breaking news
	
		
	
  Bhadradri District News
- 
      
                   
                                 కమనీయంగా కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. కొనసాగుతున్న క్రీడా పోటీలుపాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ క్రీడా పోటీలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. పోటీల్లో శ్రీశైలం, నాగర్జునసాగర్, పోచంపాడు, విద్యుత్ సౌధ, బీటీపీఎస్, కేటీపీఎస్ టీమ్లు పాల్గొన్నాయి. టేబుల్ టెన్నీస్లో విన్నర్గా విద్యుత్ సౌధ, రన్నర్ 7వ దశ, ఓపెన్ డబుల్స్ విన్నర్ విద్యుత్ సౌధ, రన్నర్గా కేటీపీఎస్ 7వ దశ, క్యారమ్స్లో విద్యుత సౌధ విన్నర్, 7వ దశ రన్నర్, షటిల్ టీం ఈవెంట్లో విద్యుత్సౌధ విన్నర్, కేటీపీఎస్ 7వ దశ రన్నర్గా నిలిచాయి. మిగితా పోటీలు శుక్రవారం ముగియనున్నాయి. స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, కౌన్సిల్ సెక్రటరీలు మహేష్, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు. కిన్నెరసానికి విదేశీ పర్యాటకులుపాల్వంచరూరల్ : మండలంలోని కిన్నెరసానిని గురువారం విదేశీ పర్యాటకులు సందర్శించారు. జర్మనీ దేశస్తులు సందర్శించి డీర్పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించి ఆ తర్వాత బోటు షికారు చేశారు. అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలిమణుగూరు రూరల్ : అవినీతి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీటీపీఎస్ సీఈ బిచ్చన్న పిలుపునిచ్చారు. థర్మల్ కేంద్రంలో గురువారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ఉద్యోగలంతా నిజాయితీగా పని చేస్తూ దేశం, సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. సాంబాయిగూడెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈలు సూర్యనారాయణ, పార్వతి, డీవైసీసీ శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ రమేష్, అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి, సేఫ్టీ డీఈ ఆనందప్రసాద్, ఏడీఈలు రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘ఓపెన్’ ఫలితాలు విడుదలకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో గత నెల 22 నుంచి 28 వరకు జరిగిన ఓపెన్ ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. ఇంటర్లో 289 మందికి గానూ 141 మంది, పదో తరగతిలో 280 మందికి 52 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాల వివరాలను వెబ్సైట్ నుంచి పొందవచ్చని, 25 రోజుల్లో మార్కుల మెమోలు స్టడీ సెంటర్లకు చేరుతాయని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు నవంబర్ 4 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రీకౌంటింగ్ ఇంటర్కు రూ.400, పదో తరగతికి రూ.350, రీ వెరిఫికేషన్ ఇంటర్కు రూ.1,200, పదో తరగతికి రూ.1,200 చెల్లించాలని, వివరాలకు స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ను సంప్రదించాలని సూచించారు.
- 
      
                   
                                 పులుల గణన పక్కాగా నిర్వహించాలి● డీఎఫ్ఓ కృష్ణా గౌడ్ పాల్వంచరూరల్: పులుల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్ సూచించారు. మండల పరిధిలోని కిన్నెరసాని డీర్పార్కు వద్ద 100 మంది వైల్డ్లైఫ్ సిబ్బందికి, టెరిటోరియల్ పాల్వంచ డివిజన్లోని 100మంది ఫారెస్ట్ సిబ్బందికి సోములగూడెం రోడ్డులోని అర్బన్ పార్కులో గురువారం శిక్షణ ఇచ్చారు. అమ్రాబాద్ నుంచి వచ్చిన వైల్డ్లైఫ్ నిపుణులు మహేందర్రెడ్డి, రమాకాంత్ పులుల గణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ వచ్చే నెల 20 నుంచి 26 వరకు జాతీయ పులుల గణన నిర్వహించాలన్నారు. 20 నుంచి 23 వరకు మాంసాహార శాఖ జంతువులైన పులులు, ఎలుగుబండ్లు, చిరుతలు, నక్కలు, తోడేళ్లు వంటి జంతువుల గణన, 24 నుంచి 26 వరకు శాకాహార జంతువులు దుప్పులు, సాంబార్లు, అడవిదున్నలు తదితర జంతువుల గణన నిర్వహించాలని సూచించారు. ఎఫ్డీఓలు బాబు, కట్టా దామోదర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సబ్ జైలు తనిఖీఇల్లెందు: ఇల్లెందు సబ్ జైలును న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి గురువారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. దీర్ఘకాలంగా సబ్ జైలులో ఉంటున్న పేద ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 ● రక్షణ కోసం పోలీస్స్టేషన్కు వచ్చిన ప్రేమజంట ● యువతి బంధువుల ఆగ్రహంతో ఠాణాలో ఉద్రిక్తతపోలీసులపై దాడికి యత్నంజూలూరుపాడు: జూలూరుపాడు ఠాణాలో గురువారం పోలీసులపై దాడికి యత్నం జరిగింది. ప్రేమజంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని అన్నారుపాడుకు చెందిన యువతి గంగ, జూలూరుపాడుకు చెందిన అఖిల్ ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు, బంధువులు గురువారం రాత్రి పోలీస్స్టేషన్ను ముట్టడించారు. యువతి కనిపించడంలేదని వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుమారు మూడు వందల మంది బంధువులు ఆందోళనకు దిగారు. యువతీ, యువకులు ఇద్దరూ మేజర్లు కావడంతో ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించామని పోలీసులు ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు వినిపించుకోకుండా ఒక్కసారిగా పోలీస్స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. కుమార్తెను అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగ్గా, యువతి తల్లి స్పృహ కోల్పోయింది. దీంతో రెచ్చిపోయిన బంధువులు పోలీసులపైకి చెప్పులు విసరడంతోపాటు, దాడికి యత్నించారు. ఎస్ఐ బాదావత్ రవి అప్రమత్తమై ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సిబ్బందితో చేరుకుని ఆందోళనకారులను పోలీస్స్టేషన్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. పరిస్థితిని అదుపు చేశారు. పోలీస్స్టేషన్పై దాడికి యత్నించిన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, చండ్రుగొండ ఎస్ఐ శివరామక్రిష్ణ, సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, చుంచుపల్లి ఎస్ఐ ఉమా, లక్ష్మీదేవీపల్లి ఎస్ఐ రమణారెడ్డి, త్రీటౌన్ ఎస్ఐ శివప్రసాద్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కాగా యువతి డిగ్రీ చదువుతుండగా, యువకుడు పీజీ చేస్తున్నట్లు తెలిసింది.
- 
      
                   
                                 ముడిపడని ముహూర్తం● రక్తనిల్వ కేంద్రం ప్రారంభం ఎప్పుడో..? ● పరికరాలు, అనుమతులు ఉన్నా ఉపయోగం సున్నా ● మణుగూరు, అశ్వారావుపేటలో ప్రారంభం.. ఇల్లెందులో తప్పని ఎదురుచూపులు ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రానికి పరికరాలు, గది, సిబ్బంది సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.12 లక్షల చొప్పున వెచ్చించి రెండు నెలల క్రితమే పరికరాలు పంపిణీ చేశారు. మిగితా రెండు ఆస్పత్రుల్లో ఇప్పటికే సేవలు కొనసాగుతున్నా.. ఇల్లెందులో మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. దాతల నుంచి సేకరణ.. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించి, ఈ కేంద్రంలో నిల్వ చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం చాలా అవసరం. శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి ఆపరేషన్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే రక్తం అందుబాటులో ఉండాలి. ఈ కేంద్రాల్లో దాతలు అందించిన రక్తంలో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటివి వేరు చేసి విడివిడిగా నిల్వ చేస్తారు. తద్వారా ఆయా అవరాలకు గల వారికి సకాలంలో రక్తం అందడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అందుబాటులో పరికరాలు.. ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఇప్పటికే రక్త నిల్వ పరికరాలు చేరాయి. వీటితో పాటు సిరంజీలు, సేకరణ సంచులు, కుర్చీలు, టేబుళ్లు, లేబులింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, ఫ్రీజర్, ల్యాబ్ మెటీరియల్, స్టెరిలైజేషన్ పరికరాలు, కంప్యూటర్ వంటివి సిద్ధంగా ఉన్నాయి. పూర్తి ఏజెన్సీ ప్రాంత వాసులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో రక్తహీనతతో బాధపడే గర్భిణులు అధికంగా ఉంటారు. ఇక కిడ్నీ, లివర్ తదితర బాధితులకు కూడా ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. జిల్లాలోని మూడు ఆస్పత్రులకు రక్త నిల్వ కేంద్రాలు మంజూరు కాగా మణుగూరు, అశ్వారావుపేటలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా మెటీరియల్, స్టాఫ్, ఫ్రీజర్లు, కంప్యూటర్ సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచలో ఇప్పటికే రక్త నిధి కేంద్రాలు ఉండగా, మణుగూరు, అశ్వారావుపేటలో ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇల్లెందులో కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రధాన సెంటర్లన్నింటిలోనూ రక్త నిల్వలు అందుబాటులోకి రానున్నాయి.
- 
      
                   
                                 ఆర్చరీ క్రీడాకారుల ఎంపికపాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో గురువారం ఎంపిక చేశారు. సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈమేరకు వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య వెల్లడించారు. బాలుర విభాగంలో కె.రాంచరణ్, ఎం.చరణ్, కె.దిలీప్ కుమార్, కె.వినోద్కుమార్, వి.సంతోష్, జి.విజయవర్దన్, వెంకటయోగేశ్వర్, డి.ఆదిత్యప్రకాశ్, టి.మోహన్రెడ్డి, పి.దేవంత్ స్వామి, శివ శశాంక్, బాలికల విభాగంలో ఇ.అవంతిక, బి.సంజనశ్రీ, పి.హర్షిత, కె.జ్యోత్స్న, ఎం.గౌతమి, జె.సంస్కృతి ఎంపికయ్యారని తెలిపారు. వసతి, సౌకర్యాలు కల్పించాలిభద్రాచలంటౌన్/టేకులపల్లి: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డీడీ అశోక్ అన్నారు. ఐటీడీఏలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమ్మతులు, డైట్ చార్జీల నిధులు కేటాయించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. వసతిగృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు రాయడం, చదవడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో దమ్మపేట, ఇల్లెందు ఏటీడీవోలు చంద్రమోహన్, భారతీదేవి, సిబ్బంది రామకృష్ణారెడ్డి, రంగయ్య, హెచ్ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంట్లో గంజాయి నిల్వ● నిందితుడి అరెస్ట్ మణుగూరు టౌన్: బంధువు మాట విని ఎక్కువ డబ్బుతో సంపాదించాలనే ఆశతో ఇంట్లో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి జైలుపాలయ్యాడు. గురువారం మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చల్లా సతీష్, అతని స్నేహితుడు రేపాకుల సాగర్ సీలేరు నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. సతీష్కు బాబాయి వరసయ్యే మణుగూరు గాంధీబొమ్మ సెంటర్కు చెందిన చల్లా శ్రీనివాస్ ఇంట్లో 3.5 కేజీల గంజాయిని నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టి, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడు చల్లా శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, చల్లా సతీష్, సాగర్లను ములుగు పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగబాబు, ఎస్ఐలు నగేశ్, శ్రావణ్, సిబ్బంది సత్యనారాయణ ఉన్నారు. గంజాయి సీజ్భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం భద్రాచలం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ రహిమున్నిసా బేగం కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డు ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. గంజాయి తరలిస్తున్న మహ్మద్ హస్సన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయితోపాటు కారు, సెల్ఫోన్ సీజ్ చేశారు.
- 
      
                   
                                 ఏజెన్సీ ఆస్పత్రికి సుస్తీభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. భవనాలు మరమ్మతులు నోచుకోవడంలేదు. దీంతో ఏజెన్సీ ప్రజలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడంలేదు. 100 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రిని 2018లో 200 పడకలకు అప్గ్రేడ్ చేశారు. నూతన భవనాలు నిర్మించారు. అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడకు భద్రాచలం ఏజెన్సీ, మణుగూరు, పాల్వంచ ప్రాంతాలతోపాటు సరిహద్దు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కూడా చికిత్స కోసం వస్తుంటారు. కానీ సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందటం లేదు. 112 పోస్టులు ఖాళీ.. ఆస్పత్రిలో 212 మంది వైద్యులు, సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 69 వైద్య పోస్టులుండగా, ప్రస్తుతం కాంట్రాక్ట్, రెగ్యులర్ కలిపి 34 మందే పనిచేస్తున్నారు. సిబ్బంది 143 మంది పోస్టులు ఉండగా, 66 మంది పనిచేస్తున్నారు. వారిలో రెగ్యులర్ 50, ఔట్సోర్సింగ్ 16 మంది ఉన్నారు. 20 మందికి పైగా ఇతర ఆస్పత్రుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. నలుగురు మాత్రం ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చి ఇక్కడ డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్న వైద్యులు కూడా సమయపాలన పాటించడంలేదని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యూరో, కార్డియాలజీ వైద్యులు లేరు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నిత్యం అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణులకు స్కానింగ్ సేవలు అందించాల్సి ఉంటుంది. రేడియాలజీ విభాగంలో ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. న్యూరోసర్జన్, కార్డియాలజిస్ట్, ఎముకల వైద్య నిపుణులు ఒక్కరూ లేరు. దీంతో ఆయా సమస్యలపై వచ్చే బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తోంది. ఫలితంగా రూ. వేలు, రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అరకొరగా సివిల్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లు సివిల్ సర్జన్లు 16 పోస్టులు ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 37 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 29 మంది ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 మందిలో 21 మంది ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో కేవలం 8 మంది మాత్రమే విధులు నిర్వరిస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందడంలేదు. స్టాఫ్ నర్సుల్లో 40 పోస్టులు ఖాళీ స్టాఫ్ నర్సుల్లో 53 పోస్టులకు 13 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. మిగిలిన 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ నర్సులలో కూడా 9 పోస్టులకు 9 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కానీ వీరిలో కొందరు డిప్యూటేషన్పై ఇతర ఆస్పత్రుల్లో విధులు నిర్వరిస్తున్నారు. కొందరు నర్సింగ్ సిబ్బంది భద్రాచలం ఆస్పత్రిలో విధి నిర్వహణకు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టించుకోని ఉమ్మడి జిల్లా మంత్రులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు ఒక్కరూ ఆస్పత్రిని సందర్శించి, సమస్యలు తెలుసుకోలేదు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ పలుమార్లు సందర్శించి ఆస్పత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గతేడాది ఆగస్టు 8న ఆస్పత్రిని సందర్శించి వైద్య నిపుణుల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మినీ టీ–హబ్, డ్రగ్ స్టోర్ కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.ఆస్పత్రి, పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. భవనంలో డోర్లు చెదలు పట్టి పాడైపోయాయి. పుచ్చిపోయిన గుమ్మాలు, వేలాడుతున్న కిటీకీలు, పడిపోయిన స్టీల్ రైలింగ్, పెచ్చులూడుతున్న కిటికీలు బాధితులను కలవరపెడుతున్నాయి. కాగా ఆస్పత్రి గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పలు అసెస్మెంట్లలో మొదటి స్థానం దక్కించుకుంది. కానీ ఇందుకు సంబంధించి రూ.30 లక్షల నగదు ఆస్పత్రికి అందలేదు. దీంతో మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి అభివృద్ధికి కూడా నిధుల కొరత వెంటాడుతోంది.వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత పోస్టులు ఉన్నది ఖాళీలు సివిల్ సర్జన్ 16 3 13 సివిల్ సర్జన్ ఆర్ఎంఓ 1 0 1 డిప్యూటీ సివిల్ సర్జన్ 9 1 8 డెంటల్ సివిల్ సర్జన్ 1 0 1 డిప్యూటీ డెంటల్ సర్జన్ 1 0 1 సివిల్ అసిస్టెంట్ సర్జన్ 37 8 29 ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ 1 0 1 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 3 1 2 డెర్మటాలజీ 1 0 1ఏరియా ఆసుపత్రిలో గల వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కొరత ఉంది, అదే విధంగా ఏరియా ఆసుపత్రి భవనం, డోర్లు, కిటీకీలు, గుమ్మాలకు మరమ్మత్తులకు సంబంధించి అవార్డులకు రావాల్సిన నగదు వస్తే చేయిస్తాము, లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాము. – డాక్టర్ రామకృష్ణ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
- 
      
                   
                                 ఎట్టకేలకు రంగం సిద్ధం● చేప పిల్లల పంపిణీకి నేడు శ్రీకారం ● జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు పాల్వంచరూరల్ : చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు పోసే ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. టెండర్లు ముగిసినా.. జాప్యం చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ రెండోవారంలోనే ముగిసింది. అయితే స్థానిక సంస్ధల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడింది. ఎట్టకేలకు నేటి నుంచి పిల్లల సరఫరా చేపడుతున్నారు. జిల్లాలోని 734 చెరువుల్లో పిల్లలు వదలాల్సి ఉండగా సమయాభావం పేరుతో 650 చెరువుల్లో మాత్రమే పోసేందుకు చర్యలు చేపడుతున్నారు. నీటినిల్వ సామర్థ్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద సైజు పిల్లలను పంపిణీ చేయనున్నారు. 80–100మి.మీ.సైజు గల 86 లక్షల పిల్లలు రూ.1.49 పైసల చొప్పున సరఫరాకు ఒప్పందం కుదిరింది. గతేడాది ఇదే సైజు పిల్లలు రూ.1.79 పైసల చొప్పున పంపిణీ చేశారు. ఇక 35 – 40 మి.మీ. సైజ్ పిల్లలు 90 లక్షలు పోయనుండగా రూ.0.56 పైసల చొప్పున పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. గతేడాది ఈ సైజు పిల్లలకు రూ.0.60 పైసల చొప్పున సరఫరా చేశారు. అయితే సాధారణంగా జూలైలో టెండర్లు ఆహ్వానించి ఆగస్టులో చేపపిల్లలు పోస్తారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులో జాప్యం జరగడంతో సెప్టెంబర్ రెండో వారంలో టెండర్లు ఖరారైనా ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొందరు మత్స్యకారులు సొంత డబ్బులతో పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోసుకున్నారు. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో శుక్రవారం ప్రారంభిస్తున్నాం. ఈ చెరువులో శీలావతి, రవ్వ, బొచ్చ రకాలకు చెందిన లక్ష పిల్ల లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాం. ఆ తర్వాత జిల్లాలోని ఇతర చెరువుల్లో 1.76 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తాం. – ఎండీ.ఇంతియాజ్ఖాన్, జిల్లా మత్స్యశాఖాధికారి
- 
      
                   
                                 ‘ఎస్ఐఆర్’ జాబితా సిద్ధం చేయండిబూర్గంపాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఓటర్ జాబితాను తప్పుల్లేకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. బూర్గంపాడు తహసీల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో చేసిన ఎస్ఐఆర్తో ప్రస్తుత జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. శనివారం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఆర్ఐ నర్సింహారావు, వీర్రాజు, జీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. గిరిజనుల విద్య బలోపేతానికి చర్యలు అశ్వాపురం : గిరిజన చిన్నారుల విద్య బలోపేతానికి ఉద్దీపకం వర్క్ బుక్ను ప్రవేశపెట్టామని పీఓ రాహుల్ తెలిపారు. మండలంలోని కోరెంవారి గూడెం, రామవరం గిరిజన సంక్షేమ పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్దీపకం వర్క్ బుక్తో విద్యార్థుల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, అయినా ఇంగ్లిష్ పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ తప్పులు కూడా లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీఆర్పీ గాంధీ, ఉపాధ్యాయులు సాయం కృష్ణయ్య, శోభన్బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్
- 
      
                   
                                 ‘సింగరేణి’లో కొత్త ఏరియా!సత్తుపల్లి: ఎన్నో ఏళ్లు సింగరేణి ప్రభావిత గ్రామస్తుల, కార్మికుల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఇన్నాళ్లు సత్తుపల్లిలోని బొగ్గు గనులు కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సత్తుపల్లి కేంద్రంగా కొత్త ఏరియాను ఏర్పాటుచేశారు. అంతేకాక జీఎం సేఫ్టీ(కార్పొరేట్)గా విధులు నిర్వర్తిస్తున్న చింతల శ్రీనివాస్ను ఏరియా జీఎంగా నియమించారు. రోజుకు 40వేల టన్నుల ఉత్పత్తి çÜ™èl$¢-ç³-ÍÏ ç³Ç«¨ÌZ gôæÒBÆŠ‡ KïÜ&2, MìSÚëtÆý‡… KïÜË$ E¯é²Æ‡$$. Òsìæ §éÓÆ> ÆøkMýS$ çÜ$Ð]l*Æý‡$ 40ÐólÌS r¯]l$²ÌS »ŸVýS$Y E™èlµ-†¢ ^ólçÜ$¢…yýl-V>, OÆð‡Ë$ Ð]l*Æý‡Y…ÌZ 32Ðól-Ë$, Æøyýl$z Ð]l*Æ>Y¯]l 2.5 r¯]l$²ÌS »ŸVýS$Y Æý‡Ðé×ê ^ólçÜ$¢-¯é²Æý‡$. íÜ…VýS-Æó‡-×ìæ-ÌZ Cç³µ-sìæ-Ð]l-Æý‡MýS$ 11 HÇĶæ*-Ë$ E…yýl-V>... 12Ð]l HÇĶæ*-V> çÜ™èl$¢-ç³-ÍÏ BÑÆý‡Â-Ñ…-_…¨. M>V>, çÜ™èl$¢-ç³-ÍÏÌZ HÇĶæ* iG… M>Æ>Å-ÌS-Ķæ*-°MìS 2022 AMøtºÆŠḥæ16¯]l Ôèæ…MýS$-Ýë¦-糯]l ^ólÔ>Æý‡$. Hyé-¨ÌZV> °Æ>Ã׿… ç³NÇ¢^ólíÜ CMýSPyìl ¯]l$…^ól ç³Ç´ë-ÌS¯]l Mö¯]l-Ýë-WÝë¢-Ð]l$° A«¨M>Æý‡$-Ë$ ^ðlí³µ-¯é M>Æý‡Å-Æý‡*ç³… §éÌS-aÌôæ§ýl$. ©…™ø {糿êÑ™èl {´ë…™èl {ç³fË$, M>ÇÃMýS$-Ë$ çÜÐ]l$-çÜÅ-Ë$ ^ðl糚-MýS$-¯ól…§ýl$MýS$ Mö™èl¢-VýS*-yðl… ÐðlâêÏ-ÍÞ Ð]lÝù¢…¨. çÜ™èl$¢-ç³-ÍÏ HÇĶæ* HÆ>µr$, iG… M>Æ>Å-ÌS-Ķæ$…Oò³ GÐðl$ÃÌôæÅ yéMýStÆŠ‡ Ð]l$sêt Æ>VýS-Ð]l$Ƈ$$ íÜ…VýS-Æó‡×ìæ ïÜG…yîl ºÌS-Æ>…§ýl–íÙtMìS ¡çÜ$-MðS-âýæÏ-V> çœÍ™èl… Ð]l_a…¨. ©…™ø §ýl*Æ>¿êÆý‡… ™èlç³µ-yýlÐól$ M>MýS ÌêÈ Ä¶æ$fÐ]l*-¯]l$-ÌSMýS$ ÌZyìl…VŠæ, MøÌŒæ Æý‡Ðé×ê ç³ÇÃrÏ sñæ…yýlÆý‡$Ï çÜ™èl$¢-ç³-ÍÏ ¯]l$…^ól QÆ>Æý‡-Ð]l#-™éƇ$$. Æý‡*.2MørÏ Ð]lÅĶæ$…-™ø °ÇÃçÜ$¢¯]l² iG… M>Æ>Å-ÌSĶæ$… ç³NÆý‡¢Äôæ$Å Ð]lÆý‡MýS$ íÜ…VýS-Æó‡×ìæ VðS‹Üt-çßo-‹ÜÌZ M>Æ>Å-ÌSĶæ$… Mö¯]l-Ýë-VýS$-™èl$…¨. iG… M>Æ>Å-ÌS-Ķæ$…-™ø ´ër$ G‹ÜKr$ iG…, HÇĶæ* C…f±-ÆŠæ, òÜMýS*Å-Çsîæ, M>ÓÍsîæ BïœçܯЇ Ñ¿êV>Ë$ A…§ýl$-»êr$-ÌZMìS Æ>V>, õÜïœt, Oòœ¯é¯ŒSÞ, ç³Æý‡Þ-¯]lÌŒæ, çÜÆó‡Ó, GõÜtsŒæ Ñ¿êV>ÌS M>Æý‡Å-MýS-Ìê´ë-Ë$ Mö¯é²â¶æ$Ï Mö™èl¢-VýS*-yðl… ¯]l$…^ól Mö¯]l-Ýë-VýS$-™éƇ$$. వైఎస్సార్ చేతుల మీదుగా.. జేవీఆర్ ఓసీని 2005 మార్చిలో నాటి సీఎం వైఎస్. రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఆతర్వాత కిష్టారం ఓసీ ఏర్పాటైంది. జేవీఆర్ ఓసీ–2 మరో 20 ఏళ్లు, కిష్టారం ఓసీ జీవితకాలం మరో నాలుగేళ్లు ఉంది. అంతేకాక బ్లాక్–3 ఓసీకి టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు చేపట్టాల్సి ఉంది. సింగరేణిలోనే సత్తుపల్లి ఏరియా పెద్దది కాగా, జేవీఆర్ ఓసీలో 1,300 మంది, కిష్టారం ఓసీలో 150 మంది పర్మనెంట్ కార్మికులు, ఔట్సోర్సింగ్లో 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
- 
      
                   
                                 సమీకృత సాగుపై దృష్టి పెట్టాలిటేకులపల్లి : సమీకృత వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని తొమ్మిదోమైలు తండా, తంగెళ్లతండాలో తుపానుతో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పొలాల్లో నీరు నిల్వ ఉంటే మరింతగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున నీటిని తొలగించాలని చెప్పారు. పత్తి సాగు చేస్తున్న రైతులు ఆ తర్వాత మునగ సాగుపై దృష్టి సారించాలని కోరారు. మునగ సాగుతో ఇప్పటికే జిల్లాలో చాలా మంది రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మునగ సాగుతో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. వరి సాగు చేసే రైతులు, నీటి ఆధారం ఉన్నవారు ఆయిల్ పామ్ సాగు చేయాలని, తద్వారా దీర్ఘకాలికంగా లాభాలు గడించవచ్చని తెలిపారు. పంటలతో పాటు కౌజు పిట్టలు, మేకలు, గేదెలు, చేపల పెంపకం చేపట్టాలని, కూరగాయలు సాగు చేయాలని, దీంతో రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఏడీఏ లాల్చంద్, ఏఓ అన్నపూర్ణ, ఏఈఓ రమేష్ తదితరులు ఉన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నాం.. సూపర్బజార్(కొత్తగూడెం): తుపాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాల్లో తీసుకోవాల్సిన భద్రతా, సహాయ చర్యలపై హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీకి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. వీసీలో ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఏఓ బాబూరావు, డీసీఎస్ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ అసిస్టెంట్ కోర్సులో మూడు నెలల శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): ఫర్నిచర్ అసిస్టెంట్గా ఆసక్తి ఉన్న వారికి రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికకు నవంబర్ 6న కలెక్టరేట్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్స్టాలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో స్థిరమైన ఉపాధి ఉంటుందని, మొదటి విడతలో ఎనిమిది మంది శిక్షణ పూర్తి చేసి రూ.15వేల వేతనంతో అప్రెంటిస్ చేస్తున్నారని తెలిపారు. రెండో విడతలో 20 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుండగా ఆసక్తి ఉన్న వారు గూగుల్ ఫాం లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత, 18 – 30 ఏళ్ల వయస్సు, ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https:// tinyurl. com/4zv2bn67 గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 79958 06182, 77994 70817 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
- 
      
                   
                                 పోలీస్ అమరులను స్మరించుకోవాలికొత్తగూడెంఅర్బన్: పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో త్రీటౌన్ పోలీసు స్టేషన్లో గురువారం ఆన్లైన్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న స్కూళ్ల విద్యార్థులు స్వయంగా ఓపెన్ హౌస్ను సందర్శించారు. పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పని విధానాన్ని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సీఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, కరుణాకర్, ఆర్ఐ లాల్ బాబు, ఎస్సైలు అరుణ, రమాదేవి పాల్గొన్నారు.
- 
      
                   
                                 గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తామణుగూరు టౌన్: గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీ మణుగూరు శివారులో గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల లోడ్తో లారీ విజయవాడ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు శివారు సాయినగర్ సమీపంలో డివైడర్ ఎక్కి వాహనం బోల్తా పడింది. స్థానికుడు గమనించి డ్రైవర్ను కేబిన్ నుంచి బయటకు తీయగా ప్రమాదం తప్పింది. లారీలో 340 సిలిండర్లు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను మరో లారీలో ఎక్కించారు. రోడ్డుపై నుంచి లారీని తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. కాగా ఒక్క సిలిండర్ లీకై నా పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు కొత్తగూడెం– ఏటూరునాగారం మార్గంలో నెలలు తరబడి డివైడర్ పనులు సాగుతున్నాయి. నిర్మాణాల వద్ద వీధిలైట్లు, స్టాపర్లు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఓ లారీ రాత్రివేళ డివైడర్ను ఎక్కి ప్రమాదానికి గురైంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి మరమ్మతులకు గురైన గుంతల్లో పడి అదే ప్రదేశంలో తీవ్రగాయాలపాలయ్యాడు. తాజాగా గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. అధికారులు స్పందించి వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం
- 
      
                   
                                 మెరుగుపడేనా..?పరీక్ష ఫలితాలుకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజుల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెలలోగా పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల తేదీలు వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో గతేడాది ఆశించిన ఫలితాలు రాబట్టాలేకపోయిరు. ఈ ఏడాదైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం డీఈవో రిటైర్డ్ కాగా, జెడ్పీ సీఈవోకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విద్యాశాఖపై దృష్టి సారించే అవకాశం లేకపోవడంతో భారం అంతా జిల్లా విద్యాశాఖ కోఆర్డి నేటర్లపైనే పడినట్లు తెలుస్తోంది. నో స్నాక్స్ సెప్టెంబర్ నుంచే పదోతరగతి విద్యార్థులకు పాఠశాలల్లోఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసు లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు నీరసపడకుండా ఏటా ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్ అందిస్తున్నారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో స్పెషల్ క్లాసుల్లో స్నాక్స్ ఇవ్వడంలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు స్టడీ అవర్స్ గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 62.56, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్రస్థాయిలో జిల్లాకు 9వ స్థానం దక్కింది. ఇంటర్మీడియట్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కళాశాలల్లో సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. సైన్స్ గ్రూపుల విద్యార్థులకు హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. స్టడీ అవర్స్ను, ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఇంటర్మీడియట్ అధ్యాపకులు చెబుతున్నారు. కళాశాలల్లో అమలుకాని మధ్యాహ్న భోజనం జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా మంది మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెచ్చుకోకుండానే కళాశాలలకు వచ్చి సాయంత్రం వరకు ఉంటారు.ఈ నేపథ్యంలో కళాశాలల్లో మధ్యా హ్న భోజనం అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కళాశాలల నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అమలు చేయడంలేదు. కాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను నియమించారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులు విద్యార్థులపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
- 
      
                   
                                 కిచెన్గార్డెన్లతో ఆరోగ్యం● కూరగాయలు, ఆకు కూరల మొక్కల పెంపకం ● పిల్లలు, గర్భిణులకు రసాయన రహిత ఆహారం.. ● జిల్లాలోని 295 అంగన్వాడీ కేంద్రాల్లో పెంపకం పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా 55 అంగన్వాడీ కేంద్రాల్లో గతేడాది కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 295 కేంద్రాల్లో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేపట్టాం. విడుతల వారీగా అన్ని కేంద్రాల్లో అమలు చేస్తాం. –స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారిగుండాల: అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో కూ డిన గుణాత్మక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పోషన్ వాటిక కార్యక్రమంలో భా గంగా కిచెన్ గార్డెన్లకు శ్రీకారం చుట్టారు. గతేడాది 55 అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పెంచారు. ఆయా కేంద్రాల్లోనే కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేయాల్సి ఉంది. రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పండించే కూరగాయలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 295 కేంద్రాల్లో సాగు.. జిల్లాలో పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 295 అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు పెంచుతున్నారు. గతేడాది సత్ఫలితాలు రావడంతో ఈసారి కేంద్రాల సంఖ్య పెంచారు. ఈ ఏడాది మండలానికి నాలుగు నుంచి ఐదు కేంద్రాలను ఎంపిక చేసి కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. తోటకూర, గోంగూర, పుదీన, కొత్తిమీర, మెంతుకూర వంటి ఆకు కూరలతోపాటు బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కూరగాయలు పండిస్తున్నారు. ఒక్కో కిచెన్ గార్డెన్కు రూ.10 వేలు కిచెన్ గార్డెన్ పెంపకానికి ఒక్కో కేంద్రానికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. ఆరు రింగులు ఏర్పాటు చేసుకుని, ఖాళీ స్థలంలో మట్టి నింపుకోవాలి. ఆరు సిమెంట్ పోల్స్ వేసి గ్రీన్ మ్యాట్ కట్టాలి. మొక్కలు ఏపుగా పెరిగి, కాపు వచ్చే వరకు కిచెన్ గార్డెన్లను కాపాడుకోవాల్సి బాధ్యత టీచర్, ఆయాలపైనే ఉంది. ప్రస్తుతం పెంచుతున్న కేంద్రాల్లో సత్ఫలితాలు వస్తే అన్ని కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపా రు. వీటిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతోనే పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌషికాహారం అందించాలని చెబుతున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలు కిరాణ దుకాణాల్లో కొనుగోలు చేసుకునే అవసరం ఉండదు. రసాయనిక ఎరువుల ప్రభావం లేకపోవడంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.
- 
      
                   
                                 మహిళ అదృశ్యందమ్మపేట: మహిళ అదృశ్యంపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం సావిత్రికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ఆమె అంగీకారంలేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సావిత్రి ఈ నెల 22న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. భర్త గోపాలరావు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యమణుగూరు టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీకి చెందిన మాలెం శ్రీనివాస్(40) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు కూతుళ్లను హాస్టల్లో చేర్పించాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఈ నెల 28న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయే దశలో ఉందని, మృతుడి భార్య దుర్గాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రావణ్ తెలిపారు. ముద్దాయికి ఏడేళ్ల జైలుశిక్షకొత్తగూడెంటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ బుధవారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్కుమార్ తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన రాజేశ్వరికి డోర్నకల్ ప్రాంతా నికి చెందిన కొలిపాక అశోక్తో 20ఏళ్ల క్రితం విహహం జరిగింది. అనంతరం వారు పాల్వంచలోని మంచికంటి నగర్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మాచర్ల ఏసోబు అనే వ్యక్తితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అశోక్ ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2019 నవంబర్ 5న జరిగిన ఈ ఘటనపై మృతిరాలి సోదరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ను దాఖలు చేశారు. న్యాయమూర్తి 16 మంది సాక్షులను విచారించగా, మాచర్ల ఏసోబుపై నేరం రుజువుకావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, సిబ్బంది జి.రాఘవయ్య, ఎం.శ్రీనివాస్, జె.రవి సహకరించారు. బొలెరో వాహనం బోల్తాభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ సెంటర్ నుంచి సారపాక వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం డివైడర్కు ఉన్న రైలింగ్ను ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ సహాయంతో స్థానికులు ఆ బొలెరో వాహనాన్ని పక్కకు జరిపారు. పేకాట స్థావరంపై దాడిములకలపల్లి: మండల పరిధిలోని మాధారం గ్రామశివారులో పేకాట శిబిరంపై బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎస్.మధుప్రసాద్ తెలిపారు. అరెస్టయినవారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని, రూ 5,150, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తూరుబాకలో చోరీదుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి స్వప్న ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రూ.55వేలు నగదు, రూ.15వేల విలువైన ఫోన్ను అపహరించారు. బాధితురాలు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
- 
      
                   
                                 పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా సురేష్బాబుభద్రాచలంటౌన్: ీపఆర్టీయు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణా నికి చెందిన తోటమళ్ల సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్ బుధవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘జీఎన్ఎం’ గడువు పొడిగింపుచుంచుపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి విడుదలైన జీఎన్ఎం కోర్సుల్లో చేరికలకు గడువు తేదీని నవంబర్ వరకుపొడిగించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మం మార్కెట్కు సెలవుల పొడిగింపు ఖమంవ్యవసాయం: ‘మోంథా’ తుపాను కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులను పొడిగించారు. తొలుత బుధవారం వరకు సెలవు ప్రకటించగా.. తుపాన్ తీవ్రత నేపథ్యాన శుక్రవారం(31వ తేదీ) వరకు సెలవులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై నవంబర్ 1న శనివారం, 2న ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో నవంబర్ 3వ తేదీ సోమవారం నుంచి పంట కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని సూచించారు. 2న అండర్–19 నెట్బాల్ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల నెట్బాల్ జట్లను వచ్చేనెల 2న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో జరుగుతాయని జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇద్దరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందంకొణిజర్ల: పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులు పడిపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కాపాడారు. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండగా బుధవారం మధ్యా హ్నం పోలీసులు ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇంతలోనే ఇద్దరు యువకులు పోలీసులను ఖాతరు చేయకుండా వాగు దాటే క్రమాన వరద ఉధృతికి వాహనం జారి పడబోయింది. అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి తాళ్ల సాయంతో ద్విచక్రవాహనం సహా యువకులను బయటకు లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.
- 
      
                   
                                 బీమా సొమ్ము స్వాహాభద్రాచలంఅర్బన్: బీమా సొమ్ము కాజేసిన నలు గురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్నగర్కు చెందిన భూక్యా శ్రీ రాములు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువపత్రం ద్వారా భద్రాచలం ఎల్ఐసీ శాఖ నుంచి రూ.10లక్షల పరిహారం పొంది వాటాలు పంచుకున్నారు. వాటాదారుల మధ్య విభేదాలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయం బయట పడింది. నిందితులు భూక్యా రాధ, ఆమె భర్త భూక్యా శ్రీ రాములు, భూక్యా లక్ష్మా, షేక్ యాకుబ్ పాషాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. భద్రాచలం ఎల్ఐసీ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులు అరెస్ట్
- 
      
                   
                                 నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎంకొణిజర్ల/అశ్వారావుపేటరూరల్: కొణిజర్ల మండ లం అంజనాపురం సమీపాన నిమ్మ వాగులో బుధవారం ఓడీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యా డు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మారుతినగర్కు చెందిన ఆరేపల్లి మురళి (32) మూడు రోజుల క్రితం అదే మండలం నారావారిగూడెం వాసి మునుగొండ వెంకటముత్యం డీసీఎం వ్యాన్కు డ్రైవర్గా వచ్చాడు. సుజాతనగర్లో పత్తి లోడ్ తీసు కుని వరంగల్ జిల్లాలో దిగుమతి చేసి బుధ వారం వస్తుండగా అంజనాపురం వద్ద నిమ్మవాగు వరద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. కొణిజర్ల వైపు నుంచి డీసీఎంలో వస్తున్న మురళి వరద దాటేందుకు యత్నిస్తుండగా మరో వైపు ఉన్న స్థానికులు, ఏన్కూరు పోలీసులు వారించారు. అయినా వినకుండా ముందుకు సాగడంతో వరద ఉధృతికి వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడనే సమాచారం తెలియంతో ఎస్ఐ జి.సూరజ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలించగా సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియరాలేదు. కాగా, మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గల్లంతయ్యాడనే సమాచారం తెలియడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. వరదలో గల్లంతైన డ్రైవర్
- 
      
