క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట

Dec 24 2025 10:54 AM | Updated on Dec 24 2025 10:54 AM

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట

క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట

ఎంపీ సురేష్‌ షెట్కార్‌

జహీరాబాద్‌ టౌన్‌: క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం పట్టణంలోని పస్తాపూర్‌ వద్ద గల ఫంక్షన్‌హాలులో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజౖరైన జహీరాబాద్‌ ఎంపీ.సురేష్‌ షెట్కార్‌ క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్‌ నియోజవకర్గంలోని 50 చర్చిల మరమ్మతులకు రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో భవనాలకు రంగులు వేయడం, డిజిటల్‌ లైటింగ్‌, అలంకరణ తదితర పనులు చేపడుతారన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ దేవూజా, తహసీల్దార్‌ దశరథ్‌, కోహీర్‌ తహసీల్దార్‌ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement