breaking news
Bhadradri District News
-
స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా తుమ్మల
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం జరిగే స్వాతంత్య్ర ప్రధాన వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా ప్రభుత్వం తరఫున హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు, రేపు సింగరేణి సీఎండీ పర్యటనరుద్రంపూర్: ఈ నెల 15న ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి హాజరుకానున్నారు. ఈక్రమంలో శుక్రవారమే ఆయన కొత్తగూడెం రానున్నారు. ఉదయం 9:30 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయంపై, మహిళా డిగ్రీ కళాశాలపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ప్రారంభించనున్నారు. దీంతోపాటు కార్పొరేట్లోని వివిధ విభాగాల అధికారులతో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. శనివారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. క్వాలిటీ జీఎం సమీక్షమణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలో కొత్తగూడెం రీజియన్ జీఎం(క్వాలిటీ) సుజయ్ మజుందార్ గురువారం పర్యటించారు. ఏరియాలోని అన్ని విభాగాలను సందర్శించి, నాణ్యత ప్రమాణాలు సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఇతర విభాగాల అధికారులు జీఎం చాంబర్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు పాల్గొన్నారు. నాటక రూపంలో బోధనఆంగ్ల ఉపాధ్యాయుడి వినూత్న ప్రయత్నం అశ్వారావుపేటరూరల్: ఆంగ్ల బోధనకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేస్తూ, విద్యార్థులు భాషపై ఆసక్తి చూపేలా, పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 6,7వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో ఉన్న ‘పురు–ది బ్రేవ్’పాఠాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. దీంతో విద్యార్థులు కష్టతరమైన ఆంగ్ల పదాలను సులువుగా అర్థం చేసుకుంటున్నారు. గురువారం పాఠశాలలో నాటకాన్ని ప్రదర్శించగా ఆకట్టుకుంది. వినూత్న ప్రయత్నం చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు హలవత్ హరిబాబును పలువురు అభినందిస్తున్నారు. ‘సర్’లో చండ్రుగొండకు మొదటిస్థానంచండ్రుగొండ: సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో జిల్లాలోనే చండ్రుగొండ మండలం మొదటి స్థానంలో నిలిచిందని తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్ తెలిపారు. గురువారం ఓటర్ల సవరణ ప్రక్రియను తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ ప్రక్రియ మండలంలో తుది దశకు చేరుకుందని, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బీఎల్ఓలు ఓటర్ల జాబితా సవరణను చేపట్టారని వివరించారు. కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట క్రమ సంఖ్యలో ఉండేలా బీఎల్ఓలు జాబితా సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. 27 బూత్లలో ఓటర్ల సవరణ జరుగుతుందని తెలిపారు. ముసాయిదా జాబితాను ఈనెల 17న విడుదల చేస్తామన్నారు. -
ఆరంభానికి ఆపసోపాలు
పర్యాటక రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఇల్లెందు క్రాస్రోడ్ దగ్గర 46 గదులతో హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. కిన్నెరసాని దగ్గర 36 గదులు కలిగిన తొమ్మిది కాటేజీలు, అద్దాల మేడలకు సంబంధించిన పనులు పూర్తయి పది నెలలు దాటింది. అయినా ఈ రెండింటిని ప్రారంభించడంలేదు. ఈ రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. కాషన్ డిపాజిట్ కింద రూ.3 కోట్లు జమ చేయాలనే నిబంధన పెట్టడంతో ప్రైవేటు కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ఏడాది కాలంగా చిక్కుముడి పడింది. దీనిపై చర్చలు జరిపి, హోటల్, కాటేజీలను పర్యాటకులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై సరైన కార్యాచరణ కరువైంది. -
హామీల్లోనే పర్యాటకం!
టెంపుల్, ఎకో టూరిజంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామంటూ మంత్రులు హామీ ఇచ్చి రెండేళ్లు గడిచింది. అయినా అడుగు ముందుకు పడలేదు. ఆనంద ద్వీపం అభివృద్ధి, తీగల వంతెన నిర్మాణం, ట్రెక్కింగ్ పనులతో పర్యాటక అభివృద్ధి హామీలకే పరిమితమైంది. నిర్మాణం పూర్తయినా హరిత హోటల్, అద్దాల మేడ, కాటేజీలు ప్రారంభానికి నోచుకోవడంలేదు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం2024 ఆగస్టు 12న మంత్రుల పర్యటన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు 2024 ఆగస్టు 12న కిన్నెరసానిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముగ్గురు మంత్రులు బోటులో సుమారు రెండు గంటలపాటు జలాశయంలో విహరించారు. జలాశయం మధ్యలో ఉన్న ‘ఆనంద ద్వీపం’ కాన్సెప్టును దగ్గర నుంచి పరిశీలించారు. బోటులోనే మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం కిన్నెరసానితోపాటు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీల తీరు ఇలా ● పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఇక్కడ అభివృద్ధి పనుల ప్రణాళిక రూపొందించే పనిని వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీకి అప్పగిస్తాం. ఈ పనులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్, ఫారెస్ట్, విద్యుత్, పర్యాటకంతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ● రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో దీవులతో కిన్నెరసాని జలాశయం అద్భుతంగా ఉంది. అవకాశాన్ని బట్టి ఎకో, వాటర్, వెడ్డింగ్ డెస్టినేషన్, రిక్రియేషన్ తదితర విభాగాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే చాలు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ● కిన్నెరసానిలో తీగల వంతెన, ట్రెక్కింగ్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అప్పుడే ప్రతిపాదించారు. రెండేళ్లు పూర్తయినా డిప్యూటీ సీఎం, పర్యాటక శాఖ మంత్రి ఇచ్చిన హామీల్లో పురోగతి లేదు. టూరిజం డెవలప్మెంట్ కోసం నియమిస్తామని చెప్పిన వరల్డ్ క్లాస్ కన్సల్టెన్సీ అంశం అటకెక్కింది. ఆనంద ద్వీపం కాన్సెప్టును పట్టించుకునేవారే లేరు. తీగల వంతెన, ట్రెక్కింగ్ పనులు కొండెక్కాయి. కంటి తుడుపు చర్యగా కేవలం జంగిల్ సఫారీ మొదలైంది. -
సైబర్ నేరాలు నిరోధించేలా..
● సురక్ష కా తిరంగా– సైబర్ స్వతంత్ర కార్యక్రమం ● ఈ నెల 5 నుంచి మొదలైన అవగాహన కార్యక్రమాలు ● అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు భద్రాచలంఅర్బన్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలు చేస్తుండగా సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితోపాటు డిజిటల్ భద్రత పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘సురక్ష కా తిరంగా–సైబర్ స్వతంత్ర’ కార్యక్రమాన్ని చేపట్టింది. సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండటం, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడంపై ఈ నెల 5 నుంచి 15 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, గ్రామాలు, పట్టణాలు, మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ ట్రేడింగ్, రుణాల పేరుతో మోసాలు, ఫేక్ లింకులు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీ, యూపీఐ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాల్లో కొన్ని ఘటనల వివరాలు ● 2025 నవంబర్ 25న భద్రాచలానికి చెందిన ప్రముఖ వైద్యుడు సుబ్బరాజును సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.20 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ● 2026 జూలై 29న తక్కువ వడ్డీకి అధిక మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి బూర్గంపాడుకు చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రూ.6.90 లక్షలు కాజేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరగాళ్ల ఖాతాలోని రూ.3.30 లక్షలను హోల్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ● 2025 కంటే 1202 ఫిర్యాదులు తగ్గినా, హోల్డ్, రీఫండ్ గతేడాది కంటే పెరిగింది. రెండేళ్లలో కూడా హోల్డ్ చేసిన మొత్తంలో సగం కూడా రీఫండ్ కాకపోవడం, మిగతాది పెండింగ్లోనే ఉండటం గమనార్హం. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసు, సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో వచ్చే కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదు. అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. మోసపోతే 1930కు ఫోన్ చేయాలి. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతోపాటు లావాదేవీ వివరాలు, ఫోన్ నంబర్లు, మెసేజ్లు, స్క్రీన్ షాట్లు భద్రపరచాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా నగదును హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజల్లో అవగాహన పెంచడం కోసమే సురక్ష కా తిరంగా కార్యక్రమం చేపట్టాం. –బి.రోహిత్ రాజు, ఎస్పీఏడాది ఫిర్యాదులు నష్టం హోల్డ్ రీఫండ్ 2025 1,758 11.58 1.80 39.81 2026 1,202 6.89 2.07 56.94 -
‘ట్రాన్సిట్ ప్లాన్’ డీపీఆర్ రద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (డీపీఆర్) తయారీ టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంస్థల సహకారంతో తలపెట్టిన డెవలప్మెంట్ వర్క్స్ డీపీఆర్పై ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. డీపీఆర్ తయారీకి త్వరలోనే ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.600 కోట్లతో కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయన్నారు. కాగా, ట్రాన్సిట్ ప్లాన్ డీపీఆర్ ప్రక్రియపై సాక్షిలో వరుసగా కథనాలు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. పర్లేదు ఉండమ్మా ట్రాన్సిట్ ప్లాన్ వివరాలను ఎమ్మెల్యే కూనంనేని మీడియాకు వివరిస్తున్న సమయంలో క్యాంప్ ఆఫీస్కు కొత్తగూడెం కమిషనర్ సుజాత వచ్చారు. వేదికపై సీపీఐ నాయకులు ఉండటంతో ఆ వేదికను పంచుకునేందుకు ఆమె తటపటాయించారు. నేను ఎమ్మెల్యేను ఇక్కడ ఉన్నాను. ప్రభుత్వ కార్యక్రమం కోసమే మాట్లాడుతున్నాం. ఏం పర్లేదు కూర్చొమ్మా అని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో ప్రెస్మీట్లో ఆమె కూడా ఆసీనులయ్యారు. కోల్డ్వార్ ట్రాన్సిట్ ప్లాన్ విషయంలో సంకీర్ణ పాలకవర్గం సీపీఐ–కాంగ్రెస్ల మధ్య కోల్డ్వార్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ పదవిని దక్కించుకున్న సీపీఐని బద్నాం చేసేందుకు కొన్ని అదృశ్య హస్తాలు పని చేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతికూల ప్రచారం కోసం ఏకంగా రూ.14 లక్షలను ‘ప్రసాదం’ తరహాలో పంచిపెట్టినట్టు కార్పొరేటర్ల మధ్య ఆఫ్ ది రికార్డుగా చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా భావించిన మరికొందరు కార్పొరేటర్లు ‘డీపీఆర్ సెటిల్మెంట్’ కోసం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పసిగుడ్డును గొంతు నులిమి చంపడం రాక్షసత్వమని, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కార్పోరేషన్ను అభివృద్ధికి చేసే ప్రయత్నాలను అడ్డుకునేలా విమర్శలు చేయడం కూడా రాక్షసత్వమేనని కూనంనేని అభివర్ణించారు. ఇంటి నంబర్లు, ఇంటి పట్టాల విషయంలో లంచాలు తీసుకునే వారే తమపై విమర్శలు చేస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దొంగలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తమపై కూడా క్రిమినల్ కేసులు పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషాను షాడో ఎమ్మెల్యేగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మేయర్ మూడ్ గణేష్, సీసీఐ కార్పొరేటర్లు, కొత్తగూడెం కమిషనర్ సుజాతలతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
రామాలయంలో ‘కియోస్క్’ సేవలు!
భద్రాచలం: రామాలయంలో త్వరలో కియోస్క్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆలయ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ప్రస్తుతం పడమర మెట్ల వద్ద నున్న టికెట్ కౌంటర్ భవనం సైతం తొలగించనున్నారు. దీంతో భక్తులు టికెట్ల కొనుగోలుకు ఇబ్బందులు పడకుండా కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మిథిలా స్టేడియం, రామా నిలయం, సీఆర్వో కార్యాలయం, రంగనాయకుల గుట్టపై కాటేజీల వద్ద వీటిని ఉంచాలని భావిస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లించి ఆర్జిత సేవలు, ప్రసాదాలు ఇతర సేవలకు యంత్రాల ద్వారా టికెట్లు పొందేలా చర్యలు చేపట్టనున్నారు. యంత్రాల ఏర్పాటుపై గురువారం ఈఓ తన కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కియోస్క్ యంత్రాలను వితరణ చేయాలని కోరారు. సుమారు 10 యంత్రాలను అందుబాటులో ఉంచాల్సి ఉందని, తొలి విడతలో ఆరింటిని అందివ్వాలని అన్నారు. కాగా, ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని బ్యాంక్ అధికారులు తెలిపారు. వారు ఆమోదిస్తే యంత్రాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకర్లతో ఈఓ దామోదర్రావు సమావేశం -
భూసేకరణతోనే ‘సీతారామ’ పనుల్లో వేగం
సాక్షిప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట : సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగంగా జరిగేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్లో గురువారం ఆయన ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించారు. ప్రాజెక్టులోని మూడో పంప్హౌస్ నుంచి నాలుగో పంప్హౌస్ వరకు నీటిని తరలించేందుకు అవసరమైన 532 ఎకరాల భూసేకరణకు రూ.45 కోట్లు అవసరమని తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంప్హౌస్ నుంచి దమ్మపేట మండలంలోని నాలుగో పంప్హౌస్ వరకు కాల్వ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఆ పంప్హౌస్ నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని చెరువులకు కాల్వలకు బదులు పైప్లైన్ ద్వారా నీరు అందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. తద్వారా వ్యయం తగ్గడమే కాక రైతులు తమ భూములను కోల్పోవాల్సిన అవసరం ఉండదని.. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలకు గోదావరి జలాలు అందుతాయని వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్తో మంత్రి తుమ్మల భేటీ -
ఎఫ్బీఓ మృతిపై సమగ్ర దర్యాప్తు
● హంతకులపై కఠినచర్యలు తీసుకుంటాం ● జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ బూర్గంపాడు: నరికిపేట అటవీప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ తెలిపారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణాసాగర్ అభయారణ్యంలోని చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ నకిరిపేట అటవీప్రాంతంలో ఎఫ్బీఓ మృతిచెందిన ప్రాంతాన్ని గురువారం ఆయన అటవీ, పోలీస్, విద్యుత్శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వేటగాళ్లు ఎక్కడి నుంచి విద్యుత్ అక్రమ కనెక్షన్ తీసుకున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటన జిల్లా అటవీశాఖ అధికారుల్లో, సిబ్బందిలో ఆందోళన కలిగించిందన్నారు. విద్యుత్శాఖ అధికారులు వేటగాళ్ల విద్యుత్ చౌర్యంపై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్శాఖ కూడా అటవీశాఖ అధికారుల విజ్ఞప్తులను, దరఖాస్తులను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. అటవీశాఖతో పోలీస్, విద్యుత్శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎఫ్డీఓ కృష్ణప్రసాద్, ఎఫ్ఆర్ఓ సురేష్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
జూలూరుపాడు(సుజాతనగర్): ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం సుజాతనగర్ మండలంలో సింగభూపాలెం, అంజనాపురం, వేపలగడ్డ గ్రామాల్లో పర్యటించారు. సింగభూపాలెం చెరువును సందర్శించి, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు పెసర, కూరగాయాలు సాగు చేసుకోవాలన్నారు. అనంతరం పాత అంజనాపురం రైతులు సాగు చేస్తున్న కూరగాయ పంటలు, పెసర, పత్తి, కాకర, సొరకాయ తదితర పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సింగభూపాలెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను, సర్వేను పరిశీలించారు. రూ.49 లక్షలతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ నీటి సంప్ నిర్మాణ పనులను సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, బోధన, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించారు. వేపలగడ్డ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను సందర్శించారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు, ఉద్యానవనశాఖ అధికారి కిషోర్ బాబు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
సింగరేణి ప్రధానాస్పత్రిలో తనిఖీ
చుంచుపల్లి/రుద్రంపూర్: సింగరేణి ప్రధానాస్పత్రిని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వివిధ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ఇమ్యునైజేషన్ విభాగాలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ , ప్రోగ్రాం ఆఫీసర్ ఈట ప్రతాప్, నాగభూషణం, రాంప్రసాద్, సింగరేణి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి దుమ్ముగూడెం మండలం కోయినవారిపురం గ్రామంలో ఆశా కార్యకర్తపై దాడి ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆశాల యూనియన్ నాయకులు డీఎంహెచ్ఓకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. -
ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి
● నీటి లభ్యత ఆధారంగా తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి ● తాలిపేరు ప్రాజెక్ట్ సందర్శనలో కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం)/చర్ల: వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ను, ఏకలవ్య మోడల్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ప్రాజెక్టులో నీటిమట్టం, ఇన్ఫ్లో, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ, సిబ్బంది తదితర వివరాలు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, ప్రాజెక్టు భద్రత, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, గేట్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు విన్నవించారు. అనంతరం చర్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనతీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని హెల్త్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించి, మందుల నిల్వ, విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని చెప్పారు. తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, ఎంఈఓ పీవీ రమణ ఇరిగేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్కు రూ 95.90 లక్షల చెక్కు అందజేతజిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటీపీఎస్ 7వ దశ సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ 95,90,802 తుది విడత నిధుల చెక్కును చీఫ్ ఇంజనీర్ బి.శివరామ్రెడ్డి బుధవారం కలెక్టర్ అంకిత్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ సివిల్ విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ యుగపతి పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులతో పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ నుంచి గిరిజన ప్రాంతమైన జగన్నాథపురం వరకు సెంట్రల్ లైటింగ్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని వివిధ గ్రామపంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. భూముల రీసర్వే కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. సర్వే పనుల కోసం రూ 22.84 లక్షలతో నాలుగు అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో లైసెన్సుడ్ సర్వేయర్లకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉన్నాయని, తాజాగా మరో నాలుగు రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సర్వే ఏడీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు. -
ప్రసాద్ పథకం పనుల పరిశీలన
దుమ్ముగూడెం : పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయంలో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను భద్రాచలం రామాలయ ఈఓ దామోదర్రావు బుధవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన షెడ్ల నిర్మాణం, ఫ్యాన్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. పనులు త్వరితిగతిన పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీ ఆధ్వర్యంలో దేవస్థాన స్థలంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ ఖాదర్బాబుకు సూచించారు. శ్రావణ్కుమార్, అనిల్కుమార్, వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. విత్తనోత్పత్తి నాణ్యతగా ఉండాలిబూర్గంపాడు: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ అన్నారు. నాగినేనిప్రోలు గ్రామంలో బుధవారం వరి, పత్తి పంటలను ఏడీఏ తాతారావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడకుండా రైతులే స్థానిక అవసరాలకు తగినట్లు విత్తనోత్పత్తిని పెంచాలన్నారు. ఏఓ శంకర్, శృతి, గాదె వెంకటేశ్వరరెడ్డి, మాధవరావు పాల్గొన్నారు. ఆలయ భూముల రక్షణకు నిరాహార దీక్షచర్ల: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి పక్కన ఉన్న సర్వే నంబర్ 117 లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించాలని కోరుతూ మహారుద్ర సేన వ్యవస్థాపకుడు కొండా చరణ్ బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టగా, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు చరణ్కు పూలమాల వేసి దీక్షను ప్రారంబించారు. దీక్షకు న్యాయవాది పరిటాల సంతోష్, లోక్ రక్షక్ పార్టీ నాయకుడు కొండా ప్రమోద్, చిట్టిమల్ల సుజాత, ఎస్కే భాష తదితరులు మద్దతు తెలిపారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం అశ్వారావుపేట/దమ్మపేట/ములకలపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. బుధవారం యాత్ర ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. దమ్మపేట బస్టాండ్ను వినియోగంలోకి తేవాలని, జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. మూకమామిడి ప్రాజెక్ట్కు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని కోరారు. అశ్వారావుపేటలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బస్ డిపో, డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుమ్మడవల్లి ప్రాజెక్టు పూర్తి చేసి 1600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ములకలపల్లిలో మేళతాళాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, నాయకులు బాగం హేమంతరావు, ఎం.విశ్వనాథం, కె. వెంకటేశ్వరరావు, ఎన్. ప్రసాద్, ధర్మ, ఈశ్వరరావు, సయ్యద్ సలీం, రామకృష్ణ పాల్గొన్నారు. -
అడవిలో ఆక్రందనలు
బూర్గంపాడు: అడవులను రక్షించే అధికారులకే భద్రత కరువైంది. బూర్గంపాడు మండలం నకిరి పేట అటవీప్రాంతంలో వేటగాళ్ల అమర్చిన విద్యుత్ తీగలు తాకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతిచెందిన ఘటనతో జిల్లా అటవీశాఖలో తీవ్ర విషా దం అలుముకుంది. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చారనే సమాచారంతో రాత్రి వేళలో సహచరులతో విధి నిర్వహణకు వెళ్లిన అధికారి ప్రాణం పోగొట్టుకున్నాడు. డీఆర్ఓతోపాటు ఆరుగురు బీట్ ఆఫీసర్లు విద్యుత్ ఉచ్చులను తప్పించాలనుకునే క్రమంలో ఓ బీట్ ఆఫీసర్ విద్యుదాఘాతంతో మృతిచెందగా, అతనితోపాటు వెళ్లిన మిగతా అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కళ్ల ముందే తమతో వచ్చిన అధికారి మృతిచెందటం మిగతా అధికారులను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నా తమ భద్రతకు ఎలాంటి చర్యలూ ఉంటడం లేదనే ఆందోళన అటవీశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. అటవీ అధికారుల ఆవేదన అడవుల నరికివేతను అడ్డుకుంటూ, కొత్తగా పోడు సాగు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోడుసాగుదారులు తిరగబడి దాడులు చేసిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలే తీసిన ఘటన కూడా ఉమ్మడి జిల్లాలో జరిగింది. పోడు సాగుదారులను అడ్డుకుంటే రాజకీయ పార్టీల ఒత్తిళ్లు, ప్రజా ప్రతినిధుల బెదిరింపులు, ప్రజాసంఘాల హెచ్చరికలతో అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అధికారంలో ఉన్నవారు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా తమను దోషులుగా చూస్తున్నారే తప్ప అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నామనే గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు పెడుతున్నవారిపై విద్యుత్, పోలీస్ శాఖలు కూడా నిఘా పెట్టాలని అటవీ అధికారులు కోరుతున్నారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు సాగును అడ్డుకుంటున్న క్రమంలో తమకు పోలీస్, రెవెన్యూ శాఖలు కూడా సహకారం అందించాలని కోరుతున్నారు. తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
విజ్ఞాన కేంద్రాలు.. గ్రంథాలయాలు
కొత్తగూడెంఅర్బన్: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. గ్రంథాలయ రంగంలో విశిష్ట సేవలందించిన ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం గ్రంథాలయంలో రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరబాబు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజంలో చైతన్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణకుమారి, ఎస్.లలితకుమారి, మణిమృదుల, నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో ప్రజావాణి కొత్తగూడెం కార్పొరేషన్లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ద్వారా 34 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు, పైపులైన్, తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, వాటిని సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత, సహాయక మిషనర్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు -
అస్వస్థతతో కూలీలు
అజాగ్రత్తగా పిచికారీ.. టమాట తోట నుంచి వచ్చినప్పటి నుంచి కళ్లలో మంట, తల తిరగడం మొదలైంది. ఒకటి రెండు సార్లు వాంతులు కూడా అయ్యాయి. ఏమయిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించటంతో వైద్య సేవలు అందించారు. పురుగుల మందు తీవ్రత వల్లనే ఇలా జరిగింది. –అలివేలు మంగకూలీలు అందరం తోటలో పనులు చేస్తుండగానే చెట్లకు పురుగు మందును పిచికారీ చేయించారు. ఇంటికి వచ్చాక తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి వచ్చాం. –హరిత, కూలీమా తోటలో రోజూ 30 మంది వరకు పనికి వస్తుంటారు. సోమవారం కూడా అలానే వచ్చారు. ఎప్పటిలాగే ఒమిటే మందును పిచికారీ చేశాం. ఆ తర్వాత, కేవలం న్యూగొల్లగూడెం ప్రాంతానికి చెందిన కూలీలే అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల వారికి ఏమీ కాలేదు. బహుశా న్యూగొల్ల గూడెం కూలీల విషయంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చు. మా తోటలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుటేజీ పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. – నర్రా అజయ్, టమాట తోట యజమానిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చుంచుపల్లి: పురుగుల మందు ప్రభావంతో పలువురు మహిళా కూలీలు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం కొత్తగూడెం నగరంలో కలకలం రేపింది. బాధిత కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీ కూలీ పనుల్లో భాగంగా కొత్తగూడెం పట్టణ పరిధిలోని న్యూ గొల్లగూడెం ఒకే ప్రాంతానికి చెందిన 14 మంది మహిళలు సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురానికి సోమవారం కూలీకి వెళ్లారు. అక్కడ నర్రా అజయ్ కుమార్కు చెందిన మూడు ఎకరాల కూరగాయల తోటల్లో టమాటాలకు పురికొసలు కట్టే పనిలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే టమాట తోటలో నలుగురు పురుష కూలీలు ముడత మందు(ఒమిటే పురుగుల మందు)ను పిచికారీ చేయడం మొదలెట్టారు. దీనిపై కూలీలు అభ్యంతరం వ్యక్తం చేయగా ‘మాపని మాది, మీ పని మీది’ అంటూ పిచికారీని అలాగే కొనసాగించారు. ఒక్కొక్కరుగా అస్వస్థతకు.. పొలంలో ఉన్నప్పుడే ఒక కూలీకి తలనొప్పి, వాంతులు కాగా, అదే రోజు సాయంత్రం కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి చేరుకుంది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇవే లక్షణాలతో మరో ఇద్దరు మహిళా కూలీలు ఆస్పత్రికి వచ్చారు. వీరికి చికిత్స కొనసాగుతుండగానే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరుగా మొత్తం 14 మంది మహిళా కూలీలు వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఐసీయూకి తరలించారు. దీంతో ఆస్పత్రి వర్గాలు అనారోగ్యానికి కారణాలు ఆరా తీయగా, సోమవారం టమాట తోటలో పనికి వెళ్లినప్పుడు పురుగుల మందు పిచికారీ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని సర్వజన ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాధితులు వీరే ఆందోడ విజయ, అలివేలు మంగ, చాగంటి సుమలత, గొడిసే మంజుల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారికి అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిలిన కూలీలు స్రవంతి, రజిత, అస్టగుర్తి ప్రసన్న, ఉదయశ్రీ, హరిత, లక్ష్మి, రమణ, కల్పన, ప్రసన్న, కొప్పుశెట్టి అనసూర్య ఉన్నారు. పురుగుల మందుల పిచికారీ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు ఇతర పనులు చేయకూడదు. పిచికారీ సమయంలో క్షేత్రంలో ఉన్నవారు తప్పని సరిగా గ్లౌవ్స్, మాస్కులు, కళ్లద్దాలు వంటివి ధరించాలి. కానీ సుజాతనగర్ ఘటనలో ఇలాంటి జాగ్రత్తలేమి కనిపించలేదు. ఆఖరికి 14 మంది అనుమానాస్పద స్థితిలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి సైతం వ్యవసాయశాఖ వర్గాలకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికై నా జరిగిన ఘటనపై వ్యవసాయశాఖ విచారణ చేసి, తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పురుగుల మందు వాసన పీల్చి వ్యవసాయ కార్మికుల ఉక్కిరిబిక్కిరి -
బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి
జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి రాజేందర్సూపర్బజార్(కొత్తగూడెం): చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటీఐలో నాల్సా జాగృతి పథకం, సైబర్ నేరాలపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన, తమ హక్కులు, బాధ్యతలను వివరించారు. సైబర్ క్రైమ్ సీఐ జితేందర్ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, ఫిషింగ్, యుపీఐ బ్యాంకింగ్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జి.మహేశ్వరరావు, న్యాయవాదులు కున్సోత్ నవీన్, లావుడ్యా రమేష్, ఐటీఐ ప్రిన్సిపాల్ గోనెల రమేష్, సిబ్బంది కిషోర్, సోడే ఆనంద్ పాల్గొన్నారు. -
ఎఫ్బీఓకు కన్నీటి వీడ్కోలు
వేటగాళ్ల ఉచ్చుకు బలైన నవీన్ అంత్యక్రియలు పూర్తికారేపల్లి: బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు మంగళవారం రాత్రి బలైన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్(36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి బుధవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించగా నవీన్ అమర్రహే, అటవీశాఖ అమరవీరుడికి జోహార్లు అంటూ నినాదాలు చేయడమే కాక ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనుబంధాన్ని చాటుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్., వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, భద్రాద్రి డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ తదితరులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆతర్వాత నవీన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రాందాస్, డీఎఫ్ఓ సిద్ధార్థ పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. వెంకిట్యాతండాలో విషాదఛాయలు కారేపల్లి మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన బానోతు దేవ్లానాయక్ – వెంకిట్యాతండా సర్పంచ్ బానోతు బూలి చిన్నకుమారుడైన నవీన్ వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలోగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా చేరుకుని కుటుంబీకులను ఓదార్చారు. ఏళ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన దేవ్లా – బూలి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, పెద్ద కుమారుడు లెనిన్ హైదరాబాద్ ఫార్మా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నకుమారుడైన నవీన్కు భార్య కవిత, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, కారేపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్, రెండు జిల్లాల అధికారులు, సిబ్బంది, నాయకులు కూడా నవీన్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
ఉద్దీపకం లక్ష్యం నెరవేరాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు రూపొందించిన ఉద్దీపకం లక్ష్యం నెరవేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. బుధవారం భద్రాచలం గిరిజన విద్యా కళాశాలలో ఉద్దీపకం–3పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గణితాన్ని సులభంగా బోధించేలా వస్తువులు, చిత్రాలు, బోధనాభ్యసన సామగ్రిను వినియోగించాలన్నారు. స్లో లెర్నర్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి మానసిక స్థాయికి తగినట్లుగా బోధన ఉండాలని చెప్పారు. ఐటిడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.చందన, భద్రాచలం, ఖమ్మం ఎసీఎంవోలు, బి. రమేష్, రాములు, బి.ఎడ్. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ భవాని, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
వైభవంగా రుద్ర హోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం రుద్రహోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద్రమంత్రాల నడుమ స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా యాగశాలకు చేర్చారు. అక్కడ మండపారాధన, గణపతిపూజతో పాటు రుద్రహోమం నిర్వహించాక పూర్ణాహుతి సమర్పించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి ఇల్లెందురూరల్: సీజనల్ వ్యాధుల కట్టడిపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశించారు. ఇల్లెందు మండలం రొంపేడు, కొమరారం పీహెచ్సీలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రొంపేడు పీహెచ్సీలో రెండు గదులు కురుస్తున్నాయని, పెచ్చులు ఊడుతున్నాయని సిబ్బంది చెప్పగా మరమ్మతులకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించేందుకు గురువారం సిబ్బంది పనులు చేపట్టాలని సూచించారు. అలాగే, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇదిలా ఉండగా రెండు పీహెచ్సీల్లో విధులకు గైర్హాజరైన సిబ్బందికి మెమో జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. తనిఖీల్లో వైద్యులు సుకృత, నవీన, సిబ్బంది పాల్గొన్నారు.‘యువ ఆపదమిత్ర’ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం సూపర్బజార్(కొత్తగూడెం): నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యాన సామాజిక స్పృహ కలిగిన యువతకు ‘ఆపదమిత్రలు’గా శిక్షణ ఇవ్వనున్నట్లు మేరా యువ భారత్ జిల్లా కోఆర్డినేటర్ మద్దుల వెంకటరాంబాబు తెలిపారు. వరదలు, భూకంపాలు వంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా ఉండడానికి యువతకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. వారం పాటు చాతకొండ బెటాలియన్లో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లావాసులై 18 – 40 ఏళ్ల వయస్సు కలిగి, కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు మై భారత్ కార్యాలయం(నెహ్రూ యువకేంద్రం)లో లేదా 91773 29258 నంబర్లో సంప్రదించాని సూచించారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భద్రాచలంఅర్బన్: ఖమ్మం రీజియన్ పరిధి గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మొత్తం 21 పోస్టులు భర్తీ చేయనుండగా, సంబంధిత సబ్జెక్టు పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు ఎన్ఈటీ/ఎస్ఈటీ/ పీహెచ్డీల్లో ఏదైనా ఒక అర్హత ఉండాలన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మహిళా కళాశాలల్లో 12, టీజీటీడబ్ల్యూఆర్డీసీ(మణుగూరు)లో తొమ్మి ది పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ధ్రువపత్రాల జిరాక్స్లతో ఈనెల 13న సాయంత్రం 5 గంటల్లోగా పాల్వంచలోని కేఎల్ఆర్ పీజీ కళాశాలలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని, వివరాలకు 98489 65711 నంబర్లో సంప్రదించాలని పీఓ తెలిపారు. -
బోధించే వారే దారి తప్పారు
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుమధిర: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన వృత్తిలో ఉన్న అధ్యాపకులే దారి తప్పారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికె ట్లు సమర్పించినట్లు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో నలుగురు లెక్చరర్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వివరణ అందిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసే అవకాశముంది. 2023లో నియామకం గత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 4న ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులను ఎంపిక చేసింది. తొలుత నియామకపత్రాలు ఇచ్చిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అయితే, నియామకాల్లో అవకతవకలు జరిగాయని, పలువు రు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని విద్యార్థి సంఘాల నాయకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈమేరకు లెక్చరర్లగా నియమితులైన అందరి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్ట గా రాష్ట్రంలో 35మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పి ంచారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉన్నట్లు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. బిహార్ సర్టిఫికెట్ మధిర జూనియర్ కాలేజీలో నియమితులైన గంటా కృష్ణ అంతకుముందు ములుగు జిల్లా వాజేడులో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన 2009లో బిహార్లోని బోద్గయలో ఉన్న మగధ యూనివర్సిటీలో పీజీ చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే, టాస్క్ఫోర్స్ అధికారులు ఆరా తీయగా మగధ యూనివర్సిటీలో కృష్ణ పీజీ చేయలేదని, తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 7న మధిర కాలేజీకి మెయిల్ పంపించారు. ఈమేరకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేస్తూ, సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోవడమే కాక క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై మధిర కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ను వివరణ కోరగా... కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు.ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గంటా కృష్ణ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న షేక్ రోషన్బీ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్ చాంద్పాషా, పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ యాకయ్య కూడా ఈ జాబితాలో ఉండడంతో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాల యం నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
వేటకొడవలితో మహిళపై భర్త దాడి
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: కుటుంబ కలహాల నేపథ్యాన మహిళపై ఆమె భర్త వేటకొడవలితో దాడిచేయగా తీవ్రగాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడుకు చెందిన మహేశ్వరి – తుర్రం శివాజీకి 20 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐదేళ్లుగా దంపతుల మధ్య విభేదాలు మొదలుకావడంతో కొన్నాళ్ల నుంచి మహేశ్వరి భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో గతంలో పలుమార్లు మహేశ్వరిపై దాడి చేసిన శివాజీ.. ఓసారి తల పగలకొట్టినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు మహేశ్వరి కుటుంబ సభ్యులు గతంలో పలుమార్లు దుమ్ముగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన మంగళవారం డ్వాక్రా సంఘం డబ్బులు కట్టేందుకు మహేశ్వరి వెళ్తుండగా శివాజీ అడ్డుకుని వేటకొడవలితో దాడి చేశాడు. ఘటనలో ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణభయంతో పరుగులు తీస్తూ కొంతదూరం తర్వాత కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎడమ చేతికి సంబంధించిన నరాలు తెగిపోవడంతో స్పర్శ లేకపోగా, మిగతా భాగాల్లోనూ తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. ఘటనపై అందిన సమాచారంతో పోలీసులు బైరాగులపాడులో పరిశీ లించడమే కాక ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. -
విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం
దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఎమ్మెల్యే విద్యా యాత్ర’చేపడుతున్నామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’కార్యక్రమాన్ని మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. పాఠశాలలో తరగతి, వసతి గదులను తనిఖీ చేయడమేకాక సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత విద్యార్థులతో కలసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే, మెనూ బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అంతేకాక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో మాట్లాడారు. ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, తహసీల్దార్ మురళి, సీఐ నాగరాజురెడ్డి, ఎస్ఐ రాజేష్కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’లో ఆదినారాయణ -
మెనూ ప్రకారం పౌష్టికాహారం
● క్రీడలతోపాటు చదువులోనూ తీర్చిదిద్దాలి ● కలెక్టర్ అంకిత్పాల్వంచరూరల్: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన క్రీడాపాఠశాల, యానంబైల్లోని హైస్కూల్, పల్లె దవఖానా, రాజాపురంలోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. క్రీడాపాఠశాల తనిఖీ సందర్భంగా విద్య, క్రీడా శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలపై ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఉద్యోగులకు సూచించారు. కాగా, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిద్దిద్దాలని తెలిపారు. యానంబైల్లో అసంతృప్తి యానంబైల్ హైస్కూల్కు వెళ్లినప్పుడు మధ్యాహ్న భోజన సమయం కావడంతో పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం ఆహారంఅందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడాలని సూచించారు. అలాగే, యానంబైల్లోని పల్లె దవాఖానా తనిఖీ సందర్భంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆతర్వాత రాజాపురంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులుపాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని పడమటనర్సాపురం డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయానికి చెందిన బాదావత్ హనుమంతరావు – కవిత కుమారుడు ఈశ్వర్(16) సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. పడమటనర్సాపురం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద రాష్ట్రీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయ న పదోతరగతి పాసై ఇంటర్లో చేరేందుకు సిద్ధమవుతుండగా మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.6.1 కేజీల గంజాయి స్వాధీనంటేకులపల్లి: ఏపీ – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి రవాణా చేస్తున్న గంజాయిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు టేకులపల్లి శివార్లలో తనిఖీ చేస్తుండగా ద్వి చక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని తనిఖీ చేయగా రూ.3,05,000 విలువైన 6.1 కేజీల గంజా యి పట్టుబడింది. నిందితులు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం రాజు క్యాంప్కు చెందిన కొర్ర డేనియల్ కుమార్, కిలో సాగర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఎస్ఐ గౌతమ్తో పాటు ఉద్యోగులు నరసింహరావు, శ్రీనివాసరావు, పార్థసారథి, రమేష్ పాల్గొన్నారు. మద్యం మత్తులో విధులకు హెచ్డబ్ల్యూఓములకలపల్లి: వుులకలపల్లి ఎస్సీ బాలుర వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్డబ్ల్యూఓ) మద్యం మత్తులో విధులకు హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెచ్డబ్ల్యూఓ కిషన్ప్రసాద్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినట్లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతేకాక ఆయనను ప్రశ్నించగా తాను కొద్దిగా మద్యం సేవించానని అందులో చెప్పడం గమనార్హం. ఈక్రమాన హాస్టల్ను మంగళవారం పాల్వంచ ఏఎస్డబ్ల్యూ అక్షయ్ తనిఖీ చేశారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. -
కొత్తగా ఇంకొంత నరికారా?
