breaking news
Sangareddy District Latest News
-
ప్రతీ లక్ష్యాన్ని నిబద్ధతతో సాధించాలి
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపటాన్చెరు: ప్రతీ లక్ష్యాన్ని నిబద్ధతతో సాధించాలని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ 17వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 1,990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం భారతీయ చేనేత రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ చేనేత కళాకారుడు గజం గోవర్ధన్కు గీతం గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. అలాగే విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి లక్ష్యాన్ని నిబద్ధతతో సాధించాలని, జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గీతం అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. లక్ష్యాలపై నిబద్ధత, నిరంతరం నేర్చుకోవడం విజయానికి సూత్రాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
బురదలో కూరుకుపోయిన స్కూల్ బస్సు
హవేళిఘణాపూర్(మెదక్): ఇటీవల కురిసిన వర్షాలతో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ముందు టైరు బురదలో కూరుకుపోయింది. వివరాలు ఇలా.. మెదక్ పట్టణం నుంచి ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు మండలంలోని మక్తభూపతిపూర్ వైపు 50 మంది విద్యార్థులను తీసుకెళ్తుండగా పుష్పాల వాగుపై వెళ్తున్న క్రమంలో ముందు టైరు బురదలో కూరుకుపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో నుంచి పిల్లలను బయటకు దింపివేశారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును వెనక్కి తీశారు. ఏడాది గడిచినా ఇంత వరకు రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం మూలంగా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తి అదృశ్యం నారాయణఖేడ్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్రావు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఉప్పరి ఈరన్న(49) నాలుగు నెలలుగా కనిపించడం లేదు. దీంతో కుంటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. భార్య సక్కుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషణవ్యక్తిపై అట్రాసిటి కేసు నమోదు మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని నర్సాయపల్లిలో కులం పేరుతో దూషించిన ఘటనలో ఓ వ్యక్తిపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ముస్త్యాల శ్రీనివాస్ను అదే గ్రామానికి చెందిన చింతల సదానందం గత నెల 30న నర్సాయపల్లి వాట్సాప్ గ్రూప్లో కులం పేరుతో దూషించినట్లు బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అట్రాసిటి కేసు నమోదు చేశారు. జూదం ఆడుతున్న 9 మంది అరెస్ట్హవేళిఘణాపూర్(మెదక్): జూదం ఆడుతున్న 9మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని ర్యాలమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. గ్రామంలో బొమ్మాబొరుసు ఆడుతు న్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేగుంట(తూప్రాన్): అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న షాపుల్లో దాడులు నిర్వహించి 15 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నిత్యానందం ఆదేశాల మేరకు పౌరసరఫరాల సిబ్బంది, రెవెన్యూ అధికారులు చేగుంటలోని అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రాల్లో శనివారం దాడులు నిర్వహించారు. వంజరి రాజుకు చెందిన లక్ష్మినర్సింహస్వామి రిపేర్ షాపులో 7, సురేశ్కు చెందిన గంగా లైట్హౌజ్లో 2, మహేదర్కు చెందిన లక్ష్మినర్సింహ సీడ్ షాపులో 6, 1 కమర్షియల్ సిలిండర్ కలుపుకొని మొత్తం 15 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక కమర్షియల్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి నంగునూరు(సిద్దిపేట): పొలం దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఘణపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల బాపురాజు (39) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం పొలం దున్నుతున్న క్రమంలో ఫిట్స్ రావడంతో కేజీవీల్ కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడు సాయి చరణ్ ఫిర్యాదు మేరకు రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జల్సాలకు అలవాటై.. బైక్ల చోరీ
అక్కన్నపేట(హుస్నాబాద్): ద్విచక్రవాహనాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని కట్కూర్ గ్రామానికి చెందిన గొల్లెన సురేశ్ కొన్ని రోజులుగా గ్రామంలో పలువురి ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లాడు. అలాగే మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకొని అతడ్ని విచారించగా నేరం అంగీకరించాడు. కాగా నిందితుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. తరిగొప్పుల పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ చోరీకి సంబంధించిన కేసులో గతంలో రిమాండ్ అయినట్లు తెలిపారు. -
యువత గంజాయికి దూరంగా ఉండాలి
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్ టూబీహెచ్కే కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పత్రాలు లేని 49 బైక్లు, 3ఆటోలు సీజ్ చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి, వారి నుంచి 18.65 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర, సురక్ష నేత్ర, షీ సేఫ్ వంటి సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో సీఐలు మహేందర్రెడ్డి, మురళి, విద్యాసాగర్, రాజేశ్, 14మంది ఎస్ఐలు, వంద మంది పోలీసులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
పుల్కల్(అందోల్): యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో కలకలం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికార్జునపల్లి రాజు(28) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. కాగా అతడ్ని గర్తుతెలియని కొందరు వ్యక్తులు ఫోన్ చేసి కారులో తీసుకెళ్లారు. ముదిమాణిక్యం– సూరెడ్డి ఇటిక్యాల గ్రామాల మధ్య రహదారి ప్రక్కన హత్య చేసి పడేశారు. సీసాతో గొంతు కోసి హత్య చేసిన ఆనవాళ్లు లభించాయని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య, జోగిపేట సీఐ అనిల్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి రహదారిపైకి వచ్చి ఆగిపోయాయి. క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుని శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.కాగా మృతుడికి భార్య ఉంది. కాగా గ్రామంలోని సీసీ కెమెరాల్లో కారు ఆనవాళ్లు లభించాయని తెలిసింది. -
యువకుడి ఆత్మహత్య
● సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని దింపారని.. ● వట్పల్లి పోలీస్స్టేషన్పై దాడి ● అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసంవట్పల్లి(అందోల్): యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా.. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టు పైనుంచి దింపారని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) వట్పల్లిలోని ఓ దాబాలో ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి దాబాలోనే పడుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో దాబా నుంచి బయటకు వెళ్లి కొంత దూరంలో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన దాబా నిర్వాహకుడు శ్రీనివాస్ వెంటనే యువకుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు దాబా నిర్వాహకులే యువకుడి మృతికి కారణమని ఆరోపిస్తూ దాబా ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్ఐ లక్ష్మికాంతరెడ్డి , పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దాబా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని చెట్టు పైనుంచి కిందకు దింపారు. పోలీస్స్టేషన్పై దాడి.. కాగా తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు ఎలా దింపుతారని గ్రామస్తులు ఆగ్రహిస్తూ పోలీస్టేషన్పై దాడికి దిగి తలుపులు, అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చే క్రమంలో గ్రామానికి చెందిన బాబయ్య అనే వ్యక్తిపై ఎస్ఐ చేయి చేసుకోడంతోనే స్టేషన్పై దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. సమాచారం అందుకున్న జోగిపేట సీఐ అనీల్కుమార్ అదనపు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య యువకుడి మృతి, స్టేషన్పై జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టారు. మృతుని అన్న నాగరాజు, గ్రామస్తుల సమక్షంలోనే మృతదేహాన్ని కిందకు దింపామని పోలీసులు తెలిపారు. కాగా మృతుని సెల్ఫోన్ ఆధారంగా ఆన్లైన్ యాప్లో బెట్టింగులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
స్నేహబంధం మరింత బలోపేతం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్నేహితుల దినోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే పాఠశాలల్లో విద్యార్థులు స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పరస్పరం మిఠాయిలు పంచిపెట్టుకొని స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. శ్రీవాణి పాఠశాలలో జరిగిన స్నేహితుల దినోత్సవంలో బడ్జెట్ మేనేజ్మెంట్ స్కూల్ అసోసియేషన్ తెలంగాణ (బీస్మాట్) జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొని మాట్లాడారు. స్నేహం అనేది మనిషి జీవితంలో అత్యంత విలువైన బంధమన్నారు. ఆపదలో అండగా నిలిచి, ఆనందంలో భాగస్వామిగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏర్పడే మంచి స్నేహాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయన్నారు. ప్రతి విద్యార్థి మంచి స్నేహితుడిగా ఎదిగి సమాజంలో ఆదర్శప్రాయంగా నిలవాలని తెలిపారు. -
మద్యం మత్తులో కుటుంబంతో గొడవ..
వ్యక్తి ఆత్మహత్యనిజాంపేట(మెదక్): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అలకుంట గురువయ్య(50) శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ మేరకు తన భార్య అలకుంట రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో రైతు.. చేర్యాల(సిద్దిపేట): అనారోగ్యంతో మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఆకునూరులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడుదూరి రాములు(64) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అపూర్వరెడ్డి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
రైతుల్లో చిగురించిన ఆశలు
● ముసురుతో ఆరుతడి పంటలకు మేలు ● ఆరు మండలాల్లో అధికం, 20 మండలాల్లో సాధారణ వర్షపాతం నారాయణఖేడ్: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆరుతడి పంటలన్నీ జీవం పోసుకున్నాయి. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అన్నదాతలు కష్టాలను గట్టెక్కినట్లే. కురిసిన వర్షాలు పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు మేలు చేకూర్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం 120.0 మి.మీ కురియాల్సి ఉండగా 132.0 మి.మీ కురిసింది. జూలైలో 194.2 మి.మీకు 203.2 మి.మీ నమోదైంది. గత నెలలో 10 శాతం అధికంగా ఈ నెలలో 6.3 శాతం అధికంగా వర్షం కురిసింది. రెండు మండలాల్లోనే తక్కువ జిల్లాలోని రెండు మండలాలైన జహీరాబాద్, ఆందోల్ మండలాల్లో మాత్రమే కాస్త తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఇదే సమయంలో సిర్గాపూర్, మనూరు, కంగ్టి, పుల్కల్, కొండాపూర్, ఆర్సీపురం మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. జిల్లాలోని 28 మండలాల్లో 20 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మండలాల్లో కాస్త తక్కువ, ఆరు మండలాల్లో ఎక్కువ వర్షపాతం కురిసింది. జిల్లాలో కంది పంట 72,594 ఎకరాలు, పెసర 8,226, మినుము 6,253, మొక్కజొన్న 8,489, సోయాబీన్ 71,888, పత్తి జిల్లాలోనే అత్యధికంగా 3,55,609 ఎకరాల్లో సాగు చేశారు. ముందు ముందు కూడా ఇదే తరహాలో సాధారణ వర్షపాతం నమోదైతే సాగులో ఉన్న పంటలకు మేలు జరిగి రైతులు మంచి దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి. పూత, కాత దశలో పెసర, మినుము జూన్లో మధ్య మధ్యలో వర్షాలు కురియడం, జూలైలో సైతం అప్పుడప్పుడు కురిసిన చినుకులతో పెసర, మినుము పంటలకు మంచి మేలు చేకూరింది. ప్రస్తుతం ఈ రెండు పంటలు పూత, కాత దశలో ఉన్నాయి. మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు కురిసిన వర్షాలకు కొందరు రైతులు పెసర, మినుము విత్తుకోగా ఆ పంటలు ప్రస్తుతం కాతదశకు వచ్చాయి. తర్వాత వేసిన కమతాల్లోని పంట పూత, అక్కడక్కడా కాత దశలో ఉన్నాయి. పెసర, మినుము స్వల్పకాలికాలు కావడంతో 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇప్పటికే 45 నుంచి 50 రోజుల కాలం అవుతుంది. మరో 25 రోజుల్లోపు పెసర, మినుము పంటలు నూర్పిళ్లు చేసుకొనే అవకాశం ఉంది. గతేడాది పెసర, మినుము భారీగా దెబ్బతినగా, ఈసారి వాతావరణం ఇలాగే అనుకూలిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. -
అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డి డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి ● మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి సంగారెడ్డి జోన్: సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్షిప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ విధానంలో జరుగుతున్న మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్రెడ్డి వివరించారు. జిల్లావ్యాప్తంగా కొన్ని రోజుల్లో ఆన్లైన్ ఫ్రెండ్షిప్ మోసాలతో 17 కేసులు నమోదయ్యాయి. డేటింగ్ యాప్, మ్యాట్రిమోనీ వెబ్సైట్, మెసేజింగ్ యాప్ల ద్వారా పరిచయాలు చేసుకుని, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ నమ్మిస్తారు. ఆ తర్వాత ప్రేమ వివాహం, విదేశీ ఉద్యోగం, బహుమతులు, పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి విలువైన సమాచారం సేకరించటంతోపాటు డబ్బులు గుంజుతారు. నకిలీ ప్రొఫైల్స్తో నమ్మించి... విదేశాల్లో స్థిరపడినట్లుగా అందమైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోలతో సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్తో అకౌంట్లు తెరుస్తారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమ వివరాల సంభాషణ జరుపుతారు. అమాయకులను చాలా దగ్గరగా చేసుకుని విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తున్నామని, ఎయిర్పోర్టులో గిఫ్ట్ ఆగిపోయిందని, కొద్దిపాటిగా ఫీజు చెల్లించాలని చెబుతూ డబ్బులు వసూలు చేస్తారు. అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, ప్రమాదం జరిగిందని చెప్పి డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడతారు. పెట్టుబడులు చేస్తే భారీ లాభాలు వస్తాయని ఇన్వెస్టిమెంట్ మోసాలు చేస్తుంటారు. వ్యక్తిగత ఫొటోలు వీడియోలు తీసుకుని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. నకిలీ పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో పని చేస్తుంటామని స్నేహం పెంచుకుని కూడా మోసాలకు పాల్పడుతుంటారు. అప్రమత్తతే ప్రధానం సైబర్ నేరాల పట్ల మోసపోకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిచయమైన అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు. గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు బదిలీ చేయకూడదు. అధికారులు ఎవ్వరు బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు అడగరు అనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. -
78 శాతం డిజిటలైజేషన్
కలెక్టర్ ప్రతీక్ జైన్ సంగారెడ్డి జోన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని తెలిపారు. నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. కొండాపూర్(సంగారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్ఓ లలితాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న చికిత్స, ప్రసూతి సేవలు తదితర అంశాలను పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పరిశుభ్రతపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నారాయణఖేడ్: ఆధునిక కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భారత్ కేర్స్ సంస్థ సీనియర్ అసోసియేట్ సీఎస్ఆర్ ప్రోగ్రామర్ మఠం సాయిప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతితో సమావేశమయ్యారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో విద్యార్థులకు ఉచితంగా ఐబీఎం స్కిల్బిల్డ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫాం ద్వారా ఏఐ, జనరేటీవ్ ఏఐ, సైబర్ సెక్యురిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. త్వరలో తమ సంస్థ, జిల్లా పరిపాలనా విభాగం మధ్య ఒప్పందం కుదర్చుకోనున్నట్లు తెలిపారు. త్వరలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసి కార్యక్రమ అమలుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్కు వివరించారు. మెదక్ కలెక్టరేట్: ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలని మిషన్ భగీరథ కార్మికులు డీఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు గత 7 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఈ సంస్థలో సుమారు 160 మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగరాజు, కార్మికులు భాస్కర్, కుమార్, నర్సింలు, అశోక్, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు. వెల్దుర్తి(తూప్రాన్): ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. వెల్దుర్తి, చేగుంట, మనోహరాబాద్, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, టీబీ సూపర్వైజర్లు, ఆర్బీఎస్కే బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. -
మంచి స్నేహితులను ఎంచుకోవాలి
స్నేహం అంటే మన మనస్సులోని అన్ని రహస్యాలను పంచుకోగల బంధం. నిజమైన స్నేహితుడు సుఖంలోనూ, కష్టంలోనూ ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. నిజమైన స్నేహితులు మన శ్రేయస్సును కోరుకుంటే స్నేహం పేరుతో మనల్ని ముంచేవాళ్లు కూడా ఉంటారు. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వారినే ఎంచుకోవాలి. – సిరివెన్నెల, బీజెడ్సీ, సిద్దిపేట. తోడు నీడగా ఉండాలి స్నేహితులు అంటే ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. స్నేహితులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. అలాంటి స్నేహితులు దొరకడం అదృష్టం. నిస్వార్థమైన స్నేహం కలకాలం నిలుస్తుంది. –అంజలి, డిగ్రీ విద్యారిన్థి, సిద్దిపేట. తేడాలను చూపనిదే స్నేహం కుల, మతం, భాష, సంపద అనే తేడాలను దాటి మనుషులను కలిపే గొప్ప బంధమే స్నేహం. జీవితంలో సంపదకంటే మంచి స్నేహితులు ఉండటం గొప్ప అదృష్టం. –మోహన్ బికాం, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
అందరూ ఒకేలా ఉండరు
ఆన్లైన్ ఫ్రెండ్షిప్తో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలేర్పడి నూతన విషయాలు నేర్చుకునే అవకాశముంది. దూరంలో ఉన్న స్నేహితులతో కూడా ఎప్పటికప్పుడు సులభంగా మాట్లాడుకునే వీలుంటుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. –రమ్య, డిగ్రీ, విద్యార్థిని, సిద్దిపేట. నిజమైన స్నేహమే నిలబడుతుంది నిజమైన స్నేహాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. నమ్మకం, నిజాయితీ, గౌరవం ఉన్నచోట నిజమైన స్నేహం పది కాలాలపాటు నిలబడుతు ంది. అలాంటి నిజమైన స్నేహితుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసి బాధను సగానికి తగ్గిస్తాడు. –గురుచరణ్, బీఎస్సీ, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.బాధను మర్చిపోతాం స్నేహానికి అధిక ప్రాధా న్యతనిస్తాను. స్నేహితులు మనకు కావాల్సినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ ఎలాంటి సమయంలోనైనా మనతో నిలబడి మన విజయంలో పాలు పంచుకుంటారు. స్నేహం మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి విలువను నేర్పిదిలా ఉండాలి. –మల్లికార్జునచారి, ఎంబీపీటీఎస్, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
నిషేధిత కష్టాలకు చెక్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా (ప్రొహిబీటెడ్ లిస్టు)లో ఉన్న పట్టా భూములు, నివాస స్థలాలను ఆ జాబితాలో నుంచి తొలగించేందుకు వస్తున్న దరఖాస్తులపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. వాటి పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ నేతృత్వంలోని ఈ కమిటీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీఓ, సంబంధిత మండల తహసీల్దార్, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఎస్ఆర్ఓ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములు, ప్లాట్లను తొలగించాలని వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వాస్తవంగా అది నిషేధిత జాబితా పరిధిలోకి రాదని తేలితే జాబితాలోంచి తీసి వేయాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఐజీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతారు. కలెక్టర్ ప్రతిపాదనల మేరకు ఐజీ కార్యాలయం ఈ జాబితాను అప్డేట్ చేస్తుంది. పక్షం రోజులకోసారి సమీక్ష నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం జిల్లాస్థాయి కమిటీ పక్షం రోజులకోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ దరఖాస్తుకు సంబంధించిన తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. అలాగే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తారు. ఈ మేరకు ఇచ్చే నివేధిక ఆధారంగా నిషేధిత జాబితాలోంచి తీసివేయడామా.. కొనసాగించడమా..? అనేది ఈ కమిటీ తేలుస్తుంది. తీసివేయాల్సి వస్తే సంబంధిత పాట్ల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయానికి పంపుతారు. ఇటీవల జరిగిన ఈ కమిటీ సమావేశంలో కొన్ని దరఖాస్తులను ఈ కమిటీ పరిష్కరించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు నిషేధిత జాబితాలో నమోదైన పట్టాభూములు, నివాస స్థలాలపై రిజిస్ట్రేషన్లు జరగవు. ఆయా భూముల సర్వే నంబర్లను భూభారతి పోర్టల్లో 22ఏ కింద నమోదు చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ప్రొహిబీటేడ్ లిస్టులో కూడా చేర్చారు. దీంతో నిజమైన పట్టాదారులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్లాట్లు, భూములు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. జిల్లాలో చాలా మంది ఇలాంటి సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ దరఖాస్తులు ఉంటున్నాయి. మరోవైపు బాధితులు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, బాధితుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు అధికారులు నిషేధిత జాబితాలోంచి తొలగించేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తేనే నిజమైన పట్టాదారులు, ప్లాట్ల యజమానులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 22ఏ నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై నజర్ పరిష్కారం కోసం కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సభ్యులుగా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు -
చట్టాలపై అవగాహన అవసరం
ఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులు చట్టాలు తెలుసుకొని న్యాయ వ్యవస్థపై గౌరవంగా ఉండాలని నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు తెలిపారు. శనివారం కంగ్టిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో లీగల్ సర్విస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు చట్టాలు, న్యాయాల విషయంలో అవగాహన ఏర్పడితే పెద్దయ్యాక క్రమశిక్షణతో కూడిన జీవనం గడిపే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం గురుకులంలోని స్టోర్ రూంను పరిశీలించి విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు, పప్పులు తదితరాలు పరిశీలించారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
పీఎం కిసాన్.. మరో ఐదేళ్లు
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ● జిల్లాలో 1,33,526 కుటుంబాలకు లబ్ధి జహీరాబాద్: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,33,526 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 2019 ఫిబ్రవరి 1వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతుల్లో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. భార్య లేదా భర్త ఎవరో ఒకరు మరణిస్తే వారి స్థానంలో పథకాన్ని మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6 వేల వంతున ఆర్థిక సహాయం అందుతోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకమారు రూ. 2 వేల వంతున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 23 విడతలుగా డబ్బులు విడుదల అయ్యాయి. చివరిసారిగా 2026 జూన్ 20న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏవైనా సందేహాల కోస హెల్ప్లైన్ నంబర్ 155261 ద్వారా సంప్రదించవచ్చు. కాగా, రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, సాగు అవసరాల కోసం సౌలభ్యంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని తీసుకున్న నిర్ణయం రైతులకు ఆనందాన్ని ఇచ్చింది. -
స్నేహోత్సవం
స్నేహితులే మన ధైర్యం, ఆత్మవిశ్వాసం డబ్బుతో కొనలేనిది కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులు జీవితంలో గొప్ప సంపద. డబ్బుతో కొనలేని అమూల్యమైన బంధం. నిజమైన స్నేహం నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవంపై నిలబడుతుంది. స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం కాకుండా ప్రేమ, ఆప్యాయతతో కొనసాగించాలి. –సుష్మ, డిగ్రీ విద్యార్థిని, సిద్దిపేట. మంచి స్నేహితులు మార్గదర్శకులు మంచి స్నేహితులు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకులు. నమ్మకంగా ఉండి మన విజయాలను చూసి సంతోషించే స్నేహితుడు ఉంటే జీవితంలో ఎంతటి విజయాలనైనా అలవోకగా సాధించేందుకు వీలుంటుంది. –సంతోష్, డిగ్రీ, ఎంపీసీఎస్, సిద్దిపేట. -
నెలాఖరు వరకు ఈ–కేవైసీ
సంగారెడ్డి జోన్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఈ–కేవైసీ గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా.. భారీ వర్షాలు, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా లబ్ధిదారులు ఈనెల 31 వరకు ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 78.13 శాతం పూర్తి జిల్లాలో 855 రేషన్ దుకాణాలు ఉండగా ఉన్నాయి. 4,48,446 వివిధ రకాల రేషన్ కార్డుదారులుండగా, అందులో 15,12,546 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 11,84,532 మంది సభ్యులు ఈ–కేవైసీ ప్రకియ పూర్తి చేశారు. ఇంకా 3,28,014 మంది చేసుకోవాల్సి ఉంది. ఈ లెక్కన 78.13 శాతం పూర్తి అయింది. మిగితా వారు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అనర్హుల తొలగింపు! జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులలో బియ్యం తీసుకొని వారు, మృతిచెందిన వారిని జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో ప్రతీనెల వారి కోటా యథావిధిగా సరఫరా అవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కార్డులో ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకువెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించింది. నేటి నుంచి మూడు నెలల బియ్యం జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో నేటి నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో తమ పూర్తి వివరాలు అందించి ఉచితంగా ఈ–కేవైసీ చేయించుకోవచ్చు. పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు పొడిగించిన ప్రభుత్వం రేషన్కార్డుదారులకు ఊరట జిల్లాలో ఇప్పటివరకు 78.13 శాతం పూర్తి చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులుఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్ చేయించుకునేందుకు ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గతంలో విధించిన గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది. ఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్ చేయించుకునేందుకు ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గతంలో విధించిన గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది. వేలిముద్రలు పడక తిప్పలు -
ఓటు హక్కు వజ్రాయుధం
పటాన్చెరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో కేవలం 64.65 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అర్హులందరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా చూడాలని బ్రాహ్మణ సంఘాలను కోరారు. నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్ నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతి రెడ్డి, బండి శంకర్, తదితర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి -
58
వలస ఓటర్లు..ఆచూకీ లేని వారు 7,592 మందివే ల మరణించిన వారు 36 వేలు 1.31 లక్షలకు మించి ఓట్ల తొలగింపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఎస్ఐఆర్ ప్రక్రియకు రెండు రోజులే గడువు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన ఓటర్లు 58,109 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. మొత్తం ఓటర్లలో సుమారు 4 శాతం మంది వలస వెళ్లినట్లు తేలింది. శుక్రవారం సుమారు 77 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయగా వీరంతా స్థానికంగా ఉండటం లేదని గుర్తించారు. మిగిలిన 23 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 13,935 మంది, ఆందోల్ నియోజకవర్గంలో 13,662 మంది ఓటర్లు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తేలింది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అతి తక్కువగా.. 7,980 మంది వలస వెళ్లినట్లు గుర్తించారు. వారందరిని ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. మరణించిన ఓటర్ల లెక్క కూడా తేలింది. ఇప్పటి వరకు 36,479 మంది మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆత్మల ఓటర్లను కూడా జాబితా నుంచి తీసివేస్తారు. మొత్తం ఓటర్లలో 2.5 శాతం మంది మరణించిన ఓటర్లు ఇప్పటి వరకు ఓటరు జాబితాలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో మరణించిన ఓటర్లు 8,621 ఉంటే.. తక్కువగా నారాయణఖేడ్లో 5,366 మంది ఉన్నట్లు తేలింది. ఆచూకీ తెలియని ఓటర్ల లెక్క కూడా తేలుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 7,592 మంది ఓటర్ల ఆచూకీ ఇంత వరకు తెలియడం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇలా ఆచూకీ లేని ఓటర్లు 3,192 మంది ఉండగా, పటాన్చెరులో 508 మంది ఉన్నారు. వేరే చోట ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్లు 29,117 మంది గుర్తించారు. వీరంతా ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు పటాన్చెరులో 6,544 మంది ఓటర్లు ఇలాంటి వారు ఉన్నట్లు తేలింది. ఈ నియోజకవర్గంలో ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరిని కూడా ఈసారి ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇవి కాకుండా ఇతర కేటగిరీలో మరో 487 మంది ఓటర్లను ఈజాబితా నుంచి తీసివేయనున్నారు. తొలగించే ఓటర్లు 9 శాతానికి మించి జిల్లాలో మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం వరకు జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇలా మరణించిన ఓటర్లు, ఇతర చోట్ల ఓటరుగా నమోదైన వారు, ఆచూకీ లేని వారు.. అన్ని క్యాటగిరిలో కలిపి 1.31 లక్షల ఓట్లను తొలగించే జాబితాలో చేర్చనున్నారు. అంటే 9.04 శాతం ఓట్లు తొలగించే ఓట్లుగా తేలింది. ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ చివరి దశకు చేరకుంది. జిల్లాలో మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 11.31 లక్షల ఓటర్లకు సంబందించిన ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అంటే మొత్తం ఓటర్లలో 77.64 శాతం ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3.26 లక్షల ఓటర్లకు సంబందించిన ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కేవలం రెండు రోజులే గడువుంది. ఆగస్టు 3 తేదీలోగా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో మిగిలిన 3.26 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేస్తే తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆచూకీ తెలియని ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు, మరణించిన ఓటర్లు.. ఇలా జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. -
ఐరన్ పరిశ్రమను తొలగించండి
తూప్రాన్: ప్రాణాంతక ఐరన్ పరిశ్రమను తొలగించాలని మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. శుక్రవారం రంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోస్టుకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జీ వంటేరు ప్రతాప్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐరన్ పరిశ్రమతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, కలుషిత నీటి కారణంగా చర్మవ్యాధులు వస్తున్నాయని, చెరువుల్లో చేపలు మృతి చెందుతున్నాయని ఆరోపించారు. అనంతరం కలెక్టర్కు పోస్టు కార్డులపై ‘ మా ప్రాణాలను– మా పిల్లల భవిష్యత్తును కాపాడండి’ అని లేఖలో పేర్కొంటూ సుమారు వె య్యికి పైగా పోస్టుకార్డులను పంపించారు. కార్యక్రమంలో రేణుకుమార్, వెంకట్గౌడ్, నాయకులు, యువకులు పాల్గొన్నారు. పోస్టుకార్డులతో కలెక్టర్కు వినతుల వెల్లువ -
అప్రమత్తంగా ఉండాలి
నారాయణఖేడ్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి సూచించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పేట్లో ఫ్రైడే– డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. టైర్లు, పాత్రల్లో నీటిని నిల్వ ఉంచితే దోమలు ప్రబలుతాయని వివరించారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. శానిటరీ అధికారి శ్రీనివాస్తో కలిసి పనులను పర్యవేక్షించారు. సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలసదన్లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకు తోడ్పడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయ పరమైన విషయంలో ఉచిత సాయం అందిస్తామని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. సంగారెడ్డి జోన్: ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి అ న్నారు. కానిస్టేబుల్గా విధుల్లో చేరి ఏఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందుతున్న మోహన్ను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సన్మానించి జ్ఞాపిక అందించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్ర మంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, ఏఆ ర్ డీఎస్పీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధించాలంటే విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తారని డీఎల్పీఓ సురేశ్బాబు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఫైజాబాద్ పంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారికి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వచ్ఛతపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రజలు చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి కార్మికులకు అంజేయాలని, వారు సేకరించిన చెత్తను డంపింగ్యార్డులో పారబోయాలన్నారు. అధికారులు, పాలకులు, ప్రజలతోనే గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపీఓ మునిరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేను సక్రమంగా నిర్వహించి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శాలిపేటలో భూభారతి సర్వేను నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి రీ సర్వే ద్వారా అందరి రైతుల పొలాల హద్దులు, ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సమావేశంలో సర్పంచ్ పోశెట్టి, మండల రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రైట్ రైట్!
