Bhadradri District News
-
మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి తుమ్మల, వివిధ పార్టీల నేతలు ● పాడె మోసిన ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన మృతదేహాన్ని మంగళవారం ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకురాగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఈర్లపుడికి తరలించగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తదితరులు పాడె మోశారు. అలాగే, ఇల్లెందు, జనగామ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తుళ్లూరి బ్రహ్మయ్య, రాంరెడ్డి గోపాల్రెడ్డి, ఏనుగుల రాకేశ్రెడ్డి, దిండిగల రాజేందర్, బెల్లయ్యనాయక్, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, బచ్చు విజయ్కుమార్, అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, గుత్తా రవి, మెంటెం రామారావు, పిన్ని కోటేశ్వరరావు, చెరుకూరి ప్రదీప్, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, మానుకొండ రాధాకిశోర్ తదితరులు సైతం మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బుధవారం మోటార్సైకిల్ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడులోని గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలికలు)లో వంటమనిషిగా పనిచేస్తున్న కుర్సం జానకమ్మ(51) తమ బంధువు మోటార్సైకిల్పై బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు వస్తోంది. ఈ క్రమంలో గౌతమిపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెనుక కూర్చున్న జానకమ్మ తారురోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న బంధువుకు, మధ్యలో కూర్చున్న ఆమె మనవడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్లోని వీఆర్పురం మండలవాసి కాగా, ఉద్యోగరీత్యా బూర్గంపాడులో ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఎనిమిది మంది మాటేంటి..?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా పాక్షిక పరిహారం తీసుకున్న చిరు వ్యాపారులు, భూ యజమానులు దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేశారు. దీంతో రెవెన్యూ అఽధికారులు బుధవారం ఆ ఇళ్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రామాలయానికి వచ్చే భక్తుల రద్దీ, స్థానికుల రాకపోకలు అధికంగా సాగుతుండడంతో రాత్రి వేళల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా పరిహారం తీసుకున్న వారు ఖాళీ చేసినా, తీసుకునేందుకు విముఖత చూపిన ఎనిమిది మంది ఇళ్ల తొలగింపు, స్వాధీనంపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ఆ భవనాల్లో అద్దెకు దుకాణాలను నిర్వహిస్తున్న వారు దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ చొరవ చూపితేనే.. మాడ వీధుల విస్తరణలో ఆలయం చుట్టుపక్కల 40 ఇళ్లను తొలగించాలని దేవస్థానం, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందుకు 32 మంది అంగీకరించగా.. అధికారులు మూడో వంతు నష్టపరిహారం కూడా అందజేశారు. మిగితా మొత్వం ఇళ్లు ఖాళీ చేశాక ఇచ్చేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో వారంతా ఇళ్లు, షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ఎనిమిది మంది మాత్రం ప్రభుత్వ నష్ట పరిహారం సరిపోవడం లేదంటూ స్వీకరణకు విముఖత చూపారు. గతంలో సైతం ఆలయ విస్తరణ సమయంలో ఒప్పుకోని ఇద్దరితో పాటు మరో ఆరుగురు ఈసారి కూడా ముందుకురాలేదు. పరిహారం పెంచితేనే ఖాళీ చేస్తామంటూ భీష్మించారు. దీంతో ఆ ఎనిమిది ఇళ్ల తొలగింపు అడ్డుగా మారింది. పడమర మెట్లకు ఎదురుగా కొన్ని, దక్షిణం వైపున కొన్ని ఇళ్లు అలాగే ఉండిపోనున్నాయి. దీనిపై కలెక్టర్ చొరవ చూపితేనే రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ హామీ ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఖాళీ చేసిన భూ యజమానులకు బ్రిడ్జి సెంటర్లో ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గతంలోనే ఆ స్థలాన్ని చదును చేశామని, త్వరలోనే లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు అప్పగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టడమే తప్పా.. ప్రభుత్వంపై నమ్మకంతో, అధికారులు ఇచ్చిన నష్టపరిహారం తీసుకున్న చిరువ్యాపారులు, దుకాణ యజమానులు ఇప్పుడు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలువులు పూర్తికాకపోవడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు ఉన్నప్పటికీ హనుమాన్ జయంతి అనంతరం ఖాళీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం స్థలాలను అప్పగించారు. అయితే పరిహారం తీసుకోని ఆఎనిమిది భవనాల్లోని అద్దె దుకాణాల్లో మాత్రం దర్జాగా వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో ఖాళీ చేసిన దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణలో పూర్తి కాని నష్టపరిహారం ఇళ్లను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు ఒక వైపు ఖాళీలు, మరో వైపు దర్జాగా దుకాణాలు త్వరలోనే స్థలాలు అప్పగిస్తాం భూ సేకరణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇళ్లు కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. నష్టపరిహారం అందుకోని వారు సైతం తొలి దశలో అంగీకరించినవారే. వారితో సంప్రదింపులు జరిపి పూర్తి చేస్తాం. లేదంటే కోర్టు ద్వారా ఆ ఇళ్లను తొలగించి స్వాధీనం చేసుకుంటాం. ఖాళీ చేసిన వారు ఆందోళన చెందొద్దు. బ్రిడ్జి పాయింట్లో ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని త్వరలోనే నిర్వాసితులకు అప్పగిస్తాం. – దామోదర్ రావు, ఆర్డీఓ -
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు
చుంచుపల్లి: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. పల్లెలు పారిశుద్ధ్య సమస్యతో సతమతమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. గతేడాది జనవరితో సర్పంచుల పదవీకాలం ముగియగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారులకు అప్పగించారు. ఎంపీపీ, జెడ్పీ పాలక మండళ్ల గడువు సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, అక్కడా స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల్లోనూ పాలక వర్గాల గడువు ఈ ఏడాది జనవరిలో ముగియగా పాలన బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న మండల స్థాయి అధికారులకు ఒక్కొక్కరికి 2 నుంచి 4 గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు కేటాయించారు. జెడ్పీకి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తుండగా, మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు రెండు మున్సిపాలిటీల పాలన పర్యవేక్షణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు అప్పగించారు. కార్యదర్శులపైనే భారం స్థానిక సంస్థల పాలన పట్టించుకోవాల్సి అధికారులు కనీసం అటువైపు రావడం లేదనే ఆరోపణలున్నాయి. భారం అంతా గ్రామాల్లో కార్యదర్శుల పైనే పడుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారులు కూడా పాలనను పట్టించుకోవడంలేదనే పలువురు పేర్కొంటున్నారు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల విడుదల చేయకపోవడంతో పాలన పూర్తిగా పడకేసింది. వర్షాకాలం సీజన్ను ప్రారంభమవుతున్నా దృష్టా ప్రత్యేక అధికారులు మేల్గొనాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు పర్యవేక్షించాలి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వర్షాకాలం సీజన్లో అప్రమత్తంగా ఉండాలి. సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను మరోసారి ఆదేశిస్తాం. – ఎం.విద్యాచందన, అదనపు కలెక్టర్ ఎన్నికలు నిర్వహించాలి ప్రత్యేకాధికారులు గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మరోవైపు పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. – మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు పంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు మున్సిపాలిటీల్లోనూ అదే తీరు గ్రామపంచాయతీలు 481 జిల్లా పరిషత్ 1 మండల పరిషత్లు 22లోపిస్తున్న జవాబుదారీతనం పదవీకాలం ముగిసి ఏడాది దాటినా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్నది స్పష్టతలేదు. మండల, జిల్లా పరిషత్ల పాలన గడువు ముగిసి పది నెలలు అవుతున్నా ఎన్నికలకు ప్రభుత్వం విముఖత చూపుతోంది. ప్రత్యేకాధికారులు పనిభారం తదితర కారణాలతో గ్రామ పాలన పట్టించుకోవడంలేదు. తమకు సొంత శాఖ విధులతోనే సరిపోతోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులతో జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. పాలనాభారం గ్రామ కార్యదర్శులు మోస్తున్నా నిధులు లేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక అధికారులను నియమించినా ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. కాగా ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసంతో పాటు మరికొన్ని పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
సర్కార్ వైద్యంపై భరోసా
పాల్వంచ: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యానికి గతంలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వచ్చేవారు. అక్కడి వాతావరణం, అరకొర సిబ్బంది, వైద్యుల పలకరింపు, సిబ్బంది పనితీరు పట్ల కొంత ఆందోళన చెందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంతోపాటు ఆధునిక వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన భార్య శ్రద్ధ పాటిల్ కాన్పు కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మగబిడ్డ జన్మించాడు. ఆస్పత్రిలో వసతులు మెరుగ్గా ఉన్నాయని కలెక్టర్ కితాబు ఇవ్వడం విశేషం. పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా.. గతంలో భద్రాచలం పీఓగా, ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వహించిన వీపీ.గౌతమ్ 2018 అక్టోబర్ 28న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. 2020 ఆగస్టు 27న అప్పటి ఎస్పీ సునీల్ దత్ సతీమణి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించారు. ఏఎస్పీ శబరీష్ సతీమణి, ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత కూడా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం పొందారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో ప్రస్తుత కలెక్టర్ జితేష్ తన సతీమణికి ప్రభుత్వాస్పత్రిలో కాన్పు సేవలు పొందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు సేవలు పొందుతున్న ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబీకులు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మణుగూరు టౌన్: వ్యసనాలకు బానిసై చోరీలను అలవాటుగా మార్చుకున్న అంతర్రాష్ట్ర దొంగను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 23న మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని శ్రీవారి జ్యూయలరీలో 13 తులాల బంగారం చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో హనుమాన్ టెంపుల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ ఆరు బంగారు చైన్లు, నల్లపూసల గొలుసు, చిన్న పిల్లల రింగులు 5 మొత్తం 132 గ్రాముల బంగారం అపహరించినట్లు అంగీకరించాడు. వరంగల్, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కూడా చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. గతంలో అతనిపై సుమారు 30 కేసులు ఉన్నాయి. నిందితుడిని బుధవారం మణుగూరు కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. చోరీలు ఇలా... మంగళ, శుక్రవారాల్లో బంగారం దుకాణాల యజమానులు పూజలు నిర్వహిస్తుంటారు. ఆ సయమంలోనే సత్యనారాయణ రెక్కీ నిర్వహిస్తూ, కొనుగోళ్లు చేసినట్లు ఏమార్చి షో కేస్లో ఉన్న బంగారం అపహరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్ఐ మేడ ప్రసాద్, సీసీఎస్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ రామారావు, వెంకటనారాయణ, విజయ్లను డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు. 132 గ్రాముల బంగారం స్వాధీనం -
జేకే ఓసీ విస్తరణకు అనుమతులు
ఇల్లెందు: జేకే–5 ఓసీ విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. ఈ మేరకు బుధవారం సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య వివరాలు వెల్లడించారు. జేకే–5 ఓసీ మూతపడనున్న నేపథ్యంలో యజమాన్యం పలువురు ఉద్యోగులను బదిలీ చేసింది. జేకే ఓసీ విస్తరణ అనుమతుల్లో జాప్యం జరిగింది. పలు దఫాలు ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఆలస్యం కావటంతో ఓసీ విస్తరణ పట్ల ఆందోళన వ్యక్తమైంది. సీఎండీతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పలు దఫాలు సింగరేణి అధికారులు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, గుర్తింపు సంఘం నాయకులు ఒత్తిడి పెంచడంతో తుది అనుమతులు బుధవారం లభించాయి. దీంతో కార్మికులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2023 ఏప్రిల్ 26న జేకే ఓసీ విస్తరణకు సింగరేణి ప్రజాభిప్రాయం సేకరించింది. రూ.297.88 కోట్లతో 1114.507హెక్టార్ల భూమిలో 2.50 మిలియన్ టన్నుల బొగ్గు సేకరణ కోసం అనుమతి కోరారు. ప్రస్తుతం 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే అనుమతి లభించినట్లు జీఎం తెలిపారు. విస్తరణ పనులు చేపట్టి బొగ్గు వెలికితీతకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపాక బీపీఎంపై సస్పెన్షన్ వేటుఅశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్పై బుధవారం తపాలా శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గడిచిన ఏడాది కాలంగా గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిన ఉత్తరాలు, ఆధార్, ఏటీఎం, బీమా, ఇతర నోటీసు పత్రాలను పంపిణీ చేయడం లేదని, ఈ నెల 26వ తేదీన గ్రామస్తులు వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు పోస్టుమాస్టర్ శశాంక్పై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అశ్వారావుపేట ఎస్పీఎం సాయిబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పాల్వంచ డివిజన్ ఇన్చార్జి పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఆసుపాక గ్రామంలో విచారణ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలను నమోదు చేసి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోస్టుమాస్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు. 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సన్నాహాలు -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధిగా నిబంధనలు పాటించాలని పౌర సరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్బాబు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. రైతులు కూడా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని కోరారు. 2023 – 24 యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,289 మంది రైతుల నుంచి 13,642.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.29.79 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని, 2024 – 25 సీజన్లో 144 కొనుగోలు కేంద్రాల ద్వారా 49,527.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 7,297 మంది రైతుల ఖాతాల్లో రూ.114.61 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,500 మంది రైతుల నుంచి రూ.103.43 కోట్ల విలువైన 44,700.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అకాల వర్షాలఓ ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. క్రీడల్లో ప్రతిభ చాటాలిఙదమ్మపేట : క్రీడల్లో ఉన్నతంగా రాణించి, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి విద్యార్థులకు సూచించారు. మండలంలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే క్రీడల్లో ఉన్నతంగా రాణించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరళ, కోచ్లు శివాజీ, అభి తదితరులు పాల్గొన్నారు. -
కొండరెడ్ల సంక్షేమానికి కృషి
● ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ● ఐటీడీఏ పీఓ రాహుల్ అశ్వారావుపేటరూరల్: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే కొండరెడ్లకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి కల్పించేలా కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మండలంలోని తిరుమలకుంట, గోగులపూడి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. తిరుమలకుంటలో తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయని, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కొండరెడ్లు కోరగా.. సర్వే చేసి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ దత్తత గ్రామమైన గోగులపూడిలో పర్యటించి కొండరెడ్లు తయారీ చేసిన వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. వీటి విక్రయానికి మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని, వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు. కొండరెడ్ల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఈనెలాఖరు లోగా ఇంటింటి సర్వే చేసి వారం రోజుల్లో అందరికీ మంజూరు పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన రైతులకు ఇందిరా గిరి జల వికాసం పథకం కింద బోరు, మోటార్, డ్రిప్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. పోడు పట్టాలున్న భూముల్లో ఆయిల్పాం, మునగ, వెదురు పెంపకం చేపట్టాలని, అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగు చేయాలని కోరారు. యువత జీవనోపాధి పొందేందుకు మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ, యువకులకు సెల్ఫోన్ రిపేర్లు, ఆడియో, వీడియో రంగాలపై శిక్షణ అందిస్తామని వివరించారు. ఐటీడీఏ ద్వారా నిర్వహించే జాబ్మేళాకు హాజరై ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనతంరం శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, జేడీఎం హరికృష్ణ, హౌసింగ్ ఏఈ మదన్, కార్యదర్శులు కార్తీక్, సందీప్ పాల్గొన్నారు. -
కేంద్ర బృందం పర్యటన
ములకలపల్లి/ పాల్వంచరూరల్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డీ) బృందం సభ్యులు రాకేశ్కుమార్, వివేక్కుమార్ కేసరి బుధవారం ములకలపల్లి, సీతారాంపురం గ్రామాల్లో పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన కుంటలు, నర్సరీలు, మెగా ప్రకృతి వనాలను చూసి, ఉపాధి కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో వసతులు కల్పిస్తున్నారా, బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో ములకలపల్లి – మూకమామిడి మధ్య నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ గద్దె రేవతి, ఇన్చార్జ్ ఎంపీఓ వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ సురేశ్, జీపీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు. కాగా, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన సభ్యులు బుధవారం కూడా వెళ్లి జలాశయంలో బోటింగ్ చేశారు. మరోసారి కిన్నెరసాని సందర్శన -
అంగన్వాడీల బలోపేతంపై దృష్టి
చుంచుపల్లి : వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవాలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తేవాలని, తద్వారా ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల పనితీరుపై ఉమ్మడి జిల్లా అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చిన్నారులకు అవసరమైన వసతులు సమకూర్చుతున్నామని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ కేంద్రాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రాథమిక పాఠశాలల సమీపంలోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంత పిల్లల ఆలనా పాలన కోసం క్రష్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పల్లెల్లో తాగునీటి సమస్య రావొద్దు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యం సాధించాలి సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క పంచాయతీరాజ్ పనుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం సురక్షిత తాగునీరు అందించాలి.. మారుమూల ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ సమస్యలపై వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని అన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టిన అధికారులను అభినందించారు. కాగా, పంచాయతీరాజ్ శాఖలో మంజూరైన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గిరిజనుల అభివృద్ధికి రోడ్లు, బ్రిడ్జిల ఏర్పాటు ముఖ్యమని, ప్రతీ గ్రామానికి కనెక్టివిటీ ఉండేలా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, మట్టా రాగమయి, మహిళా శిశు సంక్షేమ శాఖ జేడీ సునంద, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అదనపు కలెక్టర్లు విద్యాచందన, శ్రీజ, సంక్షేమాధికారులు లెనినా, రాంగోపాల్రెడ్డి, డీపీఓలు ఆశాలత, చంద్రమౌళి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పాతకొత్తగూడెం – పెనుబల్లి గ్రామాలను కలిపే హై లెవల్ బ్రిడ్జి పనులకు సీతక్క నేడు శంకుస్థాపన చేయనున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 – మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు జరుగుతాయ ని, ఇందుకోసం కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 1,367 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్టుమెంటల్ అధికారులు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 50 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడువాపు, డెంగీ, చికున్గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి శుభ్రం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీసీహెచ్ఎస్ రవినాయక్, జిల్లా మలేరియా అధికారి స్పందన, డీపీఓ చంద్రమౌళి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు ఇందిర, మణెమ్మ, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నళిని, ఏడీఎంహెచ్ఓ జయలక్ష్మి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
ఇష్టారీతిగా మద్యం ధర పెంచుతున్న వ్యాపారులు
రేటు పెంచిన సిండికేటు..లైసెన్స్ పొందిన వైన్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్మాల్సి ఉంటుంది. అయితే ఎమ్మార్పీకి అమ్మితే లాభాలు పెద్దగా రావనే ఉద్దేశంతో మద్యం వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, వైన్స్లలో పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా చూస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మద్యాన్ని బెల్ట్షాపుల ద్వారా అధిక ధరలకు అమ్ముతుంటారు. క్వార్టర్ బాటిల్పై ఎమ్మార్పీ ధర కంటే రూ.20 ఎక్కువకు బెల్ట్షాప్లకు విక్రయిస్తే వారు మరో రూ.20 కలిపి ఎమ్మార్పీకంటే రూ.40 అదనంగా అమ్ముతుంటారు. జిల్లాలోని అనేక పట్టణాల్లో ఈ దందా చాలా రోజులుగా కొనసాగుతోంది. అయితే ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పట్టణాల్లో సిండికేట్ నిర్వాహకులు తమ లాభాలను మరింతంగా పెంచుకునేందుకు ఎమ్మార్పీపై రూ.30 వరకు అదనంగా అమ్మడం మొదలుపెట్టారు.బయట నుంచి మద్యం..సాధారణంగా పట్టణాలు, పెద్ద మండల కేంద్రాల్లో మద్యం నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడుతుంటారు. వీరి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై వారిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. సిండికేట్ చెప్పిన ధరకు మద్యం కొనుగోలు చేయడంతో కష్టం తమది.. లాభం వారికి పోతోందని భావించిన బెల్ట్షాపు నిర్వాహకుల్లో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. సిండికేట్ లేని పట్టణాల్లోని వైన్స్ నుంచి ఎమ్మార్పీకే భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేయడం మొదలెట్టారు. కొన్నాళ్లుగా చాపకింద నీరులా నడుస్తున్న ఈ వ్యవహారం ఇటీవల ముదురుపాకాన పడింది.ఇల్లెందు ఘటనతోమణుగూరు సిండికేట్తో విభేదించిన కొందరు బెల్ట్షాప్ నిర్వాహకులు మహబూబాబాద్ నుంచి భారీ ఎత్తున మద్యం తీసుకెళ్తున్నారనే విషయం ఇల్లెందు ఎకై ్సజ్ పోలీసులకు ఉప్పందింది. దీంతో దారి కాచి భారీగా సరఫరా అవుతున్న మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అయితే ఈ దాడి జరగడం వెనుక సిండికేట్ హస్తం ఉందని బెల్ట్షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇల్లెందు ఎకై ్సజ్ పరిధిలోనూ ఇలాంటి దాడులు అనేకం జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. బెల్ట్షాపుల్లో మద్యం అమ్మడం నేరమైనప్పుడు, సిండికేట్ రూపంలో ఎమ్మార్పీకి మద్యం అమ్మకపోవడం కూడా చట్టరీత్యా నేరమేనని అంటున్నారు. సిండికేట్ ఘనాపాఠీల వ్యవహారాలను చూసీచూడనట్టుగా వదిలేయడం, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్లలో నడుపుకునే బెల్ట్షాపులపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సిండికేట్ అత్యాశ కారణంగా తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని, దీనిపై ఎకై ్సజ్ శాఖ దృష్టి పెట్టాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ను వివరణ కోరగా తాము ఎక్కడా దాడులు చేయడం లేదని చెప్పారు.బెల్ట్షాప్ నిర్వాహకుల్లో అసంతృప్తి..గ్రామాల్లో కిరాణా దుకాణాలు, పాన్షాపులు, బడ్డీకొట్లు బెల్ట్ షాపులుగా రూపాంతరం చెందాయి. స్థానికంగా ఉండే వారే ఎక్కువగా ఇక్కడ మద్యం తాగుతుంటారు. వారికి ప్లాస్టిక్ గ్లాసులు, మంచినీరు, పల్లీలు తదితర తినుబండారాలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోంది. దీంతో తమ లాభాలు తగ్గిపోతున్నాయనే అసంతృప్తి బెల్ట్షాపుల నిర్వాహకుల్లో ఉంది. బార్లు, వైన్స్, కౌంటర్ల వద్ద ప్లాస్టిక్ గ్లాస్కు కూడా డబ్బు వసూలు చేస్తారు. కానీ స్థానికంగా ఉండే పరిచయాలు, పరిస్థితుల కారణంగా తాము గ్లాసులకు బిల్లు వేయలేక నష్టపోతున్నామనేది బెల్ట్షాపుల వారి బాధ. అంతేకాదు.. అధిక ధరకు మద్యం అమ్ముతుంటే తమకు మందుబాబుల నుంచి ఇబ్బంది ఎదురవుతోందని అంటున్నారు. ఈ తరుణంలో క్వార్టర్ బాటిల్పై సిండికేట్ వారు అదనంగా వసూలు చేసే రూ.20లో తగ్గింపు ఇవ్వాలని కోరుతున్న తరుణంలో రేటు మరింతగా పెంచడం వివాదానికి బీజం వేసింది. -
బతుకులు ఆగం చేయొద్దు
● మాడవీధుల విస్తరణకు సహకరిస్తాం ● ప్రత్యామ్నాయం చూపండి.. పరిహారం ఇవ్వండి ● రామాలయ పరిసరాల చిరు వ్యాపారుల వినతి ● నేటి నుంచి ఇళ్లు తొలగించనున్న రెవెన్యూ అధికారులు భద్రాచలం: ‘దశాబ్దాల తరబడి రాముడిపైనే ఆధారపడి ఉంటున్నాం.. భక్తులు వస్తేనే మాకు పొట్ట నిండేది.. అయినా సరే రాముడిపై భక్తి, ఆలయాభివృద్ధి కోసం ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేస్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిహారం కూడా పూర్తిగా అందలేదు.. ప్రత్యామ్నాయ స్థలమూ చూపించలేదు.. ఇదేం అన్యాయం.. మా బతుకులు ఆగం కాకుండా చూడండి’ అంటూ నిర్వాసితులు గోడును వెల్లబోసుకుంటుచ్చారు. మేమెక్కడ ఉండాలి.. భద్రాచలం, రామాలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు తొలగించి మాడ వీధుల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు ఇటీవల నష్టపరిహారం అందజేశారు. పరిహారం పూర్తిగా చెల్లించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరామనవమికి ముందు రోజు హడావిడిగా చెక్కులు పంపిణీ చేశారని, అయితే ఆ రోజున మూడో వంతు పరిహారం మాత్రమే అందించారని నిర్వాసితులు అంటున్నారు. మిగిలిన మొత్తం కొద్ది రోజుల్లోనే ఇస్తామని, భూమికి బదులు భూమి అందిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకూ మిగితా డబ్బు ఇవ్వకపోగా ప్రత్యామ్నాయం కూడా చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇళ్లు తొలగిస్తామని అంటున్నారని, మరి తామెక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ప్రత్యామ్నాయం చూపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పష్టత ఇవ్వని అధికారులు.. నిర్వాసితులకు భూమి అందజేసే విషయంలో రెవెన్యూ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ ‘ప్రసాద్’ పనుల్లో భాగంగా బ్రిడ్జి సెంటర్లో తొలగించిన ఆర్అండ్బీ స్థలాన్ని లాటరీ పద్ధతిలో కేటాయిస్తారనే ప్రచారం సాగింది. అయితే సుమారు రెండెకరాల ఈ స్థలం భవిష్యత్లో భద్రాచలం, రామాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, నిర్వాసితులకు పురుషోత్తపట్నం లేదంటే పట్టణంలో ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారుల వద్ద ఎలాంటి స్పష్టత లేకపోవడంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖాళీ చేయాల్సిన భవనాల్లోని ఖరీదైన ఫర్నిచర్, కలపను మంగళవారం తరలించారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు. -
నిధులున్నా.. మరమ్మతులు సున్నా
● ప్రారంభం కాని తాలిపేరు కాల్వల పనులు ● రబీకి ముందే ఆరంభం కావాల్సి ఉన్నా వాయిదా.. ● సాగునీరు విడుదల చేయాలని రైతులు పట్టుబట్టడమే కారణం ● మళ్లీ ఖరీఫ్ పూర్తయితేనే వీడనున్న గ్రహణంచర్ల: తాలిపేరు ప్రధాన కాల్వల మరమ్మతులకు పట్టిన గ్రహణం వీడడం లేదు. నాడు నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోగా నేడు నిధులున్నా పనులు జరగడం లేదు. దీంతో ఆయకట్టు పరిధి లోని సాగు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పెదమిడిసిలేరు వద్ద గల తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు కింద ఏటా ఖరీఫ్లో అధికారికంగా 24,700 ఎకరాలు, అనధికారికంగా మరో 15వేల ఎకరాల్లో పంటలు సాగ వుతున్నాయి. ఈ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో విస్తరించి ఉండగా దీనికి 34 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద 21,100 ఎకరాల్లో అధికారికంగా, 12వేల ఎకరా ల్లో అనధికారికంగా పంటలు సాగవుతున్నాయి. ఎడమ కాల్వ చర్ల మండలం దోశిళ్లపల్లి, భూముల్లంక, రైస్పేట, చర్ల, లింగాపురం, మొగళ్లపల్లి, జీపీపల్లి, చింతకుంట గ్రామాల మీదుగా విస్తరించి ఉండగా, 8 డిస్ట్రీబ్యూటరీ కెనాళ్లు ఉన్నాయి. దీని కింద అధికారికంగా 3,600, అనధికారికంగా మరో 3 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఏటా తాత్కాలికమే.. కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులకు ఏళ్లుగా నిధులు మంజూరుకాలేదు. గతేడాది ప్రాజెక్టు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత జనవరిలోనే పనులు ప్రారంభించాల్సి ఉండగా రబీ పంటలకు సాగునీరు ఇవ్వాలని రైతులు పట్టుబట్టడంతో పనులు వాయిదా వేశారు. ఏప్రిల్ తర్వాత కూడా పనులు చేపట్టకపోవడంతో మళ్లీ సాగు సమయానికి పనులు పూర్తికావని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రధాన కాల్వల వంతెనలు, యూటీల నిర్మాణాల పనులు నిలిచిపోగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించిన మరమ్మతు పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అవకాశం ఉన్నా.. తాలిపేరు ఎడమ ప్రధాన కాల్వపై పలుచోట్ల ఉన్న యూటీలు కృంగిపోయి సాగునీరు చివరి భూముల వరకు వెళ్లకపోవడంతో గత ఏడాది ఖరీఫ్లో ఇరిగేషన్ అధికారులు సిమెంట్ బస్తాలను ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేసి అతికష్టం మీద సాగునీటిని కాల్వ ద్వారా మళ్లించారు. ప్రస్తుతం అవి ధ్వంసం కావడంతో ఖరీఫ్ సీజన్లో సాగునీటి సరఫరాకష్టమే. ఏప్రిల్లో పనులు ప్రారంభించి జూన్ రెండో వారం నాటికి పూర్తి చేసే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు మండిపడుతునానరు. తాలిపేరు ప్రాజెక్టు, కాల్వలపై అధికారులు, ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.ముందుగా చేస్తే బాగుండేది.. ప్రధాన కాల్వకు సంబంధించి రబీసాగు పూర్తవ్వగానే పను లు ప్రారంభిస్తే బాగుండేది. గత ఏడాదే యూటీలు కూలి పోయి సాగునీరు అతికష్టం మీద పొలాలకు చేరింది. మళ్లీ యూటీలకు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిన పరిస్థితే ఉంది. అధికంగా వర్షాలు కురిస్తే ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోతాయి. –కూరపాటి వీర్రాజు, రైతు, ఆర్.కొత్తగూడెం సమయాభావంతోనే పనుల వాయిదా సమయాభావం వల్ల ప్రధాన కాల్వకు సంబంధించి అండర్ టన్నెళ్ల మరమ్మతులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ పనులు చేయాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించిన మరమ్మతులు ప్రారంభించాం. అండర్ టన్నెళ్ల పనులూ చేపడతాం. –ఎస్డీ అహ్మద్ జానీ, ఈఈ, ఇరిగేషన్ -
నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని బ్రిడ్జి సెంటర్ వద్ద మంగళవారం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీలోని ఎటపాక మండలం గుండువారిగూడెం గ్రామానికి చెందిన నితిన్ తన ద్విచక్రవాహనంపై 23 లీటర్ల నాటుసారాను బూర్గంపాడు మండలం సారపాకకు తరలిస్తుండగా పట్టుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నితిన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, నాటుసారా, గంజాయి రవాణాకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 18004252523కు అందించాలని సీఓ పేర్కొన్నారు. దాడుల్లో కరీం, బాలు, సుధీర్, హనుమంతరావు, హరీశ్, ఉపేందర్ పాల్గొన్నారు. గంజాయిపై డాగ్స్క్వాడ్తో తనిఖీలుఅశ్వాపురం: గంజాయి నియంత్రణ చర్య ల్లో భాగంగా మంగళవారం నార్కోటిక్ గ్రేసీడాగ్తో ఎస్ఐమధుప్రసాద్ ఆధ్వర్యం లో పోలీసులు మండలంలోని చవిటిగూడెంలో అనుమానితుల ఇళ్లు, పొద లు, ఖాళీస్థలాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుప్రసాద్ మా ట్లాడుతూ.. యువత, విద్యార్థులు గంజా యి లాంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మండలంలో గంజాయి నిర్మూలనలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గంజాయి పట్టివేత?జూలూరుపాడు: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని మంగళవారం స్థానిక పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తుండగా జూలూరుపాడు మండల పరిఽధిలో వా హనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. లారీలో భారీ మొత్తంలోనే గంజాయి దొరికినట్లు తెలిసినా.. పోలీసులు వివరాలు వెల్లడించేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు దమ్మపేట: భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు జరగగా.. ఓ వర్గంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మరో వర్గంపై దాడి కేసు నమోదైంది. పోలీసులు మంగళవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని అఖినేపల్లి శివారులోని పామాయిల్ తోట తమదే అంటూ దమ్మపేటకు చెందిన కునుసోతు వెంకటేశ్వరరావు, పద్మ దంపతులు పామాయిల్ ఆకులను కోయడం ప్రారంభించారు. అదే సమయంలో తోటలోకి దమ్మపేటకు చెందిన మారిశెట్టి రామారావు, శ్రీనివాసరావు సోదరులు వచ్చి తోట తమదే అంటూ వెంకటేశ్వరరావు, పద్మను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఇల్లెందు: పట్టణంలోని 15వ నంబర్బస్తీవాసి, ఆటోడ్రైవర్ దుర్గాప్రసాద్ (45) పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం 8వ నంబర్ చెరువు సమీపంలో కూల్డ్రింక్లో పురుగులమందు కలుపుకుని తాగి మృతి చెందగా సాయంత్రం మేకల కాపరులు చూసి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య మీనాపాసీ కుమారి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆయ న ఆరు నెలల కాలంలో రెండు దఫాలు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. తలలో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ అయినట్లు బంధువులు తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబసభ్యుల సమాధుల వద్దకు చేరి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. -
సౌకర్యాలు ఎలా ఉన్నాయ్..?
ఉపాధి కూలీలను ఆరా తీసీన కేంద్ర బృందం పాల్వంచరూరల్ : పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా.. కూలీలకు సరాసరి ఎంత వేతనం వస్తోంది.. పనిచేశాక ఎన్ని రోజులకు వేతనం అందుతోంది అంటూ కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుమార్, వివేక్కుమార్ కేసరి ఆరా తీశారు. మండలంలోని జగన్నాథపురం, ప్రభాత్నగర్లో మంగళవారం పర్యటించిన సభ్యులు.. ఉపాధి కూలీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగన్నాథపురంలో ఫాంపాండ్ పనులు, పామాయిల్ తోట, నర్సరీలు, ప్రభాత్నగర్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద చేపట్టిన బ్రిడ్జి పనులను పరిశీలించారు. కిన్నెరసాని సందర్శన.. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. డీర్ పార్కులోని దుప్పులను చూస్తుండగా ఒక జింక కంచె వద్దకు రాగా దానికి మేత అందించారు. ఆ తర్వాత డ్యామ్ పైకెళ్లి జలాశయాన్ని వీక్షించి లొకేషన్ చాలా అందంగా ఉందంటూ కితాబిచ్చారు. స్థానిక అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. బృందం వెంట డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఏపీఓ రంగా, ఏపీఎం రాంబాబు, ఈసీలు రాజు, పుల్లయ్య, కార్యదర్శులు సాయిరాం, శ్రీనివాస్, శ్రీబాబు, రవి తదితరులు ఉన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంలో నిధి ఆప్కే నికట్
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఆధ్వర్యాన ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్పై ఉద్యోగుల సందేహాలను అధికారులు నివృత్తి చేయడమే కాక ప్రయోజనాలను వివరించారు. జిల్లా నోడల్ ఆఫీసర్ బి.నాగులు, సూపర్వైజర్ కె.నాగేశ్వరరావు, ఈఎస్ఐ బ్రాంచ్ ఇన్చార్జ్ మేనేజర్ రెహానా సుల్తానా, ఉద్యోగి బి.కార్తీక్తో పాటు సాక్షి బ్రాంచ్ మేనేజర్ జి.మోహనకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.చిన్న వయసు నుంచే ప్రోత్సహించాలి పాల్వంచ: చిన్న వయసు నుంచే పిల్లలను తల్లిదండ్రులు క్రీడలు ఆడేలా ప్రొత్సహించాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీనివాసకాలనీ మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్ డే అండ్ నైట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించేందుకు తమవంతు కృషి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.యుగంధర్రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహిధర్, పి.నాగేందర్, మల్లికార్జున్, నాగరాజు, గిరిప్రసాద్, అక్బర్, ఎర్రయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. తాగునీటిలో పురుగులు అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిలో మూడు రోజులు గా పురుగులు, ఇతరవ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అశ్వారావుపేట పట్టణ ప్రజలకు రోజూ స్థానిక పాత ప్రభుత్వ ఆస్పత్రి లో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తుంటారు. కాగా, మూడు రోజులుగా స్థానిక వెలమబజారు, ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంతం, కోనేరుబజారుతోపాటు పలు ఏరియాల్లో తాగునీటిలో పురుగులు, వాటి అవశేషాలతో పాటు వ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం తాగునీటిలో వచ్చిన పురుగులు, వాటి అవశేషాల ఫొటోలు, వీడియోలను తీసి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వాటర్ ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయకపోవడం, కొన్నిచోట్ల తాగునీటి పైపులు డ్రెయినేజీల్లో ఉండటంతో కలుషితం అవుతున్నట్లు పట్టణ వాసులు చెబుతున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ సుజాతనగర్: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన వేపలగడ్డ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్ఐ రమాదేవి కథనం మేరకు.. వేపలగడ్డకు చెందిన మల్లెల బాలచెన్నారెడ్డి తన ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలోని 3.3 తులాల బంగారు వస్తువులతో పాటు రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కన్నుమూత
● ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రస్థానం ● తొలినాళ్లలో సర్పంచ్, ఎంపీటీసీగా కూడా విజయం ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపంవైరా/రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్(63) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఈనెల 23న చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి కాగా మదన్లాల్కు భార్య మంజుల, కుమారుడు మృగేందర్లాల్, కూతురు మనీషాలక్ష్మి ఉన్నారు. కుమారుడు తమిళనాడు(కోయంబత్తూరు) రాష్ట్ర జీఎస్టీ కమిషనర్గా, కోడలు శ్వేత తమిళనాడు కేడర్లో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయన సోదరుడు, పోలీస్ శిక్షణా కేంద్రం ఏసీపీ జవహర్లాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు మదన్లాల్ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యే దాకా.. మదన్లాల్ ఈర్లపూడిలోని సామాన్య కుటుంబంలో జన్మించారు. 11 మంది సంతానంలో మదన్లాల్ మూడో వ్యక్తి కాగా, ప్రాథమిక విద్య డోర్నకల్ మండలం బలపాలలో, డిగ్రీ ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో పూర్తిచేశారు. కళాశాల రోజుల్లో పీడీఎస్యూలో పనిచేసిన ఆయన.. 1989లో కామేపల్లి మండలం అబ్బాస్పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కబడ్డీలో ప్రావీణ్యం ఉండడంతో అదే ఏడాది ఎస్ఐ పోస్టుకు ఎంపికై నా కేసుల కారణంగా ఉద్యోగం దక్కలేదు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి 1996 – 2001 వరకు ఈర్లపూడి సర్పంచ్గా పనిచేశారు. 2001 – 2006 వరకు ఆయన భార్య మంజుల సర్పంచ్గా కొనసాగగా, తిరిగి 2006లో మదన్లాల్ రెండోసారి సర్పంచ్గా, ఆపై కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా విజయం సాధించారు. 2004లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కలేదు. 2009లో ఏర్పాటైన వైరా(ఎస్టీ) నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఫలితం లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగి 5వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దివంగత సీఎం వైఎస్పై అభిమానంతో 2014లో నాటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా వైఎస్సార్సీపీలో చేరి, వైరా నుంచి సీపీఎం మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఏడాది తిరగకుండానే బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చేరగా, 2018, 2023 ఎన్నికల్లోనూ పోటీ చేసినా విజయం దక్కలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. కేసీఆర్ సహా పలువురి నివాళి మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ మృతదేహాన్ని ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకొచ్చారు. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్ మదన్లాల్ కుమారుడు మృగేందర్లాల్కు ఫోన్ చేసి ఓదార్చారు. అలాగే, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఇక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల తదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో పాటు వివిధ పార్టీల నాయకులు గడిపల్లి కవిత, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రాంపూడి రోశయ్య, పగడాల మంజుల, కూరాకుల నాగభూషణం, లింగాల కమలరాజు, గుండాల కృష్ణ, నెల్లూరి కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పగడాల నాగరాజు, మందడపు సుబ్బారావు, నున్నా రవికుమార్, బాగం హేమంతురావు, దండి సురేష్, యర్రా బాబు తదితరులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి సైతం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కాగా, మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం స్వగ్రామమైన ఈర్లపుడిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. -
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ బూర్గంపాడు: నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని సందెళ్ల రామాపురం అటవీ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల నరికివేతతో తగ్గిన అడవి జాతి మొక్కలను తిరిగి పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అడవుల సంరక్షణ, అటవీ ఉత్పత్తుల పెంపుపై ట్రెయినీ బీట్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ మసూద్, ఎఫ్ఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామయ్య దర్శనం.. భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.ఎఫ్ఆర్ఓ సుజాత, ఆలయ పీఆర్ఓ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు మాధుర్యాన్ని పిల్లలకు అందించండి
కొత్తగూడెంఅర్బన్: తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు అందించి, మాతృభాషపై మక్కువ పెంచాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులపై ఉందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులకు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న చివరి విడత వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆంగ్ల మాధ్యమ ఒరవడిలో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొని, కథలు రాయటం, కథలు చెప్పటం, పద్యాలు రాయటం, పద్య పఠనం, ఇంకా అనేక ప్రక్రియలను పరిచయం చేసి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులదేనని గుర్తు చేశారు. కేవలం పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయకుండా తెలుగు సాహిత్యం, తెలుగుకు సంబంధించిన వివిధ గ్రంథాలను చదివేటట్లుగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర ఇన్చార్జ్ బి.నీరజ, రాష్ట్ర పరిశీలకులు మడత భాస్కర్గౌడ్, డీఆర్పీలు రంగపురి కృష్ణార్జున్రావు, బండి రామచందర్రావు, సత్య సాయిరాం, భూక్య కర్ణ పాల్గొన్నారు. -
పరీక్షలకు సన్నద్ధం కావాలి
పాల్వంచరూరల్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని, బాగా రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక గిరిజన బాలుర అశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా.. నిరుత్సాహపడకుండా శ్రద్ధగా చదవాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు ఆసక్తిగా వినాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు టీచర్ను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం అశ్రమ పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్రాజు, హెచ్ఎం భద్రు తదితరులు పాల్గొన్నారు. -
ముక్కు నేలకు రాస్తా..
● ఇప్పుడున్న ఎమ్మెల్యేను ఒక్క పట్టా ఇప్పించమనండి.. ● మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సవాల్..మణుగూరురూరల్: ఆనాడు తాను ఎంతో శ్రమించి, పోడు పట్టాలిప్పిచ్చానని, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్క పట్టా ఇప్పించినా ముక్కు నేలకు రాస్తానని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సవాల్ విసిరారు. మంగళవారం మండలంలోని కట్టుమల్లారం గ్రామ పంచాయతీలో కొందరు గిరిజనులు ట్రాక్టర్లతో అటవీ ప్రాంతంలో దున్నుతుండగా మణుగూరు ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నట్లు తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ ఉపేందర్, ఇతర అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిబంధనలను అతిక్రమించి అడవిని ఆక్రమించి పోడు సాగు చేయొద్దని సూచించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలకు చెందిన గిరిజన కుటుంబాల మధ్య, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పోడు భూమి రాలేదంటూ కాంగ్రెస్ వర్గీయులు కాంతారావును ప్రశ్నించారు. ఆనాడు అధికారులు చేసిన సర్వేలో ఏదైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చని.. ఆ రికార్డులను తెప్పిస్తే న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంత నచ్చజెప్పిన సదరు గిరిజనులు వినకుండా భీష్మించడంతో.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉందని, స్థానిక పాలకులతో సమస్యను పరిష్కరించుకోకుండా ఇలా అటవీ భూమిని ఆక్రమించి మొక్కలు నాటడం సరికాదని సూచించారు. ఆనాడు తాను ఎంతో శ్రమించి గిరిజన పోడు సాగుదారులకు పట్టాలు ఇప్పించానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు దమ్ముంటే ఒక్కరికి పట్టా ఇప్పించినా.. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ఈ ప్రాంతంలో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. సమస్యను పెద్దది చేసే చర్యలు మానుకుని న్యాయ పరిష్కారానికి సహకరించాలని హితువు పలికారు. -
ఉపాధి పనుల పరిశీలన
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి, రావికంపాడు గ్రామాల్లో సోమవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుమార్, అమిత్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు పరిశీలించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మట్టి పనులను తనిఖీ చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు సదుపాయాల కల్పన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఏర్పాటు చేయడం లేదని, పలుగు పారలు ఇవ్వడం లేదని కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మునగ పంట సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. రుణాల మంజూరు, రికవరీ ఎలా ఉన్నాయని స్వయం సహాయక సంఘాల మహిళలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ ఉన్నారు. నేడు పాల్వంచకు.. పాల్వంచరూరల్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈజీఎస్, ఐకేపీ శాఖలకు చెందిన అభివృద్ధి పనుల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుఉమార్, అమిత్కుమార్ పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు కిన్నెరసాని, 12 గంటలకు తోగ్గూడెం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.తిప్పనపల్లి, రావికంపాడులో కేంద్ర బృందం పర్యటన -
డీర్పార్కును అభివృద్ధి చేయాలి
● వెలుగుమట్ల తరహాలో తీర్చిదిద్దాలి ● ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ పాల్వంచరూరల్ : కిన్నెరసాని డీర్పార్క్ను అభివృద్ధి చేయాలని, ఖమ్మంలోని వెలుగుమట్ల పార్కు తరహాలో తీర్చిదిద్దాలని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ సూచించారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సోమవారం అయన సందర్శించారు. వైల్డ్లైఫ్ చెక్పోస్టు పనితీరు, డీర్పార్కులోని దుప్పులను, అద్దాలమేడ, కాటేజీలను పరిశీలించారు. పనుల వివరాలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. కిన్నెరసాని నుంచి అడవి దున్నలు అధికంగా సంచరించే రేగళ్ల ఫారెస్ట్ వరకు సఫారీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే పర్యాటకులను అకట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చిల్డ్రన్స్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆయన వెంట రేంజర్ కవిత మాధురి, బీట్ అధికారి ఉమాదేవి, వైల్డ్లైఫ్ సిబ్బంది ఉన్నారు. -
ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
పాల్వంచ: ప్రస్తుతం తరగతి గది డిజిటల్ తరగతి గదిగా మారనున్న తరుణంలో ఉపాధ్యాయులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా విద్యా బోధన చేయాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని, తద్వారా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని వివరించారు. అనంతరం కేటీపీఎస్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయుల శిక్షణ శిబి రాన్ని సందర్శించారు. భోజనం చేసి కోర్సు డైరెక్టర్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మానిట రింగ్ అధికారి ఎ.నాగ రాజశేఖర్, సెంటర్ ఇన్చార్జ్ లు ఎస్కే.సైదులు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీఈఓ వెంకటేశ్వరా చారి -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● భద్రాచలం భగవాన్దాస్ కాలనీకి చెందిన సోళ్ల రత్నమ్మ.. అశ్వాపురం మండలం చింతిర్యాల పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 80/3, 80/4లో 1.03 ఎకరాల భూమి తన సోదరి మరియమ్మ పేరున ఉందని, ఆమె మరణించినందున వారసుల పేరున పట్టా మార్పిడి చేయాలని దరఖాస్తు చేయగా కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. ● పాల్వంచ గాంధీనగర్కు చెందిన నడిగిరి మణికంఠ తాను హీమోపీలియా వ్యాధితో బాధపడుతున్నానని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఏ పనీ చేయలేకపోతున్నానని, దివ్యాంగ పింఛన్ కోసం సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరగా ఆ దరఖాస్తును డీఎంహెచ్ఓకు ఎండార్స్ చేశారు. ● పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న పావురాల రామతులశమ్మ.. తాను రజకురాలినని, ఇసీ్త్ర చేస్తూ ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నానని, పాల్వంచ మున్సిపాలిటీ మార్కెట్ కాంప్లెక్స్లో ఒక గదిని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేయగా మున్సిపల్ కమిషనర్కు పంపించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
కేసులు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం లేకుండా సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై బాధితులు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలను తీసుకోవడం ద్వారా వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం తగదు టేకులపల్లి : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్రాజు సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం ఆయన టేకులపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా మెలగాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.గ్రీవెన్స్లో ఎస్పీ రోహిత్రాజ్ -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఏకలవ్య కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలం అర్బన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో జూనియర్ ఇంటర్లో ఖాళీగా ఉన్న 302 సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని ఈఎంఆర్ఎస్ కళాశాలలో కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్సీఓ అరుణకుమారి నేతృత్వాన కౌన్సెలింగ్ ఏర్పాటుచేయగా 577 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న 302 సీట్లలో మెరిట్ ప్రకారం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు భద్రాచలం కళాశాల ప్రిన్సిపాల్వందనాబీ దాస్ తెలిపారు. దీంతో కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయ్కుమార్, సంజయ్ మల్కర్, ప్రశాంత్, నితిన్సింగ్, విజయేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో అప్రెంటిస్షిప్నకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్ఎం ఏ.సరిరామ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్లో టీజీఎస్ ఆర్టీసీ లొకేషన్ను ఎంపిక చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, కుల ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ అప్లోడ్ చేయాలని తెలిపారు. జూన్ 10వ తేదీ లోపు నమోదుకు అవకాశముందని ఆర్ఎం ఓ ప్రకటనలో వెల్లడించారు. బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ బ్రోచర్లు ఆవిష్కరణభద్రాచలంఅర్బన్ : జిల్లా బ్యాడ్మింటన్ మీట్ బ్రోచర్ను ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి మాట్లాడుతూ.. జూన్ 7, 8 తేదీల్లో సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగనున్నాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే సింగిల్స్ జట్టుకు రూ.800, డబుల్స్/ మిక్స్డ్ డబుల్స్కు రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాల / కాలేజీ విద్యార్థులకు రూ.200 మాత్రమే ఉంటుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం సాధారణ విద్యార్థులు ఠీఠీఠీ. ఛ్టటౌుఽజీుఽ్ఛ. జీుఽ ద్వారా నమోదు చేసుకోవచ్చునని, ప్రభుత్వ విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్లతో పాటు ఎంట్రీలను 9059722803 నంబర్కు పంపాలని తెలిపారు. కార్యక్రమంలో పి.హరి ప్రసన్న కుమార్, చంద్రకళ, నాగరాజు, హసన్, పి. ఉదయ్, అఖిల్ పాల్గొన్నారు. -
నిష్క్రమణ..
బరువెక్కిన గుండెలతోభద్రాచలం : నిత్యం శ్రీరామ నామస్మరలతో తన్మయత్వం, రామయ్య చెంతకు వచ్చే భక్తులతో ఆత్మీయ పలకరింపులు, రామనామ కీర్తనల నడుమ జీవనయానం.. ఇవీ రామాలయ పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు సాగించే వారి జీవన శైలి. ఇవన్నీ ఇక నుంచి దూరం కానున్నాయనే బాధ గుండెలను పిండేస్తున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. జీవనోపాధి దూరం కావడంతో పాటు భద్రాచల రామయ్యతో ఉన్న అనుబంధం ఇక వారికి అనుభూతులుగానే మిగలనున్నాయి. విస్తరణకు నాంది.. రామాలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రారంభమైంది. ఇప్పటికే ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగా, ఆయా స్థలాల్లోని దుకాణాలను యజమానులు, అద్దెదారులు ఖాళీ చేయడం ప్రారంభించారు. పడమర మెట్ల వైపు, దక్షిణ భాగంలో ఉన్న దుకాణాలన్నింటినీ దాదాపుగా ఖాళీ చేశారు. సోమవారం అక్కడి దుకాణాలను తొలగించి బొమ్మలు, వస్తువులను వాహనాల ద్వారా తరలించారు. కాగా భూ సేకరణ కోసం ఖాళీ చేసిన చిరు వ్యాపారుల్లో అత్యధికంగా అద్దెకు ఉంటున్న వారే. దీంతో తమకు ప్రభుత్వమే కాంప్లెక్స్ నిర్మించి అందులో దుకాణాలను కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సైతం అందజేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ ఎనిమిది మంది ఖాళీ చేస్తేనే.. కాగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణకు ప్రభుత్వం రూ. 35 కోట్లు విడుదల చేసింది. ఇందులో అందరూ నష్టపరిహారం తీసుకోగా ఎనిమిది మంది మాత్రం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పరిహారం సరిపోవడం లేదని, తాము ఖాళీ చేసేది లేదని భీష్మించారు. దీంతో ప్రస్తుతం ఇతరులు ఖాళీ చేసినా.. వీరు కూడా ఖాళీ చేయకుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఆలయ అధికారులకు అందించే పరిస్థితి లేదు. భూమి మొత్తం అందకుంటే తదుపరి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఎనిమిది మందితో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారు అంగీకరించకపోతే న్యాయపరంగా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి చూపు ఆ ఎనిమిది మంది వైపే ఉంది. జిల్లా అధికారులు సైతం దీనిపై త్వరగా దృష్టి సారించి భూ సేకరణ పూర్తయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. దుకాణాలు ఖాళీ చేస్తున్న వ్యాపారులు రామాలయ మాడ వీధుల్లో భూ సేకరణకు నాంది -
గోదారికీ అదే సమస్య..
నాలుగు లేన్లుగా చేస్తేనే.. ప్రస్తుతం తిరిగే వాహనాల రద్దీకే కొత్తగూడెం – ఖమ్మం రహదారి సరిపోవడం లేదు. ఈ మార్గంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా తల్లాడ నుంచి ఖమ్మం వరకై తే అసాధ్యమనే చెప్పాలి. అయితే ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చివరి దశకు రావడంతో వైరా – ఖమ్మం మధ్య ట్రాఫిక్ సమస్య తీరినట్టే కానీ.. తల్లాడ – కొత్తగూడెం వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే కొత్తగూడెం – తల్లాడ – వైరా – జగ్గయ్యపేట వరకు ఉన్న 100 కి.మీ. రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గానికి జాతీయ హోదా సాధించడంతో పాటు త్వరితగతిన పనులు చేపడితే పుష్కరాల నాటికి ట్రాఫిక్ చిక్కులు రావు. కనీసం తల్లాడ – కొత్తగూడెం మార్గాన్ని అయినా వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అలాగే భద్రాచలం – సారపాక – బూర్గంపాడు – కుక్కునూరు – అశ్వారావుపేట మీదుగా రాజమండ్రి వరకు గల రోడ్డును గతంలో జాతీయ రహదారిగా గుర్తించారు. కానీ పోలవరం కారణంగా ఈ రోడ్డు అభివృద్ధి పనులు పక్కన పెట్టారు. దీంతో ఈ జాతీయ రహదారి అలైన్మెంట్ను సారపాక – బూర్గంపాడు – ములకలపల్లి – దమ్మపేట – అశ్వారావుపేటగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు ఎదురైనప్పుడు వాహనాలు మళ్లించేందుకు ప్రత్యామ్నాయమార్గంగా ఉపయోగపడుతుంది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమించింది. భారీగా నిధులు కేటాయించి పనులు చేపట్టింది. కానీ పుష్కరాలు మొదలయ్యాక తలెత్తిన ట్రాఫిక్ సమస్య భక్తులను ఇక్కట్ల పాలు చేసింది. పన్నెండు రోజుల పాటు జరిగిన పుష్కరాల్లో దాదాపు తొమ్మిది రోజులు ట్రాఫిక్ చిక్కులు భక్తులకు తప్పలేదు. నడి వేసవి, నట్టడవిలో భక్తులు నీళ్ల కోసం, నీడ కోసం అల్లాడిపోయారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లపై పెట్టిన శ్రద్ధ వాహనాల క్రమబద్ధీకరణ, అందుకు అవసరమైన రోడ్ల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణంపై లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైంది. జయశంకర్ భూపాలపల్లి తరహాలోనే భద్రాద్రి జిల్లా కూడా అడవులు, కొండలు, వాగులు, నదులతో నిండి ఉంది. కాబట్టి ముందుస్తు ప్రణాళిక లేకుంటే 2027 గోదావరి పుష్కరాలకు ఇక్కట్లు తప్పవు. రోడ్డు మార్గాల విస్తరణపై ఇప్పుటి నుంచే దృష్టి సారించాల్సిన అవసరముంది. బాటిల్నెక్గా కిన్నెరసాని జగదల్పూర్ – విజయవాడ జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే కొత్తగూడెం – భద్రాచలం మార్గంలో భద్రాచలం వద్ద గోదావరిపైన, కొత్తగూడెంలో ముర్రేడు, గోదుమవాగులపైన రెండో వంతెనలు నిర్మించారు. కానీ పాల్వంచ దాటిన తర్వాత కిన్నెరసానిపై కొత్త వంతెన నిర్మాణం చేపట్టలేదు. గతంలో నిర్మించిన వంతెన మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ రెండో వంతెన నిర్మించకుంటే పుష్కరాల సమయంలో ఈ వంతెన బాటిల్నెక్గా మారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. రెండో వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గతేడాది జూన్లోనే రూ. 20.20 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఇకనైనా జాప్యం చేయకుండా పనులు ప్రారంభించి గోదావరి పుష్కరాల నాటికి కొత్త వంతెన అందుబాటులోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇల్లెందు పనులు ఇంకెప్పుడు.. కొత్తగూడెం – ఇల్లెందు – మహబూబాబాద్ మీదుగా వలిగొండ వరకు జై శ్రీరామ్ పేరుతో జాతీయ రహదారి 930పీ విస్తరణ పనులు రెండేళ్లుగా టెండర్ల దశలోనే మగ్గిపోతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, అటవీ శాఖ అనుమతులు వంటివి చివరి దశలో ఉన్నాయి. ఇల్లెందు – కొత్తగూడెం మధ్య నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తే హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే వాహనాలను ఇల్లెందు మీదుగా మళ్లించేందుకు వీలుంటుంది. ఫలితంగా ఖమ్మం –కొత్తగూడెం – భద్రాచలం మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మోరంపల్లి బంజర నుంచి బూర్గంపాడు మీదుగా సారపాక వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కూడా విస్తరించాలి. దీంతో పాటు భద్రాచలం – దుమ్మగూడెం – చర్ల – వాజేడు రహదారిని కూడా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో పరిగణనలోకి తీసుకోవచ్చు.సరస్వతి పుష్కరాలకు ట్రాఫిక్ చిక్కులు రోడ్ల విస్తరణపై ప్రణాళిక లేకపోవడమే కారణం 2027 గోదావరి పుష్కరాలకు సైతం ఇదే సమస్య ఎదుర య్యే అవకాశ ం పాత రోడ్ల విస్తరణ, కొత్త మార్గాలు అభివృద్ధి చేస్తే భేష్ ఇప్పుడు పనులు ప్రారంభిస్తేనే అప్పటికి సిద్ధం -
సర్వేయర్లుగా రాణించాలి
చుంచుపల్లి: కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ మైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే చేసేందుకు సర్వేయర్లుగా ఎంపికై న 426 మందికి శిక్షణ ఇస్తున్నామని, అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని సూచించారు. ప్రభుత్వ కొత్త భూ రికార్డుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభ్యర్థులకు మొత్తం 50 రోజుల పాటు శిక్షణ ఇస్తామని, రెండు బ్యాచ్లుగా విభజించి ఉదయం థియరీ, మధ్యాహ్నం క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి సర్వేపై శిక్షణ ఇస్తారని వివరించారు. తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ వారికి సర్వే గొలుసులు, కాలిక్యులేటర్, స్కేల్, పెన్సిల్, నోట్ బుక్స్తో పాటు స్టడీ మెటీరియల్ కిట్లను అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏడీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతుల ప్రారంభంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
ఇల్లెందు: పట్టణంలోని మహబూబాబాద్ క్రాస్ రోడ్ వద్ద పోలీస్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో సోదా చేయగా రూ.3లక్షల విలువైన మద్యం బాటిళ్లను గుర్తించారు. ఈ మేరకు సీఐ బత్తుల సత్యనారాయణ సోమవారం వివరాలు వెల్లడించారు. మణుగూరుకు చెందిన బోడా బాలాజీ టీఎస్ 28 ఎం 7477 నంబర్ గల వాహనంలో రూ.3 లక్షల విలువైన ఇంపీరియల్ బ్లూ, ఎంసీ విస్కీ, రాయల్ స్టాగ్, మెన్షన్ హౌస్, ఆఫీసర్స్ చాయిస్, కింగ్ ఫిషర్, నాకౌట్ బీర్లు, డీకే క్వార్టర్లను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని, సరుకును సీజ్ చేశామని తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
దమ్మపేట: పామాయిల్ గెలలు కోస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని రంగువారిగూడెం శివారులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన తంగెళ్లమూడి పోలయ్య(40) రంగువారిగూడెంలో పామాయిల్ గెలలు కోసే పనికి వెళ్లాడు. పొడవాటి లోహపు పైప్తో గెలలు కోస్తుండగా, విద్యుత్ లైన్కు పైప్ తగిలి షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత..పాల్వంచరూరల్: మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లికి చెందిన పూనెం సరస్వతి(40) మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరస్వతి ఆదివారం మాట్లాడుతూనే కిందపడిపోగా స్థానిక అస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పాల్వంచ, కొత్తగూడెంలోని ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ మేరకు ఆమె కుమారుడు సాంబశివరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.సురేశ్ తెలిపారు. కాగా, ఆమె మృతికి కారణం తెలియలేదని చెప్పారు. గేదెను ఢీకొని వాహనదారుడు..దమ్మపేట: గేదెను బైక్ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన కూరం చంటి(36) తన బైక్పై దమ్మపేట మండలంలోని అంకంపాలెం వైపునకు సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, గండుగులపల్లి శివారుకు చేరుకునే సరికి చీకట్లో రోడ్డుపై గేదెను గమనించక ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంటి అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చంటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలి
మణుగూరు టౌన్: శ్రామిక శక్తితో పాటు యాంత్రిక శక్తి ఎంతో అవసరమని, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి కేసీహెచ్పీ, ఓసీ–2లో ఉత్పత్తి, సరఫరా ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయా గనుల అధికారులతో సమావేశమై మాట్లాడారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఉత్పత్తికి విఘాతం కలగకుండా చూడాలని, ఓసీల్లో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించేందుకు సరిపడా మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బీటీపీఎస్కు రోజుకు 15 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, సింగరేణి అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మీపతిగౌడ్, వెంకట్రావ్, శ్యాంసుందర్, గౌడే, నాగరమేశ్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ -
కస్తూరి జింక అవశేషాలు స్వాధీనం !
అశ్వారావుపేటరూరల్: అటవీ జంతువులకు సంబంధించిన అవశేషాలను ఫారెస్ట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను గోప్యంగా ఉంచడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన ఎస్కే అబ్దుల్ హఫీజ్ ఇంట్లో అటవీ జంతువులకు చెందిన విలువైన అవశేషాలు ఉన్నట్లు ఫారెస్టు రేంజర్ మురళికి సమాచారం అందింది. దీంతో సిబ్బందితో కలిసి హఫీజ్ ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కస్తూరి జింకకు సంబంధించిన 12 అవశేషాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి బాల్ అకారంలో ఉండగా, సువాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారని, ఖరీదు కుడా రూ.లక్షల్లో ఉంటుందని తెలిసింది. కాగా, ఈ అవశేషాలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు హైదారాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్కు పంపించి, దీని పై విచారణ చేస్తున్నారు. కాగా, అరుదైన కస్తూరి జింక అవశేషాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వీటిని ఏ విధంగా సేకరించాడు.. ఎంత కాలం నుంచి ఈ దందా సాగుతోంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. అయితే మూడు రోజుల క్రితం అబ్దుల్ హఫీజ్ను వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, పిల్లలు కలిసి తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన తర్వాత సదరు వ్యక్తి చికిత్స పేరుతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా, అదే రోజు అర్ధరాత్రి పరారయ్యాడు. అవశేషాల స్వాధీనంపై రేంజర్ వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. గోప్యంగా ఉంచిన అటవీ శాఖ అధికారులు -
‘సహకారం’లో బదిలీలు
● తొలిసారిగా ఉద్యోగులకు స్థానచలనం ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● ఉద్యోగుల డేటా, సర్వీసు వివరాల సేకరణ షురూ ● జిల్లాలో 21 సొసైటీల నుంచి 85 మందికి బదిలీకి అవకాశ ంఇల్లెందురూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ అవసరాలు తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వెనుదన్నుగా నిలుస్తున్నాయి. వారికి రుణాలు, ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో ఈ సంఘాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే కొన్ని సొసైటీల్లో అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థ ప్రక్షాళణపై దృష్టి సారించింది.తొలిసారిగా ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. 85 మంది రెగ్యులర్ ఉద్యోగులు.. సహకార వ్యవస్థ ప్రక్షాళనకు 2022 డిసెంబర్లో బీజం పడింది. సుదీర్ఘకాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే ముందు దశాబ్దాలుగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని 21 పీఏసీఎస్ల్లో 17 మంది కార్యదర్శులు, 50 మంది స్టాఫ్ అసిస్టెంట్లను, 18 మంది సబ్ స్టాఫ్ ఉద్యోగులు.. మొత్తం 85 మందిని క్రమబద్ధీకరించింది. బదిలీకి అడుగులు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల బదిలీపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల జీఓ జారీ చేయగా.. సుదీర్ఘకాలంగా ఒకే చోట విధుల్లో కొనసాగుతున్న వారితోపాటు ఐదేళ్ల కనిష్ట సీనియారిటీ కలిగిన వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. జిల్లాలోని సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా, సర్వీసు వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. బదిలీల్లో పారదర్శకత పాటించేలా జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీని కూడా నియమించారు. ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉద్యోగుల బదిలీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్మనెంట్ ఉద్యోగుల్లో కార్యదర్శి వేతనం సీనియారిటీని బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండగా, స్టాఫ్ అసిస్టెంట్, సబ్ స్టాఫ్ ఉద్యోగులకు రూ.15వేల నుంచి రూ.25వేలతో పాటు సుమారు రూ.2వేలు హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారు. ఈ వేతనంతో సొంత మండలం వీడి విధులు నిర్వహించడం కష్టమవుతుందని కిందిస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కార్యదర్శి హోదా గలవారిని బదిలీ చేసి, కిందిస్థాయి వారిని మినహాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలి సహకార శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో తక్కువ వేతనం పొందుతున్న స్టాఫ్ అసిస్టెంట్, సబ్స్టాఫ్లకు మినహాయింపు ఇవ్వాలి. ఉద్యోగులందరి బదిలీ తప్పదనకుంటే వేతనాలు పెంచాలి. ఆ దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాం. – రాజ్కుమార్, ఆఫీస్ అసిస్టెంట్ ఇల్లెందు ఉత్తర్వులు జారీ అయ్యాయి.. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఉద్యోగుల డేటా, సర్వీసు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. బదిలీలకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. – ఖుర్షీద్, జిల్లా సహకార అధికారి -
కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు !
● ఏడాదిగా బట్వాడా చేయని తపాలా ఉద్యోగి ? ● ఉన్నతాధికారులకు గ్రామస్తుల ఫిర్యాదుఅశ్వారావుపేటరూరల్: ఓ తపాలా ఉద్యోగి తన బా ధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ను గ్రామస్తులు సోమవారం వెలుగులోకి తీసుకొచ్చా రు. సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. అశ్వారావుపేట మండలం ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్.. పోస్టు ద్వారా గ్రామస్తులకు వచ్చిన ఆధార్ కార్డులు, బీమా పత్రాలు, పాన్, ఏటీఎం కార్డులతో పాటు పోలీస్ శాఖ ద్వారా వచ్చే నోటీసులను సైతం గత ఏడాది కాలంగా ఆయా వ్యక్తులకు అందించకుండా తన వద్దే ఉంచుకున్నాడని, తాము అడిగితే రాలేదని సమాధానం చెప్పేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిని లేఖలను కూడా తన గదిలోనే పడేయడంతో అవి కుప్పలుగా పేరుకుపోయాయని తెలిపారు. తమకు రావాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్ కార్డులు రాకపోవడంతో కొందరు అనుమానం వచ్చి ఉద్యోగి గదిలోకి వెళ్లి చూడగా కుప్పలుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వీటిపై సదరు ఉద్యోగిని స్థానికులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారంతా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై అశ్వారావుపేటలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
గిరిజన గురుకులంలో గందరగోళం
● 80 సీట్లు.. 120 మంది విద్యార్థులకు అనుమతి ● ఆ తర్వాత 40 మందిని నిరాకరించిన సుదిమళ్ల హెచ్ఎంఇల్లెందురూరల్: ప్రైవేటు పాఠశాలల్లో చదువు భారం కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని భావిస్తున్న విద్యార్థులు గురుకులాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఐదో తరగతి పూర్తయిన గిరిజన విద్యార్థులు ఆరో తరగతిలో చేరేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు వివిధ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. కాగా, సుదిమళ్ల గిరిజన గురుకులంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉండగా, తమ పాఠశాలలో చేరాలంటూ 120 మంది విద్యార్థులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు పాఠశాలలో అందజేశారు. అయితే వారిలో 40 మంది సీట్లు రద్దు చేస్తునట్లు ఈనెల 14న హెచ్ఎం మాధవి సదరు విద్యార్థులకు సమాచారం అందిచారు. ముందుగా సర్టిఫికెట్లు తీసుకుని నెల రోజులు గడిచాక సీట్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గురుకులాల డీసీఓ అరుణకుమారి మాట్లాడుతూ.. ఆన్లైన్లో అదనంగా పేర్లు నమోదు కావడంతో సీట్లు రద్దు చేశామని, ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగితా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. అయితే అదనంగా కేటాయించిన సీట్లపై ఉన్నతాఽధికారులకు సమాచారం చేరవేశామని, వారు తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము తదుపరి చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. -
అర్హులైన గిరిజనులంతా లబ్ధి పొందాలి
భద్రాచలం: అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా, వారు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. టేకులపల్లి మండలం మూర్తులతండాకు చెందిన లక్ష్మయ్య తమ పొలంలో బోరు బావి తవ్వించుకోవడానికి అనుమతికి, పెనుబల్లి మండలం గట్టిగూడెంకు చెందిన నాగేశ్వరరావు కరెంటు బోరు మోటారుకు, జూలూరుపాడు మండలం కర్రెవారి గూడెంకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణాలకు, అశ్వారావుపేట మండలం అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ మంచినీరు, రోడ్లు, కరెంటు ఏర్పాట్లకు, పాల్వంచ మండలం పునుకుల గ్రామానికి చెందిన వెంకటమ్మ క్రాప్ లోన్ కోసం, ఇంకా పలువురు వివిధ పనుల కోసం దరఖాస్తులు సమర్పించగా.. వాటిని సంబంధిత అధికారులకు అందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్బార్లో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏపీఓ వేణు, అధికారులు లక్ష్మీనారాయణ, సమ్మయ్య, ఉదయ్కుమార్, రమణయ్య, మనిధర్, ఆదినారాయణ, లింగా నాయక్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఫంక్షన్ హాల్, దుకాణాలకు 2న టెండర్లు
పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ సముదాయంలోని రెండు ఏసీ ఫంక్షన్ హాళ్లతో పాటు పలు దుకాణాలకు వచ్చే నెల 2న టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసీ ఫంక్షన్ హాళ్ల లీజు హక్కులకు ఆన్లైన్లో http://tendr. telagana.gv.in వెబ్ సైట్ లేదా దేవస్థానం కార్యాలయంలో 2వ తేదీ ఉదయం 11 గంటల్లోగా రూ.2వేలు చెల్లించి టెండర్ దాఖలు చేసుకోవాలని సూచించారు. కొత్త కాంప్లెక్స్లోని షాపులను మూడేళ్ల కాల పరిమితికి, పాత కాంప్లెక్స్లోని షాపులు నంబర్ 03,04తో పాటు తలనీలాలు, చీరలు పోగుచేసుకోవడం, పూలదండల విక్రయం, ఫొటోలు తీసుకునేందుకు 11 నెలల కాల పరిమితి లైసెన్స్ హక్కులు దక్కుతాయని వివరించారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీసుజాతనగర్: మండల కేంద్రంతో పాటు సీతంపేట బంజర గ్రామాల్లోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఏఓ నర్మద, ఎస్ఐ ఎం.రమాదేవి ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. పురుగుమందులు, ఎరువుల నిల్వలు తనిఖీ చేసి స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. పురుగుమందుల డబ్బాలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, తేదీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడువు ముగిసిన ఎరువులు, పురుగుమందులను విక్రయించవద్దని, గడువు తేదీని పరిశీలించిన తరువాతే రైతులకు అమ్మాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లు ఇవ్వాలని అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతివేంసూరు: ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ఇద్దరు మృతి చెందారు. వేంసూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ప్రమా దం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన నగరకంటి నాగరాజు(38), ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన బొల్లిపోగు కృష్ణకుమార్(12) తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జయలక్ష్మీపురం నుంచి కొండెగట్ల ప్రధాన రహదారి వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలోని కొండెగట్ల చెరువు మూలమలుపు వద్ద ద్విచక్ర అదుపు తప్పి కింద పడ్డాక రహదారిపై రాసుకుంటూ వెళ్లి ఎదురుగా కూలీలతో వచ్చిన ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన నాగరాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా కృష్ణకుమార్ను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుల్లోకృష్ణ కుమార్ ఆరో తరగతి చదువుతుండగా, నాగరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నా రు. ఘటనపై కృష్ణకుమార్ తండ్రి ముత్తారావు ఫిర్యాదుతో కేసు నమెదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. అంతర్రాష్ట సైబర్ నేరగాళ్లు అరెస్ట్ఖమ్మంక్రైం: ఆన్లైన్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లో డబ్బు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ.1.62కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోనకల్ మండలానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ లాభాల పేరిట నమ్మించారు. దీంతో ఆయన రూ.1.62కోట్లు చెల్లించగా.. ఆపై ముఖం చాటారు. దీంతో సదరు వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, సీపీ సునీల్దత్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. తొలుత ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన షేక్ సుభానీని అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాసరి సునీల్కుమార్, సుదలగుంట్ల సాయికృష్ణ కూడా ఈ మోసంలో ఉన్నట్లు తేలింది. ఈమేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, సీఐ యాసిన్అలీ, ఎస్ఐలు రంజిత్, విజయ్కుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
ముంజల కోసం ఆగి మృత్యువాత
రఘునాథపాలెం: తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు ఆగగా.. కారు ఢీకొన్న ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బూడిదంపాడు సమీపంలో ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మహిళ భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామేపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన బత్తుల వెంకటస్వామి తన భార్య శారద (31), కుమారుడు కార్తీక్ (12)తో కలిసి ఖమ్మం శ్రీనివాసనగర్లో బంధువుల ఇంటికి వచ్చాడు. వారు ఉప్పలమ్మ దేవతను పెట్టుకోగా, ఆ వేడుక పూర్తయ్యాక ద్విచక్ర వాహనంపై సాయంత్రం తిరిగి బయలుదేరారు. బూడిదంపాడు సమీపంలోని పవర్ గ్రిడ్ వద్ద తాటి ముంజల కోసం రోడ్డుకు కుడివైపున ఆగారు. కొనుగోలు చేశాక ప్రయాణం ప్రారంభించే సమయంలో ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శారద, కార్తీక్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా, వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ముంజలు విక్రయిస్తున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. వెంకటస్వామి ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్న ఆయన ఖాళీ సమయంలో సుతారి పనులు కూడా చేస్తుంటాడు. బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఈ ఘటనపై సీఐ ఉస్మాన్షరీఫ్ కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి -
ఇల్లెందువాసికి డాక్టరేట్
ఇల్లెందు: ఇల్లెందు కరెంటాఫీస్ ఏరియాకు చెందిన షేక్ రజియాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆదివారం రజియా వివరాలు వెల్లడించారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ కరుణసాగర్ నేతృత్వంలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ లభించిందని తెలిపింది. ఆమెకు డాక్టరేట్ రావడంపై పలువురు అభినందనలు తెలిపారు.తాళం వేసిన రెండిళ్లలో చోరీసుజాతనగర్: తాళం వేసిన రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని బాలాజీనగర్లో ఆదివా రం వెలుగుచూసింది. ఎస్ఐ రమాదేవి కథనం మేరకు.. బాలాజీనగర్లో కూరపాటి రాజేంద్రప్రసాద్, నాయుడు సతీశ్ వేర్వేరు వీధుల్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఇళ్లకు తాళం వేసి కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రప్రసాద్ ఇంట్లో 4.4 తులాల బంగారపు వస్తువులు, 44 తులాల వెండి, రూ.30 వేల నగదు, సతీశ్ ఇంట్లో 7 తులాల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.అటవీశాఖ సిబ్బందిపై ఫిర్యాదుదుమ్ముగూడెం: మండలంలోని గడ్డోరగట్ట గ్రామానికి చెందిన పోడు గిరిజనులు అటవీశాఖ సిబ్బందిపై ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలో అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్లతో టేకు చెట్లను నరికిస్తుండగా గ్రామస్తులు వెంబడించారు. ఇద్దరు పారిపోగా మరో ఇద్దరు వాచర్లు దొరకడంతో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యతిరేక సాక్ష్యాలను సృష్టించేందుకు అటవీశాఖ చేసిన కుఠిల యత్నాలు బెడిసికొట్టాయని పలువురు అంటున్నారు. ఈ ఘటనపై సీఐ అశోక్ మాట్లాడుతూ.. కేసు హైకోర్టులో ఉన్నందున.. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పోడుసాగుదారులకు సూచించారు.బైక్ను ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతికొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం కొణిజర్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దరాంపురం గ్రామానికి చెందిన ఇనపనూరి నాగేశ్వరరావు అలియాస్ నాగరాజు (33) తన కుమార్తెను ఖమ్మం వైద్యశాలలో చేర్పించి డబ్బుల కోసం ఇంటికి వస్తున్న క్రమంలో బస్వాపురం క్రాస్రోడ్డు వద్ద ఖమ్మం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుష్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బొప్పాయి.. మేలోయి
పంట సాగుతో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం ● ఉమ్మడి జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు ● ఎకరాకు 25 టన్నుల వరకు దిగుబడి ● రూ. 20 వేల వరకు పలుకుతున్న టన్ను ధరఖమ్మంవ్యవసాయం: అధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల్లో బొప్పాయి ఒకటి. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే ఇది తక్కువ కాలపు పంట. మొక్క వేసిన తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తోటలకు నాలుగేళ్ల పాటు అవకాశం ఉన్నా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకే దిగుబడి పొందుతూ ఆ తర్వాత తొలగిస్తున్నారు. మార్కెట్లో బొప్పాయికి డిమాండ్ పెరగడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. బొప్పాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, ఇతర వ్యాధులు సోకినప్పుడు బొప్పాయి పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది. చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వివిధ రకాల విటమిన్లు, పోషకాలను ఇస్తుండగా దీనికి డిమాండ్ పెరిగింది. ఈ పంట సాగు పెరిగినప్పటికీ.. దీనికి కూడా ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉంది. ఈదురుగాలులు వచ్చినప్పుడు దెబ్బతినే ప్రమాదం ఉంది. 2 వేల ఎకరాల్లో సాగు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వేల ఎకరాల్లో బొప్పాయిని రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, కామేపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, చింతకాని, ముదిగొండ, మధిర, వైరా, ఏన్కూ రు, తల్లాడ తదితర మండలాల్లో 1,700 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తుండగా, భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్, ఇల్లెందు, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి తది తర మండలాల్లో 300 ఎకరాల్లో సాగులో ఉంది. ఖర్చుకు డబుల్ ఆదాయం.. బొప్పాయి సాగు పెట్టుబడి ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. మొక్కలు, డ్రిప్, మల్చింగ్, దుక్కులు చేయడం తదితర ఖర్చులుంటాయి. అయితే ప్రభుత్వం ఈ పంట సాగుకు ప్రోత్సాహకంగా ఎకరాకు రెండేళ్ల కాలానికి రూ. 27వేల వరకు ఇస్తుంది. ఇక ఎకరాకు ఆదాయం రూ.2 లక్షలకు పైగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో సాగు చేసే బొప్పాయి ఎకరాకు 25 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. పంట వేసిన 9 నెలల నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతూ ప్రతీ 15 రోజులకు ఒకసారి చేతికందుతుంది. మొదటి 8 కోతల కాయ బాగా నాణ్యంగా ఉంటుంది. ఆ తర్వాత కొంతమేరకు నాణ్యతతో పాటు సైజ్ కూడా తగ్గుతాయి. 20 నుంచి 22 టన్నుల వరకు నాణ్యమైన, 3 నుంచి 5 టన్నులు కొంత తక్కువ నాణ్యత గల కాయలు దిగుబడి అవుతాయి. టన్ను రూ.20 వేలు.. బొప్పాయి టన్ను ధర రూ.20 వేల వరకు పలుకుతుంది. ఢిల్లీ, కోల్కతా, ముంబయి ప్రాంతాల వ్యాపారులు ఇక్కడి తోటలను పరిశీలించి కాయ సైజు, నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. మొదటి కోత టన్నుకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు, చివరి కోత రూ.10 వేల వరకు పెడుతున్నారు. -
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
పాల్వంచరూరల్: క్రీడలతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని కిన్నెరసానిలోని క్రీడాపాఠశాల మైదానంలో ఆదివారం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగులకు క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఐటీడీఏ పీఓ జట్టు, భద్రాచలం జోన్, దమ్మపేట, ఇల్లెందు ఐటీడీఓ జట్లు పాల్గొన్నాయి. పీఓ పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. విధి నిర్వహణలో అలసిపోయిన ఉద్యోగులకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని చెప్పారు. కాగా, ఫైనల్ మ్యాచ్లో ఐటీడీఏ పీఓ జట్టు, భద్రాచలం జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భద్రాచలం జోన్ జట్టు పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేశారు. పీఓ జట్టు పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి విజయం సాధించి కప్పును కై వసం చేసుకుంది. అయితే, ఐటీడీఓ పీఓ బి.రాహుల్ 9 పరుగులు చేయడమే కాక మూడు వికెట్లు తీశారు. కార్యక్రమంలో దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావు, ఏఎస్ఓ వెంకటనారాయణ, నాగేశ్వరరావు, శంకర్, ఎం.బాలు, పి.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, కబీర్ పాల్గొన్నారు. -
ఐకేపీలో అక్రమాల పర్వం..
బూర్గంపాడు: మండల ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీసీలు, బుక్కీపర్లు అందినకాడికి డ్వాక్రా సంఘాల మహిళల సొమ్మును స్వాహా చేశారు. బూర్గంపాడు ఐకేపీలో లక్షల రూపాయ ల నిధులు స్వాహా అయినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలుతోంది. శనివారం బూర్గంపా డు గౌతమిపురంలోని గ్రామసమాఖ్యలోని 19 డ్వాక్రా సంఘాల సభ్యులు చెల్లించిన సీ్త్రనిధి రు ణాలలో ఐకేపీ సిబ్బంది చేతివాటం చూపించిన ట్లు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ఆరోపణలపై సీ్త్రనిధి ఆర్ఎం సోషల్ ఆడిట్కు ఆదేశించారు. ఇదిలాఉండగా జీవనజ్యోతి, వెన్నెలజ్యోతి, శబరి, శ్రీరామ, చైతన్య, టేకులచెరువు, నకిరిపేట, కృష్ణసాగర్ గ్రామ సమాఖ్యల పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులు చెల్లించిన నిధులను వారి రుణఖాతాల్లో జమ చేయకుండా సీసీ రాంబాబు స్వాహా చేశారని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన సెర్ప్ అధికారులు రూ.1.92లక్షల నిధులు దుర్విని యోగమైనట్లు నిర్ధారించారు. దీనిపై సంబంధిత సీసీ రాంబాబుకు షోకాజ్ నోటీస్లు జారీచేశారు. డ్వాక్రా మహిళలకు ఐకేపీ, సీ్త్రనిధి నుంచి రుణా లు అందిస్తున్నారు. కాగా,రుణాలు ఇచ్చే సమయంలో కూడా ఐకేపీ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని, సీసీకి, బుక్కీపర్కు ఒక్కో సభ్యురాలు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. సీ్త్రనిధి రుణాల మంజూరులో కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. సిబ్బంది కాజేసిన డబ్బులు రికవరీ చేసి తమ అప్పు ఖాతాల్లో జమచేయాలని డ్వాక్రా సంఘాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు. సీ్త్రనిధి చెల్లింపుల్లో నిధులు స్వాహా సీసీకి షోకాజ్ నోటీసులు జారీ -
ఆర్టీఐపై అవగాహన పెంచుకోవాలి
రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్కొత్తగూడెంఅర్బన్: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. చట్టం దుర్వినియోగం చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత శ్రీనివాస్ను తెలంగాణ ఉద్యమ నాయకులు, సింగరేణి సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. రాజకీయ పార్టీల నాయకులు జేవీఎస్ చౌదరి, బిక్కసాని నాగేశ్వరావు, జీవీకే మనోహర్, కంచర్ల చంద్రశేఖర్, మేరెడ్డి జనార్దన్ రెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకులు దుద్దుకూరి రామారావు, కల్లోజి శ్రీనివాసరావు, మహ్మద్ షఫీ, వట్టికొండ రవి, చండ్రా నరసింహారావు, ఇమంది ఉదయ్ కుమార్, సుధాకర్, వాహబ్, విద్యాసంస్థల అధినేతలు మాచవరపు కోటేశ్వరరావు, తలశిల భరత్కృష్ణ పాల్గొన్నారు. ఆర్టీఐ నూతన కమిషనర్కు కలెక్టర్ స్వాగతంసింగరేణి(కొత్తగూడెం): రాష్ట్ర సమచార కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి.వీ శ్రీనివాస్ తొలిసారిగా ఆదివారం కొత్తగూడెం వచ్చారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆయన్ను కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క అందజేసి స్వాగతం పలికారు. -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ సమీపం నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయ నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 698 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.38,025 ఆదాయం లభించింది. 500 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.28,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఒక్కరోజు ఆదాయం రూ.64,025 -
సేద్యానికి ‘స్వర్ణ’యుగం
తక్కువ ధరకే రోటోవేటర్ యంత్రం తయారీ ● పూరి గుడిసెలో సాగుతున్న కుటీర పరిశ్రమ ● ఆదర్శంగా నిలుస్తున్న యువ మహిళా ఇంజనీర్ఇల్లెందు రూరల్: గతంతో పోలిస్తే వ్యవసాయంలో యాంత్రికీకరణ పెరిగి రైతులకు పనులు సులువవుతున్నాయి. విత్తనాలు నాటడం నుంచి పంట చేతికందే వరకు అన్నింటికీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధరకు భయపడి సన్న, చిన్నకారు రైతులు ఇంకా కూలీలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరకే కల్టివేటర్ తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఓ యువ ఇంజనీర్. కుల వృత్తే స్ఫూర్తిగా.. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామానికి చెందిన చిట్టోజి మోహనాచారి కుల వృత్తి అయిన వడ్రంగి పనులతో జీవనం సాగించేవాడు. వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం ఆయన ప్రత్యేకత. కుమార్తె స్వర్ణ బీటెక్ పూర్తి చేసింది. చిరుప్రాయం నుంచి తండ్రి చేసే పనులు చూసిన ఆమె.. కరోనా సమయంలో ఇంటి వద్ద తండ్రికి సాయంగా ఉంటూ వ్యవసాయానికి అవసరమయ్యే కల్టివేటర్ తయారీపై దృష్టి సారించింది. మార్కెట్ కంటే తక్కువఽ ధరతోనే రూపొందించి స్థానిక రైతులకు విక్రయించింది. రైతుల నుంచి ప్రోత్సాహం లభించడంతో నాలుగేళ్లుగా విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇంటివద్దే పూరిగుడిసెలో.. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. ప్రారంభంలో అప్పు చేసి కల్టివేటర్(పవర్ వీడర్) తయారీకి అవసరమైన ముడి సరుకును హైదరాబాద్, విజయవాడ నుంచి తెప్పించేది. ఆపై ఇంటి వద్దే తండ్రి, సోదరి రజిత సహకారంతో విజయవంతంగా కల్టివేటర్ తయారీ ప్రారంభించింది. మొదట నెలకు నాలుగైదు యంత్రాలను తయారు చేసి.. క్రమంగా ఆ సంఖ్యను పదికి పెంచింది. మార్కెట్లో కల్టివేటర్ ధర రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండగా.. స్వర్ణ మాత్రం 7హెచ్పీ సింగిల్ వీల్ కల్టివేటర్ రూ.26 వేలు, 7హెచ్పీ డబుల్ వీల్ కల్టివేటర్ రూ.28 వేలకే విక్రయిస్తోంది. ధర తక్కువైనా బయటి వాటికంటే నాణ్యంగా ఉన్నాయని రైతులు కితాబిస్తుండడం విశేషం. వినియోగం ఇలా.. ఎరువులు, పురుగు మందులతో పాటు కూలీల రేట్లు కూడా భారీగా పెరగడంతో రైతులకు పెట్టుబడి భారమవుతోంది. ఈ క్రమాన యాంత్రీకరణ విధానం భారం తగ్గిస్తున్నా.. వాటి ధరలు చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే స్వర్ణ తయారు చేస్తున్న కల్టివేటర్(పవర్ వీడర్లు) ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు అండగా నిలుస్తున్నాయి. విత్తనం మొలకత్తే దశలో కలుపు తొలగించడం, మొక్కల వరుస మధ్యలో దున్నడం, ఆ తర్వాత పాదులు చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.ప్రోత్సహిస్తే మరిన్ని యంత్రాలు బీటెక్లో నేర్చుకున్న పాఠాల ఆధారంగా వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించా. తొలి ప్రయత్నంలో విజయం సాధించా. ఇవి అమ్మితే వస్తున్న ఆదాయం పెట్టుబడి ఖర్చులు పోగా కుటుంబ పోషణకు సరిపోతోంది. యంత్రాల తయారీని విస్తరించే ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తే మరిన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు తయారుచేస్తా. – చిట్టోజి స్వర్ణ -
ఆగుతూ.. సాగుతూ..
ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ● బిల్లులు మంజూరుకాక రెండోసారి ఆగిపోయిన పనులు ● అద్దె భవనాల్లో హాస్టళ్లు, ఇరుకు గదుల్లో తరగతులుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నాలుగో ఏడాదిలోకి వస్తున్నా మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అకడమిక్ తరగతి గదులు, హాస్టల్, మెస్, రెసిడెంట్ వైద్యుల క్వార్టర్లు వంటి నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకున్న సమయంలో మరోసారి ఆగిపోయాయి. ఆగిన పనులు మెడికల్ కాలేజీ హాస్టల్, తరగతి గదులు, మెస్, రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాల నిర్మాణం జరుగుతోంది. అకడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ 4, బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్, స్టాఫ్ క్వార్టర్స్ జీ ప్లస్ 2గా నిర్మించాల్సి ఉంది. 2023 ఆరంభంలో పనులు మొదలవగా 2024 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకోగా రూ. 75 కోట్ల మేర పనులు జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా తలుపులు, కిటికీలు, డ్రెయినేజీ, ఎలక్ట్రికల్ తదితర పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.30 కోట్లకు పైగా పేరుకుపోవడంతో పనులు మధ్యలోనే ఆగినట్టు తెలుస్తోంది. నాలుగేళ్లుగా కరోనా సంక్షోభం తర్వాత వైద్యసేవల రంగాన్ని విస్తరించడంలో భాగంగా కొత్త మెడికల్ కాలేజీలను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు 2021లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా వచ్చింది. మెడికల్ కాలేజీ కంటే నర్సింగ్ కాలేజీ భవనాలు ముందుగా నిర్మించారు. దీంతో నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన భవనాల్లోనే మెడికల్ కాలేజీ కొనసాగుతోంది. మరోవైపు అద్దె భవనంలో నర్సింగ్ కాలేజీ నడుస్తోంది. కాలేజీ మంజూరై నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ భవనాలు పూర్తి కాలేదు. ఇరుకు హాస్టళ్లలో.. మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ విద్యార్థులు 2022 నవంబర్లో చేరారు. ప్రస్తుతం మూడు బ్యాచ్లకు సంబంధించి 450 మంది విద్యార్థులు ఉన్నారు. బాయ్స్ హాస్టల్ కాలేజీ క్యాంపస్ ఎదురుగా ఉన్న మంచికంటి నగర్ ఏరియాలో, గర్ల్స్ హాస్టల్ పాల్వంచ మార్కెట్ ఏరియాలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మూడు బ్యాచ్ల విద్యార్థులు రావడంతో ఇప్పటికే అద్దె భవనాలు కిక్కిరిసి ఉన్నాయి. అద్దె బిల్లులు కూడా సకాలంలో రాకపోవడంతో భవనాల యజమానులు సైతం గుర్రుగా ఉంటున్నారు. ఈ ఏడాది నాలుగో బ్యాచ్లో మరో 150 మంది విద్యార్థులు రాబోతున్నారు. కనీసం ఈ ఏడాది చివరి నాటికై నా కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోతే విద్యార్థులకు ఇక్కట్లు తప్పవు. ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.పెరుగుతున్న వ్యయం మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు 2023లో మొదలయ్యాయి. బిల్లులు మంజూరు కావడం లేదంటూ నిర్మాణ పనులు పునాదుల దశలో ఉండగానే అదే ఏడాది జూన్లో కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో 2024 జూన్ వరకు ఏడాదిపాటు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరకు మంత్రి పొంగులేటి చొరవతొ రూ. 30 కోట్లు మంజూరుకాగా 2024 జూలైలో మళ్లీ పనులు ఊపందుకున్నాయి. ఇదే జోరులో ఈ ఏడాది చివరికై నా భవనాలు అందుబాటులోకి వస్తాయనుకుంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది. ఆరంభంలో భవనాల నిర్మాణ వ్యయం రూ. 105 కోట్లు ఉండగా, తొలి సవరణలో రూ.130 కోట్లకు చేరింది. ప్రస్తుతం అది రూ.147 కోట్లకు చేరుకుంది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చ వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలరించిన భక్తి గీతాలుభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన సన్నిధిలో ఆదివారం హైదరాబాద్కు చెందిన ఆవుల శ్రీలాస్య ఆలపించిన కర్ణాటక సంగీత భక్తి గీతాలాపన భక్తులను అలరించింది. డాక్టర్ అశ్విన్, రాయప్రోలు సుబ్రహ్మణ్య శర్మ, జగన్మోహిని తదితరులు సంగీత సహకారం అందజేశారు. -
తెర మరుగు!
● జిల్లాలో మూతపడుతున్న సినిమా థియేటర్లు ● ప్రేక్షకులు రాక యాజమాన్యాలకు నిర్వహణ భారం ● ఇప్పటికే కొన్ని ఫంక్షన్హాల్, షాపింగ్ మాల్స్గా.. ● ఉపాధి కోల్పోతున్న థియేటర్లో పనిచేసే కార్మికులుబూర్గంపాడు: ఒక్కప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించేది. ఇప్పుడు కనీసం సగం థియేటర్ కూడా నిండే పరిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు కూడా మూడురోజుల ముచ్చటగానే మారుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు నడిపే యాజమాన్యాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఒక్కోసారి సినిమా షో ప్రదర్శిస్తే కనీసం కరెంట్ బిల్లు కూడా రావడంలేదని పేర్కొంటున్నాయి. సినిమా విడుదలైన రోజే పైరసీ ప్రింట్ సెల్ఫోన్లలో హల్చల్ చేయడం, ఓటీటీ ప్లాట్ఫామ్ విస్తృతం కావడంతో ప్రేక్షకులు థియేటర్ వైపు వెళ్లడంలేదు. కొత్త మూవీలు కూడా ఓటీటీలో ఇంట్లో కూర్చునే వీక్షిస్తున్నారు. తెలుగుతోపాటు పలు భాషా చిత్రాలు కూడా ఓటీటీతో చేరువ అవుతున్నాయి. దీంతో వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారిన థియేటర్లు ఇప్పుడు మూతపడుతున్నాయి. నమ్ముకున్న కార్మికులు రోడ్డున.. సినిమా థియేటర్ల మూసివేతతో పలువురు కార్మికులు వీధిన పడుతున్నారు. సినిమా నడిపించే ఆపరేటర్లు, స్వీపర్లు, పోస్టర్లు వేసేకార్మికులు, టికెట్ బుకింగ్, క్యాంటీన్, సైకిల్ స్టాండ్, పాన్షాపులు, కూల్ డ్రింక్ షాపులు, తినుబండారాల షాపుల నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే ఆటోవాలాలకు కూడా గిరాకీ తగ్గుతోంది. వీరిలో చాలామంది కూలి పనులకు వెళ్తుండగా, కొందరు పాన్షాపులు, బజ్జీల బండ్లు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5జీ నెట్వర్క్ విస్తరించి ఇళ్లలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్, హోమ్ థియేటర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో మూతపడే ప్రమాదం ఉంది. సగం థియేటర్లు మూత జిల్లాలో ఇప్పటికే సగం థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్నవి కూడా నష్టాలతోనే సాగుతున్నాయి. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఏడు థియేటర్లు ఉండగా, ప్రస్తుతం మూడు మాత్రమే నడుస్తున్నాయి. రెండు థియేటర్లను కూల్చివేశారు. ఒక థియేటర్ను షాపింగ్మాల్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో మూడు చొప్పున థియేటర్లు ఉండగా, ఇప్పటికే ఒక్కోటి మూతపడ్డాయి. పాల్వంచలో నాలుగు థియేటర్లు ఉండగా, రెండు మూతపడ్డాయి. చర్లలో రెండు థియేటర్లు ఉండగా, ఒకటి ఫంక్షన్హాల్గా మార్చారు. సారపాకలో ఉన్న థియేటర్ కూడా మూతపడగా, ఫంక్షన్హాల్, షాపింగ్ మాల్గా మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉంది. బూర్గంపాడులోని థియేటర్ను మూసివేసి ఐటీసీ అనుబంధ పరిశ్రమకు లీజుకు ఇచ్చారు. అశ్వారావుపేటలో ఒక థియేటర్ మాత్రమే ప్రస్తుతం నడుస్తోంది. దమ్మపేటలో ఉన్న థియేటర్ అప్పుడప్పుడు నడిపిస్తున్నారు. -
అశోక్నగర్లో నివాసాల కూల్చివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అశోక్నగర్ కొత్తకాలనీలో ఉన్న 41 నివాసాలను శనివారం గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేశారు. కాగా, ఈ ఇళ్లలో ఉండేవారికి రాష్ట్ర ప్రభత్వం గత నెలలో డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిందని, ఈ ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జామాయిల్ మొక్కలను నాటి, సంరక్షించనున్నామని గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.ఓయూ నుంచి డాక్టరేట్సత్తుపల్లి: సత్తుపల్లిలోని గీతమ్స్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన కునుసోతు అశోక్కుమార్కు డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభా గం ప్రొఫెసర్ డాక్టర్ బి.రమాదేవి పర్యవేక్షణ లో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. వేరుశనగలో వచ్చే కాండం కుళ్లు తెగులును తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్టులు లేకుండా నిరోధించేలా చేసిన పరిశోధనలపై అశోక్కుమార్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గీతమ్స్ కళాశాల డైరెక్టర్ దొడ్డా శ్రీనివాసరెడ్డి, శాంతినికేతన్ కళాశాల ప్రిన్సిపాల్ మమంద్రారెడ్డి తదితరులు అభినందించారు.ట్రాక్టర్ ఢీకొని కార్మికులకు గాయాలుపాల్వంచ: ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు మున్సిపల్ కార్మికులకు గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని దమ్మపేట సెంటర్ వద్ద శనివారం పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులు బొమ్మన కిరణ్, ఇందులను ట్రాక్టర్ ఢీ కొనడంతో స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ముగిసిన పీఈటీల శిక్షణటేకులపల్లి: జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు గత ఐదు రోజులుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. 100 మంది పీఈటీలు శిక్షణకు హాజరయ్యారు. కోర్సు ఇన్చార్జ్గా మెరుగు శ్రీనివాస్ వ్యవహరించగా రిసోర్స్ పర్సన్లు నరేష్కుమార్, శ్రీనివాసరావు, రామనాథం, కవిత వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇంకా మోటివేషన్, ఫిజియోథెరపీ, సీపీఆర్, నైతిక విలువలు, నేరాలు – వాటి నివారణ తదితర అంశాలపై హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బి.మాధురి, జవ్వాది వెంకటేశ్వరబాబు, షీ టీమ్ ఎస్ఐ రమాదేవి, శ్రీజ బోధించారు.కేసు నమోదుఇల్లెందు: పట్టణంలోని ఆదిత్య ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇల్లెందు ఎస్ఐ పి.శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. గత ఆదివారం అర్ధరాత్రి దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి సుమారు రూ.1.90 కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని యజమాని ప్రొద్దుటూరి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు అందించారు. కాగా, ఏఓ సతీశ్ అందజేసిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు.విద్యుదాఘాతంతో గేదె మృతిఅశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతంతో ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన శనివారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని మెరుపుకాలనీకి చెందిన కోరుకొండ రాజమ్మ తన మూడు పాడి గేదెలను మేత కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఓ హోటల్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం (ఐరన్) వద్దకు వెళ్లగా షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ.90 వేలు అని రాజమ్మ వాపోయింది. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ములకలపల్లి: ఇంట్లో వేలాడే విత్యుత్ తీగలు ఆ యువకుడి పాలిట యమపాశాలయ్యాయి. ఆరేసిన బట్టలు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని వీకే రామవరంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొర్సా శ్రీను పద్మ దంపతుల చిన్న కుమారుడు అరవింద్ (14).. స్నానం చేసి, ఇంట్లో దండేనికి ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడురైతులు ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ ఎల్లాపురం గ్రామంలో అటవీశాఖ సిబ్బందిని పోడురైతులు శనివారం అడ్డుకున్నారు. రైతులు తమ చేలల్లో విద్యుత్ సౌకర్యం కోసం పనులు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి బయలుదేరగా ఎల్లాపురం సమీపంలోనే పోడు రైతులు అడ్డుకున్నారు. పోడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఉన్నతాధికారుల అనుమతితోనే తాము విద్యుత్ స్తంభాలు పాతేందుకు పనులు చేపట్టామని తెలిపారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు భద్రాచలంఅర్బన్: బాలిక కనిపించకుండా పోయిన ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఆదర్శనగర్కాలనీకి చెందిన చిలకల లక్ష్మి, ఆదినారాయణకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కాగా ఈ నెల 22న అర్ధరాత్రి లక్ష్మి నిద్ర లేచిచూడగా ఇంట్లో కూతురు కనిపించకలేదు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో లక్ష్మి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ ఘటనపై..భద్రాచలంఅర్బన్: బంగారు ఆభరణాల చోరీపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలోని గోల్డ్స్మిత్కాలనీకి చెందిన మహిళ అంజు పాల్ ఈ నెల 22న హనుమాన్ జయంతి సందర్భంగా తన స్నేహితులతో కలిసి రామాలయం దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి, రూ. 56 వేల విలువైన బంగారం చోరీ చేశారని.. అంజుపాల్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయగా టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంకుడుగుంతలతో లాభాలెన్నో..
అశ్వారావుపేటరూరల్/మణుగూరురూరల్/సుజాతనగర్: ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇళ్లల్లోనూ తప్పనిసరిగా వాటిని నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. ఇంకుడుగుంతలతో నీటి కొరత తీరుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 20 వేల ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇంకా 10 వేల ఇంకుడుగుంతలు నిర్మించనున్నామని వెల్లడించారు. శనివారం అశ్వారావుపే మండలంలోని వినాయకపురం పీహెచ్సీతోపాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అలాగే మణుగూరు మండలంలోని తోగ్గూడెం, కట్టుమల్లారం, ముత్యాలమ్మనగర్ తదితర గ్రామాల్లో డీఆర్డీఓ, అదనపు కలెక్టర్ విద్యాచందన పర్యటించి ఇంకుడుగుంతలను పరిశీలించారు. అలాగే, సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ, రాఘవాపురం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను డీపీఓ చంద్రమౌళి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీనివాసరావు, నల్లబోతుల రవి, ప్రవీణ్కుమార్, రాందాస్నాయక్, రామచందర్రావు, అక్షిత, ముత్తారావు, మనోహర్, తేళ్లూరి శ్రీనివాసరావు, పల్నాటి వెంకటేశ్వరరావు, చెన్నకేశవరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణాలను పరిశీలించిన అధికారులు -
సింగరేణి జీఎం ఆఫీస్ ముట్టడి..
ఇల్లెందు: సింగరేణి జేకేఓసీ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. పట్టణంలోని 21 ఏరియా సింగరేణి పురాతన క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికులు, చుట్టుపక్కలవారు కలిసి కార్యాలయంలోకి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పారు. అనంతరం జీఎం వీసం కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సదర్భంగా అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాయకుడు కె.సారయ్య మాట్లాడుతూ.. ఓసీ విస్తరణలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఏ నబీ, జె.వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్కుమార్, క్లింట్ రోచ్, రాంసింగ్, సురేందర్, కవిత, శ్రీనివాస్, మొగిలి, సదయ్య, మహేష్, లాలు, సత్యనారాయణ, కృష్ణ, రాజు, విజయ్, సారంగపాణి, మధు తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి రుణాల చెల్లింపులో చేతివాటం
బూర్గంపాడు: సీ్త్రనిధి రుణాల చెల్లింపులలో ఐకేపీ సిబ్బంది, సీ్త్రనిధి అధికారులు చేతివాటంతో తమకు నష్టం కలిగించారని డ్వాక్రా మహిళలు శనివారం బూర్గంపాడు ఐకేపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గౌతమిపురం లక్ష్మీ గ్రామసమాఖ్యలోని డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న సీ్త్రనిధి రుణాల చెల్లింపులలో ఐకేపీ సిబ్బంది తమ వద్ద నగదు తీసుకుని ఖాతాలో జమచేయలేదని మహిళలు ఆరోపించారు. తాము చెల్లించిన నగదును ఐకేపీ సిబ్బంది సొంత అవసరాలకు వాడుకున్నారన్నారు. సీ్త్రనిధి రుణాల చెల్లింపులో బ్యాంకు నిర్దేశించిన నగదు కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ గ్రామ సమాఖ్యకు చెందిన 20 డ్వాక్రా సంఘాల సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆక్షేపించారు. అనంతరం డ్వాక్రా సంఘాలు మహిళలు ఐకేపీ ఏపీఎం నాగార్జునను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన సీ్త్రనిధి రీజినల్ మేనేజర్కు వివరించగా.. సోషల్ అడిట్ నిర్వహించి వాస్తవాలను వెలికితీస్తామని ఆర్ఎం హామీనిచ్చారు. అప్పటివరకు లక్ష్మీ గ్రామ సమాఖ్యకు సంబంధించిన లావాదేవీలను చూసే బుక్ కీపర్, సీసీలను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లు ఏపీఎం వెల్లడించారు. ఐకేపీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన -
‘సీతారామ’ గ్రామసభ వాయిదా..
● అధికారుల వాహనాల ఎదుట గిరిజనుల బైఠాయింపు ● రామన్నగూడెంలో ఘటన అశ్వారావుపేటరూరల్: సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కింద నిర్మించే కాల్వలకు సంబంధించిన భూసేకరణ కోసం నిర్వహించే గ్రామసభను గిరిజనులు అడ్డుకొని, అధికారుల వాహనాల ఎదుట బైఠాయించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని కన్నాయిగూడెం, నారాయణపురం, వేదాంతపుర, అనంతారం గ్రామాల్లో భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించారు. కానీ, రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల బృందం వాహనాలను స్థానిక గిరిజనులు అడ్డుకుని, వాటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఊట్లపల్లి వద్దగల వెంకమ్మ చెరువు వరద కాల్వ నిర్మాణానికి సంబంధించి 2008లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు 60 మంది రైతులకు చెందిన 40 ఎకరాల సాగు భూమిని సేకరించారని, 17 ఏళ్లు అయినా పరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మళ్లీ సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణాలకు భూసేకరణ ఏవిధంగా చేస్తారని, వెంకమ్మ వరద కాల్వ పరిహారాన్ని 2013 చట్ట ప్రకారం ఇస్తేనే సహకరిస్తామనన్నారు. దీంతో రెండు గంటలకుపైగా అధికారులను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎస్ఐ యయాతి రాజు సిబ్బందితో అక్కడి చేరుకొని వారికి నచ్చజెప్పేందుకు యత్నించగా వారు ససేమిరా అన్నారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు రైతులను తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని స్థానిక డీటీ రామకృష్ణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామసభను వాయిదా వేసి, అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. -
‘థైరాయిడ్’పై నిర్లక్ష్యం చేయొద్దు..
● అవగాహనతోనే ఆరోగ్యం ● పరీక్షలు తప్పనిసరి నేడు వరల్డ్ థైరాయిడ్ డేకరకగూడెం: థైరాయిడ్ మానవ శరీరంలోని మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీర జీవక్రియ (మెటబాలిజం) నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయి. అంటే శరీరం శక్తిని ఎలా ఉపయోగిస్తుంది, ఉష్ణోగ్రతను ఎలా నియంత్రిస్తుంది, గుండె, మెదడు, కండరాల వంటి ముఖ్యమైన అవయవాలు ఎలా పనిచేస్తాయి అనే వాటిని ఈ హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా మే 25న ‘వరల్డ్ థైరాయిడ్ డే’ను జరుపుకుంటారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. రకాలు.. లక్షణాలు.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. ఇంకా థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ కేన్సర్ ఉన్నాయి. అలసట, బరువు పెరగడం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు. బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ లేదా కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపుతో వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం లేదా ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం లేదా అధికంగా తీసుకున్నా దీని బారిన పడతారు. నివారణ, చికిత్స థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్యపరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోథైరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, లేదా శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ కేన్సర్ ఉన్నవారికి శస్త్రచికిత్స, కీమోథెరపీ లేదా రేడియేషన్ అవసరం కావొచ్చు. సరైన చికిత్సతో థైరాయిడ్ సమస్యలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత లేదా రుతుక్రమం ఆగిన తర్వాత (మెనోపాజ్) ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి లు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం లేదా హైపర్థైరాయిడిజం మాతా, శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. నిర్లక్ష్యం చేయొద్దు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో థైరాయిడ్ పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నా యి. ప్రభుత్వం థైరాయిడ్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. థైరాయిడ్ సమస్యలను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. థైరాయిడ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. –ఎల్.భాస్కర్నాయక్, డీఎంహెచ్ఓ -
ఏసీబీ అధికారినంటూ బెదిరింపు
టేకులపల్లి: ఏసీబీ అధికారినంటూ ఏకంగా తహసీల్దార్కే ఫోన్ చేసి బెదిరించి రూ.98 వేలు కాజేసిన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. శనివారం మధ్యాహ్నం 74832 47988 (మంజు గౌరి పేరుతో ఉన్నది) నంబర్ నుంచి తహసీల్దార్ ముత్తయ్యకు ఫోన్ వచ్చింది. ‘ఏసీబీ అధికారిని మాట్లాడుతున్నా.. మీ ఆర్ఐ నాకు చిక్కాడు. మీ పేరు చెబుతున్నాడు. కేసులో మీ పేరు కూడా రాస్తా.. కావాలంటే మాట్లాడండి’ అని ఆర్ఐతో ఫోన్లో మాట్లాడించాడు. రూ.2 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పాడు. అయితే విషయం ఏంటో తెలుసుకోకుండానే భయాందోళనకు గురైన తహసీల్దార్ ఫోన్ చేసిన వ్యక్తికి మొదట రూ.50వేలు, ఆ తర్వాత అర్ధగంట వ్యవధిలో రూ.48 వేలు.. మొత్తం రూ.98 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత ఆర్ఐని పిలిచి మాట్లాడితే.. తన వద్దకు ఎవరూ రాలేదని, ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన తహసీల్దార్ వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ముత్తయ్య మాట్లాడుతూ.. ఈనెలాఖరున తాను రిటైర్డ్ అవుతున్నానని, ఏసీబీ అధికారినని చెప్పగానే కంగారులో ఫోన్ పే చేశానని చెప్పారు. తనకు ఏసీబీ అధికారినంటూ ఫోన్ రావడం అనుమానంగా ఉందని, ఎవరో కుట్ర పన్ని ఇలా చేశారని అంటున్నారు. ఆ తర్వాత ఆ నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని చెప్పారు. దీనిపై ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కాగా, ఆర్ఐ రత్తయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. రూ.98 వేలు ఫోన్ పే చేసిన తహసీల్దార్ -
నిబద్ధతతో పని చేయాలి
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ : ప్రధానోపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు విజయలక్ష్మిబాయి అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో జరుగుతున్న హెచ్ఎంల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, నాణ్య మైన బోధన, విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడం వంటివి ఉపాధ్యాయులకే సాధ్యమని అన్నారు. కొందరు పిల్లల్లో ఇటీవల వింత ధోరణులు కనిపిస్తున్నాయని, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుల చొరవతోనే వాటిని అరికట్టొచ్చని అన్నారు. అనంతరం పాల్వంచ కొమ్ముగూడెం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఇక్కడ నేర్చుకున్న అంశాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పించాలని అన్నారు. డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, నిరంతరం సబ్జెక్ట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సైదులు, డీఆర్పీలు ఆనందకుమార్, మీరా సాహెబ్, విజయబాబు, బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు విజయలక్ష్మీబాయి -
697 కిలోల గంజాయి స్వాధీనం
టేకులపల్లి: టేకులపల్లి మీదుగా భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం పోలీసుస్టేషన్లో సీఐ తాటిపాముల సురేష్ వివరాలను వెల్లడించారు. హరియాణాకు చెందిన సందీప్కుమార్, లక్విందర్, అమర్నాథ్ కుమార్, పవన్కుమార్, కృషన్, కుమార్ కొన్నేళ్లుగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా బచ్చలూరులో హరికరన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కురుక్షేత్ర జిల్లాకు తరలించి ప్రిన్స్ కుమార్కు విక్రయించేవారు. ఈ క్రమంలో శనివారం బచ్చలూరు నుంచి గంజాయి తీసుకుని కురుక్షేత్రకు రవాణా చేసేందుకు ఐచర్ వ్యాన్లో తరలిస్తున్నారు. ముందు ఎస్కార్ట్గా కారులో నిందితులు వెళ్తుండగా పక్కా సమాచారంతో టేకులపల్లి, సీసీఎస్ పోలీసులు ముత్యాలంపాడు క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టా రు. ఈక్రమంలో కారు, వెనకాలే వచ్చిన వ్యాన్ను తనిఖీ చేయగా రూ.3.48కోట్ల విలు వైన 697.160 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయి అమ్మిన హరికరన్, తెప్పించిన ప్రిన్స్కుమార్పైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకున్న సీఐలు టి.సురేష్, రమాకాంత్, ఎస్ఐలు రాజేందర్, ప్రవీణ్, రామారావును ఎస్సీ రోహిత్ రాజు అభినందించారు.విలువ రూ.3.48 కోట్లు.. హరియాణా వాసుల అరెస్టు -
‘బయోచార్’పై కలెక్టర్ నజర్
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా బయోచార్ తయారీకి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో తన క్యాంప్ కార్యాలయం పక్కన శనివారం తొలి ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ డ్రమ్ కింది భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చేశారు. ఈ డ్రమ్ను మూడు సిమెంట్ రింగుల మధ్య ఉంచి అడుగులో ఎండిన ఆకులు వేసి మంట పెట్టారు. పై భాగంలో ఎండిపోయిన, పనికిరాని మొక్కల భాగాలను వేసి డ్రమ్కు మూతపెట్టారు. రింగుల మధ్యలోను ఆకులు, పొట్టు వేసి మంటపెట్టడంతో లోపల ఏర్పడే పొగ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్లో కాలిన మొక్కలు బూడిదగా మారకముందే వాటిని చల్లార్చితే ఏర్పడిన బొగ్గును బయోచార్ అంటారని కలెక్టర్ వెల్లడించారు. దీన్ని పొడిలా చేసి పొలాల్లో వాడితే పంటల దిగుబడి పెరుగుతుందని, దీనికి పశుమూత్రం జోడించి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. మట్టిలో జీవపదార్థం పెంపు, నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుదల, ఎరువుల అవసరం తగ్గింపు, వాతావరణ మార్పుల ప్రతికూలతను తగ్గించే శాశ్వత కార్బఽన్ నిల్వ, నేల స్థిరంగా ఉండేలా చేయడం వంటి ఉపయోగాలు ఉంటాయని వివరించారు. ఇది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉత్తమ మార్గంగా నిలుస్తుందని అన్నారు.తొలి ప్రదర్శన నిర్వహించిన జితేష్ వి పాటిల్ -
చలచల్లగా వెళ్లొద్దామా !
మండు వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ ● ఖమ్మం నుంచి హైదరాబాద్కు నాన్స్టాప్ బస్సులు ● ఇతర డిపోల నుంచి సైతం రాజధాని, లహరి సర్వీసులు ● రెండు నెలల్లో రీజియన్కు రూ.7.43 కోట్ల ఆదాయం ఖమ్మంమయూరిసెంటర్/చుంచుపల్లి: మండు వేసవిలోనూ చల్లని గాలిలో పయనం సాగించేలా ప్రయాణికులు ఏసీ బస్సులను ఎంచుకుంటున్నారు. వారి అవసరం, ఆసక్తికి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల సంఖ్య పెంచింది. తద్వారా ఏప్రిల్, మే నెలల్లో ఈ బస్సులు నడిపించడం ద్వారా 1,62,557 మంది గమ్యస్థానాలకు చేరడంతో ఖమ్మం రీజియన్కు రూ.7,43,53,892 ఆదాయం సమకూరింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు గంటకొకటి చొప్పున నాన్ స్టాప్ రాజధాని సర్వీసులు నడిపించడం, ఖమ్మంతో పాటు మిగతా డిపోల నుంచి రాజధాని, లహరి ఏసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందాయి. చార్జీ ఎక్కువైనా ఓకే.. ఉమ్మడి జిల్లాలో ఈ వేసవిలో ఎండలు 42 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యాన బస్టాండ్లకు వస్తున్న వారు ఏసీ బస్సు కనిపిస్తే చాలు ఎక్కేస్తున్నారు. దూర ప్రయాణాలకై తే తప్పనిసరిగా ఏసీ బస్సుల్లోనే సీట్లు ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులతో పోలిస్తే ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉన్నా ఎండ నేపథ్యాన లెక్క చేయడం లేదు. దీంతో దాదాపు అన్ని రోజుల్లోనూ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 100శాతం నమోదవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సైతం ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. అయితే, రీజియన్లోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి డిపోలకు రాజధాని, లహరి ఏసీ బస్సులు ఉండగా ఎక్కువగా హైదరాబాద్ రూట్లోనే తిప్పుతున్నారు. ఇవికాక హైదరాబాద్లోని డిపోల నుంచి సైతం ఉమ్మడి జిల్లాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏసీ బస్సులు నడిపిస్తున్నారు. కాగా, కరీంనగర్, గోదావరిఖని, నిజామాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు సైతం ఒకటి, రెండు ఏసీ బస్సులు ఏర్పాటుచేయాలనే ప్రయాణికుల డిమాండ్ను అధికారులు పరిశీలిస్తున్నారు. రూ.7.43 కోట్ల ఆదాయం.. ఈ వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఏసీ బస్సులను రెగ్యులర్తో పోలిస్తే ఎక్కువ సర్వీసులు నడిపించింది. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఏప్రిల్ నెలతో పాటు ఈనెల 23 వరకు 1,62,557 మంది ప్రయాణించగా రికార్డు స్థాయిలో రూ.7,43,53,892 ఆదాయం సమకూరింది. ఇందులో 34 రాజధాని బస్సుల్లో 1,49,816 మంది నుంచి రూ.6,52,25,993, నాలుగు లహరి ఏసీ బస్సుల్లో 12,741 మంది ప్రయాణించగా రూ.91,27,899 ఆదాయం నమోదైంది. రెండూ కలిపి ఏప్రిల్ నెలలో 87,322 మంది ప్రయాణించగా రూ.3,96,46,952, ఈనెల 23 వరకు 75,235 మంది ప్రయాణించగా రూ.3,47,06,940 ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం డిపో నుంచే.. ఖమ్మం రీజియన్కు వచ్చిన ఆదాయంలో ఖమ్మం డిపో నుంచే అత్యధికంగా లభించింది. ఈ రెండు నెలల కాలంలో రాజధాని బస్సులు 34, లహరి ఏసీ బస్సులు నాలుగు తిరగగా.. ఖమ్మం డిపో నుంచి 21 రాజధాని, రెండు లహరి బస్సులు తిప్పారు. రాజధాని బస్సుల్లో 96,040 మంది ప్రయాణించగా.. రూ.4,16,52,551, లహరి ఏసీ బస్సుల్లో 4,873 మంది ప్రయాణించగా రూ.45,26,719 ఆదాయం సమకూరింది. రీజియన్ మొత్తం ఆదాయంలో 62 శాతం ఖమ్మం డిపో నుంచే లభించడం విశేషం. ఖమ్మం నుంచి హైదరాబాద్కు గంటకొకటి చొప్పున రాజధాని ఏసీ నాన్ స్టాప్ బస్ నడపడం కలిసొచ్చింది.ఆదరణ పెరిగింది.. వేసవిలో ప్రయాణికులు ఏసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లా పరిధిలో పది సర్వీసులు ఉండగా, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నాం. ప్రతిరోజు 2వేల మందికి పైగానే ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. – దేవేందర్ గౌడ్, డీఎం, కొత్తగూడెంఏసీ బస్సులకు డిమాండ్ ఎండల దృష్ట్యా దూరప్రాంతాలకు సాధారణ బస్సుల్లో ప్రయాణించడం కష్టమే. అందుకే చాలామంది ఏసీ బస్సులు ఎంచుకుంటున్నారు. చల్లని వాతావరణంలో వెళ్లొచ్చేలా ఏసీ బస్సులు అనువుగా ఉంటాయి. అందుకే ఈ బస్సులకు డిమాండ్ పెరిగింది. – పి.కిరణ్కుమార్, డ్రైవర్ ఏప్రిల్, మే 23వరకు ఏసీ బస్సులతో వచ్చిన ఆదాయం డిపో ప్రయాణికులు ఆదాయం (రూ.ల్లో) ఖమ్మం 1,00,913 4,61,79,270 భద్రాచలం 37,563 1,71,23,886 సత్తుపల్లి 21,237 98,56,103 కొత్తగూడెం 2,844 11,94,633మొత్తం 1,62,557 7,43,53,892 -
కాపీ చేస్తే కొరడానే !
రామయ్య మూలమూర్తుల చిత్రాలకు పేటెంట్ ● అక్రమార్కుల అడ్డగోలు పూజలకు ఇక చెక్ ● రాష్ట్రంలోనే తొలి ఆలయంగా భద్రగిరి భధ్రాచలం : భద్రాద్రి రామయ్య మూలమూర్తుల చిత్రాలకు, బొమ్మలకు పేటెంట్ హక్కులు దక్కాయి. రామయ్య పేరుతో, మూలమూర్తులు, ఉత్సవ మూర్తుల ఫొటోలతో అక్రమంగా పూజలు చేసే ఆధ్యాత్మిక వ్యాపారానికి చెక్ పడింది. రామయ్య మూలమూర్తుల చిత్రాలను కాపీ చేస్తే దేవస్థానం అధికారులు ఇక కొరడా ఝుళిపించనున్నారు. పేటెంట్ రైట్స్ కలిగిన దేవుడిగా రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రగిరి రామయ్య నిలిచాడు. భద్రగిరిలోనే ప్రత్యేకం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో కెల్లా భద్రగిరి రామయ్య మూలమూర్తులు చాలా ప్రత్యేకం. అన్ని దేవస్థానాల్లో రాముడు, పక్కన సీతమ్మ, లక్ష్మ ణుడు, పాదాల చెంత ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటారు. కానీ భద్రాచలానికి గల ప్రాశస్త్యం, ప్రాంత విశిష్టత విలక్షణమైనది. భద్ర మహర్షి కఠోర తపస్సు, రామ తారక మంత్రోచ్ఛారణతో మెచ్చిన శ్రీ మహా విష్ణువు శ్రీరామ రూపాన్ని దాల్చి చతుర్భుజ రామునిగా శంకు, చక్ర, ధనుర్బాణాలను ధరించి, వామాంకమున(ఎడమ తొడపై)సీత, వామ పార్శమున(ఎడమ పక్కన) లక్ష్మణుడితో కూడి పద్మాసనమున ఆశీనుడై దర్శనమిస్తారు. పాదాల చెంత ఆంజనేయస్వామి లేని మూలమూర్తులు భద్రాచలంలోనే భక్తులకు కనిపిస్తారు. దీంతో పాటు రామాయణ వనవాస ఇతివృత్తాలతో పరిసర ప్రాంతాలకు అనుబంధం ఉండడంతో దేశ, విదేశాల భక్తులు రామయ్యను విశేషంగా, ఇలవేల్పుగా కొలుస్తారు. పేటెంట్ హక్కులకు బీజం ఇలా.. రామాలయంలోని బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణం, శ్రీరామనవమి ఉత్సవాలకు రామయ్య మూలమూర్తులతో పోలిన ఉత్సవ విగ్రహాలను వినియోగిస్తారు. అయితే గత దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్వామివారి మూలమూర్తులను పోలిన విగ్రహాలకు నిత్యకల్యాణం, ప్రత్యేక పూజలు చేస్తూ ధనార్జన చేపట్టాయి. ఇటీవల ‘ఖగోళ యాత్ర’ పేరుతో వెబ్సైట్లో సైతం భద్రాచలం శ్రీరామ పేరుతో ప్రపంచవ్యాప్తంగా నిత్యకల్యాణం చేసేందుకు విరాళాలు సేకరించారు. దీనికి వెబ్సైట్ను సైతం క్రియేట్ చేసి దాతలను ఆహ్వానించారు. భద్రాచలం రాముడి పేరు, మూలమూర్తులను పోలిన చిత్రాలు ఉండడంతో భక్తులు ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావించి విరాళాలు అందజేశారు. ఈ క్రమంలో అదే ధార్మిక సంస్థ భద్రాచలంలో సైతం ఈ పూజలు చేయాలని భావించింది. ఈ విషయం ఆలయ ఈఓ రమాదేవి దృష్టికి రావడంతో వెంటనే భద్రాచలం శ్రీరామ, మూలమూర్తులను తొలగించాలంటూ పోరాడారు. చివరకు ఆ సంస్థ వాటిని తొలగించాకే పూజలు జరిగాయి. అయితే భవిష్యత్లో సైతం రామయ్య మూలమూర్తుల చిత్రాల ద్వారా ఎలాంటి అక్రమాలు జరగకుండా పేటెంట్ హక్కుల కోసం ఈఓ దరఖాస్తు చేయగా, తాజాగా లభించాయి. ఉల్లంఘిస్తే చర్య తప్పదు.. పేటెంట్ హక్కులు రావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తుల చిత్రాలు, బొమ్మలను వాణిజ్యపరంగా బయట వినియోగించడం నేరం. ఆధ్యాత్మికంగా, ఉచితంగా ఈ చిత్రాలను వినియోగించుకోవాలంటే దేవస్థానం అనుమతి తప్పనిసరి. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలతో పాటు భారీగా జరిమానా విఽధించే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 20నుంచి పేటెంట్ హక్కులు అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా, భవిష్యత్లో రామయ్య ప్రసాదమైన లడ్డూ, చక్కెర పొంగలి, ఇప్పలడ్డూల పై సైతం హక్కులు పొందేలా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.రామయ్య చిత్రాలు దర్వినియోగం కావొద్దనే ఎంతో విశిష్టత కలిగిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మూలమూర్తులు దుర్వినియోగం కావొద్దనే పేటెంట్ హక్కులు పొందాం. గతంలో దేశ, విదేశాల్లో స్వామి వారి మూలమూర్తుల చిత్రాలను వినియోగించుకుని అక్రమార్జనకు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకోవడంతో పాటు భవిష్యత్లో ఆలయానికి అప్రతిష్ట రాకుండా చర్యలు చేపట్టాం. అవకాశం ఉంటే ప్రసాదాలపైనా పేటెంట్ హక్కులు తెచ్చేలా ప్రయత్నిస్తాం. – ఎల్.రమాదేవి, ఈఓ -
వల పన్ని.. పట్టుకున్నారు!
ఖమ్మంక్రైం: ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఖమ్మం రైల్వేస్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశాడు. ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు గందరగోళం నెలకొనగా, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది చొరవతో కింద వలలు ఏర్పాటుచేసి.. ఆ యువకుడిని తోసేయడంతో వలపై పడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు. మద్యం మత్తు.. కుటుంబ కలహాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు లలిత్ బరిహ ఖమ్మం సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మద్యం సేవించిన ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం రైల్వేస్టేషన్కు వచ్చాడు. రెండో నంబర్ ప్లాట్పాం మీదుగా ఫుట్ఓవర్ బిడ్జిపైకి ఎక్కి దూకడానికి యత్నించాడు. బ్రిడ్జి కింద హైపర్ టెన్షన్ విద్యుత్ వైరు ఉండడం, అదే సమయానికి సికింద్రాబాద్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రానుండడంతో వేచి ఉన్న ప్రయాణికులు లలిత్ను గమనించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సురేశ్గౌడ్ ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని ఎంత నచ్చజెప్పినా వినకపోగా, పైకి ఎవరైనా వస్తే దూకుతానని బెదిరించాడు. ఆపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, బ్రిడ్జిపైకి ప్రయాణికులు వెళ్లకుండా ఆపివేశారు. ఇంతలో కోణార్క్ ఎక్స్ప్రెస్ వస్తుడడంతో ఖమ్మం ఔటర్లోనే నిలిపివేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని బ్రిడ్జి కింద వలలతో సిద్ధమయ్యారు. ఇదంతా సుమారు గంట దాటడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు పైకి వెళ్లి లలిత్ తీగలపై పడకుండా వలలో పడేలా కిందకు తోశాడు. దీంతో ఆయన నేరుగా వలలో సురక్షితంగా పడటంతో ఆర్పీఎఫ్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా, లలిత్ తీరుతో రైళ్లు నిలిచిపోవటంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, ఆయన ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఫైర్ సిబ్బందిని పలువురు అభినందించారు. స్టేషన్లో ఎఫ్ఓబీ పైనుంచి దూకేందుకు ఛత్తీస్గఢ్ యువకుడి యత్నం కాపాడిన పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది -
చెరువుల అభివృద్ధేది?
● ఐదేళ్లుగా నిలిచిన పూడిక తీత పనులు ● అలుగులు, తూములకు మరమ్మతులు ● మిషన్ కాకతీయ తర్వాత చెరువుల అభివృద్ధికి గ్రహణంబూర్గంపాడు: చెరువుల్లో మట్టి పూడికలతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. తూములు, అలుగులు మరమ్మతులకు గురై నీటి వృథా జరుగుతోంది. చెరువు కట్టలు బలహీనపడి తరుచూ తెగిపోతున్నాయి. దీంతో పంట చివరి దశలో నీరు సరిపోక పైర్లు ఎండుతున్నాయి. ఐదేళ్లుగా చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టకపోవటంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. 2015 నుంచి 2019 వరకు.. గత ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసింది. 2015 మార్చి 12న ఈ పథకం ప్రారంభించగా, 2019 వరకు ప్రతి ఏటా వేసవిలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఏళ్ల తరబడి చెరువులలో పూడుకుపోయిన మట్టిని యంత్రాలతో తీయించారు. సారవంతమైన ఆ మట్టిని రైతులు పంట భూములలో వేసుకున్నా రు. చెరువులకు కొత్తతూములు వేయించారు. అలుగులను పునర్నిర్మించారు. చెరువు కట్టలపై మట్టిపోసి పటిష్టపరిచారు. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలకు ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని మెచ్చుకుంటూ పలు అవార్డులు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలో 1850 పైగా పెద్ద, చిన్న చెరువులు ఉండగా, ఈ పథకంలో 870 చెరువులను అభివృద్ధి చేశారు. చిన్న చెరువులను ఉపాధిహామీ పథకంలో కొంతమేర అభివృద్ధి చేశారు. 2019 తర్వాత పట్టించుకోలేదు.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 తర్వాత మిషన్ కాకతీయ పథకాన్ని పెద్దగా కొనసాగించలేదు. నాటి నుంచి నేటి వరకు చెరువుల అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగటం లేదు.ఐదేళ్ల క్రితం వర్షాలకు, భారీ వరదలకు మట్టి కొట్టుకొచ్చి మిషన్ కాకతీయ పథకంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో పూడిక పేరుకుపోయింది. వరద ఉధృతికి అలుగులు మరమ్మతులకు గురయ్యాయి. తూములు లీకయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా చెరువుల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవటంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పూడిక మట్టిని రైతులు చేలలోతోలుకునేందుకు కూడా ఎక్కువ ఖర్చవుతుండటంతో రైతులు ఆ ప్రయత్నాలను మానుకున్నా రు. గత వానాకాలం సీజన్ చివరిలో చెరువులలో నీరు లేకపోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. దూరంలో ఉన్న బోరుబావుల నుంచి పైప్లైన్లు వేసుకుని పంటలు కాపాడుకున్నారు. ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పూడిక తీయాలి చెరువుల్లో పూడిక మట్టి తీస్తే ఓ విడత తడికి నీరు అదనంగా అందుతుంది. వానాకాలం వరి పొట్టదశలో చెరువుల్లో నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడ్డాం. పూడిక తీతలో వచ్చే మట్టిని చేలలో వేసుకుంటే మూడేళ్లు పంటలు బాగా పండుతాయి. ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. –వై.నర్సింహారెడ్డి, రైతు, రెడ్డిపాలెం అభివృద్ధి చేయాలి గతంలో మాదిరి ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. మిషన్ కాకతీయలో చెరువులు అభివృద్ధి చేయటంతో ఐదేళ్లు ఇబ్బందులు లేకుండా పంటలు పండాయి. గతేడాది భారీ వర్షాలు, వరదలకు చెరువులలో మళ్లీ పూడిక చేరింది. మళ్లీ చెరువులలో పూడికలు తీయిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. –బి.లోక్యా, రైతు, కృష్ణసాగర్ -
కొండరెడ్లకు గృహ నిర్మాణాలు
సూపర్బజార్(కొత్తగూడెం): అటవీప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్ధన్ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపీడీఓలు ప్రతిపాదనలు అందజేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఎంపీడీఓలు, కొండరెడ్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అశ్వారావుపేట మండలంలోని ఏడు హ్యాబిటేషన్లు, దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాల ఇంటింటికి తిరిగి మొబైల్యాప్ ద్వారా సర్వే చేయాలని ఆదేశించారు. శనివారం నుంచి సర్వే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
13 తులాల బంగారం చోరీ
మణుగూరు టౌన్: పట్టణంలోని ఓ దుకాణంలో సిబ్బంది ఉండగానే కళ్లుగప్పి చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అంబేద్కర్ సెంటర్ వద్ద ఉండే శ్రీవారి బంగారు దుకాణంలో మధ్యాహ్నం ఓ వ్యక్తి ప్రవేశించి దుకాణం సిబ్బంది ఉండగానే షో కేసులో ఉన్న బంగారు నగలు అపహరించి తన వెంట తెచ్చుకున్న చేతి సంచిలో వేసుకుని పరారయ్యాడు. కొద్దిసేపటికి 13 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించిన యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ రవీందర్రెడ్డి, ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మేడా ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా, చోరీ దృశ్యం రికార్డయినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుకాణంలో సిబ్బంది కళ్లుగప్పి అపహరణ -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన జూలూరుపాడు సొసైటీ చైర్మన్ చీమలపాటి భిక్షం సతీమణి చీమలపాటి రాధమ్మ(48) రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. రాధమ్మ తల్లి ఇటీవల మృతి చెందగా గురువారం మధిర మండలం జాలిమూడిలో దశదిన కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భిక్షం, రాధమ్మ దంపతులు బైక్పై వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వైరా మండలం విప్పలమడుగు గ్రామం వద్ద రాధమ్మ లోబీపీతో కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో తీవ్ర గాయాలుకాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ రాధమ్మ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాధమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంబూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసు ల కథనం ప్రకారం... ఇరవెండి గ్రామానికి చెందిన లకావత్ గాంధీ(28) గురువారం రాత్రి సారపాక నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోతెపట్టీనగర్ గ్రామం వద్ద రోడ్డుపై అడ్డంగా వస్తున్న గేదెను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో గాంధీ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల వ్యాపారి ఆత్మహత్య మణుగూరు టౌన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ పాలవ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్యాలమ్మనగర్కు చెందిన పోట్ల ప్రసాద్(46) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు 100 పడకల ఆస్పత్రికి, అక్కడి నుంచి భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు నందకిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మణుగూరు ఎస్ఐ మనీష తెలిపారు. గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడి మృతిఅశ్వారావుపేటరూరల్: మాజీ ఉప సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కోనేరుబజార్కు చెందిన దామెరశెట్టి నీలాచలం(75) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నీలాచలం అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి 2004 నుంచి 2008వ సంవత్సరం వరకు ఉప సర్పంచ్గా పని చేశారు. -
ప్లాంటేషన్ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు
అశ్వాపురం: అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధి తుమ్మలచెరువు బీట్లోని పాలవాగు సమీపంలో ప్లాంటేషన్ నరికివేతపై అటవీశాఖ అధికారులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుర్వాపల్లి కొత్తూరుకు చెందిన కొందరు గిరిజనులు రెండు రోజులుగా ఫారెస్ట్ అధికారులు నిర్ణయించిన కందకాలు దాటి ప్లాంటేషన్లోని చెట్లను నరికివేస్తున్నా రు. దీంతో అటవీశాఖ సిబ్బంది రెవెన్యూ, పోలీసులు దృష్టికి తీసుకెళ్లగా, తహసీల్దార్ రాజారావు, ఎస్సైప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులతో మాట్లాడి పోడు నరకవద్దని సూచించారు. అనంతరం ప్లాంటేషన్ నరికివేతకు పాల్పడిన వారిని ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ రమేష్ , సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, మణుగూరు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించాలిజూలూరుపాడు: రహదారుల పక్కన ఇంకుడు గుంతలు నిర్మించాలని డీపీఓ చంద్రమౌళి సూచించారు. శుక్రవారం ఆయన జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాల్లో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మిస్తున్న ఇంకుడు గుంతల ను పరిశీలించి మాట్లాడారు. ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భజల మట్టం పెరుగుతుందని, నీటి కొరత తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జూలూ రుపాడు ఎంపీఓ టి.తులసీరామ్, వెంగన్నపాలెం పంచాయతీ సెక్రటరీ జి లక్ష్మణ్, జీపీ కార్మికులు పాల్గొన్నారు. నూతన పద్ధతులు పాటించాలిదమ్మపేట: బోధనలో నూతన పద్ధతులు పాటించాలని జిల్లా స్థాయి విద్యాశాఖ రిసోర్స్ పర్సన్ శంకర్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. శిక్షణను సద్వినియో గం చేసుకుని, బోధనలో నూతన ఒరవడికి శ్రీ కారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బోధనలో ఏఐ విధానాలను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమికస్థాయి గణిత బోధనలో సీపీఏ పద్ధతి అనుసరించాలని, పాఠ్యాంశాల బోధనలో ఎక్కువగా కృత్యధార పద్ధతులను ఉపయోగించాలని వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కీసర లక్ష్మి, ఎంఆర్పీలు రామకృష్ణ, రవి, ప్ర భాకర్, షారోన్ కుమార్, సౌమ్య, కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి తల్లాడ: మండలంలోని మల్లవరంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభగిరి బలరాం (45) దళితకాలనీ సమీపాన ఉన్న చికెన్ షాపు వెనకాల మూత్ర విసర్జనకు వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ వైర్ను తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బలరామ్కు భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 17 మందికి జరిమానాకొత్తగూడెంఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి శుక్రవారం కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు జరిమానా విధించారు. కొత్తగూడెం వన్ టౌన్, అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి విచారణ చేపట్టి జరిమానా విధించారు. -
భార్యపై కత్తితో దాడి
కొత్తగూడెంఅర్బన్: ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. వైరాకు చెందిన మాధవరావు, లావణ్య దంపతులు. భర్త మాధవరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదనే కారణంతో లావణ్య కొంతకాలంగా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్నగర్లోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మాధవరావు అత్తగారి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కత్తితో గొంతుపై గాయపరి చాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా గాయపరిచాడు. లావణ్యకు రక్తస్రావం అవుతుండగా కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్లు ఢీ : ఆరుగురికి గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బోయితండా గ్రామపంచాయతీ సేవ్యాతండాగ్రామానికి చెందిన గంగావత్ మోహన్ ఖమ్మలోఆర్టీసీ డ్రైవర్గా ఔట్సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలో ఓ శుభకార్యానికి హా జరై తిరిగి భార్య లలిత, కుమార్తె రాజేశ్వరిలతో కలిసి బైక్పై ఖమ్మం బయలుదేరాడు. అదే సమయంలో ధనియాలపాడు గ్రామానికి చెందిన చరణ్, సాగర్, శ్రావ్య ముగ్గురు బైక్పై ఇల్లెందు నుంచి కొమరారం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో మోహన్, లలిత, రాజేశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. చరణ్, సాగర్,శ్రావ్యలకు స్వల్పంగా గాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మసిఫారసు చేశారు. బాధితుల ఫిర్యాదుమేరకుఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జిల్లాకు సీతారామ జలాలు ఇవ్వాలి
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ జలాలు జిల్లా సాగు భూములకు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని 48.30 కి.మీ. వద్ద కూలిన పాసేజ్ పిల్లర్ ప్రదేశాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. నాసిరకం నిర్మాణం వల్లే పిల్లర్ కూలిందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన కాలువలతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా నాయకుడు కొండబోయిన వెంకటేశ్వర్లు, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవికుమార్, నిమ్మల మధు, గొగ్గెల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కనెక్షన్లు ౖపైపెకి..