                   
                                 ‘ముందస్తు’ ముచ్చటేది ?● భద్రగిరిలో ముక్కోటి, నవమి, పుష్కరాలపై కనిపించని కసరత్తు ● శాశ్వత పనులపై శ్రద్ధచూపని అధికారులు ● ప్రణాళిక, అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే ముఖ్యమైన మూడు పండుగలు ముందే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి, వచ్చే ఏడాది మార్చి 27న శ్రీరామనవమి పండుగలు జరుగనున్నాయి. ఇక 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ పండుగలపై ఇంతవరకు ముందస్తు సమీక్ష, ప్రణాళికలు చేపట్టలేదు. భక్తులకు కల్పించాల్సిన శాశ్వత పనులపై ప్రణాళికాయుతంగా ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే తప్ప ఉత్సవాల నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. సమీక్షా సమావేశాల నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు విడుదల చేయించేలా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ప్రణాళికపై అధికారుల నిర్లక్ష్యం.. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఇందుకోసం మిథిలా స్టేడియం పక్కనున్న వేదిక ముందు సెక్టార్లుగా విభజించి టికెట్లు విక్రయిస్తారు. అయితే వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు ఇతర ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేసిన సెక్టార్లు భక్తులతో నిండిపోతాయి. దీంతో ఇతర సాధారణ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ప్రతీ ఏడాది ఇది పరిపాటిగా మారుతోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీరామనవమి రోజునా ఇదే సమస్య ఎదురవుతోంది. సీఎం సెక్టార్తో పాటు వీవీఐపీ సెక్టార్లు నిండిపోయి వెనుక, చుట్టుపక్కల ఉండే భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించలేకపోతున్నారు. ఇక గోదావరి పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ముందస్తు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక వసతుల కల్పన అత్యవసరం. కానీ నేటి వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ముందుస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శోచనీయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానఘాట్ల సంఖ్య పెంచడం, ప్రస్తుతం ఉన్న ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అంటున్నారు. మార్చి 27నే భద్రగిరిలో కల్యాణం.. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీనే నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అస్పష్టత నెలకొని ఉంది. 26, 27 తేదీల్లో ఘడియలు వచ్చినప్పటికీ దేవస్థానంలో మిగులు గడియల్లోనే కల్యాణం జరపనున్నట్లు వైదిక సభ్యులు, ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం 26, 27 తేదీల్లో విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముక్కోటి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల ఉత్సవాలు భద్రాచలంలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత పనుల ప్రణాళికపై అధికారులు వెంటనే సమావేశాలు నిర్వహించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించకుంటే పుష్కరాల నాటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. – పోతురెడ్డి సుబ్బారెడ్డి, సారపాకభద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలకు ఎనలేని విశిష్టత ఉంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకలకు తరలి వస్తుంటారు. అలాగే 12 ఏళ్లకు ఓసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 ఆగస్టులో జరగనున్నాయి. అయితే ప్రతి ఏడాది జరిగే త్సవాలతో పాటు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా భద్రాచలంలో వసతి సౌకర్యాలు మెరుగు పడతాయని అంటున్నారు.
- 
      
                   
                                 శతవసంతాల సభకు దండుగా కదలాలిసూపర్బజార్(కొత్తగూడెం): డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వసంతాల ముగింపు సభకు ప్రతీ పల్లె, బస్తీ నుంచి దండుగా కదలాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. సీపీఐ శత వసంత ఉత్సవాలు పార్టీ వేడుకలా కాకుండా, ప్రజల ఉద్యమ చరిత్రను గుర్తు చేసేలా ఉండాలని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన సీపీఐ చరిత్ర నేటి తరానికి ఆదర్శంగా ఉండేలా మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ డిసెంబర్ 26 వరకు పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. కార్మికులు, కూలీలు, రైతులు, ఉద్యోగులు, యువత, మహిళల సమస్యలపై విస్తృత చర్చలు, సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు మర్రి గోపీకృష్ణ, మాచర్ల శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వంగా వెంకట్, గెద్దాడు నగేష్, రమణమూర్తి, నేరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
- 
      
                   
                                 జెన్కో క్రీడా పోటీలు ప్రారంభంపాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీఆర్సీ టెన్నిస్ కోర్టులో బుధవా రం జెన్ కో క్రీడా పోటీలు ప్రారంభమయ్యా యి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్ ప్రాజెక్ట్స్ పోటీల్లో టెన్సిస్, చెస్, క్యా రమ్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ విభాగాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. 7వ దశ సీఈ కె. శ్రీనివాసబాబు, 5, 6దశల సీఈ ఎం.ప్రభాకర్రావు క్రీడా పోటీలను ప్రారంభించి మా ట్లాడారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఉపయోగపడుతాయన్నారు. శ్రీశైలం, నాగర్జునసాగర్, పోచంపాడు, విద్యుత్సౌధ, బీటీపీఎస్, కేటీపీఎస్ 5,6,7 దశల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఈ లు యుగపతి, రాజ్కుమార్, జి.శ్రీనివాస్, వైసీసీఎ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు మహేష్, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు.
- 
      
                   
                                 లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాంకొత్తగూడెంటౌన్: లొంగిపోయిన మావోయిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూ ర్, సుక్మా జిల్లాలకు చెందిన ముగ్గురు మావోయిస్టులు ఇటీవల లొంగిపోగా, బుధవారం తన కార్యాలయంలో వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో పని చేస్తూ లొంగిపోయిన వారికి పునరావాసం కోసం తెలంగాణ ప్రభుత్వం నగదు రివార్డులు మంజూరు చేసిందని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని, వారితో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. పార్టీ నాయకులు, సభ్యులు ఆయుధాలు వీడి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ(ఆపరేషన్స్) నరేందర్, ఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు
- 
      
                   
                                 కమనీయంగా రామయ్య కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణచుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా నియమితులైన బొప్పన అనూష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్న టి.రాంబాబును హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన అనూషను కార్యాలయ సిబ్బంది, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనూష స్వస్థలం ఖమ్మం కాగా, ఆమె తొలి పోస్టింగ్ జిల్లాకు కేటాయించారు. ‘డీఎంఎల్టీ’ దరఖాస్తు గడువు పొడిగింపుచుంచుపల్లి: 2025 – 26 విద్యాసంవత్సరానికి గానూ కొత్తగూడెం వైద్య కళాశాలలో డీఎంఎల్టీ 30, డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.హరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్(బైపీసీ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లిలో హాకీ స్టేడియంకొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల వెనుక హాకీ స్టేడియం నిర్మించనున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ స్థలంలోని వివిధ రకాల 78 వృక్షాల తొలగింపునకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని, అవసరమైన రుసుము కూడా చెల్లించామని పేర్కొన్నారు. చెట్లను కొనాలనుకునే వారు నవంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. పలు రూట్లలో బస్సుల రద్దు ఖమ్మంమయూరిసెంటర్: తుపాను ప్రభావంతో ఖమ్మం రీజియన్ పరిధిలో పలు మార్గాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. రీజియన్ పరిధి ఏడు డిపోల నుంచి 128 బస్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ముందు జాగ్రత్తగా ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ రూట్లలో బస్సులు నడిపించలేదు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి వివిధ మార్గాల్లో బుధవారం ఒకేరోజు 60,872 కి.మీ. మేర సర్వీసులు రద్దయ్యాయి. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 35, భద్రాచలం డిపో నుంచి 25, ఖమ్మం నుంచి 22, కొత్తగూడెం నుంచి 15, ఇల్లెందు నుంచి 11, మధిర, మణుగూరు నుంచి పదేసి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- 
      
                   
                                 థర్మల్ విద్యుత్కు తగ్గిన డిమాండ్కేటీపీఎస్, బీటీపీఎస్లో పలు యూనిట్లు రిజర్వ్ షట్డౌన్పాల్వంచ: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. మరోవైపు జల, సోలార్ విద్యుత్ అధిక వినియోగంతో థర్మల్ విద్యుత్పై ప్రభావం పడింది. జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బుధవారం చాలా వరకు యూనిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. జెన్కోకు భారీ నష్టం.. విద్యుత్ డిమాండ్ లేకపోవడం, థర్మల్ విద్యుత్ ధర అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ ధరకు లభించే జల, సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశలో 800 మెగావాట్లు, 5, 6 దశల్లోని 9వ యూనిట్ 250 మెగావాట్లు, 11వ యూనిట్ 500 మెగావాట్లు రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. ప్రస్తుతం పదో యూనిట్లోని 250 మెగావాట్లు మాత్రమే నడుస్తోంది. మణుగూరు బీటీపీఎస్లో నాలుగు యూనిట్లకు గాను 270 మెగావాట్ల 3వ యూనిట్ మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తోంది. మిగిలిన 1, 2, 4 యూనిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచారు. మొత్తంగా అక్కడ 810 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జెన్కో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా డిమాండ్ లేకపోవడం, సోలార్, జల విద్యుత్నే అధికంగా వియోగిస్తుండడంతో పలు యూనిట్లు రిజర్వ్ షట్డౌన్లో ఉన్నాయని చెప్పారు.
- 
      
                   
                                 వాతావరణ ంజిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయంకొత్తగూడెంఅర్బన్: మోంథా తుపాన్ ధాటికి సింగరేణిలోని ఓపెన్కాస్ట్ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్ల డించారు. కొత్తగూడెం ఏరియాలో రోజుకు 59,080 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 38,776 టన్నులు, ఇల్లెందు ఏరియాలో 20,833 టన్నులకు గాను 6,420 టన్నులు, మణుగూరు ఏరియాలో 41,460 టన్నులకు గాను 30,039 టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైందని వివరించారు. వర్షం ఇలాగే కొనసాగితే గురువారం కూడా నష్టం తప్పదని భావిస్తున్నారు. కిన్నెరసానికి కొనసాగుతున్న వరద2వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల వరద రావడంతో బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 406.10 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
- 
      
                   
                                 నేలవాలిన ఆశలుసూపర్బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: అన్నదాతల ఆశలపై మోంథా తుపాన్ నీళ్లు చల్లింది. ఎంతో ఆశతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా.. పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. చేతికందే దశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఈ వానాకాలంలో 2,21,345 లక్షల ఎకరాల్లో పత్తి, 1,72,625 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పంటలూ కోతకు సిద్ధమవుతున్న తరుణంలోనే తుపాన్ విరుచుకుపడి రైతులను నట్టేట ముంచింది. దిగుబడి తగ్గి.. రంగు మారి.. మోంథా తుపాన్ ప్రభావంతో బలమైన గాలులు వీయగా వరి నేలవాలింది. వర్షంతో పొలాల్లో నీరు నిలిచి వరి పంట దెబ్బతిన్నది. పత్తిలో వర్షపునీరు చేరడంతో నల్లబారే ప్రమాదంతో పాటు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కూడా కోతదశలో ఉండగా కంకులు నానడంతో ధాన్యం రంగు మారుతుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోయగా.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వరి పొలాలను వర్షపు నీరు ముంచెత్తడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. పైరు నేలవాలడంతో హార్వెస్టర్లతో కోసే అవకాశం లేకుండా పోతోంది. పత్తి కాయలు పగిలి, దూది బయటకు వస్తున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో దూది పూర్తిగా తడిసిపోయింది. రంగు మారి నాణ్యత తగ్గింది. రంగు మారిన పత్తికి మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇప్పటికే సీసీఐ విధించిన నిబంధనలతో సతమతమం అవుతుండగా ‘తెల్ల బంగారం’ సాగు చేసిన రైతులకు తుపాన్ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లనుంది. అప్పుల ఊబిలో అన్నదాత.. సాగు చేసింది మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల రూపంలో రూ.లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుపాన్తో తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే వ్యవసాయ కమిషనరేట్ నుంచి జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పత్తి, వరి విస్తీర్ణాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అంటున్నారు. కొత్తగూడెంఅర్బన్: తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేయగా.. బడులన్నీ మూసివేశారు. అయితే గురువారం కొనసాగుతాయా, సెలవు ఉంటుందా అనేది వెల్లడి కాలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 31 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లాలో సరాసరి వర్షపాతం 13.4 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో ఈ సీజన్లో ఐదు మండలాల్లో సాధారణ, 18 మండలాల్లో అధికంగా వర్షం కురిసింది. మోంథా తుపాన్తో జిల్లా రైతులకు తీవ్ర నష్టం
- 
      
                   
                                 నిబంధనలు పాటించని క్లినిక్ సీజ్భద్రాచలంఅర్బన్: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఓ క్లినిక్ను వైద్యాధికారులు మంగళవారం సీజ్ చేశారు. భద్రాచలంలోని డాక్టర్ ఆర్.నాగేశ్వర్రావు కాలనీలో ఓ మెడికల్ షాప్ను ఆనుకుని అనుమతి లేకుండా ప్రతీ ఆదివారం డెర్మటాలజిస్ట్ను పిలిపించి క్లినిక్ నిర్వహిస్తున్నారు. గతంలోనే అనుమతి తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా నిర్వాహకుడు పట్టించుకోకపోవడంతో మంగళవారం సీజ్ చేశారు. అలాగే, బ్రిడ్జి సెంటర్లోని సూర్య ఆస్పత్రిలో పరీక్షలకు అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీఎంహెచ్ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 జాబ్మేళాలకు స్పందన● 23,650 మందికి ఉద్యోగాలు ● సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహణ కొత్తగూడెంఅర్బన్: పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువతకు హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది. ఆరు నెలలుగా మెగా ఉద్యోగమేళాలు నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు 24 వేల మందికి కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఆరు నెలల్లో 7 పట్టణాల్లో నిర్వహించిన జాబ్మేళా కార్యక్రమాల్లో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వారిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. ఏడో తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు గల వారితో పాటు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. ఒక్కొక్క జాబ్మేళాలో 100 నుంచి 250 వరకు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ఈ జాబ్మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21వ తేదీన మధిరలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సారథ్యంలో నిర్వహించారు. అదే నెల 27వ తేదీన భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో.. మే 18న గోదావరిఖనిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, సీఎండీ బలరామ్ ఆధ్వర్యంలో.. మే 24వ తేదీన వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో.. మే26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో.. అదేరోజు బెల్లంపల్లిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో జాబ్మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు.
- 
      
                   
                                 కోడి పుంజుకు నాలుగు కాళ్లు!అశ్వారావుపేటరూరల్: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉండటం సహజమే. కానీ ఓ కోడి పుంజుకు నాలుగు కాళ్లు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన నరదల నాగరాజు కొంతకాలంగా కోళ్లను పెంచుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఓ పెట్ట గుడ్లను పెట్టి పొదగగా అందులోని ఓ కోడి పుంజు (పచ్చాకాకి జాతి)కు నాలుగు కాళ్లు వచ్చాయి. కాగా, జన్యుపరమైన లోపం కారణంగా పుంజు నాలుగు కాళ్లతో జన్మించిందని తెలుస్తోంది. కొన్ని పుంజులు దీంతో పోట్లాడుతుండగా నాలుగు కాళ్లు చూసి పారిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
- 
      
                   
                                 కిన్నెరసాని గేటు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద వస్తుండటంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తారు. ఈ మేరకు 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి యువకుడి హాలీవుడ్ చిత్రం త్వరలో అమెరికాలో విడుదల కానున్న ‘ది లాస్ట్ విజిల్’ భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన యువ దర్శకుడు కొండపల్లి వివేక్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ విజిల్’ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. భద్రాచలం పట్టణానికి చెందిన రిటైర్డ్ సీఐ కొండపల్లి మహేశ్వరరావు కుమారుడైన వివేక్.. చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువుల అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడ చదువుకుంటూనే సినీ రంగంలో మెళకువలు నేర్చుకుని, దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని రూపొందించాడు. ఇంగ్లిష్లో వివేక్ దర్శకత్వం వహించిన ‘ది లాస్ట్ విజిల్’చిత్రం త్వరలోనే అమెరికాలో విడుదల కానుంది. ఫెడరేషన్ కప్నకు భద్రాద్రి క్రీడాకారుడు భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డీవీ శంకర్రావు హిమాచల్ ప్రదేశ్లో జరగబోయే ప్రతిష్టాత్మక పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్నకు ఎంపికై నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోగాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 73 ఏళ్ల వయస్సులో శంకర్రావు కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించడం అసాధారణమని, ఇప్పుడు ఫెడరేషన్ కప్నకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా శంకర్రావును పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, జాయింట్ సెక్రెటరీ గుగులోత్ శోభన్నాయక్, బోగాల వీరారెడ్డి, చిరంజీవి తదితరులు అభినందించారు. రెన్యూవల్ చేయించుకోవాలి.. కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, సీపీఆర్ఎంఎస్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డు పొందిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ జీవీ కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏడాదికి గాను సీపీఆర్ఎంఎస్ హెల్త్ కార్డును మీ సేవలోగానీ, ఆన్లైన్లో గానీ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుడ్రైవర్కు గుండెపోటు తృటిలో తప్పిన ప్రమాదం భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో చాకచక్యంగా బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును విజయవాడకు నడుపుతున్న డ్రైవర్ వైఎన్.రావుకు తిరువూరు బస్టాండ్ దాటిన కొద్దిసేపటికే చాతిలో త్రీవంగా నొప్పి వచ్చింది. బస్సులో ఉన్న కండక్టర్, స్థానికులు వెంటనే డ్రైవర్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వైఎన్.రావును విజయవాడకు తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా, చాతిలో నొప్పి వచ్చిన సమయంలో డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి ఇల్లెందు: గడ్డిమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన బండ జ్యోతి (36) ఈ నెల 2వ తేదీన గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఇల్లెందు వైద్యశాలకు అక్కడి నుంచి ఖమ్మం, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సోమవారం ఎంజీఎంలో మృతి చెందింది. ఎంఏ, బీఈడీ చేసిన జ్యోతి పుట్టుకతో వికలాంగురాలు. ఉద్యోగం రాక, వివాహం జరుగక తీవ్ర మనోవేదనకు గురైంది. కుటుంబానికి భారంగా ఉండొద్దని భావించి, పురుగుమందు తాగింది. తండ్రి పోషయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- 
      
                   
                                 హరీశ్రావుకు పరామర్శఇల్లెందు: మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం మృతి చెందగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని వారి నివాసంలో సత్యనారాయణ మృతదేహం వద్ద నివాళులర్పించాక హరీశ్రావు, కుటుంబీకులను పరామర్శించారు. సెక్యూరిటీగార్డుకు పాముకాటు మణుగూరుటౌన్: సింగరేణి ఓసీ–2లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీగార్డు పాముకాటుకు గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్ విధులకు హాజరైన శ్రీనివాస్ ఓసీ–2 గని సమీపంలోని 84 డీపీ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో కట్లపాము కాటుకు గురికావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సూపర్వైజర్లు, అధికారులు సింగరేణి ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కోతుల దాడితో ఆటో బోల్తా కల్లూరురూరల్: మండలంలోని ముగ్గు వెంకటాపురం శివారులో కోతుల గుంపు రావడంతో ఆటో బోల్తా పడింది. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వైపు మంగళవారం వెళ్తున్న ఆటో ముగ్గవెంకటాపురం శివార్లలోకి రాగానే కోతుల గుంపు ఆటోపైకి వచ్చింది. డ్రైవర్ ఆందోళన చెందగా ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.
- 
      
                   
                                 బీసీలు రాజ్యాధికారం సాధించాలి..కొత్తగూడెంఅర్బన్: బీసీలు చైతన్యంతో అగ్రవర్ణాల దోపిడీ పాలనను అంతమొందించాలంటే ఎస్సీ, ఎస్టీలతో జత కట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ పేర్కొన్నారు. సామాజిక చైతన్య రథయాత్ర మంగళవారం కొత్తగూడెంనకు చేరుకుంది. సూపర్బజార్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దోపిడీ పాలన, కుటుంబ పాలన అంతమై కాంగ్రెస్ పాలన వచ్చిందని సంతోషపడితే అంతకంటే ఎక్కువ దోపిడీ జరుగుతోందన్నారు. సీఎం కుటుంబ సభ్యులు, వారి అనుచరులు రాష్ట్రాన్ని జోనల్గా విభజించి భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ లాభాల ఆపేక్షతో పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని, తక్షణమే ఓపెన్ కాస్ట్ మైనింగ్ నిలిపి, సాంకేతికతతో అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులలో పూర్తిస్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆడంబరంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో ఏడాది గడిచినా ఒక్క బ్యాచ్కు కూడా శిక్షణ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కట్ట సతీశ్, బీరప్ప, మడకం ప్రసాద్, నూనె భాస్కర్రావు, రిషబ్జైన్, నరసింహారావు, సుధాకర్, బుల్లెట్ వెంకన్న, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
- 
      
                    కూరగాయల సాగు అంతంతే...సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో సంప్రదాయ, వాణిజ్య పంటలు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నపై మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించడం లేదు. మూడేళ్లుగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసిన సమష్టి కృషి ఫలితంగా ఆయిల్పామ్ వైపునకు రైతులు మొగ్గు చూపుతున్నారు. లాభదాయకమైన కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు పట్ల రైతాంగం ఆసక్తి కనబర్చక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వినియోగం ఎక్కువే.. జిల్లా ఉద్యాన శాఖ అధికార గణాంకాల ప్రకారం ఒకరోజుకు ఒక మనిషికి 200 గ్రాముల కూరగాయలు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ జిల్లాగా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గిరిజన, ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, హనుమాన్ దీక్షల సందర్భాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలనే వాడుతారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 23 మండలాల్లో కేవలం 705 మంది రైతులు 843.17 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు చేస్తున్నారంటే ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు కూరగాయలు దిగుమతి అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతులు రక్షణ చర్యలు చేపట్టి కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తే డిమాండ్ ఉన్న కారణంగా అధిక లాభాలు పొందవచ్చని అధికార యంత్రాంగం సూచిస్తున్నా రైతులు తమ సంప్రదాయ పంటల సాగు నుంచి దృష్టి మరల్చడం లేదు. జిల్లాలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో తాము కూరగాయల సాగు చేయలేక పోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో సుజాతనగర్ మండలంలో అధికంగా 242 మంది రైతులు 344.15 ఎకరాలలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండగా ములకలపల్లి, భద్రాచలం, చుంచుపల్లి, ఆళ్లపల్లి, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో కనీసం మూడు ఎకరాల్లో కూడా కూరగాయల సాగును రైతులు చేయకపోవడం గమనార్హం. కూరగాయలు పండించాలంటే కోతుల భయం ఎక్కువగా ఉంది. సమీప ప్రాంతాల్లో అడవీ ఉన్నా వాటికి ఆహారం దొరకక పోవడంతో పంట పొలాల మీద దాడి చేస్తున్నాయి. దీంతో కూరగాయలను పండించలేక పోతున్నాం. –కల్తీ ముత్తయ్య, రైతు, కన్నాయిగూడెం, గుండాల మండలం సంప్రదాయ పంటలతో వచ్చే నష్టాలను అధిగమించేందుకు ఉద్యాన, కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలి. ఈ విషయమై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో కొందరు ఉద్యాన పంటలపై మక్కువ చూపుతున్నారు. కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు. –జంగా కిశోర్, ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సుజాతనగర్ 242 344.15 టేకులపల్లి 105 148.22 జూలూరుపాడు 87 86.32 మణుగూరు 48 51.36 పాల్వంచ 42 42.34 దుమ్ముగూడెం 34 24.25 చర్ల 31 9.2 అశ్వాపురం 25 28.38 చండ్రుగొండ 25 27.2 కొత్తగూడెం 22 24.29 అశ్వారావుపేట 08 11.8 ఇల్లందు 06 8.2 భద్రాచలం 06 2.2 లక్ష్మీదేవిపల్లి 05 8.11 అన్నపురెడ్డిపల్లి 04 4.15 దమ్మపేట 03 9.6 చుంచుపల్లి 03 2.2 ఆళ్లపల్లి 03 1.32 పినపాక 03 1.17 బూర్గంపాడు 02 2.33 ములకలపల్లి 01 1.2 మొత్తం 705 843.17 రైతుల నుంచి ఆదరణ కరువు
- 
      
                   
                                 షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధందమ్మపేట: షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని బాలాజీ థియేటర్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట బాలాజీనగర్లో స్థానికంగా నివాసం ఉంటున్న నల్లబోతుల మహేశ్ తన కారును ఇంటి ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి, ఇంట్లోకి వెళ్లాడు. కారు నుంచి పొగలు రావడం గమనించిన అతడు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. దాడిచేసిన వ్యక్తిపై కేసు పాల్వంచరూరల్: గొర్రెల షెడ్డులోకి వచ్చిన వ్యక్తి.. యజమానిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పాండురంగాపురానికి చెందిన వీరబోయిన మహేశ్ గొర్రెల షెడ్డులోకి ఈ నెల 24వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఎల్లావుల సంతోష్ వచ్చాడు. గమనించిన మహేశ్ ఎందుకొచ్చావని అడిగితే కత్తితో దాడి చేశాడు. గొర్రెలను చోరీ చేసేందుకు వచ్చి, కత్తితో పొడిచాడని మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విజయ్సింహారెడ్డి కథనం మేరకు.. వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు మర్రిగూడెం శివారులో మంగళవారం దాడులు నిర్వహించారు. ఆవులు, దూడలను హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్న టాటా ఏస్ మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ వద్ద గల బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకునేందుకు యత్నించింది. గుర్తించిన తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, బాలిక తల్లిదండ్రులు గొడవ పడి వేరుగా ఉంటామని ఫోన్లో బాలికకు చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మైథిలి, ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా.. కుటుంబ సభ్యుల కలహాలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని, తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.
- 
      
                   
                                 నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి● విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● పోలీస్ సిబ్బందికి ఎస్పీ రోహిత్రాజు హెచ్చరిక కొత్తగూడెంటౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, ప్రతీ కేసులో సమగ్ర విచారణ నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు అఽధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హాట్స్పాట్లను గుర్తించి గంజాయి రవాణా చేసేవారితో పాటు సేవించే వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. చోరీ కేసుల్లో సాంకేతికతను వినియోగించి నిందితులను పట్టుకోవాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని చెప్పారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్కుమార్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలిఅశ్వాపురం/మణుగూరురూరల్ : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్ కార్యాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు మణిధర్, అద్దంకి సురేష్, డిప్యూటీ తహసీల్దార్లు అనూష, రాజేశ్వరరావు, రామారావు, ఆర్ఐ లీలావతి, యూడీసీ కనకలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కుంజా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్
- 
      
                   
                                 వణికిస్తున్న మోంథా● జిల్లాను తాకిన తుపాను ప్రభావం ● ఈదురు గాలులతో వర్షం ● పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరించిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు బుధ, గురువారాల్లో వ్యవసాయ పనులు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరికోతలు, పత్తితీతలు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు కోరారు. పనులకు బ్రేక్.. తుపాను నేపథ్యంలో మంగళవారం వరికోతలు, పత్తితీతలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగడంతో పాటు పత్తితీతలు ఊపందుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల వరకు కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మోంథా తుపాను కారణంగా మరింత జాప్యం జరుగుతుండడంతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా, ధాన్యం ఆరబోసేందుకు ఖాళీ స్థలాలు, కల్లాలు లేవు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులను తుపాను మరింతగా కష్టాల పాలు చేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పచ్చి వడ్లను తక్కువ ధరకే మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చాలా శ్రమతో కూడుకోవడంతో పాటు వసతులు లేకపోవడంతో పచ్చి వడ్లనే అమ్ముతున్నారు. పత్తితీత పనులు కూడా తుపాను నేపథ్యంలో నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పత్తి చెట్టపైనే పూర్తిగా తడిసింది. దీంతో పత్తి తీసే పనులను నిలిపివేశారు. మోంథా తుపాను ప్రభావం జిల్లాపై ఎక్కువగానే ఉంటుందనే ప్రచారంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఓ వైపు కోతకు వచ్చిన పొలాలు, మరో పక్క పూసిన పత్తి చేలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుపాను గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే వరి పంట నేలవాలడంతో పాటు పత్తి మొక్కలు కూడా ఒరిగిపోతాయనే భయాందోళనలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కోసిన పంటలను తుపాను బారి నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు, పరదాలు సిద్ధం చేసుకుంటున్నారు. అధిక వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఇప్పుడు తుపానుతో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ చెరువు కట్టలు, అలుగులు తెగిపోయి పంటలు పాడవుతాయనే ఆందోళన సైతం రైతుల్లో వ్యక్తమతోంది.
- 
      
                   
                                 అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన మధిర: రాష్ట్రమంతా భారీ వర్షాలు, తుపాన్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టే భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం నెరవేరడంలో విద్యుత్ శాఖే కీలకమని తెలిపారు. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా నాణ్యమైన విద్యుత్ అవసరమని, అందుకే రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తూ బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దశల వారీగా... మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తొలిదశలో రూ. 27.76కోట్లతో 3.5 కి.మీ. మేర 33 కేవీ లైన్, 17.3 కి.మీ. మేర 11 కే.వీ. లైన్, 15 కిలోమీటర్ల నిడివితో ఎల్టీ లైన్ను భూగర్భంలో వేస్తామని చెప్పారు. అలాగే, సబ్స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డులోని గ్యాస్ గోదాం(రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుంచి అంబారుపేట చెరువు వరకు ప్రస్తుతం ఉన్న 11 కే.వీ. ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక నందిగామ బైపాస్ రోడ్డు హెచ్పీ బంక్ నుండి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్ లైన్ పనులు చేపడతామన్నారు. తద్వారా విద్యుత్ తీగలు బయటకు ఎక్కడా కనిపించవని, విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగవని తెలిపారు. అంతేకాక రోడ్ల వెంట మొక్కల పెంపకానికి అవకాశ ం ఏర్పడడంతో పాటు భారీ వర్షాలు, తుపాన్ల సమయాన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని చెప్పారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెళ్లేలా విద్యుత్ అంబులెన్స్లను సమకూర్చగా, 1912 నంబర్కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఆతర్వాత మడుపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్ బీ ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 అలరించిన నృత్య ప్రదర్శనరేపు కిన్నెరసానిలో ఆర్చరీ పోటీలు పాల్వంచరూరల్ : పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ రౌండ్ 30 నుంచి 20 మీటర్లు, రికర్వ్ రౌండ్ 60, కాంపౌండ్ డబుల్ 50 మీటర్ల పోటీలు ఉంటాయని, పాల్గొనే బాలబాలికలు 2008 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకుని రావాలని సూచించారు. ఇక్కడ ఎంపికై న బాలబాలికలు తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా తరఫున ఆడుతారని పేర్కొన్నారు. భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. అభినయ కూచిపూడి నృత్యాలయ బృందం ఆధ్వర్యంలో మంగళవారం చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు.
- 
      
                   
                                 నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సమయపాలన పాటించాలిచుంచుపల్లి: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆమె జిల్లాలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్ 1 నుంచి 7 వరకు కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందాలు జిల్లాలో పర్యటించనున్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతీ గ్రామంలో ప్రజలకు జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను వివరించి పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో డాక్టర్లు సైదులు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో గురుకుల విద్యార్థిని ప్రతిభఇల్లెందురూరల్ : గోవిజ్ఞాన్ రాష్ట్ర స్థాయి పరీక్షలో ఇల్లెందు మండలం సుదిమళ్ల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని తంగురి వెన్నెల మూడో స్థానం సాధించింది. గోసేవా విభాగం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి వివిధ దశల్లో నిర్వహించిన గోవిజ్ఞాన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వెన్నెల.. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటింది. మూడో స్థానంలో నిలిచిన వెన్నెలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. కాగా, వెన్నెల ప్రతిభ కనబర్చడం పట్ల జిల్లా గోసేవా విభాగం ప్రతినిధులు సతీష్ ఖండేల్వాల్, పూనియానాయక్ హర్షం వ్యక్తం చేశారు.
- 
      
                   
                                 రైతుల సంక్షేమంలో కేవీకేల పాత్ర కీలకంసూపర్బజార్(కొత్తగూడెం): రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని కేవీకేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణ, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతుల సంక్షేమానికి కేవీకే చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు టార్పాలిన్లు, వ్యవసాయ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ హేమ శరత్ చంద్ర, బి.శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధికి కృషి.. జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా భారత్ రూరల్ లైవ్లీ హుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి భారత్ లైవ్లీహుడ్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎల్ఎఫ్ సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ మేరకు జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాలను ఎంపిక చేయగా, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడామని వివరించారు. సంస్థ తాత్కాలిక కార్యాలయాన్ని భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేశామని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఆర్థిక సహకారం అందుతుందని వెల్లడించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, డీఏఓ బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, ఎల్డీఎం రామిరెడ్డి, పశుసంవర్థక శాఖాధికారి వెంకటేశ్వర్లు, బీఆర్ఎల్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ అనే సందేశం ప్రతీ విద్యార్థికి చేరాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనుల్లో నాణ్యత పాటించేలా ప్రిన్సిపాళ్లు పర్యవేక్షించాలని సూచించారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అశ్వారావుపేట, చర్ల, పినపాక, దుమ్ముగూడెం కళాశాలల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గాయని ఆయా ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. కళాశాలలకు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రిన్సిపాళ్లు చెప్పగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో డీఐఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సదరం క్యాంపు పరిశీలన చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరుపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రతీ దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డులు తెలంగాణతో పాటు దేశమంతటా పని చేస్తాయని చెప్పారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని వివరించారు. సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలం : తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ వేర్వేరు ప్రకటనల్లో సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం అధికంగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. ఏపీ వైపు వెళ్లే వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద ఉండొద్దని పేర్కొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్
- 
      
                   
                                 గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందిస్తాంభద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్కు హాజరైన వారి నుంచి ఆయన ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచి అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీడీ అశోక్, ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏఓ రాంబాబు, ఇన్చార్జ్ ఎస్ఓ భాస్కరన్, ఉదయ్కుమార్, ఏపీఓ పవర్ వేణు, రాజారావు, ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, నారాయణ రావు, వెంకటేశ్వరరావు, లింగా నాయక్, జయరాజ్, ఏఓ నరేందర్ పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు డిజిటల్ ప్లాట్ఫామ్ గిరిజన నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశామని పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు – ఉద్యోగం కల్పించే పరిశ్రమలకు మధ్య ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ (వెబ్సైట్) వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత https//deet.telangana.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతను బట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్ల డించారు. వివరాలకు ఐటీడీఏ ఆవరణలోని భవిత సెల్లో సంప్రదించాలని కోరారు. ఐటీడీఏ పీఓ రాహుల్
- 
      
                   
                                 సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలుసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఆర్డీఓ మధు అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 30 మంది దరఖాస్తులు అందజేశారని, ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లపై దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కాగా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం, కొత్తగూడెం రామవరంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని సీపీఎం, సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆత్మహత్యగుండాల: ఒంటరి తనాన్ని భరించలేక మద్యానికి బానిసై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పడుగోనిగూడెం గ్రామానికి చెందిన వూకె నిఖిల్(25) చిన్నతనంలో తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో బంధువుల ఇంట్లో ఉంటున్నా.. ఒంటరివాడినని మథన పడేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యా డు. మనస్తాపానికి గురై వారం క్రితం పురుగుమందు తాగగా, ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదా రహూఫ్ తెలిపారు.
- 
      
                   
                                 నిబంధనల ప్రకారమే కొనుగోళ్లుసూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస వసతులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో వరి కోతలు తాత్కాలికంగా నిలిపివేయాలని విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలు, గన్నీ బ్యాగుల వివరాల నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులను కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ను కలిసిన సైన్స్ అధికారి.. జూలూరుపాడు: కలెక్టర్ జితేష్ వి పాటిల్ను జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఆవిష్కరణలు చేపట్టాలని ఈ సందర్భంగా సంపత్ కుమార్కు కలెక్టర్ సూచించారు. అప్డేట్ బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదే.. కొత్తగూడెంఅర్బన్: యూడైస్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేయించాల్సిన బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదేనని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. పాత్తకొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూడైస్ రిపోర్టును సక్రమంగా ఎంటర్ చేయకపోవడంతో జిల్లా పీజీఐ ర్యాంక్ తగ్గిపోతుందని అన్నారు. అనంతరం డీఈఓ బి.నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్వచ్ఛ, హరిత పాఠశాలల ఎంపికలో భాగంగా 4, 5 స్టార్స్ కల్గిన 486 పాఠశాలలను గుర్తించి, 90 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అసైన్ చేశామని, ఈనెల 31వరకు మూల్యాంకనం చేసి ఎస్హెచ్వీఆర్ వెబ్సైట్లో ఆయా అంశాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాధ్ బాబు, మార్కెటింగ్ అధికారి నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్.కె సైదులు, సతీష్ కుమార్, నాగ రాజశేఖర్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్
- 
      
                   
                                 ఏసీబికి చిక్కిన జీపీఓ● భూ రిజిస్ట్రేషన్కు రైతు నుంచి రూ.60వేలు లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న వైనం ములకలపల్లి: ములకలపల్లి తహసీల్ పరిధి గ్రామ పరిపాలనాధికారి(జీపీఓ) బానోత్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ అవినీతీ నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వేముకుంటకు చెందిన ఓ రైతు తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 22 స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ భూమిపై బ్యాంక్ రుణం బకాయి ఉన్నందున రూ.60 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని పూసుగూడెం క్లస్టర్ జీపీఓ బానోతు శ్రీనివాస్నాయక్ స్పష్టం చేశాడు. దీంతో సదరు రైతు ఫోన్పే ద్వారా రూ.30వేలు, నగదుగా రూ.10వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.20వేలు ఇవ్వాల్సిందేనని జీపీఓ స్పష్టం చేయడంతో రూ.15 వేలకు రైతు బేరం కుదుర్చుకున్నాడు. ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు తహసీల్లో శ్రీనివాస్ నాయక్ సోమవారం రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా, వసూళ్లలో ఇతర ఉద్యోగుల పాత్రపైనా విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే, పట్టుబడిన జీపీఓ శ్రీనివాస్నాయక్ నెలన్నర క్రితమే విధుల్లోకి చేరడం గమనార్హం. కాగా తహసీల్లో అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. తహ సీల్దార్ గన్యానాయక్ను కూడా విచారించినట్లు సమాచారం. పాల్వంచలో సోదాలు.. పాల్వంచ: పట్టణంలోని అయ్యప్పనగర్లో గల శ్రీనివాస్ నాయక్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరి పేర్లతో ఉన్నాయనే కోణంలో తనిఖీ చేసినట్లు సమాచారం.
- 
      
                   
                                 దివ్యాంగులను గౌరవించాలికొత్తగూడెంటౌన్: దివ్యాంగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన.. ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం –2016 పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టంపై త్వరలో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగులను కించపరిచినా, హేళన చేసినా, అవయవ లోపాలను ఎత్తిచూపినా శిక్షార్హులని పేర్కొన్నారు. దివ్యాంగులను అవమానించినా, పరికరాలు ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు జైలుశిక్ష, రూ. పది వేల నుంచి రూ.5 లక్షల జరిమానా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరి సాయిరాం, అన్నం సత్తిబాబు, సభ్యులు కృష్ణా శ్రీనివాసరావు, వాల్మీకి, అలవాల రాజా పెరియార్, కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్నదాసు బాబు, మద్దెల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు
- 
      
