నడుచుకుంటూ వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

నడుచుకుంటూ వెళ్తుండగా..

Dec 27 2025 9:50 AM | Updated on Dec 27 2025 9:50 AM

నడుచుకుంటూ వెళ్తుండగా..

నడుచుకుంటూ వెళ్తుండగా..

సంగారెడ్డి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన పుల్కల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విశ్వజన్‌ వివరాల ప్రకారం... మహారాష్ట్ర , నాందేడ్‌కు చెందిన కరీం(49) గురువారం ఉదయం 4గంటల సమయంలో జోగిపేట్‌ నుంచి హైదరాబాద్‌కు బొలెరో వాహనంలో బయలుదేరాడు. స్థానిక శివ్వంపేట్‌ గ్రామ పరిధిలో కంటైనర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంసాగర్‌ మండలం జక్కాపూర్‌ గ్రామానికి చెందిన విట్టల్‌ (26) శుక్రవారం ఉదయం ఇస్నాపూర్‌ నుంచి తన సొంత గ్రామమైన జక్కాపూర్‌కు బైక్‌పై బయలుదేరాడు. చౌటకూరు మండలం శివంపేట శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హత్నూర( సంగారెడ్డి): ద్విచక్ర వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుండ్ల మాచునూర్‌ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన హరే రామ్‌ సర్దార్‌ (44) కొంతకాలంగా కోవలెంట్‌ లేబరేటరీస్‌ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి పరిశ్రమ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి కార్మికులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

రెండు బైకులు ఢీకొని వ్యక్తి..

నర్సాపూర్‌ రూరల్‌: రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి నర్సాపూర్‌ – మెదక్‌ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట సమీపంలో చోటు చేసుకుది. ఎస్సై రంజిత్‌ రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్‌కు చెందిన బంటారం భద్రప్ప (70) టీవీఎస్‌ మోటార్‌పై నర్సాపూర్‌ వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్‌ బైక్‌ ఢీకొట్టింది. దీంతో భద్రప్పకు తీవ్ర గాయాలు కాగా అంబులెనన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అతడు మిర్చి బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతునికి భార్య శంకరమ్మ ఉంది.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు..

మరో ఘటనలో...

బైక్‌ ఢీకొని కార్మికుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement