కూల్చడం తప్ప.. కట్టడం తెలియదు
సర్కార్పై ఎమ్మెల్యే మాణిక్రావు ధ్వజం
జహీరాబాద్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్కు చెందిన బేగరి రాములుకు ఎమ్మెల్యే కె.మాణిక్రావు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. రాములుకు సంబంధించిన రేకుల ఇంటిని కూల్చి వేయించడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద బాధితుడికి ఆర్థిక సహాయం అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే ఇంటిని కూల్చివేయించారని, కాంగ్రెస్ నాయకులకు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. బాధిత కుటుంబానికి నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, భూమయ్య, మచ్చేందర్, రవికిరణ్, రాజశేఖర్, సంపత్, నర్సింహులు పాల్గొన్నారు.