కేంద్ర విధానాలపై పోరు కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. వివరాలు 8లో uబుల్లెట్ రైల్..బుల్లెట్ రైల్ కారిడార్ను మొదట్లో జహీరాబాద్ మీదుగా నిర్మించాలని ప్రతిపాదించారు. అనూహ్యంగా జహీరాబాద్ను పేరును తప్పించి వికారాబాద్ను చేర్చడంతో స్థానికంగా ప్రజల్లో అసంతృప్తి పెల్లుబూకింది. దీంతో ఆందోళనలకు దిగారు. జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్, పార్లమెంటరీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఆయా పార్టీల నాయకులు ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈక్రమంలోనే ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు సమగ్ర పరిశీలన కోసం సంబంధింత శాఖ అధికారులకు పంపించినట్లు సమాచారం. ప్రాథమిక పరిశీలన పూర్తయిన అనంతరం తదుపరి అవసరమైన చర్యల కోసం అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం ద్వారా నివేదిక సానుకూలంగానే వచ్చే అవకాశం ఉంటుందనే ఆశాభావం ప్రజల్లో నుంచి వ్యక్తం అవుతోంది. అన్ని విధాలుగా అర్హత బుల్లెట్ రైలును నడిపేందుకు జహీరాబాద్ ప్రాంతం అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందనే విషయమై ప్రజాప్రతినిధులు అందజేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 12,365 ఎకరాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) భారీ ప్రాజెక్టు రాబోతోంది. పలు పరిశ్రమాలకు భూములు కేటాయింపులు జరిగాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా విస్తరిస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపాల్సిన ఆవశ్యకత ఉంది. అయినా రాజకీయ జోక్యం మూలంగానే జహీరాబాద్ స్థానంలో వికారాబాద్ను చేర్చారనే విమర్శలున్నాయి. జహీరాబాద్కు బుల్లెట్ రైలు కనెక్టివిటీ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా వచ్చి చేరే అవకాశం ఉంది. జహీరాబాద్ మీదుగా మీదుగా బుల్లెట్ రైలును నడపడం ద్వారా సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటకలోని బీదర్ నగర ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకార్యంగా మారుతుంది. హైదరాబాద్–ముంబై వయా జహీరాబాద్ అనుకూలతపై పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి ఆదేశం పలువురు ప్రజాప్రతినిధుల చొరవ ఫలితం పారిశ్రామిక ప్రాంతంగా విస్తరిస్తున్నందున సానుకూలతజహీరాబాద్ మీదుగా హైదరాబాద్–ముంబై బుల్లెట్ రైలు కారిడార్ నడిపేందుకు ఏ మేరకు అనుకూలత ఉందనే విషయమై పరిశీలించాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. జహీరాబాద్ మీదుగా ఎందుకు నడపవచ్చనే విషయమై ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు సమగ్ర సమాచారాన్ని రూపొందించి కేంద్ర మంత్రిని కలిసి వినతులు అందజేశారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – జహీరాబాద్ -
హే రాంజీ..!
జహీరాబాద్ టౌన్: జీరాంజీ (ఉపాధి హామీ పథకం) పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లికపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతన బకాయిలు విడుదల చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసనలు, పెన్ డౌన్, షట్ డౌన్ ఆందోళనలు చేపట్టారు. జీరాంజీ పథకంలో పనిచేస్తోన్న ఏపీఓ, ఈసీ, జేఈ,టీఏలు,కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బంది కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,700 వరకు ఉన్నారు. జిల్లాలో సుమారు 150మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. జిల్లాలోని జీరాంజీ ఉద్యోగులు డిమాండ్ పరిష్కారం కోసం జేఏసీ పిలుపు మేరకు పెన్డౌన్ ప్రకటించి ప్రతీ రోజు నిరసనలు తెలుపుతున్నారు. జూలై 27 నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు ప్రతీ రోజు ఓ విధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో న్యాయమైన హక్కుల కోసం నోటీసు ఇచ్చి 16 నుంచి సమ్మెకు వెళ్తామని జేఏసీ నాయకులు చెప్పారు. ప్రధాన డిమాండ్లు ● 3 నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి ● ఉద్యోగులకు పే–స్కేల్ అమలు చేయాలి ● క్యాడర్ను ఖరారు చేసి, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి ● ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల అవకాశం ఇవ్వాలి ● ప్రతీ నెల మొదటి తేది వేతనాలు చెల్లించాలి ● సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలి. ఉద్యోగులు పెన్ డౌన్, షట్ డౌన్ వేతనాల చెల్లింపులో జాప్యం మూడు నెలల నుంచి నిరీక్షణ ఆందోళనకు దిగిన ఉద్యోగులు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాత భవనాలను గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను మిషన్ మోడ్లో నిర్వహించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో నేపథ్యంలో తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
పీఎంశ్రీలకు బతుకమ్మ నిధులు
సాక్షి, సిద్దిపేట: పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాలల్లో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పాఠశాలలకు రూ.10.80 లక్షలు మంజూరు చేసింది. బతుకమ్మ పండుగ చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యంపై విద్యార్థుల్లో అవగాహనను కల్పించాలి. బతుకమ్మకు సంబంధించిన జానపద పాటలు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలి. పర్యావరణహితంగా కార్యక్రమం చేపట్టాలి. గతే డాది పీఎం శ్రీ స్కూళ్లకు బతుకమ్మ వేడుకలకు నిధులను ఆలస్యంగా మంజూరు చేయడంతో కొన్ని పాఠశాలలల్లోనే నిర్వహించారు. మరికొన్ని పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించకుండానే బిల్లులు పెట్టి డబ్బులను హెచ్ఎంలు డ్రా చేశారు. ఈసారి అందుకే ముందుగానే నిధులు విడుదల చేసింది. పాఠశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని విద్యాశాఖ అదేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పీఎంశ్రీ స్కూల్స్ గతేడాది పండుగ ముగిసిన తర్వాత...ఈసారి ముందుగానే నిధులు పాఠశాలల్లో వెల్లివిరియనున్న సంస్కృతీ, సంప్రదాయాలు జిల్లా పాఠశాలల రూ. సంఖ్య కేటాయింపు సిద్దిపేట 33 రూ.3.30లక్షలు సంగారెడ్డి 44 రూ.4.4లక్షలు మెదక్ 31 రూ. 3.10లక్షలు -
చెరువు కాదు.. బడి
ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నిలిచిన నీరుసంగారెడ్డి క్రైమ్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరగతి గదిలోకి వెళ్లాలన్నా వర్షం నీటిలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నీరు నిలిచి ఉండటంతో మధ్యాహ్న భోజనం సైతం చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనార్యోగం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. -
కంట్రోల్ రూం ఏర్పాటు
సంగారెడ్డి జోన్: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అందే అత్యవసర ఫిర్యాదులు, సమాచారం, నష్టం వివరాలను వెంటనే స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, వరదలు, రహదారి అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు, ఇతర ప్రమాదాల సమాచారాన్ని 08455– 276155 నంబర్కు తెలియజేయాలని సూచించారు. పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జహీరాబాద్: మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం మొగుడంపల్లి మండల కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు బ్రెస్ట్ హెల్త్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. బ్రెస్ట్ కేన్సర్పై ముందస్తు అవగాహనతోనే వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. అనంతరం ఎస్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోప్యానాయక్ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.15 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, పలు తండాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే మండంలోని హంగర్గా(కె) నుంచి లాల్సింగ్ తండా వరకు నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, పంచాయతీ వ్యవస్థ బలోపేతం కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్పాటిల్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, సర్పంచ్లు అనూషబాయి, మహాదేవి, శాంతకుమార్, ఉపసర్పంచ్ భాస్కర్, మనోహర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ విధానంలో అడ్మిషన్ పొంది అక్టోబర్లో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులు మీసేవ, టీజీ ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్టుకు రూ.100 థియరీ, రూ.100 ప్రాక్టికల్ అదేవిధంగా ఇంటర్మీడియెట్కు సంబంధించి ప్రతి సబ్జెక్టుకు రూ.150 థియరీ, రూ. 150 ప్రాక్టికల్ చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 1 నంచి 17 వరకు, రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 18వ తేదీ నుంచి 24 వరకు, రూ. 50 అపరాధ రుసుంతో ఆగస్టు 25 నుంచి 29వ తేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి 8008403635 నంబర్లో సంప్రదించాలని సూచించారు. న్యాల్కల్(జహీరాబాద్): ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుందని ఎంఈఓ మారుతి రాథోడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్ర వేశం కోసం నెల రోజులుగా అర్హులైన విద్యార్థు ల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 28న అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు. -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
న్యాల్కల్(జహీరాబాద్): చాలా కాలం తర్వాత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయాల పోస్టుల భర్తీని చేపట్టడంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన దాదాపు పూర్తి కావడంతో ఉద్యోగాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలుండగా, వాటిలో 1,432 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. 92 టీచర్, 154 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రాల పరిధిలో 10 వేల మంది గర్భిణులు, 9,800 మంది బాలింతలు, 98,500 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వీరందరికీ వివిధ రకాల సేవలను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందిస్తున్నారు. అయితే కేంద్రాల్లో నెలకొన్న ఖాళీల కారణంగా వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభు త్వం ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 254 పోస్టులు.. 2,773 దరఖాస్తులు జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరిధిలో గల 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 154 ఆయా పోస్టులకు గాను 2,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి 2,089 మంది, ఆయా పోస్టులకు 684 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఆయా పోస్టులకు సంబంధించి నలుగురికి పైగా పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో తీవ్ర పోటీ ఉంది. తమకు ఉద్యోగం వచ్చేలా చూడాలని అనుకూల నాయకులు, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడతున్నారు. అంగన్వాడీ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు -
వరి నాట్లు ముమ్మరం
జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్లో 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వరి విస్తీర్ణం 88 వేల ఎకరాలకు పరిమితమవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 37 వేల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ రెండు రోజులుగా వర్షాలు పడటంతో రైతులు సాగు పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా ఆందోల్, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, సిర్గాపూర్ తదితర మండలాల్లో వరి నాట్లు పడుతున్నాయి. గుమ్మడిదల మండలంలో మాత్రం రైతులు వెదజల్లే పద్దతిలో వరి వేసుకుంటున్నారు. జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పద్దతిని అవలంభిస్తున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలకు మించి పోయే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గట్టెక్కనున్న పంటలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, సోయా వంటి వంటలు ప్రాణం పోసుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితుల మధ్య పంటల సాగు ప్రారంభమైంది. కానీ ఈ వర్షాలతో పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. నాలుగు కీలక దశల్లో పంటలకు నీ రు అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు రెండు కీలక దశలు దాటిందని వ్యవసాయశాఖ అధికారులు పే ర్కొంటున్నారు. మరో పది రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే పంటలు చేతికందుతాయని చెబుతున్నారు. రోజంతా చిరుజల్లులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా నాగల్గిద్దలో 1.8 సెం.మీలు, వట్పల్లిలో 1.7 సెం.మీ, సిర్గాపూర్లో 1.6 సెం.మీ, పుల్కల్, నిజాంపేట్లో 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం మాత్రం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సిర్గాపూర్లో 4.8 సెం.మీ, కంగ్టిలో 4.7 సెం.మీ, గుమ్మడిదల, మొగుడంపల్లి, కల్హేర్లలో 2.2 సెం.మీ చొప్పున, నిజాంపేట, మనూరుల్లో 2 సెం.మీ చొప్పున, నారాయణఖేడ్లో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లో ఒక సెం.మీ చొప్పున వర్షం కురిసింది. కాగా, వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 302 మి.మీలు కాగా, ఇప్పటి వరకు 304 మి.మీల వర్షపాతం రికార్డయింది.జిల్లాలో వరినాట్లు వేస్తున్న మహిళలుజిల్లాలో గత రెండు రోజులుగా పెట్టిన ముసురుతో వరి నాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటి వరకు బోరు బావుల వద్ద పాక్షిక విస్తీర్ణంలో పరిమితమైన రైతులు, ఇప్పుడు పూర్తి విస్తీర్ణంలో నాట్లు వేసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో బుధ, గురువారం రోజంతా ముసురు పెట్టింది. దీంతో అన్నదాతల ఆశలు చిగురించాయి. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి బోరుబావుల వద్ద నాట్లు వేగవంతం చేసిన రైతులు గుమ్మడిదల, జిన్నారంలో వెద సాగు ప్రాణం పోసుకున్న పత్తి, సోయా పంటలు -
సీఎంఆర్ వెంటనే అప్పగించండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని రైస్ మిల్లర్లు సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని వెంటనే పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. ఈ బియ్యాన్ని డెలివరీ చేయడంలో ఎలాంటి జాప్యం చేయొద్దని అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎఫ్సీఐ, పౌర సరఫరాల శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాముల్లో తలెత్తుతున్న స్థలం సమస్యను ఎఫ్సీఐ అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. దీంతో సీఎంఆర్ బియ్యం డెలివరీ సజావుగా సాగేలా చూస్తామన్నారు. మూడేళ్ల క్రితం నిర్వహించిన వేలంలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బకాయిలను మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ఇందుకు మిల్లర్లు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మెనేజర్ జయశ్రీలాల్, ఎఫ్సీఐ మెనేజర్ మహేశ్, డీఎస్ఓ బాలసరస్వతి, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నరేందర్రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లకు అదనపు కలెక్టర్ ఆదేశాలు -
రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల క్రాస్రోడ్డు వద్ద గల రాజీవ్ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కారుడ్రైవర్ మృతి చెందాడు. మృతుడి భార్య రేఖ ఫిర్యాదు ప్రకారం.. మండలంలోని రేగులపల్లె గ్రామానికి చెందిన జెల్ల శేఖర్(35) టాటా ఏసీ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. కోహెడ మండలంలోని శనిగరం గ్రామం నుంచి శేఖర్ గురువారం ఓ కారు అద్దెకు తీసుకుని పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. గుగ్గిల్ల క్రాస్రోడ్డు సమీపంలోని రాజీవ్ రహదారికి చేరేసరికి కారు పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉండొచ్చని మృతుడి భార్య రేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఏఎస్ఐ రాములు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తిరుపతి తెలిపారు. -
వరుస చోరీల ముఠా అరెస్ట్
ఇళ్లలో చోరీలు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలుపోలీసుల అదుపులో ఇద్దరు దొంగలుసంగారెడ్డి టౌన్: జైలు నుంచి విడుదలైన వెంటనే పాత అలవాటును మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సంగారెడ్డి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. అయితే పోలీసులను చూసి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో సంగారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల వరుస చోరీలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ రెడ్డి (28)పై హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 84 కేసులు ఉన్నట్లు తేలింది. అయితే ఈశ్వర్ (22)తో కలిసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి, హైదరాబాద్తో పాటు ఏపీలోని కర్నూలు వరకు వెళ్లి చోరీలకు పాల్పడ్డారు. మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాళాలు పగులగొట్టి కంప్యూటర్లు, బ్యాటరీలు, మానిటర్లను ఎత్తుకెళ్లడంతో పాటు, బేగంపేటలోని ఓ ఇంట్లోకి చొరబడి 3.5 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలను దోచుకున్నారు. నిందితుల నుంచి 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, యాక్టివా స్కూటీ, 4 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ నయీముద్దీన్, ఎస్సై మధుసూదన్ రెడ్డి, రూరల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ రూరల్, చిరాగ్పల్లి పరిధిలో వైన్స్ దుకాణంతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐలు వినయ్కుమార్, రాజేంద్రరెడ్డి వివరాలు వెల్లడించారు. మొగుడంపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ వైన్స్తో పాటు జహీరాబాద్, అల్గోల్లో జరిగిన దొంగతనాలపై సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ మేరకు చోరీకి పాల్పడిన మహారాష్ట్రలోని పూణేకు చెందిన రాహుల్ నందు రాథోడ్, జోగ్రాజ్ గురుదర్సింగ్లను అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు తరలించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు వర్ధమాన్, దయాళ్, శుక్రాచారి పరారీలో ఉన్నారు. అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
బస్సులేయండి సారూ!
ఆర్టీసీ బస్సులు పల్లెలకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు ఉన్న కొన్ని సర్వీసులను కూడా రద్దు చేయడం మరింత సమస్యగా మారింది. పెద్దశంకరంపేట(మెదక్): రేగోడ్, పెద్దశంకరంపేట, పాపన్నపేట, టేక్మాల్ మండలాలను కలుపుతూ నిర్వహిస్తున్న మూడు సర్వీసులను గతేడాది వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడంతో మెదక్ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు గ్రామాలకు రాకపోవడంతో ప్రజలు ఆటోలు,ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస పెద్దశంకరంపేట మండలం నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్టీఏ కార్యాలయం, కోర్టు, వ్యక్తిగత పనులపై వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో మారుమూల మండలాలైన పెద్దశంకరంపేట, రేగోడ్కు జిల్లా కేంద్రం మెదక్ వెళ్లాలంటే నారాయణఖేడ్ నుంచి సిద్దిపేట బస్ ఒక్కటే దిక్కు. ఇది తప్పితే ఇక బొడ్మట్పల్లి మీదుగా వెళ్లక తప్పని పరిస్థితి. ఖేడ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే సిద్దిపేట బస్సు పెద్దశంకరంపేట నుంచి వేల్పుగొండ, ఎల్లుపేట్ మీదుగా మెదక్, సిద్దిపేట వెళ్తుంది. మిగతా సమయాల్లో వెళ్లాలంటే జిల్లా కేంద్రానికి నేరుగా బస్సులు లేవు. సాయంత్రం ఉన్న బస్సు కూడా రద్దు కావడంతో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల రద్దుతో ఇబ్బందులు గతంలో రేగోడ్ ఆర్డినరీ బస్సు సర్వీసు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు పెద్దశంకరంపేట మీదుగా మెదక్ వెళ్లేవి. ఈ బస్సు రేగోడ్ మండలం, పెద్దశంకరంపేట మండలం మల్కాపురం, జూకల్, పాపన్నపేట మండలం చీకోడ్, టేక్మాల్ మండలం వేల్పుగొండ, ఎల్లుపేట్తోపాటు పలు గ్రామాల మీదుగా రాకపోకలు సాగించేది. ఇందులో ముఖ్యంగా వివిధ పనులపై మండల కేంద్రానికి వచ్చేవారు, ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తిరిగి ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు, ప్రజలకు ప్రైవేట్ వాహనాలే దిక్కు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వైనం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే జేబులకు చిల్లే -
గురుకుల పాఠశాల వాచ్మ్యాన్ మృతి
చేర్యాల(సిద్దిపేట): స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వాచ్మ్యాన్ అల్లం మల్లేశం(54) గురువారం తెల్లవారు జామున పాఠశాల ఆవరణలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన మల్లేశం కొద్దిరోజులుగా స్థానిక గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వాచ్మ్యాన్గా పని చేస్తున్నాడు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బుధవారం విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున తాను ఉండే గది నుంచి బయటకు వచ్చి గది ఎదుట రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ నర్సింహాచారి పోలీసులు, మల్లేశం కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.అపూర్వరెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
అప్పు ఊబిలో చిక్కొద్దు
● బతికుండి సాధించమంటున్న నిపుణులు మిరుదొడ్డి(దుబ్బాక): ఇదారి నవీన్ (27) అనే యువకుడు అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవాడు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో చిన్న ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకుని భార్యా పిల్లలను పోషించుకునేవాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న అత్యాశతో ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. దీంతో చిన్నా చితకా సంపాదించిన డబ్బును సైతం ఆన్లైన్ గేమ్లు, బెట్టింగుల్లో పొగొట్టుకున్నాడు. దీంతో ఆశ చావని నవీన్ అప్పులు చేసి మరీ ఆన్లైన్ గేమ్లో పెట్టాడు. వెనక్కి తిరిగి చేసుకుంటే సర్వస్వం కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. అప్పుల వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అప్పుల సమస్య ముందు అతనికి చావే సులువనిపించింది. అప్పుల బాధ తాళలేక తాను నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలోని పురుగుల మందు తాగి తనువు చాలించాడు. దీంతో భార్య, ఇద్దరు బిడ్డలు దిక్కులేనివారయ్యారు. ఇది నవీన్ ఒక్కడి పరిస్థితే కాదు. జిల్లాలో చాలామంది యువకులు అప్పుల ఊబిలో చిక్కుకుని విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో కొకొల్లలుగా ఉన్నాయి. బ్యాంకు రుణాలే సురక్షితం ప్రైవేటు సంస్థల కంటే జాతీయ బ్యాంకు రుణాలే సురక్షితంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులే శ్రేయస్కరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు, చక్ర వడ్డీలు విధించి రుణగ్రహీతల నడ్డి విరిచే ప్రమాదం ఉంది. దీంతో మానసిక ప్రశాంతత కరువై మనోవేదనతో తనువులు చాలించిన ఘటనలు ఉన్నాయి. ‘జీరో’అవ్వండి అప్పుల బాధ తాళలేని కొందరు వ్యక్తులు చావే ఈజీ అనుకుంటారు. కానీ, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడి చిన్నాభిన్నం అవుతుంటాయి. ఈ అప్పుల బాధ నుంచి బయట పడాలంటే అవసరమైతే తమకున్న ఆస్థిపాస్తులనమ్మి, అప్పులు తీర్చి జీరో స్థాయికి చేరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ జీరో స్థాయి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సామాజిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పు అవసరానికి ఆదుకునే సంజీవనిలా మురిపిస్తుంది. అప్పు తీర్చే క్రమంలో మరో అప్పు చేయడం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తెలియకుండానే అప్పు ఊబిలోకి నెట్టేస్తుంది. అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించని నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారి మధ్య వైరం మొదలవుతుంది. దీంతో అప్పులు చాలా జీవితాల్లో ఆరని నిప్పులా పరిణమిస్తుంది. -
బ్రతకండి... బ్రతకనివ్వండి
అవసరానికి మించి చేసిన అప్పులే మానసికంగా కుంగదీస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో పాటు, వడ్డీలు సైతం కొండంతగా మారుతాయి. దీంతో అప్పులు చేసిన వ్యక్తులు మానసిక ధ్యైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడతారు. తన భార్యా పిల్లల భవిష్యత్తును ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆత్మహత్యల ఆలోచనల నుంచి బయటపడొచ్చు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు. మీరు బ్రతుకుతూ, మిమ్మల్ని నమ్ముకున్న వారిని బ్రతకనివ్వండి.’ –డాక్టర్ పొన్నాల బాలయ్య, సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత, సిద్ధిపేట -
డివైడర్ను ఢీకొన్న కారు..
ఆరుగురికి స్వల్ప గాయాలువట్పల్లి (అందోల్): జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జోగిపేట పరిధిలోని సంగుపేట హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో అందోల్లో వర్షం కురుస్తుండగా కారు అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఆరుగురికి కేవలం స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే హైవే అంబులెన్స్లో క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
పాము కాటుతో విద్యార్థి మృతి
కల్హేర్(నారాయణఖేడ్): ఇంట్లో నిద్రిస్తున్న ఓ విద్యార్థి పాము కాటుతో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని రూప్లా తండాకు చెందిన రాథోడ్ సర్దార్, స్వరూప దంపతుల కుమారుడు రాథోడ్ చరణ్ (8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలా కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో చరణ్ను పాము కాటు వేసింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి బయలుదేరగా.. మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి అకస్మాత్తు మృతిపై ఎంఈఓ నాగరం శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. పటాన్చెరు టౌన్: స్థానిక పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు బీడీఎల్ పోలీసులు తెలిపారు. బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపురం ప్రాంతంలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివారులో గల యూని యాడ్స్ కంపెనీకి చెందిన నిర్మానుష్య భూమిలో స్థానికులకు గురువారం ఒక పురుషుడి అస్థిపంజరం కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే సీఐ విజయ్ కృష్ణ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న అస్థిపంజరాన్ని పరిశీలించారు. అస్థిపంజరానికి సమీపంలో నీలం రంగు డ్రాయర్, షర్టును పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతుడి ఎముకల నమూనాలను సేకరించి, పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ దుస్తుల ఆధారంగా లేదా మృతుడి గురించి ఎవరికై నా ఎలాంటి సమాచారం తెలిసినా, వెంటనే బీడీఎల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రిటైర్డ్ ఉద్యోగికి రూ.33 లక్షల టోకరా రామచంద్రాపురం (పటాన్చెరు): అధిక లాభాల ఆశ చూపించి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ రిటైర్డ్ ఉద్యోగి వద్ద రూ.33 లక్షలు కాజేసిన ఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి మాణిక్ రెడ్డిని ’అపెక్స్ డిజిటల్ క్యాపిటల్’ పేరుతో వాట్సాప్ గ్రూప్లో చేర్చిన నిందితులు, డీఎంఏ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టారు. వారు పంపిన యాప్ను డౌన్లోడ్ చేసుకున్న బాధితుడు పలు దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.33 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఐపీఓలో పెట్టుబడి పేరుతో నిందితులు మరింత నగదు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి విత్డ్రా చేయడానికి ప్రయత్నించారు. డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సాపూర్ రూరల్: భూ వివాదంలో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సాపూర్ ఎస్సై రంజిత్రెడ్డి గురువారం తెలిపారు. నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన కొర్పోల్ శంకరయ్యపై, అదే గ్రామానికి చెందిన దాయాదులు కొర్పోల్ గంగాధర్, కొర్పోల్ గోపాల్ అన్నదమ్ములు ఈ నెల 28న రాత్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శంకరయ్యకు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపు లోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కొర్పోల్ శంకరయ్యకు, నిందితులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుండటంతో కక్ష గట్టే ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. హుస్నాబాద్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అక్కన్నపేట మండలం కేశ్వాపూర్కు చెందిన కలబోయిన శ్రావణి (35) నాగరాజు దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి కొంత కాలం నుంచి పట్టణంలోని నాగారం రోడ్డులో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. నాగరాజు కొందరిని దుబ్బాయికి పంపిస్తానంటూ పైరవీలు చేస్తూ అప్పుల పాలయ్యాడు. దీంతో భార్యభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. అనేక మార్లు భార్యను వేధింపులకు గురిచేసిచేశాడు. ఈ క్రమంలో గురువారం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. -
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
ఝరాసంగం(జహీరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామ శివారులో ఉన్న ఓ రేకుల షెడ్డులో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం అందిందిం. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నవాజ్ రెడ్డి, షేక్ సోహెల్, సురేష్, పిల్లోడి సాయికుమార్, ఫయాజ్, శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రూ. 24,440లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్ భర్త
● మున్సిపల్ కార్యాలయం ఎదుట భార్యతో కలిసి నిరసన ● పనులు చేయడం లేదంటూ ఎంఐఎం నేత ఆవేదన జహీరాబాద్: అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినా.. పీఠం ఎక్కాక తమ వార్డు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్ భర్త మున్సిపల్ కార్యాలయం ఎదుట చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలోని రామ్నగర్ కాలనీలోని 8వ వార్డుకు చెందిన ఎంఐఎం కౌన్సిలర్ సోని భర్త యిర్మియా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్దకు భార్యతో కలిసి వచ్చాడు. కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతున్న సమయంలో కార్యాలయం వద్ద విలేకరులతో వార్డు సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో మనస్తాపంతో చెప్పు తీసుకుని ముఖంపై కొట్టుకున్నాడు. వార్డు సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని విమర్శించారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ప్రాయశ్చిత్తంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరు నెలలుగా తమ వార్డులో కనీస అభివృద్ధి జరగడం లేదని, ఎన్నిసార్లు చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా వారిలో చలనం లేదని మండిపడ్డారు. తమ వార్డు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సిద్దిపేటరూరల్: కారు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని తోర్నాల వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన వినేశ్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ ఏడుపాయల దేవస్థానానికి వెళ్ళారు. వినేశ్కుమార్ అల్లుడైన ద్వారకేశ్ కారులో బెజిగం శ్రీలత(39) ముగ్గురు పిల్లలతో ఎడుపాయల నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తోర్నాల పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో శ్రీలత అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన పిల్లలు లిఖిత్, శ్రీమాన్, శ్రేష్ఠను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వినేశ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అధికారులకు సహకరించాలి
మెదక్ ఆర్డీవో రమాదేవి రామాయంపేట(మెదక్): వ్యవసాయ భూ ముల రీ సర్వే కోసం గ్రామానికి వచ్చే అధికారులు, సిబ్బందికి సహకరించాలని మెదక్ ఆర్డీవో రమాదేవి సూచించారు. శివ్వాయపల్లిలో మంగళవారం భూ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రీ సర్వే కార్యక్రమానికి గ్రామస్థులు సహకరించాలన్నారు. సర్వే అధికారులు గ్రామంలో వ్యవసాయ భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తారని, ఏళ్ల తరబడి భూసంబంధిత గొడవలు ఈ సర్వేతో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ తిరుపతయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 8 సీట్లు, బైపీసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ వెల్దుర్తి(తూప్రాన్): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో నిర్వహించిన మండల ప్రభాస్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా బూత్స్థాయి అధికారుల వద్ద కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు వంటి అంశాలను బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశం, సర్పంచ్లు ఆదర్శ్, మల్లేశంగౌడ్, నాయకులు శేఖర్గౌడ్, నవీన్, బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
2లక్షల ఓట్ల తొలగింపు!
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియతో జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ తీరును పరిశీలిస్తే ఏకంగా సుమారు 2.5 లక్షల ఓట్లు తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనధికారిక అంచనా. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 1.20 లక్షల ఓట్లు తొలగిపోతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంకా ఆరు రోజులే గడువుండటంతో గ్రామాల్లో సర్ ప్రక్రియ వేగంగా సాగుతుండగా పట్టణాల్లో మాత్రం మందగించింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు చాలామంది ఓటర్ల ఎపిక్ నంబర్లో ఏపీలో మ్యాపింగ్ అయి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓటర్లు ఆయా రాష్ట్రాల్లోని తమ సొంతూరులోనే ఓటును ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనాకు వస్తున్నారు. అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ సుమారు 40 వేల వరకు చొప్పున ఓట్లు తగ్గుతాయని అనుకుంటున్నారు. 76 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ సర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్లో డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుటి 76 శాతమే పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, 11.09 లక్షల ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా 3.48 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఫారాలు చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు 3 లోపు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆగస్టు 10 తేదీ నాడు ఓటరు జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాలని ఆదేశించింది. దీంతో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు కేవలం ఆరు రోజులే గడువుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టణాల్లో నత్తనడకన డిజిటలైజేషన్ ప్రక్రియ పట్టణ, నగర ప్రాంతంలో తక్కువగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో కాస్త మెరుగ్గా ఉంది. గ్రామాల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, అలాగే మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా తెలుస్తున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో పట్టణ ప్రాంతాలతో పోల్చితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కాస్త మెరుగ్గా సాగుతోంది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వందశాతం పూర్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ పట్టణ, నగర ప్రాంతాల్లో చాలామందికి ఈ ఫారాలు అందలేదు. దీంతో చాలామంది ఓటర్లు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ చేసుకున్నారు. అత్యధికంగా పటాన్చెరులో 1.20లక్షలకు పైగా..! సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ.. ఇంకా డిజిటలైజ్ చేయాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలు 3.48 లక్షలు ఎస్ఐఆర్కు ఆరు రోజులే గడువు నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ తీరు ఇలా నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఈ.ఎఫ్.డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం నారాయణఖేడ్ 2,36,579 2,07,009 87.5 అందోల్– జోగిపేట 2,55,084 2,18,404 85.62 జహీరాబాద్ 2,82,398 2,25,136 79.72 సంగారెడ్డి 2,54,693 1,94,984 76.56 పటాన్చెరు 4,28,682 2,63,647 61.5 మొత్తం 14,57,436 11,09,180 76.1 -
వేతన వెతలు
హత్నూర(సంగారెడ్డి): వచ్చేది చాలీచాలని వేతనం...ఏకంగా ఏడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో మిషన్ భగీరథ నీటి పథకంలో పనిచేసే పంపు లైన్మెన్లు ఇబ్బందులు పడుతున్నారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని మిషన్ భగీరథ పంప్ హౌస్ నుంచి హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, మెదక్ జిల్లా నర్సాపూర్, కౌడిపల్లి,చిలపిచేడ్, శివంపేట్, కొల్చారం, మాసాయిపేట మండలాలలోని సుమారు 480 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంజీర నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ మండలాలలో లైన్మెన్లుగా 156 మంది కొన్నేళ్లుగా పనిచేస్తూ గ్రామాలకు వెళ్లే పైప్లైన్లను ఆన్ ఆఫ్ చేస్తూ నీటిని గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులకు వదులుతున్నారు. ప్రతీనెల ప్రభుత్వం భూ రత్న ఏజెన్సీ ద్వారా వీరికి రూ.8,350 వేతనాన్ని అందిస్తూ వచ్చింది. అయితే ఏడు నెలలుగా వేతనాలు సక్రమంగా రాక కుటుంబ పోషణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల కోసం బోరుపట్ల పంప్ హౌస్ దగ్గర మిషన్ భగీరథ సిబ్బంది ధర్నా చేసి ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా మా గోడు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ ఆరాతో.. ఇటీవల హత్నూర మండలం బోరపట్ల పంప్ హౌస్కు జిల్లా అదనపు కలెక్టర్ పాండు మిషన్ భగీరథలో పనిచేసే కార్మికులతో వేతనాలు వస్తున్నాయా? అని ఆరా తీసినప్పుడు ఏడు నెలలుగా వేతనాలు రాలేదని వాపోయారు. ఆగస్టు వస్తే ఎనిమిది నెలలు అవుతుందని వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు ఇప్పించాలని పంపు లైన్మెన్లు విజ్ఞప్తి చేశారు. కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం త్వరగా విడుదల చేయాలని కోరుతున్న 156 మంది పంపు లైన్మెన్లు ఏడు నెలలుగా వేతనాలు అందుకోని మిషన్ భగీరథ లైన్మెన్లు -
ఆగస్టు నుంచి పీహెచ్సీల్లో వైద్యపరీక్షలు
అల్లాదుర్గం(మెదక్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆగస్టు నుంచి అన్ని రకాల వైద్య పరీక్షలు తిరిగి ప్రారంభమవుతాయని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) గణేశ్వర్ స్పష్టం చేశారు. అల్లాదుర్గం పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...పలు రకాల రక్త పరీక్షలు ప్రతీరోజు నిర్వహించి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించనున్నామన్నారు. రక్త పరీక్షలు తీసుకెళ్లే వారి కాంట్రాక్టు పూర్తికావడంతో కొన్ని నెలల నుంచి ఆగిపోయినట్లు చెప్పారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్తోపాటు సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. గర్భిణీలు, బాలింతలకు ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో డాక్టర్ సారిక, సీహెచ్ఓ సుదర్శన్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. డీఎంహెచ్ఓ గణేశ్వర్ -
పంటల సాగులో సలహాలు పాటించాలి
ఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి కల్హేర్(నారాయణఖేడ్): పంటల సాగులో రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి సూచించారు. కల్హేర్లో మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’100వ ఎపిసోడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయిల్పామ్, ఇతర పంటలు సాగు చేసి లాభాలు పొందాలని కోరారు. ఆయిల్పాం రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఏఓ శ్రీదేవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పండరీ, ఆత్మ చైర్మన్ వినోద్పాటిల్, ఏడీఏ నూతన్కుమార్, తహసీల్దార్ శివశ్రీనివాస్, ఎంపీడీఓ హరినందన్రావు, ఏఓ వెంకటేశం, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి పాల్గొన్నారు. ఝరాసంగం(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భూములు కోల్పోతున్న ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల స్థలం కేటాయించాలన్నారు. వ్యవసాయ భూములపై ఆధారపడ్డ కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ ప్రయోజనాలు కల్పించాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కూలీలు, రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలయ్య, గోపాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
జైల్ భరోకు తరలిరండి
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఆగస్టు 10న చేపట్టిన జైల్ భరో కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు కోరారు. ఆయన పలువురు నాయకులతో కలిసి మంగళవారం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రజలు, కార్మికులు, రైతుల వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. ఆయన వెంట ఆయా సంఘాల నాయకులు అన్నపూర్ణ, సురేశ్,శివ,చందర్,నాగభూషణం,రెడ్యానాయక్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
జిల్లాలో కోతుల బెడద అరికట్టాలి
రామాయంపేట(మెదక్): జిల్లాలో కోతుల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. ఆమె మంగళవారం స్థానిక రైతువేదికలో జరిగిన విత్తన మేళాలో పాల్గొని మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాలో అక్కడి అధికారులు కోతుల బెడదను అరికట్టేందుకు అవలంబించిన పద్ధతులను అధ్యయనం చేయడానికిగాను జిల్లా అధకారులు త్వరలో అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్పామ్, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు పంటలు సాగుచేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధకారి దేవ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్సింగ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య, వైస్ చైర్మన్ నవనీత, ఆత్మ పీడీ రుద్రమూర్తి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులపై శాసీ్త్రయంగా విశ్లేషించాలాన్నారు. తరచూ ప్రమాదం జరుగుతున్న స్థలాలను బ్లాక్ స్పాట్గా గుర్తించి, ప్రమాదాలు జరగకుండా అవసరమయ్యే చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు త్వరితగతిన సహాయక చర్యలు అందేలా చూడాలన్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాత శిశు మరణాల ఆడిట్తో పాటు శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మాతృశిశు మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలకు గర్భధారణ ప్రారంభం నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. హై రిస్క్ ఉన్నవారిని ముందుగానే గుర్తించి తక్షణమే ఉన్నత వైద్య కేంద్రాలకు రెఫర్ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్జైన్ -
యువత వాయుసేనలో చేరాలి
పటాన్చెరు: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులు లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ పిలుపునిచ్చారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం క్యాంపస్లో మంగళవారం నిర్వహించిన ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం–వృత్తి మార్గదర్శనం’కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఎస్సీ, ఏఎఫ్క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీల ద్వారా పర్మినెంట్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్తో ఐఏఎఫ్ లో చేరే అవకాశాలను వివరించారు. ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అర్హతలు, ఎంపిక విధానం, ఐఎఫ్ఎస్బీ పరీక్షల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆకర్షణీయమైన వేతనం, వైద్య సదుపాయాలు, నివాసం, బీమా, విద్య, సాహస కార్యకలాపాలు వంటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఐఏఎఫ్ మొబైల్ ఎగ్జిబిషన్, సిమ్యులేషన్ సౌకర్యం విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుకుమార్ నాతి అతిథులను సత్కరించగా, డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్ వృత్తి అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్ -
పది కిలోల గంజాయి పట్టివేత
రామచంద్రాపురం(పటాన్చెరు): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లేబర్ క్యాంపులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన జయదేబ్ బిస్వాస్, ప్రశంజిత్ కలిసి వారి రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వర్గల్(గజ్వేల్): వివాహితపై లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కథనం ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలుడు సోమవారం పక్కింట్లో ఉండే వివాహితపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నర్సాపూర్ రూరల్: హత్యాయత్నం కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం.. శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన పందిముక్కుల నర్సింలు గౌడ్పై అదే గ్రామానికి చెందిన దాయాదులు పందిముక్కుల గోపాల్ గౌడ్, పందిముక్కుల మనీశ్గౌడ్ కలిసి చాకరిమెట్ల హనుమాన్ ఆలయ సమీపంలో బైక్ను అడ్డగించి దాడి, హత్య చేసేందుకు ప్రయత్నించారు. కాగా వీరి మధ్య పూర్వీకుల నుంచి వచ్చిన భూమి విషయంలో కొన్ని రోజులుగా కోర్టులో కేసు నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈనెల 28న నర్సాపూర్ కోర్టులో విచారణకు హాజరై వస్తున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం నర్సింలు గౌడ్ని ఇద్దరు హత్య చేసేందుకు ప్రయత్నించారు. టేక్మాల్(మెదక్): విద్యార్థి అదృశ్యమైన ఘటన మండలంలోని కోరంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అరవింద్కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తంగెడపల్లి నరేశ్(17) గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈనెల 24న ఇంటికి వచ్చిన అతడు 28న హాస్టల్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. కానీ హాస్టల్కు వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రానికి 550 బస్తాల యూరియా వచ్చిందని, గురువారం ఉదయం 6 గంటల నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే యాప్ బుధవారం రాత్రే ఓపెన్ కావడంతో తెలిసిన రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. ఉదయం బుక్ చేసుకుందామని అనుకున్న రైతులకు మాత్రం యరియా దొరకని పరిస్థితి. ఇదే విషయమై వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. సాంకేతిక సమస్యతో ముందుగానే యూరియా యాప్ ఓపెన్ అయిందని, ఇది గమనించిన రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు. కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని హరిచంద్తండాలో గిరిజనులకు విజ్ఞానజ్యోతి ఆధ్వర్యంలో పెరటికోళ్లు పంపిణీ చేశారు. బుధవారం హైదరాబాద్ బాచుపలి్ోల్లని విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్టీఐ–హబ్ (సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్) డీఎస్టీ ప్రాజెక్ట్ ద్వారా ఎంపిక చేసిన గిరిజన మహిళలకు పెరటికోళ్లు పంపిణీ చేశారు. వీటి పెంపకంపై తండాలోని మహిళలకు పలుమార్లు శిక్షణ ఇవ్వడంతోపాటు బాక్స్లు సైతం ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు రాము, వీరేంద్రగోపి, దత్తేశ్, రాకేశ్, రామకృష్ణ, సర్పంచ్ సాలిబాయ్, రవీందర్, పంచాయతీ కార్యదర్శి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి
సంగారెడ్డి జోన్: సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా చేపట్టిన సర్ ప్రక్రియ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సగటున 76.90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ 87.66 శాతం, ఆందోల్ 86.23 శాతం, జహీరాబాద్ 80.36 శాతం, సంగారెడ్డి 77.47 శాతం, పటాన్చెరు 62.78 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీ్త్ర నిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యుల బినామీ పేర్లతో రుణాలు తీసుకొని వినియోగించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జోనల్ మేనేజర్ రవికుమార్, డీఆర్డీఓ జ్యోతి, అదనపు డీఆర్డీఓ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక మెతుకుసీమ
మెదక్ అర్బన్: మెతుకు సీమ చారిత్రక, ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి అందాలకు మెరుగులు దిద్ది పర్యాటకులకు కనువిందు చేసేందుకు కలెక్టర్ ప్రతిమాసింగ్ టూరిజం హబ్ పేరిట బృహత్ ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నారు. జిల్లాలోని 15 దర్శనీయ స్థలాలను ఎంపిక చేసి పర్యాటక వలయాన్ని తయారు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు, మెదక్ ఖిల్లా అభివృద్ధికి రూ.57 లక్షలు మంజూరయ్యాయి. ఈనెలలో పర్యాటక కన్సెల్టెంట్ శవంతి గుప్తా, భువన్, పర్యాటక శాఖ అధికారి రమేశ్, ఈడీఎం సందీప్ ఐదు రోజుల పాటు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. కాగా సినీనటుడు మంచు విష్ణు సైతం ఈ ప్రాంతాల్లో పర్యటించి వాటికి ప్రచారం కల్పించారు. ఐదు టూరిజం సర్క్యూట్లు ● పర్యాటక అందాలకు నెలవైన మెతుకు సీమకు మెరుగులు దిద్దేందుకు మొదటిసారిగా అడుగులు పడుతున్నాయి. మెదక్ జిల్లాలోని 15 పర్యాటక కేంద్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిని 5 సర్క్యూట్లుగా విభజించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ● మెదక్ హెరిటేజ్ సర్క్యూట్: మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చర్చి, బారాకమాన్, దయార మెట్లబావి, పాపన్నపేట కోటలు, కోంటూర్ మసీదు, చందంపేట కోట, వెల్దుర్తిలోని కాకతీయ తోరణం. ● ఆలయ టూరిజం సర్క్యూట్: ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయం, కూచాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయం, వేల్పుగొండ తుంబురేశ్వర ఆలయం, మడూర్ సోమశేఖర ఆలయం. ● ఎకో టూరిజం సర్క్యూట్: పోచారం వన్యమృగ అడవి, పోచారం షికార్ ఘర్, నర్సాపూర్ అర్బన్ పార్క్. ● హైదరాబాద్ డే ట్రిప్: మెదక్ కెథెడ్రల్ చర్చి, మెదక్ ఖిల్లా, బారా కమాన్, పోచారం వన్యమృగ కేంద్రం. ● కాకతీయ వారసత్వ ట్రయల్: వెల్దుర్తి కాకతీయ తోరణం , మడూరు సోమశేఖర ఆలయం, వేల్పుగొండ తుంబురేశ్వర ఆలయం జిల్లాలో 15 దర్శనీయ స్థలాల ఎంపిక ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు కన్సల్టెన్సీకి.. సినీ హీరోలతో ప్రచార వ్యూహం -
విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి
మరో మహిళకు తీవ్ర గాయాలుదుబ్బాకటౌన్: విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయపోల్ మండలంలోని అనాజిపూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి (55) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. బుధవారం గ్రామానికి చెందిన రాచకొండ యాదగిరి పొలంలో నాట్లు వేసేందుకు లక్ష్మితో పాటు పలువురు మహిళా కూలీలు వెళ్తున్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్కు విద్యుత్ తీగలు తగిలి కరెంటు సరఫరా అవుతుంది. గమనించని లక్ష్మి ఫెన్సింగ్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురై కిందపడిపోయింది. ఆమెతో పాటు మరో మహిళ పోచవ్వకు కూడా షాక్ తగిలింది. గమనించిన తోటి కూలీలు, స్థానికులు ఇద్దరినీ గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన పోచవ్వకు చికిత్స అందిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి.. రామచంద్రాపురం(పటాన్ చెరు): గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రామచంద్రాపురం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఈనెల 26న గుర్తుతెలియని వ్యక్తి (60) ఏళ్ల వయస్సు గల వృద్ధుడు ఫిట్స్ రావడంతో కిందపడి అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో స్థానికులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా వైద్య సిబ్బంది వద్ద అతని పేరు జాఫర్ అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
వర్షాలకు కూలిన ఇల్లు
కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న పరమేశ్వరినిజాంపేట(మెదక్): మండల పరిధిలోని జెడ్ చెరువు తండాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రమావత్ చిల్లి మంతులాల్ ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంటి గోడ కూలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇల్లు కూలిపోవడంతో నివాసం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ’ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలని కోరారు. రామాయంపేట(మెదక్): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని దెబ్బతిన్న పర్వతాపూర్ రహదారిని బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ పరమేశ్వరి పరిశీలించారు. పుష్పాలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు చివరలో కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారడంతో బస్సు నడపడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ దారిలో బస్సు తిరిగితే మట్టి రోడ్డులో దిగబడి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే రోడ్డును మరమ్మతులు చేయించాలని పర్వతాపూర్ సర్పంచ్ తార్యానాయక్కు సూచించారు. మరమ్మతులు చేయిస్తానని, బస్సును బంద్ చేయవద్దని సర్పంచ్ డీఎంకు విజ్ఞప్తి చేశారు. -
చట్టాలపై అవగాహన అవసరం
హత్నూర(సంగారెడ్డి): సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. బుధవారం మండలంలోని కాసాల రైతు వేదికలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు తమకు చట్టపరంగా కల్పించిన హక్కులను తెలుసుకోవాలన్నారు. లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే విత్తన మేళా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, తహసీల్దార్ పర్వీన్ షేక్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య -
హార్టికల్చర్ పట్టభద్రులకు విస్తృత అవకాశాలు
ములుగు వీసీ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక రంగాల్లో విస్తృతమైన వృత్తి అవకాశాలు ఉన్నాయని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, విద్యారంగం, రాష్ట్ర ప్రభుత్వ శాఖ, ఉద్యానవన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఐసీఎఆర్ సంస్థలలో హార్టికల్చర్ అధికారులుగా, పరిశోధన సహాయకులుగా పనిచేయవచ్చన్నారు. విత్తన రంగం, నర్సరీలు, తోటల పెంపకంలో కూడా పట్టభద్రులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పర్యావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. అడవుల పెంపకంతో పర్యావరణ మార్పులకు చెక్ పెట్టవచ్చన్నారు. -
ఒడిసి పట్టేద్దాం
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. వ్యక్తిగత నిర్మాణాలతో పాటు కమ్యూనిటీ ఇంకుడు గుంతలను సైతం నిర్మిస్తారు. మొదటి విడతలో ప్రతి గ్రామంలో 180 వరకు ఇంకుడు గుంతలను నిర్మించేందుకు ప్రతిపాదించారు. వ్యక్తిగత నిర్మాణానికి గాను రూ.6,500, కమ్యూనిటీ ఇంకుడు గుంతకు రూ.13 వేలు చెల్లిస్తారు. ఇందుకు కూలీలతో పాటు మెటీరియల్ కోసం ఖర్చు చేస్తారు. ఇదిలా ఉంటే గ్రామంలో నుంచి బయటకు వెళ్లే నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకిచేందుకు వీలుగా గ్రామం బయట డ్రైన్ ఎండ్ పాయింట్ సోప్పిట్ నిర్మిస్తారు. ఇందుకోసం రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారు. పొలాల వద్ద పంట కుంటలు వ్యవసాయ పొలాల వద్ద రైతులు పంట కుంటలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వర్షం నీటిని ఇందులో నిల్వ చేసుకునేలా నిర్మాణాలు చేపడతారు. 15 మీటర్ల వెడల్పు, పొడవుతో రెండు మీటర్ల లోతు వంతున వీటిని తవ్వుతారు. ఈ మేరకు సామర్థ్యం ఉన్న కుంటకు రూ.1.10 లక్షలు కేటాయిస్తారు. ఇందులో కూలీల ఖర్చులతో పాటు ఇతర నిర్మాణాలకు వినియోగించుకోవచ్చు. కుంటలను నిర్మించుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఇందులో నిల్వ ఉన్న నీటిని ఉపయోగించుకొని పంటను కాపాడుకోవచ్చు. అంతే కాకుండా పంట కుంటలో నిల్వ ఉండే నీటితో కూరగాయలకు అందించడం, మందులను పిచికారీ చేసుకునేందుకు ఉపయోగించుకోవడం, పశువులకు తాగేందుకు వాడుకునే అవకాశం కలుగుతుంది. మొదటి విడతలో ప్రతి గ్రామానికి 4 వంతున పంట కుంటలు నిర్మించాలని నిర్ణయించారు. ఊట కుంటలు ప్రతి గ్రామంలో ఊట కుంటను నిర్మించేందుకు ప్రతిపాదించారు. కుంట విస్తీర్ణాన్ని బట్టి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఊట కుంట నిర్మాణంతో గ్రామంలో భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా కూలీలకు ఉపాధి లభిస్తుంది. కూలీలకు పని లేనట్లయితే ఈ పథకం ద్వారా ఉపాధి పొందగలుగుతారు. బోరు రీఛార్జ్ జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరు రీఛార్జ్ నిర్మాణాలకు అవకాశం కల్పించారు. దీంతో బోర్లలో నీటి ఊటలు పెరుగుతాయి. ఇందుకోసం రూ. 35 వేల వరకు అయ్యే వ్యయం ప్రభుత్వ పరంగా అందుతుంది. ఎండిన బోర్ల వద్ద కూడ నిర్మాణాలు చేసుకోవడం ద్వారా బోరు రీఛార్జ్ చేసుకునేందుకు దోహదపడుతుంది. వీబీజీ–రామ్జీ పథకం కింద జలసిరి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికే పంట కుంటల తవ్వకం పనులు సాగుతున్నాయి. గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అశోక్కుమార్, ఏపీఓ, జహీరాబాద్ఫామ్పాండ్లు 2,346 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 550 ఇంకుడు గుంతలు 1,10340 పర్కొలేషన్ ట్యాంకులు 550 బోర్వెల్ రీఛార్జ్ 558 బావులు 50ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారా నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చనే ఉద్దేశంతో జలసిరి కార్యక్రమం చేపట్టింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ (వీబీ జీ రాం జీ) పథకం కింద ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, ఊట చెరువులను నిర్మించాలని నిర్ణయించింది. బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదించింది. – జహీరాబాద్/సంగారెడ్డిజోన్ భూగర్భజలాల కోసం ‘జలసిరి’ గ్రామ గ్రామాన ఇంకుడు గుంతలు ‘వీబీజీరాంజీ’ కింద కార్యక్రమం ముందుకు వచ్చే లబ్ధిదారులకు నిధులు -
సింగూరుకు ఇన్ఫ్లో
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. రెండు రోజులుగా డ్యాంలోకి ఇన్ఫ్లో చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం 637 క్యూసెక్కులు, బుధవారం 592 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. ప్రస్తుతం డ్యాంలో 4.215 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి పథకాలైన మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి రెండు ఫేజ్ల ద్వారా 1877 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి క్రైమ్: డీఆర్డీఓ ఆధ్వర్యంలో పట్టణంలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికిరణ్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఫార్మసీ, డీ ఫార్మసీని కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్ ధ్రువపత్రాలతో పట్టణ బైపాస్లోని డీఆర్డీఓ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08455–271010 నంబర్లో సంప్రదించాలని కోరారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వెంకట్ స్వామి బుధవారం ఒక ప్రకటనల్లో పేర్కొన్నారు. పదో తరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీలకు రూ.1400, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1000, ఓపెన్ ఇంటర్ అభ్యర్థులు ఓసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఫీజు రూ.1200గా నిర్ధారించినట్లు తెలిపారు. ఆన్లైన్, మీసేవ ద్వారా అడ్మిషన్ నమోదు చేసుకొని సంబంధిత కేంద్రాల్లో పత్రాలు అందజేయాలని సూచించారు. కల్హేర్(నారాయణఖేడ్): ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగులో వరద చేరుతుంది. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. వరద ప్రవహం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1483 ఫీట్ల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. అనంతరం కల్హేర్లో ఎస్సీ బాలుర హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన వసతి, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, హాస్టల్లో స్లాబ్ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం భవనం కొత్తగా నిర్మించేందుకు చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రావు, గంగారం, నాయకులు పోచయ్య, ఎండీ. సర్దార్, మోహన్రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. జోగిపేట(అందోల్): సింగూరు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ బీబీ పాటిల్ బుధవారం కలెక్టర్కు ఫోన్ చేశారు. సింగూరు ప్రాంత రైతులు 23 ఏళ్లుగా ప్రాజెక్టు నీటి ద్వారానే పంటలు పండించుకుంటున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. వరి పండించుకునేందుకు నీళ్లు ఇస్తే 2027లో తాగడానికి నీరు ఉండదని కలెక్టర్ ఆయనకు తెలిపారు. 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాజెక్టులోకి నీరు వస్తుందని రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలని బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిన్నారం(పటాన్చెరు): గడ్డపోతారం పారిశ్రామికవాడలో మంగళవారం రాత్రి పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పారిశ్రామిక వాడలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాల నమూనాలను సేకరించారు. ఈసందర్భంగా పరిశ్రమల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థ జలాలను వర్షపు నీటిలో విడుదల చేస్తున్నారని స్థానిక నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్ ఇంద్రసేన, నాయకులు బాలుగారి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
వసంత్కు వాగ్దేవి జాతీయ పురస్కారం
జహీరాబాద్: జహీరాబాద్కు చెందిన ఢిల్లీ వసంత్కు వాగ్దేవి జాతీయ పురస్కారం అ ందజేసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సత్కరించారు. బుధవారం ఢిల్లీలో జాతీయ తెలుగు సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురస్కారంను ఆయనకు అందించారు. సామాజిక సేవలందించడంతో పాటు రైతు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత తదితర అంశాలపై విశేష కృషి చేస్తున్నందుకు సత్కారం పొందారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీ, ఆధ్యాత్మిక చైతన్యం కోసం 7వేల కిలోమీటర్ల మేర కుంభయాత్ర లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, తదితరులు వసంత్కు అభినందనలు తెలియజేశారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
ఝరాసంగం(జహీరాబాద్): గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, కుప్పానగర్, చీలపల్లి గ్రామ శివారులోని మల్లయ్య గిరి ఆశ్రమాల్లో వేడుకలు నిర్వహించారు. ఆయా ఆశ్రమాల్లోని పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వర స్వామి, మల్లయ్య గిరి పీఠాధిపతి బసవలింగ అవధూత గిరి మహారాజ్ ను పూలమాలతో ఘనంగా సన్మానించారు. మల్లయ్య గిరి ఆశ్రమంలో కర్ణాటక రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు హన్మంత్ రావు పాటిల్, నరోత్తం, ఉదయ్ శంకర్ పాటిల్, వేణుగోపాల్ రెడ్డి, రాజ్కుమార్ స్వామి, పండరీనాథ్, యాదగిరి పాల్గొన్నారు.పాల్గొన్న కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే -
ప్రమాదంలో యువకుడి మృతి
బైక్ను ఢీకొట్టిన లారీ.. నారాయణఖేడ్: నాందేడ్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జరి గిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ఆనంద్ ప్రభు(28) హైదరాబాద్కు వెళ్లడానికి తన బైక్పై నిజాంపేట్కు వచ్చాడు. బైక్ను అక్కడ ఉంచి మంగళవారం హైదరాబాద్కు వెళ్లి తిరిగి నిజాంపేట్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో బైక్పై పిట్లంకు వెళుతున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎన్హెచ్ అంబులెన్స్లో ఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూరగాయలకు వెళ్లొస్తుండగా.. పాపన్నపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ వివరాలు.. యూసుఫ్పేటకు చెందిన బోల వెంకటేశం (42) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి గ్రామానికి చెందిన రవితో కలిసి ద్విచక్ర వాహనంపై పొడ్చన్పల్లి గేట్వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో లక్ష్మీనగర్ గ్రామ శివారులో వెనుకనుంచి వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. గాయపడ్డ అతన్ని మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. రవికి స్వల్ప గాయాలయ్యాయి. -
వన్యప్రాణులున్నాయి జాగ్రత్త
రామాయంపేట(మెదక్): జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణులు మృతి చెందాయి. దీంతో అటవీశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈమేరకు మెదక్, రామాయంపేట అటవీ రేంజ్ అధికారులు విద్యాసాగర్, గణేశ్ తమ సిబ్బందితో బుధవారం మెదక్– ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై లక్ష్మాపూర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులను ఆపి నిదానంగా వెళ్లాలని సూచించారు. ‘మీ వేగానికి హద్దు.. వన్య ప్రాణికి రక్ష, అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లండి.. మూగ జీవులను రక్షించండి’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్, బీట్ అఫీసర్లు పాల్గొన్నారు. వాహనదారులకు అటవీశాఖ అవగాహన -
శత్రువైనా సరే ఓటు గల్లంతు కావొద్దు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శత్రువు అయినా సరే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు గల్లంతు కాకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు తన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు. ఓటు హక్కును కోల్పోతే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. బుధవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న కుట్రలు ఎటు నుంచి ఎటు పోతాయే తెలియని అయోమయం ఉందన్నారు. ఎన్నికల సంఘం మోదీ సర్కారు నేతృత్వంలో పనిచేస్తోందని ఆరోపించారు. బోనాల పండగ ఉందని ఎస్ఐఆర్ను నిర్లక్ష్యం చేయొద్దని, ఓటు హక్కు పోతే మళ్లీ రాదన్నారు. ఓట్ల కోసమో.. రాజకీయం కోసమో కాకుండా ప్రజలను కాపాడేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ తోడ్పడాలని రాహుల్గాంధీ ఇచ్చిన పిలుపును ఆయన గుర్తుచేశారు. ఆగస్టు 2న మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోశ్, కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు, తోపాజి అనంత్ కిషన్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో జగ్గారెడ్డి -
ఏసీబీ.. దూకుడేదీ?
రెండేళ్లుగా నమోదు కాని ఆదాయానికి మించి ఆస్తుల కేసు ● జిల్లాలో పలుశాఖల్లో భారీ అవినీతి తిమింగలాలు ● రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులకే పరిమితం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఉమ్మడి జిల్లాలో మాత్రం సాధారణ కేసులకే పరిమితమవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసు గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేవలం లంచం తీసుకుంటుండగా.. పట్టుబడుతున్న కేసులే అడపాదడపా నమోదవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ నమోదు చేస్తున్న ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసుల్లో కట్టల పాములు బయటకు వస్తున్నాయి. రూ. వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోల కొద్ది బంగారం, ఖరీదైన వాహనాలు.. ఇలా కళ్లు బైర్లు కమ్మె స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏసీబీ పనితీరు ఉంది. రూ. పది వేలు లంచం తీసుకుంటుంగా పంచాయతీ సెక్రటరీని పట్టుకోవడం, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. మున్సిపాలిటీ బిల్లు కలెక్టర్ను ట్రాప్ చేయడం వంటి కేసులతో సరిపెడుతున్నారు. డివిజన్ స్థాయి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులు మరో నాలుగు నమోదయ్యాయి. పెద్ద తిమింగలాలపై నజరేదీ? ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి ఉన్నతాధికారుల అక్రమార్జన రూ.కోట్లలో ఉంటోంది. రూ.వందల కోట్లలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రూ.కోట్లు విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు కొందరు భారీగా అక్రమాస్తులను కూడ గట్టారు. ఎన్నికల నిబంధనల కారణంగానో, ఇతర సాధారణ బదిలీల్లో వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేసినా వారు తిరిగి ఉమ్మడి జిల్లాకే వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పి రెవెన్యూలో మరింత కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నాయి. విద్యుత్శాఖలోని కొందరు ఇంజనీరింగ్ అధికారుల అక్రమార్జన అంతా ఇంత కాదు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు రోజువారీ అక్రమార్జనే రూ.లక్ష వరకు ఉంటోంది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఒకేచోట పనిచేసి బదిలీ అయిన నీటిపారుదలశాఖలోని ఓ అధికారి చెరువులకు ఎన్ఓసీల జారీలో చేసిన వసూళ్లు రూ.కోట్లలో ఉంటుందనేది ఆశాఖవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుశాఖలోనూ కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల రూ.వందల కోట్లు అక్రమాస్తులు బయటపడిన బీంరెడ్డి గతంలో పటాన్చెరు డీఎస్పీగా పనిచేసిన విషయం విధితమే. ఇలా జిల్లాలో అవినీతి తిమింగలాలను వదిలేసి.. చిన్నా.. చితక కేసులతో ఏసీబీ సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏసీబీ ఉమ్మడి జిల్లాలో కేవలం ఆరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన వారిలో కొమురవెల్లి మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి, సదాశివపేట మున్సిపాలిటిలో బిల్లు కలెక్టర్ వంటి కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. మిగిలిన నలుగురిలో కొల్లూరు ఎస్ఐ, విద్యుత్శాఖ నర్సాపూర్ ఏడీఈ, ఐడీఏ బొల్లారం ఏఈఈ, చేర్యాల తహసీల్దారులు ఉన్నారు. ఈ ఆరుగురిలో చేర్యాల తహసీల్దార్ మినహా మిగిలిన వారంతా రూ.పది వేలు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారే. అక్రమాస్తుల కేసులు నమోదు చేయాలంటే సరైన ఆధారాలు లభించాలని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఈ ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. -
పాఠశాల వరండాలో బీరు బాటిళ్లు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గోవర్ధనగిరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు వరండాలో పడి ఉన్న బీరు బాటిళ్లు, సిగరెట్ను చూసి అవాక్కయ్యారు. రాత్రి కొందరు మందుబాబులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి మద్యం తాగి, ఖాళీ బాటిళ్లు, సిగరెట్ ముక్కలు అక్కడే వదిలివెళ్లారు. కాగా పాఠశాలకు కూతవేటు దూరంలోనే మద్యం షాపు కొనసాగుతుంది. గతంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రస్తుతం సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనక పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల వాతావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో రాత్రి పోలీసు నిఘా పెంచడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. -
కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం
మెదక్ కలెక్టరేట్: కార్మికుల హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనలో తమ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్రావు(ఎంఆర్కేరావు ) తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఎంయూ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ. ప్రతీ సభ్యుడు క్రమశిక్షణ, ఐక్యత, అంకితభావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీఎంయూ ఘనవిజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా పడిగే నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎజాజుద్దీన్, డిపో సెక్రెటరీగా సంగమేశ్వర్, అదనపు సెక్రెటరీగా కొత్తరాజు తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు శాకయ్య, సుబ్బారావు, ఎం.యాదగిరి, అష్ఫాక్ అహ్మద్, జీపీరాజు పాల్గొన్నారు. టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్కేరావు -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని అల్లీపూర్లో బాలిక అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. అల్లీపూర్కు చెందిన వడ్డెర తమ్మిశెట్టి రామకృష్ణ కూతురు అక్షయ(12) నీళ్ల కోసం బిందె తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆమె జాడ తెలియలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56763 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. మతిస్థిమితం లేని యువకుడు.. చేగుంట(తూప్రాన్): మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యమైన సంఘటన మాసాయిపేట మండలం వెనకతండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ బిక్యానాయక్ వివరాలు.. తండాకు చెందిన మలోత్ చింటూ(19) పుట్టుకతో చెవిటి, మూగతో పాటు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో అతడు సోమవారం సాయంత్రం తండాకు వచ్చిన ఓ స్కూల్ బస్సులో ఎక్కి పెద్దశివునూర్ రోడ్డు వద్ద దిగిపోయాడు. అప్పటి నుంచి చింటూ ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం తండ్రి కిమ్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తల్లి మందలించడంతో.. సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. పట్టణంలోని జలాల్బాగ్ కాలనీకి చెందిన కవేలి శంకరయ్య (32), అమ్మానాన్నలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. పని విషయంలో అమ్మన్నాలతో పలుమార్లు గొడవపడితే పెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. కాగా తల్లి పని చేయడం లేదని కోపంలో మందలించింది. దీంతో ఆవేశంలో శంకరయ్య ఈ నెల 23న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
న్యాయం చేయాలని మృతదేహంతో ధర్నా
కొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని తపాస్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 12న కొండపాక మండలంలోని బందారం గ్రామంలో సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోని బండ గ్రామానికి చెందిన బైరీ చార్లేస్(23), తపాస్పల్లి గ్రామానికి చెందిన రుద్రారం కనకయ్య వేర్వేరు బైక్లపై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో చార్లేస్కు తీవ్రగాయాలవ్వగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమ వారం మృతిచెందాడు. ప్రమాదానికి కార ణం కనకయ్య అని, మృతుని బంధువులు అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న చేర్యాల సీఐ రమేశ్, ఎస్ మహేశ్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. హుస్నాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. హుస్నాబాద్ పట్టణానికి చెందిన సాదుల యాదమ్మ (60) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డును దాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హన్మకొండ నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేటకు వెళ్తున్న కారు వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పేకాట, బెట్టింగ్పై ఉక్కుపాదం
అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ వెల్దుర్తి(తూప్రాన్): పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, వివిధ రిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఆయా కేసుల దర్యాప్తు పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐ కరుణాకర్రెడ్డికి సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణ, లాకప్ గదులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై స్థానిక శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. -
గీత కార్మికుడికి గాయాలు
హుస్నాబాద్రూరల్: మండలంలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన మార్క రాజమౌలి మంగళవారం వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీసి కిందకు దిగే క్రమంలో మోకు జారీ కిందపడ్డాడు. తోటి గీత కార్మికులు చూసి వెంటనే వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకుడు మార్క అనిల్కుమార్ కోరారు. పటాన్చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఈ సంఘటన పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి వివరాలు.. సోమవారం నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో 13 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా 13 మందికి రూ. 16 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్కృష్ణ వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం నందిగామ గ్రామ శివారులో ఓ కంపెనీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, అతని కాలికి నల్లదారంతో కట్టిన రాగి ఉంగరం, నడుముకు రెండు వరుసల నల్ల దారం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ● మహిళ ఆత్మహత్యాయత్నం ● పోలీసుల కౌన్సిలింగ్ కొండపాక(గజ్వేల్): భర్త నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తిని దక్కకుండా చేస్తున్నారని మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కుకునూరుపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కుకునూరుపల్లికి చెందిన దివ్య సుమారు 10 ఏళ్ల కింద కొంక సంతోష్కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో 2018లో భర్త సంతోష్కుమార్తో పాటు కుమారుడు చనిపోయారు. అప్పటి నుంచి కుకునూరుపల్లిలో మామ లింగయ్య పేరిట ఉన్న ఆస్తి వారసత్వంగా భర్త నుంచి తనకు రావాల్సి ఉండగా కుటుంబీకులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కోర్టు ద్వారా తీసుకునేందుకు పలుమార్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. దీంతో మంగళవారం మరోమారు జీపీ వద్దకు వెళ్లి కార్యదర్శిని అడిగింది. ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఇంటికి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు దివ్య ఇంటికి వెళ్లి ఆమె చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పోలీస్టేషన్కు తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య దుబ్బాకటౌన్: ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జలసిరి పథకం ద్వారా గ్రామాల్లో జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. మంగళవారం దౌల్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫామ్ పాండ్స్, బోరు మోటార్ల వద్ద రీచార్జ్ వెల్స్ నిర్మించేలా చొరవ చూపాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి భూగర్భ జలాల నిల్వలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి లింగుస్వామి, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీడీఓ అఫ్జలుద్దీన్, ఎంపీఓ సయ్యద్ గఫూర్, ఎంఈఓ కనకరాజు, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శేఖర్రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి గజ్వేల్రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈవో) రవీందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కాగా జిల్లాలోనే అత్యధికంగా అడ్మిషన్లు చేసిన సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలను అభినందించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా హిమబిందు, జాయింట్ సెక్రటరీగా శివకోటి, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్తో పాటు పలువురు ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
గ్రామ పాలన బలోపేతం
నేడు జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ సమావేశాలు సంగారెడ్డి జోన్: గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు కార్యాలయాల్లో మండల సాధారణ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండల పాలకవర్గాలు ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిషత్ సమావేశాలు నిర్వహించలేకపోయారు. 2024 జూన్ 24న పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసింది. కాగా అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వం ఆదేశాలు.. గతంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని వివిధ శాఖల అధికారులతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేవారు. పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో జిల్లాలో మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పరిషత్తు పాలన కొనసాగిస్తున్నారు. అధికారుల నియామకం జరిగినప్పటికీ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. పదవి కాలం ముగిసిన రెండేళ్ల తర్వాత బుధవారం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి సమావేశం నిర్వహించిన 45 రోజుల తరువాత మరోసారి మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంక్షేమం, సమస్యలపై చర్చ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, గ్రామాల వారీగా నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు అధికారుల తీరుపై ప్రశ్నిస్తారు. ఫలితంగా గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన కోరం సభ్యులతో నిర్వహిస్తారు. ప్రస్తుతం పరిషత్ సభ్యులు లేకుండానే బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 613 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాలకు ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు హాజరుకానున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలు అభివృద్ధి, సమస్యలపై చర్చ అధికారులతో పాటు సర్పంచులు హాజరు జిల్లాలో 25 మండలాలు, 613 గ్రామపంచాయతీలు -
ఆరుతడి పంటలే మేలు
చిలప్చెడ్(నర్సాపూర్): తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలే మేలని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు పేర్కొన్నారు. మంగళవారం చిలప్చెడ్ రైతు వేదికలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా కేవీకే ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి నిత్యానంద్, ఏఓ రాజశేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటలను పండించాలని సూచించారు. ఎక్కువ నీటి వినియోగంతో సాగయ్యే వరితో పంట చేతికి వచ్చే సమయానికి ఎల్నినో ప్రభావంతో సమస్యలు రావచ్చన్నారు. విత్తనమేళాలో భాగంగా కంది, మినుము, ఆముదం, ఆయా కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు కృష్ణవేణి, వంశీ, విద్యార్థులు హారిక, హరిణి, లావణ్య, నిఖిత, వందిత, రైతులు పాల్గొన్నారు.మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు -
2500 ఎకరాలు
ఆయిల్పామ్ లక్ష్యం..నిజాంపేట(మెదక్): ఈ ఏడాది 25 వందల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు అయ్యేలా లక్ష్యం పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చల్మెడలో సాగవుతున్న ఆయిల్పామ్ పంటను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడారు. 2023లో పెట్టిన వాటికి పంట తీస్తున్నారని, పామాయిల్ సాగు చేసిన రైతులకు మూడేళ్ల తరువాత మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈ మేరకు పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలు సాగు చేస్తే మంచి లాభాలు గడించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్, హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, ఏడీఏ విన్సెంట్ వినయ్, వ్యవసాయ అధికారులు సోమశేఖర్రెడ్డి, ప్రవీణ్, యాదగిరి, వందన, ఏఈవోలు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమా సింగ్ -
సింగూరుకు స్వల్పంగా నీరు
● 637 క్యూసెక్కుల నీరు చేరిక ● తాగునీటికి 470 క్యూసెక్కుల సరఫరా పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు చేరింది. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో భారీ వర్షాలు కురవకపోవడంతో డ్యాంలోకి చుక్కనీరు రాలేదు. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి స్వల్పంగా నీరు చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టులోకి 637 క్యూసెక్కుల నీరు చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. డ్యాం మరమ్మతుల దృష్ట్యా 29.9 టీఎంసీలకు గాను, తక్కువ నీటిని నిల్వ ఉంచుతున్నారు. డ్యామ్ నీటిమట్టం 523.600 మీటర్లకు నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 515.280 మీటర్లకు 4.322 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నుంచి మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి 470 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. -
అప్పులబాధతో వ్యక్తి బలవన్మరణం
సిద్దిపేటరూరల్: అప్పులు ఎక్కువ కావడంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన మండల పరిధిలోని చింతమడక గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన పెద్దిగాని ప్రవీణ్ (26) తనకు ఉన్న వరి కోతమిషన్తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మిషన్ రిపేరు కావడంతో ఇంటి వద్దే ఉంచి, భార్యతో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఇల్లు సైతం పూర్తి కాకపోవడంతో అప్పులు కాగా పలువురితో చెప్పుకుంటూ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లగా, సోమవారం రాత్రి చున్నీతో ఉరివేసుకున్నాడు. ఈ సమయంలో అన్న కనకరాజు ప్రవీణ్కు భోజనం ఇచ్చేందుకు వెళ్లి తలుపు తెరిచి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పురుగుల మందు తాగి .. దుబ్బాకటౌన్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూసంబి సంతోష్(42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇటీవల మద్యానికి బానిసగా మారి గ్రామంలో అప్పులు చేశాడు. ఇదే విషయంపై భార్య అనిత సోమవారం మందలించగా ఇద్దరు గొడవపడ్డారు. అదే కోపంతో మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. -
ధర్మేంద్ర రాజీనామా ఎవరి విజయం కాదు
మెదక్ ఎంపీ రఘునందన్రావు సదాశివపేట(సంగారెడ్డి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎవరి విజయం కాదని విద్యార్థుల బాధ వారి ఆవేశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశిర ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కేన్సర్ స్క్రీనింగ్ క్యాంప్నకు హాజరై ఎంపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ అయినా కేంద్రం బాధ్యత తీసుకుని, పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటించిందన్నారు. కాగా ఆస్పత్రిలో అంబులెన్స్, ఆర్వోపాంట్లు,సోలార్ప్లేట్స్ పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ అధ్యక్షురాలు రాజేశ్వరి, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మాణిక్రావు, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. అట్టహాసంగా గ్రామోత్సవ క్రీడా వేడుకలు మెదక్ కలెక్టరేట్: ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామోత్సవ క్రీడా వేడుకలు ఆదివారం మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ త్రోబాల్ వేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో 300లకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇషా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ క్రీడలతో యువతలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మహేశ్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రమేశ్, పీఈటీలు నాగరాజు, వలంటీర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. హేమరాజ్సింగ్కు వైద్యరత్న నేషనల్ అవార్డు దుబ్బాక: వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు దుబ్బాక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్సింగ్ వైద్యరత్న నేషనల్ అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బహుజన సాహిత్య అకాడమి 19వ పశ్చిమ భారతదేశ సదస్సులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ పాల్గొని హేమరాజ్సింగ్కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఏ బాధ్యులు గుర్రాల శ్రీనివాస్, కుంబాల రవి, పెద్దముత్యం తదితరులు ఉన్నారు. జిన్నారం(పటాన్చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన రాజ్ ప్రసాద్(59) గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగులో స్థిరపడ్డారు. కాగా జీఎస్బీ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజులాగే శనివారం విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి కార్మికులు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి.. ములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని డబుల్బెడ్రూం సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ రఘుపతి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్కునూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసెట్టి బాలమల్లు(45) ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య లక్ష్మి వద్దకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ములుగు సమీపంలోకి చేరుకోగానే అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతోపాటు పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు పెండింగ్లో ఉన్నా కనీసం ఆలోచన చేయడం లేదన్నారు. విద్యార్థుల కు రావాల్సిన కాస్మోటిక్ చార్జీలు సైతం రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు సందీప్, రాష్ట్ర కమి టీ సభ్యుడు రవితేజ, జిల్లా కార్యదర్శి ప్రశాంత్, జిల్లా నాయకులు సుదర్శన్, నవీన్, తులసి, రుక్మిణి, వెంకటేశ్, శ్రీలత, ధరణి, ప్రియాంక, చందన, సాహితి, సాకేర పాల్గొన్నారు. -
అష్ట కాలభైరవ అడ్డా
బయ్యన్నగుట్ట..చరిత్రకు ఆనవాళ్లుగా.. మహా కాలభైరవుడుక్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన ప్రసన్న కాల భైరవుడు కొలువుదీరిన బయ్యన్న గుట్టలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. బయ్యన్న గుట్టలు, మహా సముద్రం గండిని సందర్శించి చరిత్రాత్మక నేపథ్యాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్కుమార్ వివరించారు. – హుస్నాబాద్ హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్, నాగారం, మహ్మదాపూర్ గ్రామాలను ఆనుకొని ఉన్న గుట్టల వరుసకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ గుట్టల మధ్య మహా సముద్రం గండి, గండికి సమీపాన భైరవాద్రిపై బయ్యన్న ఖిల్లా ప్రసిద్ధి గాంచింది. నేల ఉపరితలం నుంచి మూడు కి.మీ దూరంలో రాళ్లు, జలపాతాల గుహలను దాటుకుంటూ, వన్య ప్రాణులు అరుపులు వినుకుంటూ వెళ్తే అపూర్వ రీతిలో చెక్కబడిన ప్రసన్న కాల భైరవ శిల్పం దర్శనమిస్తోంది. అష్ట భుజాలతో ఉన్న ఈ కాల భైరవుడి ముఖం రౌద్రంగా, త్రిభంగాసనంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడ్డాడు. అంతరశిల్పంగా జ్వాలా కేశాలతో అభయ హస్తంతో త్రిపుర భైరవదేవి అలంకరించబడిన అరుదైన శిల్పం. కాకతీయ చక్రవర్తి, గణపతి దేవుడు, అతని అనంతరం రాణి రుద్రమదేవి ప్రతి యేట ఇక్కడ భైరవ ఆరాధక గురువు ఆధ్వర్యంలో రుద్రయామల తంత్రాన్ని నిర్వహించేవారని తెలుస్తోంది. సైన్యాధిపతులు, దండ నాయకులు, సమస్త యుద్ధ తంత్ర నిపుణులు, శత్రువులు విజయం సాధించాలనే తపనతో ఈ కార్యక్రమంలో పాల్గొనే వారని స్థానికుల కథనం. అపూర్వ శిల్ప సంపద ఇదే నేపథ్యంలో గుట్టలపై వెలసిన కాల భైరవుడిని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆరాధించేవాడని చరిత్ర చెబుతోంది. మహా సముద్రం గండిలోని 13వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహం ప్రస్తుతం ఈ గుట్ట సరిహద్దు గ్రామమైన మహ్మదాపూర్లో ఉంది. ఈ కాల భైరవుడి విగ్రహానికి చుట్టు పక్కల ఇదే కొండపై మరో భైరవ విగ్రహం, ఇంకో గండశిలపై హనుమంతుని రేఖా చిత్రం, గుట్ట పాదభాగంలో భైరవ చెట్టు కింద మెడ లోతులో కూరుకుపోయిన మరో భైరవ విగ్రహం ఉంది. అష్టదిక్కుల్లో అష్ట భైరవులు కాపలా కాస్తారని చరిత్ర చెబుతోంది. ఈ దుర్గమ ప్రదేశం చుట్టు పక్కల అనేక భైరవ విగ్రహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ మహా సముద్రం గండిలోని అమూల్య సంపద, వృక్ష, జంతు, సరీసృప సంపదలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బలహీన వర్గాలను చేరదీసి సిద్ధ సైన్యాన్ని తయారు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం (1680–1710) కాలంలో గోల్కొండ కుతుబ్షాహీ సుల్తానులు, మొఘలుల అధికారాన్ని గెరిల్లా పోరాటాలతో ధిక్కరించాడని తెలుస్తోంది. నవాబులచే నియమించబడిన నియంతృత్వ జమిందారులను, పాలకులను ఎదిరించి సామాన్య ప్రజలను ఆదుకున్నాడని జానపద కథనం. మొఘల్ సేనాని యూసఫ్ఖాన్ను ఎదిరిస్తూ హుస్నాబాద్ అటవీ ప్రాంతంలో ఈ మహా కాలభైరవుడు కొలువైన మహాసముద్రం గండిలోనే ఆయన అమరుడైనట్లు ఓ బుర్రకథ చెబుతుందని తన పరిశోధనలో వివరించారు. మహాసముద్రం గండిలో అమూల్య శిల్ప సంపద అద్భుతమైన గుట్టల ప్రాంతం చరిత్రాత్మకం ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్కుమార్ -
లాలిస్తూ.. ఆడిస్తూ..!
ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పోస్టుల కోసం దాదాపు 1,000 మంది యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు చేపట్టగా, మహిళలు భారీగా తరలివచ్చారు. అయితే చిన్న పిల్లలు ఉన్న మహిళలు ధ్రువపత్రాల పరిశీలనకు రాగా, వారి వెంట పిల్లల ఆలనాపాలనా చూసేందుకు వారి భర్తలు కూడా వెంట వచ్చారు. లోపల మహిళలు సర్టిఫికెట్ల పరిశీలనలో బిజీగా ఉండగా.. కార్యాలయ ఆవరణలో తండ్రులు తమ చిన్నారులను ఎత్తుకొని లాలిస్తూ, ఆడిస్తూ కనిపించారు. – నారాయణఖేడ్ -
సీపీఎస్ రద్దు.. చైతన్య గీతం ఆవిష్కరణ
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిప్రశాంత్నగర్(సిద్దిపేట): సీపీఎస్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, ఓపీఎస్ను అమలు చేయాలని, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ‘‘నేస్తమా కదలిరా.. సీపీఎస్ రద్దుకై ’’ అనే చైతన్య గీతంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం సాంస్కృతిక రూపంలో సాగుతున్న ఈ ప్రచారం ఉద్యమానికి కొత్త ఊపునిస్తుందన్నారు. రెండున్నర లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభావితమవుతున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. సీపీఎస్ రద్దు అంశం మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగుల్లో నిరాశ కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రైతు వేదికల్లో సీడ్ మేళా
జహీరాబాద్: మండలానికి ఒక రైతు వేదిక చొప్పున ఎంపిక చేసి సీడ్ మేళా నిర్వహించారు. సోమవారం జిల్లాలోని ఆయా మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సైతం ఈ మేళాలు కొనసాగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన కారణంగా రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు మేళాలు నిర్వహించనున్నారు. పలు రకాల కూరగాయల విత్తనాలతో పాటు స్వీట్కాన్ మొక్కజొన్న విత్తనాలను డీలర్లు రైతులకు అందుబాటులో ఉంచారు. విత్తనాలు లభించని రైతులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా వ్యవసాయ శాఖ సీడ్ మేళాను ఏర్పాటు చేసింది. జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సీడ్ మేళాకు పలువురు రైతులు హాజరై విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓ సరస్వతి పాల్గొన్నారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
సంగారెడ్డి టౌన్: దేశవ్యాప్తంగా వివిధ పీఠాల స్వామీజీల ఆదేశాల మేరకు గోరక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు గోసంతతి సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే సండే మార్కెట్ హనుమాన్ మందిరం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో గోమాతను ప్రత్యేకంగా వెంట తీసుకెళ్లారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సేకరించిన రెండు లక్షల సంతకాల ప్రతులను కలెక్టర్ ప్రతీక్ జైన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరక్షా అభియాన్ నాయకులు సుభాష్ చందర్, షెరీన్ సింగ్, సోహన్, కౌన్సిలర్ జగన్, దామోదర్ రెడ్డి, ద్వారకా రవి పాల్గొన్నారు. -
బైక్ కొనివ్వలేదని.. యువకుడి ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): బైక్ కొనివ్వడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నార్సింగి మండలం వల్లూర్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ సృజన కథనం ప్రకారం.. చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన మారబోయిన రమేశ్, యశోదల పెద్ద కుమారుడు శ్రీకాంత్(18) ఇంటర్ పూర్తిచేసుకుని వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కొంత కాలంగా బైక్ కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. శనివారం రాత్రి భోజనాలు చేసే సమయంలో తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని అడిగాడు. అయితే తండ్రి వర్షాకాలం పంటలు పండిన తరువాత కొనిస్తానని చెప్పాడు. ఆదివారం ఉదయం వల్లూర్ శివారులో ఉన్న పొలానికి నీరు పెట్టి వస్తానని చెప్పి వెళ్లిన శ్రీకాంత్ అక్కడి నుంచి తల్లికి ఫోన్చేసి తనకు బైక్ కొనివ్వడం లేదని, స్నేహితుల వద్ద పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్ కట్ చేశాడు. వెంటనే తల్లి యశోద తన బావ కుమారుడిని తీసుకుని పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకుని కన్పించాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాలికి గాయం మానకపోవడంతో.. దుబ్బాకరూరల్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు కొమ్మాట మల్లయ్య(70) కూలీ పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కాలికి గాయం కావడంతో అది మానడం లేదు. షుగర్ వ్యాధి ఎక్కువై పుండు మానకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధుడు ఇంటి ప్రక్కన గల గదిలో ఆదివారం తెల్లవారు జామున ఉరివేసుకున్నాడు. ఉదయం కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సాగుకు సానుకూలం!
● వరుస వర్షాలతో అన్నదాతకు ఊరట ● జీవం పోసుకున్న పత్తి, సోయా, పెసర ● సాధారణ వర్షపాతం జాబితాలోకి జిల్లాసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షం పంటలకు జీవం పోసింది. ఎల్నినో హెచ్చరికలతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు కొంత ఊరటనిచ్చింది. దీంతో ఆరుతడి పంటలకు ప్రాణం వచ్చింది. ప్రధానంగా పత్తి, సోయా, పెసర, కంది వంటి పంటలకు ఎంతో మేలు జరిగింది. ఒక కంది మినహ మిగిలిన మూడు పంటలు ప్రస్తుతం గూడ దశలో ఉన్నాయి. వారం రోజుల్లో పూత దశకు చేరుకుంటాయి. ఈ కీలక తరుణంలో వరుణుడు కాస్త కరుణ చూపడంతో ఈ పంటలకు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం పడకపోతే పంటలు ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి కూడా రైతులు నష్టపోయే వారు. ఇప్పుడు కురిసిన వర్షానికి లాభాలు రాకపోయినా, పెట్టుబడి అయినా వస్తుందనే ఆశ కలిగింది. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, ఈనెల 27 వరకు 5.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇది రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కావడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇంత విస్తీర్ణంలో పంటలు సాగు కాలేదు. అత్యధికంగా 3.56 లక్షల ఎకరాల్లో పత్తి విత్తుకున్నారు. 70,191 ఎకరాల్లో సోయా పంట వేసుకున్నారు. 71,961 ఎకరాల్లో కంది, 7,364 ఎకరాల్లో మక్క, 8,002 ఎకరాల్లో పెసర, 6,250 ఎకరాల్లో శనగ పంట సాగవుతోంది. మరోవైపు 34,249 చెరుకు పంట కొనసాగుతోంది. అయితే బోరుబావుల కింద 19,365 ఎకరాల్లో వరి వేసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సంగారెడ్డి జిల్లాలో సాగువుతున్నాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలు ఈ పంటలకు ప్రాణం పోసినట్లయింది. మరోవారం రోజులు వర్షాలు కురియకపోతే ఈ పంటలన్నీ ఎండిపోతుండేవని అన్నదాతలు పేర్కొంటున్నారు. అత్యధికంగా 7.2 సెం.మీలు సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రంలో 7.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. కంగ్టిలో 5 సెం.మీలు, సిర్గాపూర్ 5.7 సెం.మీలు, కందిలో 5.2 సెం.మీలు, గుమ్మడిదలలో 4.3 సెం.మీలు, పటాన్చెరులో 4.1 సెం.మీలు, ఆర్సీపురంలో 3.9 సెం.మీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 2.8 సెం.మీల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో కూడా జిల్లాలోని పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. వర్షపాతంలో రెండో స్థానం వర్షాకాలం ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 290 మి.మీ. ఇప్పటి వరకు 271 మి.మీల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే కేవలం ఏడు శాతం.. 19 మి.మీలు మాత్రమే తక్కువ ఉంది. సాధారణం కంటే 20 శాతం తక్కువ గానీ, ఎక్కువ గానీ నమోదైనా సాధారణ వర్షపాతంగానే వాతావరణశాఖ భావిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లానే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏడు మండలాలు సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు కాగా, అందులో సంగారెడ్డి కూడా ఉంది. -
ఆదుకోండి సారూ..
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026హత్నూర మండలం పల్పనూర్కు చెందిన మంగలి శ్యామలకు ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. ఇటీవల తన భర్త శివకుమార్ గుండెపోటుతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను సాకటం కష్టంగా మారింది. భర్త పేరు మీద కొంత పొలం ఉన్నప్పటికీ రైతు బీమా నమోదు చేసుకోకపోవడంతో బీమా డబ్బులు రాలేదు. బతుకు భారంగా మారిందని తనకు ఏదైనా దారి చూపాలని, బీ మా డబ్బులు వచ్చేలా చేయాలని సోమవారం ప్రజావాణిలో తల్లితో కలిసి వచ్చి కలెక్టర్ను వేడుకుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
వెంచర్ కోసం వాగు దారిమళ్లింపు!
● పేరుకుపోతున్న చెత్తాచెదారం ● ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు ● పట్టించుకోని అధికారులు జహీరాబాద్: సహజత్వానికి విరుద్ధంగా ఎవరికి నచ్చినట్లు వారు వాగును మళ్లించుకుంటూ పోవడంతో వరదనీరు సక్రమంగా ముందుకెళ్లని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాగులో వచ్చే చెత్తాచెదారం పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తోంది. జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీ, నారాయణనగర్ కాలనీల నుంచి ముసానగర్, చెన్నారెడ్డినగర్ కాలనీ, వసుంధర నగర్, ఇంద్రప్రస్థ కాలనీలో మీదుగా వెళ్తున్న వాగును ఇష్టానుసారంగా వెంచర్ నిర్వాహకులు దారి మళ్లించారు. దీంతో వరద నీరు ముందుకెళ్లడం లేదు. దీంతో ఎక్కడికక్కడ స్తంభించడంతో ఆయా కాలనీల వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. వసుంధర కాలనీ వెంచర్ నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా వాగును దారి మళ్లించారు. వాగుపై చిన్న చిన్న పైపులను వేసి పక్క కాలనీల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా చిన్న కల్వర్టును నిర్మించారు. కల్వర్టు నుంచి దిగువకు నీరు వెళ్లకుండా స్తంభిస్తోంది. కల్వర్టు వద్ద చెత్త పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. భారీ వర్షం వస్తే కల్వర్టుకు ఇరువైపులా నీరు పొంగి కాలనీల్లోకి చేరుతోందని పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలి.. దిగువన ఉన్న ఇంద్రప్రస్థ వెంచర్ వద్ద 65వ జాతీయ రహదారి పక్క నుంచి వాగును దారి మళ్లించారు. దీంతో వర్షం కురిస్తే వరదనీరు సక్రమంగా ముందుకెళ్లకుండా పరిసరాల్లో నిలుస్తోంది. దిగువన ఉన్న పలు వెంచర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం, వాగును దారి మళ్లించడంతో వరదనీరు ఎక్కడికక్కడే స్తంభిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు
జహీరాబాద్ టౌన్: కోహీర్ మండలం దిగ్వాల్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాములు సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో 12, బైపీసీలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. బీసీలకు 4, ఎస్టీలకు 2, ఎస్సీలకు 14, ఓసీలకు ఒక సీటు కేటాయిస్తామన్నారు. అడ్మిషన్ కోసం బుధవారం ఉదయం 11 గంటల లోపు విద్యార్థులు అన్ని ఒరిజినల్ పత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయంపటాన్చెరు టౌన్: బీరంగూడ పరిధిలోని గోశాల 33/11 కేవీ సబ్స్టేషన్న్ పరిధిలోని 11 కేవీ శివాలయం ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నందున మంగళ వారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్న ట్లు ఏఈ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధుర నగర్, భ్రమరాంబిక, మల్లికార్జున హిల్స్, బీరంగూడ ప్రాంతాల్లో సరఫరాను నిలిపివేయనున్నారు. అలాగే పటేల్గూడ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ రాఘవేంద్ర ఫీడర్లో నిర్వహణ పనుల వల్ల మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐక్యత హోమ్స్, రాఘవేంద్ర కాలనీ, కృష్ణానగర్, మారుతీనగర్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం సంగారెడ్డి జోన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరినారాయణఖేడ్: పెండింగులో ఉన్న రూ.15 వేలకోట్ల ఫీజు, ఉపకారవేతనాల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సమరభేరి మోగిస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోణం విఠల్, మండల అధ్యక్షుడు సిందోల్ దశరథ్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ తెలిపారు. సమరభేరిలో భాగంగా 17, 18వ తేదీ ల్లో ఫీజుల బకాయి– బీజేపీ లడాయి పేరిట ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నాయకులు పెద్దశంకరంపేట మండల అధ్యక్షుడు శ్రావణ్, సుగుణాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్ వెల్దుర్తి(తూప్రాన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 1న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్ కార్డుల జారీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్య ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈ ఓ మధుసూదన్రావు, నాయకులు భద్రయ్య, ఝాన్సి తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు -
బెల్ట్షాపులపై దాడులు
● అక్రమంగా నిల్వ ఉన్న బీరు, మద్యం స్వాధీనం ● ఇద్దరిపై కేసు నమోదు అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని కట్కూర్, చాపగానీతండా గ్రామాల్లో ఉన్న పలు బెల్ట్షాపులపై ఆదివారం అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కూర్లోని శ్రీనివాస కిరాణాషాపులో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న బానోతు ఉమ వద్ద 6 లీటర్ల బీరు, 3.7లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ శాఖ సీఐ పవన్, ఎస్ఐ దామోదర్ పేర్కొన్నారు. అలాగే చాపగానీతండా గ్రామంలో గుగులోతు కొమురయ్య వద్ద 5లీటర్ల బీరు, 3.6లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐ దామోదర్, హెడ్ కానిస్టేబుల్ కొండల్రావు, కానిస్టేబుళ్లు సంపత్, శైలజ పాల్గొన్నారు. -
ఫామ్పాండ్లతో భూగర్భజలాల వృద్ధి
అదనపు డీఆర్డీఓ బాలరాజుసంగారెడ్డిటౌన్: ఫామ్ పాండ్ల ఏర్పాటుతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అదనపు డీఆర్డీఓ బాలరాజు అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని పసల్వాది పంచాయతీలో వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్కు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ తమ పొలాల వద్ద వ్యవసాయ కుంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కుంటలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ ఉంచడం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. నిల్వ ఉన్న నీరు భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పైకి వస్తాయని వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎంపీడీఓ నిహారిక, ఎంపీఓ శ్రీకాంత్, ఏపీఓ మధుసూదన్రావు, సర్పంచ్ హరిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్ సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లలో నిర్వహించిన ప్రజావాణిలో 99 ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, తదితరులు పాల్గొన్నారు. -
గుంతల దారి.. అవస్థలే మరి
పూర్తిగా ధ్వంసమైన రహదారిజహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ గ్రామ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రజలు నరకం చూస్తున్నా రు. రోడ్డు పొడువునా పడిన గుంతలు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించినా, కలెక్టర్ను కలసి వినతిపత్రాలు అందజేసినా ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అల్గోల్ రోడ్డు జహీరాబాద్ పట్టణం నుంచి పొట్పల్లి మీదుగా ఎల్గోయి వరకు ఉన్న నిమ్జ్ ప్రాజెక్టు ప్రాంతం వరకు వెళ్తుంది. కొన్నేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోవడంలేదు. రోడ్డు పొడువునా పెద్ద పెద్ద గుంతలేర్పడ్డాయి. గుంతల కారణంగా వర్షం నీరు చేరి ప్రయాణం నరకయాతనగా మారింది. ఆటోలు, మోటారు బైక్లు అదుపుతప్పి పడిపోతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.65 కోట్ల నిధులు కూడా మంజూరు కాగా సకాలంలో మరమ్మతులు చేపట్టని కారణంగా అవికూడా రద్దయ్యాయి. రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు జహీరాబాద్ నుంచి అల్గోల్ వరకు గల సుమారు 6 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతుల కోసం ఆర్అండ్బీ అధికారులు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపా రు. ఇంత వరకూ నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి కోరుతున్నారు. -
శాకాంబరీదేవిగా శ్రీవిద్యాసరస్వతి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకాంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
పరారైన రిమాండ్ ఖైదీ అరెస్ట్
సిద్దిపేటకమాన్: పరారైన రిమాండ్ ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట వన్టౌన్ సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. సాధారణ వైద్య పరీక్షల కోసం జిల్లా జైలు నుంచి ఏడుగురు ఖైదీలను వ్యానులో ఏఆర్ పోలీసులు శనివారం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం నలుగురు ఖైదీలను వ్యానులో ఎక్కించగా వీరిలో రిమాండ్లో ఉన్న ఖైదీ జొన్నల సాయికుమార్ బేడీలు తొలగించుకుని ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకి పారిపోయాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సాయికుమార్ కోమటిచెరువు కట్టపై ఉన్న బైక్ను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ టీవీ, ఇతర ఆధారాల సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి రైల్వేస్టేషన్ సమీపంలో సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు దొంగిలించిన బైక్పై మేడ్చల్లోని సోదరి ఇంటికి వెళ్లి అక్కడ బట్టలు మార్చుకుని రైలులో కామారెడ్డికి వెళ్లాడు. అక్కడి నుంచి నిజామాబాద్ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి -
గణితంపై భయం పోగొట్టాలి
సమగ్ర శిక్షణ కోర్సు డైరెక్టర్ కరీమొద్దీన్గజ్వేల్: విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంపొందించేలా బోధన సాగాలని సమగ్ర శిక్షణ కోర్సు డైరెక్టర్, హెచ్ఎం కరీమొద్దీన్ సూచించారు. సోమవారం గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణకు ఆయన హాజరై మాట్లాడుతూ.. చిన్న, చిన్న కృత్యాలు, గ్రూపు యాక్టివిటీ ద్వారా విద్యార్థుల్లో ఉన్న అభ్యసనాలోపాలను అధిగమించవచ్చని తెలిపారు. గజ్వేల్ డివిజన్లోని ఏడు మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనగా రిసోర్స్పర్సన్లుగా వంటేరు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్. అశోక్రెడ్డి, సుభాష్చంద్రారెడ్డి, భాస్కర్, వెంకటేశ్వర్, సతీశ్కుమార్, చంద్రారెడ్డి వ్యవహరించారు. -
నేషనల్ స్కిల్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కోరినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం తెలిపారు. ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. మెదక్జోన్: బాలిక వెంటపడి పెళ్లి చేసుకుంటానని వేధించిన నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు ఇలా.. శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 ఫిబ్రవరిలో చాకలి కుమార్ టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా ఇంటర్ చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి శుభవల్లి నిందితుడికి ఏడాది జెలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు వాడుకున్న వారి నుంచి రికవరీ చేయాలని మాజీ ఉప సర్పంచ్ నర్సింలు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా రూ.16 లక్షల ఆదాయం వచ్చిందని, ఆ డబ్బులు మాజీ సర్పంచ్ సుధాకర్రెడ్డి వద్ద రూ.11 లక్షలు, రాంచంద్రా రెడ్డి వద్ద రూ.5 లక్షలు గ్రామస్తుల సమక్షంలో ఉంచినట్లు ఆరోపించారు. కాగా గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉన్నా.. డబ్బులు అడిగితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ప్రజా అవసరాలకు ఖర్చు చేయాల్సిన డబ్బులను వారి సొంతానికి వాడుకున్న వారిపై చర్యలు తీసుకొని, డబ్బులు రికవరీ చేయాలని పోలీస్స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్రూరల్: మండల పరిధిలోని కొడకండ్లలోగల పెద్దమ్మతల్లి దేవాలయంలో చోరీ జరిగింది. గ్రామస్తుల వివరాలు.. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ముక్కుపుడకతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. కాగా సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సదాశివపేట(సంగారెడ్డి): మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపి పట్టుబడటమే కాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం.. ఈనెల 22న వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దాపురం రవీందర్ పట్టుబడ్డాడు. కాగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి లక్ష్మికళ అతడికి నాలుగు రోజుల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. -
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే..
రేగోడ్(మెదక్): మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులనుద్దేశించి అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వంట సరుకులు, పలు రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అదనపు గదుల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువు, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాన్నారు. ప్రతీ విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తారెడ్డి, ప్రిన్సిపాల్ స్వయంప్రభ, ఆర్ఐ శరణప్ప తదితరులు ఉన్నారు. ఆధార్లో వివరాల నమోదు మెదక్ కలెక్టరేట్: ప్రతి పౌరుడు తమ ఆధార్లో పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఈ–డిస్ట్రిక్ అధికారులు, ఆధార్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందాలంటే ఆధార్ వివరాలు కచ్చితంగా, తాజా సమాచారంతో ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. -
మంజీరా తీరంలో అలజడి
● సాగు మోటార్లకు కరెంటు నిలిపివేత ● మంత్రి జోక్యంతో పునరుద్ధరించిన అధికారులు పుల్కల్(అందోల్): మంజీరా నది తీరంలో ‘సాగు’ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. మంజీరా నది పరివాహకంలో నీటి కొరత ఏర్పడటంతో సాగుకోసం రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లకు సోమవారం విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తాగునీటి పథకాలకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అధికారులు తీరం వెంబడి ఏర్పాటు చేసిన మోటార్లకు విద్యుత్ సరఫరాను తొలగించారు. పోలీసులు, విద్యుత్ అధికారులు సింగూరు డ్యాం దిగువ నుంచి ఘనపూర్ ఆయకట్టు వరకు వేలాది సాగు మోటార్లకు విద్యుత్ సరఫరాను తొలగించారు. దీంతో రైతులు మూకుమ్మడిగా రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహకు సమాచారం అందించారు. దీంతో మంత్రి జోక్యం చేసుకుని విద్యుత్ మోటార్లకు సరఫరాను పునరుద్ధరింపజేశారు. నాట్లు పూర్తి.. మంజీరా నదీ పరివాహకంలో పుల్కల్, చౌటకూర్, సదాశివపేట, హత్నూర, చిలిప్చెడ్, అందోల్, చౌటకూర్ మండలాలు, పాపన్నపేట, కొల్చారం, మండలాలకు చెందిన తీరం గ్రామాల్లో వేలాది సాగు మోటార్లను అమర్చి సేద్యం చేస్తున్నారు. నదిలో పుష్కలంగా నీరు లభిస్తుండటంతో కరువు కాలంలో కూడా తీరం వెంబడి పుష్కలంగా పంటలు పండిస్తారు. అధికారులు సోమవారం సాగు మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీరం వెంబడి పంటలు పండించొద్దని జూన్ ప్రారంభంలో అధికారులు సూచిస్తే వరినాట్లు వేయకుండా ఉండేవారమని రైతులు మంత్రి దామోదరకు తెలిపారు. -
నవోదయ పిలుస్తోంది
● చివరి తేదీ ఈ నెల 31 వరకు ● పరీక్షలో నెగెటివ్ మార్క్ విధానం వర్గల్ నవోదయ విద్యాలయంఉమ్మడి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాలయం కృషి చేస్తోంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యాలయంను జిల్లాలో ఏర్పాటు చేసింది. ఆధునిక విద్యతో పాటు సాంకేతిక అవగాహన, క్రీడల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేస్తోంది. – సంగారెడ్డి ఎడ్యుకేషన్/సంగారెడ్డి క్రైమ్ ఉమ్మడి జిల్లాలోని వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రవేశానికి ఉమ్మడి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అర్హులు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యను ఈ విద్యాలయంలో అందిస్తారు. పరీక్ష విధానం ప్రవేశపరీక్ష పూర్తిగా ఆబ్టెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అర్థమెటిక్–25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్–25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కు–50 మార్కులకు సంబంధించి వంద మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నాపత్రం ఆంగ్లం, హిందీ భాషలో ఉంటుంది. నెగెటివ్ మార్క్ కూడా ఉంటుంది. అర్హతలు ఉమ్మడి జిల్లా పరిధిలో నివాసితులై ఉండాలి. 01–05–2015, 31–07–2017 మధ్య జన్మించి ఉండాలి. బాలికలకు 33% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు.అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలలో పాటు నివాస, కుల పత్రాలు అప్లోడ్ చేయాలి. పరీక్ష నవంబర్ 28న నిర్వహిస్తారు. ఆన్లైన్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఒకరికి తీవ్ర గాయాలుములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తునికిబొల్లారం శివారులో జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన ఎండపల్లి సహదేవ్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల కూతురు జన్మించడంతో సోమవారం ఊయల కార్యక్రమం నిర్వహించారు. దీనికి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో సహదేవ్ కుమారుడు హరిమోహన్(22), అన్న మనవడు హరిచరణ్ యాక్టీవాపై తునికి బొల్లారం వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు హరిమోహన్ మృతి చెందినట్లు ధృవీకరించారు. హరిచరణ్కు చికిత్స అందిస్తున్నారు. కాగా హరిమోహన్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చతుర్విద జలప్రక్రియపై కలెక్టర్కు నివేదన
ఫలితాల బుక్లెట్ అందజేసిన నిపుణుడు అఫ్సర్జహీరాబాద్: చతుర్విద జలప్రక్రియ ఉపయోగాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు కార్యక్రమ జాతీయ స్థాయి నిపుణుడు, గొటిగార్పల్లి గ్రామానికి చెందిన ఎండి. అఫ్సర్ నివేదించారు. సోమవారం కలెక్టర్ను కలిసి తక్కువ ఖర్చుతో జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో చేపట్టిన చతుర్విద జల ప్రక్రియ కార్యక్రమ ఫలితాల గురించి వివరించారు. ఇందుకు సంబంధించి రూపొందించిన బుక్లెట్ను కలెక్టర్కు అందజేశారు. జహీరాబాద్ మండలంలోని గొటిగార్పల్లి గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయింది. దీని స్ఫూర్తితో ఎడారి ప్రాంతమైన రాజస్తాన్లో అక్కడి ప్రభుత్వం అమలు చేసి సాధించిన ఫలితాల గురించి కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. త్వరలో గ్రామాన్ని సందర్శించి ఫలితాల గురించి ప్రత్యక్షంగా చూస్తానని కలెక్టర్ చెప్పినట్లు అఫ్సర్ పేర్కొన్నారు. -
కూతురి టీసీ కోసం..
పెట్రోల్ బాటిల్తో తండ్రి ఆందోళనజహీరాబాద్: ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం టీసీ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థి తండ్రి ఆ పాఠశాల ఎదుట పెట్రోల్ బాటిల్తో ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోహీర్ మండలంలోని చింతలగట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెండేళ్లుగా తన కుమార్తెను జహీరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నాడు. కాగా ఏప్రిల్లోనే తన కుమార్తె టీసీ ఇవ్వాలని ముందస్తుగానే లిఖిత పూర్వకంగా విన్నవించినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం టీసీ కోసం వెళ్తే వారం రోజులు సమయం పడుతుందని, పాఠశాల బాధ్యులు సమాధానం ఇచ్చారన్నారు. దీంతో విధిలేక పెట్రోల్ బాటిల్తో ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. శుక్రవారం టీసీ కోసం సంబంధిత విభాగంలో అడగగా సోమవారం ఇస్తామని చెప్పి పంపించామన్నారు. సోమవారం పాఠశాలకు రాగా సాయంత్రం తీసుకెళ్లమని సూచించగా, నిరసనకు దిగాడని తెలిపారు. పాఠశాలలో ఇప్పటి వరకు ఎవరి టీసీలను ఆపలేదని వారు స్పష్టం చేశారు. -
సీ్త్రనిధి రుణాల రికవరీలో వేగం
మెదక్ కలెక్టరేట్: సీ్త్రనిధి రుణాల రికవరీని వేగవంతం చేసి 90శాతం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో సీ్త్రనిధి రుణాల రికవరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సీ్త్రనిధి రుణాల రికవరీ, పెండింగ్ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాలు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను నేరుగా కలెక్టర్ ప్రశ్నించారు. వెనుకబడిన కారణాలను విశ్లేషించి ఆయా మండలాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే రెండునెలల్లో కనీసం 90శాతం రుణాలు రికవరీ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన అమలు పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెప్మా పీడీ హనుమంత రెడ్డి, సీ్త్రనిధి జోనల్ మేనేజర్ రవికుమార్, రీజినల్ మేనేజర్ గంగారం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ సిద్దిపేటరూరల్: విద్యార్థులు పాఠశాల దశలోనే లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, సాధన దిశగా అడుగులు వేయాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మోటివేషనల్ స్పీకర్ రవీందర్ విద్యార్థులకు సూచించారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ అధ్యక్షతన సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీందర్ హాజరై మాట్లాడారు. నాలుగో తరగతిలోనే లక్ష్య సాధన కోసం తాను ఏర్పరచుకున్న ఆలోచనను తన గురువుతో పంచుకున్న అబ్దుల్ కలాం విజయ గాథను విద్యార్థులకు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో ఏప్రిల్లో ప్రారంభమైన వేసవి శిబిరం తీరును సంకల్ప సిద్ధి కార్యక్రమం కోఆర్డినేటర్ వరప్రసాద్ వివరించారు. శిబిరంలో పాల్గొన్న 120 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, మెటల్ వాటర్ బాటిల్, జామెట్రీ బాక్స్, స్టూడెంట్ డైరీతో కూడిన కిట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వివాహం కావడం లేదని..
యువకుడి ఆత్మహత్య సిద్దిపేటకమాన్: వివాహం కావడం లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం కోమటిచెరువులో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నాసర్పూరకు చెందిన మిద్దె చందు (30) కొంత కాలంగా కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. కాగా యువకుడికి కొద్ది రోజుల క్రితం కంటికి పూత వచ్చింది. ఆ సమస్య పెద్దది కావడం, ముప్పై ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి స్థానిక కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతగిరిపల్లిలో వివాహిత.. వర్గల్(గజ్వేల్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని అనంతగిరిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మల మహేశ్, శిల్ప(25) ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏమి జరిగిందో తెలియదుగాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిల్ప బెడ్రూమ్లో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె మృతికి భర్తే కారణమంటూ మృతురాలి సంబంధీకులు, కుటుంబీకులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సమాచారం తెలిసి తొగుట సీఐ లతీఫ్, పలువురు ఎస్ఐలు, పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా, మృతురాలి భర్త మహేశ్పై దాడి జరగకుండా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారకులెవరైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మృతురాలి సంబంధీకులకు సీఐ నచ్చజెప్పారు. శిల్ప మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తొగుట సీఐ తెలిపారు. -
వర్గ పోరాటంతోనే కులనిర్మూలన
నారాయణఖేడ్: కులవ్యవస్థ నిర్మూలనకు వర్గపోరాట దృక్పథం ఒక్కటే మార్గమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కేవీపీఎస్ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. వర్గ పోరాటం ఒక్కటే సమాజ మార్పునకు చోదక శక్తిగా ఉంటుందన్నారు. కులాల మధ్య ఘర్షణ పీడిత వర్గ ఐక్యతకు ఆటంకంగా నిలుస్తాయని, అన్ని కులాల్లో పీడిత వర్గాన్ని ఏకం చేస్తేనే మార్పు సాధ్యమన్నారు. అన్ని రకాల అసమానతలను తొలగించేందుకు వర్గ పోరాటం ఒక్కటే ఏకై క ఆయుధం అని చెప్పారు. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు అతిమెల మాణిక్యం మాట్లాడుతూ జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక సమాజిక ఉధ్యమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. నాయకులు మద్దూరి శికుమార్, కొటారి నర్సింహులు, సుభాష్, గణపతి, మల్లేశ్, సంతోష్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జైకుమార్, అరుణ్, శరణప్ప పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర నేత స్కైలాబ్ బాబు -
28న ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్లో వివిధ కోర్సుల్లో ఉన్న ఖాళీలకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 15, బైపీసీలో 15 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఖాళీ సీట్లను జోనల్ అధికారి ఉత్తర్వుల మేరకు నేరుగా భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి సంతలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని పోతిరెడ్డిపల్లి, శాంతినగర్, బృందావన్ కాలనీ, గీతానగర్, మార్చ్నగర్ తదితర కాలనీల్లో రోడ్లపై నీరు చేరడంతో ద్విచక్ర వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్అండ్బీ కార్యాలయం నుంచి రైతు బజార్ వరకు డ్రైనేజీ పొంగి ప్రధాన రోడ్డుపై చేరడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బుద్ధుడు బోధించిన కరుణ, సమానత్వం, అహింస, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించేందుకు ముత్యాల నర్సింహులు ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రూ.వేల కోట్ల తో కొనసాగేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చక పొతే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
పర్యాటక ప్రాంతంగా బోరంచ
నారాయణఖేడ్: పర్యాటక ప్రాంతంగా బోరంచ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నల్లపోచమ్మ, సంగమేశ్వర ఆలయాల సమీపంలో ఉన్న మంజీరా నదిలో భక్తుల సౌకర్యార్థం మాఘ స్నానాల కోసం మెట్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. టూరిజంలో భాగంగా బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. బోరంచ, సంగమేశ్వర ఆలయాలను మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధితో ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, నాయకులు దిగంబర్రెడ్డి, బీరప్ప, సిద్దారెడ్డి, శేరి రాజు పాల్గొన్నారు. అనంతరం తుమ్నూర్, ముగ్దుంపూర్ గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
రైతు గుండె చెరువు
హత్నూర(సంగారెడ్డి): కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కనువిందు చేసే సాగు భూములు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. అయితే బోర్ల కింద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు వద్దంటున్నా.. రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం హత్నూర మండలంలో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నారు. కేవలం పత్తి 4,000 ఎకరాలు, 200 ఎకరాల్లో కంది, 100 ఎకరాల్లో జొన్నసాగుకు రైతులు ప్రస్తుతం సిద్ధమై సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 250 వరకు చెరువు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువు కుంటల్లో చుక్క నీరు చేరలేదు. అయినప్పటికీ రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలు తక్కువ పడతాయని, రైతులు వరినాట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నామని తెలిపారు. అయినా కొన్ని గ్రామాల్లో వరిపైనే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చేతికొచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోతే నష్టపోయే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నాం. కమ్ముకున్న కరువు వెలవెలబోతున్న నీటి వనరులు బోర్లను నమ్ముకుని వరి నాట్లు -
మహిళా ‘వికాసం’
పేదలకు కుట్టులో శిక్షణజహీరాబాద్ టౌన్: మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం కోసం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్(వికాస్) సంస్థ చేయూతనిస్తోంది. పేదలను గుర్తించి వారికి కుటుల్టో శిక్షణ తరగతులు నిర్వహించి ఉచితంగా మెషీన్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు శిక్షణ తరగతుల ద్వారా 1,170 మంది మహిళలకు మెషీన్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మరో 370 మందికి త్వరలోనే మెషీన్ల పంపిణీ చేయనుంది. ఐటీఐ విద్యార్థులకు కూడా నైపుణ్యంపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి వారికి కూడా అవసరం మేరకు టూల్స్ పంపిణీ చేశారు. కోల్ ఇండియా సహకారంతో..జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్(వికాస్) సంస్థను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా జహీరాబాద్ ప్రాంతం వారికి మేలు జరగాలని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు స్వయం ఉపాధి మార్గం చూపాలన్న ఉద్దేశ్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సహకారంతో మహిళా సశక్తీకరణ –నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుటుబం పోషణకు మహిళల పాత్ర కీలకమని గ్రహించి వారికి కుట్టులో శిక్షణ ఇప్పించి విలువైన మెషీన్లు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. నియోజకవర్గం అంతటా శిక్షణ తరగతులు జహీరాబాద్ పట్టణంతోపాటు నియోజకవర్గం అంతటా ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క కేంద్రంలో సుమారు 60 మంది వరకు మహిళలకు ట్రైనర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. మూడు నెలల శిక్షణ తర్వాత ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేస్తుంటారు. వికాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్ అధికారులు కూడా పరిశీలించి నిర్వహకులను అభినందించారు. ఉచితంగా 1,170 మెషీన్ల పంపిణీ మరో 370 మెషీన్ల పంపిణీకి సిద్ధం -
ఓటరు వివరాల నమోదు తప్పనిసరి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకుని పటాన్చెరును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, కార్మికులకు ఆదివారం ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుహక్కు చాలా కీలకం అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఇటీవల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న నాయికోటి రాజును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, మెట్టు కు మార్ యాదవ్, బాల్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రె డ్డి, అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, భిక్షపతి, పృథ్వీరా జ్, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
అభివృద్ధి జాడేది?
వట్పల్లి(అందోల్): మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు సరైన ధరలు దక్కేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్యార్డులో సదుపాయాలు కల్పించడానికి మార్కెట్ కమిటీలు పనిచేస్తాయి. దీనిలో భాగంగానే 2024 అక్టోబర్లో వట్పల్లి మార్కెట్యార్డు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. యార్డులో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనుల నిర్వహణపై దృష్టి సారించి పాలకవర్గ సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఆ తర్వాత పాలకవర్గం మరో ఐదు సమావేశాలు నిర్వహించినప్పటికీ అవే సమస్యలు, అవే తీర్మానాలపై చర్చించారు తప్ప కొత్తగా చేసిందేమిలేదని, తీర్మానించిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అడుగుపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి దామోదర మార్కెట్ యార్డు ఆవరణలో పోలీస్స్టేషన్, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి ఖరారు చేయడంతో దీనిపై ఈ నెల 24న పాలకవర్గం సమావేశమై తీర్మానించింది. అలాగే ఇతర అభివృద్ధి పనుల నిర్వహణపై చర్చించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పదవీకాలం మూడు నెలలు మాత్రమే ఉందని.. ఇప్పటికే అభివృద్ధి పనులపై చేసిన తీర్మానాలు అమలుకు నోచుకోలేదని సమావేశానికి ముందు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం అక్టోబర్లో ముగియనుంది. నిధులు మంజూరైనా.. పనులు సున్నా మార్కెట్యార్డు ఆవరణలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.71 లక్షల నిధులను గతేడాది జూలైలో మంజూరు చేసింది. ఆరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.43 లక్షలు, ఆర్వో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్కు రూ. 8 లక్షలు, కంపౌండ్ వాలుకు రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా టెండర్లను కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. బీటలు వారుతున్న కార్యాలయం మార్కెట్ కార్యాలయంలో ఎక్కడ చూసినా బీటలు వారి పెచ్చులూడిన గోడలు కనిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్న్, కార్యదర్శి చాంబర్లో టైల్స్ కుంగిపోయి అధ్వానంగా తయారయ్యాయి. మార్కెట్ కార్యాలయానికి వచ్చేవారు కుంగిన బండలను చూసి కూర్చీలపై కూర్చోకుండా దూరంగా ఉంటున్నారు. విధుల నిర్వహణలో కార్యాలయ సిబ్బంది కూడా పగిలిన టైల్స్, బీటలు వాలిన గోడలను చూసి జంకుతున్నారు. ప్రస్తుతం టైల్స్ రిపేర్ పనులు జరుగుతున్నాయి. తీర్మానాలకే వట్పల్లి మార్కెట్ కమిటీ పరిమితం -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
నారాయణఖేడ్: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణకు వారం రోజులే గడువు ఉన్నందున బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని టీజీఐఐసీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ’సర్’ ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి ఫయీం, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఆదివారం ఖేడ్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీఏల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని బీఎల్ఓలకు ఫారాలు అందజేశారా..? లేదా అనే విషయాన్ని స్వయంగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఇంకా సమర్పించని వారిని గుర్తించి అవసరమైన సహాయం అందించి వెంటనే ఫారాలు అందజేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ సర్ ప్రక్రియను శతశాతం పూర్తిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల -
మార్కెట్కు మొక్కజొన్న కంకులు
జహీరాబాద్ టౌన్: సీజన్ కావడంతో మార్కెట్లోకి మొక్కజొన్న పొత్తులు భారీ వచ్చాయి. జహీరాబాద్ మార్కెట్లో మొక్కజొన్న పొత్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చి కంకులనే అమ్ముకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గిట్టుబాటు ధర లభిస్తుండటంతో అమ్మకాలు, కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడుతోంది. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్లో రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. చెరుకులోనూ అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తుంటారు. గతేడాది కంటే ఈసారి డివిజన్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. జహీరాబాద్,న్యాల్కల్,మొగుడంపల్లి,కోహీర్,ఝరాసంగం తదితర మండలాల్లో రైతులు గతేడాది 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేయగా..ఈ సంవత్సరం సుమారు 10 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించడంతో గిట్టుబాటవుతుందని ఈ పంట సాగుపై మొగ్గు చూపారు. సీజన్ కావడంతో పంట చేతికి వచ్చింది. పట్టణంలోని పశువుల సంత వద్ద గల మార్కెట్లో కంకుల అమ్మకాలు జరుగుతుంటాయి. రైతులు పంటను మార్కెట్కు తీసుకొని రాగా దళారులు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కంకులను క్వింటాలు లెక్కన అమ్ముతుంటారు. ప్రస్తుతం జహీరాబాద్ మార్కెట్లో క్వింటాలు రూ.2,200 వరకు పలుకుతోంది. చిరువ్యాపారులు మార్కెట్లో కొనుగోలు చేసి కాల్చిన ఒక్కో కంకిని రూ.20 అమ్ముతున్నారు. పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా కంకులను కొనుగోలు చేస్తున్నారు. జోరుగా సాగుతున్న అమ్మకాలు పచ్చి కంకులు అమ్మడానికే రైతుల ఆసక్తి -
కొమురవెల్లికి రైలు కూత
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఏళ్లుగా భక్తులు కలలుకంటున్న కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి రైలు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతూ వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. భక్తుల వినతుల మేరకు కొమురవెల్లికి హాల్ట్ రైల్వేస్టేషన్ను కేంద్రం మంజూరు చేసింది. రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వేస్టేషన్ను ఆదివారం(నేడు) కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించి, రైలును స్టేషన్లో నిలుపనున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్గా రైల్వే శాఖ నామకరణం చేసింది. కొమురవెల్లికి రైలు మార్గం రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,160 కోట్లు మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేమార్గంలో భాగంగా సిద్దిపేట వరకు రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ను రూ. 1,160 కోట్ల వ్యయంతో చేపట్టారు. తొలుత కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులకు భక్తులు వినతులు సమర్పించడంతో హాల్ట్ స్టేషన్ను మంజూరు చేశారు. 15 ఫిబ్రవరి 2024న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రయాణం మరింత సులభం ప్రతీ ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, చత్తీస్గడ్, మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ఇప్పటివరకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చిన భక్తులకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి రూ.25లు, సిద్దిపేట నుంచి కొమురవెల్లికి రూ.10 రైల్వే చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు నడుస్తున్న నాలుగు డెమూ రైళ్లను (రెండు అప్..మరో రెండు డౌన్) ప్రతీ రోజు కొమురవెల్లి స్టేషన్లో హాల్ట్ చేయనున్నారు. భక్తుల వినతితో రైల్వేస్టేషన్ ఏర్పాటు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం భక్తులకు ప్రయాణం మరింత సులభం నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
పరిశ్రమలకు నీటి గండం!
ఎల్నినోను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కేవలం మిషన్భగీరథ తాగునీటి సరఫరాకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా పరిశ్రమలకు మిషన్భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని నిలిపివేస్తామని ఆ శాఖ అధికారులు పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. కానీ బీరు ఫ్యాక్టరీలకు మాత్రం ఈ నిలిపివేత నుంచి మినహాయింపునిచ్చారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ప్రాజెక్టుల్లో నీటిని తాగునీటికే పరిమితం చేయాలని నిర్ణయం పరిశ్రమలకు సరఫరా నిలిపి వేస్తామన్న మిషన్ భగీరథ శాఖ బ్రేవరీస్లకు మాత్రం మినహాయింపు..! హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే సింగూరులో ప్రస్తుతం కేవలం 4.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు తాగునీటికి సరఫరా చేసినా ఈ ఏడాది నవంబర్ వరకే సరిపోతాయని మిషన్భగీరథ అధికారులు ప్రకటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు నీటి సరఫరాను నిలిపివేస్తామని ముందస్తు నోటీసులు జారీ చేస్తామని మిషన్భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ రఘువీర్ ఇటీవల జరిగిన సమీక్షలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న సుమారు 17 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఇందులో ఫార్మా, పాలీప్లాస్ట్, ఆగ్రో, ఆటోమొబైల్, మాన్ఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలున్నాయి. వీటికి నిత్యం మిషన్భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతోంది. బీరు ఫ్యాక్టరీలకు ఓకే బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీటి నిలిపివేత నుంచి మినహాయింపునునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో బీరు తయారు చేసే ఫ్యాక్టరీలు ఆరు ఉన్నాయి. రాష్ట్రానికి సరిపడా బీరు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. వీటిలో కొన్ని రెండు ఫ్యాక్టరీలకు హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్క్) నుంచి నీరు సరఫరా అవుతోంది. సింగూరు నుంచి హైదరాబాద్ నగరానికి సరఫరా అయ్యే పైప్లైన్ నుంచి ఈ బీరు ఫ్యాక్టరీలు పైప్లైన్లను అటాచ్ చేసుకుని నీటిని వినియోగించుకుంటున్నాయి. ఒక ఫ్యాక్టరీకి నెలకు తొమ్మిది వేల కేఎల్ (90 లక్షల లీటర్లు) నీటిని సరఫరా అవుతోంది. అయితే ఇతర పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేయాలని మిషన్భగీరథ శాఖ గానీ, ఈ బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీటి సరఫరా నిలిపివేతపై హెచ్ఎండబ్ల్యూఎస్ గానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వలేదని..రానున్న రోజుల్లో నీటి సరఫరా తగ్గే అవకాశాలుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని మౌఖికంగా మాత్రమే చెప్పినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు. మంజీరా డ్యాం వద్ద హెచ్ఎండబ్ల్యూఎస్ తాగునీటి సరఫరా ప్లాంటు ఎల్నినోను ఎదుర్కొనే ముందస్తు చర్యల్లో భాగంగా.. -
యువత చారిత్రక విజయం
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి: దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను, కలలను ఛిద్రం చేసిన నీట్ లీకేజీ కుంభకోణం కేంద్ర ప్రభుత్వ చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును కొందరు దళారులు, అక్రమార్కులు మార్కెట్లో అమ్ముకోవడం మన విద్యా వ్యవస్థకే అతిపెద్ద అవమానమన్నారు. అయితే, ఈ అన్యాయాన్ని మౌనంగా భరించకుండా తమ హక్కుల సాధన కోసం నేటి యువత ఢిల్లీ వీధుల్లోకి వచ్చి చేసిన పోరాటం దేశ చరిత్రలో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. లాఠీ దెబ్బలకు వెనక్కి తగ్గని యువత ధైర్యం దేశానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సంగారెడ్డి క్రైమ్: వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్సై, కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీలోగా అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు నెలకు రూ.1,000 స్టైఫండ్, ఉచిత మెటీరియల్ అందజేస్తామన్నారు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆఫీస్తో పాటు 08455– 277015, 9494390803 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జహీరాబాద్ టౌన్: బుల్లెట్ రైలు ప్రాజెక్టు సహకారం కోసం సీఎం రేవంత్రెడ్డి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, కర్నాటక బీజేపీ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ అన్నారు. శనివారం బీదర్ వెళ్తూ స్థానిక అతిథి హోటల్లో కొద్ది సేపు బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి పార్టీ నాయకులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతం నిమ్జ్ ప్రాజెక్టు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం, జిల్లా మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బుల్లెట్ రైలు స్టాప్ జహీరాబాద్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజల ఆశాంతిగా ఉన్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. పటాన్చెరు టౌన్: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి అధ్యయన కేంద్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. ఇంటర్మీడియెట్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 7 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7382929636 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఫలించిన రాహుల్ పోరాటం
టేక్మాల్(మెదక్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎస్పీ శ్రుతికీర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్స్, ధరల పట్టికలు, రైతులకు బిల్లుల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఓ కోటేశ్వర్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీట్ పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాహుల్గాంధీ చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈసందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోదీ నివాసం ఎదుట రాహుల్గాంధీ ధర్నా చేసిన తర్వాతే ఈ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. మోదీ పాలన 14 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారని.. నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో 14 మంది మెరిట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో విద్యా స్కాం జరిగిందని ఆరోపించారు. రాహుల్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధంగా ఉంటారని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి కుసుమ్కుమార్, తోపాజీ అనంతకిషన్, కూన సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి -
నష్టపోయే వారిని ఆదుకుంటాం
పటాన్చెరు: జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విస్తరణలో ఆస్తులు కోల్పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హామీ ఇచ్చారు. అతి త్వరలో జాతీయ రహదారుల సంస్థ ఈఎన్సీ ధర్మారెడ్డి, కలెక్టర్తో కలిసి రుద్రారంలో సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం గ్రామంలోని వార్డు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రహదారి విస్తరణలో ఎదురయ్యే నష్టాలను గ్రామస్తులు వివరించారు. ఇరువైపులా 50 ఫీట్ల చొప్పున విస్తరణ పనులు చేపడతామని చెప్పి.. నేడు 75 గజాలు నిర్ణయించడం సరికాదన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అతి త్వరలో శాశ్వత పరిష్కారం చూపెడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డీఈ సందీప్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, కౌన్సిలర్లు వెంకటేశ్, రాజు, సందీప్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధీర్రెడ్డి, సిద్ధి వినాయక దేవాలయం కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, రాజు, బలరాం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సంగారెడ్డి టౌన్: పిల్లల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ స్కీంపై శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి సురక్షితమైన, హింస రహితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను నిశితంగా గమనించాలని సూచించారు. బాలలపై జరిగే వేధింపులు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలోని 239 ప్రభుత్వ పాఠశాలలో 239 మంది ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక ఒత్తిడి ప్రవర్తన మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి తల్లిదండ్రులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చైతన్య రెడ్డి, జడ్జిలు, జిల్లా సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర -
ఇక స్మార్ట్గా రేషన్
2006లో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండగా కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. నాడు కుటుంబ సభ్యులు ఫొటోలు, పేర్లు, వయసు, ఇతర వివరాలతో కూడుకొని కార్డులను జారీ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల నవీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో చాలా మంది పాత కార్డులనే వినియోగిస్తూ వచ్చారు. కొత్త కుటుంబాలు ఏర్పడటం, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాలతో కొత్త కార్డుల అవసరం పెరిగింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులు, తొలగింపులు, ఇతర మార్పుల ప్రక్రియ వేగవంతం చేసింది. జిల్లాలో 2,80,409 మంది సభ్యులతో కూడుకొని 69,935 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. ఏటీఎం కార్డు తరహాలో.. నూతనంగా జారీ చేయనున్న రేషన్ కార్డులు క్రెడిట్, డెబిట్కార్డు సైజులో ఏటీఎం కార్డు తరహాలో తయారు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఆకర్షణీయ రూపకల్పనతో పాటు భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించారు. పేపర్ రూపం నుంచి ఎటీఎం కార్డుల తరహాలో రావడం ఇదే తొలిసారి. కార్డుపై ఎడమవైపు సీఎం రేవంత్రెడ్డి, కుడి వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను ముద్రించారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా లబ్ధిదారు వివరాలను వేగంగా గుర్తించే అవకాశం ఉండటంతో రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటివరకు వారు తీసుకున్న సరుకుల వివరాలు కన్పిస్తాయి. రేషన్ దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదంటే కార్డు నంబరు చెప్పి బయోమెట్రిక్ ద్వారా రేషన్ తీసుకోవచ్చు. భవిష్యత్తులో డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడానికి కూడా ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లాలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఏటీఎం కార్డు పరిమాణంలో తయారు చేసిన ఈ కార్డులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. త్వరలో పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. – నారాయణఖేడ్/ సంగారెడ్డి జోన్కార్డుపై క్యూఆర్తో పాటు ఎఫ్ఎస్సీ నంబర్ త్వరలో లబ్ధిదారులకు పంపిణీ ఇప్పటికే జిల్లాకు చేరిన కార్డులు -
రోడ్డుపైనే ఇసుక వ్యాపారం
వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రయాణంలో ఏదేని చిన్న తప్పిదానికి ఎంతోమంది నిండు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన వట్పల్లిలో ఇసుక, సిమెంట్ ఇటుకల తయారీ వ్యాపారులు ఏకంగా రోడ్లపైనే వ్యాపారం సాగిస్తున్నారు. గొర్రెకల్, దేవునూర్ గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రోడ్లపై ఇసుకను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో అటుగీ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు జరిమానాలు విధించే అధికారులు ప్రమాదానికి కారణమయ్యే వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు -
వర్షాలు కురవాలని చర్చిలో ప్రార్థనలు
మెదక్జోన్: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ బిషప్ కమిషనరీ రెవ. జయానంద్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని పరలోక ప్రభువును ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డయాసిస్ సెక్రటరీ దేవ సహాయం, ప్రాపర్టీ కన్వీనర్ మంత్రి సొలోమోన్, చైర్మన్ జార్జి, వైస్ చైర్మన్ దేవదాస్, డయాసిస్ గురువులు ప్రేమ్కుమార్, మెదక్ ప్రెసిమెటరీ ఇన్చార్జి రెవ.శాంతయ్య, చర్చి సెక్రటరీ గెలన్, చిత్తరంజన్, సంపత్, సుశీల్, నోబుల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
పొలంలో పడి యువకుడి మృతి
పుల్కల్(అందోల్): ఎరువులు చల్లడానికి వెళ్లిన యువకుడు ఫిట్స్ (మూర్ఛ వ్యాధి)తో ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కోడూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దబాగు మల్లేశం(31) పొలంలో ఎరువులు చల్లడానికి ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అతనికి మూర్ఛ వ్యాధి రావడంతో పొలంలోనే పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ చూడకపోవడంతో పొలంలో బురదలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. కాగా చాలా సమయం తరువాత చుట్టు ప్రక్కల వారు చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య శివనీల, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. మూర్ఛ వ్యాధితో కూలీ.. హత్నూర( సంగారెడ్డి): మూర్ఛ వ్యాధితో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొన్యాల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(35) రెండు వారాలుగా హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని ఓ వ్యక్తి వ్యవసాయం పొలంలో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజువారి మాదిరిగానే పొలంలో పనిచేయడానికి వెళుతూ యాదగిరి పొలం వద్ద ఒకసారిగా కుప్పకూలాడు. గమనించిన ఇరుగుపొరుగు కూలీలు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యంతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోతుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అమీన్పూర్లో ఇక్రిశాట్ కాలనీ కొన్ని దశాబ్దాల క్రితం వెలసింది. అందులోని ఇళ్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సర్వే నం. 1071, పటేల్గూడలోని 71, ప్రణీత్ కాలనీ, గ్రీన్ ఫీల్డ్ తదితర కాలనీ ప్రజలు తమ ఇళ్లను అమ్ముకునే పరిస్థితి లేదు. – నందారం నర్సింహాగౌడ్, మాజీ వైస్ చైర్మన్ అమీన్పూర్ -
పని సర్దుబాటు సమస్యను పరిష్కరించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు సమస్యను పరిష్కరించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి రోహిణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, అదనపు భారం కారణంగా విద్యాబోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వెంటనే అవసరమైన చోట్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సర్కారు ఉత్తర్వుల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సర్దుబాట్లు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు నర్సింహ రాజు, నాయకులు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ చట్టాలపై అవగాహన
వర్గల్(గజ్వేల్): విద్యార్థులు బడి దాటి, సమాజాన్ని చదువుతామంటూ పోలీస్స్టేషన్ను సందర్శించారు. పాఠ్యపుస్తక విద్యతో పాటు సమాజంపై అవగాహన, చట్టాలపై గౌరవం, పౌర బాధ్యత పెంపొందించాలనే ఉపాధ్యాయుల సూచనల మేరకు శుక్రవారం మండలంలోని తున్కిఖాల్సా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గౌరారం పీఎస్ను చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆరోగ్యం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ప్రజల భద్రత కోసం సేవలు, చట్టాలు, శిక్షలు, నేరాల నియంత్రలో ప్రజల పాత్ర, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలు వివరించారు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగడం, చట్టాలను గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ పర్యటన ద్వారా అవగతమైందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఈ పర్యటన దోహదపడుతుందని హెచ్ఎం పులి రాజు, టీచర్లు మంజులరెడ్డి, రుక్మిణి, జరీనా, ఫర్హిన్, పూజ పేర్కొన్నారు. గౌరారం పీఎస్లో తున్కిఖాల్సా విద్యార్థులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని దుబ్బతండా గ్రామ పరిధిలోని సీతారం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. గ్రామానికి చెందిన భూక్య పద్మ–సమ్మయ్య దంపతులకు ఏకై క కుమారుడు ఆంజనేయులు(17) బైకుపై కట్కూర్ నుంచి మల్లారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో కట్కూర్ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ఇసుక కుప్పను ఢీకొట్టాడు. దీంతో అతడి ముఖానికి తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే హుస్నాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే, అందరితో కలిసిమెలిసి ఉండే ఆంజనేయులు చిన్న వయస్సులోనే మరణించాడన్న వార్త విన్న తండావాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాచేపల్లి ఘటనలో చికిత్స పొందుతూ.. కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండలం బాచేపల్లి వద్ద ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం.. మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్కు చెందిన కుటుంబీకులు హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బాచేపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టగా షమీమ్బేగం(50), అనాబియా తక్షిం(4), మొహ్మద్ నదీమ్(30) మరణించిన విషయం విధితమే. మరో 5 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి సంగారెడ్డి ఆస్పత్రిలో చేరిన మొహ్మద్ నవీద్(32)ను అక్కడి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. చిరాగ్పల్లి ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం.. సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ నెల 13న మండలంలోని సత్వార్ గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా గాయాలయ్యాయి. వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్వార్ పాలనాధికారి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 61849 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. -
వైద్యుల విధులకు ఆటంకం
వ్యక్తి అరెస్టు జహీరాబాద్: విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారి ఫొటోలు తీసి ఇన్స్ట్రాగామ్లో, సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఎం.డి చాంద్పాషను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం బోడపల్లి గ్రామానికి చెందిన చాంద్పాష జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా 12 రోజుల క్రితం అతడు తన భార్యను ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశాడు. సిబ్బంది తగిన వైద్యం అందించినప్పటికీ చాంద్పాష అనవసరంగా వైద్యులను, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, రోగుల ఫొటోలు, వీడియోలు తీస్తూ వారి వ్యక్తిగత జీవితానికి, విధులకు ఆటంకం కల్గించాడు. అంతే కాకుండా వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, రోగులకు మందులు సరిగా ఇవ్వడం లేదని అనవసర వ్యాఖ్యలు చేశాడు. అలాగే తాను ఓ పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అని చెప్పుకుంటూ వైద్యుల వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయమై వైద్యురాలు, ఆర్ఎంఓ ఎం.మానస పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కల్హేర్(నారాయణఖేడ్): వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సిర్గాపూర్ ఎస్ఐ మహేశ్ వివరాలు.. ఖాజాపూర్కు చెందిన వర్ల మహేందర్కు పదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నాగన్పల్లికు చెందిన నాగరాణితో వివాహం జరిగింది. భార్యాభర్తలు కలిసి ఈ నెల 18న పిట్లంలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. నాగరాణి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో మహేందర్ ఒక్కడే ఖాజాపూర్ వచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిన నాగరాణి ఆచూకీ కనిపించకుండా పోయింది. భర్త మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నిషేధం..ఎందుకో?
పటాన్చెరు: అమీన్ఫూర్ బీరంగూడలోని గ్రీన్ఫీల్డ్స్, ప్రణీత్ హోమ్స్, పటేల్ గూడలోని కొన్ని కాలనీల్లో ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. దాదాపు ఆ కాలనీలు కొన్నేళ్ల క్రితం వెలిశాయి. అవి కూడా హుడా, హెచ్ఎండీఏ వెంచర్లే కానీ ఇప్పుడు అవి ప్రభుత్వ జాగాలో ఉన్నట్లు చెబుతున్నారు. పట్టా భూముల్లో వెంచర్లు ఉన్నా.. వాటి ప్రక్కనే ప్రభుత్వ భూమి ఉందని రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నారు. అధికారుల నివేదికల మేరకు ప్రొహిబిటెడ్ జాబితాలో కొన్ని ప్రాంతాలను కొత్తగా చేర్చారని, జిల్లా రెవెన్యూ అధికారులిచ్చిన ఆదేశాల మేరకు ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆపుతున్నామని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి అవి ప్రభుత్వ భూములు కావని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు భూముల్లో వెలసిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల తర్వాత కొర్రిలు పెట్టడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్రయ, విక్రయదారులకు ఇబ్బందులు.. సంగారెడ్డిలోని పటాన్చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో క్రయ, విక్రయదారులు ప్రతి నిత్యం ఆ శాఖ అధికారులతో వాదనలకు దిగుతున్నారు. కొందరైతే గుట్టు చప్పుడు కాకుండా దళారులను పట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగితే కొనుగోలు ప్రక్రియకు చేసిన అగ్రిమెంట్లు, బ్యాంకులోన్కు ఇబ్బందులు వస్తాయని లంచాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసే వీలు లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా ప్రాహిబిటెడ్ జాబితాలో కొత్తగా పాత వెంచర్లను చేర్చడం విడ్డూరం అంటున్నారు. రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు 20ఏళ్ల క్రితం వెలసిన కాలనీవాసులకు తిప్పలు శ్రావణ్ అనే వ్యక్తి దశాబ్దం క్రితం ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేశారు. హెచ్ఎండీఏ అనుమతులతో వెలసిన ఆ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. కాగా బీరంగూడను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇల్లు మంచి రేటుతో అమ్ముడు పోయింది. కానీ అధికారులు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు. మీరు ఉంటున్న కాలనీకి చెందిన భూమి ప్రభుత్వ జాగా అని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి ఎన్ఓసీ తెస్తేనే రిజిస్ట్రేషన్ చేయడం కుదురుతుందన్నారు. దీంతో ఆయన ఖంగు తిన్నాడు. ఇలా ఒక్క శ్రావణే కాదు అమీన్పూర్లోని అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది. -
ప్రకృతి వ్యవసాయంతోనే నేల సారవంతం
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని, దీంతో నేల సారవంతమవడంతో పాటు, పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని కేవీకే హెడ్ సైంటిస్ట్ శంబాజీ దత్తాత్రేయ నల్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తునికిలో యూఎన్డీపీ– బయోపిన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆయన వ్యసాయంపై మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఎంపికై న 10 గ్రామాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అవసరమైన జీవామృతం, పంచగవ్య, అగ్నిఅస్త్రం, దశపర్ణి కషాయం తదితర తయారీని చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియంతోనే పంట దిగుబడి అధికంగా ఉండటంతో పాటు, ఆహార ఉత్పత్తులు నాణ్యతగా ఉంటాయన్నారు. ముఖ్యంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఎఫ్పీఓ ప్రతినిధులు, కేవీకే క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కేవీకే హెడ్ సైంటిస్ట్ శంబాజీ దత్తాత్రేయ నల్కర్ -
108, 102 వాహనాల తనిఖీ
కౌడిపల్లి(నర్సాపూర్): 108, 102 వాహనాలు అన్నిరకాల వసతులతో ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని 108,102 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ కిరణ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన కౌడిపల్లి గల వాహనాల నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన వాహనాల్లో ఉండాల్సిన రికార్డులు, మందుల నిల్వల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర వాహనాలను ఖండిషన్లో ఉండడంతో పాటు, మందులు, చికిత్సకు అవసరమయ్యే ప్రాథమిక వస్తువులను అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజు, శివ, పైలట్ జగన్, నవీన్, కెప్టెన్ నర్సింహులు పాల్గొన్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): పై ఫొటోలో ప్రశాంతంగా ఉన్న గేదెలను చూసి, ఏదో గేదెల పాక అనుకునేరు. కానే కాదు.. అది క్రీడా పాంగణం. గత ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన క్రీడా ప్రాంగణాలు ప్రస్తుతం కనుమరుగయ్యేలా ఉన్నాయి. చిలప్చెడ్ మండలం అంతారం గ్రామంలో గల క్రీడా ప్రాంగణం గేదెల నివాసానికి, ఆవాసంగా మారింది. కంది(సంగారెడ్డి): ఓ కేసులో శిక్ష పడుతుందనే భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఏర్దనూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. పెద్ద నూరుకు చెందిన నవీన్ కుమార్(27) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2022లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మృతుడిపై పోక్సో కేసు నమోదైంది. కొంతకాలంగా వాయిదాలకు కూడా పోవడం లేదు. తనపై ఉన్న కేసులో శిక్ష పడుతుందేమోనన్న భయంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం మద్దూరు(హుస్నాబాద్): భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన దూల్మిట్ట మండలంలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన కొలిపాక యాదగిరి(52)అనే రైతు తన పేరుపై ఉన్న నాలుగెకరాల భూమిని తన తల్లి పోచమ్మ తిరిగి తన పేరుపై మార్పించుకుంది. కాగా అందులోని కొంత భూమిని తన ముగ్గురు కుమారైల పేర్లపై బదిలీ చేసింది. దీంతో యాదగిరికి, అక్కాచెల్లెళ్లతో గొడవలు జరుగుతుండడంతో ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన యాదగిరి మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యాదగిరిని చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తలిరంచారు. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు నడుం బిగించారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ శంకర్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండలానికి చెందిన నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు 2025లో పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర స్థాయి పురస్కారం లభించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రామకృష్ణ, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ టోర్నీకి జట్లు సిద్ధం
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా మూడు రోజులపాటు కొనసాగిన ఫుట్బాల్ రీజినల్ సెలక్షన్ ట్రయల్స్ శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. నవోదయ జాతీయస్థాయి టోర్నీలో పోటీ కోసం కేటగిరీల వారీగా జట్ల ఎంపిక సంపూర్ణమైంది. తెలంగాణ, ఏపీ, కేరళ, కర్నాటక, పాండిచ్చేరిలోని 26 నవోదయ విద్యాలయాల నుంచి 151 మంది బాలురు, 28 మంది బాలికలు సెలక్షన్ ట్రయల్స్కు తరలివచ్చారు. కేటగిరీల వారీగా హైదరాబాద్ రీజియన్ నుంచి జాతీయ టోర్నీకి ఎంపికై న బాలబాలికలకు ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. వచ్చే నెలలో అస్సాంలో జరిగే జాతీయ టోర్నీలో హైదరాబాద్ రీజియన్కు ఈ జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. ముగింపు వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరింపజేశాయి. వర్గల్ నవోదయ నుంచి 16 మంది సెలక్షన్ ట్రయల్స్ ద్వారా ఆతిథ్య వర్గల్ నవోదయ విద్యాలయం నుంచి జాతీయ టోర్నీకి ఆరుగురు బాలురు, 10 మంది బాలికలు ఎంపికయ్యారు. అండర్ –17లో రిషిక, శృతిక, మనస్వి, ఆశ్రిత, సంజన, అండర్ –19లో సోమ సంహిత, ఎం.నిత్యశ్రీ, సీహెచ్ శ్రీవల్లి, వీ.విజయ ఉన్నారు. బాలుర అండర్ –14లో శివతేజ్గౌడ్, జిలాని, శ్రేయన్, వి.కార్తీక్, అండర్ –17లో జోయల్ సుబోధ్, వరుణ్తేజ్ ఎంపికయ్యారు. మూడు కేటగిరీలుగా జట్ల ఎంపిక అండర్ –14, 17, 19 కేటగిరీలుగా ప్రత్యేక కోచ్ల బృందం బాలబాలికలకు ట్రయల్స్ నిర్వహించారు. ఆటలో వారి ప్రావీణ్యాన్ని అన్ని కోణాల్లో పరిశీలించారు. మెరికలైన క్రీడాకారులతో అండర్ – 14, 17, 19 బాలుర జట్లు, అండర్ –17, 19 బాలికల జట్లను ఎంపిక చేశారు. వచ్చే నెలలో జరిగే టోర్నీలో హైదరాబాద్ రీజియన్కు ప్రాతినిధ్యం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు -
చెరుకు పంటకు బోనస్ ఇవ్వాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరి పండించిన రైతులకు ఇస్తున్న విధంగానే చెరుకు సాగు చేస్తున్న రైతులకు కూడా బోనస్ ఇచ్చి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ముబీన్ అధ్యక్షతన గురువారం చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చెరకు పంటను సాగు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు. వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లుగానే చెరుకు పంటకు టన్నుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒక మారు రైతులకు ఉచితంగా విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరుకు పంటకు అధికంగా అవరమయ్యే మినీ ట్రాక్టర్లను సబ్సిడీపై అందించాలని కోరారు. చెరుకుసాగు వల్ల ప్రభుత్వానికి పలు విధాలుగా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెరుకు కోత యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సహాయం అందించాలని, అవసరం మేరకు డ్రిప్ పరికరాలు అందజేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త విజయ్కుమార్ దిగుబడులపై ఎల్ నినో ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించారు. సమావేశంలో స్టేట్ షుగర్ ఇండస్ట్రీ డివిజినల్ కమిటీ సభ్యుడు గడీల రాంరెడ్డి, రాయికోడ్ సీడీసీ చైర్మన్ ముబీన్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీడీసీ సమావేశంలో రైతుల డిమాండ్ -
వేతనాలు ఒకటో తేదీన చెల్లించేలా చూస్తా..
హత్నూర(సంగారెడ్డి): మిషన్ భగీరథ తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులందరికీ ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. హత్నూర మండలం బోరపట్ల గ్రామ శివారులోని మిషన్ భగీరథ పంపుహౌస్ను గురువారం ఆయన పరిశీలించారు. కాంట్రాక్ట్ కార్మికులతో మాట్లాడి వేతనాలపై ఆరా తీశారు. ఎప్పుడు అందుతున్నాయోనని అడిగి తెలుసుకున్నారు. తమకు ఏడు నెలల నుంచి వేతనాలు రావడం లేదని పంపు లైన్మాన్లు ఆయన వద్ద వాపోయారు. పంపుహౌస్లో పనిచేస్తున్న కొంత మందికి కూడా సక్రమంగా జీతాలు అందడం లేదని ఏకరువు పెట్టారు. దీంతో ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీ నాటికి వేతనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో 983 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలతోనే కాంటాక్ట్ కార్మికులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. ఆరుతడి పంటలే మేలు ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చే ఏడాది జూన్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపాలని అదనపు కలెక్టర్ పాండు రైతులకు సూచించారు. వర్షపాతం లేకపోతే వరి సాగుచేసే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. జలసిరి పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకంతో గ్రామాలలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో పామ్ పాండ్, ప్రతి గ్రామంలో ఊరకుంట నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టి కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. రైతులు వరి వేస్తే నష్టపోచి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ బాలరాజ్, మిషన్ భగీరథ ఈఈ నాగభూషణం, డీఈ భరత్, ప్రవీణ్, ఏఈలు సురేశ్, శివ, మిషన్ భగీరథ కార్మికులు పాల్గొన్నారు. టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి నారాయణఖేడ్: టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చక్కటి బోధన అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు ఉపాధ్యాయులకు సూచించారు. డీఆర్డీఓ బాలరాజుతో కలిసి గురువారం నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. బోధన, పాఠ్యాంశాల అవగాహన, విద్యార్థుల అభ్యాసన స్థాయిపై ఆరా తీశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలో పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ నిర్వహణపై ఆధికారులకు సూచనలు చేశారు. కార్యాలయాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఎంపీడీఓ సంగ్రాం, ఎంపీఓ సురేశ్, సర్పంచ్ కావ్యరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు రాధాకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుల జీతాలపై ఆరా అదనపు కలెక్టర్ పాండు -
వైద్యరత్న అవార్డుకు హేమరాజ్సింగ్ ఎంపిక
దుబ్బాక: ప్రజలకు అంకిత భావంతో వైద్య సేవలందిస్తున్న దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్సింగ్ ప్రతిష్టాత్మక వైద్యరత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ విష్ణు, గుర్రాల శ్రీనివాస్, కుంబాల రవీందర్ ఆధ్వర్యంలో హేమరాజ్సింగ్ పేరును ఖరారు చేశారు. 26న బీఎస్ఏ 19వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ డాక్టర్ హేమరాజ్సింగ్కు ఆ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సదస్సుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 600 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారని వారు తెలిపారు. నేషనల్ అవార్డుకు ఎంపిక కావడంపై హేమరాజ్సింగ్ను ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అభినందించారు. -
ఉద్యమకారులకు న్యాయం చేస్తాం
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కోదండరాం దుబ్బాక: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్నివిధాలుగా సముచిత న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గంలోని 280 మంది ఉద్యమకారుల ఎఫ్ఐఆర్లను గురువారం ఆయన అద్దంకి దయాకర్ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం పాత్ర కీలకమైనదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మిక, కర్షకులతోపాటు ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్ర పోలిట్బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, పీఏసీఎస్ వైస్ చైర్మన్, నియోజకవర్గ మాల మహానాడు ఇన్చార్జి కాల్వ నరేశ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: కేవలం 22 రోజుల్లో 142 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.21.84 లక్షల ఉంటుందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,038 ఫోన్ల రికవరీచేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్స్టేషన్లో ప్రత్యేక కానిస్టేబుల్ను నియమించామని తెలిపారు. ఫోన్ల రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, సీఐలు జార్జ్, రాజశేఖర్రెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది విజయ్, మహేందర్, వెంకట్గౌడ్, సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డిటౌన్: నిందితుల చేతికి వేయాల్సిన బేడీలను గేటుకు వేయడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. శిక్షపడిన ఖైదీలను తరలించేటప్పుడు వారు పారిపోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జిల్లా కేంద్రంలోని రూరల్పోలీస్ స్టేషన్ గేటుకు తాళానికి బదులు బేడీలను ఉపయోగించారు. దీంతో పలు విమర్శలు వచ్చాయి. రూరల్ పోలీసులను వివరణ కోరగా హైదరాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ఇతరులు చాలా మంది తమ వాహనాలను పోలీస్ స్టేషన్లో పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తాళం పట్టకపోవడంతో ఓ కానిస్టేబుల్ పొరపాటుగా గేటుకు బేడీలు వేశారని, వెంటనే అప్రమత్తమై తొలగించామని చెప్పారు. నారాయణఖేడ్: కేరళకు చెందిన జాతీయ గ్రామీ ణాభివృద్ధి సంస్థకు చెందిన ప్రతినిధులు స్వయం సహాయక బృందాల పనితీరును పరిశీలించారు. కేరళకు చెందిన చెమ్మగం, సురేశ్కుమార్, సంధ్య, జీనా, ఇందులేఖతోపాటు ఎన్ఐఆర్డీ బృందం మండలంలోని వెంకటాపూర్తండాను సందర్శించింది. తండాలోని రామసీతా స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి మేకలు, కోళ్లు, గొర్రెలు కొనుగోలుచేసి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకున్నారు. పలు విషయాలను పరిశీలించారు. స్వయం సహాయక బృందాలు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా చేస్తున్నఽ ధాన్యం సేకరణ, కుసుమ, పల్లి విక్రయాలు, పప్పుధాన్యాలను కొనుగోలు చేసి లాభాలు పొందడంపై ఆరా తీశారు. అనంతరం ఖేడ్ ఐకేపీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులతో సమావేశమయ్యారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మల్లేశం, సభ్యులు కిరణ్, ఏపీఎం సాయిలు, రామారావు, రాజు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి అదృశ్యం
పటాన్చెరుటౌన్: తల్లీకుమారుడు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్కు చెందిన వీరేశానికి తన భార్య స్వాతితో 15న గొడవ జరిగింది. దీంతో స్వాతి మూడేళ్ల కుమారుడు విరాజ్ను తీసుకొని ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గీతం విద్యార్థిని.. హాస్టల్లో ఉండే ఓ విద్యార్థిని ఔటింగ్కని వెళ్లి అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్నగర్కు చెందిన విద్యార్థిని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం కాలేజ్ హాస్టల్ నుంచి ఔటింగ్కి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో హైదర్నగర్ నుంచి కుటుంబ సభ్యులు రుద్రారం హాస్టల్కు వచ్చి తెలుసుకోగా బుధవారం సాయంత్రం ఏడున్నర సమయంలో ఔటింగ్కి వెళ్లినట్టు రిజిస్టర్లో రాసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తండ్రి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రీజినల్ జట్టులో స్థానమే లక్ష్యంగా..
వర్గల్(గజ్వేల్): దూసుకొచ్చిన ‘బంతి’ని కాళ్లతో నియంత్రిస్తూ.. ప్రత్యర్థికి చిక్కకుండా గోల్పోస్టు వైపు పరుగులు తీస్తూ.. రీజినల్ జట్టులో స్థానమే లక్ష్యంగా క్రీడాకారులు చెలరేగారు. ఫుట్బాల్ విన్యాసాలతో ఆహూతులను అలరిస్తూ తుదిజట్టులో చోటు కోసం పోటీపడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా గురువారం రెండోరోజు రీజియన్ జట్ల ఎంపిక కోసం నిర్వహించిన క్రీడానైపుణ్య ప్రదర్శన పోటీలు అందరినీ అలరించాయి. బాల్ పాసింగ్, ఫార్వర్డ్ బ్లాక్, సెంటర్ ఫార్వర్డ్, గోల్ కీపింగ్, ఫ్లయింగ్ కిక్, కార్నర్ కిక్ తదితర అంశాలు, అందుకు సరైన ఆటగాళ్ల ఎంపిక లక్ష్యంగా కోచ్లు ఆటతీరును పరిశీలించారు. ఐదు జట్లుగా ఎంపికలు ఐదురాష్ట్రాల నవోదయ క్రీడాకారులు పాల్గొన్న ఈ సెలెక్షన్ మీట్లో బాలురకు అండర్ 14, 17, 19; బాలికలకు అండర్ 17, 19 కేటగిరీలుగా జట్ల ఎంపిక పరీక్షను కోచ్లు నిర్వహించారు. ఫుట్బాల్ స్టేడియంలో క్రీడాకారుల విన్యాసాలు పరిశీలిస్తూ మెరికలతో కూడిన జాబితా సిద్ధం చేశారు. కేటగిరీల వారీగా అయిదు జట్ల వివరాలను తుది పరిశీలన అనంతరం వెల్లడిస్తామని, శుక్రవారం రీజినల్ సెలెక్షన్ మీట్ ముగింపు కార్యక్రమం ఉంటుందని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. పోటాపోటీగా ఫుట్బాల్ నైపుణ్య ప్రదర్శన నవోదయలో ఉత్సాహంగా సెలెక్షన్ మీట్ ఆకట్టుకున్న హరియాణ నృత్యం వర్గల్(గజ్వేల్): రీజినల్ ఫుట్బాల్ సెలెక్షన్స్ మీట్ సందర్భంగా వర్గల్ నవోదయలో గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హర్యానా విద్యార్థినుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
కాపాడుకుంటే మేలు
రైతు నేస్తాలు..మిరుదొడ్డి(దుబ్బాక): వ్యవసాయ సాగుబడిలో చీడపీడల బెడద ఎక్కువైతే పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. పంటలను ఆశించి నష్టపరిచే పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఎడాపెడా రసాయన ఎరువులను వాడటం వల్ల రైతులకు మేలుచేసే మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగైపోతున్నాయి. ఇవి పంటలకు కీడుచేసే పురుగులను తిని పంటల దిగుబడిని పెంచడంలో సాయపడతాయి. పంట పొలాలల్లో ఇటువంటి మిత్ర పురుగులు, పక్షులను సంక్షిరక్షిస్తేనే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. పర్యావరణ, సమతుల్యాన్ని కాపాడటంలో సహజమైన మిత్రపురుగులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అవన్నీ రైతులకు నేస్తాలు. మిత్ర పురుగులతోనే అధిక దిగుబడులు పంటలకు మేలుచేసే అక్షింతల పురుగులు(లేడీబర్డ్ బీటిల్), మిడతలు, తూనీగలు, సాలె పురుగులు, పిచ్చుకలు, కొంగలు, కాకులు, మైనాలు, కొంగలు, కోయిలలు, వానపాములు, కప్పలు, పెంకు పురుగులు, ఆరుద్ర పురుగులు రైతులకు అసలైన నేస్తాలుగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని భూసారాన్ని పెంపొందిస్తే, మరికొన్ని పంటలకు నష్టాలను కలిగించే పురుగులను తిని పంటల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. కానీ రైతులు అధిక దిగుబడులను ఆశించి మోతాదుకు మించిన రసాయన ఎరువులను వినియోగించడం వల్ల మేలుచేసే మిత్రపురుగులు అంతరించిపోతున్నాయని వ్యవసాయ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం మేరకే సాయన ఎరువులను వినియోగించి మిత్ర పురుగులను కాపాడుకొంటేనే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు. కానరాని పశు సంపద వ్యవసాయరంగంలో యాంత్రిక విప్లవం రావడంతో కాలక్రమేణా పశుసంపద కానరాకుండా పోయింది. దున్నుకం మొదలుకొని, పంటకోసి విక్రయించే వరకు రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. ఒకనాడు తొలకరి పలకరింపుతో పశువులతోనే వ్యవసాయం ప్రారంభమయ్యేది. దిగుబడి రాశులను ఎడ్లబళ్లపై ఇళ్లకు చేర్చుకునేవారు. పశువుల ఎరువులతో అధిక దిగుబడి సాధించేవారు. కాలక్రమేణా యాంత్రిక వ్యవసాయానికి అలవాటు పడ్డ రైతులకు పశువుల అవసరం లేకుండా పోయింది. దీంతో పశు సంపద కనుమరుగైంది.వ్యవసాయంలో మితిమీరిన రసాయన మందుల వినియోగం. ఆవాసాలు దెబ్బతినడం, నగరీకరణ వల్ల రైతులకు మేలుచేసే మిత్ర పురుగులు, పక్షులు వేగంగా కనుమరుగైపోతున్నాయి. పకృతి సమతుల్యతను కాపాడటం, పెట్టుబడిలేని ఉచిత సస్యరక్షణ అందించడం, అధిక దిగుబడులు సాధించడంలో వీటిపాత్ర ఎంతో కీలకం. ఈ రైతు నేస్తాలను కాపాడుకోవడం చాలా అవసరంపంటలకు మేలు చేస్తున్న రైతు నేస్తాలను తప్పనిసరిగా కాపాడుకోవాలి. వ్యవసాయరంగంలో ముఖ్య భూమిక పోషించే పశుసంపద కనుమరుగవడంతో రైతులు సేంద్రియ ఎరువులకు దూరమయ్యారు. అలాగే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అంతేకాక చీడపీడలను వదిలించుకోడానికి రకరకాల పురుగుల మందులను వాడుతుండటంతో రైతు నేస్తాలైన సూక్ష్మజీవులు, పక్షులు, పశువులు కనుమరుగవుతున్నాయి. అనవసర పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి పంటకు మేలుచేసే బదనికలు, పరాన్న జీవులు, పక్షులను కాపాడుకోవాలి. – ప్రశాంత్ ఏఈఓ, మిరుదొడ్డి -
నాచారం ఆలయం వద్ద బాల్యవివాహం
వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం నాచారం ఆలయం వద్ద గురువారం బాల్యవివాహం చేసుకున్న వారిని గుర్తించి యాదాద్రి భువనగిరి సీడబ్ల్యూసీకి అప్పగించినట్లు బాల్యవివాహ నిరోధక అధికారులు(సీఎంపీఓ) తెలిపారు. నాచారం గుట్ట అవుట్పోస్టు పోలీస్స్టేషన్ వద్ద సీఎంపీఓ అధికారులు రాజు, గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన రెండు కుటుంబాలు నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బాల్యవివాహం జరుపుతున్నట్లు చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందింది. వెంటనే బాల్య వివాహ నిరోధక అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ హెల్ప్లైన్(1098) సిబ్బంది అక్కడికి చేరుకుని బాల్యవివాహంపై ఆరా తీశారు. వారు చేరుకునేలోపే బాల్య వివాహం జరిగినట్లు గుర్తించారు. వధూవరులు 18 సంవత్సరాల లోపు బాలబాలికలే అని నిర్ధారించారు. అనంతరం వారిని జిల్లా బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపరిచారు. వారి ఆదేశాల మేరకు భద్రత, రక్షణ, తదుపరి సంరక్షణ కోసం సంబంధిత యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంక్షేమ సమితికి బదిలీ చేసి వారిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాలల బంగారు భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అధికారుల విచారణ యాదాద్రి భువనగిరి సీడబ్ల్యూసీకి అప్పగింత -
మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు గరువారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చల్మెడ గ్రామానికి చెందిన అలకుంట వెంకవ్వ(65) గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుంది. భర్త రెండేళ్ల క్రితం మరణించడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో బాధపడుతోంది. గతంలో కూడా ఆమె రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మృతురాలి కుమారుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మరో ఘటనలో భర్త.. మిరుదొడ్డి(దుబ్బాక): తన భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీశ్ గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్(చెక్క రవి)(40) ఇదే గ్రామానికి చెందిన ఫర్జానా బేగంను వివాహం చేసుకున్నాడు. మతాలు వేరు కావడంతో రవి ముస్లింగా కన్వెర్టయి అబ్దుల్ రెహమాన్గా పేరు మార్చుకున్నాడు. వారికి 15 సంవత్సరాలలోపు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు కొంత కాలంగా సిద్దిపేటలోని కేసీఆర్నగర్ డబుల్బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20న అబ్దుల్ రెహమాన్ తన భార్యపై దాడిచేశాడు. దీంతో ఆమె సిద్దిపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన భర్త తన స్వగ్రామమైన మిరుదొడ్డికి చేరుకుని గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నవోదయలో ఫుట్బాల్ సెలెక్షన్స్ మీట్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా ఫుట్బాల్ రీజినల్ సెలెక్షన్స్ మీట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్ టోర్నమెంట్ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్ మీట్ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్ సక్సెస్కు అందరూ సహకరించాలని కోరారు. వైస్ప్రిన్సిపాల్ మోహన్రాథోర్, సెలెక్షన్ కోచ్లు, ఎస్కార్ట్ టీచర్లు, వ్యాయామోపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు పాల్గొన్నారు. భయపెట్టిన వర్షం..మూడు గంటలు ఆలస్యం సెలెక్షన్ మీట్ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్ నిర్వహించారు. రీజియన్ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫోకస్గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి. -
గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలి
నేడు మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హుస్నాబాద్: ఎల్నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హై మావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు. రోజంతా ముసురు సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభమైంది. రోజంతా ముసురు పట్టడంతో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు రైతులు మాత్రం ఆనందంతో పొలాల్లో తమ పనుల్లో బిజీగా కనిపించారు. వర్షాలు ఇలాగే కురిస్తే చెరువులు, కుంటలు నిండి పంటలు పండుతాయని, అటు పశువులకు గడ్డి సైతం దొరుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. సర్కు సహకరించండి వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్, ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘వృద్ధులను వేధిస్తే చర్యలు’ -
ట్రాఫిక్ పీఎస్ను మంజూరు చేయండి
జహీరాబాద్: జహీరాబాద్కు నూతన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మాణిక్రావు డీజీపీ సీవీ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోందని, దీంతో జనాభా భారీగా పెరుగుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా పరిశ్రమలు, విద్యాసంస్థలు వెలుస్తున్నాయని, ప్రజా రవాణా వాహనాల రద్దీ సైతం పెరిగిందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా టౌన్ పోలీస్స్టేషన్ను అప్గ్రేడ్ చేయడంతో పాటు ట్రాఫిక్ను నియంత్రించాలని కోరారు. సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.డీజీపీ సీవీ ఆనంద్కు ఎమ్మెల్యే మాణిక్రావు వినతి -
ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నారాయణఖేడ్: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డ నిందితుడిని ఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై శ్రీశైలం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఖేడ్ నియోజకవర్గంతో పాటు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పిట్లం, నసురుల్లాబాద్, పాపన్నపేట ప్రాంతాల్లో 10 రోజుల్లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఖేడ్ ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది యాదుల్, ముజమ్మిల్, హరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ బృందం చోరీలను ఛేదించింది. కాగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబోజీగూడకు చెందిన దుర్గాప్రసాద్ బైకులను చోరీ చేసినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 16 చోరీ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా కేసును ఛేదించిన ప్రత్యేక బృందాన్ని సీఐ అభినందించారు. సంగాపూర్ ఆభరణాల చోరీ కేసులో.. రాయికోడ్(అందోల్): తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ చైతన్యకిరణ్ కథనం మేరకు.. ఈ నెల 18న మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన కే.నగేశ్ ఇంట్లో దొంగతనం జరిగింది. పగటిఫూట ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల పట్ట గొలుసులు, రూ.25 వేల విలువైన ఫోన్ను ఎత్తుకెళ్లారు. ఇంటికి చేరుకున్న నగేశ్ దంపతులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో గ్రామానికి చెందిన ఎం.బసవరాజ్ను బుధవారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ చోరీ నిందితుడి అరెస్టు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నర్సాపూర్ రూరల్: పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని మల్లారెడ్డి అగ్రికల్చర్ సైన్స్ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యవసాయంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలు, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయంపై అవగాహన కల్పించి తల్లిదండ్రులకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు, గ్రామస్తులు , పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