దమ్మపేట: మండలంలోని పూసుకుంట గ్రామపంచాయితీ పరిధి వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ప్రత్యక్షమైన కలప దుంగలను అటవీ అధికారులు మంగళవారం పరిశీలించారు. ‘పాత కేసుకు కొత్త కలప ?’శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంతో పాల్వంచ ఎఫ్డీఓ కృష్ణప్రసాద్, సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్డు పక్కనే ఉన్న మారుజాతి కలప దుంగలను పరిశీలించి నరికి ఎంతకాలం అయిందనే అంశంపై ఆరాతీశారు. అంతేకాక అక్కడికి సమీప ప్రదేశాల్లో చెట్లు నరికిన ఆనవాళ్లను కూడా పరిశీలించారు. కాగా, పూసుకుంట అటవీ ప్రాంతంలో మారుజాతి చెట్లను ఇటీవలే నరికినట్లు ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. ఇందులో కొండ మురళి, బిల్లుడు, చిరుమాను, నల్లమద్ది, కొడిశ తదితర మారుజాతికి చెందిన మొదళ్లు ఉండగా, వీటి దుంగలను వీరారెడ్డి గుంపుకి తరలించారా అన్నది తేలాల్సిఉంది. పాత కేసులో కలప ఎక్కడ? పూసుకుంట అటవీ ప్రాంతంలోనికి జేసీబీతో అక్రమంగా ప్రవేశించడమే గాక మారుజాతి కలప చెట్ల ధ్వంసానికి పాల్పడిన ఘటనపై ఏడాది క్రితం అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కలప ఇప్పటివరకు దమ్మపేట రేంజ్ కార్యాలయం, పాల్వంచ టింబర్ డిపోకు తరలించలేదు. పాత కలప ఏమైందనే విషయం అధికారులు బయటపెట్టకపోగా, ఈ స్థానంలో తాజాగా నరికిన దుంగలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎఫ్డీఓ కృష్ణస్రాద్ మాట్లాడుతూ వీరారెడ్డి గుంపులో ఉన్న కలప దుంగలను పరిశీలించామని, సమగ్రమైన దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వీరారెడ్డి గుంపులో అధికారుల పరిశీలన -
డీపీఆర్ టెండర్ను రద్దు చేయాల్సిందే..
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ. 9.60 కోట్ల డీపీఆర్ టెండర్ను తక్షణమే రద్దు చేసి ఎమ్మె ల్యే సాంబశివరావు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జైభీమ్రావు భారత్పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఝెర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం డీపీఆర్ రూపొందించేలా రూ 9.60 కోట్లతో టెండర్ పిలిచి, మూడు రోజులే గడువు ఇవ్వ డం సరికాదన్నారు. కేవలం రెండు దరఖాస్తులే వచ్చినందున రద్దు చేయాల్సిందేనన్నారు. టెండర్ ప్రక్రియలోనే జరిగిన అక్రమాలకు ఎవరు బాధ్యులో తేల్చడమే కాక టెండర్ రద్దు చేసే వరకూ పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, నాయకులు నాగుల రవికుమార్, గజ్జల శంకర్, వినయ్, సోను, మున్నా పాల్గొన్నారు. విస్తా కాంప్లెక్స్లో స్క్రాప్ అమ్మకం భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఐటీడీఏ ఆధీనంలోని విస్తా కాంప్లెక్స్లో పాడైన మిషనరీ, ఇతరత్రా నాలుగు టన్నుల స్క్రాప్ అమ్మనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపా రు. షాపు నంబర్లు 9, 30లో రంగురాళ్లకు సంబంధించిన పాడైన మిషనరీ, ఇతర స్క్రాప్, షాపు నంబర్ 9లో 2.50 టన్నులు, షాపు నంబర్ 30లో సుమారు 1.50 టన్నుల స్క్రాప్ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు విస్తా కాంప్లెక్స్ కు హాజరై కొనుగోలు చేయొచ్చని, వివరాలకు 94415 07135 నంబర్లో సంప్రదించాలని పీఓ సూచించారు. దాడి ఘటనలో ఆరుగురిపై కేసు నమోదుఇల్లెందురూరల్: పట్టణంలోని 24ఏరియాలో గత నెల 24వ తేదీన జరిగిన దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. 24 ఏరియాకు చెందిన క్రాంతికుమార్పై అతని ఇంటి వద్దే గుళ్లగట్టు ప్రకాష్, సుధారాణి, వెంకటేశ్వర్లు, వంవీకుమార, జరీనా, జానీ దాడి చేస్తున్న విషయం తెలుసుకొని 21ఏరియాకు చెందిన మెరుగు కృష్ణవేణి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమైపె కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో తనకు న్యాయం చేయాలని కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విప్లవోద్యమ నాయకురాలు సీతక్క●నివాళులర్పించిన మాస్లైన్ నేతలు ఖమ్మంమయూరిసెంటర్: దాదాపు 30 ఏళ్ల పాటు అడవిలో సాయుధ సభ్యురాలుగా పనిచేసిన గంగసాని సీతక్క(సరోజిని) విప్లవోద్యమ నాయకురాలు అని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందగా ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నివాళులర్పించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ సీతక్క సీని యర్ నేత ధర్మన్న జీవిత సహచరి కాగా, 15 ఏళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో బయట ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు సభ్యులు జి.రామ య్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, సీహెచ్.శిరోమణి, టీ ఝాన్సీ, పి శోభ, శివకుమార్, కొత్తపల్లి రేణుక, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయల రవికుమార్, న్యాయవాది కందాల క్రాంతికుమార్తో పాటు పోటు శ్రీనివాస్, గంగసాని కృష్ణ, రమాదేవి తదితరులు కూడా సీతక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. గురుకులంలో ఎలుకల కాటుఆరుగురు విద్యార్థినులకు గాయాలు సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం అడవిమల్లెలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్లో నిద్రిస్తు న్న ఆరుగురు విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు మంగళవారం ఈ విషయాన్ని చెప్పడంతో లంకాసాగర్ పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. అయితే, గురుకుల హాస్టల్లో ఎలుకల బెడద కొత్తేమీ కాదని, గతంలోనూ పలువురిని కరిచినా నివారణ చర్యలు చేపట్టలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఎలుకల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రశ్నించే వారంతా కమ్యూనిస్టులే...
జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రశ్నించే ప్రతీ గొంతుక కమ్యూనిస్టుదేనని.. సమాజ మార్పునకు ఎర్రజెండానే దిక్సూచిగా నిలుస్తూ ప్రజలను కమ్యూనిస్టులు చైతన్యపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సీపీఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం సుజాతనగర్, జూలూరుపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సభల్లో సాంబశివరావు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మత విద్వేషాలు రెచ్చిగొట్టి కాలం గడుపుతుందని ఆరోపించారు. దేశ సంపదంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాగా, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యాన ప్రజాసామ్యం, రాజ్యాంగబద్దమైన హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు. కాగా, జూలూరుపాడు మండలం నుంచి యాత్ర చండ్రుగొండ మండలానికి చేరగా పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా మాట్లాడారు. గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించే ముందు స్థానిక భూములకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, మండలంలోని వెంగళరావు ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేసి మూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నారు. పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారి శ్రీనివాసరావు మృతి బాధాకరమే అయినా, దీన్ని బూచిగా చూపించి పోడుదారులపై దౌర్జన్యాలు, దాడులు చేయటం సరికాదని పేర్కొన్నారు. యాత్రలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, సరిరెడ్డి పుల్లారెడ్డి, చండ్ర నరేంద్రకుమార్, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, డి.వెంకన్న, భూక్యా దస్రు, భూక్యా శ్రీనివాస్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, హన్మంతరావు, లక్ష్మీకుమారి, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాచైతన్య యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
గిరిజన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
భద్రాచలంఅర్బన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో జీపీఎస్, ఏపీఎస్, ఏహెచ్ఎస్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్దీపకం వర్క్బుక్–3పై ఇచ్చే శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిలో నైపుణ్యాలను బలోపేతం చేయాలని తెలిపారు. గతంలో ఉద్దీపకం వర్క్బుక్–1, 2 ద్వారా విద్యార్థుల చదువులో మెరుగుదల కనిపించిందని, వర్క్బుక్–3లో ఇంగ్లిష్, గణితం, తెలుగు అంశాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, రోబోటిక్స్, భారతీయ సంస్కృతి, వ్యవసాయం తదితర అంశాలను చేర్చినట్లు చెప్పారు. జీపీఎస్ల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయుల్లో ప్రతినెలా ఇద్దరిని సన్మానిస్తామని తెలిపారు. కాగా, వర్క్బుక్పై గేయం రచించిన మణుగూరు మండలం ఇప్పలసింగారం జీపీఎస్ ఉపాధ్యాయుడు రాఘవేంద్రను పీఓ అభినందించారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఏటీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
హర్ ఘర్ తిరంగా !
చుంచుపల్లి/కొత్తగూడెం అర్బన్: పెద్దసంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు చేబూని కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. బీజేపీ ఆధ్వర్యాన ’హర్ ఘర్ తిరంగా’ పేరుతో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొనగా పోస్టాీఫీస్ సెంటర్ వద్ద మొదలై ప్రకాశం బస్టాండ్ సెంటర్, సూపర్బజార్, గణేష్టెంపుల్, ఓల్డ్ డిపో, గోధుమవాగు మీదుగా లక్ష్మీదేవిపల్లి వరకు కొనసాగింది. ర్యాలీ జరుగుతున్న సమయాన ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులు స్వచ్ఛందంగా దారి ఇచ్చి దేశభక్తిని చాటుకోవడం విశేషం. తొలుత ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, కిసాన్మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశభక్తిని చాటడమే కాక వికసిత భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ సంకల్పాన్ని చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. నాయకులు జాటోత్ వెంకన్న నాయక్, భోగి కృష్ణ, బిక్షపతి, గోపి, కోల హరీష్, నరేష్,పుణ్యా నాయక్, మురళి, చెరుకు భాగ్యలక్ష్మి, భూక్యా దివ్యశ్రీ, సముద్రాల గాయత్రి, భూక్య స్వాతి, దుర్గా శ్రీనివాసరావు, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ -
ట్రాఫేక్ రూల్స్..!?
భద్రాచలంఅర్బన్: రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే చలానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా పోలీసులు, రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మరి అదే రహదారిపై భారీ లోడ్తో ప్రమాదకరంగా దూసుకెళ్లే లారీలు, టిప్పర్లు, ఇతర సరకు రవాణా వాహనాల విషయంలో మాత్రం అధికారులు తీసుకుంటున్న చర్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా... ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు లారీలు, ఇతర భారీ వాహనాల ప్రమేయంతో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 14న బూర్గంపాడు మండలం సారపాక ప్రాంతంలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఏన్కూర్ మండలానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ వెంగళరావు మృతి చెందాడు. ● జూన్ 19న భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ● జూలై 14న జూలూరుపాడులో యాష్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ● అదేనెల 15న బూర్గంపాడు మండల పరిధిలో గల కృష్ణసాగర్ క్రాస్రోడ్డు వద్ద పాల్వంచ మండల కేశవాపురం గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కిశోర్ కుమార్ లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. ● అలాగే, 17న ఐటీసీ లారీ యార్డులో జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సూర్యచందర్రావు మృతి చెందాడు. ● జూలై 27న దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ● ఈనెల 7న సారపాక ఐటీసీ వద్ద డ్యూటీని ముగించుకుని శ్రీరామ్ మోటార్సైకిల్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ● ఈ ఘటనలు వేర్వేరు కారణాలతో జరిగినవే అయినా భారీ వాహనాల ప్రమేయంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నందున రోడ్డు భద్రతపై సమగ్ర సమీక్ష అవసరాన్ని స్పష్టం చేస్తోంది. చర్యలు ఉన్నాయా? ద్విచక్ర వాహనదారులపై హెల్మెట్ తనిఖీలు, చలాన్లు విధించడం అవసరమే. అయితే రోడ్డు భద్రతను బైక్లకే పరిమితం చేయకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్తున్నారా, ఓవర్లోడ్ చేస్తున్నారా, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ ఉందా అనే తదితర అంశాలపై నిరంతర తనిఖీలు అవసరం. ముఖ్యంగా రాత్రివేళ నిఘా పెంచి డ్రంక్ అండ్ డ్రైవ్, నిద్రమత్తులో డ్రైవింగ్ వంటి అంశాలపై తనిఖీలు చేపట్టాలి. డ్రైవర్లు ఎక్కువ గంటలు విశ్రాంతి లేకుండా వాహనాలు నడుపుతున్నారా అనేది కూడా పరిశీలించాలి. ముందస్తు చర్యలతోనే ఫలితం ప్రమాదం జరిగిన తర్వాత కేసు నమోదు చేయడ, వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం చట్టపరమైన ప్రక్రియ. కానీ ప్రమాదం జరగకముందే స్పందించడమే రోడ్డు భద్రతకు కొలమానం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పోలీసులు, రవాణా, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. రోడ్డు భద్రత అంటే చలాన్ల సంఖ్య పెంచడం కాదు.. ప్రమాదాల సంఖ్య తగ్గించడం. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న భారీ వాహన ప్రమాదాలు చూస్తుంటే.. రోడ్డు భద్రత ద్విచక్ర వాహనాలకేనా? అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. హెల్మెట్ తనిఖీలతో పాటు భారీ వాహనాలపై కూడా కఠిన నిఘా పెట్టాలి. అతివేగం, ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే అడ్డుకోవడమే నిజమైన రోడ్డు భద్రత. రోడ్డు భద్రత.. ద్విచక్ర వాహనాలకేనా? -
పూర్తయింది... సర్!
అన్ని కేటగిరీలు కలిపి... బీఎల్ఓలకు అందిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను సోమవారం అర్ధరాత్రికల్లా పూర్తిచేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో డబుల్ ఎంట్రీ, మృతి చెందిన, అందుబాటులో లేని వారు, ఇతరులు కలిపి 1,32,785 మంది ఉండగా వీరి ఓట్లు జాబితా నుంచి తొలగించనున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత జాబితాను మ్యాపింగ్ చేసిన బీఎల్ఓలు, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. ఈమేరకు 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పారాలు పంపిణీ చేస్తే, సోమవారానికి 8,63,413 పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. 2002 జాబితాతో పోలిస్తే 78,253 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ జరగకపోగా, ఇతరత్రా కారణాలతో ఇంకొందరు ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. 13 మండలాల్లో 90 శాతానికిపైగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 86.67 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారు. అయితే, ఏ మండలంలో కూడా 100 శాతం పూర్తయిన దాఖలాలు కనిపించలేదు. మొత్తంగా అశ్వారావుపేట నియోజకవర్గం 90.36 శాతంతో మొదటి స్థానాన నిలవగా, భద్రాచలం నియోజకవర్గం 87.02 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక అత్యల్పంగా ఇల్లెందు 85.39 శాతమే నమోదైంది. ఐదు నియోజకవర్గాల్లో మృతులు 31,187 మంది కాగా, వలస వెళ్లినవారు 78, 253 మంది, డబుల్ ఎంట్రీ ఓటర్లు 14,305 మంది, అందుబాటులో లేనివారు 8,733 మంది, ఇతరులు 307 చొప్పున ఉన్నారు. మండలాల వారీగా వాజేడు టాప్ జిల్లాలోని 23 మండలాలతో పాటు ఇక్కడి నియోజకవర్గాల పరిధి మండలాలు ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనగుతున్నాయి. ఈ మేరకు మొత్తం 13 మండలాలలో 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయింది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉండి ములుగు జిల్లాలో కొనసాగుతున్న వాజేడు మండలం 94.17 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని సుజాతనగర్ 93.89 శాతంతో దక్కించుకుంది. ఆ తర్వాత అన్నపురెడ్డిపల్లి మండలంలో 93.04 శాతం, దుమ్ముగూడెం 92.35 శాతం, ములకలపల్లి 92.34 శాతం, చంద్రుగొండ 92.29 శాతం గుండాల 92.15 శాతం, ఆళ్లపల్లి 91.93 శాతం, పాల్వంచ 91.82 శాతం, కరకగూడెం 91.37 శాతం, దమ్మపేట 90.87 శాతం, చర్ల 90.69 శాతం, వెంకటాపురం 90.13 శాతం చొప్పున డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక అత్యల్పంగా భద్రాచలం మండలంలో 73.66 శాతం, ఇల్లెందు మున్సిపాలిటీలో 76.58 శాతం, మణుగూరు 77.87 శాతమే అయింది. కాగా, డిజిటలైజేషన్ చేసిన వాటిలో మ్యాపింగ్ కాని వారు, ఇతర అభ్యంతరాలు తెలిపే వారికి ఈనెల 17 నుంచి నోటీసులు జారీ చేస్తారు. పుట్టిన తేదీని అనుసరించి కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, తల్లిదండ్రుల సర్టిఫికెట్లతో సమర్పిస్తే అర్హతల ఆధారంగా ముసాయిదా జాబితాలో చోటు కల్పిస్తారు. జిల్లాలో 45 రోజుల పాటు నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్) తొలి విడత విజయవంతమైంది. బీఎల్వోలు, అధికారులు సమన్వయంతో శ్రమించి పొరపాట్లు జరకుండా 86.67శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటర్లు బాధ్యతగా జాబితా పరిశీలించి ఓటుహక్కు నిర్ధారించుకోవాలి. ఎస్ఐఆర్లో భాగస్వాములైన ఉద్యోగులందరికీ అభినందనలు. – అంకిత్, కలెక్టర్‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదేరోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాక అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీంతో ‘సర్’ ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాలో 1,32,785 ఓట్ల తొలగింపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బీఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చే గడువు సోమవారంతో ముగియగా డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 8,63,413 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా 86.67 శాతంగా నమోదైంది. తద్వారా 1,32,785 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. –చుంచుపల్లి -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు పసుమర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు చారిత్రక ఆనవాళ్లు కలిగిన పరుపు బండలుఽ ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని సంరక్షించాలని కోరారు. -
‘పీఎం విశ్వకర్మ’తో చేతివృత్తుల అభివృద్ధి
చుంచుపల్లి: చేతి వృత్తుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం దోహదపడుతుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కొత్తగూడెంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉమ్మడి జిల్లా లబ్ధిదారుల సదస్సుకు జిల్లా కోఆర్డినేటర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ మాట్లాడారు. దేశంలోని చేతి వృత్తుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పీఎం మోడీ పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టారని తెలిపా రు. భారతపౌరులై ఉండి, సంప్రదాయ చేతి వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారికి శిక్షణ, పనిముట్లు, రుణ సదుపాయాలు అందుతాయని చెప్పారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడగా.. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, నాయకలు పైడిపాటి రవీందర్, సీతారాంనాయక్, శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు, నరసింహారావు, కనుకుంట్ల రాజమౌళి, క్రాంతి, భూక్య రాజేష్నాయక్, గూడ విజయ, భూక్యా పూర్ణ, గుమలాపురం సత్యనారా యణ, ఆదిమూల రాములు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ -
హైవే అభివృద్ధి ప్రతిపాదనపై పరిశీలన
చుంచుపల్లి/ఇల్లెందు రూరల్: జిల్లా మీదుగా ప్రతిపాదిత జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ శాఖకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.యువరాజ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రతిపాదిత జాతీయ రహదారి అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించి మాట్లాడారు. ఎన్హెచ్–930పీలో నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు రహదారిని రెండు, నాలుగు లేన్ల అభివృద్ధి చేసే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 78.1804 హెక్టార్ల అటవీ భూమి కేటాయించి, 9వేల చెట్లు తొలగించేలా ప్రతిపాదనల్లో పొందుపర్చారని చెప్పారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతం, భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ బీమానాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఇల్లెందు ఎఫ్డీఓ కరుణాకరాచారి, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సంఘాల నాయకులు అరెస్ట్
రుద్రంపూర్: కొత్తగూడెం పట్టణంలో సోమవారం జైల్భరో కార్యక్రమం నిర్వహించగా, ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘాల రాష్ట్ర బాధ్యులు పోతినేని సుదర్శన్రావు, ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మి కుల హక్కులపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీ జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, నరాటి ప్రసాద్, సీతారామయ్య, గోపాలరావు, అన్నవరపు సత్యనారాయణ, కెచ్చర్ల రంగారెడ్డి, పూర్ణచందర్ రావు, జలీల్, చంద్రారెడ్డి, బ్రహ్మాచారి పాల్గొన్నారు. కొండచిలువ కలకలంబూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో సోమవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానిక మసీదులో కొండచిలువ కని పించడంతో భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ శ్రీనివాస్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని, అనంతరం సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తల్లీ బిడ్డలను వేరుచేసిన పంచాయితీ!పోలీసులను ఆశ్రయించిన అమ్మమ్మ మణుగూరు టౌన్: పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ తల్లీబిడ్డలను వేరుచేసేలా ఉండటంతో ఓ మహిళ తన మనవళ్లతో కలిసి న్యా యం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు కవిత కథనం ప్రకారం... కవిత కూతురు హేమలతకు వివాహం జరగ్గా ఇద్దరు మగపిల్లలున్నారు. ఏడు నెలల క్రితం అల్లుడు మృతి చెందాడు. ఈ క్రమంలో హేమలతకు ముత్యాలమ్మనగర్కి చెందిన రామకృష్ణతో ఉన్న పరిచయంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసి హేమలతను మందలించింది. కాగా, ముత్యాలమ్మనగర్ గ్రామపెద్దలు, సర్పంచ్లు సోమవారం పంచా యితీ పెట్టి హేమలత, రామకృష్ణలకు వివా హం చేయాలని నిర్ణయించారు. పిల్లలను తానే సాకాలని ఒత్తిడి చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. కనీస రక్షణ చర్యలు శూన్యం!భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల్లోనిర్మాణ సంస్థ ప్రతినిధులు కనీస రక్షణ చర్యలు పాటించటం లేదు. కార్మికుల ప్రాణాలను గాలికొదిలేసి పనులను చేయిస్తున్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంపై ఐరన్ షెడ్ను తొలగించే క్రమంలో ఓ కార్మికుడిని జేసీబీ యంత్రంపై ఉంచి పని చేయించారు. హెల్మెట్ ధరించకుండా, రోప్ ఆధారం లేకుండా కార్మికులు ఐరన్ షెడ్ను తొలగించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ భద్రతా చర్యలు తీసుకునేలా చూడాలని పలువురు కోరుతున్నారు. టిప్పర్, ట్రాక్టర్ సీజ్అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ టిప్పర్, ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయా తీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి గోదావరి ర్యాంప్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టిప్పర్లో దమ్మపేట మండలం అంకంపాలేనికి తరలిస్తుండగా మార్గమధ్యలోని అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి శివారులోవాహనాన్ని పట్టుకున్నా రు. అలాగే మండలంలోని అనంతారం గ్రామ శివారులో వాగు నుంచి అనుమతి లేకుండా ట్రా క్టర్లో ఇసుక అశ్వారావుపేటకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్లు, యజ మానులతోపాటు ఇసుకవినియోగదారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
చెరువులోకి చేప..
● ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ కసరత్తు ● రూ.116 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ● 742 చెరువుల్లో కోటి 80 లక్షల చేప పిల్లలు వదలాలని లక్ష్యం పాల్వంచరూరల్: ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మత్స్యశాఖ అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి చేపపిల్లల పంపిణీ ఉంటుందో ఉండదోనని మత్యకారులు ఒకింత ఆందోళన చెందారు. ఈ తరుణంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు, రొయ్యల పంపిణీకి రూ.116 కోట్ల మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది. 81 మత్స్యపారిశ్రామిక సంఘాలు.. మత్స్య శాఖ గతేడాది 532 చెరువుల్లో కోటి 32 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసింది. ఈ ఏడాది కోటి 80 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 35 నుంచి 40 ఎంఎం సైజువి 53 లక్షలు, 80 నుంచి 100 సైజు కలిగినవి కోటి 27 లక్షల చేప పిల్లలను 742 చెరువుల్లో వదలాలని నిర్ణయియించారు. ఇందులో పెద్ద చెరువులు 83, చిన్న చెరువులు 659 ఉండగా, జిల్లాలోని 81 మత్స్యపారిశ్రామిక సంఘాల్లో 3,500 మంది సభ్యులు ఉన్నారు. అదును దాటాక పోస్తే చేప ఎదగదు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ గతేడాది కూడా నవంబర్లో జరిగింది. దీంతో చేపలు ఎదగక మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ సారి కూడా ఆలస్యం చేయకుండా చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అప్పుడే తమకు ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు. బొచ్చె, రవ్వ, శీలావతి బొచ్చె, రవ్వ, శీలావతి మూడు రకాల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను సీడ్ సరఫరాకు జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 17వ తేదీలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 742 చెరువుల్లో కోటి 80 లక్షల చేపపిల్ల లను ఉచితంగా పంపిణీ చేస్తాం. 35 నుంచి 40 ఎంఎం చేపపిల్లలకు రూ.61, 80 నుంచి 100 ఎంఎం సైజు పిల్లలకు రూ.1.60 చొప్పున ధరలను నిర్దేశించాం. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటివారంలో చేప పిల్లల పంపిణీ పూర్తి చేస్తాం. కిన్నెరసాని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో 8 లక్షల సీడ్ను ఇటీవల పోశాం. వాటిని కూడా సొసైటీలకు అందజేస్తాం. –శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
రెవెన్యూ.. అక్రమాలు
వివాదంలో ఉన్నా.. జిల్లాలో సమగ్ర భూ సర్వే కింద కాకరవాయి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. గ్రామంలోని మొత్తం భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయగా.. భూమి వివరాలు పరిశీలంచుకోవాలని రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇదేగ్రామంలో ఓ భూమిపై వివాదంలో ఉండడం, కోర్టు పరిధిలో కేసు కొనసాగుతుండగా అది తేలేవరకు ఎలాంటి లావాదేవీలు జరపొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వివాదంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదేమిటని వారసులు అడిగితే కోర్టులో ఉందనే విషయం తమకు తెలియదంటూ దాటవేసినట్లు సమాచారం. నిబంధనలన్నీ బేఖాతర్ కాకరవాయికి చెందిన ఓ వ్యక్తి భార్యకు పసువు కుంకుమ కింద ఆమె తల్లిదండ్రుల నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ దంపతులకు ఉన్న ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. మిగిలిన ఇద్దరిని వివాహాలు జరిగాయి. సదరు వ్యక్తి భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఆమె పేరిట ఉన్న భూమిని తన పేరుపైకి మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, భూమి పంపకాలపై అప్పటికే కోర్టులో కేసు ఉండగా, విషయాన్ని వారసుల్లో ఒకరు తిరుమలాయపాలెం తహసీల్దార్, కూసుమంచి రిజిస్ట్రార్, ఖమ్మం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక భార్య పేరిట ఉన్న భూమిని మార్చాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా కోర్టు ఉత్తర్వులు ఉండాలి. అంతేకాక కుటుంబ సభ్యుల ఆధార్కార్డులు ఉండాలి. కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్లో కూతుర్ల పేరు లేకుండా.. కేవలం సదరు వ్యక్తి పేరు మాత్రమే ఉంది. ఇక భూబదలాయింపు సమయాన ఇద్దరు కూతుర్లకు సమాచారం ఇవ్వకపోగా అభ్యంతరా లను స్వీకరించలేదు. ఆయన అన్ రిజిస్టర్డ్ వీలునామా సమర్పించినా అధికారులు చట్టబద్ధతపై విచారణ చేయలేదు. ఆపై రెండు నెలల క్రితం ఆయన పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత అదే నెలలో ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరిట కొంత, ఇతర వ్యక్తుల పేరుపై కొంత రిజిస్ట్రేషన్, జీపీఏ చేపించాడు. ఇవన్నీ ఒకే రోజు చేయడం విశేషం. కాకరవాయికి చెందని ఓ వ్యక్తి తన భార్య చనిపోయిందని, ఆమె రాసిన వీలునామా ప్రకారం భూమిని తన పేరిట మార్చాలని కోరాడు. కుటుంబంలో ఓ కూతురితో వివాదం ఉందని మొదట నా దృష్టికి రాలేదు. ఈ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ప్రస్తుతం అవి అమల్లో(ఫోర్స్) లేవు. వివాదం తెలియగానే లావాదేవీలు, బదిలీలను పూర్తిగా హోల్డ్లో పెట్టాం. కాకరవాయి పరిధిలో రీ–సర్వే పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు, బదిలీలు జరగవు. – లూథర్ విల్సన్, తహసీల్దార్, తిరుమలాయపాలెంభూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించగా కొందరు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరమైన పత్రాలను పరిశీలించకుండానే ఇటీవల ఓ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయగా, ఇదేమిటని అడిగితే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని సర్దిచెప్పారని సమాచారం. చాలాచోట్ల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.రైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం భూసమస్యలకు పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చారు. గతంలో ఉన్న ధరణిలో చాలా భూములు నిషేధిత జాబితాలో పడడంతో రైతులు క్రయవిక్రయాలకే కాక రిజిస్ట్రేషన్ల సమయంలోనూ అవస్థ పడ్డారు. అయితే, ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొచ్చినా రైతుల ఇక్కట్లు తీరడం లేదు. పీఓబీ, ఇతర సమస్యలతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా, ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేకు చాలావరకు ఇటువంటి సమస్యలే వస్తున్నాయి. భూ భారతి చట్టం, నిబంధనలు తూచ్ గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొత్త చట్టంలోని నిబంధనలను విస్మరిస్తున్న కొందరు అధికారులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇటీవల మృతి చెందిన మహిళ పేరిట ఉన్న భూమిని వారసుల అంగీకారం లేకుండానే ఆమె భర్త పేరిట చకచకా రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగు చూసింది. అంతకుముందే వారసులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చినా పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. భూముల రీసర్వేకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఈ ఘటన చోటుచేసుకోగా వారసుల్లో ఒకరు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. – సాక్షి ప్రతినిధి,ఖమ్మం -
బాడీబిల్డింగ్ చాంపియన్షిప్
ఖమ్మంలో సౌత్ ఏషియా ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక 17వ సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్షిప్ టోర్నీ నిర్వహణకు ఖమ్మంను వేదికగా ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టులో ఈ టోర్నీ జరగనుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఖమ్మంలో టోర్నీ నిర్వహించాలని సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి వినతిపత్రం అందించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేశ రాజధానులకే పరిమితమయ్యే అంతర్జాతీయ స్థాయి పోటీలు ఖమ్మంలో జరగనుండగా.. భారత్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి 150 మంది క్రీడాకారులు, 300 మంది టెక్నికల్ అధికారులు హాజరవుతారని ఎంపీ తెలిపారు. సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ేఫెడరేషన్ జనరల్ బాడీ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నన్న నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు స్వామి రమేష్ తన దృష్టికి తీసుకురాగా కేంద్ర క్రీడల మంత్రికి వివరించడంతో సానుకూలంగా స్పందించారని వివరించారు. ‘పీఎం – సేతు’ హబ్ కేటాయించాలని వినతి ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాకు ‘పీఎం–సేతు’ హబ్ కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతాలకే ఐటీఐల ఆధునీకరణ పరిమితం చేయకుండా, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఐటీఐని హబ్గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను అనుసంధానించాలని కోరారు. అంతేకాక ఖమ్మంలో మిరప ప్రాసెసింగ్, ఫుడ్–ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ – మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాక ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వినతితో కేంద్ర క్రీడల మంత్రి సానుకూల స్పందన -
పాత కేసులో కొత్త కలప?
దమ్మపేట: అటవీశాఖ అధికారుల తీరుపై కంచే చేను మేసిన చందంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు పాత కేసు వివరాలు అడిగితే, రికవరీ చూపేందుకు మళ్లీ కలప దుంగలు నరికించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలోని కొండరెడ్ల గ్రామం పూసుకుంట గ్రామ పంచాయతీ వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే రెండు రోజుల క్రితం అటవీ చెట్ల దుంగలు పడి ఉండటం వెలుగుచూసింది. వాటిని పరిశీలిస్తే ఇటీవల నరికిన పచ్చి దుంగల మాదిరిగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం దుంగలు అయితే చెదలు పట్టి పాడై పోయేవని పేర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి పూసుకుంట అటవీ నుంచి దుంగులను తెప్పించి పాత కేసుకు సంబంధించిన నంబర్లను రాయించారని తెలుస్తోంది. దుంగలపై 12 నుంచి 60 వరకు నంబర్లు రాసి ఉండగా, మొత్తం 33 మారుజాతి కలప దుంగలు ఉన్నాయి. వీటి విలువ రూ. లక్షకు మించే ఉండవచ్చని అంచనా. పాత కేసులో ఏం జరిగిందంటే? 2025 ఆగస్టులో అటవీ ప్రాంతంలో చెట్లను తొలగిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసి దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి, రూ. లక్ష జరిమానా విధించినట్టు సమాచారం. అక్కడ పట్టుకున్న కలప దుంగలను పాల్వంచ టింబర్ డిపోకు తరలింంచాల్సి ఉండగా, తరలించలేదు. ఇటీవల ఆ కేసు గురించి ఉన్నతాధికారులు ప్రశ్నించడంతో హడావిడిగా అదే ప్రాంతంలో చెట్లను నరికించి, దుంగలకు గత కేసుకు సంబంధించిన నంబర్లను రాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల నరికినట్టుగా పచ్చిదనం కనిపిస్తున్న దృశ్యంపూసుకుంట అటవీ పరిధిలోని వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ఉన్న అటవీ కలప దుంగలకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందితో మాట్లాడాక వెల్లడిస్తాం. –శ్రీనివాస్, దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి -
అమృత్ ఆలస్యం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అమృత్ భారత్ నిధులతో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల తీరు చూస్తుంటే ఇల్లు తీసేసి పందిరివేసిన చందంగా మారింది. మూడేళ్లు గడిచినా ఏ ఒక్క పనీ పూర్తి కాలేదు. స్టేషన్ రూపు రేఖలు మారుస్తామనే ప్రభుత్వ ప్రకటన చివరకు ప్రతి కూల ఫలితాలు చూపుతోంది. మూడేళ్ల క్రితం మొదలు అమృత్ భారత్ పథకం కింద భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) స్టేషన్ అభివృద్ధికి రూ.25.41కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. ఈ పనులను 2023 ఆగస్టు 6న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. స్టేషన్కు కొత్త ఆర్చ్, పోర్టికో నిర్మించి, సర్క్యులేటింగ్ ఏరియాను అభివృద్ధి చేయాల్సి ఉంది. ర్యాంప్, ఎస్కలేటర్, లిఫ్టులు అందుబాటులోకి తేవాల్సి ఉంది. వీటితోపాటు ప్లాట్ఫామ్స్పై ఉన్న కొత్త టాయిలెట్ల నిర్మాణం, పాత టాయిలెట్ల ఆధునికీకరణ, కొత్త పైకప్పు, ఎల్ఈడీ కోచ్ ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనుల కోసం స్టేషన్లో ఉన్న పాతనిర్మాణాల్లో చాలావాటిని తొలగించా రు. అదే వేగం నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కనిపించడం లేదు. ఫలితంగా స్టేషన్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సగం పనులే పూర్తి మూడేళ్ల క్రితం మొదలైన అమృత్ భారత్ పనులు ఇప్పటివరకు 50నుంచి 60 శాతమే పూర్తయ్యాయి. నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో స్టేషన్కు వచ్చి పోయే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాట్ఫారమ్పై కోచ్ ఇండికేటర్లు లేక స్లీపర్, ఏసీ బోగీలు ఎక్కడ ఉన్నాయో తెలియక తికమక పడుతున్నారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఈ చివర నుంచి ఆ చివరకు నడవలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్ హాల్స్, క్యాంటీన్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో పుణ్యక్షేత్రమైన భద్రాచలం నుంచి రాకపోకలు సాగించే భక్తులు కొత్తగూడెం రైల్వేస్టేషన్లో అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలి పెరిగినా, వర్షం కురిసినా మహిళలు, పిల్లల బాధ చెప్పనలవికానివిగా ఉంటున్నాయి. ఈ ఇక్కట్లకు తాళలేక అమృత్ భారత్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్లకు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం ఎదురవుతోంది. అయినా రైల్వేశాఖ నుంచి స్పందన రావడం లేదు. అమృత్ భారత్ పనుల పరిస్థితి అలా ఉంటే కొత్తగా ఇక్కడ పుష్కరాల పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్/జూలైలో జరగబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంరోడ్ స్టేషన్లో భక్తులు బస/విశ్రాంతి/విచారణ కేంద్రాలు/హెల్ప్లైన్/ రద్దీ నియంత్రణ వంటి పనులకు ప్రణాళిక సిద్ధమైంది. స్టేషన్లో డౌన్లైన్కు ఎడమ వైపు, న్యూ గొల్లగూడెం దిశలో ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్, నేల చదును పనులు మొదలయ్యాయి.అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం -
మణుగూరులో మెగా ఓసీ?
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గని (కేపీయూజీ) రానున్న రోజుల్లో మెగా ఓసీగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కేపీయూజీ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గుకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే ఉత్పత్తికి తరచూ అవాంతరాలు ఏర్పడటం, ప్రారంభం నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర రాకపోవడంతో పీకేఓసీ–2 డిప్ సైడ్, కేపీయూజీని కలిపి మెగా మైన్గా మార్చాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓసీ–2, ఓసీ–4ను కలిపి పీకేఓసీగా పిలుస్తుండగా, ఓసీ–2 డిప్ సైడ్ సైతం తాజాగా సింగరేణికి దక్కింది. దీంతో కేపీయూజీ, ఓసీ–2కు మధ్య ప్రవహించే గొర్రెపేట వాగును కేపీయూజీకి ముందు భాగానికి మళ్లించి, ఇప్పుడున్న గొర్రెపేట వాగును, కొండాపురం భూగర్భగనిని, ఓసీ–2 డిప్సైడ్ను కలిపి మెగా ఓసీగా మార్చాలని భావిస్తున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖకు ప్రతిపాదనలు, పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2016లో ప్రారంభం 2016లో కేపీయూజీ ప్రారంభించారు. ఏడాదికి 5 లక్షల టన్నుల చొప్పున 20 ఏళ్లపాటు బొగ్గు వెలికితీయాలని నిర్ణయించారు. నాణ్యమైన జీ–6 బొగ్గు ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు పొరల్లో అవాంతరాలు, వేడినీటి ఉబికి రావడంతో కార్మికులు పనిచేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వెనుకంజలో ఉంది. ఈ క్రమంలో మెగా ఓసీగా మార్చాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేపీయూజీ, ఓసీ–2 డిప్ సైడ్లను కలిపి ఓపెన్కాస్టు ఏర్పాటుకు సింగరేణి కసరత్తు.. -
ల్యాబ్లు 130.. తనిఖీలు 18 చోట్లే..
● నిర్లక్ష్యం వీడని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ● ఇష్టారాజ్యంగా మెడికల్ ల్యాబ్ల నిర్వహణ ● పరీక్షలకు నిర్దేశిత ధరల కంటే అధికంగా వసూళ్లు చుంచుపల్లి: మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు, పూర్తి స్థాయి అనుమతి పత్రాలు, అర్హతా ప్రమాణాలు పాటించకుండా ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. రక్త, ఇతర పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. బయోవేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హతలు లేనివారితో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయిస్తున్నారు. అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఉదాసీనత వీడటంలేదు. తనిఖీ బృందాలు మొక్కుబడిగానే పనిచేస్తున్నాయి. రిపోర్టుల్లో పొరపాట్లు వస్తే.. జిల్లా వ్యాప్తంగా 130 మెడికల్ ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు వంటి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, షుగర్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రులు, క్లీనిక్లకు అనుబంధంగా, మరికొన్నిచోట్ల స్వతంత్రగా రక్త పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 130 ల్యాబ్లు ఉండగా, ఏడాది కాలంలో కేవలం 18 మాత్రమే తనిఖీ చేశారు. వీటిల్లో నిబంధనలు ఉల్లంఘించిన 13 ల్యాబ్లకు రూ.1.15 లక్షల జరిమానా విధించారు. మిగితా 112 ల్యాబ్లను ఎందుకు తనిఖీ చేయలేదనేది వైద్యాఆరోగ్యశాఖ అధికారులే వెల్లడించాల్సి ఉంది. పరీక్షల ఫలితాల ఆధారంగా వైద్యులు చికిత్స అందించాల్సి ఉండటంతో, ఫలితాల్లో చిన్న పొరపాటు జరిగినా రోగ నిర్ధారణ, మందుల మోతాదు, తదుపరి చికిత్సపై ప్రభావం పడే అవకాశం ఉంది. వైద్యులకు కమీషన్లు సీజనల్ జ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్గున్యా, వైరల్ జ్వరాలు వ్యాపిస్తే ల్యాబ్ల నిర్వాహకులు బాధితులను పీల్చిపిప్పి చేస్తున్నారు. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్లినా నాడీ పట్టకుండానే బీపీ, షుగర్, మూత్రపరీక్ష చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. రక్తపరీక్షలకు రూ. 1000 నుంచి రూ.5వేల వరకు బిల్లులు చేస్తున్నా రు. దీంతో కొంత వైద్యులు కూడా కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హతలేనివారితో విధులు డీఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ తదితర అర్హతలు కల్గిన వారు ల్యాబ్ ఏర్పాటుకు చేసుకునేందుకు అర్హులు. అలాగే, వివిధ శాఖల నుంచి పూర్తి స్థాయి అనుమతిపత్రాలు, తనిఖీలు పూర్తి చేశాక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీచేస్తారు. ఆ తర్వాతే ల్యాబ్ను అధికారికంగా ప్రారంభించాలి. కానీ చాలామంది అన్ని అనుమతులు రాకపోయినా అధికారులను మేనేజ్ చేస్తూ ల్యాబ్లు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ల్యాబ్ల్లో పాథాలజిస్టులు కూడా ఉండటంలేదు.మెడికల్ ల్యాబ్లను పర్యవేక్షిస్తున్నాం. నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కొందరికి జరిమానాలు కూడా విధించాం. త్వరలో మరోసారి తనిఖీలు చేపడతాం. అర్హత లేని ల్యాబ్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ తుకారాం రాథోడ్, డీఎంహెచ్ఓ -
కొత్త గనులు ఏర్పాటు చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ● చైతన్య యాత్రకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం సంఘీభావం సూపర్బజార్(కొత్తగూడెం)/టేకులపల్లి: టేకులపల్లి ప్రాంతంలో నూతన బొగ్గు భూగర్భ గనులు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డిమాండ్ చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టేకులపల్లి సభ నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి కార్మికప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. ఆటా పాటలతో ఉత్సాహంగా యాత్ర సగగా, సీతారాంపురం, లాలుతండా, కారుకొండ, రైల్వే స్టేషన్ సెంటర్, ఎంజీ రోడ్డు, భజనమందిర్ రోడ్, సింగరేణి హెడ్డాఫీస్, ఎస్సీబీ నగర్, రామవరం, 3 ఇంకై ్లన్, 4 ఇంకై ్లన్, రుద్రంపూర్, గౌతంపూర్, పెనగడప సెంటర్లలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు సాగుదారులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని సూచించారు. కొత్తగూడెం ప్రాంత అభివృద్ధిని గాడిలో పెట్టింది సీపీఐ మాత్రమేనని అన్నారు. పంటరుణాలు, రైతు భరోసా రాకపోవ డం వల్ల అంబసత్రం రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. కొత్తగూడెంలో క్రమబద్ధీకరణ జీఓ 76ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పొజిషన్ సర్టిఫికెట్లు జారీచేయాలని కోరారు. కాగా, టేకులపల్లి సభకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మచ్చా శ్రీనివాస్, గుగులోత్ రామ్చందర్, నాగార్జునాచారి, డేగల రమేష్, గుగులోత్ సోని, జయమ్మ పాల్గొన్నారు. -
వరుణయాగంలో భద్రగిరి బృందం
భద్రాచలం: వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నాగార్జున సాగర్లో సోమవారం నిర్వహించిన వరుణ యాగంలో భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి చెందిన అర్చక, ఉద్యోగ బృందం పాల్గొంది. అర్చకులు స్వామివారి తరఫున లాంఛనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ హనుమంతురావుకు రామయ్య ప్రసాదాలను అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి యాగం విశేషలను, ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబాతో పాటుగా అర్చకులు పాల్గొన్నారు. మనోహరం.. రామయ్య కల్యాణం రామయ్య కల్యాణం మనోహరంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్టేడియం ప్రాంగణంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పాల్వంచలోని బాపూజీ నగర్కు చెందిన కట్టెకోల యాదగిరిరావు రూ.లక్ష విరాళం అందించారు. ఈఓ దామోదర్రావు వారికి రశీదును అందచేశారు. -
నందీశ్వరస్వామికి అభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం అర్చకులు శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లు నిర్వహించారు. నేడు రుద్రహోమం మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 1,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు. రేక్ పాయింట్కు 2,635 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,635.47 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,275.47 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 660 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. పార్ట్టైం విధానంలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైం విధానంలో భర్తీ చేయనుండగా, అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ, పీజీలో 55శాతం మార్కులు కలిగి ఉండి, బీఈడీ, టెట్ ఉత్తీర్హులైన వారు అర్హులని పేర్కొన్నారు. మహిళా విభాగంలో టీజీటీ(హిందీ, గణితం, బయోసైన్స్, సోష ల్), జేఎల్(బోటనీ) ఐదు పోస్టులు ఉండగా, జనరల్ విభాగంలో పీజీటీ(హిందీ, ఇంగ్లిష్, సోషల్), జేఎల్(జువాలజీ) నాలుగు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టి ఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా భద్రాచలం ఐటీడీఏలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని పీఓ తెలిపారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో.. ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. పీజీలో 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కామర్స్ ఆరు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ రెండేసి పోస్టులతో పాటు గణితం, బోటనీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఒక్కో పోస్టు భర్తీ చేస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాల్వంచ కేఎల్ఆర్ పీజీ కళాశాల ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98489 65711, 79893 25024 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. నేడు ‘పీఎం విశ్వకర్మ’ సదస్సుచుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు మంగళవారం కొత్తగూడెం క్లబ్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పీఎం విశ్వకర్మ యోజ న రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎంఎస్డీఈ డైరెక్టర్ రవికుమార్ హాజరై లబ్ధిదారులకు అందుతున్న పథకాలు, శిక్షణ, ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నా రు. ఈ సమావేశంలో నాయకులు కనుకుంట రాజమౌళి, శీలం విద్యాసాగర్, గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొన్నారు. -
వాహనాల ఫిట్నెస్.. ఆటోమేటిక్!
ఖమ్మంక్రైం: సరుకు, ప్రజా రవాణా చేసే లారీలు, బస్సులు, లైట్ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు ఇన్నాళ్లు అధికారులే ప్రత్యక్షం(మ్యాన్వల్)గా చేపడుతుండగా, ఈ విధానానికి చెల్లుచీటి పాడనున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా ఫిట్నెస్ పరీక్షించేందుకు యంత్రాలను వినియోగించనున్నారు. ఈమేరకు తొలిదశగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్)లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింధి. ఇందులో ఖమ్మం జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి కూడా చోటు దక్కడం విశేషం. మొదటి దశలోనే ఖమ్మంలో... రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37 ప్రాంతాల్లో ఏటీఎస్(ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో తొలుత 15 ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా ఇందుకోసం రూ.50కోట్లు కేటాయించారు. ఈ జాబితాలో ఖమ్మం కూడా ఉండడంతో ఇక్కడి రవాణా శాఖ కార్యాలయంలో రూ.3కోట్ల విలువైన ఆటోమెటిక్ స్టేషన్ను ఏర్పాచేస్తారు. ఫిట్నెస్ పరీక్షలు ఇలా... ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. వీటి పరిధిలోకి వాహనం వెళ్లగానే వాహనాల బ్రేక్, ఇంజన్ సామర్థాలే కాక కాలుష్య ఉద్గారాలు, ఇతర అంశాలను సెన్సార్లతో పరీక్ష పూర్తవుతుంది. ఆపై అంతా సక్రమంగా ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. అలా సర్టిఫికెట్ ఉన్న వాహనం వివరాలు నేరుగా కేంద్ర రవాణాశాఖ పరిధిలోని వాహన్ పోర్టల్లో ఆప్లోడ్ అవుతాయి. తద్వారా అవినీతికి ఆస్కారం లేకపోగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెరిగి రోడ్డు భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏటీఎస్ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రవాణాశాఖా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. యంత్రం నిర్వహణ, పరీక్షలపై రవాణా శాఖ ఉద్యోగులకు శిక్షణ ఉంటుంది. – శ్రీనివాస్, ఇన్చార్జ్ ఆర్టీఓప్రసుత్తం ఫిట్నెస్ పరీక్షలు ఎంవీఐల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలను పరీక్షించి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్నెస్ లేనట్టు తేలుతోంది. దీంతో కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్ష సరిగా నిర్వహించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో నగదు చేతులు మారుతున్నట్లు తెలుస్తుండగా, కొన్ని వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారని తెలుస్తోంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మానవ ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతోనే వాహనాల సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. -
గుండెపోటుతో మహిళా రైతు మృతి
గుండాల: గుండెపోటుతో ఓ మహిళ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని శంభుని గూడెం గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంజా రాంబాయి (48) ఉదయాన్నే లేచి చేను పనికి వెళ్లింది. సాయంత్రం రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి వెతకగా చెట్టు కింద విగత జీవిగా పడిఉంది. గుండెపోటు వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో అన్ని తానై వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లిళ్లు చేసింది. తండ్రి లేకపోగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి సాకిన తల్లి చనిపోవడంతో కూతుళ్లు కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని గ్రామస్తులు కోరారు. నార్కట్పల్లిలో రామవరం యువకుడు..రుద్రంపూర్: నార్కట్పల్లిలో ఆదివారం బైక్ ఢీకొని కొత్తగూడెం 15 డివిజన్(రామవరం)కు చెందిన యువకుడు దొంతుల నిఖిల్(24) మృతి చెందాడు. వివరాలు ఇలా.. రామవరానికి చెందిన రతన్ కొత్తగూడెంలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల కోసం తండ్రికి ఆసరాగా ఉండేందుకు నిఖిల్ నార్కట్పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం పనికి వెళ్లివస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి మృతి చెందాడు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, నల్లగొండ ప్రభుత్వఆస్పత్రిలో సోమవారం పోస్టమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
లేకపోయినా.. ఉన్నట్లే..!
ఓటరు జాబితాలో మృతుల పేర్లు కూడా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో చేపట్టిన ‘సర్’ సర్వేలో వెల్లడవుతున్నాయి. అటవీ సంపదను పరిరక్షణతో కూడిన ఆదివాసీల జీవన విధానం అందరికీ ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత చట్టాలను పరిరక్షిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఐటీడీఓ పీఓ తెలిపారు. ఉద్దీపకం వర్క్బుక్లతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపరుస్తున్నామని, ఉన్నత విద్య చదివి విద్యార్థులకు ల్యాప్టాప్లు, రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. కోయ భాష అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన గట్టు, గోత్రాలు, కట్టుబాట్లు, ఇలవేల్పుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ చందన, ఆర్సీఓ అరుణకుమారి, ఇతర అధికారులు రాంబాబు, సమ్మయ్య, ఉదయ్కుమార్, పవర్ వేణు, ప్రభాకర్రావు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ సెలవు సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ ప్రభుత్వ సెలవు ఉన్నందున జిల్లా అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ప్రజలు సమస్యల దరఖాస్తులను అందజేసేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. గిరిజన దర్బార్ కూడా..భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన గిరిజన దర్బార్ను బోనాల పండుగ సెలవు నేపథ్యంలో రద్దు చేసినట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సెలవు కారణంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు అందుబాటులో ఉండరని, గిరిజనులు వినతులు అందించేందుకు ఐటీడీఏ కార్యాలయానికి రావొద్దని సూచించారు. వరుణ యాగానికి భద్రగిరి వేదపండితులుభద్రాచలంటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ముఖ్య వైదిక సిబ్బంది, వేదపండితుల బృందం ఆదివారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ నిండాలని, తద్వారా పాడిపంటలు వర్ధిల్లి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ మహా యాగాన్ని తలపెట్టింది. హోమాలు, పూజా కార్యక్రమాల్లో భద్రాద్రి రామాలయ అర్చక స్వాములు కీలక పాత్ర పోషించనున్నారు. వేద పారాయణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులతో కూడిన వేదపండితుల బృందం తరలివెళ్లింది. కిన్నెరసానిలో పర్యాటక ఆదాయం రూ.76,070పాల్వంచరూరల్: కిన్నెరసానికి రోజురోజుకూ పర్యాటకులు పెరుగుతున్నారు. ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ప్రభుత్వానికి రూ.76,070 ఆదాయం సమకూరింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయం తదితరాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 773 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.34,850, సఫారీ వాహనాల ద్వారా రూ. 14,450 ఆదాయం లభించినట్లు వైల్ల్లైఫ్ సిబ్బంది తెలిపారు. 430 మంది బోటింగ్ చేయగా టూరిజం శాఖకు రూ.26,770 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పీజీలో నాలుగు కొత్త కోర్సులు రేక్ పాయింట్కు చేరిన కాంప్లెక్స్ ఎరువులు చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 394.800 మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువులు 723.250 మె.టన్నులతో పాటు ఎంఓపీ 255.200 మె. టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖా ధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువులను మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. -
మన్యంలో సందడి
భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిలావ్యాప్తంగా వేడుకలు జరిపారు. ర్యాలీలు నిర్వహించారు. ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. సంప్రదాయ వేషధారణ, నృత్యాలతో అలరించారు. భద్రాచలం అనంతరం గిరిజన భవన్లో నిర్వహించిన సభను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్లో ఆదివాసీ అమరులు అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లుదొర, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివాసీ జెండాను ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఐటీడీఏ సంక్షేమ పథకాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆదివాసీ వేషధారణలో పీఓ, ఎమ్మెల్యే సందడి చేశారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివాసీలతో మమేకమై నృత్యం చేశారు. సంప్రదాయ ఆభరణాలు, వెండితో తయారు చేసిన కంటె, రూపాయి మాలను ధరించారు. డోలు వాయించి, బాణం ఎక్కుపెట్టి ఆదివాసీల్లో జోష్ నింపారు. పీఓ తన కుమారుడికి కూడా ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరింపజేశారు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
శాకంబరి అవతారంలో అమ్మవారు
పాల్వంచరూరల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణలో పెద్దమ్మతల్లి, శాకంబరేశ్వరుడి అలంకరణలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వితరణ చేసిన కూరగాయలు, పండ్లు, పూలతో ఆదివారం శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారిని అలంకరించారు. ఈ అవతారంలో అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
జమలాపురంలో ఆషాఢమాస పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడమే కాక అలివేలు మంగ అమ్మవారికి సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు బోనాలు, సారె సమర్పించారు. అలాగే, అర్చకులు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్కు అభిషేకం, స్వామి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు మహిళలుగా ఎదగాలి
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: ఇందిరాగాంధీ ఐరన్ లేడీగా నిలిచిన తీరును ఆదర్శంగా తీసుకుని, ప్రతీ మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలంలోని పాత చీపురుగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన స్వయం శక్తి గ్రామ మహిళా సంఘ భవనాన్ని, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నాచారంలో రూ. కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాగుపల్లి పంచాయతీ కొత్తూరులో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. గర్భిణుల సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతచీపురుగూడెం గ్రామంలో సభ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేటలోని రింగ్రోడ్ సెంటర్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహించి, ఆదివాసీ జెండాను ఎగుర వేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆదివాసీలకు కేటాయించిన స్థలానికి రూ.25 లక్షల వ్యయంతో మంజూరైన ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల గ్రామ పంచాయతీల పరిధిలో మహిళ సంఘ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. కాకతీయుల పాలనకు వ్యతిరేకంగా సమ్మక్క, సారలమ్మ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలకు భవనాలు, వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి, స్థిర ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న 357 ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ నియామకమెప్పుడో?
● ప్రభుత్వం ఆదేశించినా అమలు చేయని అధికారులు ● పర్యవేక్షణ లేక ఫలితాల్లో ఆశ్రమ పాఠశాలల వెనుకబాటు ● గిరిజన విద్య పటిష్టతకు ఇప్పటికే పీఓ కసరత్తుభద్రాచలం: ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఉట్నూరు ఐటీడీఏలో నియామకం పూర్తి చేశారు. భద్రాచలం ఐటీడీఏలో మాత్రం నియామక ప్రక్రియ ప్రారంభంకాలేదు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉన్నాయి. గిరిజన గురుకులాలు భద్రాద్రి జిల్లాలో 21 ఉండగా, ఖమ్మం జిల్లాలో 6.. మొత్తం 27 ఉన్నాయి. ప్రధానంగా ఆశ్రమ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉండగా, ఇతర శాఖల పర్యవేక్షణ, పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ డీఈఓను నియమిస్తే ఉన్నతాధికారులకు వెసులుబాటు కలగడంతోపాటు విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వ ఆదేశాలు ఇక డీడీ ఉద్యోగ విరమణ, బదిలీ జరిగితే ఇన్చార్జి లతో కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏల్లో డిప్యూటీ డీఈఓలను నియమించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించింది. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన సీనియర్ ప్యానెల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులను డిప్యూటేషన్ పద్ధతిలో ఎంపిక చేయాలని జీఓ కూడా విడుదల చేసింది. ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా కార్యక్రమాలు వంటి బాధ్యతలు నిర్వర్తించాలని జీఓలో పేర్కొంది. అయితే ఐటీడీఏ అధికారులు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా అలసత్వం వీడలేదు. పీఓ చొరవ చూపాలని.. గిరిజనాభివృద్ధికి, ప్రాథమిక స్థాయిలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రస్తుత ఐటీడీఈ పీఓ రాహుల్ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఉద్దీపకం ప్రాక్టీస్ బుక్లను రూపొందించారు. 1వ తరగతి నుంచే విద్యార్థులతో అభ్యాసనం చేయిస్తుండటంతో చిన్నారుల నైపుణ్యం మెరుగుపడుతోంది. కెరీర్ గైడెన్స్, వంద శాతం ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక వంటివి అమలు చేస్తున్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టు అందుబాటులోకి వస్తే పీఓ, డీడీపై భారం తగ్గుతుందని, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలపై పర్యవేక్షణ పెంచి, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. పీఓ దృష్టి సారించాలని కోరుతున్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పీఓ అనుమతితో ప్రక్రియ ప్రారంభమైంది. నియమ, నిబంధనలను త్వరలో విడుదల చేసి పారదర్శకంగా భర్తీ చేస్తాం. గిరిజనాభివృద్ధికి పాటుపడతాం. –చందన, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏగతంలో భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన సమయంలో ఈ పోస్టును జిల్లా డీఈఓ పోస్టుగా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్ని రకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతో ఐటీడీఏలో ఏజెన్సీ డీఈఓ పోస్టు మాయమైంది. చివరిగా 2016లో ఇన్చార్జి ఏజెన్సీ డీఈఓగా రవీందర్ బాబు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఆపన్నహస్తం అందించరూ..
పాల్వంచరూరల్: రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి గిరిజన విద్యార్థులకు వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఎడమ తొడ ఎము క, కుడిచేతి మణికట్టు, నోటి దవడ ఎముకలు విరిగాయి. శస్త్రచికిత్సకు అవసరమైన ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా డు. పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన జి.వాసు పాల్వంచ మండలం కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో వాలీబాల్ కోచ్గా 2023 నుంచి పనిచేస్తున్నాడు. ఆయన శిక్షణలో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. ఆయన గత మంగళవారం కొత్తగూడెం నుంచి పాల్వంచ బైక్పై వస్తుండగా కలెక్టరేట్ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు ఆర్థిక స్థోమత లేక దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. సాయం అందించాలనుకునేవారు.. ఎస్బీఐ: జి.వాసు ఖాతా నంబర్ 20201293986, సీఐఎఫ్ నంబర్ 87060945729, ఐఎఫ్ఎస్సీ నంబర్: ఎస్బీఐఎన్0016563 లేదా.. 90926 54891 నంబర్లో సంప్రదించాలని కోరారు. చోరీకి గురైన బైక్లు లభ్యంగుర్తించిన స్థానికులు భద్రాచలంఅర్బన్: చోరీకి గురైన ద్విచక్రవాహనం కోసం వెతుకుతుండగా.. మూడు బైక్లు దొరికిన ఘటన భద్రాచలం సరిహద్దులోని వెంకట్రెడ్డిపేట వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పోయిన బైక్ కోసం బాధితులు వెతుకుతుండగా మూడు బైక్లు కపించాయి. అక్కడ ఇద్దరు యువ కులు ఉండగా స్థానికులు ప్రశ్నించడంతో పరారయ్యారు. స్థానికులు ఆ యువకుల ఫొటోలను తీశారు. మూడు బైక్ల్లో ఒకటి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మూలమలుపు వద్ద చోరీకి గురికాగా.. మరో బైక్ ఆదర్శ్నగర్కాలనీకి చెందిన వ్యక్తికి చెందినదిగా తెలిసింది. మూడోది ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది. బాబూక్యాంపులో పట్టపగలే చోరీచుంచుపల్లి: వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని అదనుగా చేసు కున్న దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి పట్టపగలే చోరీకి పాల్పడిన ఘటన చుంచుపల్లి మండలం బాబూక్యాంపులో ఆదివారం చోటుచేసుకుంది. బాబూక్యాంప్లో నివాసముండే ఖాజా బేగం కూతురితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. దుండగులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి నాలుగు నాలుగు గ్రాముల బంగారు చెవి దిమ్మలు, ఎనిమిది గ్రాముల వెండి పట్టీలు, 10 గ్రాముల సిల్వర్ కాయిన్ అపహరించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో చోరీ.. తెలంగాణలో పట్టుబడి.. ములకలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి కారులో పరారవుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట శివారులో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉడండం గమనార్హం. స్థానికుల కథనం మేరకు.. కుక్కునూరు మండలం గుండబోరు గ్రామ శివారులో ఆదివారం ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని, కొందరు వ్యక్తులు కారులో తెలంగాణ వైపు పరారయ్యారు. దీంతో అక్కడి స్థానికులు అటుగా ఉన్న తెలంగాణ గ్రామస్తులకు విషయాన్ని తెలిపారు. తిమ్మంపేట వైపు కారు వస్తుందన్న సమాచారంతో స్థానిక సర్పంచ్ తుర్రం శ్రీను, గ్రామస్తులు రహదారిపై ఆటోను అడ్డుగా పెట్టారు. ఆటోను సైతం ఢీకొట్టి దొంగలు తప్పించునే ప్రయత్నం చేసేలోగానే స్థానికులు వారిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ములకలపల్లి ఎస్ఐ మధుప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని, నిందితులను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్ఐని వివరణ కోరగా.. ఘటన ఆంధ్రాలో చోటుచేసుకుందని, నిందితులను కుక్కునూరు పోలీసులకు అప్పగించామని తెలిపారు. రేషన్ బియ్యం లారీ పట్టివేతభద్రాచలంఅర్బన్: అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని భద్రాచలంటౌన్ పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట నుంచి భద్రాచలం మీదుగా ఒడిశాలోని కొరాపుట్కు లారీలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, లారీడ్రైవర్, క్లీనర్, యజమానితో పాటు మహబూబాబాద్కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
గుండాల/ఇల్లెందు: ప్రజలు, రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారినే మోసం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించగా.. సాబీర్పాషా మాట్లాడారు. ఎరువులు, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, సకాలంలో ఎరువులు ఇవ్వకుండా యాప్ల పేరుతో జాప్యం చేస్తున్నారని, ఏజెన్సీలో సిగ్నల్ సమస్యతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయా మండలాల సహజ వనరులైన ఇసుక ను స్థానిక ప్రజలే వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని కొమరంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఇల్లెందులో యూనియన్ నేత కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మత్యాల విశ్వనాథం, సరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, రేసు ఎల్లయ్య, ఉప్పుశెట్టి రాహుల్, చంద్రగిరి శ్రీనివాస్, పూర్ణచందర్రావు, మున్నా లక్ష్మీకుమారి, నిమ్మల రాంబాబు, భూక్యా శ్రీను, కొమరం హనుమంతరావు, గొగ్గెల కృష్ణ, వజ్జ ఉమ, వాగబోయిన రమేశ్, సాహెబ్, షాహెద్, బచ్చల రామయ్య, కె.సారయ్య, బాస శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
విద్యార్థినికి వైద్యం అందించడంలో జాప్యం?
