కరకగూడెం: మండలంలోని వెంకటాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఈ మేరకు సర్పంచ్ చౌలం కేశవరావు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా రూ.25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్రమ విక్రయాల సమాచారం అందించిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. అనంతరం ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో తీర్మాన ప్రతిని అందజేశారు.
వెంకటాపురం గ్రామస్తుల తీర్మానం