                   
                                 నాణ్యమైన సేవలతో వ్యాపారాభివృద్ధిభద్రాచలంటౌన్: వినియోగదారులకు నాణ్య మైన సేవలు అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తెలిపారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఎస్ఎల్బీటీ పెయింట్స్ అండ్ జనరల్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ‘నెక్సన్’ షోరూంను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భద్రాచలంలో ‘నెక్సన్’ షోరూం ప్రారంభం కావడం హర్షణీయమని తెలిపారు. అనంతరం వెంకట్రావ్, వీరయ్యను ఎస్ఎల్బీటీ సంస్థ అధినేతలు సెట్టి వేణు, భూమా తేజ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆయిల్పామ్తో అధిక లాభాలుసూపర్బజార్(కొత్తగూడెం): ఆయిల్పామ్ సాగు చేస్తే రైతులు అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ అన్నారు. అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సోమవారం తమ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు ఆవశ్యకత, సబ్సిడీ వంటి వివరాలు తెలిపారు. సమావేశంలో పీసీఓ ఎ.శ్రీనివాస్, ఆయిల్ఫెడ్ డీఓ రాధాకృష్ణ, గోద్రేజ్ డీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలుఇల్లెందు: అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో ఇల్లెందు పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆర్అండ్ఆర్ కాలనీలో 100 గృహాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 60 బైక్లు, 10 ఆటోలు, మద్యం, గుట్కాలు పట్టుకున్నారు. ఐదు బైక్లు సీజ్ చేశారు. అనంతరం చంద్రబాను మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం తమ నివాస ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ టి.సురేష్, టేకులపల్లి, గుండాల సీఐలు బత్తుల సత్యనారాయణ, లోడిగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరించుకోండిపాల్వంచ: ఈపీఎఫ్లో తప్పులుంటే వాటిని సవరణ చేసుకోవచ్చని నిధి ఆప్కే నికట్ వరంగల్ అకౌంట్స్ అధికారి కొండపల్లి సునీల్ అన్నా రు. స్థానిక మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ నెల 27వ తేదీన ఈపీఎఫ్పై అవగాహన కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్బంగా నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలు పరిష్కరించి సలహాలు, సూచనలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ఉద్యోగ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి సామర్థ్యాన్ని అభివృద్ది చేయడం, అన్ని రంగాల్లో సామాజిక భద్రత మెరుగుపర్చడం వంటి ప్రయోజనాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కె.సుజాత, సెక్షన్ సూపర్వైజర్ రమేష్, మున్సిపల్ మేనేజర్ లోగాని వెంకట సత్యనారాయణ, బరగడి దేవదానం, వెంపటి అరుణ్ కుమార్, బి.సక్రాం, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీగుండాల: ఆళ్లపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ను హైదరాబాద్ క్వాలిటీ విభాగం అధికారి ఫకీర్దాస్, జిల్లా సమన్వయకర్త సతీష్ సోమవారం తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వాహనం మరమ్మతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పరమ సునీల్ కుమార్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలిమణుగూరు రూరల్ : కొత్తగూడెం – మణుగూరు – ఏటూరునాగారం రహదారిపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రోడ్లపై గుంతలతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులు ఎక్కడికి తరలిపోతున్నాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా.. నిధులు సున్నా అని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పోశం నర్సింహరావు, కుర్రి నాగేశ్వరరావు, కె. లక్ష్మణ్, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, నూకారపు రమేష్, అక్కి నర్సింహరావు, వేర్పుల సురేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
- 
      
                   
                                 కాంగ్రెస్లో బీసీలకు ప్రాధాన్యత లేదుటీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్కుమార్ అశ్వారావుపేటరూరల్ : కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదని, మరో మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. సోమవారం అశ్వారావుపేటలో నిర్వహించిన సామాజిక చైతన్య రథయాత్రలో, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సామాజిక చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, మంత్రి కొండా సురేఖను సైతం ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్ దొర, నాయకులు వెలుగు జాకబ్, భాస్కర్రావు, జానీ, బీరప్ప, సుధాకర్ పాల్గొన్నారు.
- 
      
                    కరకట్టపై చెత్త వేస్తే జరిమానాభద్రాచలంఅర్బన్ : భద్రాచలంలోని అన్ని కాలనీల వారు ఇళ్లలో ఏర్పడే చెత్తను గ్రామ పంచాయతీ ఆటోల్లోనే వేయాలని, కరకట్ట ప్రాంతాల్లో వేస్తే భారీ జరిమానా విధిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇతరులు సోమవారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పీఓ, సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం కరకట్ట ప్రాంతంలో వేసే చెత్తతో వచ్చే దుర్వాసన, కొందరు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాల వారితో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. త్వరలో కరకట్ట వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రానున్న వారం రోజుల్లో కరకట్ట ప్రాంతం అంతా శుభ్రం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈఓ శ్రీని వాసరావు, డీడీఎంహెచ్ఓ చైతన్య పాల్గొన్నారు. సిలబస్ పూర్తి చేయాలిదుమ్ముగూడెం: ఇంటర్ సిలబస్ త్వరగా పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాలని రాష్ట్ర ఇంటర్మీడిఝెట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. సోమవారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజువారీ ఎఫ్ఆర్ఎస్ను 80 శాతానికి పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ కాని విద్యార్ధులకు ఈ రిజి స్ట్రేషన్ చేయించాలని సూచించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలని, వాటిని అటెండెన్స్ రికార్డులో నమోదు చేయాలని అన్నారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ
- 
      
                   
                                 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు షురూ..కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు మాట్లాడుతూ.. విజిలెన్స్ విజిలెన్స్ విభాగం సింగరేణిలో అంతర్భాగమని అన్నారు. ప్రతీ పనిలో నీతి నిజాయితీ, పారదర్శకత అవసరమని, తద్వారా సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అవినీతికి వ్యతిరేక జరిగే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ మేనేజర్ విజిలెన్స్ ఎస్డీ షాకీర్ మొహినుద్దీన్ ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ జీఎం కె.ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికారులు కవితానాయుడు, జి.వి.కిరణ్కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి. రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, సీఎంఓఏఐ కార్పొరేట్ అధ్యక్షుడు ఎస్.వెంకటాచారి పాల్గొన్నారు.
- 
      
                   
                                 బీటీపీఎస్ సీఎస్సార్ నిధులు రూ.2.50 కోట్లుసూపర్బజార్(కొత్తగూడెం): మణుగూరు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సోమవారం ఐడీఓసీలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కలిశారు. బీటీపీఎస్ సీఎస్సార్ నిధుల కింద రూ 2.50 కోట్ల డీడీని అందజేశారు. మణుగూరు నుంచి ఏడూళ్ల బయ్యారం వరకు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం, భూ సేకరణలో రైల్వేలైన్ సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వినియోగించనున్నారు. నేటి బీఆర్ఎస్ ధర్నా వాయిదా.. మణుగూరు టౌన్: రోడ్డు మరమ్మతులకు రూ.2.50 కోట్ల మంజూరు నేపథ్యంలో మంగళవారం బీటీపీఎస్ గేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి రూ.వందల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు రాబట్టే వరకు దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
- 
      
                   
                                 వణికిస్తున్న వాయుగండంతుపాను నేపథ్యంలో రైతుల్లో హైరానా ● ఇప్పటికే ఆలస్యమవుతున్న వరికోతలు ● మొదలైనా ముందుకు సాగని పత్తితీతలు బూర్గంపాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిన మొంథా తుపాన్ రైతులను వణికిస్తోంది. తుపాన్ ప్రభావం మంగళవారం నుంచి ఉంటుందని చెప్పిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ఇప్పటికే వరికోతలు ఆలస్యమయ్యాయి. కోతకు వచ్చి వరిపంట వర్షాలతో నేలవాలింది. చాలాచోట్ల మాగాణుల్లో నీరు నిలిచి వరికోతలకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో తుపాన్ అలర్ట్ రైతులను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తితీతలు కూడా ఆలస్యమయ్యాయి. ఒకరోజు పత్తి తీయిస్తే వర్షాల కారణంగా నాలుగు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే తొలివిడత పత్తితీతలు పూర్తి కావాల్సి ఉన్నా.. చాలాచోట్ల మొదలేకాని పరిస్థితి నెలకొంది. కుంగదీస్తున్న వానలు.. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు రైతులను మరింతగా కుంగదీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆగస్టు నుంచి తరచూ వర్షాలు పడుతుండడంతో పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. అధిక వర్షాలతో చీడపీడలు, తెగుళ్లు, పురుగు ఉధృతి పెరిగింది. భూమి, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. ఎన్నో తిప్పలు పడి పండించిన పంటను తీసుకునేందుకు వర్షాలు ఆటంకంగా మారాయి. మొంథా తుపాన్ ప్రభావం జిల్లాపై ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరికోతలు, పత్తి తీత పనులను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరు జల్లులు కురవడం ప్రారంభమైంది. జిల్లాలో మంగళవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు పత్తితీతలు, వరి కోతలను నిలిపివేశారు. అన్నదాతల ఆందోళన.. అధిక వర్షాలతో ఈ ఏడాది వరి పంటకు తాటాకు, ఎండు తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి నివారణకు రైతులు రూ.వేలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షాల కారణంగా కోతలు ఆలస్యం కావడంతో కొన్నిచోట్ల వరి పంట నేలవాలింది. మొంథా తుపాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుందా.. రాదా అనే డైలామాలో రైతులున్నారు. హార్వెస్టర్లతో వరి కోయాలంటే భూమి ఆరకపోవడం, ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడం, ధాన్యం తరలించేందుకు పొలం బాటలు బురదమయంగా ఉండడం వారిని కలవరపరుస్తోంది. ప్రస్తుత తుపాన్ ప్రభావంతో వరికోతలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటివారంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నా.. చాలాచోట్ల వాటి నిర్వహణకు అనువైన పరిస్థితి లేదు. ఇప్పటికే కోసిన పచ్చి ధాన్యాన్నే వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం రైతులు పచ్చి ధాన్యాన్ని రూ. 1,300 నుంచి రూ.1,450 వరకు అమ్ముకుంటున్నారు. ఇక మొక్కజొన్న కోతలు జరుగుతుండగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఆరబోసిన మొక్కజొన్న వానలకు తడిసిపోతోంది. ఇక తుపాన్ వస్తే పంటలకు మరింతగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులు తీసిన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కొనడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయడం లేదు. తేమశాతం 8 కంటే తక్కువగా ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం తగ్గడం లేదు. చేలలో పూసిన పత్తి వర్షాలకు పాడవుతుండడంతో రైతులు తీయిస్తున్నారు. ఆ పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేకపోతున్నారు. అందులో తేమశాతం ఎక్కువగా ఉండడం, ఆరబెట్టే వీలు లేకపోవటంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటిస్తే, ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు క్వింటా రూ.4 వేల నుంచి రూ 5 వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు దిగుబడి రాక, మరో వైపు మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
- 
      
                   
                                 లక్కు దక్కిందిలా..కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు కొత్తగూడెం క్లబ్లో సోమవారం జరిగిన లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆరు స్టేషన్ల పరిధిలో చాలా మంది సిండికేట్ అయి టెండర్లు వేయగా, మరికొందరు ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెండర్లు దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఓ సిండికేట్ వర్గం వారు 21 దరఖాస్తులు దాఖలు చేయగా, ఒక్క షాపు మాత్రమే దక్కింది. టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వారావుపేటకు చెందిన మరో 56 మంది సిండికేట్గా ఏర్పడి 108 దరఖాస్తులు దాఖలు చేయగా వారికి మూడు షాపులే వచ్చాయి. ఈ ఏడాది టెండర్ దాఖలుకు రూ.3లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తులు తగ్గినా.. గతంలో కంటే అధికంగానే ఆదాయం సమకూరింది. డ్రాలో షాపులు దక్కించుకున్న వారి నుంచి జిల్లా ఎకై ్సజ్ అధికారులు.. శ్లాబ్ ప్రకారం మొదటి విడత ఫీజు స్వీకరించారు. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల లైసెన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 88 వైన్ షాపులు, 13 బార్లు ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం రూ.3లక్షల ఫీజుతో 3,922 దరఖాస్తులు వచ్చాయి. పారదర్శకంగా వ్యవహరించాం.. జిల్లాలో నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు పారదర్శకంగా లాటరీ తీశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే డ్రా పద్ధతిని పాటించామన్నారు. కార్యక్రమమంతా సీసీటీవీల పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్, ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించామని వివరించారు. టెండర్లు దక్కించుకున్న వారు నిర్దేశిత కాల వ్యవధిలో లైసెన్స్ ఫీజు చెల్లించి, షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం విక్రయించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించే దుకాణాలు, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు, సర్వేలు కొనసాగుతాయని తెలిపారు. అక్రమ వ్యాపారాల విషయంలో ప్రజలు కూడా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరంచంద్ తదితరులు పాల్గొన్నారు. శేషగిరిని కరుణించిన పెద్దమ్మతల్లి ! పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్ కోసం పలువురు పోటీ పడగా మారుమూల ప్రాంతానికి చెందిన వాడే శేషగిరికి దక్కింది. ఈ వైన్స్ కోసం జిల్లాలోనే అత్యధికంగా 102 టెండర్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ములకలపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన వాడే శేషగిరి డ్రాలో షాపు దక్కించుకున్నాడు. ఆయన మరో 11 మంది మిత్రులతో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు.మద్యం దుకాణాలకు డ్రా కార్యక్రమంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం గమనార్హం. కొందరు సెంటిమెంట్తో మహిళల పేర్లతోనే దరఖాస్తు చేయగా, డ్రా కార్యక్రమానికి వారిని తీసుకొచ్చారు. గతంలో డ్రా కార్యక్రమంలో మహిళలు తక్కువగా కనిపించే వారు. కానీ సోమవారం నాటి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దుకాణాలకు ఎక్కువ మంది మహిళలతో టెండర్లు వేయించారు. మొత్తంగా 88 మద్యం దుకాణాలకు గాను 44 షాపులు ఎస్టీలకు, ఏడు ఎస్సీలకు, 31 ఓపెన్, ఆరు గౌడ కులస్తులకు కేటాయించారు.
- 
      
                   
                                 భక్తిశ్రద్ధలతో సందల్ శోభాయాత్రఇల్లెందురూరల్: గార్వీ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని సీఎస్సీ బస్తీ గ్రామపంచాయతీ హజరత్ ఇమామ్ ఖాసీం ఆషుర ఖానాలో సయ్యద్ యాకూబ్షావళి బాబాకు మూడు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం బాబాకు సందల్ సమర్పించే కార్యక్రమాన్ని భక్తులు కోలాహలంగా నిర్వహించారు. సీఎస్సీ బస్తీ నుంచి పాతబస్టాండ్, జగదాంబ సెంటర్ మీదుగా హజరత్ ఇమామ్ ఖాసీం ఆషురఖానా వరకు సందల్తో శోభాయాత్ర నిర్వహించారు. ఆషుర్ఖానాలో హజరత్ యాకూబ్షావళికి సంప్రదాయయుతంగా సందల్ సమర్పించారు. అనంతరం దర్గా ప్రాంగణంలో భక్తులకు గార్వీ విందు ఇచ్చారు. కార్యక్రమంలో దర్గా మాలిక్ మహ్మద్ పాషా, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 లక్కు ఎవరికో..?● నేడు కొత్తగూడెం క్లబ్లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ● ఏర్పాట్లు పూర్తిచేసిన ఎకై ్సజ్ అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 88 షాపులకు 3,922 దరఖాస్తులు పాల్వంచరూరల్: మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. లక్కు ఎవరిని వరిస్తుందోనని దరఖాస్తుదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 88 మద్యం దుకాణాలు ఉండగా, 2025–2027 సంవత్సరాల కాలానికి లైసెన్స్ కోసం గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించారు. గతంలో రూ.2 లక్షలు ఉన్న లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో గతం కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగింది. మొత్తం 3,922 దరఖాస్తులు రాగా, ఎకై ్సజ్ శాఖకు రూ. 117.66 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ తీసే ప్రక్రియను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభిస్తారని ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. లాటరీలో షాపును దక్కించుకున్న వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. నిర్దేశించిన లైసెన్స్ ఫీజును రెండేళ్ల కాలంలో ఆరు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది. మొదటి విడుత ఫీజు మాత్రం వచ్చే నెలాఖరులోగా చెల్లించాలి. జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాచలంలో అత్యధికంగా 16 షాపులకు 828 దరఖాస్తులు వచ్చాయి. మణుగూరులో 15 షాపులు ఉండగా తక్కువగా 512 దరఖాస్తులు వచ్చాయి. ఇక పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వద్ద షాపునకు రికార్డు స్ధాయిలో 102 దరఖాస్తులు వచ్చాయి. కాగా నాలుగు, ఐదు దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు ఒక్క షాపైనా వస్తుందో రాదోనని టెన్షన్ పడుతున్నారు.
- 
      
                   
                                 ద్విచక్రవాహనం చోరీజూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం గ్రామంలో ఓ ఇంటి ఎదుట ఉన్న బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పడమటనర్సాపురం కాలనీకి చెందిన శ్రీరామ్ తన బైక్ను ఇంటి ఎదుట ఉన్న రేకుల్షెడ్లో నిలిపి ఉంచాడు. ఆదివారం నిత్రలేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. బైక్ను దుండగులు కొత్తగూడెం వైపు తీసుకెళ్లినట్లు డేగలమడుగు సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలిసింది. శ్రీరామ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుక్కలను తప్పించబోయి లారీ కిందికి.. ద్విచక్రవాహనం దూసుకుపోవడంతో మహిళ మృతి సత్తుపల్లిరూరల్: రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో తప్పించబోయి లారీకిందికి దూసుకుపోయింది. తీవ్రగాయాలతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55) ద్విచక్రవాహనం(స్కూటీ)పై గంగారం వైపు నుంచి సత్తుపల్లికి వస్తోంది. తాళ్లమడ శివారున కుక్కలు అడ్డురావడంతో వాహ నం అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ధాన్యం కోసం ఆగి ఉన్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీకింద భాగంలో ఇరుక్కుపోయిన స్వర్ణలత తలకు బంపర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను సత్తుపల్లి 108 సిబ్బంది బయటకు తీశారు. మృతురాలికి భర్త రామకోటేశ్వరరావు, కుమారుడు నాగశ్యామ్, కుమార్తె నాగశ్రీ ఉన్నారు.
- 
      
                   
                                 గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్ఇల్లెందు: ఎస్పీ రోహిత్రాజ్ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ టి.సురేశ్ గంజాయి సరఫరా చేసే సపావత్ వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాశీరాంతండాకు చెందిన సపావత్ వెంకన్న గంజాయి సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న వెంకన్నపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై భద్రాచలం, దుమ్ముగూడెం, రాజేంద్రనగర్, ఇల్లెందు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది ఇల్లెందు పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో వెంకన్నను అరెస్ట్ చేయగా.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. పట్టణం దాటక ముందే ఆనాటి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. తాజాగా వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజ్ అభినందించారు.
- 
      
                   
                                 బాబా ఆలయంలో సంగారెడ్డి జడ్జి పూజలుభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల శ్రీ సాయిబాబా ఆలయాన్ని ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జడ్జి సాయిభూపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి సాయిభూపతిని ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. లయన్స్క్లబ్కు ఎక్స్లెన్స్ అవార్డు మణుగూరురూరల్: మెంటల్ వెల్ బీయింగ్ అండ్ వెల్నెస్ వారోత్సవాల్లో భాగంగా మండలంలో తొమ్మిదిరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మణుగూరు లయన్స్క్లబ్కు జిల్లాస్థాయి ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. సోమవారం ఖమ్మం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన రెండో జిల్లా కేబినేట్ సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు షేక్ మీరాహుస్సేన్కు ఈ అవార్డును క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలిఖమ్మంమామిళ్లగూడెం: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలు ఏర్పాటు చేసి, నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదళ్లలో మతతత్వ బీజా లు నాటే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నూత న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్భవన్లో ఏఐఎస్ఎఫ్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. దేశవ్యాప్తంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పాలని, నూతన విద్యావిధానం ద్వారా మతత త్వ బోధనలు చేయాలని తలపెట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి పీఎంశ్రీ పాఠశాల ఏర్పాటుచేయడానికిపూనుకుందని,రాష్ట్ర ప్రభు త్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు శివ, వంశీ, గోపి, పవన్, నరేందర్, సందీప్, వెంకట్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల క్రీడా జట్లు సిద్ధంఖమ్మంస్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ టెన్నిస్ క్రీడాంశాల్లో వివిధ వయసు కేటగిరిల్లో ఎంపికలను నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. జిల్లా స్కేటింగ్ అండర్–11 బాలికల జట్టులో బి.రిత్విత, జి.సోనాక్షి, టి.జింగ్నార్ష, ఎస్.కె. సమీరా, పి.యోధ, వై.దేవర్షిశ్రీ, బాలుర జట్టులో కె.సాయిశ్రీతేజ, డి.లోహిత అభిరాం, ఎ.కౌశల్, ఆర్.రియాన్, డి.భవన్జై, బి.విశ్వకార్తీక్, అండర్–14 బాలికల జట్టులో టి.జ్ఞానవి, ఐ.వ్యూహిత, వి.పవిత్రయాదవ్, వై.చైతన్య, బాలుర జట్టులో ఎ.భువన్తేజ, ఎ.వవన్సాయి, అండర్–17 బాలుర జట్టులో డి.మదిలేశ్, ఎ.చరణ్, ఎండీ తౌహిద్, జిల్లా జిమ్నాస్టిక్స్ జట్టులో బి.మనోజ్ఞసుచరిత, జి.దీక్షితశ్రీ, ఆర్.లోహితసాయి, బాలురజట్టులో సాయిరాం భరత్, సీహెచ్ మోక్షచందర్, ఎస్.కె.హమీద్అలీ, లాన్ టెన్నిస్ అండర్–14 బాలికల జట్టులో బి.ప్రీతి ప్రజ్వల్, బి.భానుశ్రీ, వి.నేహాశ్రీ, శాలిని, బాలురలో కె.వీరవర్దన్, బి.రిషిరాంనాయక్, ఎస్.తేజ్దీప్, ఎండీ మసూద్, గగన్దీప్, అండర్–17 బాలుర జట్టులో స్వప్నిల్, రఘురాం ఎంపికయ్యారు.
- 
      
                   
                                 పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● సత్తుపల్లిలో మెగా జాబ్మేళా విజయవంతం సత్తుపల్లి: ప్రతీ జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సహకారంతో ఆదివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే ఉద్యోగాల్లో మాత్రం అథమ స్థానంలో ఉందన్నారు. జాబ్మేళాకు సుమారు 70 కంపెనీలు రావడం, 13 వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్మేళాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని, వివిధ నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రైవేట్ కంపెనీల ద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తోందని చెప్పారు. జాబ్మేళా నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి, సహకరించిన సింగరేణి సంస్థను అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించటం ద్వారా ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హతకు తగిన ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరవచ్చని సూచించారు. సింగరేణి ద్వారా సత్తుపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి ఈఅండ్ఎం డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ.. కోల్బెల్ట్ ప్రాంతంలో ఇది ఆరో జాబ్మేళా అని చెప్పారు. అనుభవం లేని వారికి కూడా ఉద్యోగావకాశాలు దక్కినందున కెరీర్ డెవలప్మెంట్కు ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఏసీపీ రఘు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, మున్సిపల్ కమిషనర్ కోండ్రు నర్సింహా, తోట సుజలారాణి, ఎండీ కమల్పాషా, ఉమ్మినేని ప్రసాద్, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, గాదె చెన్నారావు, పసుమర్తి చందర్రావు, మందపాటి ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఘనంగా సత్యనారాయణ వ్రతంభద్రాచలంఅర్బన్: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో ఆర్జిత సేవలో భాగంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయంలోని అంతరాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిత్యకల్యాణం సంప్రదాయబద్ధంగా జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, మాంగల్యధారణ, వేద ఆశీర్వచనంతో కల్యాణ ప్రక్రియ ముగించారు.
- 
      
                   
                                 అండర్ – 19 క్రీడా జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్బాల్, రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసా కలీం తెలిపారు. అండర్–19 బాస్కెట్బాల్ బాలుర జట్టులో జోయిదీప్, అబిద్, సిద్దు, వినయ్కుమార్, విష్ణు, చేతన్, ఖాదర్, సంజయ్, లోహిత్, తాస్విక్, రాజ్ కీర్తన్, బాలికల జట్టులో మౌనిక, జోషిత, సాగరిక, ధత్రి, అశిని, జబీన్, మనస్విని, లిఖిత, దీక్షిత, ప్రవళ్లిక, అక్షనీ, లావణ్య, సాయిచరిత, రగ్బీ బాలుర జట్టులో జి.ప్రవీణ్, బి.గణేష్, వి. రోమిత్, పి.వీరబ్రహ్మం, ఎం.శరణ్సాయి, ఎం. గోపీచంద్, డి.నోము, ఎ.రాకేష్, ఆర్. ఈశ్వర్, బి.రాజశేఖర్, యక్షిత్, బి.సంతోష్, టి.మనోహర్, కె.శ్రావణ్, పి.సాయితేజ, పి.విగ్నేష్, జి.నూతన్కుమార్, బాలికల జట్టులో ఎ.వేదశ్రీ, బి.సునీత, కె.సాత్విక, ఎస్.సోని, కె.మంజు, జి.మైసీ, జి.శైలజ, డి.హిమవర్షిని, జె.సాహితీ, పి.సల్మా, ఆర్.గీతయామిని, ఎస్.సాత్వి, బి.పావని, జె.ప్రవళ్లిక, ఐ.భవాని, ఎం.డి.ఆఫ్రీన్, జిచయవస్విని, కె.లాస్య ఉన్నారు.
- 
      
                   
                                 వరుస వర్షాలతో తెగుళ్లుచర్ల: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పైర్లు దెబ్బ తింటున్నాయి. అక్టోబర్ గడుస్తున్నా వానలు కురుస్తుండటంతో పంటలు వర్షార్పణమవుతున్నాయి. తొలితీత దశలో ఉన్న పత్తి, ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న దెబ్బతిన్నాయి. వరి పంట లో తెగుళ్ల ఉధృతి పెరుగుతోంది ఈ ఏడాది జిల్లాలో సగటు విస్తీర్ణం కంటే అదనంగా 21,988 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సుమారు 1.85 లక్షల ఎకరాల్లో వరి, 2,21,345 ఎకరాల్లో పత్తి, మొత్తం పంటలు 5.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. పంటలను ఆశిస్తున్న తెగుళ్లు జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో సాధారణం కంటే 23.8 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. చర్ల, గుండాల, మణుగూరు, టేకులపల్లి, చండ్రుగొండ, సుజాతనగర్ , పాల్వంచ తదితర మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అధిక వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశిస్తున్నాయి. తేమశాతం ఎక్కువగా ఉండటంతో వరి పంటకు సుడిదోమ (బీపీహెచ్), బ్యాక్టీరియా ఎండు ఆకు (బీఎల్బీ), కంకి నల్లి ( పానికల్మిట్) వంటి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ధాన్యం దిగుబడి తగ్గుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే కొంత మేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వరి పంటను సుడిదోమ, బ్యాక్టీరియా ఎండు తెగులు, కంకినల్లి వంటివి ఆశిస్తున్నాయి. సుడిదోమ కనిపిస్తే పొలంలో నీరు నిలువ లేకుండా చేయాలి. బ్యాక్టీరియా ఎండు ఆకు తెగలు ఆశిస్తే ఎకరాకు 60 గ్రాముల స్ట్రెప్టోమైసిన్సల్ఫేట్ పిచికారీ చేయాలి. ఈ సందర్భంలో యూరియా వేయడం ఆపి వేయాలి. కంకి నల్లి నియంత్రణకు స్పైరోమైసిన్ మందును ఎకరాకు 159 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. వర్షం ఆగిన వెంటనే పొలాల్లో నీటి నిల్వను తొలగించాలి. మడుల మధ్య గాలి ప్రసరణ అయ్యేలా దారులు తీయాలి. ఫంగస్ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా నాటివో ఫంగసైడ్ పిచికారీ చేయాలి. – బి.సుధాకర్రావు, ఏడీఏ, భద్రాచలం సబ్ డివిజన్
- 
      
                   
                                 ‘జీరో’ చేయాల్సిందే..ఇల్లెందు: గ్రామాల్లో పంటల కొనుగోళ్లు చేసే ప్రతీ వ్యాపారికి లైసెన్స్ ఉంటే జీరో దందా ఇక జీరో అయిపోతుందని, మార్కెట్ల నుంచి జిల్లా రాబడి రెట్టింపు అవుతుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్రమ పద్ధతుల్లో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వ్యాపారులను గుర్తించి వారికి మార్కెట్ శాఖ నుంచి లైసెన్సులు ఇప్పించే చర్యలు కూడా ముమ్మరం చేశారు. దీని కోసం విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. గత ఏడా ది కంటే రెట్టింపు స్థాయిలో లైసెన్సులు ఇచ్చినప్పటికీ జిల్లావ్యాప్తంగా అన్ని మార్కెట్ల పరిధిలో అక్రమ పద్ధతుల్లో అనుమతులు లేకుండా వ్యాపారం చేసే వారు చాలా మంది ఉన్నారు. మార్కెట్ ఫీజు ఎగనామం పెట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్లలో క్రయ విక్రయం నమోదు చేయడం లేదు. దీంతో మార్కెట్ ఆదాయం తరిగిపోతోంది. కొంతకాలంగా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పత్తి పంట విక్రయానికి కిసాన్ కపాస్ యాప్లో పంటల సాగు వివరాలు నమోదు చేసిన వారి నుంచే సీసీఐ కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెక్ పోస్టు ఉన్నా ఏమీ చేయలేక మార్కెట్ పరిధి దాటి సరుకు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. జీరో దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. 139 మందికి లైసెన్స్లు జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. కొత్తగూడెం మార్కెట్ పరిధిలో 37 మంది వ్యాపారులు ఉండగా దమ్మపేట మార్కెట్ పరిధిలో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక భద్రాచలం మార్కెట్ పరిధిలో 10 మంది, చర్ల మార్కెట్ పరిధిలో 5, బూర్గంపాడు పరిధిలో 11 మంది ఉన్నారు. ఒక్క ఇల్లెందు మార్కెట్ పరిధిలో 68 మంది వ్యాపారులు ఉన్నారు. జిల్లాలో 139 మంది వ్యపారులకు లైసెన్సులు ఉన్నాయి. ఇందులో సగం ఒక్క ఏడాదిలో పొందిన వారే ఉన్నారు. సీజన్ వస్తోంది.. ఏటా అక్టోబర్ నుంచి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. పత్తి, మొక్క జొన్న పంటలు ముందే చేతికి వస్తుంటాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం జిల్లాలో నాలుగు మిల్లులకు అనుమతి ఇచ్చారు. ఈ దఫా భద్రాద్రి జిల్లాలో 44 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. కారేపల్లి, సుజాతనగర్, లక్ష్మీపురం, బూర్గంపాడులోని మిల్లుల ద్వారా సీసీఐకి పత్తి విక్రయించేలా గురువారం జిల్లా మార్కెట్ శాఖ అధికారి నరేందర్ అనుమతి ఇచ్చారు. జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్యార్డులు ఉన్నాయి. 2025–26 ఏడాదికి జిల్లా లక్ష్యం రూ.22.65 కోట్లుగా నిర్ణయించారు. మార్క్ఫెడ్ కోసం ఎదురుచూపులు.. ఈ దఫా మొక్కజొన్న సాగు ఎక్కువైనప్పటికీ దిగుబడి మాత్రం తగ్గింది. విక్రయించుకునేందుకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉండగా గ్రామాల్లో వ్యాపారులు మాత్రం రూ.2 వేలకు మించి పెట్టడం లేదు. మార్క్ఫెడ్ ద్వారానైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన రైతులు కోరుతున్నారు. మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది లక్ష్యం లక్ష్యం బూర్గంపాడు 586.05 625.34 దమ్మపేట 325.35 367.66 ఇల్లెందు 464.69 516.60 భద్రాచలం 200.00 194.60 కొత్తగూడెం 330.88 347.89 చర్ల 262.66 212.90 జిల్లాలో మక్క సాగు అత్యధికంగా ఉన్నా దిగుబడి మాత్రం తగ్గింది. అయితే మార్కెట్లో వ్యాపారులు తక్కువ రేటుకు మక్కలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలంటే తక్షణమే మార్క్ఫెడ్ రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. –బానోతు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇల్లెందు అనుమతి లేని వ్యాపారం నేరం.. జిల్లాలోని అన్ని మార్కెట్ల పరిధిలో అనుమతి లేకుండా, లైసెన్స్ పొందకుండా వ్యాపారులు కొనుగోళ్లు చేపడితే చర్యలు తీసుకుంటాం. వారి పంటలను సీజ్ చేస్తాం. ఇప్పటికే నాలుగు మిల్లులకు సీసీఐ ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అనుమతి ఇచ్చాం. ఇక మార్కెట్లలో పంటల కొనుగోళ్లకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. అనుమతి కోరితే ఇచ్చేందుకు సిద్ధం. –జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి లైసెన్స్ లేకుండా వ్యాపారం.. మార్కెట్ ఆదాయానికి గండి
- 
      
                   
                                 రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లోని డీఆర్ఎస్ పబ్లిక్ స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీ ల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–11 బాలురలో జాయ్ ఇమ్మాన్యుయేల్ ద్వితీయస్థానం, అండర్–13 సింగిల్స్లో షేక్ సహాయల్ ఫజల్ ప్రథమ, అండర్–15 బాలురులో గౌరిశెట్టి చార్విక్ తృతీయస్థానం దక్కించుకున్నారు. అండర్–17 బాలురలో పరిటాల జలిత్ సింగిల్స్లో టైటిల్ను దక్కించుకోగా, పిట్టల మోహిత్ కృష్ణ తృతీయస్థానంలో.. అదే డబుల్స్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాడు. బాలికల అండర్–17లో గద్దల సిరి ద్వితీయస్థానం, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచింది. అండర్–13లో బొంతు సాయిశివాని ద్వితీయ, వి.సౌమ్య సింగిల్స్లో ప్రథమస్థానం, అండర్–13లో ఈలప్రోలు హరి, ఈలప్రోలు తరుణ్ సింగిల్స్లో ద్వితీయ, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచారు. అండర్–15 బాలుర డబుల్స్లో రణధీర్రెడ్డి ప్రథమ, డబుల్స్లో ప్రథమ, సీతా ప్రజ్ఞాన్ ప్రథమ, జి.చంద్రికరాణి, జి.షర్మిలరాణి డబుల్స్ లో ప్రథమస్థానాల్లో నిలిచారు. వారిని డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్, కార్యదర్శి వి.సాంబమూర్తి, ఉపాధ్యక్షులు పరిటాల చలపతిరావు, గద్దల రామారావు, షేక్ జవహర్పాషా అభినందించారు.
- 
      
                   
                                 ఉత్సాహంగా సాగిన ఈత ర్యాలీఖమ్మంస్పోర్ట్స్: పోలేపల్లి మున్నేరుఒడ్డున ఈత ర్యాలీ ప్రారంభమై ఆరు కిలోమీటర్లపాటు ఉత్సాహంగా కొనసాగింది. ఆదివారం మున్నేరులో ఈతమిత్రుల సంఘం ఆధ్వర్యంలో కొన సాగిన ర్యాలీలో దాదాపు 150 మందికి పైగా యువకులు, పెద్దలు పాల్గొన్నారు. పోలేపల్లి నుంచి కరుణగిరి ప్రాంతంలోని గురుదక్షిణ ఫౌండేషన్ మున్నేరు ఒడ్డు వరకు సాగింది. సీనియర్ స్విమ్మర్స్ కోదాటి గిరి, బోజెడ్ల ప్రభాకర్, ఆర్గానిక్ రాంరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ దర్గయ్య, ఎకై ్సజ్ బుజ్జి, కోటేశ్వరరావు, గోపాల్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ.. నీటి ప్రమాదాల నుంచి ప్రజలకు అవగాహన, రక్షణ కల్పించేందుకై మున్నేరులో లాంగ్ ఈత ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. వయస్సు కూడా లెక్కచేయకుండా ఎనభై ఏళ్లు దాటిన స్విమ్మర్లు, పిల్లలు పాల్గొన్నారని, ఏటా ర్యాలీ జరుపుతున్నామని వివరించారు.
- 
      
                   
                                 పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: కార్తీకమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణ కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు కొత్తగూడెం, భద్రాచలంలలో ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌలభ్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్వార్డ్లో తమ దరఖాస్తులను అందజేసి రశీదులు పొందాలని, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. పర్యాటకుల జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. పొరుగు జిల్లాలో నుంచీ సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 356 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,980 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,700 ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. రైతు నేస్తం అవార్డు ప్రదానందమ్మపేట: మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రైతు నేస్తం అవార్డు అందజేశారు. హైదరాబాద్లోని స్వర్ణభారతి మండపంలో ఉమ్మడి ఏపీకి చెందిన రైతు నేస్తం ఫౌండేషన్, స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డును ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కోటగిరి సత్యంబాబు, ఎల్లిన రాఘవరావు, నాగప్రసాద్, కేవీ, కొయ్యల అచ్యుతరావు, మురళి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రేక్ పాయింట్కు చేరిన యూరియాచింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,512.80 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్కుమార్ ఈ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,052.80 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 710 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 550 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీ కి 200 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు.
- 
      
                   
                                 వారధికి మరమ్మతులేవి..?భద్రగిరి వారధి గుంతలమయంగా మారింది. ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తున్నా మరమ్మతులు చేపట్టడంలేదు. గోదావరి పాత బ్రిడ్జి నిండా గుంతలు ఏర్పడటంతో వాహనాదారులు అవస్థ పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు కొత్త బ్రిడ్జి తుది పనులు పూర్తికాలేదు. పంచాయతీ, ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. – భధ్రాచలంప్రమాదకరంగా పాత బ్రిడ్జి 1965లో ప్రారంభమైన పాత బ్రిడ్జి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తోంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. సుమారు తొమ్మిదేళ్లపాటు నిర్మాణం సాగగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని పనులు పూర్తి చేయించారు. రద్దీ దృష్ట్యా గతేడాది శ్రీరామనవమి నుంచి రెండో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అప్పటినుంచి పాత బ్రిడ్జి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో బ్రిడ్జి పొడవునా ప్రమాదకరంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సారపాక వైపు అప్రోచ్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. రెండు వైపులా పిచ్చి మొక్కలు మొలిశాయి. పరిశుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతోపాటు మట్టి పేరుకుపోయింది. భద్రగిరి దర్శనానికి వచ్చే భక్తులు ‘ఇదేం దక్షిణ అయోధ్య’ అనుకుంటూ పెదవి విరుస్తున్నారు.చీకట్లోనే రాకపోకలు గత శ్రీరామనవమికి కొత్త బ్రిడ్జిపై అనధికారికంగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తుది పనులను మాత్రం అలాగే వదిలేశారు. బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. ఇప్పటివరకు విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. చిమ్మ చీకట్లోనే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ద్విచక్రవాహన ప్రమాదంలో యువకులు మృత్యువాత పడ్డారు. నిర్మాణలో లోపం వల్ల వర్షం నీళ్లు బ్రిడ్జిపైనే నిలుస్తున్నాయి. వరదల మాదిరిగా ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఇలా రెండో బ్రిడ్జిపై సమస్యలు తిష్టవేశాయి. గతేడాది నుంచి రాకపోకలు సాగిస్తున్నా రెండో బ్రిడ్జిని ఇంతవరకు అధికారికంగా ప్రారంభించలేదు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టగా, పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. శిలాఫలకం పైలాన్ నిర్మాణం కూడా మధ్యలోనే ఆపేశారు. తుది పనులు సైతం నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మొదటి బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, కొత్త బ్రిడ్జి తుది పనులను పూర్తి చేయాలని సీతారామ చంద్రస్వామివారి భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
- 
      
                   
                                 పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలుకూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదాడిలో ఉదయం గ్రామానికి చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికుడు గోపె నాగయ్యపై దాడిచేయగా నుదుటిన తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పశువులు, మేకలను కరిచి గాయపర్చటంతో గ్రామస్తులు కుక్కను వెంబడించి హతమార్చారు. రెండు బైక్లు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు టేకులపల్లి: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలై ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రాంపురం గ్రామానికి చెందిన కేళోతు లచ్చిరాం, కేళోతు నరసింహారావు, మాళోతు సక్రు ముగ్గురూ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం అద్దెకు తీసుకున్న ఎద్దులను ఎర్రాయిగూడెంలోని యజమానికి అప్పగించేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. అక్కడి నుంచి బైక్పై ముగ్గురూ స్వగ్రామానికి బయలుదేరారు. దాసుతండా వద్దకు రాగానే బర్లగూడెంనకు చెందిన యువకుడు వేగంగా బైక్పై వచ్చి ముగ్గురు ఉన్న బైక్ని ఢీకొట్టాడు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇల్లెందు, టేకులపల్లికి చెందిన రెండు 108 అంబులెన్సులలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- 
      