భద్రాచలంఅర్బన్: అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ విద్యార్థినికి సకాలంలో వైద్యం అందించకుండా కళాశాల సిబ్బంది జాప్యం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పట్టణంలోని పాత ఎల్ఐసీ రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా ఇంజక్షన్ వేసిన తర్వాత తమ కుమార్తె ఆరోగ్యం మరింత క్షీణించిందని విద్యార్థిని తండ్రి ఎర్రయ్య తెలిపాడు. పట్టణంలోని మారుతి పారామెడికల్ కళాశాలలో జీఎ్ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మంజుల ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించాలని మంజుల కళాశాల సిబ్బందిని కోరినప్పటికీ వెంటనే స్పందించలేదని, దాదాపు రెండు గంటల పాటు జాప్యం చేసినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాను కళాశాల యాజమాన్యానికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. వైద్యులు ఇంజక్షన్ వేయగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆరోపిస్తున్నారు. కాగా, విద్యార్థిని కొంతకాలంగా సికిల్సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. అయితే, తాము సకాలంలోనే స్పందించి ఆస్పత్రికి తీసుకొచ్చామని కళాశాల సిబ్బంది చెప్పారు. విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
నాలుగు గంటల విచారణ..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం కేంద్రంగా జరిగిన రూ.52 కోట్ల మోసం కేసులో లక్ష్మీదేవిపల్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడు బేతంపూడి భరత్ ఇప్పటికే భద్రాచలం సబ్జైలులో ఉన్నాడు. తాజాగా మరో ముగ్గురు నిందితులు, అతని తల్లి రాజేశ్వరి, సోదరి శ్రీవిద్య, భార్య ఉషశ్రీలను శనివారం అరెస్ట్ చేశారు. తొలుత పట్టణంలోని కూనవరం రోడ్డులోని టీచర్స్కాలనీలో ఉన్న నిందితుడి ఇంట్లో సీఐ వెంకటేశ్వర్లుతో కూడిన పోలీస్ బృందం రెండు గంటలపాటు సోదా లు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలపాటు కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించినట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు గంటలపాటు అక్కడే ఉన్న పోలీసులు ఆర్థిక లావాదేవీలు, నగదు ఎక్కడ దాచారు? తదితర కోణాల్లో విచారణ సాగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.52 కోట్లు మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంతకు మించి మోసం చేశారా? ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. బయటకు రాని బాధితుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సోదాలు, విచారణలో లభించిన ఆధారాలు, తేలిన విషయాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. డబ్బుల ఆచూకీ కోసం ఆరా! -
భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఐఎస్ఓ గుర్తింపు!
భద్రాచలంఅర్బన్: ఏజెన్సీ ప్రాంతంలో కీలక వైద్యకేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఐఎస్ఓ గుర్తింపు లభించినట్లు సమాచారం. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, రోగుల సంరక్షణ, వివిధ విభాగాల నిర్వహణ, సేవల ప్రమాణాలను పరిశీలించిన అనంతరం గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక నిర్ధారణకు మరో మూడు నెలల సమయం ఉందని సమాచారం. 200 పడకల సామర్థ్యంతో కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, అత్యవసర సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, లేబర్ రూమ్, ఎస్ఎన్సీయూ, ల్యాబ్, రక్తనిధి కేంద్రం, ఫార్మసీ తదితర విభాగాలు ఉన్నాయి. గత నెల 29న సందర్శించిన బీఎస్ఐ (బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్)కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఆస్పత్రి సేవలపై సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఐఎస్ఓ గుర్తింపు అధికారికంగా ఖరారైతే సేవల నాణ్యత, పరిశుభ్రత, రోగుల భద్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది జవాబుదారితనం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. కాగా ఆస్పత్రికి గతంలోనే రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు వచ్చాయి. మూడు నెలల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం -
వైభవంగా నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాల వద్ద ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు నదీహారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితుల సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్, పురోహితులు అశోక్ కుమార్ శర్మ, సత్య ప్రసాద్, పవన్ కుమార్, రామాచార్యులు, చంద్రశేఖర్, తిరుపతిరావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, నరసింహ శర్మ, తేజ శర్మతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. భద్రగిరి రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 14 నుంచి శ్రావణ మాసోత్సవాలుభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రత్యేక సేవలు, 17న సింహ సంక్రమణం, 18న సుదర్శన నారసింహస్వామి పూజలు, 21న వరలక్ష్మీ వ్రతం, 23న అంకురార్పణ, 24న ద్వాదశి, 25న వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. 26 నుంచి 28 వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి, 8న శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
లేకపోయినా.. ఉన్నట్లే..!
● జిల్లాలో 31,083 మృతులకు ఓటు హక్కు ● జాబితాలో వలస ఓటర్లు 77,280 మంది ● జిల్లాలో తొలగించనున్న ఓట్లు 1,30,914 ● నేటితో ముగియనున్న సర్ ప్రక్రియ చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓటరు జాబితాల పరిశీలనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ధ్రువీకరణలో ఇప్పటికే మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. కొంతకాలంగా ఓటరు జాబితాల్లో మార్పు లు నమోదు కాకపోవడం, కుటుంబ సభ్యులు మరణాల వివరాలను ఎన్నికల అధికారులకు తెలపకపోవడం వల్ల మృతుల పేర్లు జాబితాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. సర్ ప్రక్రియలో బీఎల్ఓలు వారి పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టగా.. ఒకే కుటుంబంలో మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన, రెండు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లు వెలుగుచూస్తున్నాయి. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఆధారాలను పరిశీలించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 31,083 మంది మృతులకు ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. మృతులు ఏళ్ల తరబడి ఓటరు జాబితాలోనే ఉన్నారని తెలిసింది. మృతుల ఓట్లు ఎక్కువగా ఇల్లెందులో 10,009, కొత్తగూడెం 6,391 ఓట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 4,101 మంది మృతులు ఉన్నారు. స్థానికంగానే కాకుండా మరోచోట ఓటు నమోదు చేసుకున్నవారు 14,123 మంది ఉన్నారు. 356 మంది ‘సర్’ పత్రాలు ఇవ్వలేదు.. జిల్లా నుంచి వలస వెళ్లిన ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. బీఎల్ఓల నుంచి ఎన్యుమరేషన్ పత్రా లను పంపిణీ చేసినా అందుబాటులో లేనివారు 8,072 మంది ఉండటం గమనార్హం. మిగిలిన ఇతర కారణాలతో సైతం 356 మంది పత్రాలను ఇవ్వలేదు. వీరంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారా..? రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం వల్ల పత్రాలు తిరిగి ఇవ్వలేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లారని, వారి వివరాల సేకరణకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని బీఎల్ఓలు, అధికారులు అంటున్నారు. నేటి వరకే గడువు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువు ముగియనుంది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,104 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తికానుంది. దీంతో బీఎల్ఓలు, సిబ్బంది తుది లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 9,96,198 మంది ఓటర్లకు జూన్ 25 నుంచి ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన గడువు ప్రకారం ఈ నెల 10 వరకు వీటిని సేకరించి, 100శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వాస్తవంగా దీని గడువు గత నెల 24తో ముగిసినా.. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజులు అవకాశం ఇచ్చారు. దీనిలో తిరిగి ఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్లో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓట్లను గుర్తించారు. 2002, 2025 ఓటర్ల జాబితా ప్రకారం బీఎల్ఓలు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 9,96,198 మంది ఓటర్లకు గాను, 8,61,360 మంది వివరాలను గురువారం వరకు అందించారు. దీంతో 86.46 శాతంతో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మృతులు, వలస ఓటర్లు, రెండేసి ఓట్లు ఉన్నవారు, అందుబాటులో లేనివారిపై ప్రత్యేక దృష్టి సారించిన బీఎల్ఓలు విభాగాల వారీగా పునః పరిశీలన చేసి అందుబాటులో ఉన్నవారి వివరాలను ఆన్లైన్ చేశారు. మ్యాపింగ్ కానీ ఓటర్లకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గడువు అనంతరం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారు నిర్దేశిత పత్రాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సేకరించని ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి (అన్కలెక్టబుల్) మృతులు, శాశ్వత వలసలు, రెండేసి ఓట్లు ఉన్నవారు, అందుబాటులో లేనివారి ఓట్ల లెక్క తుది దశకు చేరింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక ఈ నెల 10 నుంచి వీటిని పూర్తిగా తొలగించనున్నారు. జిల్లాలో తొలగించే ఓట్లు సుమారు 1,30,914 వరకు ఉన్నాయని అధికారులు ప్రాథ మికంగా అంచనాకు వచ్చారు. సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 17న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిచిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో ఓటు కోల్పో యి, అర్హత ఉంటే మళ్లీ నమోదుకు ఫారం–6 దర ఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. నియోజవర్గం మృతులు వలస ఓటర్లు డబుల్ ఓటర్లు అడ్రెస్ లేనివి ఇతరులు మొత్తం పినపాక 6,353 19,131 2,565 1,935 71 30,055 ఇల్లెందు 10,093 17,736 4,521 992 35 33,377 కొత్తగూడెం 6,391 18,080 3,899 3,444 119 31,933 అశ్వారావుపేట 4,143 9,018 1,527 720 104 15,514 భద్రాచలం 4,101 13,315 1,611 981 27 20,035 మొత్తం 31,083 77,280 14,123 8,072 356 13,0914నియోజవర్గం పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు డిజిటల్ అయినవి శాతం పినపాక 245 2,04,518 1,74,433 85.29 ఇల్లెందు 243 2,28,211 1,94,827 85.31 కొత్తగూడెం 253 2,50,085 2,14,265 85.65 అశ్వారావుపేట 184 1,60,221 1,44,707 90.32 భద్రాచలం 179 1,53,163 1,33,128 86.92 మొత్తం 1,104 99,6198 86,1360 86.46 -
●వేడుకలకు సర్వం సిద్ధం
భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన గిరిజన భవనం, ఆదివాసీ మహనీయుల విగ్రహాల వద్ద ఏర్పాట్లను, భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది కంటే ఈసారి ప్రముఖులు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ, గిరిజన భవనంలో నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. తాగునీరు, పార్కింగ్, భోజన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ మధుకర్, ఏఓ సున్నం రాంబాబు, టీఏ శ్రీనివాస్, ఏటీడీఓ రాధమ్మ, డీఎస్వో ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
కాలువలకు భూసేకరణ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో కొత్తగా 72 వేల ఎకరాల ఆయకట్టు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు చండ్రుగొండ, పాల్వంచ మండలాల పరిధిలో భూసేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రెండేళ్ల క్రితం.. సీతారామ ప్రాజెక్ట్లోని మూడు పంప్హౌస్లతోపాటు రాజీవ్ కెనాల్ను 2024 ఆగస్టులో సీఎం రేవంత్రెడ్డి జాతికి అంకితం చేశారు. ఆ సమయంలోనే జిల్లా పరిధిలో కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పనులను 1, 2, 7, 8 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో 7, 8 ప్యాకేజీల కింద నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గోదావరి నీరు పారే అవకాశం ఉంది. యాతాలకుంట టన్నెల్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో త్వరలో అశ్వారావుపేట నియోజకర్గంలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీలు 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ పనులు జరిగితే కొత్తగూడెం, పినపాక నియోజకర్గాల పరిధిలో కొత్తగా సుమారు 72 వేల ఎకరాలకు గోదావరి నీరు అందే అవకాశం ఉంది. భూసేకరణ షురూ రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టు అందివ్వలేదని సీతారామపై పడిన అపవాదును చెరిపేసే పనుల్లో మరో కీలక అడుగు పడింది. ప్యాకేజీ 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల కోసం భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు శుక్ర, శనివారాల్లో జారీ అయ్యాయి. ప్యాకేజీ–2లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 15 ఆర్ కోసం చండ్రుగొండ మండలం పోకలగూడెంలో 89 ఎకరాలు, ప్యాకేజీ–1లో పాల్వంచ మండలం దంతెలబోరలో 73 ఎకరాలు సేకరించే ప్రక్రియ మొదలైంది. భూసేకరణ చట్టం– 2013 ద్వారా ప్రక్రియ కొనసాగించనున్నారు. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు 1, 2లకు సంబంధించి కాలువల నిర్మాణ పనులకు 2024 అక్టోబరులో టెండర్లు పిలిచారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంది. గడిచిన రెండేళ్లుగా కనీసం కాలువ నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కూడా వేగం కనిపించలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం జరగకపోవడంతో ఎత్తిపోతలు మొదలై రెండేళ్లయినా జిల్లాలో కొత్త ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. కేవలం ఈ సీజన్లో ములకలపల్లి మండలంలో కొన్ని చెరువులు నింపేందుకు గోదావరి జలాలు అక్కరకు వచ్చాయి. దీంతో పాటు గత వేసవి, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో తాగునీటి అవసరాల కోసం వైరా రిజర్వాయర్కి గోదావరి నీరు ఎత్తిపోసేందుకు సీతా రామ ప్రాజెక్ట్ ఉపయోగపడినట్టయ్యింది. -
ఆధునికత దిశగా..
ప్రకృతితో మమేకమై అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించిన ఆదివాసీలు క్రమంగా ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సదుపాయాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ చైతన్యం, ముందడుగు ఆదివాసీ సమాజం మొత్తంలో లేదు. పాలకులు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే ఆదివాసీలు అందరూ ప్రగతిబాట పట్టే అవకాశం ఉంది. –పాల్వంచరూరల్/భద్రాచలం● సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆదివాసీలు ● ఉన్నత విద్యతో కొలువులు సాధిస్తున్న అడవిబిడ్డలు ● వలస ఆదివాసీల్లో ఇప్పుడిప్పుడే ముందడుగు నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంజిల్లావ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. తొలుత అడవే వీరి జీవనానికి ప్రధాన ఆధారంగా ఉండేది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి పొందేవారు. క్రమంగా వ్యవసాయం చేయడంతోపాటు వివిధ రకాల వృత్తి, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి కొలువులు కూడా చేపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రధారణపైనా ఆసక్తి చూపుతున్నారు. పలువురు ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 32 గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 14,253 గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది ఆదివాసీలే ఉన్నారు. -
‘రామ సేవా మండపం’లో నిత్యకల్యాణం
భద్రాచలం: మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో రామయ్య నిత్యకల్యా ణం శనివారం వైభవోపేతంగా జరిగింది. ఆల య అభివృద్ధి పనుల్లో భాగంగా తాత్కాలిక నిత్యకల్యాణ వేదికను మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసి, రామ సేవా మండపంగా నామకరణం చేశారు. దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం నిత్యకల్యాణానికి కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ‘శాకంబరి’ అవతారానికి కూరగాయలు వితరణపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారు ఆదివారం శాకంబరిదేవిగా దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలను శనివారం భక్తులు వితరణ చేశారు. సంకా రామారావు 900 సొరకాయలు, 30 కేజీల క్యాప్సికమ్, అరటిగెలలు, తాటికొండ సురేష్ 30 కేజీల క్యారెట్, 30 కేజీల బెండకాయలు అందజేసినట్లు ఆలయ ఈఓ విజయ్కుమార్ తెలిపారు. భూవివాదంలో జోక్యం.. ఎస్ఐ సస్పెన్షన్సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని సుజాతనగర్ ఎస్సై రమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదం విషయంలో ఓ మిలిటరీ ఉద్యోగి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైని సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇతర కారణాలతో అదే ఠాణాలోని మరో మహిళా ఎస్సైని కూడా సస్పెండ్ చేస్తారని పోలీస్ శాఖలో కూడా ప్రచారం జరిగింది. అయితే పోలీస్ అధికారులు ధ్రువీకరించలేదు. జిల్లా, డివిజన్ అధికారులను ఈవిషయమై వివరణ కోరగా.. ఎస్ఐ విధుల్లో లేని మాట నిజమేనని, సస్పెన్షన్ విషయం మాత్రం పూర్తిస్థాయిలో తమకు తెలియదని చెప్పారు. తాలిపేరుకు వరద ఉధృతిచర్ల: తాలిపేరు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు 23,898 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 28,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, మరో 2 గేట్లను ఫ్రీ ఫ్లోలో ఉంచారు. ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ 74 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 73.63 మీటర్లకు చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 730 మిలియన్ క్యూబిక్ ీమీటర్లు (ఎంసీఎఫ్టీ) కాగా, ప్రస్తుతం 659 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. కాగా, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత్స్య రైతులకు ముగిసిన శిక్షణకూసుమంచి: మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో హైదరాబాద్కు చెందిన పీ.వీ.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మత్స్య రైతులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ‘బయోప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఇక్కడ మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పలు జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
‘ప్రత్యామ్నాయ’ సాగు పెంచాలి
సూపర్బజార్(కొత్తగూడెం): వరి సాగు తగ్గించి తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశం నిర్వహించారు. తొలుత అధికారులు వర్షపాతం, నీటి లభ్యత వివరాలను వెల్లడించారు. జిల్లాలో 455.8 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సాధారణ వర్షపాతం 561.4 మి.మీ కాగా, 18.8 శాతం లోటు నమోదైందని చెప్పారు. జూన్లో 4.3 శాతం, జూలైలో 31.8 శాతం లోటు ఉండగా, ఆగస్టులో ఇప్పటివరకు సాధారణం కంటే 1.2 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వివరించారు. జిల్లాలో 2,384 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, సుమారు 800 చెరువుల్లో 50 శాతానికి మించి నీరు చేరిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్ల్లో కూడా నీరు చేరుతోందని చెప్పారు. వర్షాకాలం సీజన్లో 4,86,048 ఎకరాల సాగు లక్ష్యానికి 4,21,367 ఎకరాల్లో పంటలు సాగు చేపట్టారని, 86.69 శాతం నమోదైందని తెలిపారు. పత్తి సాగు లక్ష్యం చేరిందని, వరి సాగు లక్ష్యం 31,500 ఎకరాలు కాగా 70,652 ఎకరాల్లో రైతులు సాగు చేశారని, దీంతో 224.29 శాతం నమోదైనట్లు వివరించారు. నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెసర, మినుము, కంది, కూరగాయలు, ఆయిల్పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పంటల వైవిధ్యీకరణ వైపు... కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైజ్డ్ బెడ్ విధానం, నీటి సంరక్షణ, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, నేలలో తేమను సంరక్షించే పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, డీఏఓ బాబూరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, సీపీఓ సునీత, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, నీటిపారుదల శాఖ ఈఈలు, డీఈలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
రూ.52 కోట్ల మోసం కేసులో దర్యాప్తు..
భద్రాచలంఅర్బన్: రూ.52 కోట్ల భారీ మోసం కేసులో భద్రాచలం పట్టణానికి చెందిన భరత్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే భద్రాచలం సబ్జైలుకి పంపారు. మరోవైపు అతడికి సంబంధించి, సీజ్ చేసిన ఇంట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు, విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. గదులు, అల్మారాలు, పత్రాలు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, ఆర్థి క లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర సమాచారాన్ని గుర్తించే దిశగా తనిఖీలు సాగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నిందితుడి తల్లి, కుటుంబ సభ్యులను సైతం అదే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంచి పోలీసులు విడివిడిగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.52 కోట్ల మోసం వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యులకు తెలిసిన విషయాలు, నిందితుడి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, డబ్బు ఎక్కడికి తరలించారనే అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకరి సమాధానాలు మరొకరికి తెలియకుండా వేర్వేరుగా విచారిస్తూ.. వారి నుంచి సేకరించిన వివరాలను ఇంట్లో లభిస్తున్న పత్రాలు, ఇతర ఆధారాలతో సరిపోల్చుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడు భరత్ జైలులో ఉండగా.. అతని ఇంట్లో ఒకవైపు పోలీసులు పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించడం, మరోవైపు కుటుంబ సభ్యులను విడివిడిగా విచారిస్తుండటం కేసు దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లేదా ఇతర వస్తువులు లభించాయా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే సోదాల సమయంలో పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారనే వివరాలు, కుటుంబ సభ్యుల విచారణలో ఏం వెల్లడైందనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీజ్ చేసిన ఇంట్లో పోలీసుల సోదాలు? -
ప్రభుత్వాల వైఖరి మారాలి..
పాల్వంచ/పాల్వంచరూరల్/బూర్గంపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా స్పష్టం చేశారు. సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మూడో రోజు శనివారం బూర్గంపాడు మండలంతోపాటు పాల్వంచ మండలంలోని రంగాపురం, జగన్నాథపురం, కేశవాపురం, నాగారంకాలనీ, పునుకుల, కోడిపుంజులవాగు, కిన్నెరసాని, మొండికట్ట, ఉల్వనూరు, చండ్రాలగూడెం నుంచి పాల్వంచ బస్టాండ్ వరకు సాగింది. అక్కడి నుంచి రాజీవ్గాంధీమార్కెట్, శాసీ్త్రరోడ్ వరకు ర్యాలీ నిర్వహించగా.. సాబీర్పాషా మాట్లాడారు. పాల్వంచ ప్రాంత అస్థిత్వాన్ని, ప్రజల హక్కులను కాపాడి, పూర్వవైభవం తీసుకురావడానికి పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సర్వే నంబర్లు 444, 817, 727, 999, 410లలో స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవ చూపించడంతో సర్వే ప్రారంభమైందన్నారు. కేటీపీఎస్ పరిధిలో 800 మెగావాట్ల రెండు విద్యుత్ ప్లాంట్లు తెచ్చి పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కులు, ఉపాధి హామీ చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తోందని, కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అదానీ, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, పోరాటాలతో తిప్పికొట్టాలని కోరారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, వీసంశెట్టి పూర్ణచందర్రావు, పుల్లారెడ్డి, అడుసుమల్లి సాయిబాబు, ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, సారెడ్డి పుల్లారెడ్డి, మున్న లక్ష్మీకుమారి, మువ్వ వెంకటేశ్వర్లు, పేరాల శ్రీనివాస్, సప్కా నాగేశ్వరరావు, నలజాల సత్యనారాయణ, ముదిగొండ బాలకృష్ణ, వీవీబీ చారి, బర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.సీపీఐ ప్రజా చైతన్యయాత్రలో నాయకులు -
బైక్ను ఢీకొట్టిన లారీ..
పినపాక: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మండలంలోని జానంపేట శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హిమవతి, మద్దెల రాణి విధులు ముగించుకుని హిమవతి తండ్రి నరసింహారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. జానంపేట శివారులో లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం లారీ టైర్ల కింద పడింది. నరసింహారావు, హిమవతిల కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. రాణికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 ద్వారా క్షతగాత్రులను మణుగూరులోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం ఇల్లెందురూరల్: మండలంలోని లచ్చగూడెం గ్రామపంచాయతీ కొమ్ముగూడెంకాలనీ గ్రామంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకుంటున్న నాగరాజు పక్కనే తాత్కాలిక ఇంటిని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివా రం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. కాలేజీ యాజమాన్యం తీరుపై ఫిర్యాదు చుంచుపల్లి: ప్రత్యేక సెలవు రోజుల్లో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తరగతులు నిర్వహించడాన్ని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఖండిస్తూ శనివారం లక్ష్మీదేవిపల్లిలోని కృష్ణవేణి కళాశాల యాజమాన్యానికి విన్నవించేందుకు వెళ్లారు. అయి తే, తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని ఆరోపిస్తూ నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం వ్యాపార దృక్పథంతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ క్లాసులు నిర్వహించడాన్ని ప్రశ్నించినందుకు కళాశాల నిర్వాహకులు దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. కాగా, ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తప్పిన ప్రమాదం.. పినపాక: ఏడూళ్ల బయ్యారం క్రాస్రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో హైడ్రోజన్ పెరాకై ్సడ్ తరలిస్తున్న ఓ లారీ శనివారం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బంక్లోకి వెళ్తున్న ఖాళీ లారీ అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ నగదు పంపకంలో విభేదాలు వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: మృతిచెందిన కన్నతల్లి ఇన్సూరెన్స్ డబ్బుల పంపకం విషయంలో ముగ్గురు కొడుకుల మధ్య విభేదాలు తలెత్తడంతో చిన్నకొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పునుకుల గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని కోడిపుంజులవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని పూసలతండా గ్రామానికి చెందిన బాదావత్ తిరుపతి, సంతు దంపతులకు బాలాజీ, విజయ్, సాగర్ కుమారులు ఉన్నారు. తల్లి సంతు ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో రైతు బీమా కింద రూ.5 లక్షలు వచ్చాయి. ఈ నగదు పంపిణీ విషయంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. దీంతో చిన్నకొడుకు సాగర్ శనివారం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయం పేరిట నగదు చోరీ నేలకొండపల్లి: దివ్యాంగులకు సాయం చేస్తాను, కొంత డబ్బు చెల్లిస్తే అంతకు మించి ఇస్తానని నమ్మబలికిన వ్యక్తి రూ.15 వేలు చోరీ చేసిన ఘటన ఇది. నేలకొండపల్లికి చెందిన మండల కేంద్రంలో ఓ దివ్యాంగుడు శనివారం స్కూటీపై పెట్రోల్ బంక్ వద్ద ఉండగా, పల్సర్ బైక్పై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. ఎంత డబ్బు ఉంటే అంతకు మించి సాయం చేస్తాననడంతో సదరు దివ్యాంగుడు జేబులో రూ.15 వేల నగదు తీస్తున్నాడు. ఆ నగదు తాను లెక్కిస్తానంటూ యువకుడు లాక్కుని పరారయ్యాడు. అదే సమయాన వచ్చిన చెన్నారానికి చెందిన దివ్యాంగుడు వీరయ్య తన వాహనంపై వెంబడించినా నిందితుడు వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. నంబర్ ప్లేట్ లేని వాహనంపై మాస్క్ ధరించి తిరుగుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మెరిట్ విద్యార్థులకు తోడ్పాటు..
● ఎన్ఎంఎంఎస్ ద్వారా ఏటా రూ.12వేలు ● దరఖాస్తుకు ఈ నెల 24వరకు అవకాశంటేకులపల్లి: ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12,000 చొప్పున, నాలుగు సంవత్సరాల్లో మొత్తం రూ.48,000 ఆర్థిక సాయం నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. రెసిడెన్షియల్ (గురుకుల) పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఈ నెల 24 తేదీ వరకు గడువు ఉంది. నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలైతే రూ.50, బీసీ, ఓసీలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీ స్కూల్, బాబు క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా కేంద్రప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎనిమిదో తరగతిలో పరీక్ష రాసి అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏటా రూ.12వేల సాయం అందుతుంది. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అజ్మీరా జగన్నాయక్, ఎంఈఓ, టేకులపల్లి -
●ఆకట్టుకునే కొమ్ము నృత్యం
ఆదివాసీ సంప్రదాయ కొమ్మునృత్యం నేడు యువతకు ఉపాధిగా మారింది. కొమ్ము పాగా ధరించి డోలు వాయిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ఆకట్టుకుంటుంది. ఇద్దరు నృత్యకారులు ఎగురుతూ ధరించిన కొమ్ములతో ఢీ కొట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. దీన్నే రేలా నృత్యం అని కూడా పిలుస్తారు. పురుషులు అడవి దున్న లేదా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేకమైన కిరీటాన్ని తలకు ధరిస్తారు. శరీరంపై నెమలి ఈకలు, వర్ణరంజితమైన దుస్తులు, చేతిలో డప్పు (తుడుము) కనిపిస్తాయి. తొలుత ఆదివాసీ గ్రామాల్లోనే ప్రదర్శించే ఈ నృత్యం ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో, ప్రముఖుల పర్యటనల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో కొందరు ఆదివాసీ యువకులు సంస్కృతిని కాపాడుకుంటూనే కొమ్ము నృత్యంతో ఉపాధి పొందుతున్నారు. గొత్తికోయ గిరిజన గ్రామాల్లో మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్ ), గిరిజన పెద్దలు కలిసి ఆదివాసీ పల్లెల్లో డీజేలను వినియోగించొద్దని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా అథ్లెట్లు ప్రతిభ చాటి పది పతకాలు సాధించారు. జిల్లా క్రీడాకారులు నాలుగు బంగారు, నాలుగు రజత, రెండు కాంస్య పతకాలు సాధించారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.మహీధర్ తెలిపారు. పతకాలు సాధించిన వారిలో చర్లకు చెందిన ఎం.శ్రీవిద్యదొర, భద్రాచలానికి చెందిన ఎస్కే అమ్రిన్, టి.అవంతిక, సాయిమంజుశ్రీ, బి.పృథ్విక, కొత్తగూడెంనకు చెందిన సీహెచ్ వేదశ్రీ, బి.శైలేశ్, పాల్వంచకు చెందిన బి.సౌమ్య, ఎ.నందిని, ఎస్.అక్షిత ఉండగా డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి విజేతలను, కోచ్లు పి.నాగేందర్, డి.మల్లికార్జున్, జన్ను గిరిప్రసాద్ను అభినందించారు. నవభారత్ స్కూల్ హెచ్ఎంకు డాక్టరేట్పాల్వంచ: నవభారత్ పబ్లిక్ స్కూల్ హెచ్ఎం ఎన్వీకే ప్రసాద్కు కెన్నెడీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన డాక్టరేట్ అందుకున్నారు. పాఠశాల విద్యలో బోధనా ప్రమాణాలు పెంపొందించడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందించడంలో చేసిన కృషికి గాను పురస్కారం లభించిందని తెలిపారు. ఆయన్ను ఉపాధ్యాయులతోపాటు పలువురు అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు కొత్తగూడెంఅర్బన్: పోగొట్టుకున్న ఫోన్ను తిరిగి ఆ వ్యక్తికి పోలీసులు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం ప్రగతినగర్కు చెందిన పారుపల్లి రమేశ్ గత జనవరి 15వ తేదీన సూపర్బజార్ నుంచి బస్టాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో ఫోన్ పోగొట్టుకున్నాడు. మీ సేవలో రిజిస్టర్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ విజయకుమారి, కానిస్టేబుల్ విష్ణువర్దన్ రమేశ్కు ఫోన్ను అప్పగించారు. రేషన్ దుకాణంలో తాచుపాము కలకలం మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధి సుందరయ్యనగర్లోని రేషన్ దుకాణంలో తాచు పాము కలకలం సృష్టించింది. గదుల్లో రేషన్ బియ్యం బస్తాల మధ్యలో ఉన్న పాము అలికిడితో నిర్వాహకురాలు, రేషన్ తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ ముజాఫర్కు సమాచారం అందించగా, సుమారు గంట పాటు రెస్క్యూ చేసి పామును పట్టి అడవిలో వదిలేయడంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిపై పోక్సో కేసు వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పార్టీ ఇన్చార్జ్గా చెలామణి అవుతున్న గౌరవరపు డేవిడ్రాజ్ శనివారం మద్యం మత్తులో వైరాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి గణితం చెబుతానంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామారావు చేరుకుని డేవిడ్రాజ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. కాగా, డేవిడ్పై గతంలోనే రౌడీషీట్ నమోదైంది.స్కూటీ అపహరణ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి తుమ్మూరి రామారావు వీధిలో స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ తన ఇంటిముందు శుక్రవారం రాత్రి స్కూటీ పార్క్ చేశాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని అపహరించగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
భార్య కేసు పెడతానని బెదిరిస్తే..
కొణిజర్ల: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోగా ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలులో వేయిస్తానని బెదిరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని తనికెళ్లకు చెందిన పెద్దగౌండ్ల గోపాల్రావు అలియాస్ గోపి(27)కు గతంలోనే వివాహం జరిగినా విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఆయన చింతకాని మండలం నేరడకు చెందిన రజనిని వివాహం చేసుకోగా దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా పెద్దలు నచ్చజెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమాన 15 రోజుల క్రితం రజని పుట్టింటికి వెళ్లింది. గోపి ఫోన్ చేయగా మరోమారు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో గోపి రోజులాగే శుక్రవారం ఆటో నడిపిన అనంతరం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్థానికులు ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఆయన తల్లి శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆందోళనతో యువకుడి ఆత్మహత్య -
●అభివృద్ధికి ఐటీడీఏ కృషి
భద్రాచలంటౌన్: ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోంది. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ మరింత చొరవ చూపుతున్నారు. విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెరుగైన ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా భద్రాచలంలో గిరిజన మ్యూజి యం ఏర్పాటు చేశారు. అటవీ, సంప్రదాయ ఉత్పత్తులతోపాటు నిత్యావసరాల అమ్మకానికి భద్రిగిరి మార్టును అందుబాటులోకి తేగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి అంటే మౌలిక వసతులు కల్పించడం మాత్రమే కాదు. వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఆదివాసీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేలా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశాం. –బి.రాహుల్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం -
కూలీలకు డిమాండ్
● వరి నాట్ల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి రాక ● నారు ముదురుతుండటంతో రైతుల్లో ఆందోళన బూర్గంపాడు: ఎల్నినో ప్రభావంతో ఆగస్ట్ మొదటివారం వరకు వరుణుడు ముఖం చాటేయడంతో వరి సాగుకు ప్రతికూలంగా మారింది. వరినార్లు పోసుకుని నాట్లు వేసేందుకు ఎదురుచూసిన రైతు లు వరిసాగుపై ఆశలు వదులుకున్నారు. వ్యవసాయశాఖ కూడా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించింది. ఆగస్ట్ మొదటివారంలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలకు కొంతమేర నీరు చేరింది. దీంతో రైతులందరూ ఒకేసారి వరినాట్లు వేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. మాగాణులు దమ్ము చేసి వరినాట్లు వేసేందుకు సిద్ధమైన తరుణంలో కూలీల కొరత ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికే వరి నార్లు ముదిరిపోతున్నాయనే ఆందోళనలో ఉన్న రైతులకు కూలీల కొరత మరింత ఇబ్బందికరంగా మార్చింది. స్థానికంగా ఉన్న కూలీలు వరినాట్లకు సరిపోకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రపిస్తున్నారు. 1.90 లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది జిల్లాలో 1.90లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం సగానికి తగ్గుతుందని తరువాత భావించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరిసాగు మళ్లీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్కు నీరు చేరటం, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమవటంతో వరిసాగు పెరుగు తోంది. తుమ్మలచెరువు, దోమలవాగు చెరువులకు మారెళ్లపాడు, సీతారామ ప్రాజెక్ట్ల నుంచి నీరు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదారేళ్లుగా వరినాట్లకు బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. జిల్లాలో కూలీల సంఖ్య ఏటికేడు తగ్గుతుండటం పంటల సాగుకు ప్రతిబంధకమవుతోంది. జిల్లాలో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు పెరుగుతుండటంతో కూలీలు ఆ పను లకు ఎక్కువగా వెళ్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర పనులకు వెళ్తున్న కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుండటంతో గ్రామీణ కూలీలు ఆ పనులకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కువ మంది మహిళా కూలీలు జామాయిల్ నర్సరీల్లో పనులకు వెళ్తున్నారు. బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో విలీనమైన వేలేరు, పెదరావిగూడెం, అల్లిగూడెం, గణపవరం, ఇబ్రహీంపేట, బంజరగూడెం గ్రామాల్లో వేలాదిగా జామాయిల్ నర్సరీలున్నాయి. ఈ నర్సరీలలో పనిచేసేందుకు బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పాల్వంచ, ముల్కలపల్లి మండలాలకు చెందిన మహిళా కూలీలు ఎక్కువగా వెళ్తున్నారు. ప్రతిరోజు కనీసం 3 వేల మందికి పైగా కూలీలు జామాయిల్ నర్సరీల్లో పనులకు వెళ్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో వరినాట్లు వేసేందుకు, ఇతర వ్యవసాయ పనులకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మధ్యవర్తుల ద్వారా.. వరినాట్లు ముమ్మరంగా సాగుతుండటంతో బెంగాల్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. కొందరు మధ్యవర్తులు వలస కూలీలను తీసుకొచ్చి జిల్లాలో వరినాట్లు వేయిస్తున్నారు. గతేడాది ఎకరం వరి నాటేందుకు రూ.4,500 చెల్లిస్తే, ఈ ఏడాది ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలాఖరు వరకు జిల్లాలో వరినాట్లు కొనసాగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరుసగా వరి నాటుతున్నారు. దీంతో ఎరువులు చల్లుకునేందుకు, పురుగుమందులు పిచికారీ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని రైతులంటున్నారు. అంతేకాకుండా గాలి, వెలుతురు మొక్కకు బాగా అందుతుండటంతో దిగుబడులుకూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. -
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
జూలూరుపాడు: ఇంజనీరింగ్ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ రాజేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని అన్నారుపాడుకు చెందిన బానోత్ నరసింహ, విజయ దంపతుల కుమారుడు కిరణ్ (19) సుజాతనగర్ మండలం వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు మనస్పర్దల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి నరసింహ వద్ద కిరణ్ ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులు కలవరనే ఉద్దేశంతో తీవ్ర మనోవేదనకు గురైన కిరణ్ మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన పురుగులమందు తాగాడు. తండ్రి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శుక్రవారం కిరణ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బూర్గంపాడు: గోదావరి బ్రిడ్జి సారపాక వైపున 3వ ఫిల్లర్ వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని నీటిలో తేలిన మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రి మర్చూరీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే పోలీస్స్టేషన్కు సమాచారమివ్వాలని ఎస్ఐ నాగభిక్షం కోరారు. భార్య మందలించిందని గడ్డిమందు తాగిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి పాల్వంచరూరల్: పత్తి చేనుకు ఓ వ్యక్తి గడ్డి మందు పిచికారీ చేయగా పత్తి మొక్కలు కూడా చనిపోవడంతో ఆయన భార్య మందలించింది. మనస్తాపం చెందిన భర్త అదే గడ్డిమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన తాపాల ఎల్లయ్య (39) ఈ నెల 6న పత్తిచేనులో గడ్డి మందు పిచికారీ చేశాడు. గడ్డితోపాటు పత్తి చెట్లు కూడా మొత్తం చనిపోవడంతో ఆయన భార్య లలిత మందలించింది. మనస్తాపానికి గురైన ఎల్లయ్య అదే గడ్డిమందు తాగగా 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుడువెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
కావడిగుండ్ల అడవిలో పులి సంచారం
● ఏపీ నుంచి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి.. ● అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులుఅశ్వారావుపేటరూరల్: ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి అటవీ ప్రాంతాల్లో గడిచిన కొద్ది రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి తాజాగా శుక్రవారం అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అడవిలోకి వచ్చినట్లు స్థానిక అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 2న జీలుగుమల్లి మండలం స్వర్ణవారిగూడెం సమీపంలో పులి దాడి చేసి ఓ గేదెను చంపివేసింది. గతంలో పులికి అమర్చిన జీపీఎస్ ట్రాక్ సిగ్నల్ ద్వారా పులి సంచారం గుర్తించి, వలలు, బోన్లు ఏర్పాటు చేసి బంధించేందుకు అక్కడి అటవీ, పోలీస్ శాఖల అధికారులు ప్రయత్నం చేశారు. కానీ ఆచూకీ కచ్చితంగా గుర్తించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పులి ఏపీ సరిహద్దు ప్రాంతాన్ని దాటి శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాల మీదుగా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జీపీఎస్ సిగ్నల్ కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో చూపుతున్న నేపథ్యంలో స్థానిక అటవీ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తయ్యారు. స్థానికులను అప్రమత్తం చేసి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 20, 21వ తేదీల్లో కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి, తిరిగి ఈ ఏడాది జూన్ 28వ తేదీన రెండోసారి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఏపీ నుంచి కావడిగుండ్ల వైపు రావడంతో ఈ ప్రాంత వాసులంతా భయందోళన చెందుతున్నారు. -
● ఏటూరునాగారం మార్గంలో నిలిపివేత ● కిలోమీటర్ల మేర బారులుదీరిన వాహనాలు..
ఇసుక లారీలకు బ్రేక్.. పినపాక: మణుగూరు, పినపాక మండలాల ఇసుక క్వారీల నుంచి బయలుదేరిన ఇసుక లారీలను శుక్రవారం పినపాక మండల శివారులో మంగపేట పోలీసులు నిలిపివేశారు. దీంతో ఉదయం నుంచే వందల సంఖ్యలో లారీలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. లారీడ్రైవర్ల కథనం ప్రకారం.. ఉదయాన్నే ఇసుక లోడ్ చేసుకుని ఏటూరునాగారం మార్గంలో బయలుదేరగా, మంగపేట వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేశారని తెలిపారు. ఇసుక క్వారీ నిర్వాహకులు ఈ మార్గంలో వెళ్లొచ్చని చెప్పగా, ఇక్కడ పోలీసుల అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారని వాపోయారు. గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగపేట పోలీసులను వివరణ కోరగా, పైఅధికారుల ఆదేశాల మేరకే వాహనాలను నిలిపివేశామని తెలిపారు. హైదరాబాద్కు వెళ్లే లారీలు మణుగూరు – కొత్తగూడెం లేదా ఇల్లెందు – పాల్వంచ మార్గాల్లో వెళ్లాలని సూచించామని చెప్పారు. వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆవు.. కరకగూడెం: మండలంధిలోని కన్నాయిగూడెం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ ఆవు బలైంది. గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్యకు చెందిన ఆవు శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని అడవికి మేత కోసం వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన ఉచ్చు ఆవు మెడకు బిగుసుకుని, అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని వెంకయ్య తెలిపారు. -
సురక్షిత డ్రైవింగ్పై డ్రైవర్లకు శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ తెలిపారు. రీజియన్ పరిధి ఏడు డిపోల డ్రైవర్లకు ఖమ్మం కొత్త బస్టాండ్ మీటింగ్హాల్లో శుక్రవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయాన అప్రమత్తతపై వివరించారు. మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండి సరైన విశ్రాంతి తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఏఎంవీఐ మధు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. డీపీఆర్ను రద్దు చేయాలి కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పేరిట రహస్యంగా రూపొందించిన డీపీఆర్ను రద్దు చేయాలని స్వతంత్ర కార్పొరేటర్ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్పొరేటర్ భీమా శ్రీవల్లి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలపై అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని తెలిపారు. జూన్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.300 కోట్లు, జర్మనీ బ్యాంకు రుణం రూ.300 కోట్లతో అభివృద్ధి పనుల అంశాన్ని కౌన్సిల్లో పెడితే తాము వ్యతిరేకించామని, సీపీఐ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆమోదించారని, గతంలో ప్రపంచ బ్యాంకు నిధులను వ్యతిరేకించిన ఎమ్మెల్యే, సీపీఐ నేతలు ఇప్పుడు ఎలా స్వాగతిస్తున్నారని నిలదీశారు. సుమారు రూ.8 కోట్లు పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీవల్లి, నాయకుడు శ్రీధర్ మాట్లాడారు. ‘నవోదయ’ దరఖాస్తుల గడువు పొడిగింపు కరకగూడెం: జవహర్ నవోదయ విద్యాలయంలో 2027 – 28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించినట్లు కరకగూడెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రత్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 7తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www. navodaya. gov. in లేదా cbseitms. rcil. gov. in/ nvs వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుక్స్టాల్లో చోరీ భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో ఉన్న ఓ బుక్స్టాల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఓ దుండగుడు ఇనుప రాడ్డుతో షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, కౌంటర్లో ఉన్న సుమారు రూ.15 వేల నగదును అపహరించాడు. శుక్రవారం ఉదయం యజమాని పాకాల శివ దుకాణానికి వచ్చి చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, బుక్స్టాల్లోకి ఓ వ్యక్తి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా, వాటి ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు అద్దాలు ధ్వంసం అశ్వాపురం: మణుగూరులో బస్సు ఆపలేదని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మణుగూరు నుంచి కొత్తగూడెం వెళ్తోంది. మణుగూరులో బస్సు ఆపలేదని ఓ వ్యక్తి బైక్పై వచ్చి మండలంలోని మొండికుంటలో బస్సుపై రాయి విసరగా అద్దాలు పగిలాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ..
బూర్గంపాడు: లారీడ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని చిదిమేసింది. మోటార్ సైకిల్ను అతివేగంగా ఢీకొట్టడంతో పాటుగా 30 మీటర్ల మేరా లాక్కెళ్లింది. దీంతో ద్విచక్రవాహనదారుడి శరీరమంతా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఐటీసీ పీఎస్పీడీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ఈ ఘటనలో మరణించాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో సారపాకలో విషాదం అలుముకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దతండా గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీరామ్ (47) పదహారేళ్లుగా సారపాక కండక్టర్స్ కాలనీలో నివాసముంటూ ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం జనరల్ షిఫ్ట్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రా మెటీరియల్ లోడ్తో వస్తున్న లారీ సారపాక ఐటీసీ ఈస్ట్గేట్ సమీపంలో అతివేగంగా మోటార్ సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. శ్రీరామ్ లారీ వెనుక టైర్ల కిందపడిపోయాడు. అతడిని లారీ 30 మీటర్ల వరకు లాక్కెళ్లడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా.. శ్రీరామ్ శుక్రవారం రాత్రి సారపాక నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది. శ్రీరామ్ భార్యకు హైదరాబాద్లో శనివారం శస్త్ర చికిత్స ఉంది. అందుకోసం కుటుంబ సభ్యులు ముందుగానే వెళ్లి హైదరాబాద్లో ఉన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరాల్సిన శ్రీరామ్ను మృత్యువు లారీ రూపంలో కబళించింది. శ్రీరామ్ తన ఏకై క కుమారుడికి గత మే నెలలోనే వివాహం చేశాడు. పెళ్లి చేసిన ఆనందం ముగియక ముందే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎస్ఐ నాగభిక్షం ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి -
చికిత్స పొందుతున్న వృద్ధుడి మృతి
ములకలపల్లి: మద్యానికి బానిసగా మారిన వృద్ధుడు పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని పాతూరు శివారు మేడువాయి గుంపులో వృద్ధ దంపతులు సున్నం బుల్లెమ్మ, సోములు జీవనం సాగిస్తున్నారు. సోములు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన మద్యానికి బానిసై పనులకు సరిగా వెళ్లడం లేదు. గురువారం మేకలు కాసేందుకు వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా నిరాకరించాడు. తరచూ పనులు చెబుతున్నారని కోపంతో పురుగులమందు తాగాడు. కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోములు శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో కేటీపీఎస్ క్రీడాకారుడు..పాల్వంచ: బ్రెయిన్ స్ట్రోక్తో కేటీపీఎస్ జేఏఓ, క్రీడాకారుడు కొండ్ర అశోక్కుమార్ (43) మృతి చెందాడు. కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏడీఎం) అశోక్కుమార్ తాను నివాసం ఉండే కేటీపీఎస్ ఆస్పత్రి ఏరియాలోని క్వార్టర్లో గత నెల 23న బీపీ ఎక్కువై అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతడిని కొత్తగూడెం ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్కు గురై శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య మీనా, కూతురు హనిక ఉన్నారు. అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా, అశోక్కుమార్ క్రీడల్లోనూ సత్తా చాటి తనదైన ము ద్ర వేసుకున్నాడు. ఆల్ ఇండియా హాకీ, ఫుట్బాల్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించాడు. జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడల్లో హాకీ, ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్ పోటీల్లో రాణించాడు. అతని మృతితో కేటీపీఎస్ కాంప్లెక్స్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని శనివారం కుటుంబ సభ్యులు పాల్వంచకు తీసుకురానున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి.. టేకులపల్లి: తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఘటన మండలంలోని కొప్పురాయి పంచాయతీ పరిధిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన గొగ్గిల రాములు కుమారుడు గొగ్గిల హనుమంతు (24) డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడంతో కొద్దిరోజులుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చూసుకోవాలని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హనుమంతు ఈ నెల 3న ఇంట్లోనే పురుగులమందు (గడ్డి మందు) తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం కన్నుమూశాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు బోడు ఏఎస్ఐ నాగయ్య కేసు నమోదు చేశారు. -
స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్మణుగూరు టౌన్: ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మణుగూరు మండల సమితి సింగారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరా బాద్లోని కొత్తపేట ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర నూ తన కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఉపసర్పంచుల సంఘం, వ్యవస్థాపక రాష్ట్రఅధ్యక్షుడు లావుడ్యా రాములు నాయక్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ‘ఎఫ్ఎఫ్ఎస్’ సేవలు షురూ..టేకులపల్లి: ఎరువుల పంపిణీకి ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్స్ (ఎఫ్ఎఫ్ఎస్ ) కొత్త యాప్ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. టేకులపల్లిలోని ఫెర్టిలైజర్ షాపుల్లో యాప్ వినియోగంపై ఇల్లెందు ఏడీఏ గుగులోత్ లాల్చంద్ రైతులకు అవగాహన కల్పించారు. యాప్ ద్వారా రైతులు స్మార్ట్ఫోన్ల ద్వారా యూరియా, డీఏపీ, 20200 వంటి కాంప్లెక్స్ ఎరువులను సులభంగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, ఏఓ అన్నపూర్ణ పీఏసీఎస్ సీఈఓ ప్రేమాచారి, వెంకటేశ్వర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 7వ దశలో ఉత్పత్తి పునరుద్ధరణపాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో విద్యుదుత్పత్తిని శనివారం తెల్లవారుజామున అధికారులు పునరుద్ధరించారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో గురువారం రాత్రి యూనిట్ ట్రిప్ అయింది. వెంటనే మరమ్మతులు చేపట్టినట్లు సీఈ శివరామ్ రెడ్డి తెలిపారు. -
పాప మృతిపై విచారణ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదేళ్ల పాప మృతి చెందిన ఘటనపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ అర్హతకు మించి వైద్యం చేయడంతో పాప మరణించినట్టుగా ‘పరిధి దాటి.. ప్రాణం తీసి’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో మెడికల్ ఆఫీసర్ బాదావత్ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణలతో కూడిన ద్విసభ్య కమిటీ సుజాతనగర్ మండలం మాలపల్లిలోని బాధితుల ఇంటికి వెళ్లి విచారణ చేపట్టింది. నివేదికను డీఎంహెచ్ఓకు రాత పూర్వకంగా అందించారు. ‘ఆగస్టు 5 ఉదయం ఆరేళ్ల చిన్నారికి నీరసంగా ఉండటంతో పాటు ఫిట్స్ వచ్చాయి. దీంతో పాపను ఆమె కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మళ్లీ ఫిట్స్ వచ్చాయి. ఆ తర్వాత శరీరం మొత్తం గట్టిగా అయిపోయింది. కళ్లు తేలేసి స్పృహ లేకుండా పోయింది. ఆ సమయంలో నాడీ, శ్వాస రెండు లేకపోవడంతో పాప చనిపోయిందని తల్లిదండ్రులు నిర్థారించుకున్నారు. దీంతో కొత్తగూడెం వెళ్లకుండా మార్గమధ్యంలోనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చారు. గతంలో పాపకు ఎటువంటి అనా రోగ్య సమస్యలు లేవు, చాలా యాక్టివ్గా ఉండేది.’ అని ద్విసభ్య కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. స్పెషల్ పార్టీ ఓవైపు ఆర్ఎంపీ/పీఎంపీ వైద్యుల దందాపై విమర్శలు ఆరోపణలు వస్తుంటే మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా నగర శివార్లలో ఉన్న ఫంక్షన్ హాల్లో భారీ పార్టీని ఏర్పాటు చేశా రు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలను ఆహ్వానించి, తమ ఆస్పత్రికి పేషెంట్లను రిఫర్ చేయాలని కోరుతూ ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసినట్టు సమాచారం. సుజాతనగర్ ఘటన వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే ప్రైవేటు ఆస్పత్రి, ఆర్ఎంపీలకు పార్టీ ఏర్పాటు చేయడం గమనార్హం. పైగా ఈ పార్టీకి వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొందరు ఉద్యోగులు ప్రత్యేక అతిథులుగా హాజరైనట్టు సమాచారం. -
క్విజ్ పోటీలతో ఆలోచనా శక్తి పెంపు
దమ్మపేట: విద్యార్థుల్లో జ్ఞాపక, ఆలోచన శక్తులు, పోటీ తత్వాన్ని పెంపొందిచేందుకు క్విజ్ పోటీలు దోహదం చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంకంపాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల స్థాయి క్విజ్ పోటీలను పీఓ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి నలుగురిని ఎంపిక చేసి, ఈ నెల 11న ఏటీడీఓ స్థాయిలో, 13న ఐటీడీఏ స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మురళి, ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్ఎం శారద, డిప్యూటీ వార్డెన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి భద్రాచలం: గిరిజన ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధికారుల సమన్వయంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీల సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అధికారులు చందన, అరుణకుమారి, మధుకర్, సమ్మయ్య, వేణు, రమేష్, విజయ్ కుమార్, ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్కు ఆహ్వానం భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి రావాలని ఏపీఓ డేవిడ్రాజ్ శుక్రవారం కలెక్టర్ అంకిత్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
జీజీహెచ్లో నిలిచిన రక్తపరీక్షలు
●రెండు రోజులుగా రోగుల అవస్థలు చుంచుపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు రోజులుగా ల్యాబ్ సేవలు నిలిచి పోయాయి. నీటి సరఫరా నిలిచిపోవడంతో గురు, శుక్రవారాల్లో రక్త పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. ల్యాబ్లో పరీక్షల నిర్వహణ, పరికరాల శుభ్ర త, నమూనాల ప్రాసెసింగ్కు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పరీక్షలు చేపట్టలేకపోయారు. రక్త పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష ల ఫలితాలపై ఆధారపడే వైద్య చికిత్సలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద యం నుంచే రక్త పరీక్షల కోసం వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూసి చివరకు నిరాశతో వెనుదిరిగారు. జీజీహెచ్, ఎంసీహెచ్కు వచ్చిన బాధితులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించా ల్సి వచ్చింది. అధికారులు స్పందించి ల్యాబ్ సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కాగా, రోజూ ఇక్కడ 1000 మంది బాధితులకు సంబంధించి 1500 నుంచి 2000 వరకు రక్త నమూనాలను పరీక్షిస్తారు. బోరు మరమ్మతుల వల్ల సమస్య ఏర్పడిందని, నీటి సరఫరా పునరుద్ధరించగానే ల్యాబ్ సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రి ఆర్ఎంఓ చైతన్య తెలిపారు. -
ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యే ఆగ్రహం
దమ్మపేట: పిల్లలకు కనీసం పేర్లు రాయడం, చదవడం నేర్పడంలో విఫలమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మండలంలోని పార్కలగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పాకలగూడెం, కొత్తూరు గ్రామాల్లో మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థుల రాత, పఠన సామర్థ్యాలను పరిశీలించి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకలగూడెంలో ఐదో తరగతి విద్యార్థి, కనీసం తన ఊరి పేరు కూడా రాయలేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు పాఠశాల సందర్శనలో గ్రామస్తులు తమ పిల్లలకు ఉపాధ్యాయులు ఏమాత్రం చదువు చెప్పడం లేదని ఎమ్మెల్యేకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఊరి పేర్లు రాయడం, పాఠ్యాంశాలను చదవడంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి, సెలవు పెట్టకుండా ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఎమ్మెల్యే ఫోన్లో ఫిర్యాదు చేశారు. -
పెదవాగు ప్రాజెక్టు గేట్లు దించారు!
అశ్వారావుపేటరూరల్: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పొటెత్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 5వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘పెదవాగు నీళ్లు వృథా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎట్టకేలకు నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం మూడు గేట్లను కిందకు దించారు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు భారీగా గండ్లు పడిన సమయంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేయగా, నాటి నుంచి కిందకు దించలేదు. రింగ్ బండ్ నిర్మించి చేతులు దులుపుకున్న నీటి పారుదల శాఖ అధికారులు కనీసం గేట్లను కిందకు దించకుండా వదిలేయడంతో వరదనీరు గోదావరిలో కలుస్తోంది. తాజాగా గేట్లు దించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా లేకపోతే రింగ్బండ్ మళ్లీ కోతకు గురయ్యే అవకాశం ఉంది. -
కనిపించడం లేదని వెతుకుతుండగా..
గోదావరిలో మృతదేహమై తేలిన వ్యక్తి భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే అతడు భద్రాచలం గోదావరిలో మృతదేహంగా తేలాడు. అతడిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గోద రాములు (75)గా పోలీసులు గుర్తించారు. తిరువూరు పోలీసులు మిస్సింగ్ కేసు దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాలు, భద్రాచలం టౌన్ పోలీసుల ప్రచారం నేపథ్యంలో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గోద రాములుకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ నెల 5న తిరువూరు బస్స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అనంతరం ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తిరువూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, రాములు భద్రాచలం బస్సు ఎక్కిన దృశ్యాలు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు గురువారం రాత్రి భద్రాచలం చేరుకుని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం భద్రాచలం వైకుంఠధామం సమీపంలోని గోదావరి ఒడ్డున గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు మృతుడి ఫొటో, దుస్తుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఫొటోను చూసిన కుటుంబ సభ్యులు టౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని మృతదేహాన్ని రాములుదేనని నిర్ధారించారు. రాములు కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నిర్మాణాలు తొలగిస్తున్నా మదిలో జ్ఞాపకాలుగా..
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రమంగా ఒక్కో నిర్మాణం తొలగిస్తున్నారు. చిత్రకూట మండపం, ఉత్తర ద్వారం, అద్దాల మండపం, లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, యాగశాల, భద్రుని గుడి, బేడా మండపం వంటి నిర్మాణాలను కూల్చివేశారు. వీటితో ఎంతో మందికి ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఆయా ఆలయాలు, మండపాల్లో జరిపిన సేవా కాలం, పండుగలు, ఉత్సవాలు, నిత్యకై ంకర్యాలు కళ్లముందు మెదులుతున్నాయి. అధికారులు, సిబ్బంది, అర్చకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆలయ అభివృద్ధిలో జరిగే మార్పులను స్వాగతిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు జరిగే ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను. వీటికి వేదికగా ఉన్న ఉత్తర ద్వారంతో పాటు ఇతర నిర్మాణాలు ఒక్కోటి దూరమవుతున్న క్షణాలు మనస్సును కలిచివేస్తున్నాయి. ఇక్కడి ఉత్సవాలు, పూజలలో పాల్గొన్న క్షణాలు అనిర్వచనీయం. –అమరవాది విజయరాఘవన్, ప్రధాన అర్చకుడు -
గోదావరి వరద ముంపుపై పట్టింపేది?
బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: ఏటా గోదావరి వరద ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల పంటలు నీటమునుగుతున్నా.. పాలకులు పట్టించుకోవటం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా ఆరోపించారు. సీపీఐ ప్రజా చైతన్యయాత్ర శుక్రవారం సారపాక, భద్రాచలం, దుమ్ముగూడెం మీదుగా చర్ల మండలం తిప్పాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో సాబీర్పాషా పాల్గొని ప్రసంగించారు. బూర్గంపాడు మండలంలో గోదావరి వరద ముంపు రాకుండా కరకట్టలు నిర్మించాలని, పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు దాడులు నిలిపివేయాలని కోరారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా దేవస్థాన భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, ఈ స్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమన్నారు. సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించిన తర్వాతే మిగులు జలాలను తరలించాలని, ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో గిరిజన గ్రామాలు, వ్యవసాయ భూములు, అడవులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాజేడు – భద్రాచలం ప్రధాన రహదారి ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు, సహజ వనరులు, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వరరావు, మువ్వా వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మేయర్ గణేశ్, పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, మున్నా లక్ష్మీకుమారి, పేరాల శ్రీని వాస్, సబ్కా నాగేశ్వరరావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, తూర్పాకలో జయరామరెడ్డి స్తూపం, నరసాపురంలో రావులపల్లి నాగభూషణం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా చైతన్యయాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా -
జోర్దారిగా గంజాయి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిఘా వ్యవస్థలు నిరంతరం పని చేస్తున్నా జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గతేడాదితో పోల్చితే కేసుల సంఖ్య తక్కువగా నమోదైనా గంజాయి రవాణాను నిరోధించలేకపోయారు. గంజాయి అడ్డా ఏఓబీ జిల్లాకు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. సమీపంలోనే ఒడిశా రాష్ట్రం కూడా ఉంది. సీలేరు నదికి ఇరువైపులా వ్యాపించిన ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండ ప్రాంతాలను కేంద్రాలుగా ఏఓబీలో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. క్రమంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాలకు విస్తరిస్తోంది. ఏఓబీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోకి ప్రవేశించగానే మూడు జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏఓబీ లో పండించే గంజాయిని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాను డ్రగ్ పెడ్లర్లు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. బైక్ నుంచి బస్సు వరకు హైదరాబాద్ వంటి నగరాల్లో బ్లాక్ మార్కెట్లో గంజాయికి ఫుల్ డిమాండ్ ఉంది. గంజాయిని ఎండబెట్టి, ప్యాకెట్లుగా చేసి తొలి దశలో ఉండే పెడ్లర్ చేతికి వచ్చే సరికి కేజీ ప్యాకెట్ ధర రూ.25వేలుగా ఉంటోంది. ఇది హైదరాబాద్కు చేరాక కేజీ విలువ రూ.లక్ష వరకు పలుకుతోంది. దీంతో వ్యక్తులు, వ్యవస్థీకృత నేర ముఠాలు గంజాయి రవాణాలో భాగస్వాములుగా ఉంటున్నారు. బైక్లు, ఆటో, కారు, ట్రాక్టర్, లారీ, బస్సులు ఇలా వివిధ వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఇందుకోసం వాహనాలకు ప్రత్యేకంగా డిజైన్లు కూడా చేయిస్తున్నారు. ఉక్కుపాదం మోపాలి జిల్లాకు సరిహద్దులో ఉన్న దండకారణ్యం 40 ఏళ్ల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరొందింది. అయితే ఆ ప్రభావం చర్ల, దుమ్ముగూడెం మండలాలను దాటి రాకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. గంజాయి విషయానికి వస్తే పోలీసు, ఎకై ్సజ్ విభాగాలు అక్రమ రవాణాను అడ్డుకునేందుకే పరిమితం అవుతున్నాయి. అందుకు స్థానికంగా సహకరిస్తున్న వ్యక్తులు/ ముఠాల భరతం పట్టడం లేదు. మావోయిస్టు పార్టీకి అడ్డుకట్ట వేసినట్టుగానే గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.ఈ ఏడాది ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా పట్టుబడిన గంజాయి వివరాలు కేసులు గంజాయి విలువ అరైస్టెన వారు (కేజీల్లో) (రూ.లక్షల్లో) పాల్వంచ 14 991 495 57భద్రాచలం 8 42 33 24మణుగూరు 3 82 41 9ఇల్లెందు 4 31 15 11కొత్తగూడెం(2025) 30 3,372 843 141గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తోంది. గతేడాది వివరాలను పరి శీలిస్తే 112 కేసులు నమో దు కాగా, 8,078 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.20.20 కోట్లుగా నమోదైంది. 399 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఈ నెల 5 వరకు వివరాలను పరిశీలిస్తే కొత్తగూడెం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగి లిన నాలుగు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలో 29 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,146 కేజీల గంజాయి పట్టుబడగా, దాని విలువ సుమారు రూ. 2.86 కోట్లుగా తేలింది. ఇలా పట్టుబడిన గంజాయిని పెద్ద మొత్తంలో పోగుపడిన తర్వాత ఎకై ్సజ్ అధికారులు కాల్చి వేస్తున్నారు. ఏఓబీ నుంచి జిల్లా మీదుగా అక్రమంగా రవాణా -
బైక్ను ఢీకొట్టిన లారీ..
మైక్రో ఫైనాన్స్ వ్యాపారికి తీవ్ర గాయాలు జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా జీపీ మర్రిచెట్టుతండా గ్రామ సమీపంలో భద్రాచలం రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోవారి జిల్లా అనపర్తికి చెందిన, మైక్రో ఫైనాన్స్ వ్యా పారి కొవ్వూరి చంద్రారెడ్డి కొత్తగూడెం విద్యానగర్కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఫైనాన్స్ ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కుమారుడితో బైక్పై కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వెళ్తుండగా మర్రిచెట్టుతండా సమీపంలోకి రాగానే వెనక వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. చంద్రారెడ్డి తీవ్రంగా గాయపడగా, అతని కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీడ్రైవర్ సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య దుమ్ముగూడెం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పైడిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్సం బాలరాజు (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..టేకులపల్లి: ఉరివేసుకుని వ్యవసాయ కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోయ గూడెం పంచాయతీ దంతెలతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భూక్యా కిషన్ (40) మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన ఇంకా డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. అందరూ నిద్రపోయిన తర్వాత మద్యం మత్తులోనే శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి ముందు వరండాలోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు చందు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పి.శ్రీనివాస్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అవగాహన కల్పించాలి
ప్రత్యామ్నాయ పంటలపై సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా రైతులను చైతన్యపరచాలని, పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, ప్రత్యామ్నా య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పంటల సాగు, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరు, వన మహోత్సవం తదితర అంశాలపై శుక్రవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని నిర్వహించాలని, అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని, వన మహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. పంచాయతీ అభివృద్ధిలో ప్రణాళికలు కీలకం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరా నికి జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణా ళిక రూపకల్పనపై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతి మండలం రెండు లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. మండల, జిల్లాస్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, సీపీఓ సునీత, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, ఈఈ తిరుమలేష్ పాల్గొన్నారు. హ్యాండ్బుక్ రూపొందించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా జనగణన హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ)ను ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరించి, పూర్తిస్థాయిలో పరిశీ లన, ధ్రువీకరణ అనంతరం జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపొందిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ప్రణాళికాధికారి సునీత, జిల్లా పంచా యతీ అధికారి అనూష, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంచుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మణుగూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ పోస్టుతోపాటు పిల్లల వైద్య నిపుణుడి పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన వైద్యులను నియమించేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం రూ.2 లక్షలు, రూ.2.50 లక్షలు చెల్లిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలని తెలిపారు. నాణ్యమైన ధార్మిక సేవలురామాలయ ఈఓ దామోదర్రావు భద్రాచలంటౌన్: ధార్మిక సేవల నాణ్యత పెంపే లక్ష్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ‘సీత’ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దామోదర్రావు తెలిపారు. గురువారం అంబాసత్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్చకులు, సిబ్బంది, ధార్మిక సేవకుల సామర్థ్యాన్ని పెంచేందుకు తరగతులు దోహదపడతాయన్నారు. సీత సంస్థ డైరెక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు మాట్లాడుతూ శిక్షణలో ఆగమశాస్త్రం, ఆలయ నిర్వహణ, పూజా విధానాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. శ్రీరామ చక్రవర్తి, కృష్ణమాచార్యులు, భవాని రామకృష్ణ పాల్గొన్నారు. -
పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి
పినపాక/మణుగూరు రూరల్: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను గురువారం ఆయన మండల పరిధిలోని బయ్యారం క్రాస్ రోడ్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోడు సమస్యను పరిష్కరించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. అనంతరం మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మణుగూరు మండల పరిధిలోని రామానుజవరంలో సీపీఐ నేత బొల్లోజు అయోధ్యాచారి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. ప్రజా ఉద్యమాల్లో విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, ముత్యాల విశ్వనాథం, కమటం వెంకటేశ్వరరావు, కల్లూరు వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీకుమారి, వై.రాంగోపాల్, తోగాటి కుమార్, గడ్డం మనోహర్ ఆచారి, పత్తిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో ఎమ్మెల్యే కూనంనేని -
జయశంకర్ సేవలు చిరస్మరణీయం
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలం: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ బి.రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్, ఐటీడీఏ, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చూపిన మార్గం, ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులర్పించారు. -
సహకారంలో కాక!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరబోతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకు అప్పగించనున్నారు. ఈ మేరకు ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యాన ఎమ్మెల్యేలు తమ పరిధి పీఏసీఎస్ల్లో పదవులు ఆశిస్తున్న నేతలపై ఆరా తీస్తుండగా.. ఆశావహులు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. తొలిసారి పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ విధానంలో భర్తీ చేయనుండడంతో అధికార పార్టీలో హడావుడి మొదలైంది. పీఏసీఎస్ టు డీసీసీబీ.. జిల్లాలోని పీఏసీఎస్లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు కాగా, 2020లో డీసీసీబీ చైర్మన్గా ఎన్నికై న కూరాకుల నాగభూషణంను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తప్పించింది. 2024 జనవరిలో వైస్ చైర్మన్గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావును చైర్మన్గా నియమించారు. ఆతర్వాత 2025 డిసెంబర్ 19తో డీసీసీబీ పదవీకాలం పూర్తయింది. అనంతరం ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు పొడిగించి చివరకు పాలకవర్గాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం డీసీసీబీకి పర్సన్ ఇన్చార్జ్గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇక పీఏసీఎస్ల పదవీ కాలం ఐదేళ్లకు ముగిసినా ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో వారు కొనసాగుతున్నా, పది రోజుల్లో గడువు ముగియనున్నట్లు సమాచారం. అంతా నామినేటెడే... పీఏసీఎస్లతో పాటు డీసీసీబీ పాలకవర్గాన్ని సైతం నామినేటెడ్ పద్దతిన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో పీఏసీఎస్ల్లో సభ్యులైన రైతులు డైరెక్టర్లను ఎన్నుకున్నాక.. వారిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగేది. ఇక సొసైటీల చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను.. ఆపై డైరెక్టర్లలో చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నుకునే విధానం ఉండేది. ప్రభుత్వం దీనికి స్వస్తి పలికి పీఏసీఎస్ల నుంచి డీసీసీబీ వరకు పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో నియమించాలని భావిస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్తో సహా డీసీసీబీకి మొత్తం 22 మంది డైరెక్టర్లు ఉంటారు. సుమారు 5లక్షల మంది రైతులు పీఏసీఎస్ల్లో సభ్యులుగా ఉండడంతో చైర్మన్ పదవులను నామినేటెడ్ పద్దతిన భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఇదే సమయాన ఆశావవహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేయడం జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారనుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. 2023 ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన వారు కాకుండా గత కొన్నేళ్లుగా పార్టీకి విధేయులుగా ఉంటూ.. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
చెరువుల్లోకి చేరుతున్న నీరు
పాల్వంచరూరల్: ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. కొన్ని నిండి జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 2,144 చెరువులు ఉండగా, ఇందులో 53 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. మరికొన్ని నిండేదశకు చేరుకున్నాయి. ఎక్కువ చెరువుల్లో సగానికి మించి నీరు చేరింది. పాల్వంచ మండలంలోని జోగారావు చెరువు, ఎర్రసాని చెరువు, మందెరకలపాడు వద్ద రాళ్లవాగు పిక్డ్యామ్ అలుగుపోస్తున్నాయి. జగన్నాథపురం, రంగాపురం, నాగారం, దంతలబోరు చెరువుల్లో 75శాతానికి పైగా నీళ్లు చేరాయి. కిన్నెరసాని వాగుచెక్ డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. రైతుల హర్షం కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా నిండిన చెరువుల కింద పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్ట్, ఎర్రసాని చెరువు, రాళ్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షభావ పరిస్థితులు ఉన్నాయి. భారీ వర్షాలు కురువని కారణంగా జిల్లాలో చెరువులు, కుంటలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఈనెలలోనైనా భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయని భావిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నీళ్లు పంటల సాగుకు సరిపోవు. –శ్రీనివాసరెడ్డి, జిల్లా జలవనరులశాఖ సీఈమొత్తం చెరువులు 2,144 అలుగు పోస్తున్నవి 53 25 శాతం వరకు నిండినవి 588 25 నుంచి 50శాతం వరకు నిండినవి 763 50నుంచి75శాతం వరకు నిండిననవి 436 75 నుంచి 100శాతం నిండినవి 304 -
ఆర్టీసీలో ‘గుర్తింపు’ సమరం!
● రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ● దశాబ్ద కాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ● జిల్లాలో 879 మంది ఆర్టీసీ కార్మికులుచుంచుపల్లి: దశాబ్ద కాలం తర్వాత టీజీఎస్ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం కార్మిక శాఖ, ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధమవుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీలో రెండేళ్లకొకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. చివరిసారిగా 2016లో నిర్వహించారు. 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేదు. 2019లో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రభుత్వం సంఘాల గుర్తింపును పూర్తిగా రద్దు చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రాధాన్యం కోల్పోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్నికల నిర్వహణకు హామీ ఇచ్చింది. ఆగస్టులోనే ఎన్నికల నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా లేబర్ కమిషన్తో చర్చలు జరిపిన ఆర్టీసీ సంఘాల జేఏసీ నాయకులు గత మంగళవారం మరోసారి ఎన్నికలపై సమావేశమయ్యారు. అన్ని విధాలా అనుకూలిస్తే ఈ నెల చివరి వారంలో ఎన్నికలు పూర్తిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైతే ఆయా డిపోల పరిధిలో ఎన్నికల వేడి పెరిగే అవకాశం ఉంది. ప్రచారంపై కార్మిక సంఘాల దృష్టి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్మిక సంఘాలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్, టీఎంయూ, టీజేఎంయూ, ఐఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా, గుర్తింపు సంఘాలు రీజియన్, రాష్ట్రస్థాయిలో ఉంటాయి. రెండింటికి వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో కార్మికుడు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది. గెలిచిన యూనియన్ కార్మిక సమస్యల పరిష్కారంలో, కార్మికుల తరఫున ఆర్టీసీ, యాజమాన్యం, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులకు పని ఒత్తిడి తదితర సమస్యలు, సంక్షేమ పథకాలపై యాజమాన్యంతో చర్చించే అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గుర్తింపు సంఘం ఉంటే కార్మిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే డిపోల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా చూస్తున్నాం. –కె.భాస్కర్రావు, రాష్ట్ర సహాయకార్యదర్శి, ఈయూడిపో పేరు సిబ్బంది కొత్తగూడెం 204 భద్రాచలం 362మణుగూరు 210ఇల్లెందు 103 -
ప్రీ ప్రైమరీ విద్య కీలకం
డీఈఓ వాసంతి కొత్తగూడెంఅర్బన్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ విద్య కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రీ ప్రైమరీ శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారుల ఆసక్తిని పెంచేలా వినూత్నమైన యాక్టివిటిస్, నాణ్యమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, కృత్యధార బోధన పద్దతుల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కాగా ఇన్స్ట్రక్టర్లు తయారు చేసిన నమూనాలు, చార్టులు, డ్రాయింగ్లు, కాగితపు వస్తువులు, వినూత్న బోధన పరికరాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏఎంఓ మాధవరావు, ఆర్పీలు స్వరూప్కుమార్, శ్రీశైలం, ప్రవీణ్కుమార్, మోహన్కుమార్ పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలు ప్రారంభం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండోర్ క్రీడలు–2026లో భాగంగా క్యారమ్స్ పోటీలను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.ప్రేమలత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు పరస్పర స్నేహభావం, ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్కుమార్, సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు, కోశాధికారి జి.సంధ్యారాణి, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శులు బానోత్ దేవదాస్, ఎన్.ఉమ, గ్రంథాలయ కార్యదర్శి దొడ్డ ప్రసాద్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఇంట్లోకి చొరబడి విద్యార్థినిపై దాడి బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని జగదీశ్కాలనీలో ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు మహిళలు ఇంట్లోకి చొరబడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కొట్టడంతో పాటు చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాచలం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా లక్కవరం మోడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నెల 1న భద్రాచలంలోని తన నివాసంలో ఉంది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో బూర్గంపాడు మండలానికి చెందిన స్వరూప, పాల్వంచకు చెందిన రజిత(స్వరూప చెల్లి) ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, విద్యార్థినితో వాగ్వాదానికి దిగి, అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకుని ఇంటి నుంచి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో దాడి ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన బాధితురాలి తల్లి, పెద్దమ్మ, సోదరుడినీ కూడా దూషించి బెదిరించి, చంపేస్తామని వారు హెచ్చరించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, దాడి చేసిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం మార్కెట్కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: వారాంతం, బోనాలు, అమావాస్య సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించారు. ఈనెల 8వ తేదీ శనివారం, 9న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 10వ తేదీన సోమవారం బోనాల సందర్భంగా ప్రభుత్వం సెలవుప్రకటించింది. ఇక 11వ తేదీ మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు జరగనుండగా, 12వ తేదీ బుధవారం అమావాస్య కావడంతో సెలవు అమలవుతుంది. తిరిగి 13వ తేదీ గురువారం నుంచి మార్కెట్ యార్డులో కార్యకలాపాలు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. -
అమృత భాండాగారం
ఖమ్మంవైద్యవిభాగం: తల్లి పాలు శిశువుకు అమృతం వంటివి. బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు పట్టిస్తే ఆ శిశువు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరడమే కాక ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. అయితే, కొందరు తల్లులకు సరిపడా పాలు రాక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరికొందరు తల్లులకు పాలు లభించినా శిశువుకు పట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా ఆయా శిశువులకు డబ్బా పాలు పట్టిస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో 2022 మే నెలలో ‘అమృతం’ పేరిట తల్లిపాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాలు ఎక్కువగా వచ్చే తల్లుల నుంచి సేకరించి భద్రపరుస్తూ పాలు రాని తల్లుల పిల్లలకు అందిస్తున్నారు. అలాగే పాలు వచ్చినా పట్టించలేని తల్లులు కూడా ఈ కేంద్రంలో పాలను డబ్బాల్లో సేకరించి శిశువులకు పట్టించే అవకాశం కల్పించారు. నాలుగేళ్లుగా సేవలు పెద్దాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల సేకరణ కేంద్రం నాలుగేళ్లుగా విస్తృత సేవలు అందిస్తోంది. నిత్యం 20 – 25 వరకు ప్రసవాలు జరుగుతుండగా, బరువు తక్కువగా, ఇతర అనారోగ్య సమస్యలతో పుట్టిన వారికి ఎస్ఎన్సీయూలో చికిత్స అందిస్తారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించి అనారోగ్య సమస్యలకు గురైన శిశువులను కూడా ఎంసీహెచ్ఎస్కు తీసుకొస్తున్నారు. వీరిలో చాలామంది శిశువులకు తల్లి నేరుగా పాలు పట్టించడం సాధ్యం కాక డబ్బా పాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమాన మిల్క్ బ్యాంక్లో పాలు ఎక్కువ పడే తల్లులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా సేకరించి అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ కేంద్రం ద్వారా 10,861 మంది తల్లుల నుంచి 2,969 లీటర్ల పాలు సేకరించి శిశువులకు అందించారు. పెద్దాస్పత్రిలో చికిత్స పొందే శిశువులకే కాక శిశుగృహలో ఉండే పిల్లలకు 159 లీటర్ల పాలు సరఫరా చేయడం విశేషం.నాకు వారం క్రితం బిడ్డ పుట్టింది. శిశువుకు పాలు ఇచ్చాక కూడా మిగులుతున్నాయి. ఇక్కడి సిబ్బంది మిల్క్ బ్యాంక్ సేవలను వివరించారు. దీంతో అవసరమైన శిశువులకు ఉపయోగపడతాయని పాలు ఇస్తున్నా. –ఎన్.అనూష, జూలూరుపాడు నాకు మొదటి కాన్పులో ఇద్దరు శిశువులు జన్మించారు. వీరు బరువు తక్కువగా ఉండటంతో ఎస్ఎన్సీయూలో చికిత్స చేస్తున్నారు. పాలు పట్టే పరిస్థితి లేక మిల్క్ బ్యాంక్లో సేకరించి డబ్బాల ద్వారా పిల్లలకు పడుతున్నా. –బి.అశ్విని, కారేపల్లి గర్భిణులు, బాలింతలకు వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరించిన పాలను అవసరమైన వారికి అందిస్తున్నాం. తల్లి పాలే శిశువు ఆరోగ్యానికి సంజీవనిలా నిలుస్తాయి. –బాబురత్నాకర్, చిన్న పిల్లల వైద్య నిపుణులు పాలు అందించిన తల్లులు 10,681 మంది స్వచ్ఛందంగా వచ్చిన వారు 5,299 మంది ఇప్పటి వరకు సేకరించిన పాలు 2,969 లీటర్లు లబ్ధి పొందిన శిశువులు 12,494 మంది -
696.1 కిలోల గంజాయి దహనం
తల్లాడ/కొత్తగూడెంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ (వ్యర్థ పదార్థాల నివారణ పరిశ్రమ)లో దహనం చేశారు. భద్రాద్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 కేసులకు సంబంధించి 696.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.50 కోట్లు కాగా, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి ఆదేశాలతో గురువారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, కొత్తగూడెం డీపీఈఓ ఎ.శ్రీనివాసరెడ్డి, సీఐ జయశ్రీ, ఎస్ఐలు రమేశ్, గౌతమ్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో లారీడ్రైవర్ బీభత్సం
దుమ్ముగూడెం: మండలంలోని కేశపట్నం సమీపంలోని చిన్ననల్లబల్లి వద్ద గురువారం లారీడ్రైవర్ నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ ఇసుక లోడుతో ఉన్న లారీని వేగంగా నడుపుతూ రోడ్డుకు దూరంగా పార్క్ చేసిన ఆటోను ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాడి ఘటనపై కేసు నమోదు ములకలపల్లి: ప్రైవేట్ సైట్ ఇంజనీర్పై దాడికి పాల్పడిన ఘటనలో ఒకరిపై కేసు నమోదైంది. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. కమలాపురం శివారు సీతారామ పంప్హౌస్–3 సమీపంలో ప్యాకేజ్–6లో ఓ కంపెనీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పనులు సాగుతున్నాయి. అక్కడ సైట్ ఇంజనీర్గా తరుణ్ పని చేస్తున్నాడు. ములకలపల్లి శివారుకు చెందిన మహేశ్ గురువారం వర్క్సైట్కు వెళ్లి తరుణ్తో వాగ్వాదానికి దిగాడు. గతంలో తాము చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాంటూ అడిగాడు. తరుణ్పై చేయి చేసుకుని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. తరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ విద్యుత్ స్తంభాలను తొలగించండి..
పాల్వంచరూరల్: వైల్డ్లైఫ్ పరిధిలో విద్యుత్శాఖ అధికారులు అనుమతులు లేకుండా గిరిజన రైతుల వ్యవసాయ కనెక్షన్ల్కోసం వేసిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని వైల్డ్లైఫ్ శాఖ రేంజర్ కనకమ్మ ఆ శాఖ ఏడీఈ, ఏఈలకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. మండలంలోని బంజర గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్టీఎఫ్సీ స్కీమ్ కింద రెండు నెలల క్రితం ఎన్పీడీసీఎల్ అధికారులు 32 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో అనుమతి లేకుండా వైల్డ్లైఫ్ పరిధిలో విద్యుత్ స్తంభాలు ఎలా వేస్తారని, వెంటనే తొలగించాలని వైల్డ్లైఫ్ చాతకొండ రేంజర్ కనకమ్మ ఎన్పీడీసీఎల్ ఏడీఈ, రూరల్ ఏఈలకు నోటీసులు జారీ చేశారు. వైల్డ్లైఫ్ పరిధిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలంటే ఢిల్లీ బోర్డు నుంచి, స్థానిక వైల్డ్లైఫ్ డివిజన్ ద్వారా క్లియరెన్స్ అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఐటీడీఏ ద్వారా అనుమతులు ఇచ్చిన తర్వాత స్తంభాలు ఏర్పాట్లు చేశామని ఏఈ రవీందర్ తెలిపారు. విద్యుత్ స్తంభాల నిర్మాణం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో గురువారం ఎన్పీడీసీఎల్ ఏడీఈ హుస్సేన్ బంజర గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్, రైతులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు తొలగించాల్సి ఉందని వివరించారు. విద్యుత్ అధికారులకు వైల్డ్లైఫ్ రేంజర్ నోటీసులు -
మాతృ మరణాలను నివారించాలి
సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ/పాల్వంచరూరల్: మాతృ మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ అంకిత్ ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన మాతృ మరణాలపై కలెక్టరేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, 108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యూనివర్సల్ న్యూ బోర్న్ బేబీస్ ఐ స్క్రీనింగ్ – ఆర్క్ లైట్ ఎగ్జామినేషన్’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవజాత శిశువులకు కంటి పరీక్షలు నిర్వహించి, పుట్టుకతో వచ్చే కంటి లోపాలకు చికిత్స అందించాలని సూచించారు. ఆర్క్ లైట్ పరికరం వినియోగం నిపుణులు అవగాహన కల్పించారు. ఆ తర్వాత భూ భారతి రిజిస్ట్రేషన్, సక్షేషన్ మాడ్యూళ్లపై నిర్వహించిన శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండాలని చెప్పారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనంత రామకృష్ణ భూ భారతి రిజిస్ట్రేషన్, సక్సేషన్ మాడ్యూళ్ల అమలు విధానం, పత్రాల పరిశీలన, భూ భారతి వ్యవస్థలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇందిరమ్మ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం గ్రామాల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. ప్రతీ దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం బస్వతారాకకాలనీలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాల నాణ్యతను పరిశీలించారు. ఆ తర్వాత పాల్వంచ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులు, రక్త పరీక్ష సెంటర్, ఫార్మసీ, మందుల నిల్వ గదులను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ మధు, డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రాందాస్, డాక్టర్ దినేష్, పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ పి.రాజారావు, హౌసింగ్ పీడీ రామ్, ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు ఎన్.దిలీప్కుమార్, రాజేష్, సత్యేంద్రకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
కూల్చారు గానీ..
● భద్రగిరిలో శిథిలాల తరలింపు ఆలస్యం ● అరకొర యంత్రాలతో నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియ ● పనులు వేగం పుంజుకోక అధికారుల అసహనం ● రాములోరి దర్శనంపై ప్రచార లోపం.. భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనుల్లో శిథిలాల తొలగింపే పెనుభారంగా కనపడుతోంది. భవనాలు, ప్రాకారాలు కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ వాటి శిథిలాల తొలగింపు మరింత ఆలస్యమవుతోంది. ఆలయ పనుల పరిశీలనకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు, జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు యంత్రాలను పెంచి రాత్రింబవళ్లు పనులు షిఫ్ట్ల వారీగా చేపట్టాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించటం లేదు. దీంతో నిర్దేశిత సమయంలో పనులు జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ల గుట్టల్లా శిథిలాలు ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఉపాలయాలు, ఇతర కట్టడాల కూల్చివేత పనులు జూన్ 27వ తేదీన ప్రారంభమయ్యాయి. తొలుత రంగనాయకుల గుట్ట పైన ఉన్న కుసుమ హరనాథబాబా, ప్రసాదాల తయారీ భవనం, ఆ తరువాత చిత్రకూట మండపం, దక్షిణం వైపు మెట్లు, గదులను కూల్చారు. ఉత్తరం దిక్కున ద్వారం, మెట్లను పడేశారు. ఆలయ ప్రాంగణంలో తాజాగా యాగశాల, భద్రుని గుడి లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, అద్దాల మండపాలను కూల్చారు. ఇలా మూడు పక్కల పనుల కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ వాటి తాలూకు రాళ్లు, ఇతరాల తొలగింపు మాత్రం ఆలస్యమవుతోంది. ముక్కోటి నాటికి నూతన ఉత్తర ద్వారం పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేయటంతో ఆ వైపు హడావుడిగా నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐతే నెలరోజుల క్రితం కుసుమ హరనాథబాబ ఆలయం, వంటశాల వైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం. రాళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ప్రచార లోపం, భక్తులకు ఇక్కట్లు శిథిలాల తొలగింపు ఆలస్యమవుతుండటంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో సైతం పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కేవలం తూర్పు మెట్ల ద్వారానే దర్శనాలకు భక్తులకు అనుమతినిస్తున్నారు. దీనిపై అధికారులు తగిన ప్రచారం చేయకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. గోదావరి నుంచి పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తూర్పు మెట్ల వైపు రావడానికి తగు సూచిక బోర్డులు లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైకుల ద్వారా ప్రధాన కూడళ్లలో, ఆలయం చుట్టుపక్కల ప్రచారం చేయాలని పలువురు సూచిస్తున్నారు. పనులను పరిశీలించిన ఈఓ దేవస్థానం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురువారం ఆలయ ఈఓ దామోదర్రావు పరిశీలించారు. పడమర మెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో తూర్పు వైపు కౌంటర్ల ఏర్పాటుకు వేస్తున్న షెడ్ను, ఉత్తరం, దక్షిణ భాగంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రవీందర్, ఆలయ అధికారులు ఉన్నారు. పనులు ఆలస్యంగా జరుగుతుండడంపై అధికారులు సదరు నిర్మాణ సంస్థ భాధ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యవధి తక్కువగా ఉండటం, పనులు నెమ్మదిగా జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరకొర యంత్రాలతో శిథిలాల తొలగింపునకే నెలలు పడుతోందని, ఈ ప్రకారం నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి కావని వారు చెబుతున్నారు. షిఫ్ట్ల వారీగా కార్మికులతో, రాత్రింబవళ్లు పనులు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పూర్తి కాకపోవడంతో పనుల పురోగతిపై తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. -
అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీఒక్కరు అవగాహన పెంపొందించుకుంటేనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమవుతుందని ఎస్పీరోహిత్ రాజ్ తెలిపారు. ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నానాటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నందున విద్యార్థినులకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులు, యాప్లు, మ్యూల్ అకౌంట్ల ద్వారా నిందితులు నమ్మించి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ సమయంలో అధిక లాభాలు, ఉద్యోగ, సినిమా అవకాశాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చే మెసేజ్లు, లింక్లను నమ్మొద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని ఎస్పీ తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ సదస్సులో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు జితేందర్, శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు శారద, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ -
ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మంత్రుల భేటీ
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, డాక్టర్ మట్టా రాగమయి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావహులపై చర్చించడమే కాక ఎమ్మెల్యేలు నుంచి పేర్లు సేకరించారు.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ -
9న శాకంబరీ అవతారంలో పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్: మండంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారు ఈనెల 9న శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి అలంకరణ కోసం కావాల్సిన పండ్లు, వివిధ రకాల కూరగాయలు, పూలను దాతలు వితరణ చేయొచ్చని ఈఓ విజయ్కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న భక్తులు ఈనెల 8వ తేదీ శనివారం నాటికి ఆలయంలో అందజేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. గుండాల గురుకులం ప్రిన్సిపాల్కు పదోన్నతి గుండాల: గుండాల గిరిజన గురుకుల కళా శాల ప్రిన్సిపాల్ నారా యణనాయక్కు ఆర్సీఓగా పదోన్నతి లభించింది. ఏడాది కాలంగా ఆయన ఇక్క డ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు నారాయణకు పదోన్నతి కల్పించడమే కాక మహబూబాబాద్ ఆర్సీఓగా నియమిస్తూ గురుకులాల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన మహబూబాబాద్లో బుధవారం బాధ్యతలు స్వీకరించగా, గుండాల కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలను వైస్ ప్రిన్సిపాల్ విప్పా సత్యనారాయణకు అప్పగించారు. నేడు ఆర్ఎల్సీతో ఏఐటీయూసీ చర్చలు రుద్రంపూర్: సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ 30 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యాన ఆర్ఎల్సీ సమక్షాన గురువా రం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఓసారి చర్చలు జరిగినా ఒప్పందం కుదరకపోవడంతో 6వ తేదీన హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో రెండోసారి చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో ఒప్పందాలు కుదిరితే సమ్మె నోటీసు వెనక్కి తీసుకుంటామని, లేనిపక్షంలో సమ్మె తప్పదని ఏఐటీయూసీ నాయకులు చెబుతున్నారు. కాగా, గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలపై చాన్నాళ్లు ఉదాసీనంగా వ్యవహరించి, సెప్టెంబర్లో కాలపరిమితి ముగుస్తుండగా సమ్మె నోటీసు ఇవ్వడంపై కార్మికుల్లో అనుమానాలు నెలకొన్నా యి. ఏదేమైనా గురువారం నాటి చర్చల్లో 30 డిమాండ్లకు గాను కనీసం 20 సాధించినా ఫర్వాలేదని భావిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్లో పతకాలురుద్రంపూర్: హైదరాబాద్లో ఈనెల 1, 2వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్లో భారత్ తరఫున పాల్గొన్న కొత్తగూడెం సింగరేణి మహిళా జూని యర్ కళాశాల విద్యార్థిని భూక్యా శ్రీవిద్య ప్రతి భ కనబరిచింది. ఆమె కరాటే కటాస్ విభాగంలో స్వర్ణం, కుమిటే విభాగంలో మరో పతకం సాధించింది. ఈ సందర్భంగా శ్రీవిద్యను సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ జి.రాజేంద్రప్రసాద్, కరస్పాండెంట్ పి.కాంతారావు, ప్రిన్సిపాల్ టి.సంధ్యారాణి, పీఈటీ ఏ.లావణ్య బుధవారం అభినందించారు. టీసీ సీపీగెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ మణుగూరు రూరల్: రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో ప్రవేశానికి కాకతీయ యూ నివర్సిటీ ఆధ్వర్యాన నిర్వహించిన టీజీసీపీ గెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో మణుగూరుకు చెందిన భూక్యా భరత్ రాష్ట్ర స్థాయి 19వ ర్యాంక్ సాధించాడు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసిన ఆయన సీపీ గెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడంపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యర్నం చిన్నప్పయ్యతో పాటు అధ్యాపకులు బుధవారం అభినందించారు. బాల పురస్కార్ దరఖాస్తు గడువు పెంపు ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. గతంలో ఉన్న గడువు జూలై 31తో ముగియగా, ఆగస్టు 15 వరకు పొడిగించారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 – 18 ఏళ్ల లోపు బాలబాలికలు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన వారు, బాలల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఏడేళ్లకు పైగా సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు https:// awards. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
న్యాయం చేయాలని ఆందోళన
టేకులపల్లి: టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధి హనుమతండాకు చెందిన గుగులోతు శ్రీకాంత్(25) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నేళ్లుగా ఖమ్మం కస్నానాయక్ తండాకు చెందిన యువతిని ప్రేమించినట్లు తెలిసింది. ఈక్రమాన యువతి బావలు హాము, సచిన్ బెదిరించడం, యువతి కూడా దూరం కావడంతో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గత నెల 21న వారిపై కేసు నమోదు చేసినా ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై బుధవారం మృతుడి తల్లిదండ్రులు రవి, జ్యోతి, బంధువులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోగా ఎస్ఐ తిరుపతి, సిబ్బంది వారితో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై నచ్చచెప్పడంతో ఆందోళనను విరమించారు. పోలీసుస్టేషన్ ఎదుట యువకుడి కుటుంబీకుల ధర్నా -
ఆలయ మర్యాదలపై అవగాహన తప్పనిసరి
భద్రాచలం: దేవాదాయ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది దేవస్థానం, ఆలయ మర్యాదలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్(సీత) డైరెక్టర్గా చిలకపాటి విజయరాఘవాచార్యులు పేర్కొన్నారు. ‘సీత’ఆధ్వర్యాన భద్రాచలంలోని అంబసత్రంలో మూడు రోజుల పాటు ఉద్యోగులకు జరగనున్న వర్క్షాప్ బుధవారం మొదలైంది. ఈ సందర్భంగా విజయరాఘవచార్యులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ సిబ్బందికి ప్రభుత్వ పాలన, వ్యవస్థలు, సిబ్బంది కార్యదర్శకత, సంప్రదాయం, ఆగ మ శాస్త్రం, ఆలయ ఆచారాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల నిర్వహణను ఆధునికంగా, పారదర్శకంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈఓ దామోదర్రావు మాట్లాడుతూ సుమారు 15ఏళ్ల అనంతరం శిక్షణ పునఃప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. శిక్షణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఉద్యోగులు 120 మంది పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భవానీ రామకృష్ణ, స్థానాచార్యులు స్థలశాయి, రామాయణ పారాయణదారు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు, అకా డమీ నుంచి శ్రీరామ చక్రదర్ పాల్గొన్నారు. ‘సీత’వర్క్షాప్లో డైరెక్టర్ విజయరాఘవులు -
‘కోడ్’ దందా..
కొత్తగూడెంఅర్బన్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంటున్నా కొత్తగూడెం కార్యాలయంలో మాత్రం ఏజెంట్లు ఓ అడుగు ముందుకేస్తున్నట్లు తెలిసింది. వాహనదారులకు అన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతు న్నా.. ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎవరికి ఏ అవసరం కావాలన్నా ఏజెంట్లను కలవకుండా నేరుగా వెళ్తే ముప్పుతిప్పలు ఎదురవుతున్నాయి. ఇదే సమయాన ఏజెంట్లను కలిసి వారు చెప్పినంత చెల్లిస్తే లైసెన్స్లు, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఇలా ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. ఈక్రమాన వారు అన్ని వివరాలను నింపి ప్రత్యేక కోడ్ వేసి ఇచ్చే పత్రాన్ని కార్యాలయంలో సమర్పిస్తే దాని ఆధారంగా అంతా సాఫీగా సాగిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. నేరుగా వెళ్తే తిరగాల్సిందే... సామాన్యులు లైసెన్స్, ఇతర పనుల కోసం నేరుగా అన్ని పత్రాలతో వెళ్లినా కార్యాలయంలో పనులు కావడం లేదని చెబుతున్నారు. ఫలితంగా ఏజెంట్ను ఆశ్రయిస్తే ఒకటి, రెండు రోజుల్లోనే లైసెన్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు అందుతున్నాయి. అయితే, డ్రైవింగ్ రాని వారు, నిబంధనలు తెలియని వారికి డబ్బులు తీసుకుని.. కనీస పరీక్షలు చేయకుండా లైసెన్స్ ఇప్పిస్తుండడంతో ప్రమాదాలు జరిగితే ఎవరు కారణమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క తనిఖీల సందర్భంగా పర్మిట్ లేని వాహనాలు కంటపడితే ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారికి రూ.వేలు, రూ.లక్షకు పైగా జరిమానా విధించిన ఘటనలు ఉన్నాయని తెలుస్తోంది. ఈక్రమాన అధికారులు – వాహనదారుల నడుమ కొందరు సిబ్బంది మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం.ఆర్టీఓలో ఏజెంట్లదే హవా -
అవన్నీ మరిచారా?!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తొలి పాలకవర్గం తెరపైకి తీసుకొచ్చిన ట్రాన్సిట్ ఓరియెంటెండ్ డెవలప్మెంట్ ప్లాన్పై మిశ్రమ స్పందన వస్తోంది. నగర అభివృద్ధికి ఆయువు పట్టయిన మాస్టర్ ప్లాన్, ప్రణాళికాయుతమైన అభివృద్ధికి దిక్సూచి వంటి ‘కుడా’ భాగస్వామ్యం లేకుండా ప్లాన్ తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, రుణాల రూపంలో కాకుండా ప్రభుత్వ గ్రాంట్గానే పనులు చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇప్పటికే డీపీఆర్ తయారీ టెండర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నందున భవిష్యత్లో చేపట్టే పనులైనా విమర్శలకు తావివ్వకుండా చేపట్టాలని నగరవాసులు సూచిస్తున్నారు. ట్రాన్సిట్ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో కొత్తగూడెం – పాల్వంచ– సుజాతనగర్ గ్రోత్ కారిడార్ ప్రకటించడంతో అనూహ్యంగా ట్రాన్సిట్ ఓరియెంటెండ్ డెవలప్మెంట్ ప్లాన్ తెరపైకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు విదేశీ బ్యాంకు రుణంతో మొత్తంగా రూ.600 కోట్లతో నగర పరిధిలో అభివద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధమైంది. ఊహించనిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై ప్రజల నుంచి సానుకూలత వస్తున్నా, అభివృద్ధికి అప్పులతో లంకె పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా నగర అభివృద్ధి ప్రణాళికలో కీలకమైన మాస్టర్ ప్లాన్, కుడా వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కదలిక లేని మాస్టర్ ప్లాన్, ‘కుడా’ ఒక పట్టణం లేదా నగరంలో నివసించే ప్రజలకు అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆ నగర లేదా పట్టణం ఆదాయం పెరిగేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా అభివృద్ధి పనులు ప్రణాళికాయుతంగా చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ అవసరం. పక్కా మాస్టర్ ప్లాన్లు ఉన్న పట్టణాలు/నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. కొత్తగూడెం, పాల్వంచ వేర్వేరు మున్సిపాలిటీలుగా ఉన్నప్పటి నుంచి ఈ రెండు పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు లేవు. ఈ రెండు పట్టణాలను ఒక్కటిగా చేసి, అందులో సుజాతనగర్ మండలంలో ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ గతేడాది మేలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. అంతకు ముందే 2024 అక్టోబర్ 28న కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు ‘కుడా’కు పాలకవర్గాన్ని నియమించలేదు. కొత్తగూడెం కార్పొరేషన్కు మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయంలోనూ కదలిక లేదు. ట్రాన్సిట్ ప్లాన్ పట్టాలెక్కించే ముందు మాస్టర్ప్లాన్, ‘కుడా’పైనా కూడా కసరత్తు చేయాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. 90వ దశకం తర్వాత కొత్తగూడెం, పాల్వంచలో అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. 2016లో కొత్తగూడెం జిల్లా కేంద్రమైన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల వంటి నగరాలతో పోల్చితే అభివృద్ధి ఆశించిన వేగంతో లేదు. ఈ సమయాన ట్రాన్సిట్ ప్లాన్ను కార్పొరేషన్ తలకెత్తుకుంది. ఈ ట్రాన్సిట్ ప్లాన్ బడ్జెట్ రూ.600 కోట్లలో రూ.300 కోట్లు విదేశీ బ్యాంకు నుంచి రుణం రూపంలో సమీకరిస్తున్నారు. ఈ రుణానికి సాలీనా 13 శాతం వడ్డీరేటుతో ఏటా రూ.39 కోట్లు తిరిగి చెల్లించాలని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్కు అధిక ఆదాయం సమకూర్చే ప్రాపర్టీ ట్యాక్స్ ఏడాది సుమారు రూ.13 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్పొరేషన్కు వచ్చే ఆదాయం.. చేయబోయే అప్పులను బేరీజు వేసుకుని ట్రాన్సిట్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లడం నగర భవిష్యత్కు మేలు చేస్తుంది. అభివృద్ధికి ఖర్చయే నిధులను అప్పు రూపంలో కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్), కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) వంటి ఇతర మార్గాల ద్వారా, ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో పొందేందుకు ప్రయత్నించాలని నగర వాసులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్ మరిచి.. ట్రాన్సిట్ తెచ్చారు.. -
అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి
విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అంకిత్సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగంగా పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014 నుంచి 2026 జూలై వరకు నమోదైన 1,104 అట్రాసిటీ కేసులకు 859 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 12 కేసుల్లో శిక్షలు నమోదయ్యాయని తెలిపారు. కేసుల విచారణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధితులకు త్వరగా న్యాయం అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన 949 కేసుల్లో 823 కేసులకు పరిహారం మంజూరైందని, 105 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ హక్కులు, పోక్సో చట్టం, మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్తో పాటు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సూపర్బజార్(కొత్తగూడెం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడంతో సిబ్బందికి సహకారం అందించాలని తెలిపారు.కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి 8,60,051 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మరో 1,29,263 ఫారాలు అందలేదని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రంగప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేయాలా.. వద్దా ?
● నగదు మోసపోయిన బాధితుల్లో ఆవేదన ● పెట్టుబడుల పేరిట మోసం విలువ రూ.52కోట్లు ● ఇప్పటి వరకు ఫిర్యాదు చేసింది ఇద్దరే..భద్రాచలంఅర్బన్: నెలకు నాలుగు శాతం వడ్డీ... సురక్షిత పెట్టుబడి... కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం... ఇలా నమ్మకంగా చెప్పిన మాటలతో డబ్బు అప్పగించిన పలువురు ఇప్పుడు తాము మోసపోయామని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. భద్రాచలానికి చెందిన భరత్ రకరకాల పేర్లతో పలువురి నుంచి సుమారు రూ.52 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నా ఇప్పటివరకు పోలీసులకు ఇద్దరు మాత్రమే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే అధిక వడ్డీకి ఆశ పడినట్లు తెలిసి పరువు పోతుందని కొందరు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. మరికొందరు మాత్రం ఎప్పటికై నా డబ్బు తిరిగి వస్తుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దసంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. అలాగే, భద్రాచలం రాజీవ్నగర్లోని ఇంటిని కూడా సీజ్ చేసినా బాధితులు పెద్దగా ముందుకు రాకపోవడం గమనార్హం. చెల్లింపులు ఆగాక వెలుగులోకి... కొంతకాలం తర్వాత భరత్ వడ్డీ చెల్లింపులు నిలిచివేయడమే కాక బిల్లులు రావాల్సి ఉందని, కాంట్రాక్ట్ చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని నమ్మబలికినట్లు తెలిసింది. నెలలు వేచి చూసినా ఫలితం లేకపోవడమే కాక భరత్, ఆయన కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. కొందరు బాధితులు ఆయన ఇంటి వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి పోలీసులు విచారణ చేపట్టి కేరళలో భరత్ను అరెస్ట్ చేశారు. ఏపీలోనూ బాధితులు భరత్ పెట్టుబడుల సేకరణ వ్యవహారం భద్రాచలాన్ని దాటి ఏపీలోని చింతూరుకు చేరినట్లు సమాచారం. అయితే అక్కడి బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయకపోగా, డబ్బు తిరిగి వస్తుందనే భావనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులే చింతూరు సహా పరిసర ప్రాంతాల్లోనూ బాధితుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు అప్పులు చేసి, మరికొందరు భూములు అమ్మి, బంగారం తాకట్టు పెట్టి భరత్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన ఓ వ్యక్తి రూ.8.95 కోట్లు వడ్డీకి ఇవ్వగా విడతల వారీగా రూ.4.07 కోట్లు తిరిగి చెల్లించినా ఇంకా రూ.4.87 కోట్లు బాకీ ఉందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే, పాల్వంచ రూరల్ మండలం యానంబైల్కు ఓ మహిళ మూడేళ్ల క్రితం భరత్కు విడతల వారీగా రూ.1.46 కోట్లు ఇచ్చి లాభం చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లగా తాళం ఉండడంతో పోలీసులను ఆశ్రయించింది. అలాగే, పాల్వంచ మండలంలోనే మరో 10 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. లావాదేవీలపై ఆరా నిందితుడైన భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలు, చెక్కులు, డిజిటల్ రికార్డులు, ఆస్తుల కొనుగోళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తున్నారు. నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఒక భవనం, ఫ్లాట్ను ఇప్పటికే సీజ్ చేశారు. మరికొందరి బాధితుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ అనంతరం ఈ మోసం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఒకప్పుడు చిన్నస్థాయి లేబర్ కాంట్రాక్టర్గా ఉన్న భరత్ కాలక్రమేణా ఆర్థికంగా ఎదిగి ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులకు యజమానిగా మారాడు. విలాసవంతమైన జీవనశైలి, రాజకీయ, వ్యాపార వర్గాల్లో పరిచయాలతో నమ్మకమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. అదే నమ్మకంతో మొదట బంధువులు, స్నేహితులు, వ్యాపార పరిచయాలున్న వారినే లక్ష్యంగా చేసుకొని పెట్టుబడులు సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఐటీసీ కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తా, నెలకు నాలుగు శాతం వడ్డీ వస్తుందని చెబుతూ ఆయన పెట్టుబడులు సేకరించినట్లు తెలిసింది. ప్రారంభంలో కొందరికి వడ్డీ సకాలంలో చెల్లించడంతో నమ్మకం పెరగగా ఇంకొందరు ముందుకొచ్చారు. అంతేకాక వారి స్నేహితులు, పరిచయస్తుల ద్వారా కూడా పెట్టుబడి పెట్టించగా రశీదులు, ఒప్పంద పత్రాలు ఇవ్వడంతో నమ్మకం బలిపడిందని తెలుస్తోంది. -
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలు ఖమ్మంమయూరిసెంటర్: భారత్నెట్ ద్వారా తెలంగాణలో బ్రాడ్బ్యాండ్ సేవలు, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలను వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పాలన, విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు టెలికాం మౌలిక వసతులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 356 గ్రామాలు మొబైల్ నెట్వర్క్ కలిగి ఉండగా, 355 గ్రామాలు 4జీ, 5జీ పరిధిలోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 361 గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ ఉండగా.. అందులో 357 గ్రామాల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిపాలతో శిశువుకు ఆరోగ్యం ‘లాక్టేషన్ యూనిట్’ను ప్రారంభించిన ఐటీడీఏ పీఓ భద్రాచలంఅర్బన్: నవజాత శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని, ప్రతీ శిశువుకు తల్లి పాలు పట్టేలా వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ బాలింత శిశువుకు తల్లి పాలు మాత్రమే అందించేలా ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన యూనిట్ ద్వారా తల్లులకు పాలు ఇచ్చే విధానంపై కౌన్సెలింగ్, పాల సేకరణ, సురక్షితంగా భద్రపరచడం వంటి సేవలు అందుతాయని తెలిపారు. అలాగే, పాల నిల్వ గది, దుస్తులు మార్చుకునే గది ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్, డీసీహెచ్ఎస్ రవిబాబు, డీడబ్ల్యూఓ తెనినా, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు రాజశేఖర్రెడ్డి, ఆర్ఎంఓలు సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లిపాక పీఏసీఎస్లో అక్రమాలు నిజమే... రూ.22 లక్షలు పక్కదారి, చైర్మన్, సీఈఓ నుంచి రికవరీకి ఆదేశాలు అశ్వాపురం: మండలంలోని నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.22,07,441 మేర అవకతవకలు నిజమేనని నిర్ధారణ అయింది. ఆడిట్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. పీఏసీఎస్ పరిధిలో 2021–22లో అవకతవకలు జరిగాయని చైర్మన్, సీఈఓపై పాలకవర్గ బాధ్యులు డీసీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేయించగా నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలింది. ఈమేరకు నగదు రికవరీ కోసం డీసీఓ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్ 60 ప్రకారం చైర్మన్, సస్పెన్షన్లో ఉన్న సీఈఓ నుంచి ఉమ్మడిగా రూ.20,30,122, సీఈఓ నుంచి రూ.1,77,319ను ఏటా 18శాతం వడ్డీతో వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గోదావరి రెండో బ్రిడ్జిపై త్వరలోనే రాకపోకలు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుబూర్గంపాడు/భద్రాచలం: గోదావరి నదిపై సారపాక – భద్రాచలం మధ్య నిర్మించిన రెండో బ్రిడ్జిపై రాకపోకలను ఈ నెలలోనే పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రెండవ బ్రిడ్జి అప్రోచ్ కుంగడంతో ఇటీవల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను బుధవారం మంత్రి పరిశీలించి నేషనల్ హైవే అధికారులకు సూచనలు చేశారు. బ్రిడ్జి అప్రోచ్కు పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనులు పూర్తిచేసి రాకపోకలకు అనుమతిస్తే భద్రాచలం వచ్చే భక్తులతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సారపాక సర్పంచ్ కిశోర్నాయక్, ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
ఇల్లెందు న్యాయమూర్తికి డాక్టరేట్
ఇల్లెందు: ఇల్లెందు కోర్టు న్యాయమూర్తి స్వరూప కాటం న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. ‘రైట్ టూ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండర్ ది కాన్స్ట్యూషన్ ఆఫ్ ఇండియా’అనే అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించగా, బుధవారం న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించిన స్వరూప మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థితికి చేరానని తెలిపారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివే సమయాన మూడు బంగారు పతాకాలు సాధించినట్లు వెల్లడించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. రూ.5.43 లక్షల విలువైన గంజాయి స్వాధీనంభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.5.43లక్షల విలు వైన గంజాయి పట్టుబడింది. భద్రాచలం టౌన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యాన ఈనెల 2వ తేదీన రాత్రి తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్ర శ్నించగా ఛత్తీస్గఢ్కు చెందిన వివేక్ విరాట్నాగ్, ఒడిశాకు చెందిన గంజాయి వ్యాపారి నితీష్కుమార్గా తేలింది. ఈమేరకు హైదరాబాద్ తరలించేందుకు సిద్ధం చేసిన 10.870 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విరాట్నాగ్ను అరెస్ట్ చేయగా నితీష్ పరారయ్యాడు. -
ఈనెల రెండో వారంలోగా యూనిఫామ్
ములకలపల్లి: జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్, గురుకులాల విద్యార్థులకు ఈనెల 10వ తేదీలోగా, ఏకలవ్య విద్యార్థులకు 13లోగా ఒక జత యూనిఫామ్ అందించాలని అదనపు కలెక్టర్ విద్యాచందన సూచించారు. ములకలపల్లి మండలం మూకమామిడిలోని యూనిఫామ్ హబ్ను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఆతర్వాత గ్రామసమాఖ్య భవన నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అలాగే, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంతో పాటు పెట్లం గ్రామంలో గ్రామసమాఖ్య నిర్మాణాలు, యూని ఫామ్ ెంసటర్లను ఆమె పరిశీలించారు. సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి, ఎంపీడీఓలు సత్యనారాయణ, రాజేశ్వరి, ఈజీఎస్ ఏపీఓ హుస్సేన్, ఏపీఎం రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ క్యాన్ కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
కరకగూడెం: రోడ్డుపై పడిపోయిన డీజిల్ క్యాన్ తీసుకునేందుకు బైక్ దిగిన ఆ యువకుడికి అదే చివరి క్షణమైంది. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటనకు సంబంధించి కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు తెలిపిన వివరాలు... మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కొమరం రాంగోపాల్(24) తన స్నేహితుడు పూనేం సందీప్తో కలిసి మంగళవారం అర్ధరాత్రి కరకగూడెం బంక్కు వెళ్లి క్యాన్లో డీజిల్ తీసుకుని బైక్పై వస్తున్నాడు. మార్గమధ్యలో డీజిల్ క్యాన్ కిందపడగా దానిని తీసుకునేందుకు బైక్ దిగాడు. అదే సమయాన వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాంగోపాల్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతితో తల్లిదండ్రులు కొమరం సుబ్బారావు, లక్ష్మీభాయి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై రాంగోపాల్ సోదరుడు సురేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేధింపుల కేసు నమోదుభద్రాచలంఅర్బన్: భర్త, అత్తమామ వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భద్రాచలం టౌన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అశోక్నగర్ కాలనీకి చెందిన మహేశ్వరి – సుధీర్బాబు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోకవరంలో నివాసం ఉంటున్న భర్తతో పాటు అత్తమామ వేధిస్తున్నారని మహేశ్వరి ఫిర్యాదు చేయగా బుధవారం కేసు నమోదు చేశారు. భూ వివాదంలో ముగ్గురిపై... ములకలపల్లి: భూమిలోకి అక్రమంగా ప్రవేఽశించి, దున్నిన ఘటనపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జగన్నాథపురంకు చెందిన షేక్ మౌలానా భూమిలోకి గత నెల 31న అర్ధరాత్రి ముత్యాలంపాడు గ్రామానికి చెందిన కొందరు ప్రవేశించి దున్నారు. ఈమేరకు మౌలానా బుధవారం ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. యువకుడిని బలితీసుకున్న వాహనం -
డిప్సైడ్–2 బ్లాక్ ఎవరి ఘనతా కాదు..
రుద్రంపూర్: మణుగూరు ఏరియాలోని డిప్సైడ్–2 బ్లాక్ సింగరేణి దక్కడాన్ని ఎవరికి వారు తమ ఘనతా చెప్పుకోవడం గర్హనీయమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలంలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడకపోవడంతో సింగరేణి కేటాయించగా కొన్ని యూనియన్లు వారి ఘనతగా చెప్పుకోవడం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా ఇదే ప్రకటన చేయ డం సరికాదన్నారు. ఒకవేళ కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే శ్రావణపల్లి ఓసీ, గోల్లేటి, ఆర్కే, పూజపల్లి, మణుగూరు ఎక్స్టెన్షన్ గనులకు అటవీ అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, మణుగూరు డిప్సైడ్–2 బ్లాక్ కోసం జెన్కో టెండర్లో పాల్గొనడం వల్ల సింగరేణికి 4శాతంకు బదులు 6.5 రాయల్టీతో వచ్చిందని, తద్వారా సంస్థపై రూ.కోట్ల బారం పడనుందని రాజిరెడ్డి తెలిపారు. కాగా, నాడు కేసీఆర్ వేలం లేకుండానే బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని, ప్రైవేట్కు ఇస్తే అడ్డుకుంటామని చెప్పడంతో అప్పుడు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు శంకర్, విజయ్కుమార్, మహిధర్, వెంకటేశ్వర్లు, నవీన్, రాజేష్, వినీత్, శంకర్, తిరుపతి, దేవ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి -
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు
పాల్వంచ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు గురువారం నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్ పాషా తెలిపారు. పాల్వంచలోని చండ్ర రాజేశ్వరరావు భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలం కాగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అంతేకాక పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, పంటలకు కనీస మద్దతు ధర లేక నష్టం ఎదురవుతోందని చెప్పారు. ఈ సమస్యలతో పాటు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, కేటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ల ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు, సీతారామ ప్రాజెక్ట్ పూర్తి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలను ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తామని సాబీర్పాషా తెలిపారు. ఈసమావేశంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాధం, అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
బూర్గంపాడు వైపూ కరకట్ట
● మొదటి దశలో బూర్గంపాడు, నాగినేనిప్రోల వద్ద నిర్మాణం ● రూ.33.72 కోట్లతో 280 ఎకరాల భూసేకరణకు అనుమతిబూర్గంపాడు: గోదావరి వరదలతో ఏటా తీవ్రంగా నష్టపోతున్న బూర్గంపాడు మండలానికి వరద ముప్పు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కిన్నెరసాని వైపు నుంచి కూడా నీళ్లు రాకుండా ఫేస్–1లో సంజీవరెడ్డిపాలెం నుంచి బూర్గంపాడు మీదుగా నాగినేనిప్రోలు వరకు గోదావరికి కరకట్ట నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సుమారు 280 ఎకరాల భూసేకరణ చేయాలని ఇరిగేషన్ అధికారులు నివేదించగా, రూ.33.72 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వచ్చే ఏడాది గోదావరి వరదల నాటికి పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ ప్రక్రియ వారం రోజుల్లో ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫేస్–2లో.. గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే సారపాక, మోతె పట్టీనగర్, ఇరవెండి, దుమ్ముగూడెం మండలంలోని కొన్ని గ్రామాలకు ఫేస్–2లో కరకట్టలు నిర్మించనుంది. అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఫేస్–3లో కరకట్టలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భద్రాచలం పట్టణానికి చుట్టూ కరకట్ట ఉండటంతో ఈ ఏడాది గోదావరి వరద ఎదురుగా ఉన్న బూర్గంపాడు మండలంపై పడింది. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, సారపాకలపై ప్రభావం పెరిగింది. గతంలో 60 అడుగుల వరద వచ్చినప్పుడు ఏ మేరకు ముంపునకు గురైందో.. మూడురోజుల క్రితం వచ్చిన 56 అడుగుల వరదతో అదేస్థాయిలో ముంపునకు గురైందని స్థానికులు, రైతులు చెబుతున్నారు. భద్రాచలం వైపు గోదావరికి కరకట్ట పొడవు పెంచటంతో బూర్గంపాడు వైపు పంటలు ఎక్కువగా నీట మునిగాయని ఆవేదన చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. -
ఆధ్యాత్మికత ఉట్టిపడాలి
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలసి దేవస్థానంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణాల రూపక ల్పనలో ఆలయ ప్రాచీనతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తర ద్వార నిర్మాణ పనులను ముక్కోటి ఏకాదశి లోగా, పునరుద్ధరణ పనులు గోదావరి పుష్కరాలలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆలయం నుంచి గోదావరి ఘాట్ వరకు కాలినడకన వెళ్తూ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యంపై పలు సూచనలు చేశారు. పనుల పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ నుంచి ప్రత్యేకంగా అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అభివృద్ధి మ్యాప్ను పరిశీలించారు. అధికారులు శ్రావణ్కుమార్, రవికుమార్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
భవిష్యత్కు భరోసా
మణుగూరు టౌన్: మణుగూరులోని పీకేఓసీ–2డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మణుగూరు ఏరియా మనుగడకు మరో 25 ఏళ్లు భరోసా లభించింది. మణుగూరు ఏరియాలో కొండాపురం భూగర్భగని, మూడు ఓపెన్కాస్ట్లు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. సింగరేణితో ముడిపడిన భవిష్యత్ విస్తరణ నేపథ్యంలో మణుగూరు ఓసీలో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయిది. పీకేఓసీలోని ఓసీ–2, ఓసీ–4ల్లోనే వార్షికంగా 9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇంకా 55 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, మరో ఐదేళ్ల వరకు వెలికితీసే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో మణుగూరు ఓసీలో ఉత్పత్తి ప్రారంభమైనా ఏటా రెండు మిలియన్ టన్నులే వస్తుంది. ఈ నేపథ్యంలో మణుగూరు మనుగడకు పీకేఓసీ–2డిప్ సైడ్ బ్లాక్ కీలకంగా మారింది. ఇక్కడ పనిచేసే సుమారు 2,300 మంది పర్మనెంట్, 3,600 మంది కాంట్రాక్ట్ కార్మికులతోపాటు పరోక్షంగా ఆధార పడే కుటుంబాల భవి ష్యత్ సింగరేణితో ముడిపడి ఉంది. ఈ క్రమంలోనే బొగ్గు బ్లాకులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేయడంతో సింగరేణి పాల్గొని దక్కించుకుంది. 2050 వరకు ఢోకా లేదు ప్రస్తుతం ఉన్న ఓసీలను కొనసాగిస్తే మరో ఐదేళ్ల తర్వాత మణుగూరు ఓసీ, కేపీయూజీల నుంచి వచ్చే బొగ్గు కేవలం ఏడాదికి మూడు మిలియన్ టన్నులకే ఏరియా పరిమితంకానుంది. పీకేఓసీ–2 బ్లాక్ సింగరేణి సిగలో చేరడంతో భవిష్యత్కు భరోసా లభించింది. బ్లాక్లో 110 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారికంగా చెబుతుండగా, 180 మిలియన్ టన్నుల వరకు ఉండొచ్చని అధికారవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే జీ–8 గ్రేడ్ బొగ్గుకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఏటా 60 లక్షల టన్నులు వెలికితీసినా సుమారు 25 ఏళ్లపాటు కార్మిక కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. పీకేఓసీ–2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే లభించడం శుభపరిణామం. సమష్టి కృషితోనే సాధ్యమైంది. మణుగూరు మనుగడ కోసం సింగరేణికే రావాలని కార్మికులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు బలంగా డిమాండ్ చేశారు. సింగరేణిపై ఆధారపడి ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు. –దుర్గం రాంచందర్, మణుగూరు ఏరియా జీఎం -
వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ రాజీవ్సాగర్
అశ్వాపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ రాజీవ్ సాగర్ అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరు పంప్ హౌస్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించే మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి మోటార్లు అమర్చే ప్రక్రియను ఆయన మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ చేపట్టిన రాజీవ్సాగర్ ప్రాజెక్న్టు రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్గా గత ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాజశేఖరరెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెంచిందని ఆరోపించారు. ప్రాజెక్ట్ పేర్లు మారినా రైతులకు నీళ్లు అందుతున్నాయంటే అంతా వైఎస్సార్ చలవేనని అన్నారు. మారెళ్లపాడు లిఫ్ట్ ఎడమ కాలువ ద్వారా 8 వేల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు శ్రీనివాస్, సూర్యప్రకాష్, ముత్యాలరావు, కాంగ్రెస్ నాయకుడు ఓరుగంటి రమేష్ పాల్గొన్నారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -
ప్రతిపాదనలపైనా అభ్యంతరాలు
అంచనా వ్యయం (రూ.కోట్లలో)45 కి.మీ మేరకు 6 లేన్ల ఆధునిక రోడ్డు కార్పొరేషన్ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ కొత్తగూడెంలో కార్పొరేషన్ నూతన భవనం కార్పొరేషన్ ప్రాంగణంలో ఆడిటోరియం పాల్వంచ కార్పొరేషన్ ఆఫీస్లో ఆడిటోరియం కొత్తగూడెం రైతుమార్కెట్ దగ్గర మల్టీప్లెక్స్ కొత్తగూడెం, పాల్వంచ బస్స్టేషన్ల కొత్త భవనాలు పాల్వంచ డంపింగ్ యార్డ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ పాల్వంచ శ్రీనివాస కాలనీలో క్రికెట్ స్టేడియం బృందావన కాలనీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొత్తగూడెం ప్రగతి మైదాన్ అభివృద్ధి సుజాతనగర్ తాగునీటి పథకం పార్కుల అభివృద్ధి రాతి చెరువు, మేడికుంట చెరువుల అభివృద్ధి కొత్తగూడెంలో మల్టీ పర్పస్ హాల్ కొత్తగూడెంలో డిజిటల్ లైబ్రరీమొత్తం -
నేటి నుంచి జేఎంఈటీల దీక్షలు
రుద్రంపూర్: ఓవర్మెన్ ప్రమోషన్ కోసం వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జేఎంఈటీలు ఈ నెల 5,6,7 తేదీల్లో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టనున్నారు. 2016–17 బ్యాచ్కు చెందిన వీరు సంస్థలో షార్ట్పైరర్, మైనింగ్ సర్దార్, సీనియర్ మైనింగ్ సర్దార్లుగా పనిచేస్తున్నారు. గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందజేసి, సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో దీక్షలు చేపడుతున్నట్లు జేఎంఈటీలు తెలిపారు. నేడు తల్లిపాల బ్యాంక్ ప్రారంభంభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లిపాలను భద్రపరిచే బ్యాంకు (హ్యూమన్ మిల్క్ బ్యాంక్)ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించనున్నారు. ఆస్పత్రిలో ప్రతీ నెల 200 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతుండగా, తల్లి లేదా శిశువు ఆరోగ్య పరిస్థితుల కారణంగా వెంటనే పాలివ్వలేని సందర్భాల్లో తల్లి నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా పాలను సేకరించి భద్రపరిచి తిరిగి అదే శిశువుకు అందించనున్నారు. ముర్రుపాలను కూడా ప్రత్యేకంగా నిల్వ చేసే ఏర్పాట్లు చేశారు. ఒకేసారి పది మంది బాలింతల పాలను భద్రపరిచే సామర్థ్యం ఈ బ్యాంకుకు ఉండగా, నిర్వహణ కోసం నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. నవజాత శిశువులకు తల్లిపాలు సకాలంలో అందించేందుకు మిల్క్ బ్యాంక్ ఉపయోగపడుతుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెండో రోజు కిన్నెరసాని పరిశీలనపాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్ను రెండో రోజు మంగళవారం ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత(సీడీఎస్ఈ) బృందం పరిశీలించింది. చైర్మన్ రామారావు, సభ్యులు వెంకటరమణ, శ్రీకాంత్, లక్ష్మణ్రావు మొండికట్ట మార్గం వైపు కరకట్టను పరిశీలించారు. లీకులపై ఆరా తీశారు. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కేటీపీఎస్ 5వ దశ ఈఈ వెంకటేశ్వరరావు, ఏడీఈ రామకృష్ణ, ఏఈ సురేష్ ఉన్నారు. ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్లు ఆవిష్కరణసూపర్బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర, తెలంగాణ సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఎస్పీ రోహిత్రాజు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు జితేందర్, శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణారావు, ఎస్సై జుబేదా బేగం, పాల్గొన్నారు. మండలాల్లోనూ ప్రజావాణిమార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం భద్రాచలంఅర్బన్: మండలస్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ ఎంఎస్ నంబర్4ను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీఓతో పాటు తహసీల్దార్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. భద్రాచలం ప్రాంతంలో ఇప్పటికే ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజా జీవోతో మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయం కూడా ప్రజావాణి వేదికగా మారనుంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్నచిన్న సమస్యల కోసం డివిజన్ లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అధికారులు ఒకే వేదిక పై అందుబాటులో ఉండటంతో ఫిర్యాదుల పరిష్కారం వేగవంతంకానుంది. -
ప్రజారోగ్యంపై పట్టింపేది?
అశ్వారావుపేటరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలు కుంటుపడుతున్నాయి. ఈసారి వానాకాలంలో మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టలేదు. దీనికితోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవు. సబ్ సెంటర్ల పరిధిలో ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండటంతో వ్యాక్సినేషన్ సక్రమంగా సాగడంలేదు. జిల్లా వ్యాప్తంగా 63 మంది వైద్యాధికారుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరో 39 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్మాన్, యునాని వైద్యులకు ఇన్చార్జి బాధ్యతలెలా..? మెడికల్ ఆఫీసర్ల స్థానంలో పలుచోట్ల తాత్కాలికం పేరుతో ఆయుష్మాన్, యునాని వైద్యులకు ఇన్చార్జి బాధ్యతలు కేటాయించారు. పీహెచ్సీల్లో ఆయుష్మాన్, యునాని వైద్యులతో డెంగీ, మలేరియా, విష జ్వరాలకు వైద్య సేవలు అందించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పలువురు పేర్కొంటున్నారు. తమది కానీ శాఖలో ఆయుష్మాన్, యునాని వైద్యులతో చికిత్స ఎలా చేస్తారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమల మందు స్ప్రే మరిచిపోయారు.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏటా ఆయా గ్రామాల్లో వర్షాకాలం సీజన్కు ముందే దోమల మందు స్ప్రే చేస్తారు. పదేళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో 292 గ్రామాలను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇప్పటివరకు స్ప్రే చేయలేదు. ఏటా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కావడిగుండ్ల, కొత్త కావడిగుండ్ల, చెన్నాపురం, కన్నాయిగూడెం, కంట్లం, రేగళ్ల, గోగులపూడి, దురదపాడు, ఉడుములబండ, మొద్దులమడ, పెద్దమిద్దె, రెడ్డిగూడెం, బండారుగుంపు, సుద్దగోతులగూడెం, తోగూడెం, తిరుమలకుంట ఎస్టీ కాలనీ గ్రామాలతోపాటు భద్రాచలం, గుండాల ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఏటా మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. దోమల మందు స్ప్రే చేయకపోవడంతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఏడాది దోమ తెరలు కూడా పంపిణీ చేయలేదు. మొబైల్ వైద్యానికి మంగళం పీహెచ్సీల పరిధిలో మొబైల్ వైద్యుల బృందం, సిబ్బంది గిరిజన గ్రామాలకు నిత్యం వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించేవారు. మొబైల్ వైద్య బృందాల్లోని డాక్టర్లను పీహెచ్సీల్లో నియమించడంతో.. మొబైల్ వైద్య సేవలు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బడ్జెట్ లేని కారణంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు పీహెచ్సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీకి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్, యునాని వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పీహెచ్సీలకు తాత్కాలికంగా కేటాయించారు. దోమల మందు స్ప్రే కొద్ది రోజుల్లో ప్రారంభమవుతంది. బడ్జెట్ లేకపోవడంతో మొబైల్ వైద్య సేవలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. –డాక్టర్ రాందాస్ నాయక్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్అశ్వారావుపేట మండలాన్ని పరిశీలిస్తే వినాయకపురం పీహెచ్సీలో ఇద్దరు, గుమ్మడవల్లి పీహెచ్సీ ఇద్దరు చొప్పున వైద్యాధికారులు ఉండాలి. కానీ ఈ రెండు చోట్ల ఒక్క వైద్యాధికారి కూడా లేరు. దమ్మపేట మండలంలోని దమ్మపేట, పట్వారీగూడెం, ములకలపల్లి మండలంలోని మంగపేట పీహెచ్సీ, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి పీహెచ్సీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వినాయకపురం పీహెచ్సీ వైద్యాధికారిని డిప్యూటేషన్పై జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. మరికొందరు వైద్యులు మూడు నెలల క్రితమే పీజీ, ఉన్నత విద్య కోసం వెళ్లగా, ఆ స్థానాల్లో సర్దుబాటు చేయలేదు. పీహెచ్సీ మే–2026 జూన్–2026 జూలై 27వరకు ఓపీ జ్వరాలు ఓపీ జ్వరాలు ఓపీ జ్వరాలు వినాయకపురం 921 117 1,169 153 1,435 264 గుమ్మడవల్లి 979 106 1,029 123 1,369 196 దమ్మపేట 1,154 79 806 85 1,024 100 పట్వారీగూడెం 921 88 964 94 1,037 136 మొత్తం 3,975 390 3,868 455 4,865 696 -
●పెదవాగు నీళ్లు వృథా..
అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్టు మధ్యతరహా ప్రాజెక్టులో వరదనీరు కొద్ది రోజు లుగా వృథాగాపోతోంది. రెండేళ్ల క్రితం కురిసి న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు భారీ గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఆ నాటి నుంచి ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోవడం లేదు. తాత్కాలి కంగా రింగ్బండ్ నిర్మించి చేతులు దులుపుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో వాగుల నుంచి వస్తున్న వరదనీరు ప్రాజెక్టు మూడు గేట్ల నుంచి వృథాగా బయటకు వెళ్లి దిగువలో ఉన్న గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆయకట్టు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
మక్కలకు యమ డిమాండ్!
ఖమ్మంవ్యవసాయం: ‘ఎల్నినో’ నేపథ్యాన మక్కలకు డిమాండ్కు పెరిగింది. పౌల్ట్రీ పరిశ్రమలు, ఇంధన(ఇథనాల్) కంపెనీలు ఆసక్తి చూపడంతో మార్క్ఫెడ్ ద్వారా వేలంలో మెరుగైన ధర పలికింది. గత యాసంగి సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 కన్నా తక్కువ ధర పలుకుతుండడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.31 లక్షల మెట్రిక్ టన్నులను రూ.795 కోట్లను వెచ్చించి కొనుగోలు చేయగా, దాదాపు 50 వేల మె.టన్నులను ఓపెన్ షెడ్లలో, మిగిలిన పంట క్లోజ్డ్ షెడ్లలో నిల్వ చేశారు. తొలుత ఓపెన్ షెడ్లలో మక్కలకు రక్షణ లేకపోవడంతో టెండర్లు నిర్వహించగా క్వింటాకు రూ. 2,200 ధరే పలకడంతో నష్టం ఎదురైంది. ఆతర్వాత క్లోజ్డ్ షెడ్లలో ఉన్న మక్కల అమ్మకానికి ఈ–వేలం వేయగా క్వింటాకు రూ.2,490 నుంచి రూ.2,560 ధర పలికింది. ఫలితంగా మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన దాని కంటే అధిక ధర వచ్చినట్లయింది. ఓపెన్ షెడ్లలో ఉన్న మక్కలను తొలుత పంపిస్తుండగా, ఆ తర్వాత మిగతా సరుకు పంపిస్తామని మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ బత్తుల నరసింహారావు తెలిపారు. కొన్న ధర కంటే వేలంలో అధికం -
లాభాల పేరుతో మోసగిస్తున్న కేటుగాడి అరెస్టు
అశ్వారావుపేటరూరల్: బ్లాక్ మనీ, లాభాల పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బ్లాక్ పేపర్లు, లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకోగా అశ్వారావుపేటలోని సీఐ కార్యాలయంలో పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూ రు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రేమ్చంద్ ప్రస్తుతం అశ్వారావుపేట ఫైర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా జల్సాలకు అలవాటు పడిన ఆయన నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మిస్తున్నాడు. ఈక్రమాన అశ్వారావుపేటకు చెందిన వ్యాపారి మధుబాబును గతేడాది డిసెంబర్లో కలిసి తనకు రూ.15 లక్షలు ఇస్తే కొద్ది రోజుల్లోనే రూ.కోటి ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా బ్లాక్ పేపర్లను ద్రావణంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతాయని (అసలైన నోట్లను వేళ్ల మధ్య దాచి తీస్తూ) నమ్మించాడు. ఆపై సదరు వ్యాపారి నుంచి తొలుత రూ.11లక్షలు, ఆతర్వాత ద్రావణం కొనుగోలుకు మరో రూ.2లక్షలు తీసుకుని ముఖం చాటేశాడు. నెలలు గడుస్తున్నా రూ.కోటి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి మంగళవారం ఫైర్ కాలనీలోని నివాసంలో ప్రేమ్చంద్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన బ్లాక్ పేపర్ల కట్టలతోపాటు, రెండు లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడు ఇదే తరహాలో హైదరాబాద్లోని బాచుపల్లి, కూకట్పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో పలువురి మోసం చేయడమే కాక ద్విచక్రవాహనాల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగరాజు రెడ్డి, ఎస్ఐలు టి.యయాతీ రాజు, దేవ్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. బ్లాక్ పేపర్లు, లిక్విడ్ బాటిళ్లు స్వాధీనం -
పట్టా ఇప్పిస్తానని మోసం
న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు దమ్మపేట: వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయిస్తానని రూ. లక్ష డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో బాధితుడు తెలిపిన వివరాలు... మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన వృద్ధ రైతు గండిపూడి వెంకటేశ్వరరావుకు సర్వే నంబర్ 143లో అర ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి పట్టా ఇప్పిస్తానని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నమ్మబలికి రూ.50 వేలు వసూలు చేశాడు. కొంతకాలం తర్వాత మరో రూ.50 వేలు కావాలని, లేకపోతే పాస్ బుక్ రాదని తెలిపాడు. దీంతో మోసపోయనని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తహసీల్దార్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరాడు. -
కారేపల్లి మండల వాసికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: కారేపల్లి మండలం గుడితండాకు చెందిన భూక్యా వెంకటేష్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ఆయన ఫిజిక్స్ విభాగంలో ‘సింథసిస్, క్వారటరైజేషన్, ఫొటో క్వాటిలిటిక్ డై డిగరడేషన్ అప్లికేషన్స్ ఆఫ్ రేర్ – ఎర్త్ మెటల్ ఆయాన్ కో సబ్స్టిట్యూటెడ్ క్వాడమియం కోబాల్ట్ స్పినల్ నానో ఫైరెట్స్’ అంశంపై ప్రొఫెసర్ జె.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో పరిశోధనాపత్రం సమర్పించారు. ఈమేరకు ఓ యూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం సైఫాబాద్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్ను పలువురు అభినందించారు. వేట కేసులో మరో ఇద్దరి అరెస్ట్ తల్లాడ: విద్యుత్ తీగలు అమర్చి ఎలుగుబంటిని హతమార్చిన కేసులో పరారీ లో ఉన్న ఇద్దరు నిందితులను అటవీ శాఖాదికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్ చేయగా, కొత్త బోడుమల్లెకు అజ్మీరా కృష్ణ, లోకారానికి చెందిన ఏనుగంటి రామకృష్ణ పట్టుబడ్డారని తల్లాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమ తెలిపారు. తల్లాడలో మంగళవారం ఆమె మాట్లాడుతూ నిందితులను సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చి, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం ఖమ్మం జిల్లా జైలుకు తరరలించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ఉద్యోగులు పి.సురేష్కుమార్, ఆఫీసర్, రమేష్, అజమ్ ఆలీ, తెనాలి శ్రీను, తేజావత్ కృష్ణ, అమ్జద్పాషా, నాగరాజు పాల్గొన్నారు. 4.25 కేజీల గంజాయి స్వాధీనంఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫామ్ వెనకాల ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో గంజాయి లభించింది. ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న నలు గురు పట్టుబడగా, వారి నుంచి 4.25 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలించి నట్లు ఖమ్మం–2 ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.చంద్రమోహన్ తెలిపారు. -
పర్యాటక ప్రాంతంగా మార్చండి..
● తుమ్మలచెరువులో బోటు షికారుకే పరిమితం ● కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు ● బోటింగ్కు వచ్చే వారికి కనీస సౌకర్యాలు కరువు గత కలెక్టర్ హయాంలో.. గత కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ హయాంలో తుమ్మలచెరువు పర్యాటక అభివృద్ధిపై ప్రతిపాదనలు చేశారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ప్రత్యేకించి సందర్శించేలా బోట్ షికారుతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. పర్ణశాల, భద్రాచలం, సీతారామ, సీతమ్మసాగర్లను కలుపుతూ తుమ్మలచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. తుమ్మలచెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు దృష్టి సారించాలని పర్యాటక అభివృద్ధి ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. సౌకర్యాలు ఏవి? గత కలెక్టర్ ప్రతిపాదనల మేరకు తుమ్మలచెరువులో డబుల్ పెడల్ బోట్లు, స్కల్లింగ్ బోట్లు, ఫ్లోటింగ్ జెట్టి వంటివి తెప్పించారు. చుట్టుపక్కల మండలాల నుంచి వందలాది మంది వచ్చి బోటు షికారు చేస్తుంటారు. గతేడాది ముమ్మరంగా బోటు షికారు కొనసాగింది. నిర్వహణ బాధ్యతలను గ్రామంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. జిల్లాలోని యువతకు ప్రత్యేకమైన బోటింగ్పై శిక్షణ ఇచ్చారు. అయితే, తుమ్మలచెరువు వద్ద బోటింగ్కు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. బోటు కోసం వేచి ఉండే పర్యాటకులు నీడ లేక ఎండలో, వర్షంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బోటింగ్ వద్దకు రావడానికి తుమ్మలచెరువు వరకు సరైన రహదారి సౌకర్యం లేదు. ప్రాథమికంగా తుమ్మలచెరువుకు రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బోట్ షికారుకు వీలుగా చెరువు కట్టకు పలుచోట్ల మెట్ల నిర్మాణం, క్యాంటీన్, విశ్రాంతి కోసం హాలు, ఉద్యానవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. బోటింగ్కు తగిన సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. మండలంలోని కాకతీయులకాలంలో నిర్మించిన తుమ్మల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా తుమ్మలచెరువును పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. – అశ్వాపురం -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మణుగూరు టౌన్/కరకగూడెం: వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అరోగ్యశాఖాధికారి తుకారాం రాథోడ్ సూచించారు. మంగళవారం శివలింగాపురం పీహెచ్సీని సందర్శించిన ఆయన ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కరకగూడెం, పినపాక, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ఆశా డే కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు రవితేజ, అనిల్, వేణు, సిబ్బంది నాగభూషణం, పోలెబోయిన కృష్ణయ్య పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలిభద్రాచలంటౌన్: ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీఓ బి.రాహుల్ పేర్కొన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల విజయవంతానికి అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతి నిధులతో ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు డేవిడ్ రాజ్, విజయ్ కుమార్, శ్రీనివాస్, ఆదినారాయణ పాల్గొన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహించాలిబూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి సూచించారు. బూర్గంపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను, విద్యాబోధన తీరు, మధ్యాహ్న భోజనం అమలు తీరు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. హెచ్ఎం రవిలాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైకిల్పై ఆధ్యాత్మిక యాత్రభద్రాచలంఅర్బన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ జిల్లా బటవాపూర్ గ్రామానికి చెందిన హేమంత్ వత్స్ అనే వ్యక్తి సైకిల్పై ఆధ్యాత్మిక యాత్ర చేపట్టాడు. భద్రాచలం చేరుకున్న సందర్భంగా మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించాడు. ఇప్పటివరకు సుమారు దేశవ్యాప్తంగా 67 వేల కిలోమీటర్ల దూరం సైకిల్పై ప్రయాణించినట్లు తెలిపాడు. 2023 జూలై 18న యాత్ర ప్రారంభించానని, అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నానని వివరించాడు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. కరోనా సమయంలో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయానని, ఆ విషాదం నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టానని వివరించాడు. యాత్రలో ఎవరైనా ఆహారం అందిస్తే స్వీకరిస్తానని, లేకపోతే స్వయంగా వండుకుంటానని చెప్పాడు. నేపాల్, శ్రీలంక దేశాల్లోని ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపాడు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
టేకులపల్లి: మండల పరిధిలోని టేకులపల్లి పంచాయతీ ఏ కాలనీ తండాకు చెందిన రైతు మంగళవా రం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. ఇంట్లోని ఫ్యాన్ పని చేయకపోవడంతో రైతు ధారావత్ తులిశ్యా (55) మరమ్మతులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం 108లో కొత్తగూడెం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఈఎంటీ రాధ, పైలట్ వెంకట రామారావు సీపీఆర్ చేశారు. కాగా, ఆస్పత్రి వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులుఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తిరుపతి తెలిపారు. వివాహిత ఆత్మహత్యదుమ్ముగూడెం: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన వివాహిత పూనెం సంధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటప్పయ్య తెలిపిన వివరాలు.. సంధ్యకు 6 నెలల క్రితం సాయి అనే యువకుడితో వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల రోజులకు రోడ్డు ప్రమాదం జరగ్గా, సాయి మృతి చెందాడు. సంధ్యకు కాలు విరిగింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. భర్త చనిపోవడం, తాను గాయపడటంతో మనస్తాపం చెంది గత నెల 27న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డి మందు తాగి కూలీ..అశ్వారావుపేటరూరల్: గడ్డి మందు తాగి ఓ కూలీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని పాత నారంవారిగూడేనికి చెందిన సత్తినపల్లి పెంటయ్య(53) కొద్ది కాలంగా అతిగా మద్యం తాగుతున్నాడు. సోమవారం రాత్రి కూడా మద్యం తాగడంతో కుటుంబీకులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘కిన్నెరసాని’కి ఢోకా లేదు
పాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్కు మరో 50 ఏళ్ల వరకు ఢోకాలేదని ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత పరిశీలన(సీడీఎస్ఈ) బృందం చైర్మన్ రామరాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సోమవారం సభ్యులు వెంకటరమణ, శ్రీకాంత్, లక్ష్మణ్రావుతో కలిసి ఆయన కిన్నెరసాని ప్రాజెక్ట్ను సందర్శించారు. నీటి నిల్వ సామర్థ్యం, పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు సరఫరాపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 175 ప్రాజెక్టులు ఉండగా, ఇప్పటివరకు 60 ప్రాజెక్టులను పరిశీలించామని తెలిపారు. 1962లో నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్ట్ చెక్కుచెదరలేదన్నారు. లోపాలు, జాగ్రత్తలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గేట్ల లీకేజీల వంటి చిన్న సమస్యలు ఉన్నాయని అన్నారు. గేట్లు ఎత్తే క్రమంలో రోప్వేలు తెగినా లాక్ పడేలా స్పింగ్ బాల్స్ విధానంతో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేటీపీఎస్ విద్యుత్ను జెన్కో సంస్థ నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నందున, కేటీపీఎస్కు ఇక్కడి నుంచి నీరు వెళ్తుందని, ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా గ్రిడ్పై ప్రభావం పడకుండా చూడాలన్నారు. కాగా బృందం మంగళవారం కూడా పరిశీలించనుంది. కేటీపీఎస్ ఎస్ఈ మొక్షవీర్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ రామకృష్ణ, ఏఈ సురేష్ పాల్గొన్నారు. సీడీఎస్ఈ బృందం చైర్మన్ రామరాజు -
మీకు ఆహ్లాదం..
మాకు ఆకలి!పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులను అలరించే చుక్కల దుప్పులు(జింకలు) అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రాకపోవడంతో ఆహారం సరిపడా అందడంలేదు. అటవీశాఖ వైల్డ్లైఫ్ విభాగం అధికారులు ఉన్న నిధులతో నెట్టుకొస్తున్నారు. 1974లో సెప్టెంబర్ 29న ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో డీర్ పార్కు ఏర్పాటు చేశారు. 1999లో నిర్వహణనకు వైల్డ్లైఫ్ శాఖకు అప్పగించారు. పార్కు 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రారంభంలో మూడు జింకలను వదిలారు. సంతానం పెరిగి ప్రస్తుతం 160 జింకలు ఉన్నాయి. వీటికి తోడు మరో మూడు మూషిక జింకలు, మరికొన్ని కొండ గొర్రెలు కూడా ఉన్నాయి. కిన్నెరసాని వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డీర్ పార్కులోని జింకలను వీక్షిస్తారు. జింకల కోసం రెండు హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి పెంచుతున్నారు. అధికారులు పచ్చిగడ్డిపాటు ఫీడింగ్ను మేతగా వేస్తున్నారు. రోజూ ఉదయం 50 కేజీలు, సాయంత్రం 50 కేజీల ఫీడింగ్, 250 కేజీల గడ్డిని అందిస్తున్నట్లు వైల్డ్లైఫ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 11 రకాల పోషకాలు కలిగిన ఫీడింగ్ను ఛతీస్గఢ్లోని రాయచూర్ నుంచి తెప్పిస్తున్నారు. ఫీడింగ్తోపాటు పచ్చిగడ్డి వేసినా వాటికి సరిపోవడంలేదు. దీంతో పర్యాటకులు ఆహ్లాదం పంచే జింకలు బక్కచిక్కిపోతున్నాయి. అదనంగా ఫీడింగ్ ఇవ్వాలంటే ఆర్థిక భారం పెరుగుతోంది. అటవీశాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు కూడా రావడంలేదు. వీక్షకులకు టికెట్లు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మునే ఇందుకు వినియోగిస్తున్నారు. పార్కులో 9 మంది వాచర్లకు, సీసీ కెమెరాల రీచార్జీలకు, శానిటేషన్, ఇతర నిర్వహణకు ప్రతీ నెల రూ.3 లక్షల వరకు ఖర్చవుతోందని అంచనా. ఇటీవల ఫీడింగ్ ధర కూడా పెరిగిపోయిందని వైల్డ్లైఫ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫీడింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. కడుపు నిండా తిండిలేక బక్కచిక్కిపోతున్న జింకలను జంతు ప్రేమికులు, వితరణశీలురు, స్వచ్ఛంద సంస్థలవారు దత్తత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పర్యాటకులకు ఆహ్లాదం పంచే దుప్పుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొంటున్నారు. మూగ జీవులకు మూడు పూటలా తిండి పెట్టే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. వీక్షకులు అందించే ఆహారం కోసం ఎదురుచూస్తున్న వన్యప్రాణులుదానశీలురు దత్తతైనా తీసుకోండిజింకల పోషణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రావడంలేదు. పర్యాటకుల ద్వారా లభించే ఆదాయం ద్వారానే నెట్టుకొస్తున్నాం. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలని ఐటీసీ, నవభారత్, సింగరేణి, జెన్ సంస్థలను కోరాం. ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. – బి.బాబు, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ -
సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. వాటర్ప్రూఫ్ టెంట్లు, వేదిక, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. శాఖలవారీగా ప్రగతి స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు.సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిశీలించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఉత్తమ వేదిక ప్రజావాణి కార్యక్రమమని అన్నారు. కాగా, ఈ వారం కూడా ప్రజా వాణికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గింది. వ్యవసాయ పనుల సమయం కావడంతో ఎక్కువ మంది రాలేదని అధికారులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. తమ గ్రామంలో శిథిలావస్థకు పాఠశాల భవనంలో కొత్త భవనం నిర్మించాలని పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామపంచాయతీ కొత్తూరు గ్రామస్తులు విన్నవించారు. అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కోరగా, డీఈఓకు ఎండార్స్ చేశారు. చేతి పంపునకు మరమ్మతులు చేపట్టాలని అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలోని కురుమబజార్ కాలనీ ప్రజలు విన్నవించగా, ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు. సబ్ స్టేషన్ 132/33 కేవీ విద్యుత్లైన్ను గ్రామం మధ్యలో కాకుండా, శివారు నుంచి నిర్మించాలని అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని బాలాజీనగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ ఎస్ఈకి ఎండార్స్ చేశారు. తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమిలో అధికారులు సర్వే నిర్వహించినా పట్టా మంజూరు కాలేదని గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన బొమ్మల లాలుప్రసాద్ వినతిపత్రం ఇచ్చాడు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు. మార్క్ఫెడ్కు మొక్కజొన్న విక్రయించిన మొక్కజొన్న రైతుల ఖాతాలో పూర్తిస్థాయిలో నగదు జమ కాలేదని, పెట్టుబడుల అవసరాలు పెరిగిన దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందజేశారు. ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధింపులకు గురి చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవా లని కోరుతూ పాల్వంచలోని గట్టాయిగూడేనికి చెందిన ఆర్.వీరయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. -
ఏం.. ప్లాన్ వేశారు!
ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్–2026 కార్పొరేషన్ ఏర్పాడి ఏడాది దాటగా, గత ఫిబ్రవరిలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇప్పటివరకు నగరపాలక సంస్థ హోదాకు తగిన అభివృద్ధి పనులేమీ చేపట్టలేదు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ ఓరియెంటెండ్ డెవలప్మెంట్–2026 ప్రణాళికను పాలకవర్గం తెరమీదకు తెచ్చింది. ఇందుకోసం రూ.600 కోట్లు వెచ్చించనుండగా, రూ.300 కోట్లను రుణం రూపంలో ఓ విదేశీ బ్యాంకు/సంస్థ సమకూరుస్తుందని, మరో రూ.300 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచింగ్ గ్రాంట్గా వస్తాయని చెబుతున్నారు. కాగా, ట్రాన్సిట్ ప్లాన్ను గత జూన్ 6న కౌన్సిల్ ఆమోదించింది. ఒక్కటే టెండర్ చేపట్టనున్న అభివృద్ధి పనుల డీపీఆర్ తయారీకి జూన్ 19న నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకే కంపెనీ టెండరు దాఖలు చేసింది. పోటీ లేనప్పుడు టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ఆ కంపెనీతో కార్పొరేషన్ తరఫున చర్చలకు సన్నద్ధం అవుతుండటంతో ప్లాన్ రూపకల్పన, అమలుపై అనేక సందేహాలు వస్తున్నాయి. సందేహాలు చిన్న డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన జరిగితేనే వివరాలను ఘనంగా ప్రకటిస్తుంటారు. ఏకంగా రూ.600 కోట్లతో అమలు చేయబోయే ప్రణాళికపై గోప్యంగా వ్యవహరించమేంటని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు కౌన్సిల్లో ప్లాన్ ఆమోదం పొందిన రెండు వారాల వరకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, ఆ తర్వాత టెండర్ల దాఖలుకు కేవలం రెండే రోజుల సమయం ఇవ్వడమూ అనుమానాలకు తావిస్తోంది. డీపీఆర్ రూపకల్పన కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.50 శాతం వరకు వెచ్చించడం పరిపాటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే 1 శాతం/1.50 శాతం వరకు పెంచుతుంటారు. కార్పొరేషన్ పాలక వర్గం కేవలం డీపీఆర్ కోసమే 1.50 శాతం అంటే రూ.9 కోట్లను కేటాయించడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 కోట్లకు పెంచేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పద్దు కింద మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నాయి ? రుణం ఇచ్చేందుకు ఏ విదేశీ బ్యాంకు/సంస్థ ముందుకు వచ్చింది? తీసుకున్న రుణాన్ని ఎలా తీరుస్తారు? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికార, పాలకవర్గం నుంచి సమాధానం లేదు. దీంతో పక్కా ప్రణాళిక, పారదర్శకత పాటించకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చేపట్టిన ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్–2026 ప్రణాళికపై సందేహాలు ముసురుకుంటున్నాయి. అభివృద్ధి పేరుతో కమీషన్ల రూపంలో కాసులు రాబట్టుకునేందుకే ప్లాన్ రూపొందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ప్రక్రియ తీరు, డీపీఆర్కు అధిక కేటాయింపులు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంట్రాన్సిట్ ప్లాన్పై లేవనెత్తిన ప్రశ్నలకు పాలక, అధికార వర్గాల నుంచి సమాధానం కరువైంది. కొత్తగూడెం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణా న్ని తిరిగి ఎలా చెల్లిస్తారనే అనే అంశంపై స్పష్టత లేదు. – కే. దుర్గాప్రసాద్, స్వతంత్ర కార్పొరేటర్ విదేశీ సంస్థ నుంచి నిధుల మంజూరు లేఖ ఇంకా రాలేదు. ఆ ఆర్డర్ రావడానికి ఐదు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల ప్లానింగ్కు సంబంధించి టెండర్ కూడా పిలవలేదు. – సుజాత, కార్పొరేషన్ కమిషనర్, -
● ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలూ నిర్వహించలేని దుస్థితి ● ప్రాభవం కోల్పోతున్న మండల పరిషత్లు ● స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూపులు
చుంచుపల్లి: గ్రామాల అభివృద్ధిలో కీలకమైన జిల్లా, మండల పరిషత్లు ప్రస్తుతం పాలకవర్గాల లేమి, నిధుల కొరతతో వాటి ప్రాభవం కోల్పోతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఉన్న మండల పరిషత్లు ఇప్పుడు ప్రత్యేక అధికారుల పరిపాలనకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడంతో పాలన పూర్తిగా గాడి తప్పింది. రెండేళ్లుగా పరిషత్లకు పాలకవర్గాలు లేకపోవడంతో స్థానిక పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా మండల పరిషత్ సాధారణ సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులపై సమీక్షలు తగ్గడం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిషత్ పాలకవర్గాలు ఉంటే ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలను నిర్వహించి సమస్యలను ప్రస్తావించేవారు. ప్రజలకు కావాల్సిన అత్యవసర పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేసివారు. కానీ, మండల, జిల్లా పరిషత్ల పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు సర్పంచులను ఎన్నుకోగా, వారు సైతం సమస్యలను ఎవరి వద్ద ప్రస్తావించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రెండేళ్లుగా ఎన్నికలు లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండేళ్లుగా ఎన్నికలను నిర్వహించకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే మూలుగుతున్నాయి. జిల్లా ప్రజా పరిషత్తోపాటు 21 మండల పరిషత్ల పాలకవర్గాలకు గడువు 2024 ఆగస్టు మొదటి వారంతో ముగిసింది. అప్పటి నుంచి పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది. గతేడాది డిసెంబర్లో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరినా, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. ఈ పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైనా కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో పాలకవర్గాలు లేకపోవడంతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. సమస్యలను ఎవరికి చెప్పు కోవాలో తెలియడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఎక్కడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ప్రత్యేకాధికారులు పనిభారం, ఇతర కారణాలతో మండల పాలనను పూర్తిగా పట్టించుకోవడం లేదు. తమ సొంత శాఖ విధులతోనే సరిపోతోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి మండల పరిషత్ పరిధిలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాల సమన్వయం వంటి బాధ్యతలు ఉంటాయి. గ్రామీణ రహదారుల మరమ్మతులు, తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మండల పరిషత్ సమావేశాలు క్రమం తప్పకుండా జరగాల్సి ఉన్నా, పాలకవర్గాలు లేకపోవడం వల్ల నిర్ణయాల ప్రక్రియ మందగిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగలేదు. దీంతో జిల్లా, మండల పరిషత్లలో పాలన అధ్వానంగా మారింది. ప్రత్యేక అధికారుల పాలనలో కనీసం సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు. –బాదావత్ శాంతి, మాజీ ఎంపీపీ -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపిక
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన చెస్ పోటీల్లో ప్రతిభ చూపినవారిన రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–13, అండర్–10 విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికై నవారిలో తోట జిజ్ఞాస, మోక్షిత, పీ సాధిక, బీ జెస్సీ, ఇష్హిత, రేయాన్ష్, పీ జస్విక్, శ్రీహిమా న్షు, ఉజ్వల్, యస్విక్ యువన్, గౌతం చంద్ర మోక్షిత్, సుహాస్, సిహెచ్ గౌతంకృష్ణ,, దారా తన్మయ కృతి, సుభా హిమజ ఉన్నారు. వీరు ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొననున్నారు. నిర్వాహకులు, అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ శ్రీని వాస్, జ్యోత్స్న, సీహెచ్ గోపీకృష్ణ, రంజిత్ రాజు పాల్గొన్నారు. పీకేఓసీ–2 బ్లాక్ దక్కడం హర్షణీయంసూపర్బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే మణుగూరు పీకేఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి కేటాయించారని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గని కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించామని వారు తెలిపారు. భజన పోటీలు ప్రారంభంభద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి ఆలయంలో రాష్ట్రస్థాయి భజన పోటీలు సోమవారం ప్రారంభమయ్యా యి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాల హరినామ సంకీర్తనలు, సంప్రదా య కీర్తనలు ఆలపించారు. మూడు రోజులపాటు పోటీలు సాగనుండగా, తొలిరోజు భజన బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు కృష్ణచైతన్య స్వామి తదితరులు పాల్గొన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట ఖమ్మంమయూరిసెంటర్: దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడిచిన ఐదేళ్లలో కేటాయింపులు పెరిగాయని తెలిపారు. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్ – 2.0’ కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఎంపిక చేసిన 41,762 పాఠశాలలకు గాను 2,104 స్కూళ్లలో స్మార్ట్ క్లాస్రూమ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు సమకూర్చామని చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించారు. కృష్ణా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో పొగ, మంటలు మధిర: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగీలో సోమవారం మంటలు వ్యాపించాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ దాటగానే బీ4 ఏసీ బోగీలో కంప్రెషన్ బెల్టులు కాలిపోయి పొగ వ్యాపించింది. ప్రయాణికులు గమనించి చైన్ లాగడంతో తొండల గోపవరం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. అప్పటికే పొగకు తోడు మంటలు వ్యాపిస్తుండడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగారు. ఏసీ మెకానిక్ వచ్చి మరమ్మతులు చేపట్టి కాలిపోతున్న ఏసీ కంప్రెషర్ బెల్ట్లను తొలగించాక సుమారు 20 నిమిషాల అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
మనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పథకాలు అర్హులందరికీ చేరాలిఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ భద్రాచలం: ప్రభుత్వ పథకాలు అర్హులైన గిరిజ నులకు అందాలని ఐటీడీఏ ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజనదర్బార్లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి దరఖా స్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ అర్హతల మేరకు అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన దర్బార్లో 150 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ఈ కార్యక్రమంలో అధికారులు చందన, ఆనంద్కుమార్, అరుణకుమారి, సైదులు, ఉదయ్కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ప్రాకారం కూల్చివేతశరవేగంగా రామాలయ పునరుద్ధరణ పనులు భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే యాగశాల, లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయ గ్రిల్స్ తొలగించారు. దక్షిణం వైపు ప్రాకారాన్ని సోమవారం కూల్చివేశారు. దీంతో యంత్రాలు వెళ్లేందుకు మార్గం ఏర్పడగా, అమ్మవారి ఉపాలయం, భద్రుని గుడిని తొలగించనున్నారు. ఉత్తరం ప్రాకా రాన్ని కూడా ఇటు నుంచే తొలగించనున్నారు. దక్షిణం వైపు మెట్ల పక్కనున్న పూర్వ ఈఓ కార్యాలయం, లిఫ్ట్ మినహా ప్రొటోకాల్ గదులను నేలమట్టం చేశారు. విస్తా కాంప్లెక్ష్క్స్ సముదాయాన్ని తొలగించేందుకు ఈ నెల 15 లోపుగా ఖాళీ చేయాలని దుకాణదారులకు అధికారులు ఆదేశాలను జారీ చేశారు. బాలుడి మృతిపై విచారణగుండాల: సింగారంలో 9 సంవత్సరాల బాలుడి మృతిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రతాప్, మలేరియా అధికారి శ్రీధర్ ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సింగారం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. కాగా, గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. సుమారు 170 మంది గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు అందజేశారు. సిబ్బంది గోపీలాల్, నాగభూషణం, గొంది వెంకటేశ్వర్లు, పాయం శ్రీనివాసరావు, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు. -
‘సీత’ ఆధ్వర్యంలో శిక్షణ
భద్రాచలం: స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ (సీత) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు శిక్షణకు భద్రగిరి వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలిసారిగా ఈ శిక్షణ భద్రాచలంలో జరగనుంది. దేవాలయాల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. సీత సంస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల పలువురు విన్నవించగా ఈ ఏడాది పునరుద్ధరించింది. డైరెక్టర్గా చిలకపాటి విజయరాఘవాచార్యులును నియమించి, గత నెలలో శిక్షణా కార్యక్రమాలను అధికారికంగా ప్రా రంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే 12 వేల మంది సిబ్బంది, అర్చకులు, అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగమ శాస్త్రాలు, దేవాలయ సంప్రదాయాలు, నిత్య పూజా విధానాలు, దేవాలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, అకౌంట్స్, ఆస్తుల సంరక్షణ, భక్తులకు మెరుగైన సేవలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, చట్టపరమైన నిబంధనలు, పారదర్శక పాలనపై శిక్షణలో వివరిస్తారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. 26 మంది శిక్షణలో పాల్గొననుండగా, దేవస్థానం తరఫున ఉచిత బస, భోజన వసతి కల్పించనున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజులపాటు కార్యక్రమం -
గ్రీన్ఫీల్డ్ హైవేపై గజిబిజి ప్రయాణం
వైరా: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం – దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఇప్పటికే వైరా మండలం సోమవరం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ నుంచి వాహనాలను అనుమతిస్తుండగా తాజాగా ప్రారంభ స్థానమైన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద నుంచి రాకపోకలకు అనుమతించారు. అయితే, తల్లంపాడు వద్ద టోల్గేట్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో తల్లంపాడు నుంచి సోమవరం వరకు హైవేపై ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. అలాగే ముందుకెళ్తే దేవరపల్లి వద్ద దిగే సమయాన టోల్ఫీజుకు ఇక్కట్లు రానుండడంతో సోమవరం వద్ద కిందకు దిగి తిరిగి హైవేపైకి చేరాల్సి వస్తోంది. దేవరపల్లి నుంచి వచ్చే వాహనదారులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. రెండు వైపులా వాహనదారులు సోమవరం టోల్ పాయింట్ వద్ద దిగి నమోదు చేయించుకుని వెళ్లాల్సి రావడం, కొత్తగా వచ్చే వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లకు మలుపు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇకనైనా అధికారులు త్వరగా తల్లంపాడు వద్ద టోల్గేట్ అమల్లోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. -
వివాదాస్పద భూమిలో ప్లాంటేషన్..
● పనులు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు ● సస్పెండైన అధికారిని విధుల్లోకి తీసుకునే అవకాశంఅశ్వాపురం: రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైన మండల పరిధిలోని మనుబోతులగూడెం గ్రామ పంచాయతీ వేములూరులోని వివాదాస్పద భూమి లో సోమవారం ప్లాంటేషన్ పనులు చేపట్టారు. అధికారులు ఇరువర్గాలతో విచారణ జరిపి 20 హెక్టార్లలో మణుగూరు ఎఫ్డీఓ బాబు, రేంజర్ ఉపేందర్ పర్యవేక్షణలో అటవీ సిబ్బంది పనులు చేపట్టారు. పోడు భూముల విషయమై గత నెల 17న ఫారెస్ట్ సిబ్బందికి, ఆదివాసీలకు ఘర్షణ జరి గింది. దీంతో అటవీ సిబ్బంది, ఆదివాసీ మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ప్రత్యేకంగా కమి టీ వేసి విచారణ చేపట్టారు. డీఎఫ్ఓ, ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. సస్పెండైన అధికారి నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ, అధికారులు ఆదివాసీలతో మా ట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. 20 హెక్టార్లలో ప్లాంటేషన్.. వేములూరులో 269 ఎకరాల అటవీ భూమి ఆది వాసీల పోడు సాగులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి 10 ఎకరాలకు పైగా ఉందని, నిబంధనల ప్రకారం పదెకరాలకు లోపే ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. 269 ఎకరాల భూముల్లో 120 ఎకరాలు గత ఏడాది క్రితం ప్లాంటేషన్ వేశారు. తాజాగా మరో 20 హెక్టార్లలో ప్లాంటేషన్ పనులు ప్రారంభించారు. కాగా తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బీట్ అధికారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు సమాచారం. వేములూరు ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసి నివేదిక అందజేసింది. బీట్ అధికారి సంపత్ను తాత్కాలికంగానే సస్పెండ్ చేశాం. ఆయనకు ఏఓసీ ఇచ్చారు. దానిపై వివరణ ఇచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అటవీ భూముల్లో ప్లాంటేషన్ పనులు ప్రారంభించాం. –బి.బాబు, ఎఫ్డీఓ మణుగూరు -
బొగ్గు టిప్పర్ బోల్తా
చండ్రుగొండ : మండలంలోని మద్దుకూరు గ్రామంలో జాతీయ రహదారిపై మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున బొగ్గు టిప్పర్ బోల్తా పడింది. జిల్లా పారిషత్ పాఠశాల గోడకు ఆనుకుని టిప్పర్ ఆగింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కాగా ఇదే ప్రాంతంలో అనేక సార్లు బొగ్గుటిప్పర్లతోపాటు జామాయిల్ లోడ్లతో వెళ్లే లారీలు సైతం బోల్తా పడ్డాయి. రెండేళ్ళకిత్రం ఓ పామాయిల్ లోడ్ లారీ అదుపుతప్పి పాఠశాల గదిలోకే దూసుకెళ్లింది. కాగా, మలుపు వద్ద రోడ్డు విస్తరించి, ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాల కార్మికుల గుర్తింపుభద్రాచలంఅర్బన్: ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సోమవారం పట్టణంలో బాలల సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. రెండు వాణిజ్య దుకాణాల్లె బాలలు పనులు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం బాలలను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చా రు. దుకాణం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. చిరుత కాదు.. అడవి కుక్కచుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని వచ్చిన వదంతుల్లో నిజం లేదని ఫారెస్ట్ సిబ్బంది సోమవారం తెలిపారు. అటవీ ప్రాంతంలో గేదెలపై దాడి చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆనవాళ్లను పరిశీలించి, స్థానిక ప్రజల నుంచి వివరాలు సేకరించారు. కాలి గుర్తులు అడవి కుక్కవని, చిరుతపులి సంచరించినట్లు ఆధారాలు లేవని తెలిపారు. గంజాయి స్వాధీనంభద్రాచలంఅర్బన్: ఆర్టీసీ బస్సులో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు యువకులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని, ఠాణాకు తరలించిన విషమం విదితమే. ఇద్దరు యువకుల వద్ద ఆరు ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు తేలగా, డీఎస్పీ అరుణ్కుమార్ సిబ్బందితో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు, గంజాయి తరలింపు వివరాలు వెల్లడించాల్సి ఉంది. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడు ఆర్వోబీ వద్ద ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన రామిశెట్టి వేణుకుమార్(21) వ్యక్తిగత కారణాలతో సోమవారం మధ్యాహ్నం సాయినగర్ – కాకినాడ వెళ్లే షిర్టీ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈమేరకు సమాచారం అందుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. -
పని మనిషే నిందితురాలు
ఇల్లెందు: పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. పని మనిషే నిందితురాలిగా తేలడంతో అరెస్ట్ చేశారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకన్నబాబు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాకతీయ నగర్లో పెద్దబోయిన శంకర్ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. మరుసటి రోజు అంత్యక్రియల సమయంలో తండ్రి చేయించిన బంగారు ఆభరాణాలను తల్లి మెడలో వేయాలని కుమారుడు, కుటుంబీకులు భావించారు. బీరువా తెరిచి చూడగా ఆభరణాలు కనిపించలేదు. అంత్యక్రియలు, సంస్మరణ కార్యక్రమాలు పూర్తయ్యాక గత నెల 30న మృతుడి కుమారుడు నగేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి పనిమనిషి, కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వేమూరి సీతను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చోరీ చేసినట్లు అంగీకరించింది. జూన్ 7న మధ్యాహ్నం ఇంటి యజమానులు నిద్రిస్తున్న సమయంలో బీరువా తెరిచి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపింది. గొలుసు ఇల్లెందులోని సీఎస్పీ బ్యాంకులో తాకట్టు పెట్టింది. మిగిలిన ఆభరణాలను సైతం ఖమ్మంలో విక్రయించేందుకు ప్రయత్నం చేసింది. విచారణ పూర్తి చేసిన పోలీసులు సుమారు 11 తులాలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ సురేష్కుమార్, ఎస్ఐ ఉమ పాల్గొన్నారు. బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు -
గోదారి వరదతో మేత కరువు
బూర్గంపాడు: గోదావరి వరదలతో ప్రజలు మాత్రమే కాకుండా పశువులు, జీవాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. గోదావరి వరదలతో వాగులు, వంకలు నీటమునిగాయి. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె పట్టీనగర్, ఇరవెండి గ్రామాల్లో మేకలు, గొర్రెలు మేతకు బయటకు వెళ్లేందుకు వీలు లేని దుస్థితి ఎదురైంది. శనివారం గోదావరి వరద పెరగడంతో పెంపకందారులు మేకలు, గొర్రెలను మేతకు తోలలేదు. ఆదివారం వరద తగ్గినా గడ్డిపై బురద ఉండటంతో జీవాలు మేతకు అలమటించాయి. వారం రోజులపాటు దూరప్రాంతాలకు వెళ్తే తప్ప జీవాలకు మేత దొరకదని చెబుతున్నారు. ఆపదలో ఉన్న మిత్రుడికి చేయూత ● రూ.2.25 లక్షలు అందించిన పూర్వ విద్యార్థులు నేలకొండపల్లి/ఏన్కూరు: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంనకు చెందిన తాళ్లూరి గురుబ్రహ్మాచారికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయనతో కలిసి ఏన్కూరు గురుకులంలో చదువుకున్న 1992 బ్యాచ్ మిత్రులు.. రూ.2.25 లక్షలు సేకరించి స్నేహితుల దినోత్సవమైన ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో అర్పినేని కృష్ణ, తిరునగిరి అనిల్, వంగూరి మల్లేశ్, పగిడిపల్లి పుల్లయ్య, చిప్పలపల్లి వెంకన్న, వేల్పుల సురేశ్బాబు, గుడిపూడి కృష్ణయ్య, బండి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీహైవేపై రాకపోకలకు అనుమతి ఖమ్మం – దేవరపల్లి హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మలఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద ఆదివారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ లైట్లు అమర్చే పనులు జరుగుతుండడంతో భారీ వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవేపై కొంతదూరం ప్రయాణించి పరిశీలించారు. కాగా, హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించినా, ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమం మాత్రం ఉండదని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాక టోల్ఫీజు వసూలు మమొదలవుతుందని వెల్లడించారు. ఇన్నాళ్లు సోమవరం వద్ద... హైవే పనులు కొద్ది నెలల క్రితమే పూర్తయినా ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఆలస్యమైంది. దీంతో వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసలాపురం వద్ద బ్రిడ్జితో పాటు ఎగ్జిట్ నిర్మాణ పనులు, ఇతరత్రా అన్ని పూర్తవడంతో తల్లంపాడు ఎంట్రీ పాయింట్ నుంచి అనుమతిస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారికి దూరం, సమయం తగ్గనున్నాయి. వాగులోకి దిగిన కార్మికుడికి ఫిట్స్ గుండాల: బహిర్భూమికని కిన్నెరసాని వాగులో దిగిన ఓ కార్మికుడికి ఫిట్స్ రావడంతో మృతిచెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రామచంద్రయ్యగుంపు గ్రామానికి చెందిన తుమ్మ రాంబాబు (34) గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి మూర్చవ్యాధి ఉంది. శనివారం విధులు ముగించుకుని స్థానిక కిన్నెరసాని వాగు వద్దకు బహిర్భూమికని వెళ్లాడు. వాగులో దిగగానే ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాంబాబు ఇంటికి రాకపోవడంతో కటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. కిన్నెరసానివాగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం గుర్తించి, బోరున విలపించారు. కుటుంబ సభ్యుల పిర్యాధు మేరకు ఎస్ఐ సోమేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