● జిల్లాలో 56,789 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ● దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇస్తామంటున్న అధికారులు ● ఏడాదిలోనే 52 శాతం పెంపుసూపర్బజార్(కొత్తగూడెం): రైతుల సాగు భూములకు నీరందించేందుకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. సర్వీసుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం, ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం ఉన్న జిల్లాలో 90 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే ఉన్నాయి. ఇందులో ఎకరం, అంతకంటే తక్కువ భూములు ఉన్న గిరిజనులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసేలా ఆ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. పారదర్శక సేవల కోసం.. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023తో పోల్చితే 2024లో 52 శాతం కనెక్షన్లు పెరగడం విశేషం. ప్రస్తుతం 56,789 సర్వీసులు ఉన్నాయని విద్యుత్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సర్వీసుల మంజూరుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా సరిపడా మెటీరియల్ను అధికారులు సిద్ధంగా ఉంచుతున్నారు. అవసరమైన ప్రదేశాల్లో స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు దరఖాస్తు చేసుకోగానే వాటిని ఆన్లైన్ చేస్తున్నారు. తద్వారా పారదర్శకంగా సేవలందించే అవకాశంతో పాటు రైతులు తమ దరఖాస్తుల స్టేటస్ను అగ్రికల్చర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెండింగ్లో 637 దరఖాస్తులు.. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు జిల్లాలో 4,963 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. గతేడాది ఏప్రిల్లో 404, మే నెలలో 343, జూన్ 405, జూలై 370, ఆగస్టు 288, సెప్టెంబర్ 111, అక్టోబర్ 346, నవంబర్ 383, డిసెంబర్ 428, ఈ ఏడాది జనవరి 425, ఫిబ్రవరి 438, మార్చి 491, ఏప్రిల్లో 531 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా ఇంకా 637 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సత్వర మంజూరుకు చర్యలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సత్వర మంజూరుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్లైన్ విధానంతో తమ దరఖాస్తులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో రైతులు తెలుసుకునేలా అగ్రికల్చర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. కనెక్షన్లు పొందిన రైతులు సాగునీటి అవసరం మేరకే మోటార్లను వినియోగించాలి. ఎక్కువ సేపు మోటార్లు ఆన్ చేసి ఉంచితే విద్యుత్తో పాటు సాగునీరు వృథా అవుతాయి. మోటార్ల వినియోగంలో అధికారుల సూచనలను జాగ్రత్తలను పాటించాలి. –జి.మహేందర్, విద్యుత్ ఎస్ఈ -
తనిఖీకొస్తే తంటాలే..!
తనిఖీల పేరుతో పంచాయతీరాజ్ శాఖలో ఓ సబ్ డివిజన్ స్థాయి అధికారి వ్యవహారశైలి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం.. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచడం, ఆ తర్వాత తన కోరికల చిట్టాను బయటపెట్టడం.. కాదంటే ‘నీ పని ఖతం’ అంటూ కన్నెర్ర చేయడం ఆ అధికారి నైజం కావడమే ఇందుకు కారణం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరికార్డుల పరిశీలన పేరుతో ఓ అధికారి హంగామా ● ప్రత్యేక భోజనం.. ‘స్పెషల్ కవర్’ ఇవ్వాలని డిమాండ్ ● ఆ అధికారి తనిఖీలంటేనే వణుకుతున్న సెక్రటరీలు ● తిరుగుబాటుకు సిద్ధమవుతున్న పంచాయతీ కార్యదర్శులు తనిఖీల పేరుతో దందా.. పంచాయతీరాజ్ విభాగంలో ఓ ఉన్నత స్థాయి అధికారి తనిఖీల పేరుతో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూ పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నివురుగప్పిన నిప్పులా మారింది. సదరు అధికారి ఏ గ్రామానికి పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నాడో.. ఆ సమాచారాన్ని ముందుగానే పంచాయతీ కార్యదర్శులకు చేరవేస్తారు. తాను వచ్చిపోయేందుకు వీలుగా కారులో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయడానికి రూ.3,000 ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. తనిఖీలు పూర్తయ్యాక లంచ్ లేదా డిన్నర్లో నాటుకోడి పులుసు, చేపల ఫ్రై కచ్చితంగా ఉండాల్సిందే. భోజనం చేసి కారు ఎక్కేటప్పుడు కనీసం రూ.10,000 నగదుతో కూడిన కవరు అందజేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ చిన్న మార్పు జరిగినా సదరు అధికారికి చిర్రెత్తుకొస్తుంది. ‘నీ పని తీరు బాగా లేదని రిపోర్టు రాస్తా’నంటూ బుసలు కొడతాడు. నిర్దేశిత షెడ్యూల్ తప్పినందుకు జరిమానాతో సహా ముడుపులు చెల్లిస్తే తప్ప సదరు అధికారి శాంతించడు. నిబంధనల పేరుతో బెదిరింపులు.. పల్లె పరిపాలన ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఇందులో రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటిప్పుడు అప్లోడ్ చేయాలి. ఈ యాప్లో వివరాలు సరిగా నమోదు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత సబ్ డివిజనల్ స్థాయి అధికారులది. ప్రతీ నెల కనీసం 16 గ్రామాలకు వెళ్లి యాప్ పనితీరును పరిశీలించాలి. దీన్ని ఓ అధికారి అక్రమార్జనకు, గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి ఆయుధంగా ఉపయోగిస్తున్నాడని పంచాయతీరాజ్ శాఖ కోడై కూస్తోంది. తప్పులెంచుతూ.. తన పని కానిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఇంటి పన్ను వసూలు ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయం సమకూర్చుకుంటాయి. ఇంటి పన్నుల ద్వారా వచ్చిన నిధులను ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. గ్రామ పరిపాలనకు ఖర్చు చేసిన మొత్తాలను బిల్లుల రూపంలో ట్రెజరీలో సమర్పిస్తే అక్కడి నుంచి చెక్కుల రూపంలో విడుదలవుతాయి. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర సర్కారు సైతం నిధుల మంజూరులో జాప్యం చేస్తోంది. ట్రెజరీలో బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. కానీ పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగించే ట్రాక్టర్, వీధి దీపాలకు డబ్బులు అత్యవసరం అవుతున్నాయి. అంతేకాక గ్రామసభలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతీయ పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం అప్పటికప్పుడు డబ్బులు అవసరం పడుతున్నాయి. దీంతో ఇంటి పన్నుల ద్వారా వసూలైన డబ్బును తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీ ద్వారా కాకుండా నేరుగా ఖర్చు పెట్టక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఇతర సబ్ డివిజన్లలోనూ అనధికారికంగా ఇదే జరుగుతోంది. అలాగే గ్రామ పరిపాలనకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మొత్తం 72 రకాల రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రోజు, వారం, పక్షం, నెలరోజుల వారీగా వివరాలు నమోదు చేయాల్సిన రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డుల నిర్వహణలో సహజంగానే కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ సదరు అధికారి క్షేత్రస్థాయి పర్యటనలో రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగంలో పారదర్శకత లేదంటూ లోపాలను ఎంచుతూ పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డ్యూటీ ఎలా చేయాలనే అంశంపై ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచుతున్నాడు. చివరకు తన కారుకు ఫుల్ట్యాంక్, నాటుకోడి, ఫిష్ఫ్రై, రూ.10,000 కవర్ సమర్పిస్తే అంతా ‘రైట్’ అంటూ వెళ్లిపోతున్నాడు.ఇక భరించలేం.. నిధులు మంజూరు కాక పంచాయతీల నిర్వహణ కోసం ఇప్పటికే రూ.లక్షల అప్పులు తెచ్చామని, సదరు అధికారి తీరుతో మరింత ఒత్తిడికి లోనవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఒక్కసారి తనిఖీ అంటే ‘మానేజ్’ చేయగలరు కానీ పదే పదే కొందరినే టార్గెట్ చేస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. దీంతో సదరు అధికారిపై రేపో మాపో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం, లేదంటే ఏసీబీని ఆశ్రయించాలనే ఆలోచనలో బాధితులు ఉన్నట్లు సమాచారం. -
కాయకల్ప బృందం పరిశీలన
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. స్వచ్ఛత, సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పారిశుద్ధ్య, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి తదితర అంశాలపై పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలోనే కాయకల్ప ఇంటర్నల్ పీర్ అసెస్మెంట్ జరగగా, అందులో క్వాలిఫై కావడంతో ఎక్సటర్నల్ అసెస్మెంట్ జరిగింది. ఇందులో ప్రథమ ర్యాంక్ వస్తే రూ. 15 లక్షలు, ద్వితీయ ర్యాంక్ వస్తే రూ.10 లక్షలతో పాటు ఇందులో పాల్గొన్నందుకు రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్ రాజు, రాధిక శర్మ, స్వామి, ఆస్పత్రి వైద్యులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపు రం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు శుక్రవారం పంచామృతాభిషేకం చే శారు. ముందుగా అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంత రం మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశా క నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పం స మర్పించారు. అనంతరం కుంకుమపూజ, గణప తి హోమం నిర్వహించారు. కార్యక్రమంలోఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పాల్గొన్నారు. కోచ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఏడాది కాలానికి కోచ్లను నియమించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కిన్నెరసానిలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆర్చరీ కోచ్, కాచనపల్లిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో కబడ్డీ కోచ్ ఎంపికకు ఎన్ఎస్, ఎన్ఐఎస్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్ములని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువపత్రాలతో ఈనెల 26నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐటీడీఏలోని స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కానీ dtdo. bhadradri@gmail.com మెయిల్ ద్వారా కానీ దరఖాస్తులు పంపించాలని సూచించారు. వివరాలకు 98489 88205, 99123 62053 నంబర్లకు సంప్రదించాలని పీఓ తెలిపారు. యువత అన్ని రంగాల్లో ముందుండాలి కొత్తగూడెంఅర్బన్ : గిరిజన ప్రాంతాల్లో నివసించే యువత అన్ని రంగాల్లో ముందుండాలి ఎస్పీ రోహిత్రాజు అన్నారు. దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కొండరెడ్ల గ్రామమైన పూసుకుంటకు చెందిన 12 మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించగా.. శుక్రవారం ఎస్పీ రోహిత్రాజు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు, మైదాన ప్రాంతాల్లోని వలస గిరిజన యువతకు తమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. క్రీడా పోటీల నిర్వహణ, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత డ్రైవింగ్ లైసెన్స్లు లేక వాహన తలిఖీల్లో పట్టుబడుతున్నారని, అందుకే లైసెన్స్లు ఇప్పించేందుకు తమ శాఖ ముందుకొచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎంబీబీఎస్–2 ఖాళీ వైద్య పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా డీసీహెచ్ఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నెలకు వేతనం రూ.52,351 చెల్లించనున్నట్లు తెలిపారు. -
ఎల్ఆర్ఎస్కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాలోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులుఖమ్మం అర్బన్: స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టగా దరఖాస్తులదారుల వెసులుబాటు కోసం ఇటీవల ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. దీంతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, తద్వారా నిర్మాణానికి ఇక్కట్లు తీరతాయని భావించిన దరఖాస్తుదారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుతం నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీకి అర్హులుగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం రూపొందించిన యాప్లో సాంకేతిక సమస్యలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ యజమానులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫీజు చెల్లింపునకు అనుమతి జారీ కావడం లేదు. దశల వారీగా... ఎల్–1 దరఖాస్తులకు సంబంధించి కార్పొరేషన్ లేదా గ్రామపంచాయతీ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే యాప్లో అప్లోడ్ చేసి అనుమతి ఇస్తున్నారు. కానీ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మూడు శాఖల అధికారులకు ఒకేసారి సమయం లభించి క్షేత్రస్థాయికి వస్తేనే ప్లాట్ ప్రభుత్వ భూమిలో ఉందా, ఎఫ్టీఎఫ్ పరిధిలో ఉందా అనేది నిర్ధారించే అవకాశముంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరిగి యాప్లో నమోదు చేయించుకున్నా... తిరిగి మరోమారు అనుమతి కోసం క్షేత్రస్థాయికి రావాల్సి ఉండడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఎల్–2(టౌన్ ప్లానింగ్), ఎల్–3(ముఖ్య అధికారి జారీ చేసే పత్రం) దశల్లోనూ విపరీతమైన జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా భరించలేక కొందరు తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా కొందరు అంత దూరం రావాలంటే ఖర్చులు అవుతాయని డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రెండేసి సార్లు కొన్ని ప్లాట్లకు సమీపాన ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములు లేదా వాగులు, వర్రెలు ఉంటే ఈ భూమిని కూడా నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. ఇలాంటి ప్లాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే రాయితీతో ఫీజు చెల్లింపునకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. అంతా పూర్తయి ఫీజు చెల్లించినా అనుమతి పత్రం కోసం మరోమారు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుండడం గమనార్హం.మీ సేవ కేంద్రాలకు పరుగులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే యజమానులు అన్ని పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కానీ ఇప్పుడు మరోమారు అప్లోడ్ చేయాలని ప్లాట్లదారులకు సమాచారంవస్తోంది. దీంతో నెట్ సెంటర్లు, మీ సేవ సేవా కేంద్రాలకు పరుగుల తీయక తప్పడం లేదు. ఇప్పటికై నా సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఫీజు చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని, ఆ వెంటనే అనుమతులు జారీచేయాలని పలువురు కోరుతున్నారు. -
అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులను అన్ని వేళల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం బస్తీ దవాఖానా, పాత కొత్తగూడెంలోని ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు అందించాలని అన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రాకేష్, అజయ్, పాయం శ్రీనివాస్, హెచ్ఈఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ -
నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్బజార్(కొత్తగూడెం): నకిలీ విత్తనాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దృష్టి సారించాలని, వాటిని అరికట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు, ఇన్పుట్ డీలర్లకు కలెక్టర్, ఎస్పీ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు సంతకాలు చేసిన బిల్లులు ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో టాస్క్ఫోర్స్ కమిటీలు, ఇంటర్నల్ స్క్వాడ్, మండల క్వాలిటీ ఇన్స్పెక్టర్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, డీసీఓ ఖుర్షీద్, డీహెచ్ఎస్ఓ కిశోర్, డీఏఓ వి.బాబురావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ పిల్లలకు చదువే ప్రధానందివ్యాంగులైన పిల్లలకు చదువే ప్రధానమని కలెక్టర్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాంటి చిన్నారులకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఐఈడీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఇక దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు మంజూరు చేస్తామని, ఉపాఽధిహామీ పథకం ద్వారా అర్హులకు పని కల్పిస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మిస్తామన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అంత్యోదయ కార్డులు, బ్యాటరీ ఆపరేటర్ సైకిళ్ల రిపేర్లకు టెక్నీషియన్లను నియమిస్తామని చెప్పారు. వయోవృద్ధులకు ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అన్ని మండలాల్లో ఆయుర్వేదిక్ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ అభివృద్ధి అధికారి డి. అనసూర్య, ఏడీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, మెప్మా పీడీ సీహెచ్. రాజేష్, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, పరిశ్రమల అధికారి మధుసూదన్రెడ్డి, బీసీ సంక్షేమాధికారి ఇందిర, సీపీఓ కె సంజీవరావు, ఆర్డీఓలు మధు, దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి హెచ్ఎంలే మూలస్తంభాలు కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, వారే మూలస్తంభాల్లాంటి వారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వృత్యంతర శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. హెచ్ఎంలు మనసుపెట్టి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని, పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం పెంచుతూ పిల్లలకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. అంతకుముందు పాతపాల్వంచలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జీవశాస్త్రం చదవడంటే డాక్టర్గా స్థిరపడడమే అనే ఒక అపోహ నుంచి విద్యార్థులు బయటపడేలా చూడాలని, ఎన్నో వినూత్నమైన కోర్సులను అధ్యయనం చేస్తూ మానవాళికి అవసరమైన సహజ సిద్ధ ఆహార పదార్థాలను మొక్కల ద్వారా అందించొచ్చని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, జీవశాస్త్ర శిక్షణా కేంద్ర ఇన్చార్జ్ ఎ. పద్మలత, రాష్ట్ర పరిశీలకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
‘ఏసీబీ’తో భయం.. భయం
● సింగరేణిలో తొలిసారిగా చిక్కిన కార్మికుడు ● మిగతావారిపై ఆరా తీస్తున్న అధికారులు ● లోతుగా విచారిస్తే మరింతమంది వెలుగులోకి.. ● మున్సిపాలిటీల్లో కూడా పెరిగిపోతున్న అవినీతి ఆరోపణలు కొత్తగూడెంఅర్బన్: అత్యాశ, ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కి జైలుపాలవుతున్నారు. కొందరు లంచం తీసుకుంటుండగా, మరికొందరు అవినీతి ఆరోపణలకు గురై సాక్ష్యాధారాలతో దొరుకుతుండటంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 16 నెలల కాలంలో ఏసీబీ అధికారులు 19 కేసులు నమోదు చేశారు. 27 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం జిల్లాలో లంచం అడగాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు వణుకు పుడుతుందనే చెప్పుకోవచ్చు. కానీ సింగరేణి, మున్సిపాలిటీల్లో అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఈ నెల 6న ఏసీబీ దాడులు నిర్వహించింది. వర్క్షాపులో డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు, 100 ఫైళ్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు కార్మికుడి ఇంట్లో సోదాలు చేసి ఆధారాలతో సహా పట్టుకుని కేసు నమోదు చేశారు. సింగరేణిలో మొదటిసారి దాడులు నిర్వహించిన సమయంలో సింగరేణి ఆస్పత్రిలో హడావిడి చేశారుకానీ నిందితులను పట్టుకోలేకపోయారు. రెండోసారి దాడుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. కార్మికుల బదిలీలు, మెడికల్ అనిఫిట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి లంచం తీసుకుంటున్నవారు ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వివరాలన్నీ సేకరించే పనిలో ఉన్న వారు మరోసారి దాడులు చేస్తే ఏళ్ల తరబడిగా దందాలు చేస్తున్న వారు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా సింగరేణి ఆస్పత్రి సమీపంలోని హోటళ్లను అడ్డాగా చేసుకుని కొందరు బదిలీలు, మెడికల్ అన్ఫిట్ దందాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి అడ్డాలు జిల్లా కేంద్రంలో అనేకం ఉన్నాయని, పక్కా సమాచారంతో దాడులు చేస్తే అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కొందరు కార్మిక సంఘ నాయకులు కూడా దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి విజిలెన్స్ దాడులు చేస్తే మేలు సింగరేణి మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేయిస్తామని, బదిలీ చేయిస్తామని, ఉద్యోగాలకు ఎంపికై న వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో దందా యథాతథంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల బదిలీలు, అన్ఫిట్ తదితర విషయాల్లో లంచం తీసుకునేవారి వివరాలతో సింగరేణి విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తే రూ.10 వేలు పారితోషికం అందజేస్తామని రెండు వారాల కిందట అధికారులు ప్రకటించారు. దందా యథేచ్ఛగా సాగుతున్నా ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆధారాలు ఉన్న కూడా తమ పనులు పూర్తయితే చాలు అనుకునే వారు వందల సంఖ్యలో ఉన్నారు. విజిలెన్స్ అధికారులను ఆశ్రయిస్తే వారి పనితోపాటు, వారు కూడా బయటపడే అవకాశం ఉందని కొందరు జంకుతున్నారు. అయితే విజిలెన్స్ అధికారులే అడ్డాలపై దృష్టి సారించి దాడులు చేస్తే అవినీతిపరులు దొరుకుతారని పలువురు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలో ఇద్దరితో బోణీ... జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఉండగా, పాల్వంచ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సూపర్వైజర్, అసిస్టెంట్ ఇద్దరూ ఏసీబీకి పట్టుబడ్డారు. మిగతా మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే మున్సిపాలిటీల్లోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది చిక్కే అవకాశముంటుంది. ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కరే కమిషనర్ ఉండటంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఏసీబీ నిఘా పెడితే అవినీతిపరులకు చెక్ పెట్టవచ్చని ఆయా మున్సిపాలిటీల ప్రజలు పేర్కొంటున్నారు. -
భాగ్యరెడ్డివర్మ చిరస్మరణీయుడు
సూపర్బజార్(కొత్తగూడెం): దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త ఎంవీ భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొనియాడారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో భాగ్యరెడ్డివర్మ 137వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత పాఠశాలలు స్థాపించారని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి అనసూర్య, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఏఓ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారుల వెంట ఇంకుడు గుంతలు నిర్మించాలిరహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. జల్ సంచయ్ జన్భాగీ దారి కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భజల మట్టం పెరుగుతుందని అన్నారు. రోడ్ల పక్కన వర్షపునీరు నిలిచేందుకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతలు తవ్వించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో చుక్క వర్షపు నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో జిల్లా ద్వితీయస్థానంలో ఉందని, అధిక సంఖ్యలో నిర్మాణాలు చేపట్టి ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు. 26 నుంచి శిక్షణ తరగతులుచుంచుపల్లి: లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కళాశాలలో శిక్షణ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 426 మంది అభ్యర్థులకు 50 పని దినాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ, 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర అన్ని పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని, అభ్యర్థులకు చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాస్, మైనింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘పచ్చిరొట్ట’పై పునరాలోచన!
గతేడాది రూ.1,116.. ఈ ఏడాది రూ.2,137 గతేడాది 30 కిలోల జీలుగు విత్తనాల బస్తా ధర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది ఆ ధర రూ. 2,137.50కు పెరిగింది. గతేడాది కిలో జీలుగుల ధర రూ.93 ఉండగా, ప్రభుత్వం రూ.55.80 సబ్సిడీ ఇవ్వగా రైతులు రూ. 37.20 చెల్లించారు. ఈ ఏడాది కిలో జీలుగు ధర రూ.142.50కు పెరిగింది. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ 71.25 పోగా రైతులు కూడా రూ.71.25 చెల్లించాలి. గతేడాది పోల్చితే ధర రూ.34 పెరిగింది. 30 కిలోల జీలుగు బస్తాకు రూ.1,020 అదనంగా పెరిగినట్లయింది. గతేడాది ప్రభుత్వం 60శాతం రాయితీ ఇవ్వగా ఈ ఏడాది రాయితీని 10 శాతం తగ్గించి 50శాతానికి కుదించింది.బూర్గంపాడు: పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ విధానాలను అవలంబించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో రైతులు మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తన ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోలిస్తే రేటు రెట్టింపయింది. గతంలో 60 శాతం మేర ఉన్న రాయితీని 50 శాతానికి తగ్గించింది. విత్తన ధర పెంపు, సబ్సిడీ తగ్గింపుతో రైతులపై ఆర్థికభారం పెరిగింది. జీలుగు వినియోగమే ఎక్కువ జిల్లాలో ఏటా రైతులు పచ్చిరొట్ట సాగుకు ఎక్కువగా జీలుగులనే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల జనుము సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పీఏసీఎస్ల ద్వారా జీలుగు విత్తనాలను సరఫరా చేయనుండగా, ఈ ఏడాది జిల్లాకు 5 వేల క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. గతేడాది సుమారు 6 వేల క్వింటాళ్లకు పైగా రైతులకు అందించారు. విత్తనాల రాశి తగ్గడం, ధర పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 30 కిలోల సంచి రెండు ఎకరాల సాగుకు సరిపోనుండగా, ఒక ఎకర సాగుకు రూ.1,100 వరకు ఖర్చవుతుంది. దుక్కికి మరో రూ.2 వేలు ఖర్చు చేయాలి. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయాలా? వద్దా అని రైతులు ఆలోచిస్తున్నారు. విత్తన ధర పెంపు, రాయితీ తగ్గింపుతో రైతుల ఆందోళన 30 కేజీల జీలుగు బస్తా కొనాలంటే రూ.1,020 అదనపుభారం భూసారం కోసం పచ్చిరొట్ట సాగు చేయాలన్నా కష్టమే.. ఐదు వేల క్వింటాళ్లు సిద్ధం జిల్లాలో ఐదు వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధంగా ఉంచాం. మండల వ్యవసాయశాఖ అధికారుల రికై ్వర్మెంట్ ప్రకారం ఇంకా విత్తనాలు తెప్పిస్తాం. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసి భూసారాన్ని పరిరక్షించుకోవాలి. –బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారిరాయితీ పెంచి ధర తగ్గించాలి జీలుగు విత్తనాల ధరలు రెట్టింపు చేయటం రైతులకు ఇబ్బందే. ఽవిత్తన ధరలు పెరిగితే ప్రభుత్వం రాయితీ పెంచాలి. అట్లకాకుండా ధరలు పెరిగినప్పుడు, రాయితీ తగ్గించటం సరికాదు. ఇప్పటికై నా రాయితీ పెంచి ధర తగ్గించాలి. –ఊడుగుల సత్యం, రైతు, గొమ్మూరు -
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. ఇద్దరు అర్చకులకు నోటీసులు జారీభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధానార్చకులకు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి గురువారం నోటీసులు జారీ చేశారు. రామాలయంలోని అభయాంజనేయ స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకార్చనను నిర్వహించడంలో అర్చకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రధానార్చకులు విష్ణు, కిరణ్ కుమారాచార్యులును వివరణ కోరగా తమలపాకార్చన నిర్వహించలేదని సమాధానం చెప్పారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారికి నోటీసులు జారీ చేశారు. సింగిల్విండోలో హెచ్టీ సర్వీసుల మంజూరువిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): వినియోగదారులకు హెచ్టీ 11 కేవీ, 33 కేవీలతోపాటు అంతకంటే ఎక్కువ ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో హెచ్టీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సింగిల్ విండో విధానంతో వినియోగదారులు టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్లో అవసరమైన పత్రాలతో హెచ్టీ దరఖాస్తులు (టీజీ ఐపాస్లో నమోదుకాని) నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత కొత్త అప్లికేషన్ నంబరు వస్తుందని వివరించారు. విద్యుత్ సిబ్బంది ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్ను సందర్శిస్తారని తెలిపారు. లోపాలుంటే రెండురోజులలోపు రిమార్క్ వివరాలను వినియోగదారునికి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలిజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర్నాయక్అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్నాయక్ సూచించారు. మండలంలోని ఎర్రగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు. శస్త్రచికిత్సలు లేకుండా సహజ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయగా, తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ తన్మయ్, ఆరోగ్య సిబ్బంది ఎస్తేరు రాణి, ప్రకాష్రావు, హారిక, ప్రసాదరావు, కళ్యాణ్, లక్ష్మి, శరత్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో మొదటి సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సు విద్యార్థులు 1,359 మందికి 1,217 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 188 మందికి 163 హాజరయ్యారు. రెండు విభాగాల్లో 113 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి జనరల్ కోర్సు 432 మందికి 404 మంది విద్యార్థులు హాజరు కాగా, 28 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 64 మందికి 54 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశలు మెడికల్ కిట్లతో విధులు నిర్వహించారు. కొత్తగూడెంలో కొన్ని కేంద్రాల పేర్లు సరిగ్గా తెలియక కొందరు విద్యార్థులు మరో కేంద్రానికి వెళ్లి.. చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. -
రామయ్య సేవలో మాజీ స్పీకర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్ సునీల్ పాల్గొన్నారు. ట్రాలీ ఆటో డ్రైవర్పై కేసు నమోదు పాల్వంచరూరల్: ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటనలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ఈ నెల 19న రాత్రి మండల పరిధి లక్ష్మీదేవిపల్లి బీసీఎం జాతీయ ప్రధాన రహదారి పక్కన మెకానిక్ షాపువద్ద ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేస్తున్న ఆసీఫ్, దంతలబోరు గ్రామానికి చెందిన పోలేబోయిన రాజారావు, చెరుకు శ్రీనులను పాల్వంచ వైపు వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలు కాగా ఖమ్మంకు తరలించారు. పోలేబోయిన వీర్రాజు ఫిర్యాదు మేరకు ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కంచర్ల కృష్ణయ్యపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. పందెంరాయుళ్లపై.. దమ్మపేట: కోడి పందేలు నిర్వహిస్తున్న పందెంరాయుళ్లపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దిబ్బగూడెం గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయికిషోర్రెడ్డి, తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడి పుంజులు, రూ.2,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే..
ఖమ్మంవన్టౌన్: జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల నగరంలో జాతీయవాదుల నేతృత్వాన నిర్వహించిన తిరంగా యాత్రను కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వాన జిల్లా నేతలు కరీంనగర్లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించగా.. ఆయన స్పందించారు.ఇలాంటి దేశద్రోహకర చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. బండి సంజయ్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయప్రతాప్, రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు ● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు. కొమ్మ కత్తిరింపులు.. ● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి. ● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి. ● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. దుక్కి దున్నడం.. తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం. -
నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పినపాక: నాటుసార విక్రయించడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ శాఖ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి దుగినేపల్లి గ్రామానికి చెందిన భూఖ్య రామారావు జానంపేటలో నాటు సారా విక్రయించడానికి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతని వద్ద ఎనిమిది లీటర్ల నాటు సారాతో పాటు ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నాటు సారా విక్రయించిన, తయారు చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి డయాలసిస్ కేంద్రం సీజ్ కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవకతవకలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో ఆస్పత్రి కేంద్రంలోని డయాలసిస్ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ వెల్లడించారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్ చేశామన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద తప్పనిసరిగా ప్రమాణాలు పాటించి సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ నాగభూషణం, డిప్యూటీ డెమో ఎండీ.ఫైజామోహిఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి
కొత్తగూడెంఅర్బన్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానీయుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి అని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కొనియడారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో భాగ్యరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు రెహమాన్ భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగా వర్మ బిరుదు పొందిన ఆయన అణగారిన, దళితుల అభివృద్ధికి, విద్యాసంస్థలు నెలకొల్పి వారి జీవితాల్లో విద్యతో వెలుగులు నింపారని కొనియాడారు. జగన్ మిత్ర మండలిని స్థాపించి దళితుల చైతన్యం కోసం పాటుపడ్డారని, దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి కోసం కృషి చేసిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజన సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం: పీసా యాక్ట్ ప్రకారం గిరిజన మహిళల కోసం కేటాయించిన ఇసుక సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీల సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి మోసపొవద్దని సూచించారు. మహిళలందరూ ఐక్యంగా ఉండి గోదావరిలో ఇసుక వెలికితీత, నిర్వహణ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడీ మైన్స్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టును ఢీ కొట్టిన కంటైనర్..
బూర్గంపాడు: ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో కల్వర్టును ఢీ కొట్టిన ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ మృతిచెందాడు. గురువారం సారపాకలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన ఐతరాజు నరేశ్(35) కంటైనర్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యాన గురువారం కంటైనర్లో పేలుడు పదార్థాల లోడ్తో ఒడిశా వెళ్తున్న క్రమంలో సారపాక సంత సమీపాన ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొట్టాడు. దీంతో నరేష్కు తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు, 108 సిబ్బంది శ్రమించి బయటకు తీశాక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్థారించగా.. ఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ సతీష్, సీఐ సతీష్ పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ మృతి -
డీఎస్పీ సేవలకు గుర్తింపు
కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు. -
పురుగుల మందు తాగి కారు డ్రైవర్ ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని దండాబత్తుల వారి వీధికి చెందిన వరికూటి వెంకన్నబాబు(37) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడిచిన కొద్ది రోజులుగా ఖాళీగా ఉండడంతో కుటుంబపోషణ భారంగా మారడంతో మనస్తాపానికి గురై గురువారం తెల్ల వారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం కలరు. కాగా, మృతుడి అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. టేకులపల్లిలో ఏసీబీ దాడులు? టేకులపల్లి: టేకులపల్లి మండలంలో ఏసీబీ అధికారులు మండలానికి చెందిన అధికారిని పట్టుకునేందుకు రెండు సార్లు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మండలంలో పని చేస్తున్న మండల అధికారిపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు గత వారంలో ఒక రోజు, ఈ వారంలో ఒకసారి ఆ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్రయత్నించగా ముందే పసిగట్టిన తప్పించుకున్నట్లు సమాచారం. అంతగా మండలంలో అవినీతికి పాల్పడుతున్న మండల అధికారి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యాన తాజాగా టేకులపల్లి ఉదంతం వెలుగులోకి రావడంతో మండలంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారేపల్లి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన బానోత్ లాల్సింగ్, ఇల్లెందు మండలం జింకలతండా గ్రామానికి చెందిన బానోత్ సుప్రజ ఇరువురు బైక్పై కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు వస్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యులు ఖమ్మంకు సిఫారసు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
● పుష్కరాలకు జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు ● నదీస్నానం పుణ్యఫలమని నమ్మకం ● ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం ఇల్లెందురూరల్ : సరస్వతీ పురష్కరాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఈ త్రివేణీ సంగమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండగా.. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. నదీ స్నానాలకు ప్రాముఖ్యం సరస్వతీ పుష్కరాల్లో నదీ స్నానాలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్కరస్నానం పుణ్యఫలమని, చదవుల తల్లిగా విరాజిల్లుతున్న సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. కాళేశ్వరంలో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం భక్తులు నదీ తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పాటు పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో పయనం.. జిల్లాలోని అన్ని ప్రాంతాల భక్తులు నిత్యం పుష్కరాలకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో ఇల్లెందు, మహబూబాబాద్, నర్సంపేట, వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. లేదంటే రైలులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు. ట్రావెల్స్ చార్జీల మోత.. జిల్లా నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సుల సౌకర్యం అంతగా లేకపోవడంతో భక్తులు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు భక్తులు పుష్కరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, లక్నవరం, రామప్ప, వరంగల్ వేయి స్థంబాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, సెలవులు కావడం, ఇప్పుడే పుష్కరాలు రావడంతో ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరల మోత మోగుతోంది. దక్షిణ కాశీ దర్శనం ఆనందాన్నిచ్చింది దక్షిణ కాశీగా పేరెన్నికగన్న కాళేశ్వరం దర్శనం ఆనందాన్నిచ్చింది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ పవిత్ర భూమిని ప్రత్యక్షంగా వీక్షిండం, పుష్కరస్నానం ఆచరించడంతో ధన్యులమయ్యాం. యమలింగం, శివలింగం దర్శనం మరింత సంతృప్తినిచ్చింది. – పొద్దుటూరి స్వప్న, కొమరారం, ఇల్లెందు మండలం పుష్కరాలకు వెళ్లడం సంతృప్తినిచ్చింది గోదావరి, కృష్ణ పుష్కరాలకు గతంలో వెళ్లాం. కానీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లడం మరింత సంతృప్తినిచ్చింది. మూడు నదుల సంగమ ప్రదేశాన్ని దర్శించడం, ఆ పుణ్య ప్రదేశంలో కుటుంబ సమేతంగా స్నానమాచరించడం అదృష్టంగా భావిస్తున్నాం. – పుల్లఖండం మమత, పోలారం, ఇల్లెందు మండలం -
‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా
బూర్గంపాడు: కుటుంబ ఆర్థిక భరోసాకు జీవిత బీమా తప్పనిసరని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాగరాజు అన్నారు. గురువారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని తమ బ్యాంకులో జీవిత బీమా చేసి ప్రమాదవశాత్తు, సహజ మరణాలు పొందిన తొమ్మిది మంది కుటుంబాలకు రూ.36 లక్షల విలువైన చెక్కులను అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరే బీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంక్ మేనేజర్ ఆర్.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సునీల్కుమార్, రమేష్రెడ్డి, ఉదయ్కుమార్, రామకృష్ణ, సాయి కృష్ణ, పాషా, ఐకేపీ ఏపీఎం నాగార్జున, ఎస్బీఐ బిజనెస్ డెవలప్మెంట్ మేనేజర్ నందు, గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. జనావాసాల్లోకి దుప్పి.. అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పి అశ్వారావుపేట పట్టణంలో హల్చల్ చేసింది. గురువారం మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతం నుంచి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో ఉన్న జనవాసాల్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆందోళనకు గురై పరుగులు తీసింది. దీంతో బీఎస్ఆర్ నగర్ మీదుగా ఇందిరా కాలనీ నుంచి అల్లిగూడెం గ్రామం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న స్థానిక ఫారెస్టు రేంజర్ మురళి ఆధ్వర్యాన దుప్పిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది అటవీ సిబ్బందికి చిక్కకుండా అల్లిగూడెం సమీపంలో గల వ్యవసాయ క్షేత్రాలను దాటుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దాదాపు గంటపాటు పట్టణంలోని ఇళ్లల్లోకి వెళ్లి దుప్పి హల్చల్ చేయడంతో స్థానికులు చూసేందుకు పోటీ పడ్డారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో జరగనున్న టైసన్ కప్ ఓపెన్ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్యాట్రన్ ఝెర్రా కామేష్ వివరాలు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల్లో సబ్ జూనియర్స్ విభాగంలో గోనెల నిశాంత్ కుమార్, దాసరి హేమంత్, రాచకట్ల వినయ్, బొల్లోజు మహేశ్, ఆముదాల విజయ్ భాగ్యేష్, జూనియర్స్ విభాగంలో జిజుల అజిత్, గోనెల అక్షయ్ కుమార్ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ వై.శివసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు షమీవుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, ధనుంజయ్, సుహాష్ అద్వైత్, నున్న శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే నష్టపరిహారం అశ్వారావుపేటరూరల్: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద నిర్మించే కాలువ నిర్మాణాల్లో సాగు భూములను కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన నష్ట పరిహారం మేరకే చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె.కార్తీక్ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ నిర్మాణాలకు అవసరమైన భూములను సేకరిస్తున్నామని, ఎమైనా అభ్యంతరాలు ఉంటే వెల్లడించాలని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా అశ్వారావుపేట మండలంలో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నష్టపోతున్న రైతులు సహకరించాలని కోరారు. ఈ గ్రామసభలో మున్సిపాలిటీ కమిషనర్ సుజాత, డీటీ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ కృష్ణ, ఏఈఈ కేఎన్బీ కృష్ణ, ఆర్ఐలు తాటి కృష్ణ, పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంకుడుగుంతలతోనే నీటి సంరక్షణ
మణుగూరు రూరల్: ఇంకుడు గుంతల ఏర్పాటుతోనే నీటి సంరక్షణ, భూగర్భ జలాలను పెంపొందించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. గురువారం మండల పరిధిలోని లంకమల్లారం, సమితిసింగారం, గుట్టమల్లారం, ముత్యాలమ్మనగర్గ్రామపంచాయతర్ల్ ఇంకుడుగుంతలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటి వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటింటికి ఇంకుడుగుంతలు తప్సనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, బోరు బావి, చేతిపంపుల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు. నేల స్వభావాన్ని, పరిసరాలను బట్టి ఈ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్బజార్(కొత్తగూడెం): సీతారామ కెనాల్ ఎత్తిపోతల పథకానికి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన ఇరిగేషన్, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో గ్రామసభల నిర్వహణ పూర్తి చేయాలని చెప్పారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ చేయాలని సూచించారు. సర్వేయర్లకు అధునాతన యంత్రపరికరాలు, ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. సర్వేలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని, తద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు, కాల్వల వెంట సుబాబుల్, తంగేడు, తాటి మొక్కలు నాటేలా అవగాహనా కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జునరావు, సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి చుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ, వెంకటేశ్వర కాలనీల సమగ్రాభివృద్ధికి శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ రెండు గ్రామాల్లో పర్యటించారు. డ్రెయినేజీలు, రహదారులు, ఖాళీ స్థలాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నామని, వసతుల కల్పనకు తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల్లో ఈ గ్రామాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ సుభాషిని, ఎంపీఓ సత్యనారాయణ, స్థానిక నాయకులు జేబీ శౌరి, దుర్గేష్ తదితరులు ఉన్నారు. -
విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాల పెంపుదలతో పాటు విద్యారంగాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో హెచ్ఎంలకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యారంగ డిజిటలీకరణ వైపుగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని నాయకత్వ పటిమతో పని చేయాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణలో రిసోర్స్ పర్సన్లు చెప్పే అంశాలను శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవాలని, పాఠశాలకు వెళ్లిన తర్వాత వాటిని సరైన రీతిలో ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర సమన్వయకర్త, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, రిసోర్స్పర్సన్లు ఆనందకుమార్, మీరా సాహెబ్, విజయబాబు, బాబూలాల్ పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం.. 2025 – 26 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ తెలిపారు. పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 4,01,875 పుస్తకాలు వచ్చాయని వివరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి విశాఖపట్టణానికి చెందిన గవిరెడ్డి కస్తూరి నాయుడు దంపతులు రూ.1,00,016, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పైడికొండల పాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీయదత్త దంపతలు రూ.2.50 లక్షలు ఆలయ ఈఓ రమాదేవికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ లింగాల సాయిబాబు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుందిడీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య కొత్తగూడెంఅర్బన్: నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. కొత్తగూడెంలో బుధవారం జరిగిన పార్టీ సంస్థాగత సభకు జిల్లా అబ్జర్వర్లు శ్రవణ్కుమార్రెడ్డి, ప్రమోద్కుమార్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలు, ఏ, బీ బ్లాక్ల అధ్యక్ష పదవులకు ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తికొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడిఝెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 27 వరకు పరీక్షలు జరగనుండగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆదివారంతో సహా ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 7,635 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
టేకులపల్లి : పామాయిల్ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని ఉద్యాన శాఖ జిల్లా అధికారి జె.కిశోర్కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ జి.లాల్చంద్ అన్నారు. మండలంలోని చింతోనిచెలకలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎకరానికి 57 పామాయిల్ మొక్కలు వేయాలని, డ్రిప్ పరికరాల కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తామని చెప్పారు. మూడేళ్లపాటు ఎకరానికి రూ.4200 చొప్పున రైతుల ఖాతాలల్ల జమ చేస్తామన్నారు. పామాయిల్ గెలలు 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తాయని, నికర ఆదాయం ఉంటుందని వివరించారు. పామాయిల్లో అంతర పంటగా మునగ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, హెచ్ఓ స్రవంతి, ఏఈఓ రెహనా, ఇరిగేషన్ మేనేజర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన శాఖాధికారి కిశోర్కుమార్ -
క్రీడలతో ఆనందం, ఆరోగ్యం
సుజాతనగర్: క్రీడలతో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. వేపలగడ్డలో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా బ్యాడ్మింటన్ ఆటపై మక్కువ పెరుగుతుందని అన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, స్టేడియం నిర్వాహకులు చెరుకుమల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదం.. అందని వైద్యం
● బాధితులకు సకాలంలో అందని మందులు ● వారంలో మూడు రోజులే వస్తున్న డాక్టర్లు ● జిల్లాలో 12 వైద్యశాలలు, వెల్నెస్ సెంటర్లు ● అంతటా ఇదే పరిస్థితి.. ఇల్లెందు: ఆధునిక వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటికీ కొందరు ఆయుర్వేద, యునానీ, హోమియో మందులపైనే ఆధారపడుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఉన్నవారూ అంతంతమాత్రంగానే పని చేస్తుండడంతో బాధితులకు సకాలంలో మందులు అందడం లేదు. జిల్లాలో 12 ఆయుర్వేద, యునానీ, హోమియో ఆస్పత్రులు ఉండగా, డాక్టర్లు వారంలో మూడు రోజులే వైద్యశాలకు వస్తుంటారు. అప్పుడు కూడా పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదు. ఎస్ఎన్ఓలే దిక్కు.. జిల్లాలో 12 ఆస్పత్రులకు అనుబంధంగా వెల్నెస్ సెంటర్లు నెలకొల్పారు. ఈ వైద్యశాలల్లో నలుగురే డాక్టర్లు ఉన్నారు. వీరంతా ప్రతీ గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే వస్తుంటారు. అతి తక్కువ మంది ఉన్న ఫార్మసిస్టులు, స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ(ఎస్ఎన్ఓ)లు మాత్రమే బాధితులకు మందులు ఇస్తుంటారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఔట్సోర్సింగ్ పద్ధతిన డీపీఎంలను నియమించినా వారూ అంతంతమాత్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల తాళాలు తీసే దిక్కే లేదు. లోపాలు అనేకం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలన వికేంద్రీకరణపై మొగ్గు చూపిన ప్రభుత్వం.. ఆయుర్వేద, యునానీ, హోమియో వైద్యశాలలను మాత్రం విస్మరించింది. వీటికి జిల్లా స్థాయిలో అధికారులు లేరు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వరంగల్ కేంద్రంగా రీజినల్ డైరెక్టర్(ఆర్డీ) పర్యవేక్షిస్తున్నారు. అలా కాకుండా ప్రతీ జిల్లాకు పాలనాపరంగా అధికారిని నియమించడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచాలని, నిత్యం ప్రజలకు వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. ‘ఇల్నెస్’ సెంటర్లుగా.. జిల్లాలో 12 ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యశాలలకు అనుబంధంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినా వాటిని తెరిచే నాథుడు లేక అవి ఇల్నెస్ సెంటర్లుగా మారాయి. జిల్లాలో రొంపేడు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వాపురం, కరకగూడెం, నాగుపల్లిలో ఆయుర్వేద ఆస్పత్రులు, ఇల్లెందు, అశ్వారావుపేట, ఆర్ కొత్తగూడెంలో హోమియో, భద్రాచలం, పాపకొల్లులో యునానీ ఆస్పత్రులు ఉండగా అన్నింటికీ కలిపి నలుగురే డాక్టర్లు ఉన్నారు. ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆస్పత్రిని అందుబాటులో ఉంచాలి.. ఇల్లెందులోని హోమియో వైద్యశాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రెగ్యులర్ డాక్టర్, ఫార్మసిస్ట్, స్వీపర్ను నియమించాలి. సరిపడా మందులు నిల్వ ఉంచాలి. అధిరారుల పర్యవేక్షణ నిరంతరం ఉండేలా చూడాలి. – మునిగంటి శివ, ఇల్లెందు ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్నా ఇల్లెందు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో గత కొంత కాలంగా ఇన్చార్జ్గా సేవలు అందిస్తున్నా. గార్లలో రెగ్యులర్ డాక్టర్గా రెండు చోట్లా పని చేయడంతో వారానికి మూడు రోజులే రావాల్సి వస్తోంది. త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ అవుతాయి. కొన్ని రకాల మందులు తక్కువ ఉన్నాయి. – డాక్టర్ జ్యోతి, ప్రభుత్వ హోమియో వైద్యశాల, ఇల్లెందుతీవ్రంగా మందుల కొరత.. జిల్లా వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఆయుర్వేద వైద్యం పొందే మార్గం ఉన్నా అటు డాక్టర్లు, ఇటు మందులు అందుబాటులో లేక ప్రజల్లో ఆదరణ తగ్గింది. కొందరు ఆయుర్వేద వైద్యం, మందులపై నమ్మకంతో ఆస్పత్రిఇ వస్తున్నా వారికి సకాలంలో చికిత్స అందకపోగా మందుల కొరతా వేధిస్తోంది. డాక్టర్లు లేకపోవడంతో మందులకు ఇండెంట్ పెట్టే వారు కూడా ఉండడం లేదు. -
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి
చుంచుపల్లి: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. బుధవారం ఆయన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో–ఆర్డినేషన్ సెంటర్ను సందర్శించారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలు, వాటి పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లాలోని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్, ఎస్సై ఉమ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్ రాజు -
ముందుగానే తొలకరి..
● ఉపరితల ఆవర్తనంతో వర్షాలు ● వారంలోగా రుతుపవనాలు వస్తాయంటున్న వాతావరణ శాఖ ● వానాకాలం పంటల సాగుకు రైతుల సమాయత్తంబూర్గంపాడు: ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరిస్తోంది. మే నెలలో కురిసిన అకాల వర్షాలతో భూములు పదునయ్యాయి. గత మూడు రోజులుగా ఉపరితల ఆవర్తనంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ కార్తెలో సాధారణంగా ఎండల తీవ్రత పెరుగుతుంది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావం, రుతుపవనాలు ముందస్తుగా వస్తాయనే సమాచారంతో ఈ ఏడాది ముందుగానే పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పదునెక్కిన భూములు.. ఇటీవలి వర్షాలతో భూములు పదునెక్కగా వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచే పత్తితో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, పిల్లి పెసర, పెసర పంటలు కూడా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ రెండో వారంలో వరి నార్లు పోస్తారు. వర్షాలు కురుస్తుండడం, రుతుపవనాలు ముందుగానే వస్తాయనే వాతావరణశాఖ సూచనలతో పంటల సాగు పనులు ప్రారంభించారు. గత సీజన్లో సాగు చేసిన పత్తి, మిరప వ్యర్థాలను తొలగించి భూములు శుభ్రం చేస్తున్నారు. వరి మాగాణుల గట్లు సరిచేసుకుంటున్నారు. పశువుల ఎరువు, చెరువు మట్టిని పొలాల్లో తోలుకుంటున్నారు. చేలలో నీటి గుంతలు, పంట కాల్వలు తవ్వుతున్నారు. మరోవైపున పెట్టుబడి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఏ భూముల్లో ఏ విత్తనాలు వేయాలి, ఏ కంపెనీ విత్తనాలు తీసుకోవాలనే చర్చ రైతుల్లో సాగుతోంది. మరో వారం రోజుల్లో సాగు పనులు ముమ్మరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
డయాగ్నస్టిక్ సెంటర్ సీజ్
మణుగూరు రూరల్: మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ రక్త పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, డీఈఎంఓ డాక్టర్ ఫయాజ్ మోహినుద్దీన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీ లించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న ఎస్వీ డయాగస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ సీహెచ్ శ్రీనివాస్ లీలా, ఎండీ సాధిక్ తదితరులు పాల్గొన్నారు ‘సీతారామ’ భూసేకరణకు గ్రామసభలుఅశ్వారావుపేటరూరల్: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ నంబరు–7, 8వ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణాల కోసం గ్రామసభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం, నారంవారిగూడెం,అశ్వారావుపేట, జమ్మిగూడెం, మద్దికొండ, 23న ఆసుపాక, వేదాంతపురం, తిరుమలకుంట, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, గ్రామ పంచాయతీ కార్యాలయం, 24న రామన్నగూడెం, అనంతారం, కన్నాయిగూడెం, నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను నిర్వహిస్తామని తెలిపారు. సభల్లో మొత్తం 848.28 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఆయా రైతులతోపాటు, పీసా గ్రామసభలకు కార్యదర్శులు, పీసా కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, గ్రామపెద్దలు హాజరు కావాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో పది మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజ మల్లు బుధవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్ పరిధి, లక్ష్మీదేవిపల్లి ఏరియా, పాల్వంచ ఏరియాలలో పోలీసులు తనిఖీలు చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వారికి జరిమానా విధించారు. టీజీఆర్జేసీలో చాణక్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్చుంచుపల్లి/సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఆర్జేసీ పరీక్షలో రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి బొమ్మిశెట్టి చాణక్య అభినవ ఎంఈసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్టు విద్యార్థి చాణక్య తెలిపాడు. పీవీకే–5 గనిలో గ్యాస్ లీక్గోడలు నిర్మించటంతో తప్పిన ప్రమాదం సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గనిలో మంగళవారం 16 రేస్ 72 లెవల్ వద్ద గ్యాస్ విడుదలగా, విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గనిలో గ్యాస్ను గుర్తించే మానిటరింగ్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి గని మేనేజర్ ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై రెండు రోజులుగా గ్యాస్లీకేజీ అవుతున్న ఏరియాలో గోడలు నిర్మించి గ్యాస్ లీకేజీని అరికట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై గని మేనేజర్ను వివరణ కోరగా.. పాత గని కావడంతో జియాలజికల్ సమస్యలు తలెత్తాయని, భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంపార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పాల్వంచరూరల్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్తక సంఘం భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో గాంధీనగర్, శ్రీనగర్ ఏరియాల నుంచి కేతిని కుమారి, ఎర్రంశెట్టి రాజేశ్వర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీ లో చేరాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడు తూ బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలోనాయకులు రాపాకరమేష్, కళ్లెంవిజయరెడ్డి,భూక్య రవి, వెంకటేశ్వరరావు, రంజిత్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
సులభంగా.. వేగంగా..
● భూ భారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం ● పైలట్ ప్రాజెక్ట్గా సుజాతనగర్ మండలం ఎంపిక ● రెవెన్యూ సదస్సుల్లో 2,835 దరఖాస్తులు..సుజాతనగర్: భూ భారతి చట్టం అమలుకు జిల్లాలో సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సులభతరం చేయడంతోపాటు తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు కల్పించడంతో సమస్యలు వేగవంతంగా పరిష్కారం కానున్నాయి. సుజాతనగర్ మండలంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సులో భూ సమస్యలపై 2,835 దరఖాస్తులు అధికారులకు అందాయి. సాదాబైనామా, అసైన్డ్ భూములు, పాసు పుస్తకాల జారీ, పోడు భూములు, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడం వంటి సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను ఆన్లైన్చేసి, విచారణ త్వరితగతిన పూర్తిచేసి పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. సాదాబైనామా అర్జీలే ఎక్కువ.. మొత్తం 2,835 దరఖాస్తుల్లో సాదాబైనామా 1,240, వారసత్వం 118, ఫామ్ కే 103, పెండింగ్ మ్యుటేషన్ 3, పాసు పుస్తకాలపై 314, డీఎస్ పెండింగ్ 12 దరఖాస్తులతోపాటు, పోడు భూములు, అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం, ఇతరత్రా కోర్టు కేసులకు సంబందించిన దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటిలో ప్రస్తుతం వారసత్వం భూములు, గిరిజనులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. డిప్యూటీ తహసీల్దార్, గిర్దావర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లతో మూడు బృందాలుగా అధికారులు ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక హద్దులను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ప్రయోజనం ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీ సమస్య సీసీఎల్ఏ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు. దీంతో రైతులు చేసేదేమి లేక ఇబ్బందులకు గురయ్యారు. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి చట్టంతో సులభంగా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సుజాతనగర్ మండల స్వరూపం విస్తీర్ణం 24,927.18 ఎకరాలు అటవీ భూమి 7,535.25 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ 558.13 ఎకరాలు ప్రభుత్వ భూమి 2,241.28 ఎకరాలు రెవెన్యూ గ్రామాలు 6 గ్రామ పంచాయతీలు 20పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేశా.. మా తాత కాకటి పుల్లయ్య ద్వా రా మా నాన్న వెంకయ్యకు వా రసత్వంగా 444 సర్వే నంబర్లో 2 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూమిని గత 50 ఏళ్లుగా మా నాన్నే సాగు చేస్తున్నాడు. పాసు పుస్తకం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు పొందలేకపోతున్నాం. ఇటీవల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేశాను. –కాకటి సునీల్ కుమార్, సింగభూపాలెం సమస్యలకు పరిష్కారం మండలంలో మొత్తం 2,835 దరఖాస్తులు రాగా, మూడు బృందాలుగా దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వారసత్వం, గిరిజనులు కొనుగోలు చేసి రిజి స్ట్రేషన్కు సిద్ధంగా ఉన్న భూ సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ అనుమతి అనంతరం సాదాబైనామా దరఖాస్తులను విచారిస్తాం. –వనం కృష్ణప్రసాద్, తహసీల్దార్, సుజాతనగర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. గుండెపుడి గ్రామ పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన పద్దం చిన్న నరసింహారావు(35), కల్తి కార్తీక్లు బైక్పై మంగళవారం రాత్రి జూలూరుపాడు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెలను బైక్ ఢీకొట్టింది. దీంతో పద్దం చిన్న నరసింహారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్కు గాయాలయ్యాయి. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో ఎస్అండ్పీ గార్డు..ఇల్లెందు: పట్టణంలోని స్ట్రట్ఫిట్ బస్తీకి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డు బి.రాజ్కుమార్(40) బుధవారం గుండె పోటుతో మృతిచెందాడు. ఉదయం విధుల నిమిత్తం ఆఫీస్కు వెళ్లిన ఆయనకు చెమటలు వచ్చి అస్వస్థత చెందడంతో సింగరేణి ఆస్పత్రికి వెళ్లాలని తోటి సిబ్బంది సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరిన కొద్ది సమయానికే మృతి చెందా డు. సహచర గార్డులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కర్ణాటకలో చోరీ.. వైరాలో రికవరీవైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్లకిలే ఏఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్కుమార్కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు. -
సదస్సులు లేవు.. చైతన్యం లేదు..
వైరారూరల్: పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలు, విత్తనాల ఎంపిక జాగ్రత్తలు, సాగుకు ముందు చేయించాల్సిన భూపరీక్షలు ఇలా పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రపదేశ్గా ఉన్నప్పడు రైతు చైతన్య యాత్రలు నిర్వహించేవారు. తెలంగాణ ఏర్పడాక బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఏటా వానాకాలం సాగుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులను నిర్వహించేది. కానీ గత రెండేళ్ల నుండి ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ఏటా సదస్సుల ఊసెత్తడం లేదు. దీంతోఆధునిక విధానాలపై అవగాహన లేక, ఏళ్లుగా ఒకే పంట సాగు చేస్తూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ రైతులు నష్టపోవడం అనవాయితీగా మారింది. అవగాహనలేమితో నష్టాలు గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాక నష్టాలు తగ్గే అవకాశముంది. గతంలో సదస్సులు నిర్వహించినప్పుడు వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే కాక రైతుల నుంచి సంతకాలు సేకరించేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితిల జాడ లేకపోగా, అవగాహన సదస్సుల విషయాన్నే మరిచిపోయారు. ఈ ఏడాది ‘రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశిత ప్రాంతాల్లోనే ఏర్పాటుచేస్తుండడంతో రైతులకు సలహాలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఊసే లేని ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ రెండేళ్ల క్రితం వరకు ఏప్రిల్, మేలో అవగాహన సదస్సులు ఈసారి మండలానికొక సదస్సుతో సరి -
ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు
దమ్మపేట: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరి చిన దమ్మపేట మండలానికి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, శాఖ కార్యదర్శి శరత్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. బుధవారం హైదరాబాద్లోని కొమురం భీమ్ భవన్లో గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్(2024–25)ను ఘనంగా నిర్వహించారు. 575, 569 మార్కులతో గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వాడే మౌనిక, స్రవంతిలకు గోల్డ్ మెడళ్లను అందజేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలను కూడా మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్ఎంలు శారద, చంద్రకళ, వార్డెన్ నాగమణి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం విద్యార్థినులు -
నిందితుడికి రిమాండ్
పాల్వంచ: వివాహిత ఆత్మహత్య కేసులో నిందితుడు, టీఎస్పీఎస్ కానిస్టేబుల్ నాగరాజును పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్య భార్య త్రివేణి(32)ని మరిది కానిస్టేబుల్ నాగరాజు వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపం చెందింది. పాల్వంచలోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చి సోమవారం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు త్రివేణి ఆత్మహత్యకు కారణమైన మరిదిని అరెస్ట్ చేశారు. పశువులు స్వాధీనంటేకులపల్లి: టేకులపల్లి నుంచి పండితాపురం సంతకు అక్రమంగా తరలిస్తున్న పశువులను బుధవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. తావుర్యాతండా పంచాయతీ ఈర్యాతండా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలెరో ట్రాలీలో తరలిస్తున్న ఏడు పశువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మునీర్, తేజవత్ ప్రసాద్, హైమద్లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. -
తారుప్లాంట్లో అగ్నిప్రమాదం
బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలో ఉన్న తారుప్లాంట్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తారు ప్లాంట్ నుంచి దట్టమైన పొగతో మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ప్లాంట్లో పనిచేసే కార్మికుల సమాచారంతో భద్రాచలం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. భద్రాచలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫైర్మెన్లు కిరణ్, యాకుబ్, వెంకట్రామిరెడ్డి మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలి
ములకలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలపరిధిలోని మాదారం గ్రామంలో తెలంగాణా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సదస్సులో మాట్లాడారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, తెలంగాణా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, పార్టీ ములకలపల్లి, పాల్వంచ మండలాల కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, పాకాల వెంకట్రావు, ఊకంటి రవికుమార్, మాలోతు రావూజా, నిమ్మల మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ -
ఆర్టిజన్లకు బదిలీల భయం
● కేటీపీఎస్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు ● పర్మనెంట్ చేశాకే బదిలీ చేయాలని డిమాండ్ పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే టీజీ జెన్కో పరిధిలోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలతోపాటు, ఏఈ నుంచి ఎస్ఈ వరకు బదిలీలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన వైటీపీఎస్, బీటీపీఎస్లలో ఉద్యోగ, కార్మికులు అవసరం ఉండటంతో అక్కడికే ఎక్కువ మందిని బదిలీలు చేశారు. ఈ క్రమంలో కేటీపీఎస్లో అదనంగా ఉన్న ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కలిగించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలు సరికాదంటున్న కార్మికులు ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్–1, 2 ,3, 4లుగా ఉన్నారు. స్కిల్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరు గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన క్రమంలో స్కిల్ను బట్టి ఆయా కంపెనీలు పనికి తగిన వేతనం ఇచ్చేవి. గత ప్రభుత్వం వీరిని ఆర్టిజన్లుగా తీసుకోవడం, కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశలో ఆర్టిజన్లు ఉన్నారు. కానీ పదేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల మాదిరిగా వీరికి జెన్కో యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలేదు. పైగా అదనంగా ఉన్నారనే నెపంతో యాజమాన్యం ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే యోచన సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఆర్టిజన్లు వాపోతున్నారు. ఉద్యోగులుగా తీసుకోవాలి ఇప్పటివరకు ఇతర కేడర్లలో అత్యధికంగా పదోన్నతులతోనే బదిలీలు చేపట్టారు. ఆర్టిజన్లు కేటీపీఎస్ 7వ దశలో 600 మంది, కేటీపీఎస్ 5,6 దశల్లో సుమారు 1,400 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి సుమారు 24 వేల మంది ఉన్నారు. బదిలీ చేసే ముందు తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగులకు కల్పి స్తున్న సౌకర్యాలన్నీ తమకు కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. లేనిపక్షంలో బదిలీ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లబ్ధిదారుల పేర్లల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని జిల్లా హౌజింగ్ పీడీ శంకర్ సూచించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో మంగళవారం ఆయన ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల జాబితాను పరిశీలించి మాట్లాడారు. తప్పులున్న వారి జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు వాటిని సరిదిద్దుతామని వెల్లడించారు. ఆయన వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేశ్, పంచాయతీ కార్యదర్శి రోహిత్, ఏఈలు రాము, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సరళమైన పద్ధతిలో బోధించాలి పాల్వంచ: ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్ట్లో మెళకువలు నేర్చుకుని, సరళమైన పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, సబ్జెక్ట్లను పూర్తిగా అవగాహన చేసుకుని, విద్యార్థులు అవపోసన పట్టే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ ఎస్.సైదులు, డీఆర్పీలు సంపత్, ప్రభుసింగ్, అపక శంకర్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సర్వీసులపై అవగాహన తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్సీకి ఇటీవల 108, 102 నియోనేటల్ అంబులెన్స్ సేవలు మంజూరయ్యాయి. ఆయా వాహనాల్లో ఉన్న అత్యాధునిక పరికరాల వినియోగంపై అత్యవసర సేవల ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సీహెచ్సీకి మంగళవారం వచ్చిన ఆయన అంబులెన్స్ల్లోని సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృపా ఉషశ్రీ ఉద్యోగులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగి మృతదేహం లభ్యం సుజాతనగర్: మండలంలోని డేగలమడుగు సమీప పంట పొలాల్లో ఓ మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈమేరకు పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన పోస్టల్ విశ్రాంత ఉద్యోగి షేక్ ఖాసిం(61)గా గుర్తించారు. కాగా, డేగలమడుగు వాసులకు సోమవారం కనిపించిన ఆయన మంగళవారం మధ్యాహ్నానికి మృతదేహంగా మారాడు. ఖాసిం మరణంపై ఎలాంటి అనుమానం లేదని, అనారోగ్యంతో మృతి చెందాడని ఆయన కుమార్తె షేక్ మౌలాబీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమాదేవి తెలిపారు. దాడులకు పాల్పడడం హేయమైన చర్యఖమ్మంమామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా సైనికుల త్యాగా లు, కేంద్ర ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంటే విచ్ఛిన్నం చేసేలా కొందరు దాడులకు పాల్పడటం గర్హనీయమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన జవాన్ల వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలపాల్సింది పోయి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని తెలి పారు. ఈమేరకు జాతీయవాదులపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో నాయకులు నున్నా రవికుమార్, ఈ.వీ.రమేష్, సన్నే ఉదయ్ప్రతాప్, అల్లిక అంజయ్య, నంబూరి రామలింగేశ్వరరావు, రవిరాథోడ్, బెనర్జీ, నల్లగట్టు ప్రవీణ్కుమార్, ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చండ్రుగొండకు చెందిన ఎస్కే మౌలాన (70) అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఉంటున్నాడు. మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో కొత్తగూడెం వైపు వెళ్తున టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మౌలానా అక్కడికక్కడే మృతిచెందగా.. వేగంగా వెళ్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబీకులు, స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నాగరాజు తెలిపారు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు భద్రాచలంఅర్బన్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ 2022 ఏప్రిల్ 22న ఓ గర్భిణికి సిజేరియన్ చేస్తున్న సందర్భంలో ముద్దాయి గుర్రం లాల్ఖాన్ సదరు మహిళతో అవమానకరంగా ప్రవర్తించాడని భద్రాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగా పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి శివనాయక్ మంగళవారం పైవిధంగా తీర్పునిచ్చారు. అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న జేసీబీని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని అప్పారావుపేట శివారులో మంగళవారం అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకుని, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఐ భిక్షం జేసీబీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. -
కాంగ్రెస్ను పటిష్టపర్చాల్సి ఉంది..
ఇల్లెందు/మణుగూరుటౌన్: దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని, గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలని, ఇలాంటి తరుణంలో కాంగ్రెస్కు పూర్తిస్థాయి కార్యకర్తలు అవసరమని టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పి.శ్రావణ్కుమార్రెడ్డి, ప్రదాన కార్యదర్శి ప్రమోద్కుమార్ వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంస్థాగత కమిటీల పదవులకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, దేశంలో అధికారం సాధించి, రాహుల్ను ప్రధానిని చేసేందుకు ప్రతీ కార్యకర్త పోరాడాలని కోరారు. అందుకోసం ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి సూచనలతో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పటిష్టం చేయాల్సి ఉందన్నారు. 2017 పూర్వం నుంచి పార్టీ లో ఉన్న వారికి పదవులు వస్తాయని, దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. డానియేల్, పులి సైదులు, దేవానాయక్, రవికుమార్, జిల్లా కిసాన్ కమిటీ అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మణుగూరులోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా.. శ్రావణ్కుమార్రెడ్డి, ప్రమోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏ, బీ బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్కుమార్రెడ్డి -
శిథిలావస్థలో సీఎంపీఎఫ్ కార్యాలయం
● 1985లో నిర్మాణం ● పర్యవేక్షణ కరువు.. నాణ్యతా లోపం.. ● క్వార్టర్లదీ అదే పరిస్థితి సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సీఎంపీఎఫ్ (కొత్తగూడెం రీజియన్) భవనం శిథిలావస్థకు చేరింది. 1985లో సీఎంపీఎఫ్ సెంట్రల్ కార్యాలయం వారు కేటాయించిన నిధులతో సింగరేణిి యాజమాన్యం కాంట్రాక్టర్ ద్వారా నిర్మించిన ఈ భవనాన్ని 1987లో ఆనాటి సీఎంపీఎఫ్ కమిషనర్ శంకర్ ప్రసాద్ ప్రారంభించారు. 40 ఏళ్లకే పూర్తి శిథిలావస్థకు చేరిందంటే కాంట్రాక్టర్ కట్టిన నాణ్యత ఇట్టే అర్థం అవుతుంది. అంతే కాకుండా సివిల్ అధికారుల పర్యవేక్షణ, అధికారుల నిబద్ధత గురించి కార్మికులు గుసగుసలాడుతున్నారు. రీజియన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యనిధి అంటే సుమారు 20 వేల మంది కార్మికుల భవితవ్యం ఈ కార్యాలయంలో ఉంటుంది. కార్పొరేట్ ఏరియాకు కూతవేటు దూరంలోనే సివిల్ జీఎంలతోపాటు, ఇతర ఉన్నతాధికారులు ఉండే కార్యాలయ నిర్మాణం ఈవిధంగా ఉందంటే ఇతర ఏరియాలలో కాంట్రాక్టర్లు నిర్మించి భవనాల తీరు ఏవిధంగా ఉంటుందో, ఎంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్థం అవుతంందని కార్మికులు చర్చించుకుంటున్నారు. పెచ్చులు ఊడి పడుతున్న స్లాబ్.. భవనంలో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఎప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళనలతో ఉద్యోగులు ఇటీవల పక్కనే ఉన్న మరో కార్యాలయంలోకి మారారు. అయినా సింగరేణి అఽధికారులు పట్టించుకోవటం లేదు. ఇదిలా ఉండగా, సీఎంపీఎఫ్ కార్యాలయం వెనక సింగరేణి కాంట్రక్టర్లు నిర్మించిన క్వార్టర్లు కూడా ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో మరమ్మతులు చేశారు. అయినా మార్పు లేదని, ఉద్యోగులు గమనించి బయట కిరాయికి ఉంటున్నారు. క్వార్టర్లు ఉండి ఉద్యోగులు బయట కిరాయికి ఉండటం గర్హనీయం. ఈ భవనం, క్వార్టర్ల కోసం సుమారు 40 ఏళ్ల క్రితం ఆనాటి ఎస్టేట్స్ అధికారులకు సుమారు 5 ఏకరాల స్థలాన్ని లీజ్కు లీజుకు ఇచ్చింది. కార్మికుల భవిష్యనిధి వివరాలు, సీఎంపీఎఫ్ పేరిట వసూలు అవుతున్న కోట్లాది రుపాయల లెక్కలు ఉండే కార్యాలయం, క్వార్టర్ల మెయింటునెన్స్ను కంపెనీ పట్టించుకోకపోవటం విచారకమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కార్పొరేట్ ఆధికారులు సీఎంపీఎఫ్ కార్యాలయం, క్వార్టర్లపై దృష్టి సారించి మరమ్మతులు చేయించి, ఉద్యోగులకు ఇవ్వాలని లేదంటే పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ క్వార్టర్ల స్థలం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని కార్మికులు అంటున్నారు. -
ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: విద్యార్థులు విద్యతో పాటు ఇతర రంగాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని కేజీబీవీలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి పీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించటం ద్వారా ఉన్నత విద్య సులభతరం అవుతందన్నారు. క్యాంపుల ద్వారా నేర్చుకున్న అంశాలను నిత్య జీవన శైలిలో అమలు పర్చాలని సూచించారు, కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరచారి, ఎంఈఓ రమ,కొత్తగూడెం జీసీడీఓఅన్నామణి,విద్యార్థినులు పాల్గొన్నారు. దుమ్ముగూడెంలో.. దుమ్ముగూడెం: గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని అంతర్జాతీయస్థాయిలో రాణించడానికి అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాలు అవసరమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం మండలంలోని ములకపాడు, ములకనపల్లిలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణం, కమ్యూనిటీ హాల్, ఇండోర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలీస్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ నిర్మించాలన్నారు. రూ.10 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ త్వరితిగతిన పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, టీఏ శ్రీనివాస్, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
కుమార్తెకు ఓణీల ఫంక్షన్ చేసి..
మరుసటిరోజు గుండెపోటుతో తండ్రి మృతి జూలూరుపాడు: తన కుమార్తెకు ఓణిల ఫంక్షన్ చేసిన తండ్రి మరుసటిరోజే గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అనంతారంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్కం వెంకటేశ్వర్లు (55) ఓ ప్రైవేట్ బస్సుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం తన చిన్న కుమార్తె నాగపంచమి ఓణీల ఫంక్షన్ చేశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య బాపమ్మ, ఇద్దరు కుమార్తెలు నాగప్రసన్న, నాగపంచమి ఉన్నారు. అనారోగ్యంతో బాలింత మృతిజూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన బాలింత సిద్ధెల శ్రావణి (21) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. రెండేళ్ల కిందట కాకర్ల గ్రామానికి చెందిన సిద్ధెల కిశోర్కు కల్లూరు మండలం చినకోరుకొండకు చెందిన శ్రావణితో వివాహమైంది. అనంతరం గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శ్రావణి పది రోజులుగా జ్వరంతోపాటు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అక్కడ ఆసుపత్రిలో చేరింది. అయినా తగ్గకపోవడంతో భర్త కిశోర్ ఆమెను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శ్రావణి మంగళవారం మృతిచెందింది. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య గుండాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి ఎస్ఐ సోమేశ్వర్ కథనం ప్రకారం.. కాచనపల్లి గ్రామానికి చెందిన పరిషక లక్ష్మయ్య (45 )సోమవారం సాయంత్రం మద్యం తాగి రావడంతో భార్య మందలించింది. మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బైక్ను ఢీకొన్న కారు జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్ను కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పూసుగూడెంనకు చెందిన ధరావత్ ప్రవీణ్ బైక్పై ఖమ్మం నుంచి పాల్వంచ వెళ్తున్నాడు. వినోభానగర్ గ్రామం దాటిన తరువాత ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ప్రవీణ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
పత్తి సాగుకు సై !
దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు ● ఉమ్మడి జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో సాగు అంచనా ● 9 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్ల అవసరం ● త్వరలోనే డీలర్లతో భేటీ, విక్రయాలకు అనుమతి ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగుకు సమయం సమీపిస్తోంది. కొద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు దుక్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27వ తేదీ నాటికి దేశంలోకి ఆ తర్వాత, కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు కురవగానే రైతులు పత్తి సాగుపై దృష్టి సారించనుండడంతో అవసరమైన ఏర్పాట్లకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెరిగిన విత్తన ధరలు ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని 2.13 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. ఎకరాకు 450 గ్రాములవి రెండు విత్తన ప్యాకెట్లను వినియోగిస్తారు. ఉమ్మడి జిల్లా రైతులకు అవసరమైనవే కాక అదనంగా కలిపి 10.10 లక్షల మేర ప్యాకెట్లను సమకూర్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ విత్తన కంపెనీల నుంచి ఖమ్మం జిల్లా డీలర్లు 36,279 ప్యాకెట్లు, భద్రాద్రి జిల్లా డీలర్లు 1.83 లక్షల ప్యాకెట్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడి నేలలకు అనుకూలమైన నూజివీడు, తులసి, యూఎస్, రాశి, ఆశ, డాక్టర్ బెంట్, నీరజ, అంకూర్, కావేరి తదితర కంపెనీ విత్తనాలను అమ్మేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, గత ఏడాది 450 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, ఈ ఏడాది రూ.37 పెంచి రూ.901గా నిర్ణయించారు. త్వరలోనే డీలర్లతో సమావేశం పత్తి సీజన్ సమీపిస్తున్న వేళ విత్తన విక్రయాలపై డీలర్లతో సమావేశం నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. నాణ్యమైన విత్తనాల విక్రయం, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిజిస్టర్ల నిర్వహణ, ధరలు, బ్లాక్ మార్కెట్ను అరికట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో విత్తన విక్రయాలకు ఇచ్చే అనుమతులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టేలా మండలాలు, డివిజన్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసే ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను సభ్యులుగా నియమిస్తారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ లేదా సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు అమ్మే దళారులు.. అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా వేసి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు ప్రణాళిక జిల్లా సాగు (ఎకరాల్లో)్ఞ విత్తనాలు (ప్యాకెట్లు) అందుబాటులో ఉన్నవి ఖమ్మం 2.13లక్షలు 4.82 లక్షలు 37 వేలు భద్రాద్రి 2.14లక్షలు 4.84 లక్షలు 1.83లక్షలు త్వరలోనే భేటీ, అనుమతులు పత్తి సాగు చేసే రైతులకు అవసరమైన విత్తనాలు సమకూర్చనున్నాం. లైసెన్స్డ్ డీలర్ల వద్ద అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే, ఇంకా విత్తన విక్రయాలకు అనుమతులు ఇవ్వలేదు. త్వరలోనే డీలర్లతో సమావేశం నిర్వహించి విక్రయాలకు చర్యలు తీసుకుంటాం. అలాగే, నకిలీ విత్తన విక్రయాలను సమర్థవంతంగా నిలువరించేలా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తాం. –ధనసరి పుల్లయ్య, ఖమ్మం డీఏఓ -
జల రవాణాపై దృష్టి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదిలో జల రవాణాకు గల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో ఉపాధి, వాణిజ్య రంగాలు మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో రాజమండ్రి, భద్రాచలం మీదుగా.. కాకినాడ పోర్టు నుంచి బొగ్గును రైలు మార్గంలో తెలంగాణకు తీసుకొస్తుండగా తెలంగాణ బియ్యాన్ని రోడ్డు మార్గంలో భద్రాద్రి జిల్లా మీదుగానే కాకినాడకు తరలిస్తున్నారు. గోదావరిలో జలరవాణా అందుబాటులోకి వస్తే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు సరుకు రవాణాకు అవకాశం ఉంది. గతంలో కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం – చర్ల – కాళేశ్వరం (సిరోంచ, మహారాష్ట్ర)ల మధ్య బ్రిటీష్ / నిజాం జమానాలో జల రవాణా నిర్విరామంగా జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడంతో క్రమంగా జలరవాణా కనుమరుగైంది. బరాజ్ల అండతో గోదావరిలో ఏడాది పొడవునా ఏపీలోని వీఆర్పురం మండలం పోచవరం నుంచి రాజమండ్రి వరకు పడవలు తిరిగేంత నీటి మట్టం ఉంటుంది. ఈ స్ట్రెచ్లో పర్యాటకప్రాంతమైన పాపికొండలకు బోట్లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, రాజమండ్రి – భద్రాచలం – దుమ్ముగూడెం ఆనకట్ట వరకు జల రవాణాకు అనుకూలమైన నీటిమట్టం ఉండే అవకాశముంది. ఆ పైన సీతమ్మ సాగర్ (నిర్మాణంలో ఉంది), సమ్మక్క సాగర్ బరాజ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్లు ఉన్నాయి. వీటికిపైన మంచిర్యాల – గోదావరిఖని వంటి పారిశ్రామిక ప్రాంతాల నడుమ శ్రీపాదసాగర్ బరాజ్ ఉంది. దీంతో జలరవాణాకు కావాల్సినంత నీటి మట్టం గోదావరిలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటర్ వేస్ జలరవాణా అభివృద్ధిపై కేంద్రం నుంచి గతంలో అనేక ప్రకటనలు వచ్చాయి. 2008లో యూపీఏ హయాంలో నేషనల్ వాటర్ వేస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో వాటర్ వేస్–4లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు 171 కి.మీ జల రవాణా మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రోడ్, రైల్, రివర్ (ఆర్ఆర్ఆర్) ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇదే పథకానికి కొత్త రూపు ఇచ్చింది. ఇందులో మహారాష్ట్రలో నాసిక్ నుంచి బంగాళాఖాతం వరకు గోదావరిలో జలరవాణాకు గల అవకాశాలు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీస్ సర్వీసెస్ (వాప్కోస్) ఆధ్వర్యంలో పలుమార్లు సర్వేలు కూడా జరిగాయి. ప్రతికూలతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సీతమ్మసాగర్ బరాజ్కు ఇంకా అనుమతులు రాలేదు. వీటిపై స్పష్టత వచ్చాకే జల రవాణాపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. లేదంటే యూపీఏ, ఎన్డీఏ సర్కార్ల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు, సర్వేలతో సరిపెట్టే అవకాశముంది. ఒక వేళ ఎగువ ప్రాంతాలను మినహాయించి కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం వరకే జలరవాణాకు గల అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమేరకు అడుగులు ముందుకు పడే అవకాశముంది. అయినా భద్రాచలంలో స్థల లభ్యతతోపాటు భద్రాచలం – మల్కన్గిరి రైల్వేలైనులో పాండురంగాపురం – సారపాక సెక్షన్ల మధ్య రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మించాల్సి ఉంటుంది. గోదావరిలో జలరవాణా మొదలైతే తెలంగాణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత కీలకంగా మారే అవకాశముంది. స్థానికులకు వ్యాపార, ఉపాధి రంగాల్లో అవకాశాలు మరింతగా మెరుగవుతాయి.జలమార్గంపై అధ్యయనం చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటన గతంలో గోదావరిలో రాజమండ్రి– భద్రాచలం– సిరోంచల మధ్య రవాణా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనూ రాజమండ్రి–భద్రాచలం స్ట్రెచ్చవక రవాణా రోడ్డు, రైలు మార్గాలతో పోల్చితే జలరవాణా చవక. అందువల్లే సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతుంటాయి. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం లోటుగా ఉంది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత డ్రైపోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఆశించిన పురోగతి రాలేదు. దీంతో జలరవాణాకు గల అవకాశాలను పరిశీలించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇతర దేశాల నుంచి చౌకగా లభించే బొగ్గును కాకినాడ నుంచి తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం, తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కృష్ణా నదిలో జలరవాణా అందుబాటులోకి వస్తే దాని తీర ప్రాంతంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు మేలు జరుగుతుందనే అంచనాలున్నాయి. -
వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
● బూర్గంపాడు సీహెచ్సీలో ఆకస్మిక తనిఖీ ● పనితీరు మారకపోతే బదిలీ చేస్తామని హెచ్చరిక బూర్గంపాడు : ‘ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేందుకు సూపరింటెండెంట్, వైద్యులు, స్టాఫ్ నర్స్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుంటే బూర్గంపాడులో గుండు సున్న. ఇదే లాస్ట్ వార్నింగ్. మార్పురాకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేస్తాం. ప్రజలు కలెక్టరేట్కు రాకుంటే, నేనే ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటా. డెలివరీ కేసుల సంఖ్య పెంచేలా మీరు ఎందుకు గ్రామాలకు వెళ్లడంలేదు. బూర్గంపాడు సీహెచ్సీ మ్యూజియంలా మారింది. ప్రజలు రావడంలేదని చెబుతున్నారు. మరి ఆస్పత్రిని మూసేద్దామా’ అంటూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు 20 ప్రసవాలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం ఆయన బూర్గంపాడు సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఆస్పత్రిలో ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే అందరినీ బదిలీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల పాఠశాల(బాలికలు)ను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆదరణ పొందాలి మణుగూరు టౌన్: ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి, ప్రజల ఆదరణ పొందాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, బాధితులను చులకన భావంతో చూడొద్దని చెప్పారు. అనంతరం మున్సిపాలిటీలోని రాజుపేట, విఠల్రావునగర్ ఏరియాల్లో పర్యటించారు. సింగరేణి హద్దులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు, ఇసుక లారీలతో దుమ్ము, ధూళి వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తంగా చేయగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించుకోలేని పరిస్థితి ఉందని, ఈ రెండు గ్రామాలను సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణలో తీసుకుని మరోచోట పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య, డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యుడు గౌరీ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. రాంబంటుకు పట్టువస్త్రాలు.. కొండగట్టు అంజన్నకు కానుకలు సమర్పించిన భద్రగిరి ఈఓ భద్రాచలం: కొండగట్టు అంజన్న స్వామికి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అధికారులు మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భద్రగిరి రామయ్య తరఫున పట్టువస్త్రాలను, కానుకలను సమర్పించటం కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ నెల 22న హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, వైదిక సిబ్బంది కొండగట్టు చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీకి కార్మికులే మూలస్తంభం రీజినల్ మేనేజర్ సరిరామ్ మణుగూరు టౌన్: టీజీఎస్ ఆర్టీసీ సంస్థకు కార్మికులే మూలస్తంభమని, అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ అన్నారు. మంగళవారం మణుగూరు డిపోలో రీజినల్స్థాయి ప్రగతి చక్ర అవార్డులను ప్రదానం చేశారు. డ్రైవర్ కేటగిరీలో 10 మందికి, కండక్టర్ కేటగిరీలో ఏడుగురు, టీ డ్రైవర్ కేటగిరీలో ముగ్గురు, మెకానికల్ కేటగిరీలో ముగ్గురు, పీహెచ్బీ డ్రైవర్ కేటగిరీలో ఐదుగురికి, ఉత్తమ బస్టాండ్గా ఖమ్మం కొత్త బస్టాండ్కు, మొత్తం 29 ప్రగతి చక్ర అవార్డులను అందజేసి మాట్లాడారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి, డిపోల డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. స్కూల్ బస్సులు ఫిట్గా ఉండాలిజిల్లా రవాణా అధికారి వెంకటరమణ కొత్తగూడెంఅర్బన్: త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్తో ఉండాలని జిల్లా రవాణాశాఖ అధికారి సూచించారు. జిల్లా రవాణా కార్యాలయంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు బస్సుల ఫిట్నెస్, రహదారి భద్రతపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని, ప్రతీ వాహనానికి అటెండెంట్ ఉండాలని చెప్పారు. స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని కోరారు. అనంతరం పాటించాల్సిన జాగ్రత్తల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘నకిలీ’లతో జాగ్రత్త!
● విత్తన కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి ● ఆఫర్లు, మాయమాటలను నమ్మి మోసపోవద్దు ● రశీదులు, ఖాళీ ప్యాకెట్లు భద్రపరుచుకోవాలి ● జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం రైతు సంఘాల నాయకులు ఏం కోరుతున్నారంటే.. ● నకిలీ విత్తనాల ఉత్పత్తి, నియంత్రణకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. ● మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు మాత్ర మే విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. ● తనిఖీలు చేపట్టేందుకు రెగ్యులేటరీ సంస్థలు ఏర్పాటు చేయాలి. విత్తన కంపెనీలు, పంపిణీదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ● నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహనా సదస్సులు జరపాలి. ● గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలో విత్తన విక్రయాలకు అనుమతి పొందిన కంపెనీలు, డీలర్ల వివరాలను, ఏయే కంపెనీ విత్తనాలు ఎంత ధర అనే విషయాలను రైతులందరికీ తెలిసేలా గ్రామాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. బూర్గంపాడు/పాల్వంచరూరల్/చర్ల: జూన్ నుంచి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభంకానుడటంతో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కాలంటే రైతులు ఆది నుంచే అప్రమత్తంగా ఉండాలి. దుక్కులు దున్నడం దగ్గర నుంచి పంట దిగుబడి చేతికి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు పాటించాలి. విత్తన ఎంపికలో అప్రమత్తంగా లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఊరు, పేరులేని విత్తనాలను అంటగడతారు.. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో నాణ్యత లేని, ఊరుపేరు లేని వరి, పత్తి, మిర్చి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. అధిక దిగుబడి ఇస్తుందంటూ, కొత్తరకం అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి ఏటా రైతులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరలు, ఆఫర్లు అంటు కొందరు డీలర్లు నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోయారు. గతేడాది కోడిపుంజుల వాగు గ్రామ రైతులకు పాల్వంచలోని విత్తన వ్యాపారి నకిలీ వరి విత్తనాలు విక్రయించాడు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చేయగా సంబంధిత కంపెనీ నష్టపరిహారం చెల్లించింది. చండ్రుగొండ, సుజాతనగర్ మండలాల్లో కూడా నాణ్యత లోపం కలిగిన వరి విత్తనాలు విక్రయించారు. పాండురంగాపురంలో నకిలీ మిర్చి, పత్తి విత్తనాలు కొనుగోలుచేసి పలువురు రైతులు దగాపడ్డారు. సూరారం, జగన్నాథపురం, కోడిపుంజుల వాగులో నాణ్యతలేని వరి విత్తనాలను కొనుగోలుచేసి మోస పోయారు. బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు.. నిషేధిత గ్లైసిల్, బీటీ, బీటీ–3తో పాటుగా అనుమతులులేని కొన్ని కంపెనీల పత్తి విత్తనాలు గతంలో జిల్లాలో విక్రయించారు. గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి, జిన్నింగ్ మిల్లుల నుంచి నకిలీ విత్తనాలు తెప్పించి, బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నింపి విక్రయించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన గడువు ముగిసిన విత్తనాలు కూడా కొత్తగా ప్యాకింగ్ చేసి విక్రయించిన ఘటనలు ఉన్నాయి. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన పలువురు వ్యాపారులు జైలు పాలయ్యారు. విత్తనం కొనే ముందు... రైతులు వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ చేసిన బస్తాలను ధ్రువీకరణ(ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. విత్తన బస్తాపై ప్యాకెట్లపై గడువు తేది, రకం పేరు, లాట్ నంబర్లు చూసుకోవాలి. కొనుగోలు బిల్లుతోపాటు విత్తన రకం, గడువు తేదీ ఉండేలా డీలర్ సంతకంతో కూడిన రశీదు మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం విత్తన కొనుగోళ్లపై ప్రతి మంగళవారం రైతువేదికల్లో అవగాహన కల్పిస్తున్నాం. రశీదులు, ప్యాకెట్లను భద్రపరుచుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనాలి. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసేవారికి దూరంగా ఉండాలి. 450 గ్రాముల బ్రాండెడ్ విత్తన ప్యాకెట్ ధర రూ. 901గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుమించి ఎక్కువ ధర చెల్లించవద్దు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – బాబూరావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి -
సర్వే సమస్యకు చెక్ పెట్టేలా..
● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు ● భూభారతి చట్టం అమలుతో పెరగనున్న అవసరాలు ● లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తింపుతో యువతకు ఉపాధి ● ఉమ్మడి జిల్లాలో 1,073 మంది నుంచి దరఖాస్తులు చుంచుపల్లి: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసింది. ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్ను పొందుపర్చింది. ఈ నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనుండగా, శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 17 వరకు మీ సేవా కేంద్రాల దరఖాస్తులు స్వీకరించగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 647 దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 426 మంది దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భూ సర్వేపై శిక్షణ ఇచ్చి, లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తించనున్నారు. వీరు భూమి రిజిస్ట్రేషన్కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ సర్వేయర్లు పూర్తిస్థాయిలో పరిశీలించాక సంబంధిత జిల్లా అధికారి ఆమోదముద్ర వేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 44 మండలాల్లో ప్రస్తుతం 37 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల భూముల సర్వేకు నెలల తరబడి రైతులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేయనుండటంతో సర్వేల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుంది. 50 రోజులపాటు శిక్షణ దరఖాస్తులను పరిశీలించాక అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 26 నుంచి శిక్షణ.. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 50 రోజులపాటు మూడు దశల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు కేటగిరీ ఖమ్మం భద్రాద్రి మొత్తం ఓసీ 26 05 31బీసీ 232 69 301ఎస్సీ 182 73 255ఎస్టీ 207 279 486మొత్తం 647 426 1,073 -
వృద్ధురాలి ఆత్మహత్య
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన సారంగి సరోజిని (60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ.. మతిస్థిమితం కోల్పోయింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు అశ్వాపురం పీహెచ్సీకి తరలించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిది వేధింపులతో వదిన.. పాల్వంచ: మరిది వేధింపులు తాళలేక వదిన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్యకు త్రివేణి(32)తో గతంలో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా త్రివేణి మరిది అయిన టీఎస్పీఎస్ కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె పర్సనల్ ఫొటోలను బంధువులు, తెలిసిన వారికి ఫోన్లో పంపిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చింది. సోమవారం పైపోర్షన్కు వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుమన్ తెలిపారు. విద్యుదాఘాతంతో మూడు పశువులు మృతి చండ్రుగొండ: మండలంలోని సత్యనారాయణపురం శివారు రైల్వేలైన్ సమీపంలో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గానుగపాడు వాసి వెంకన్నకు చెందిన రెండు పాడిగేదెలు, సత్యనారాయణపురంవాసి భాగ్యరాజుకు చెందిన దుక్కిటెద్దు ఆదివారం మేతకు వెళ్లాయి. రైల్వేలైన్ సమీపంలో త్రీఫేస్ విద్యుత్ వైరు కిందపడి ఉండటంతో విద్యుదాఘాతానికి గురై మూడు పశువులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఒక్కో పశువు విలువ రూ.లక్ష ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. కాగా, గాలిదుమారం, పిడుగుపాటుకు గానుగపాడు, సత్యనారాయణపురం మధ్య విద్యుత్లైన్ ఇన్సులేటర్లు ఫెయిల్ అయి తీగలు కిద్దపడ్డాయని, ఒక్కో పశువుకు శాఖ తరఫున రూ.40 వేలు పరిహారం అందిస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. -
సీతారాంపురంలో విషాదం
అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో విషాదం నెలకొన్నది. గ్రామానికి చెందిన కొందరు బంధువులు మేడారం సమ్మక్క – సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు ఈ నెల 17న ఒక ట్రాక్టర్, ఒక ఆటోలో మేడారం వెళ్లారు. ఈ నెల 18న తిరుగుపయనమయ్యారు. తాడ్వాయి వద్ద మంచినీరు తాగేందుకు ట్రాక్టర్ రహదారి వెంబడి ఆపారు. ఈ క్రమంలో వెనుక వచ్చిన ఇసుక లారీ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో నూప దుర్గ (38), చెట్టిపల్లి సీతమ్మ (40) మృతి చెందారు. ట్రాక్టర్లోని మిగతావారంతా గాయపడగా వారిని ములుగు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో చెట్టిపల్లి ముత్తమ్మ, చెట్టిపల్లి సునీత, మోడియం సమ్మయ్య, మోడియం రాకేశ్, మణుగూరు మండలం కూనవరానికి చెందిన వెల్లుబోయిన శంకర్, ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం కమ్మరిగూడెంనకు చెందిన గొల్ల జంపన్న ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీతారాంపురం గ్రామానికి చెందిన కోండ్రు శ్రీను, నూప నరసింహ, చెట్టిపల్లి శ్రీకృష్ణ, ఈసం జీవన్, మొడియం వినయ్, సుజాత ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెట్టిపల్లి సింధు, చెట్టిపల్లి విష్ణు, కారం వంశీ, సౌందర్యను డిశ్చార్జ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయాలపాలైన వారంతా నిరుపేదలే. క్షతగాత్రుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంబులెన్స్కు చెల్లించేందుకు సైతం డబ్బు లేకపోవడంతో పలువురు సామాజిక మాధ్యమాల్లో విరాళాలు సేకరించి అందజేశారు. కాగా, ప్రమాదంపై మంత్రి సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడారం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి -
గిరిజన భూములతో వ్యాపారం?
● తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభానికి విక్రయం ● నిబంధనలకు విరుద్ధంగా భూబదిలీలు ● గిరిజనులకు అందని భూహక్కు పత్రాలు దమ్మపేట: జిల్లాలోని దమ్మపేట సహా పలు గిరిజన గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములతో గిరిజనేతరులు అక్రమ భూవ్యాపారం చేస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు, నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాకపోగా.. గిరిజనేతర భూవ్యాపారులు అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేసి, అడ్డదారిన పీఓడీ చట్టం ద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా హక్కు పత్రాలు సృష్టించి.. ఆపై లాభానికి అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలోని నల్లకుంట, గుర్వాయిగూడెం, గండుగులపల్లి, అఖినేపల్లి, ముష్టిబండ తదితర గిరిజన గ్రామాల్లోనే కాక ఇతర చోట్ల కూడా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. గిరిజన ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పలువురు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో జారీ చేసిన జీఓ 1045 ద్వారా అధికారులను మచ్చిక చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పట్టా భూములుగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక దమ్మపేట తహసీల్లో కాంట్రాక్టు ఉద్యోగిగా గతంలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం ఉందని చెబుతున్నారు. సుమారు 300 ఎకరాలకు పైగా ఈ వ్యాపారం సాగిందని చర్చ నడుస్తోంది. ఈ కారణంగా గిరిజన గ్రామాల్లో వ్యవసాయ భూముల విస్తీర్ణానికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాగా, అర్హులైన గిరిజనులకు మాత్రం పుస్తకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూ భారతి’తోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని గిరిజనులు ఆశతో ఉన్నారు. వ్యాపారం ఇలా.. 1970–80 దశకాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితుల కోసం ఇచ్చిన జీఓ 1045ను ఆసరాగా చేసుకుని గిరిజనుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు చెల్లించి కొంటున్నారు. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా, మండలంలోని నల్లకుంట సర్వే నంబర్ 273లో గిరిజనేతరుడు ఐదెకరాల భూమిని అక్రమ మార్గంలో పట్టా చేయించినట్టు తెలిసింది. అదే సర్వే నంబర్లో ఐదెకరాల అసైన్డ్ భూమిని ఓ వ్యక్తి నుంచి ఎకరాకు రూ.16 లక్షలు చొప్పున కొనుగోలు చేసిన వ్యక్తులు, పట్టా చేయించాక ఎకరం రూ.31లక్షలకు విక్రయించారు. అఖినేపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 290లో ఐదెకరాల ప్రభుత్వ భూమిని వారసత్వం పేరుతో ధరణిలో పట్టా భూమిగా మార్చి, ఇప్పుడు రూ.16 లక్షలు ఎకరం చొప్పున విక్రయించారనే ప్రచారం జరుగుతోంది. -
అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు
కొత్తగూడెంఅర్బన్: అర్హత లేని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పనిచేయిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంతటా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమలు చేస్తున్నామని, మినహాయింపు లేకుండా ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో అగ్నిమాపక భద్రతా ఆడిట్లు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, డాక్టర్ ఆర్పీ చైతన్య, డాక్టర్ మధువరుణ్, పుల్లారెడ్డి, తేజశ్రీ, డిప్యూటీ డెమో ఫైజ్మోహియుద్దీన్ పాల్గొన్నారు. విలువలు కలిగిన రాజకీయ వేత్త సుందరయ్య సింగరేణి(కొత్తగూడెం): విలువలు కలిగిన రాజకీయాలకు సుందరయ్య నిలువెత్తు నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మంచికంటిభవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా చిన్ననాటి నుంచి, అంటరానితనం, కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య చేసిన త్యాగాలను పలువురు సీపీఎం నాయకులు వివరించారు. 1008 బ్రహ్మసూత్ర శివలింగాల ప్రతిష్ఠాపన దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ చిన్న అరుణాచల ఆలయంలో సోమవారం బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయ వ్యవస్థాపకుడు శివనాగస్వామి ఆధ్వర్యంలో చిన్న అరుణాచలం క్షేత్రంలో వైశాఖ మాసం పంచమితి సోమవారం శ్రవణ నక్షత్రంలో 1008 బ్రహ్మసూత్ర శివలింగాలను 9 అడుగుల బాణలింగాన్ని వేదమంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠించారు. ఇద్దరిపై దాడి ఇల్లెందు: ముగ్గురు యువకులు కలిసి మరో ఇద్దరిపై దాడి చేసిన ఘటన ఆజాద్నగర్లో సోమవారం చోటుచేసుకుంది. ఆజాద్నగర్లో జరుగుతున్న ఓ ఫంక్షన్కు ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఖాదర్పాషా బైక్పై వచ్చాడు. అక్కడి ముత్యాలమ్మ గుడి వద్ద బైక్ నిలిపి భోజనం చేసి తిరిగి రాగా.. అదే ఏరియాకు చెందిన ఆర్.వంశీ, మధు, సందీప్ బైక్ ఇవ్వమని కోరారు. తాను వెళ్లాల్సి ఉందని వారించటంతో మాటామాటా పెరిగి ఖాదర్పాషాపై చేయి చేసుకున్నారు. ఖాదర్పాషా మిత్రుడు ఎస్.వంశీ అడ్డురాగా అతనిపై కూడా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ బి.సూర్య తెలిపారు. పిడుగుపాటుతో రైతు మృతి మరో రైతుకు గాయాలు ఇల్లెందురూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఓ రైతు మృతి చెందగా, ఆయన సోదరుడైన మరో రైతుకు గాయాలయ్యాయి. ఇల్లెందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన సోదరులు పరిటాల పుల్లయ్య (40), వెంకన్న తమ పొలం వద్ద పది రోజులుగా బావి తవ్విస్తున్నారు. మధ్యలో మేడారం వన దేవతల దర్శనానికి వెళ్లిరాగా, సోమవారం పనులు తిరిగి ప్రారంభించారు. పని చేయిస్తుండగా వర్షం మొదలుకావడంతో పుల్లయ్య సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి తన సోదరుడు వెంకన్నను కూడా పిలిచాడు. వెంకన్న చెట్టు కిందకు వెళ్తుండగానే పిడుగు పడడంతో పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపానికి చేరిన వెంకన్న షాక్తో కింద పడ్డాడు. కాగా, మృతుడికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇక ఆటలు ఆడుకోవచ్చు..
● భద్రాద్రిలో క్రీడా మైదానం ఏర్పాటుకు అడుగులు ● ఐటీడీఏ పీఓ చొరవతో స్థల సేకరణ ● తీరనున్న క్రీడాకారుల కళ భద్రాచలంటౌన్: భారత మహిళా క్రికెట్ జట్టులో స్థానం సాధించిన గొంగడి త్రిష భద్రాద్రిలో తొలుత శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ క్రీడామైదానం లేకపోవడం క్రీడాకారులకు ఎంతో లోటు. క్రీడాకారులు శిక్షణ పొందాలన్నా.. పోటీలు నిర్వహించాలన్నా.. స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాల క్రీడా మైదానమే పెద్ద దిక్కు. ఈ విషయాన్ని స్థానిక క్రీడాకారులు, యువకులు అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రతిఫలం దక్కలేదు. ఇటీవల ఐటీడీఏ పీఓ పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. క్రీడా మైదానానికి కేటాయించేలా సర్వే చేసి పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చి నూతన హంగులతో క్రీడా మైదానం అందుబాటులో రావాలని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. మెగా టోర్నీలకు వేదికగా.. ఏటా నిర్వహించే భద్రాద్రి కప్తో పాటు జాతీయస్థాయిలో నిర్వహించే నెహ్రూకప్నకు భద్రాద్రి ఆతిథ్యం ఇస్తోంది. కానీ, సరైన మైదానం లేక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్నే సర్దుకోవాల్సి వస్తోంది. ఐటీడీఏ తరఫున నిర్వహించే క్రీడాపోటీలు సైతం ఇక్కడే నిర్వహిస్తారు. అయితే, ఇదే మైదానాన్ని ఇతర కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇవ్వడంతో తిరిగి క్రీడలు నిర్వహించే సమయంలో అసౌకర్యంగా ఉంటోంది. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానుల ఏళ్లుగా విన్నవిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఐదెకరాల్లో ప్రణాళిక పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో ఉన్న 5 ఎకరాల్లో స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ భూమి క్రీడా మైదానానికి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను పీఓ రాహుల్ ఆదేశించారు. ఆయనే స్వయంగా వెళ్లి సదరు ప్రాంతాన్ని రెవెన్యూ అధికారలతో కలిసి పరిశీలించారు. కాగా, ఈ భూమి గతంలో పంచాయతీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ భూమిని మైదానం ఏర్పాటుకు కేటాయించారు కాబట్టి తిరిగి పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ఈ ప్రక్రియను వేగంగా పూర్తయితే స్టేడియం పనులకు అడుగులు పడతాయి. యువతను ప్రోత్సహించేందుకే.. భద్రాచలంలో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను ప్రొత్సహించేందుకే స్టేడియం ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆటలు ఆడుకోవడానికి సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. సుందరయ్యనగర్లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమినిలో స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాను. –బి.రాహుల్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం సరైన మైదానం లేక ఇబ్బందులు భద్రాచలం పట్టణంలో ఏళ్లుగా సరైన క్రీడా మైదానం లేదు. ప్రతీ సారి ఇక్కడి క్రీడాకారులు జానియర్ కళాశాల క్రీడా మైదానంలోనే పోటీలతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి మైదానం ఏర్పాటుకు అడుగులు పడడం శుభ పరిణామం. –నగేశ్, భద్రాచలం మైదానం అవసరం ఉంది భద్రాచలం పట్టణంతో పాటు సరిహద్దు మండలాల క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి పూర్తిస్థాయి వసతులతో క్రీడా మైదానం అవసరం ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు పీఓ స్టేడియం ఏర్పాటుకు చొరవ తీసుకోవడం హర్షనీయం. –కుప్పాల చరణ్ తేజ, క్రికెట్ కోచ్, భద్రాచలం -
కేర్ టేకర్గా చేరి రూ.11.49లక్షలు స్వాహా
ఖమ్మంక్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడిన ఓ వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్ టేకర్గా చేరి ఆయనకు తెలియకుండా ఖాతా నుంచి రూ.11.49 లక్షలు స్వాహా చేశాడు. ఈమేరకు నిందితుడిని సోమవారం ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మధిర మండలం నిదానపురానికి చెందిన గుండా వెంకటేశ్వరరెడ్డి ఖమ్మం హోమ్ కేర్ సర్వీస్లో కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగైదేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆయన గత మార్చిలో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గాదె కేశవరావు వద్ద కేర్ టేకర్గా చేరాడు. యజమానిని నమ్మిస్తూ ఆయన ఫోన్లోని గూగుల్ పే ద్వారా బెట్టింగ్ యాప్ల్లోకి డబ్బు డిపాజిట్ చేయడం మొదలుపెట్టాడు. రెండు వారాల పాటు వరుసగా రూ.11.49 లక్షల డిపాజిట్ చేయగా, లాభాలు రాకపోవడంతో ఉద్యోగం మానేశాడు. కొన్నాళ్ల తర్వాత గుర్తించిన కేశవరావు ఈ విషయమై చేసిన ఫిర్యాదుతో వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కోర్టులో హాజరుపర్చగా, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ను, ఎస్సైలు రంజిత్కుమార్,విజయ్కుమార్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. -
ఈతకు వెళ్లిన బాలుడికి షాక్
ఆస్పత్రికి తరలించేలోగా మృతి కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్నగర్ వద్ద మొర్రేడు వాగులో ఈతకు వెళ్లిన బాలుడు.. అక్కడే మోటార్కు అమర్చిన విద్యుత్వైరు తాకి.. షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ న్యూగొల్లగూడెంనకు చెందిన టిల్లు (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో మొర్రేడువాగులో ఈతకు వెళ్లాడు. వాగులో మోటారుకు అమర్చిన విద్యుత్ తీగ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు టిల్లును కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టిల్లు మృతదేహాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా సందర్శించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అశ్వాపురం: మండలంలోని బీజీకొత్తూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామానికి చెందిన సోడె శ్రీకాంత్ (26) బైక్పై మణుగూరు మండలం పగిడేరులో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బీజీ కొత్తూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రాక్టర్ రోడ్డుపైకి వస్తూ బైక్ను ఢీకొనడంతో శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి 108లో తరలిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలంటౌన్: గిరిజన, ఆదివాసీల సమస్యలు పరిష్కరించడమే కాక అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మాట్లాడారు. పోడు భూముల, వ్యక్తిగత, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సాయం, ట్రైకార్ రుణాలు, గిరి వికాసం ద్వారా సోలార్ విద్యుత్ కనెక్షన్లు తదితర అంశాలపై వినతులు రాగా పరిష్కారంపై ఉద్యోగులకు పీఓ సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్కుమార్, సమ్మయ్య, ఆదినారాయణ, నారాయణరావు, చైతన్య, హరికృష్ణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ నష్టం
ఇల్లెందు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణం దగ్ధమైంది. ఇలెందు మొయిన్రోడ్లోని శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దుకాణంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు.. సుమారు రూ.2.70 కోట్ల సరుకు కాలిపోయినట్లు అంచనా. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, సోమవారం ఏఓ సతీశ్ దుకాణాన్ని పరిశీలించి రికార్డుల ఆధారంగా నష్టంపై అంచనా వేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, అగ్నిమాపకశాఖ అధికారి నవీన్, డీఎస్పీ చంద్రభాను, సీఐ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీఈ కోటేశ్వరరావు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. దుకాణంలోని 80 శాతం సరుకు అగ్నికి ఆహుతైందని యజమాని ప్రొద్దుటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఫర్టిలైజర్ షాప్లో రూ.కోట్ల విలువైన సామగ్రి దగ్ధం -
పాలకులం కాదు.. మేం సేవకులం
● కాకతీయ వారసుడు కమల్చంద్ బంజ్దేవ్ ● వైభవంగా శ్రీ ఆత్మలింగేశ్వరాలయం పునఃప్రతిష్ఠ పాల్వంచ: కాకతీయ రాజుల వంశీయులమైనా తాము పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగానే ముందుకు సాగుతున్నామని బస్తర్ మహారాజు, కాకతీయుల వారసుడు కమల్చంద్ బంజ్దేవ్ తెలిపారు. పాత పాల్వంచలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వరాలయం శిథిలావస్థకు చేరడంతో అభివృద్ధి చేశారు. ఈమేరకు ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు ఆధ్వర్యాన సోమవారం ప్రతిష్ఠా మహా కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆత్మలింగేశ్వర స్వామితో పాటు ఇతర దేవతామూర్తులు, మహానంది మండపం, ధ్వజస్థంభం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కమల్ చంద్ బంజ్దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొని హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ మహా స్వామి సమక్షాన ప్రతిష్ఠ చేశారు. అనంతరం బంజ్దేవ్ మాట్లాడుతూ శిఽథిలావస్థలో ఉన్న ఆలయ నికి పూర్వవైభవం తీసుకొచ్చిన శ్రీనిసరావును, పూజారులు, భక్తులను అభినందించారు. పునఃప్రతిష్ఠాపన ద్వారా ఆలయ చరిత్రను పరమశివుడే తిరిగి రాసినట్లయిందని తెలిపారు. ప్రతిష్టాపనాచార్య జక్కి కృష్ణవధాని, ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ, బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్తో పాటు వివిధ పార్టీల నాయకులు వనమా రాఘవేందర్రావు, కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, మండే వీరహన్మంతరావు, వల్లపు యాకయ్య, యల్లావుల కోటేశ్వరరావు, వెంకన్న, నాగర్జున, కృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రామా... వసతి కష్టాలు కనుమా..
భద్రాచలంలో గుట్టపై శిథిలమైన సత్రాలు, కాటేజీలు ● పునఃనిర్మాణం చేస్తేనే కష్టాల నుంచి ఉపశమనం ● వసతి ఇక్కట్లు తీర్చాలని భక్తుల విన్నపాలు రంగనాయకుల గుట్టపై శిథిలావస్థలో ఉన్న టీటీడీ సత్రం (ఇన్సెట్) పూర్తిగా శిథిలమైన అన్నవరం సత్రందక్షిణ అయోధ్యగా భావించే భద్రాచలానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి కష్టాలు తీరడం లేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఆ సమయంలో కాస్త హడావుడి చేసే అధికారులు ఆతర్వాత పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యాన ఇప్పటినుంచే వసతి గదుల నిర్మాణానికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగితే ఇక్కట్లు తీరనున్నాయి. – భద్రాచలంటీటీటీ, అన్నవరం సత్రాలు.. గతంలో భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఏళ్ల తరబడి టీటీడీ, అన్నవరం ఆలయ పరిధిలోని సత్రాలు ఆసరాగా నిలిచాయి. అయితే, అవన్నీ 1950, 1960 నాటి కట్టడాలు కావడంతో పూర్తిగా శిథిలమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా సీఆర్ఓ కార్యాలయం వెనుక మారుతి సదనం పేరుతో వసతి గదుల నిర్మాణం చేపట్టి దేవస్థానానికి అప్పగించింది. కానీ పైన ఉన్న టీటీడీ సత్రం, అన్నవరం సత్రం మాత్రం మరమ్మతులకు నోచుకోలేదు. వీటి స్థానంలో బహుళ అంతస్తులతో కూడిన భవనాలు నిర్మిస్తే ఉత్సవాల సమయంతో పాటు వారాంతాలు, సెలవు దినాల్లో భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి సమకూరుతుంది. గోదావరి పుష్కరాలే లక్ష్యంగా... గోదావరి పుష్కరాలకు తెలంగాణ భక్తులు అత్యధికంగా భద్రాచలానికే వస్తారు. 2015లో గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. 2027లో సైతం ఇంతకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యాన ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అభయాంజనేయస్వామి ఆలయం వద్ద, సూపర్ బజార్ సెంటర్, అంబసత్రం వైపు ఉన్న దేవస్థానం భూముల్లో వసతి గదుల నిర్మాణానికి అవకాశముంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లోనూ షిర్డీ, తిరుపతి మాదిరి నిర్మాణాలు చేపడితే మేలు జరుగుతుంది. ఆ దిశగా దేవస్థానం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నాయి కానీ లేనట్టే... దశాబ్దాల క్రితం భద్రాచలం రంగనాయకుల గుట్టపైన వసతి గదులతో కూడిన సత్రాలు ఉండేవి. వీఐపీల కోసం ఒకటి, రెండు సత్రాలు ఉండగా.. కాలక్రమంలో ఆలయం చుట్టుపక్కల ప్రైవేట్ లాడ్జీలతో పాటు దేవస్థానం వసతి గదులను సైతం నిర్మాణమయ్యాయి. దీంతో రంగనాయకుల గుట్టపై వీవీఐపీల కోసం కాటేజీలను నిర్మించారు. గుట్టపై 28కు పైగా కాటేజీలు ఉండగా, పర్యవేక్షణ లేకపోవడంతో అవి వాడకంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం పది కాటేజీలు ఉపయోగంలో ఉండగా వీటిలో సగానికి పైగా ప్రైవేట్ యాజమాన్య పరిధిలోనే ఉన్నాయి. మరో రెండింటిని దాతల సాయంతో నిర్మిస్తున్నారు. అయితే, వినియోగంలో లేని కాటేజీలకు మరమ్మతులు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో శిథిలమైన వాటి స్థానంలో బహుళ అంతస్తుల వసతి గదుల నిర్మాణానికి అవకాశమున్నా ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు. గదుల నిర్మాణానికి ప్రణాళిక దేవస్థానానికి చెందిన ఖాళీ భూముల్లో వసతి గదుల నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం. పట్టణంలోని స్థలాల్లోనే కాక పురుషోత్తపట్నంలోని ఆలయ భూముల్లోనూ పుష్కరాల దృష్ట్యా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. వీటిని ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అంతేకాక గుట్టపై కాటేజీలను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. – ఎల్.రమాదేవి, ఈఓ, రామాలయం -
సమానత్వం కోసం పోరాడేది ఎర్రజెండానే..
సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతల్లాడ: సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో సోమవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతుండగా, ఇందుకు పాలకులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. పాలకుల విధానాలతో విద్య, వైద్యం కూడా ఖరీదు కాగా, పేదలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపారు. అసమానతను నిర్మూలించేలా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వేసిన బాట నేటికీ ఆదర్శనంగా నిలు స్తోందని తెలిపారు. ఆయన చూపిన బాటలో కమ్యూనిస్టులు నడుస్తూ పాలకపక్షాల ప్రజావ్యతి రేక విధానాలపై ఉద్యమించాలని జాన్వెస్లీ సూచించారు. తొలుత కుర్నవల్లిలో ర్యాలీ నిర్వహించగా, సీపీఎం నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, కల్యాణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కర్రావు, చలమాల విఠల్, ఫకీరమ్మ, రామలింగేశ్వరరావు, కట్టా దర్గయ్య పాల్గొన్నారు. -
పాత స్టాక్కు కొత్త ధర!
● అమల్లోకి పెరిగిన మద్యం ధరలు ● ఇదే అదునుగా పాత స్టాక్కూ పెంచిన వ్యాపారులువైరా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, వైన్స్, బార్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న మద్యాన్ని నిబంధనల ప్రకారం పాత ధరలకే అమ్మాలి. కానీ అధికారులెవరూ ఈ దిశగా దృష్టి సారించకపోవడంతో పాత స్టాక్ను సైతం వ్యాపారులు కొత్త ధరతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ఇదే తంతు కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచడంతో మద్యం వ్యాపారులకు కాసులు పంట పండినట్లయింది. క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.40 మేర ధర పెంచగా, ఆ ప్రకారమే పాత స్టాక్ను సైతం విక్రయించారు. ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని ఐఎంఎల్ డిపోలోనే సుమారు లక్ష కేసుల మద్యం పాత స్టాక్ ఉందని అధికారులే చెబుతున్నారు. కొన్నింటికి మినహాయింపు ప్రభుత్వం మద్యం ధరలు పెంచినప్పటికీ చీప్ లిక్కర్ జాబితాలో ఉన్న కొన్నింటిని మినహాయించింది. డైమండ్ విస్కీ, కేకే, డౌన్డౌన్, గుడ్వన్, డెక్కన్బ్లూ, యునైటెడ్ గోల్డు, బీకే, సన్హార్ట్స్, మెగాసిటీ బ్రాండ్ల మద్యానికి పాత ధరలే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బ్రీజర్ కంపెనీలో కాన్బెర్రీ ధరలోనూ మార్పు చేయలేదు. బ్రాండెడ్ మద్యం ధరలే పెంచడంతో ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో 17వ తేదీ వరకు రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది రూ.95 కోట్ల మద్యమే అమ్ముడైంది. మరో పది రోజుల్లో గత ఏడాది కంటే ఎక్కువ అమ్మకాలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా అమ్మకాలు ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం అమల్లోకి రాగా వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మధ్యాహ్నం వరకు లారీలు బయటకు కదల్లేదు. కొత్త ధరలతో బిల్లింగ్ చేసేలా స్టాఫ్వేర్లో మార్పులు చేయడంతో ఆలస్యమైందని తెలిసింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత డిపోలో అమ్మకాలు మొదలుకాగా, ఒకేరోజు రూ.12 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారని సమాచారం.మందుబాబులకు ముందే కిక్కు పాల్వంచరూరల్: మద్యంపై పెంచిన ధరలు అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని భావించిన మందుబాబులకు ఆ ఆనందం దక్కలేదు. పాల్వంచ మండలం పెద్దమ్మగుడి ఆలయం సమీపంలోని వైన్స్లో పాత స్టాక్నే కొత్త ధరకు అమ్మడంతో వాగ్వాదం జరిగింది. ఈ విషయమై పలువురు ఎకై ్సజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ బ్రాండ్ మద్యం క్వార్టర్ ధర రూ.180 ఉంటే పెరిగిన ధరతో కలిపి రూ.190కు, హాఫ్, పుల్ బాటిళ్లు కూడా అలాగే అమ్మారని తెలిసింది. ఈవిషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్గౌడ్ను వివరణ కోరగా షాపుల్లో ఉన్న పాత స్టాక్ను ధర పెంచి అమ్మితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్కొత్తగూడెంఅర్బన్: ప్రతీ సోమవారం ప్రజావాణి(గీవెన్స్ డే)లో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి నివసిస్తున్న తోట భార్గవి తల్లి నుండి సంక్రమించిన భూమి సాగును సోదరులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ● పినపాక మండలం కరకగూడెం జీపీ పరిధిలోని చోప్పాలా, నర్సాపురం గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కోసం విన్నవించారు. ● అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన నోముల లక్ష్మి 2024 వరదల్లో ఇల్లు కొట్టుకుపోయినందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● లక్ష్మీదేవిపల్లి మండలం బోరింగ్ తండాకు నూనావత్ జగన్మోహన్దాస్ రోడ్డు విస్తరణలో తాను కిరాణా షాప్ను కోల్పోయినందున న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ● బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరకు చెందిన జివాజి రమాదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● ములకలపల్లి మండలంలో జరుగుతున్న సీతారామ ప్యాకేజ్–3 పనులకు సంబంధించి విలువైన రాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నందున చర్యలు తీసుకోవాలని కొత్తూరు గ్రామానికి చెందిన ఆంగోతు సుధాకర్ ఫిర్యాదు చేశారు. పూడికతీత పనులకు రూ.167.7 లక్షలు కొత్తగూడెంఅర్బన్: సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యాన చెరువుల పూడికతీతకు గాను రూ.167.7లక్షలు కేటాయించారు. ఈ నిధులతో మణుగూరులోని కోడిపుంజుల వాగు, సమితి సింగారం చెరువు, పొడ పొట్రాల చెరువు, ఎర్ర లక్ష్మయ్య కుంట పూడికతీత పనులు చేపడుతారు. తద్వారా వర్షాకాలం ఎక్కువ నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈమేరకు నిధుల కేటాయింపు పత్రాలను కలెక్టర్ పాటిల్కు సోమవారం సింగరేణి అధికారులు అందజేశారు. సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ఎస్పీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా 4 ఇంక్లైన్లోని రెస్క్యూ స్టేషన్ను ఎస్పీ రోహిత్రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రెస్క్యూ ఆపరేషన్లలో విని యోగించే పరికరాలు, తీసుకునే జాగ్రత్తలు, ఇప్పటివరకు చేసిన ఆపరేషన్ల వివరాలను ఇన్చార్జ్ అనంతరామయ్య వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సింగరేని ఉద్యోగులు చేపట్టే రెస్క్యూ ఆపరేషన్లు పలువురి ప్రాణాలను నిలబెడుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రహమాన్, సీఐలు రమేష్కుమార్, చెన్నూరు శ్రీనివాస్, సింగరేణి అధికారులు కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ రెహమాన్తో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు చెన్నూరు శ్రీనివాస్, కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యాన్నదానానికి విరాళం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి వరంగల్కు చెందిన వీరస్వామి–విమల దంపతులు సోమవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే, కొత్తగూడెంకు చెందిన బాబు–కమలమ్మ దంపతులు రూ.50 వేల విలువైన 600 గ్రాముల వెండి అభిషేకం జల్లెడను ఈఓ ఎల్.రమాదేవికి అందజేశారు. బ్లాస్టింగ్ టెక్నాలజీలో డాక్టరేట్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ ఓసీల్లో నిర్వహించే బ్లాస్టింగ్ టెక్నాలజీలో డాక్టరేట్ సాధించారు. బ్లాస్టింగ్ సమయాన ఇబ్బందులను తగ్గించే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు నాగపూర్ నిట్ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరమణను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్లు అభినందించగా, సీపీపీ జీఎం సాయిబాబు, ఏజీఎం గోనే శ్రీకాంత్ తదితరులు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఓసీల్లో బ్లాస్టింగ్ సమయాన పెద్ద శబ్దంతోపాటు దుమ్ము, ధూళి వచ్చేవని తెలిపారు. కానీ అలా రాకుండా అనుసరించాల్సిన విధానాలపై వెంకటరమణ పరిశోధనలు చేయడం అభినందనీయమని వెల్లడించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఈనెల 22నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 7,635 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 24 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించాలని, పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఎండల నేపథ్యాన కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి సీహెచ్.వెంకటేశ్వరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు సులోచనరాణి, జయలక్ష్మి, సీహెచ్.శ్రీనివాస్, చిన్న యాకయ్య, అహ్మద్, రమణారావు తదితరులు పాల్గొన్నారు. వాహనాల పన్ను వసూళ్లపై దృష్టికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని వాహనాలకు నిర్దేశించిన పన్నులు వసూలు చేయడంపై ఉద్యోగులు దృష్టిసారించాలని రవాణా శాఖ వరంగల్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం సూచించారు. కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలని, లేనిపక్షంలో జరిమానా విధించాలని తెలిపారు. అలాగే, విద్యాసంత్సరం ప్రారంభం కానున్నందున విద్యాసంస్థలు బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని సూచించారు. జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, కొత్తగూడెం ఎంవీఐలు మనోహర్, నిర్మలారెడ్డి, వెంకటపుల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
నమ్మాలి.. ఇది పంట కాలువే..
వానాకాలం పంటల సీజన్ సమీపిస్తోంది. మరో పక్షం దాటితే దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కానీ అధికారులు మాత్రం పంట కాల్వలను బాగు చేయడంపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఏడు కి.మీ. పొడవైన కుడి కాల్వలో పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది. అందులో నుంచి ప్రాజెక్టు నీళ్ల మాటేమిటో కానీ నీటిధార కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కానరావడం లేదు. అలాగే, రాళ్లవాగుకు చెందిన కాల్వ సైతం కారెగట్టు వద్ద ఇలాగే మూసుకుపోయింది. ఎండాకాలంలో నీటి సరఫరా లేనప్పుడు స్పందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని.. ఇకనైనా స్పందిస్తే వానలు మొదలయ్యేనాటికి కాల్వలు బాగవుతాయని రైతులు చెబుతున్నారు. – పాల్వంచరూరల్ -
పనులు ఎన్ని రోజులండి?
రెండేళ్లుగా సాగుతున్న అమృత్ పథకం పనులు ● ధర గిట్టుబాటుకాక కొన్నింటిని నిలిపివేసిన కాంట్రాక్టర్ ● బీడీసీఆర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవస్థలు కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ను ఎంపిక చేసి రూ. 25.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటివరకు 50 శాతం వరకు పనులు జరిగాయి. టెక్నికల్ సమస్యలతోపాటు ధర గిట్టుబాటు కాలేదని కాంట్రాక్టర్లు వెనకాడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం ఆలయానికి సమీపంలో ఉండటంతో భక్తులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. అమృత్ పథకంతో రైల్వే స్టేషన్లో సౌకర్యాలు మెరుగుపడతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. రెండేళ్లుగా పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు తప్పనిపాట్లు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు మూడు విభాగాలుగా జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్, ఫుట్ఓవర్ బ్రిడ్జి, షీట్ వర్క్స్, స్టేషన్ ముఖద్వారం, ప్రవేశద్వారం, ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఆలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం పనులు కూడా నిలిచిపోయాయి. స్టేషన్లో వెయిటింగ్ హాల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కానీ బాత్రూంలకు, రాకపోకలకు సంబంధించిన డోర్లు ఏర్పాటు చేయలేదు. విద్యుదీకరణ, వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్ఫామ్ ఉపరితలం, పైకప్పులను అధునాతన షీట్లతో నిర్మించే పనుల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో సీట్లన్నీ ప్లాట్ఫాంపైనే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో అక్కడక్కడా జరిపిన తవ్వకాలు అడ్డుగా ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారం దగ్గర కూడా అపరిశుభ్రత నెలకొంది. ప్రయాణికుల కుర్చీలు, బల్లల దగ్గర పైకప్పు లేకపోవడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వర్షం వస్తే ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల దగ్గర తలదాచుకుంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి అభివృద్ధి, ఆధునికీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కూర్చోవాలన్నా ఇబ్బందే.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్కు వెళ్తున్నాం. మధ్యాహ్నం రైలు వచ్చేందుకు సమయం ఉండటంతో వేచి చూస్తున్నాం. స్టేషన్లో కూర్చునేందుకు నీడ కూడా లేదు. వెయిటింగ్ హాల్ పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. రైలు వచ్చే వరకు ఎక్కడ వేచి ఉండాలో తెలియడం లేదు. – ఈర్య, సుజాతనగర్త్వరగా పూర్తిచేయాలి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయి. స్టేషన్లో ఎక్కడ చూసినా పనులకు సంబంధించిన సామగ్రి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరముంది. – మారోని, కొత్తగూడెం -
మద్యం ధరలకు రెక్కలు
● క్వార్టర్పై రూ. 10, ఫుల్ బాటిల్కు రూ.40 పెంపు ● నేటి నుంచి అమలుకు రంగం సిద్ధంవైరా: మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత నవంబర్లో బీరు ధరలు పెంచిన సర్కార్.. ఆరు నెలలకే లిక్కర్ ధరలు కూడా పెంచడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టినట్టయింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్ నుంచి అన్ని రకాల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ (180 ఎంఎల్) సీసాపై రూ.10 పెంచగా, హాఫ్ బాటిల్కు రూ. 20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. గతంలో బీర్ల ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు పెంచడంతో ఈ ఏడాది గతంలో ఏన్నాడూ లేనంతగా బీర్ల అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. మళ్లీ అన్ని బ్రాండ్ల లిక్కర్ రేట్లు పెంచడంతో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.నేడు మద్యం డిపోలో బిల్లింగ్ ఆలస్యం..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మద్యం సరఫరా అయ్యే వైరాలోని మద్యం డిపోలో వ్యాపారులు బిల్లింగ్ కోసం వస్తుంటారు. పెరిగిన ధరల జాబితా ఆన్లైన్లో ఆప్డేట్ అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత సర్వర్లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో ధరల జాబితాను వ్యాపారులకు అందించే అవకాశం ఉంటుందని డిపో అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో పెంచిన ధరల జాబితా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయంతో మద్యం ప్రియులపై ధరల పిడుగు పడిందని చెప్పొచ్చు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.శ్రీకనకదుర్గమ్మకు విశేష పూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్కు తరలివచ్చారు. డ్యామ్పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కిన్నెరసానిని సందర్శించిన 6వ బెటాలియన్ కమాండెంట్చాతకొండ ఆరో బెటాలియన్కు చెందిన కమాండెంట్ శివప్రసాద్రెడ్డి కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. జలాశయాన్ని వీక్షించి బోటు షికారు చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రశాంతంసుజాతనగర్: మండల పరిధిలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 120 మందికిగాను 118 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆదివారం జరిగిన ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం, కోయ వీరగాథ చక్రం ప్రదర్శన డాక్యుమెంటేషన్ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గూడేలలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను మొక్కవోని ధైర్యంతో ఎదిరించిన సమ్మక్క సారలమ్మలు, కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసుల ఇలవేల్పులు బాపనమ్మ చంద్రపాల వారసులు, రుద్రమదేవి పరిపాలన కాలంలో వాడిన ఆయుధాలు, వారి చరిత్రను వీరగాథలుగా మలిచి నేటితరం గిరిజనులకు తెలియపరచడం అభినందనీయమన్నారు. ఆదివాసీ కళలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా, ఖండాంతరాలకు తెలిసే విధంగా గిరిజన మ్యూజియంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మ్యూజియం సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అనంతరం కోయ సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన బుక్లెట్ను ఆవిష్కరించి, కులపతులను పీఓ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల్ రావు, బండ్ల మునీశ్వరరావు, గొర్రె బాపనయ్య, బండ్ల చుక్కమ్మ, గొర్రె సత్యం, రాంబాబు, వీరాస్వామి, గిరిజనులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘తితిక్ష’
ఖమ్మంగాంధీచౌక్: గంజాయి మత్తులో తూగుతూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్న కొడుకును తల్లి హత్య చేసిన ఇతివృత్తంగా రూపొందించిన ‘తితిక్ష’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్ దాశరథి థియేటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో నాన్న ఉత్తరం, నా ఆడపిల్ల లఘు చిత్రాలను ప్రదర్శించారు. ముళ్లపూడి ఈశ్వరి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నెలనెలా వెన్నెల నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాటిక ప్రదర్శకులకు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా దాతలు న్యాయవాది జాబిశెట్టి పాపారావు, కొండపల్లి జగన్మోహన్ రావు, వంగవీటి నవీన్ మాట్లాడుతూ.. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఇలాంటి నాటికలు ప్రదర్శించటం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, మార్తి కొండల్రావు, నందిగామ కృష్ణ, శానం వీరబాబు, జి.రవీందర్ పాల్గొన్నారు.