                   
                                 టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిటీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ ఖమ్మం సహకారనగర్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి, గత 20 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్నవారు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, భాషా పండితుల, పీఈటీల అప్గ్రేడేషన్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు ఆళ్ల రామారావు, ముత్తయ్య, రమాదేవి, కె.వి, వీరబాబు, మల్ల య్య, నాగిరెడ్డి సంధ్యరాణి, ఉమాదేవి, ఆకుల నాగేశ్వరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ప్రజలతో మమేకం● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ది విభిన్న శైలి ● నేలపై కూర్చుని గ్రామస్తులతో మాటామంతిపాల్వంచరూరల్: కలెక్టర్ నిత్యం విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. జిల్లా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తుంటారు. కానీ ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇవన్నీ చేస్తూనే ప్రజలతో మమేకం అవుతున్నారు. భిన్నమైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీలోని మారుమూల ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును సందర్శించారు. గ్రామంలో స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడే రెండు గంటలపాటు గడిపారు. నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్తో (కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్న్) బ్లాక్ ఇటుకలను తానే మట్టి కలిపి తయారుచేసి చూపించారు. స్కూల్ నిర్మాణ పనుల్లో ఐరన్ పైపులను అందించారు. నేలపైన రాయిపై కూర్చుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇటీవల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలోనూ పక్కన సీసీ ఉన్నప్పటికీ పిల్లలు, అధ్యాపకులు చెప్పిన సమస్యలను తానే నోటు చేసుకున్నారు. ఇలా నిత్యం ప్రజలతో మేమకం అవుతూ, ఓపికగా సమస్యలు ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులుచదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులు వస్తాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామపంచాయతీ ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును ఆదివారం ఆయన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి సందర్శించారు. పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన మట్టి ఇటుకల తయారీపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ పాఠశాల భవనం నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాల భవనానికి ఫారెస్ట్ రక్షణ భవనంగా పేరు పెడతామని అన్నారు. విధి నిర్వహణకు అటవీ ఉద్యోగులు కూడా ఒక గది వినియోగించుకోవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు నిర్మించుకోవాలని, చేపలు, కౌజు పిట్టలు, వెదురు పెంపకం చేపట్టి ఆదాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్ఎం.బిక్షం, ఆర్ఐ నళినీకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 ముంపు నుంచి రక్షణకు రూ.100 కోట్లుఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని గతేడాది తీవ్రంగా ప్రభావితం చేసిన మున్నేరు వరద ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వరద నియంత్రణ, నివారణ చర్యల కోసం రూ.6,190 కోట్ల విడుదలకు జలశక్తి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జిల్లాకు నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది వరదలతో ములుగు, కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ నష్టాలు సంభవించాయి. వరద నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికల ఆధారంగా కేంద్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక కింద నిధులు కేటాయించింది. ఖమ్మంలో మున్నేరు వరద ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఇటీవల జలవనరుల శాఖ అధికారులు ప్రకాశ్నగర్ వంతెన నుంచి నేషనల్ హైవే వంతెన వరకు సర్వే నిర్వహించి రిటైనింగ్ వాల్ పొడిగింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర జలశక్తి మంజూరుచేసిన రూ.100 కోట్లను ఈ ప్రతిపాదిత పనుల కోసం వినియోగించనున్నారు. మొదట ధంసలాపురం కాలనీ వైపు శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నిధులతో మున్నేరు పరిధిలో రిటైనింగ్ వాల్ పొడిగింపు, డ్రెయినేజీ మార్గాల అభివృద్ధి, వరద నీరు తక్షణం నదిలోకి చేరేలా పనులు చేపట్టనున్నారు.నిధులు మంజూరు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
- 
      
                   
                                 కిన్నెరసాని జలాశయానికి వరదపాల్వంచరూరల్: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,600 క్యూ సెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో శనివారం నీటిమట్టం 406.60 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టుకు చెందిన ఒక గేటు ఎత్తి ఉంచి 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు తెలిపారు. రేక్ పాయింట్కు 2,518 టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్చార్జ్ పవన్కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు సంఘం కృషితోనే బదిలీలుకొత్తగూడెంఅర్బన్: గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) కృషితో బదిలీలకు మోక్షం కలిగిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ఫర్ పాలసీ మార్చాలని పలుమార్లు కోరగా యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. వ్యక్తిగత, మ్యూచ్వల్, స్పౌస్, హెల్త్ గ్రౌండ్ ప్రాతిపదికన శనివారం 114 మందికి బదిలీ ఉత్తర్వులు ఇప్పించినట్లు తెలిపారు. పోలీసుల విస్తృత తనిఖీలుభద్రాచలంఅర్బన్: పట్టణంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంటీన్, కార్గో, ఆర్టీసీ బస్సుల్లో తరలించే పార్సిళ్లను, ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐలు సతీష్, శ్యామ్ ప్రసాద్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక వాహనాల అడ్డగింత ట్రాక్టర్ డ్రైవర్లు, గ్రామస్తుల పరస్పర దాడి టేకులపల్లి: మండలంలోని గంగారం పంచాయతీ సంపత్నగర్ వద్ద ఉన్న పాలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధిక లోడ్తో ట్రాక్టర్లు తిరుగుతుండగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో స్థాని కులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఈ క్రమంలో గ్రామస్తులు శనివారం పాలవాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు , ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణ అనంతరం ఇసుకను వాగులో డంప్ చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు బోడు పోలీసుస్టేషన్కు వెళ్లాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇసుక సొసైటీల ఘర్షణమణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని అనంతారం, చినరాయిగూడెం, కోడిముత్తయ్యగుంపు ఇసుక సొసైటీ సభ్యుల మధ్య శనివారం ఘర్షణ నెలకొంది. మూడు ర్యాంపుల సొసైటీ సభ్యులు ఘర్షణ పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సీఐ నాగబాబు, ఎస్ఐ నగేష్లు వచ్చి సభ్యులకు నచ్చజెప్పి పంపించివేశారు. కాగా ఒక సొసైటీకి సంబంధించిన శివారు దారిలో మరో సొసైటీ వారు ఇసుకను తరలించేందుకు లారీలకు అనువుగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అనంతారం సొసైటీ సభ్యులు రోడ్డు వేయొద్దంటూ అడ్డుకోవడంతో వివాదం తలెత్తినట్లు తెలిసింది.
- 
      
                   
                                 అటవీశాఖకు ప్రభుత్వ భూమి అప్పగింతజూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని అటవీశాఖ అధికారులకు శనివారం అప్పగించారు. పాపకొల్లు నుంచి వయా రాజారావుపేట మీదుగా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామాన్ని కలుపుతూ పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు. రాజారావుపేట, కేసుపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉంది. బీటీ రోడ్డు నిర్మాణంతో అటవీశాఖ భూమి ఐదెకరాల భూమి కోల్పోయింది. దీంతో అటవీ భూమికి బదులుగా జూలూరుపాడు రెవెన్యూ పరిధిలోని 250 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్డీఓ యు కోటేశ్వరరావు, ఇతర అధికారులు జి ప్రసాద్రావు, సీహెచ్ ఆదినారాయణ, ప్రవీణ్, శ్రీనివాసరావు, హనుమంతు, నరసింహారావు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆధ్యాత్మికశోభఅన్నపురెడ్డిపల్లిలో చారిత్రక నేపథ్యం.. కాకతీయ సేనానిగా పనిచేసిన అన్నపురెడ్డి దట్టమైన అడవుల్లో శ్రీ వేంకటేశుడి ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆలయం చుట్టూ జనావాసాలు ఏర్పడగా, అన్నపురెడ్డిపల్లి పేరుతో గ్రామం ఆవిర్భవించింది. 1970వ దశకంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రత్యేక చొరవతో నాలుగు ప్రాకారాలు, మండపం నిర్మించి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసుడు కొలువైన గ్రామంలో శివాలయం కూడా నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులు భావించారు. శ్రీ వేంకటేశ్వర దేవస్థాన భూముల్లో పనులు మొదలుపెట్టారు. గర్భాలయం వరకు నిర్మించాక పనులు నిలిచిపోయాయి. ముప్పై ఏళ్లపాటు కేవలం గర్భాలయం మాత్రమే ఉండగా, చలువ పందిర్లు వేసి, శివకల్యాణం చేసే వారు. అటుపిమ్మట గ్రామానికి చెందిన విద్యావేత్త మారగాని శ్రీనివాసరావు ఆలయ నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఆరేళ్లపాటు శ్రమించి శివలింగాకారంలో, 108 శివలింగాలతో కోవెలను పూర్తి చేశారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శివపార్వతులు, నంది, భక్తకన్నప్ప, మార్కండేయులు, దక్షిణామూర్తి, భారీ వాయలింగం విగ్రహాలతో పాటు, కోనేరు నిర్మించారు. భక్తులకు వసతిగదులను కూడా ఏర్పాటు చేశారు. కనుల పండువగా కార్తీక మాసోత్సవాలు ఆలయంలో ప్రతీయేటా కార్తీక మాసోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలతో విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 22న విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆకాశ దీపారాధనతో మాసోత్సవాలు ప్రారంభమాయ్య యి. శనివారం నాగులచవితి సందర్భంగా ఆలయ పరిసరాల్లో పుట్టల వద్ద మహిళలు పూజలు చేశారు. నవంబరు 30 వరకు విశేష పూజాధికాలు జరుపనున్నారు. నవంబర్ 1న ఏకాదశి అన్నాభిషేకం, 5న కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని కృత్తికా దీపోత్సవం, జ్వాల తోరణం, కోనేటి హారతి, గంగాహారతిని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 8న లక్ష బిల్వార్చన, 14న సామూహిక కుంకుమార్చనలు, 17న సందీశ్వరుని అభిషేకం, 18న శివపార్వతుల కల్యాణ మహోత్సవ వేడుక, 20న మాసోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీగా భక్తులు హాజరుకానుండగా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ మేనేజర్ పీవీ రమణ తెలిపారు.ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నపురెడ్డిపల్లి భ్రమరాంబ సమేత మల్లికార్జున (మృత్యుంజయ) స్వామివారి ఆలయం ఆధ్యాత్మికశోభ సంతరించుకుంటోంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో నెలరోజులపాటు ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసంలో వేకువ జామునే మహిళలు కార్తీక దీపాలు వెలిగించనుండగా, సోమ, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణం రద్దీగా మారనుంది. – ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి)కార్తీకమాసం కావడంతో నిత్యం పూజాధికాలు, అభిషేకాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. వేడుకలపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేశాం. – మల్లెల నర్సింహారావు, ఆలయ చైర్మన్
- 
      
                   
                                 ఏజెన్సీలో క్రీడా సంబరాలుపినపాక: క్రీడా సంబరాలకు ఏడూళ్ల బయ్యారం జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ వేదిక కానుంది. నవంబర్ 8, 9, 10 మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బాలబాలికల విభాగాల్లో పది ఉమ్మడి జిల్లాల వారీగా జట్లు పోటీలకు హాజరుకానున్నాయి. ప్రతిభ చూపి న బాలబాలికలను జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతల సహకారం తీసుకుంటుంటున్నారు. కంది చారిటబుల్ ట్రస్ట్ పోటీలకు తోడ్పాటునందించనుంది. దాతలు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. బాలురు జెడ్పీహెచ్ఎస్, బాలికలు బయ్యారం గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్లో బస చేయనున్నారు. పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ను శుభ్రం చేస్తున్నారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సహాయ సహకారాలు అందించా లని కోరారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీ నివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీ హరి, సీతక్క హాజరుకానున్నట్లు అధికారులు తెలి పారు. పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 8నుంచి నిర్వహణ చదువుకున్న స్కూల్కు, సొంతూరికి మంచి చేయాలనే సంకల్పంతో నా వంతు సహకారం అందిస్తున్నాను. రాష్ట్రస్థాయి పోటీలు నేను చదువుకున్న బయ్యారం పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. – కంది విశ్వభారత్రెడ్డి, ఎన్నారై, కంది చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్
- 
      
                   
                                 వైభవోపేతంగా గంగాహారతికాశీ తరహాలో ఇక్కడ ఏటా గంగాహారతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీకపౌర్ణమి రోజు జరిపే వేడుకలో శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ వేంకటేశ్వరుడు శేషవాహనంపై శివాలయానికి చేరుకుంటారు. దారి పొడవునా భక్తజనం దర్శించుకుంటుండగా, శివాలయ ప్రతినిధులు శ్రీనివాసునికి స్వాగతం పలుకుతారు. శివపార్వతులు ఎదురేగుతారు. ఇక్కడ దేవలతకు జ్వాలాతోరణంతో సాదర స్వాగతం పలుకుతారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ శివపార్వతులు, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ వేదికపైకి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయా దేవతల సాక్షిగా వేదమంత్రోచ్ఛరణ నడుమ గంగమ్మకు హారతి సమర్పిస్తారు. ఈ విశిష్ట ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనం పోటెత్తుతారు.
- 
      
                   
                                 పకడ్బందీగా ఎస్ఐఆర్ జాబితాసూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలంటౌన్: ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో నుంచి కలెక్టర్తోపాటు ఐటీడీఏ పీఓ, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరీ ’ఏ’ ని బీఎల్ఓ యాప్ ద్వారా ఽధ్రువీకరిస్తామని, కేటగిరీ సీ, డీ లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈఆర్ఓ కార్యాలయంలో ఇద్దరు బూత్స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి వచ్చే శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్
- 
      
                   
                                 పశువులు పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు అక్రమంగా తరలిస్తున్న పశువులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని గుండాల కాల నీ నుంచి తిరువూరుకు రెండు ట్రాలీ ఆటోల్లో 12 పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోని చెక్పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. 70 బైక్లు స్వాధీనంఅశ్వారావుపేట: గంజాయి నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన ‘చైతన్యం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పట్టణంలోని వడ్డెర బజారు వద్ద నాకాబందీ, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 టూవీలర్లు, 4 ఆటోలు, 4 కారులు, 6 ట్రాక్టర్లు, 2 లారీలు, బెల్టు షాపులలో నిల్వ ఉంచిన 16 లీటర్ల మద్యం స్వాధీన పరచుకున్నారు. గంజాయి వాడుక, విక్రయం, రవాణా చేయొద్దని అవగాహన కలిగించారు. సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్ఐలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, అఖిల, సిబ్బంది ఉన్నారు.
- 
      
                   
                                 రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిమణుగూరు టౌన్: కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బీటీపీఎస్ విశ్రాంత ఉద్యోగి సందుపట్ల కృష్ణారెడ్డి(60) సమితిసింగారంలో నివసిస్తున్నాడు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసి పాల్వంచ నుంచి మణుగూరు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో తోగ్గూడెం ఆలయ సమీపంలో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొంది. దీంతో కృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 100 పడకల ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సబిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంతాపం తెలిపారు. సూపరింటెండెంట్ సునీల్ తదితరులు ఉన్నారు.
- 
      
                   
                                 రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలిగుండాల: రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్కు పట్టం కట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆళ్లపల్లి మండలంలో శనివారం ఆయన పర్యటించారు. రామాంజిగూడెం, పాతూరు రాయిలంక గ్రామాల నుంచి 80 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జెడ్పీటీసీ కొమరం హనుమంతు, పాయం నర్సింహరావు, ఎస్కె, బాబా, కిషోర్ బాబు, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారిదేవస్థానంలోని మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, సువర్ణపుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరంనిత్యకల్యా ణానికి బేడామండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఉపాధ్యాయులపై పీఓ ఆగ్రహందుమ్ముగూడెం: ఉద్దీపకం టు వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగాలేకపోవడంతో ఉపాధ్యాయులపై భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలు పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం మండలంలోని పెద్దనల్లబల్లి, గడ్డోరు గట్ట గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలో తనిఖీచేశారు. పిల్లల సామర్థ్యాలను పరీక్షించి, రా యడం, చదవడంలో వెనుకబడిఉన్నారని గ్రహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులు కనీసం తెలుగు, ఇంగ్లిష్లో తమపేర్లు రాసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఎస్సీఆర్పీల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని అన్నారు. టీచర్లు ఇకనైనా దృష్టిపెట్టాలని హెచ్చరించారు.
- 
      
                   
                                 ‘రామయ్య’కు ఇంటిపోరు!● రామాలయంలో సిబ్బంది మధ్య వర్గవిభేదాలు ● నూతన ఈఓకు తలనొప్పిగా మారిన వ్యవహారం ● భద్రాచలం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి!భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. అధికారులు, సిబ్బంది నడుమ పొసగకపోవడంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆలయ అభివృద్ధిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. వెరసి ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈఓ దామోదర్రావుకు తలనొప్పిగా మారింది. కొత్త ఈఓ వచ్చాక రెండుసార్లు అంతర్గత బదిలీలు గతంలో పనిచేసిన ఈఓ ఎల్.రమాదేవి ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్గత బదిలీలను చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టారు. రామయ్య సొమ్మును మింగిన అవినీతి పరుల వద్ద నుంచి రికవరీ చేశారు. ఈ సమయంలో పలువురిని ఇతర విభాగాలకు, పర్ణశాలకు బదిలీ చేశారు. రమాదేవి బదిలీ కాగానే బాధ్యతలు చేపట్టిన దామోదర్రావు కూడా రెండుసార్లు అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇందులో రెండోసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ఈఓ పలు కారణాలతో దూరంగా ఉంచిన వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ బదిలీ చేశారు. దీంతో వర్గపోరు ఉత్పన్నమైంది. విధుల్లో చేరేందుకు విముఖత? అంతర్గత బదిలీలు చేశాక చాలా మంది వెంటనే విధుల్లో చేరలేదు. దీంతో విధుల్లో చేరాలని ఈఓ దామోదర్రావు మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా విభాగాల బాధ్యతలను అప్పగించకుండా కొందరు జాప్యం చేశారు. తమను కక్షపూరితంగా, క్లిష్టమైన విభాగాలకు బదిలీ చేశారని మరికొందరు తాత్సారం చేశారు. గతంలో ఈఓకు అటెండర్గా పని చేసిన ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఎంపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా పైరవీ చేయించుకోగా, ఈఓ తప్పనిసరి పరిస్థితుల్లో లడ్డూ విభాగం నుంచి విధులను మరో చోటికి మార్చటం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగినికి ప్రొటోకాల్తో పాటు మరో కొన్ని పనులను అప్పగించారు. కానీ ఆమె విముఖత చూపుతూ అనారోగ్యమంటూ సెలవు పెట్టారు. ఇలా కొందరు విధుల్లో చేరకపోవడంతో వీరి స్థానాల్లో వెళ్లాల్సిన వారు అలాగే ఆగిపోయారు. గతంలో చక్రం తిప్పినవారే మళ్లీ.. రమాదేవి ఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు దేవస్థానంలో చక్రం తిప్పినవారు తిరిగి యథా స్థానాలకు రావడంతో వర్గ పోరుకు బీజం పడింది. ఆలయంలో సస్పెన్షన్కు గురై మళ్లీ విధుల్లో చేరిన ఓ కీలక అధికారి, పలు కాంట్రాక్ట్లు చేపట్టిన ఓ వ్యక్తి, కన్సాలిటెడ్గా పని చేస్తున్న మరో ఉద్యోగి తిరిగి ఆలయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వర్గం వాదిస్తోంది. అందుకు తగినట్లుగానే అంతర్గత బదిలీలను చేపట్టారని, అవి అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా బదిలీలు కేవలం కక్షపూరితంగా చేపట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అంతర్గత బదిలీలు సాధారణమేనని, ఇందులో ఎటువంటి వ్యక్తిగత కక్షలు ఉండవని మరోవర్గం పేర్కొంటోంది. రచ్చకెక్కుతున్న వర్గపోరు డిసెంబర్ చివరిలో ముక్కోటి మహోత్సవం జరగనుంది. ఆలయ మాస్టర్ప్లాన్పై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇటువంటి కీలక తరుణంలో వర్గపోరు భక్తులను కలవరపెడుతోంది. రెవెన్యూ శాఖ నుంచి దేవస్థానం ఈఓగా వచ్చిన దామోదర్రావుకు ఉద్యోగులు, సిబ్బందిని గాడిన పెట్టడం సవాల్గా మారింది. దీనికితోడు గత గురువారం ఆలయంలో ఓ కాంట్రాక్టర్ ఎస్టీఎఫ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం మరోవర్గం వాదనకు ఊతమిచ్చేలా ఉండటం ఆయనను మరింత కలవరపెట్టింది. ఈఓ ఉద్యోగుల మధ్య సమన్వయం సాధిస్తేనే భక్తుల వసతుల కల్పన, ఉత్సవాల విజయవంతం, ఆలయ ప్రతిష్టకు భంగం రానివ్వకుండా ఉండటం, ఆలయ మాస్టర్ ప్లాన్ వంటివి సాఫీగా ముందుకు సాగుతాయి.
- 
      
                   
                                 వెండితెరపై గుమ్మడిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్హీరో శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు. మూడేళ్ల పాటు రీసెర్చ్ మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది. రెండేళ్లపాటు గుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కేవలం 20 రోజుల్లో.. ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్హీరో డాక్టర్ శివరాజ్కుమార్కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు. రియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్కుమార్లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది.
- 
      
