పరిశ్రమలో డ్రగ్‌ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలో డ్రగ్‌ అధికారుల దాడులు

Dec 25 2025 10:12 AM | Updated on Dec 25 2025 10:12 AM

పరిశ్రమలో డ్రగ్‌ అధికారుల దాడులు

పరిశ్రమలో డ్రగ్‌ అధికారుల దాడులు

పటాన్‌చెరు టౌన్‌: మెడిబ్లూ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో డ్రగ్‌ అధికారుల దాడులు నిర్వహించి, రూ. 1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్‌ చేశారు. ఈ సంఘటన అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైస్‌ పార్క్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు పరిశ్రమలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరిశ్రమలో అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... వైద్య పరికరాల నిబంధనల ప్రకారం మెడికల్‌ డివైజెస్‌ మ్యాన్‌ ఫ్యాక్చరింగ్‌ లైసెన్స్‌ కింద తయారు చేయాలన్నారు.అనుమతి లేకుండా వైద్య పరికరాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో బొల్లారం డ్రగ్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, జిన్నారం డ్రగ్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, పాశమైలారం ఇనన్‌స్పెక్టర్‌ వరప్రసాద్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రూ.1.70 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement