాన్చెరు టౌన్: నాలుగు లేబర్ కోడ్స్ను అమలు చేయడం అత్యంత దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ శనివారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు రంగారెడ్డి మాట్లాడుతూ...2019–20లో ప్రపంచం మొత్తం కరోనా విపత్తులో ఉన్నపుడు దొడ్డిదారిన మోదీ సర్కారు లేబర్ కోడ్స్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నదన్నారు. కార్మికవర్గం 9 దేశవ్యాప్త సమ్మెల ద్వారా ఈ లేబర్ చట్టాలపై నిరసన తెలియజేసిందని గుర్తు చేశారు. ఈ లేబర్ కోడ్స్ పూర్తిగా యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు, శ్రమ దోపి డీ చేయడానికి ఉపయోగపడతాయన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి -
ఆయిల్పామ్ సాగుతో ఆర్థిక భరోసా
జహీరాబాద్ టౌన్: ఆయిల్పామ్ సాగుతో నిరంతర సుస్థిర ఆదాయం లభిస్తుందని రైతుల ఆ పంట సాగుకు ముందుకురావాలని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. మండలంలోని రంజోల్ బాబానగర్లో సత్యనారాయణ పొలంలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయిల్పామ్ మొక్కలను ఒక్కసారినాటితే 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఆయిల్పామ్ సాగు కోసం ఎకరాకు రూ.51 వేల చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయిల్పామ్ మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాణిక్రావు -
పక్షం రోజుల్లో మరమ్మతులు
పుల్కల్(అందోల్): సింగూరు డ్యామ్ మరమ్మతు పనులు పక్షం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కమిటీ స్పష్టం చేసింది. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పరిశీలన కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శనివారం ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ...డ్యామ్ సాగు, తాగునీటి పథకాలను అంచనావేస్తూ దశలవారీగా నీటిని దిగువకు వదిలి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రస్తుతం డ్యామ్లో 17 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం డ్యామ్ మట్టికట్టకు 800 మీటర్ల బుంగ కనిపిస్తుందని, దిగువకు ఎంతవరకు ఉందో నీరు తొలగిస్తేనే తెలుస్తుందని వివరించారు. దిగువ వరకు బుంగ ఉంటే నీరు మొత్తం ఖాళీ చేయాల్సి ఉంటుందని, దిగువకు కొద్ది మొత్తంలో ఉంటే రెండు, మూడు టీఎంసీలు నిల్వ ఉంచుకోవచ్చని కమిటీ అభిప్రాయం తెలిపింది. ప్రాజెక్టు బహుళ ప్రయోజనాల దృష్ట్యా మరమ్మతు పనులు 50 ఏళ్ల వరకు మన్నిక ఉండేలా చేపట్టాలని సూచిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం డ్యామ్ గేట్లను, మిషన్ భగీరథ ప్లాంట్లను పరిశీలించారు. డ్యామ్ మరమ్మతు పనులు జరుగుతున్నప్పుడు బోరుబావులు తవ్వి గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారిస్తామని మిషన్ భగీరథ ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్ను పరిశీలించిన కమిటీ సభ్యుల్లో ఈఎన్సీ (జనరల్) అంజత్ హుస్సేన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, డిజైన్ సీఈ సత్యనారాయణరెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం బ్రిజేశ్, సీఈ శ్రీనివాస్, ఎస్ఈ పోచమళ్లు ఉన్నారు. సింగూరు ప్రాజెక్టును పరిశీలించిననిపుణుల బృందం