                   
                                 తడిసి మొలకెత్తిన మక్కలుఇల్లెందురూరల్: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్నలు తడిసి మొలకెత్తాయి. దీంతో రైతులు ఆవేదన చెందారు. మండలంలో సుమారు 25వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, 70 శాతం మేర విస్తీర్ణంలో కంకులను విరిచారు. యంత్రాల సహాయంతో కంకుల నుంచి గింజలను వేరుచేసి తేమశాతం కోసం కల్లాల్లో ఆరబెట్టారు. కొమరారం, మస్సివాగు, మాణిక్యారం, పోలారం గ్రామాల్లో ఆరబెట్టిన మక్కలు వానకు తడిసిపోయాయి. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ పట్టాలను కప్పినా కాపాడుకోలేకపోయారు. వర్షం అధికంగా కురవడంతో గింజలు తడిసి మొలకెత్తాయి. రైతులు శనివారం మొలకెత్తిన గింజలను చూసి ఆవేదనకు గురయ్యారు. తడిసిన మొక్కజొన్న లను మళ్లీ ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే శాపంగా మారింది. మార్క్ఫెడ్ నిర్ణయించినట్లు చల్లసముద్రం, కొమరారం, వ్యవసాయ మార్కెట్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. తీరని నష్టంతో రైతు కంట కన్నీరు
- 
      
                   
                                 ముంచిన ‘ఆయిల్పామ్’అశ్వారావుపేట: కాతలేని ఆయిల్పామ్ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని చింతల చెరువు సమీపంలో నలుగురు రైతులకు చెందిన 20 ఎకరాల తోటలను ఆయిల్ఫెడ్ అధికారులు తవ్వేస్తున్నారు. ఐదేళ్లపాటు పెంచినా చెట్లు కాతకురాలేదు. ఎకరానికి సుమారు రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు నిరాశ చెందుతున్నారు. ఆయిల్ఫెడ్ యాజమాన్యం మొక్కలను తొలగించేందుకు జేసీబీలను మాత్రమే పంపింది. ఆ తర్వాత కొమ్మలు, బోదెలను రైతులే తొలగించుకోవాలని సూచించడంతో ఎకరాకు కనీసం రూ.20వేలకు పైగా అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆదాయం వస్తుందని ఆయిల్పామ్ సాగు చేపట్టిన గిరిజన కుటుంబాలు సంశయంలో పడ్డాయి. రానున్న రోజుల్లోనైనా నాణ్యమైన మొక్కలు ఇవ్వాలని కోరుతున్నాయి. రైతులు నష్టపోయినా.. పరిహారం ఊసేలేదు 2015 నుంచి మొదలైన ఈ వ్యవహారం బయటపడేందుకు దశాబ్దం పట్టింది. ఈ సమస్యపై ఓ రైతు సంఘం ఢిల్లీ దాకా పోరు సల్పడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం చెల్లించాలని నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తున్నా ఆయిల్ఫెడ్ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు స్పందించడంలేదు. ఈ విషయమై ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట డివిజన్ అధికారి నాయుడు రామకృష్ణను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశాలతో 55 మంది రైతులకు 7,574 మొక్కలను తిరిగి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని తెలిపారు. ఆయిల్ఫెడ్ మొక్కలపై నమ్మకం లేదు ములకలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన తాండ్ర దిలీప్కుమార్, సుభద్ర దంపతులు ఆరేళ్ల క్రితం 19 ఎకరాల్లో టీఎస్ ఆయిల్ఫెడ్ ఇచ్చిన మొక్కలతో సాగు మొదలుపెట్టారు. ఎకరానికి 54 మొక్కలను నాటారు. ఐదేళ్లు దాటినా కాపు రాకపోవడంతో గత జూన్లో 300 మొక్కలను తొలగించారు. ఇంకా మిగిలిన మొక్కల పరిస్థితీ అలాగే ఉంది. దీంతో భారీగా నష్టపోయారు. ఆయిల్ఫెడ్ అధికారులు కొత్తగా మొక్కలను ఇస్తామని చెబుతున్నా మళ్లీ సాగు చేసేందుకు సాహసించడంలేదు. ఐదేళ్లు పెంచినా కాతరాని పామాయిల్ చెట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పామ్ విస్తరణను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పదేళ్లుగా ఆయిల్పామ్ విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుత వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మొదటి నుంచీ పామాయిల్ తోటల సాగుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తోటల పెంపకానికి ఆసక్తి చూపారు. ఆయిల్పామ్ సాగు చేసే ఆదాయం పెరిగి కష్టాలు పోతాయని భావించారు. అయితే సాగునీటి లభ్యత లేకున్నా రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతాల రైతులకు అశ్వారావుపేట(నారంవారిగూడెం) నర్సరీ నుంచి భారీగా మొక్కలు తరలి వెళ్లేవి. స్థానిక సన్న, చిన్నకారు రైతులకు మొక్కలు అందేవి కావు. అధికారులు ఇదే అదనుగా పనికిరాని మొక్కలను సైతం రైతులకు అంటగట్టారు. తోటల్లో రాలిన గింజల నుంచి వచ్చే మొక్కలను సైతం రైతులకు పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి.
- 
      
                   
                                 గంజాయి కేసులో పీడీ యాక్ట్ నమోదుజూలూరుపాడు: గంజాయి అక్రమ రవాణా కేసులోని నిందితుడిపై జూలూరుపాడు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక తాళ్లగొమ్మూరుకు చెందిన దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లొచ్చాక కూడా తీరు మార్చుకోకుండా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. దీంతో నిందితుడిపై పీడీ యాక్ట్ను అమలు చేస్తూ ఈనెల 23వ తేదీన పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ రవి పీడీ యాక్ట్ నమోదు చేసి, సంబంధిత పత్రాలను చర్లపల్లి జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో శివశంకర్ రెడ్డి ఆస్తులను జూలూరుపాడు పోలీసులు జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డకట్ట గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పోలీస్శాఖ ఆధ్వర్యంలో చైతన్యం–డ్రగ్స్పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ అబుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
- 
      
                   
                                 వర్కర్కు వేతనం చెల్లింపుఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల ప్రాథమిక పాఠశాల స్కావెంజర్ ప్రమీలకు ఆరు నెలల వేతనం రూ.36 వేలు గురువారం అందింది. ‘వర్కర్ నిధులు పక్కదారి’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంఈఓ ఉమాశంకర్, క్లస్టర్ హెచ్ఎం లాలు పాఠశాలను సందర్శించారు. వేతనం చెల్లించకపోవడంపై ప్రధానోపాధ్యాయుడు సురేందర్ నుంచి వివరణ తీసుకుని బకాయి వేతనం ఇప్పించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఎంఈఓ తెలిపారు. 15 ఎకరాల్లో ‘ఆయిల్పామ్’ తొలగింపుఅశ్వారావుపేట: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆర్ల కృష్ణ, తోట పిచ్చయ్యలకు చెందిన 15 ఎకరాల ఆయిల్పామ్ తోటలను గురువారం తొలగించారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కల్లో కల్తీ మొక్కలు ఎక్కువగా ఉండి దిగుబడి రాకపోవడంతో మొక్కలను రైతులు తొలగించారు. ఎకరాకు ఏటా రూ.లక్ష మేర పెట్టుబడి పెట్టిన రైతులు నిండా మునిగిపోయారు. తిరిగి ఆయిల్పామ్ మొక్కలు పెడితే కాస్తాయనే నమ్మకం అధికారులు కలిగించాలని రైతులుకోరుతున్నారు. పటిష్ట ఏర్పాట్లు చేయాలిపినపాక: మండలంలోని ఈ బయ్యారం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించే అండర్–17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు సుధీర్ కుమార్, సునీల్ కుమార్, వెంకటేశ్వరరావు, నాగయ్య పాల్గొన్నారు. ఏజెన్సీలో పోలీసుల అప్రమత్తందుమ్ముగూడెం : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ మావోయిస్టులు శుక్రవారం భారత్బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం పెద్దబండిరేవు క్రాస్ రోడ్డు, పెద్దనల్లబల్లి ప్రధాన రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీల చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చే వాహనాలను, ప్రజలను క్షుణంగా తనిఖీ చేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చేపట్టారు. సీఐ వెంకటప్పయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల నిలిపివేత భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే బస్సులు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో చర్ల, కుంట, చింతూరు ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామాలయంలో హల్చల్ఈఓకు ఫిర్యాదు.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి – ఓ వ్యక్తికి నడుమ గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో దేవస్థానంలో కాంట్రాక్టర్గా పని చేసిన ఓ వ్యక్తి మధ్యాహ్నం దర్శనాలు నిలిపివేసే సమయంలో కొందరిని దర్శనానికి తీసుకురాగా, అక్కడ విధులు నిర్వర్తించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి ‘నేనెవరో తెలియదా’ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. మాటామాట పెరగడంతో హెడ్ కానిస్టేబుల్ వచ్చి నివారించే ప్రయత్నం చేయగా, ఆయనతోనూ ఇలాగే వ్యవహరించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఈ ఉదంతంపై ఆలయ ఈఓ దామోదర్రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఈఓను వివరణ కోరగా.. విచారణ చేపడతామని తెలిపారు.
- 
      
                   
                                 పెద్దమ్మతల్లి వైన్స్కు రూ.3.06 కోట్లుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయం వద్ద నిర్వహించే మద్యం దుకాణ లైసెన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ మంది ఈ షాపు కోసం దరఖాస్తులు చేశారు. పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. దీనికి ఈ నెల 18వ తేదీ వరకు 100 టెండర్లు రాగా, తర్వాత గడువు పొడిగించడంతో మరో రెండు టెండర్లు పడ్డాయి. దీంతో ఎకై ్సజ్ శాఖకు రూ.3.06 కోట్ల ఆదాయం లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 207 మద్య దుకాణాలు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 88 షాపులు, ఖమ్మం జిల్లాలో 119 మద్య దుకాణాలు ఉన్నాయి. వీటిన్నింటికి నూతన లైసెన్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టగా, పెద్దమ్మగుడి వద్ద దుకాణానికి మాత్రమే అత్యధికంగా 102 టెండర్లు దాఖలు చేశారు. 2023లో రూ.2.48 కోట్లు 2023లో నిర్వహించిన టెండర్లలో 124 దరఖాస్తులు రాగా రూ.2.48 కోట్ల ఆదాయం లభించింది. గతంలో కంటే ఈసారి 22 టెండర్ల సంఖ్య తక్కువైనా ఆదాయం పెరిగింది. గతం కంటే రూ.58 లక్షలు ఎక్కువగా వచ్చింది. గతంలో లైసెన్స్ ధర దరఖాస్తుకు రూ. 2 లక్షలు ఉంటే ఈసారి రూ. 3 లక్షలకు పెంచిన విషయం విదితమే. పాల్వంచ పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు ఉండగా 213 టెండర్లు వచ్చాయి. తద్వారా రూ.6.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 102 దరఖాస్తులు పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 13 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తొలుత 525 టెండర్లు వచ్చాయి. గడువు పొడిగించాక మరో 15 టెండర్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దమ్మగుడి వద్ద షాపునకే మొత్తం 102 టెండర్లు లభించాయి. –ప్రసాద్, ఎకై ్సజ్ సీఐ
- 
      
                   
                                 భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాల భీముడి జననంభద్రాచలంఅర్బన్ : భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఓ మహిళ 5 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మణుగూరు పట్టణ పరిధిలోని విప్పల సింగారం ప్రాంతానికి చెందిన జోగునూరి బాబు భార్య రాణికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. రాణిని పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో 2.05 నిమిషాలకు ఆపరేషన్ చేయగా ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. కాగా జోగునూరి బాబు, రాణి దంపతులకు 2018లో ఒక బాబు (3.75 కేజీల బరువు) జన్మించాడు. ఐదు కిలోల బాలుడు.. తల్లీ బిడ్డ క్షేమం
- 
      
                   
                                 ‘డైలీవేజ్’ సమ్మె విరమణఇల్లెందు: డైలీవేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఆందోళన విరమించారు. తగ్గించిన వేతనం కోసం 42 రోజులపాటు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఐటీడీఏ పీఓ, కలెక్టరేట్లను ముట్టడించారు. గురువారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్లోని తన చాంబర్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఐటీయూ నేతలతో సమావేశమై చర్చించారు. పాత జీతం యథావిధిగా కొనసాగించేలా చూస్తామని, 3 నెలల లోపు సమస్యలను శాశ్వతంగా పరిష్కంచేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, దీంతో సమ్మె విరమించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి తెలిపారు. గత నెల 12 నుంచి దీక్షలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కార్మికులు గత నెల 12 నుంచి రిలే దీక్షలు చేపట్టారు. డైలీవేజ్ వర్కర్లకు వేతనం రూ.26 వేలు ఉండగా, జీఓ 64 తీసుకుని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,700 చెల్లిస్తామని ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం రూ.15,600 ఉండగా రూ. 9,200 చెల్లిస్తామని పేర్కొంది. దీంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో 413 మంది డైలీవేజ్ వర్కర్లు, 88 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు. వీరంతా ఆందోళన చేపట్టగా, మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
- 
      
                   
                                 ఆశావహులకు ఊరట!చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు అనర్హులు అనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలువురు ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న అభ్యర్థులు మాత్రమే పోటీకి అర్హులని నిబంధన ఉండటంతో చాలా మంది స్థానిక ఎన్నికల బరిలో నిలబడే అవకాశం కోల్పోయారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేద్దామనే యోచన ఉన్నా ముగ్గురు పిల్లలు ఉండటంతో ఎన్ని కలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదంతెలపడంతో ఆశావహులకు ఊరట కలగనుంది. దీనిపై ప్రభుత్వం చట్ట సవరణ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది. 1995 నుంచి ఇద్దరు పిల్లల నిబంధన రాష్ట్రంలో జనాభా నియంత్రణతోపాటు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు పిల్లలు మాత్రమే అనే నిబంధనను తీసుకొచ్చింది. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీకి అనర్హులు. అప్పటినుంచి 30 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులకు ముగ్గురు పిల్లల నిబంధనలు కొంత అవరోధంగా నిలిచాయి. తెలంగాణ వచ్చాక తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం కూడా స్థానిక బరిలో నిలిచే అభ్యర్థులు ముగ్గురు పిలల్లను కలిగి ఉంటే అనర్హులు అవుతారంటూ పాత నిబంధనలే అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ఉన్న ముగ్గురు పిల్లలు నిబంధనలను తొలగించేందుకు ముందుకురావడం శుభపరిణామం. ఈ నిబంధనలు 30 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. దీని వల్ల చాలా మంది ఆశావహులు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా పోతోంది. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి కొంత అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయనుండటంతో ఆశావహులకు ఊరట కలుగుతుంది. – బోడా శారద, మాజీ ఎంపీటీసీ, త్రీ ఇంక్లైన్ఈ నిబంధనను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తొలగించారు. దీంతో తెలంగాణలో కూడా ఎత్తివేయాలంటూ పలు వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. వినతులు, డిమాండ్లతో పాటు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణపై ప్రజల్లో పెరిగిన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మంత్రి మండలి ఆమోదించింది. ఇక ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్ట సవరణకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా బీసీ రిజర్వేషన్ల కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కోర్టు పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ల జీఓ, బిల్లు విషయం తేలేలోపే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.విడత పంచాయతీలు వార్డులు బరిలోఉన్న వారు మొదటి 174 1,534 3,265 రెండో 142 1,294 2,708 మూడో 163 1,404 3,635స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో మార్పు
- 
      
                   
                                 తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలిటేకులపల్లి: పత్తి పంటల్లో తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, సేద్య విభాగం శాస్త్రవేత్తలు కోరారు. గురువారం శాస్త్రవేత్తల బృందం మండలంలోని వెంకట్యాతండాలో క్షేత్ర సందర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశిస్తే ప్రోఫినోపాస్, దియోడికార్చ్, కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే ప్లాంటమైసిన్, కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మిరపలో వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.శివ, డాక్టర్ ఎం.శరత్, వ్యవసాయశాఖ అధికారులు లాల్ చంద్, అన్నపూర్ణ, విశాలచౌహాన్ పాల్గొన్నారు. పశువులు పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఎటపాక నుంచి హైదరాబాద్కు ట్రాలీలో తరలిస్తున్న 11 పశువులను గురువారం బ్రిడ్జి సెంటర్లో ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
- 
      
                   
                                 త్రుటిలో తప్పిన ప్రమాదంకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జిలో మరో మారు యాష్ ట్యాంకర్ బోల్తాపడింది. గురువారం తెల్లవారుజామున ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ నుంచి ఖమ్మం వైపు యాష్ ట్యాంకర్ వెళ్తోంది. అదే సమయంలో ట్రాలీ ఆటో సిమెంట్ మిక్సింగ్ మిషన్, జనరేటర్ను తీసుకుని వెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జిలోకి రాగానే యాష్ ట్యాంకర్ ముందు ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాలీలో ఐదుగురు కార్మికులున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గతంలో కూడా యాష్ ట్యాంకర్ ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే మరో సారి ట్యాంకర్ ప్రమాదం జరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలో యాష్ ట్యాంకర్ బోల్తా
- 
      
                   
                                 ఏఎన్ఎం కోర్సుతో ఉపాధి అవకాశాలుఖమ్మంఅర్బన్: ఏఎన్ఎం కోర్సు పూర్తిచేసిన యువతులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూ (నర్సింగ్ కోర్సు) పూర్తి చేసిన విద్యార్థినులకు గురువారం క్యాపింగ్ ఉత్సవం నిర్వహించగా ఆమె మాట్లాడారు. నిరుపేద విద్యార్థినులకు మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ మాట్లాడుతూ రెండేళ్ల కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డీసీహెచ్ఎన్ శేషు పద్మ మాట్లాడగా కోర్సు పూర్తి చేసిన వారికి పత్రాలు అందజేశారు. మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేతతో పాటు ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్కుమార్, సుధీర్, సుకన్య, లాలయ్య, మౌనిక, దుర్గారావు, శాంతమ్మ పాల్గొన్నారు.
- 
      
                    వర్షంతో దెబ్బతింటున్న పంటలు● కోత దశలో నేలవాలుతున్న వరి ● తడిసి పాడవుతున్న పత్తి, మక్కలు బూర్గంపాడు/గుండాల: పంటచేతికి వచ్చే సమయంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. వరి, పత్తి, మొక్కజన్న పంటలు దెబ్బతింటున్నాయి. మూడురోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షాలకు కోతకు వచ్చిన వరిపంట నేలవాలుతోంది. ఇప్పటికే వరికోతలు ప్రారంభించాల్సి ఉండగా, వానల కారణంగా ఆలస్యమవుతున్నాయి. అధిక వర్షాలు ఈ ఏడాది పత్తిపంటకు కూడా ప్రతికూలంగా మారాయి. పూసిన పత్తిని తీసుకునేందుకు వర్షాల కారణంగా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. తొలివిడత పత్తితీతలు ప్రారంభమవుతున్న తరుణంలో తరచు వర్షాలు కురుస్తుండటంతో పత్తి తీసేందుకు ఇబ్బందికరంగా మారింది. దూది తడిసి నల్లబడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షంతో తడిసిన మొక్కజొన్న వర్షంతో ఆరబోసిన మొక్కజొన్నలు గురువారం కురిసిన వర్షానికి తడిసిపోయాయి. గుండాల మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయగా, ఇప్పుడిప్పుడే రైతులు కోతలు మొదలు పెట్టారు. విరిసిన మొక్కజొన్న కంకులను కల్లాల్లో, మిల్లర్ పట్టిన మక్కలను రోడ్లపై ఆరబోశారు. బుధవారం నుంచి మబ్బులు కమ్ముతూ తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.టార్బాలిన్లు కప్పుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
- 
      
                   
                                 బాధితులతో మర్యాదగా వ్యవహరించాలిటేకులపల్లి: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్రాజ్ పోలీస్ సిబ్బందికి సూచించారు. బోడు పోలీసుస్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల సీఐలు సత్యనారాయణ, సురేష్, రవీందర్, ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రాజేందర్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు
- 
      
                   
                                 వేగమేదయా ?!సీతారామా..సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు లక్ష్యం మేర సాగడం లేదు. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా.. ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.19,324 కోట్లకు పెంచినప్పటికీ ఆ మేరకు నిధులు రావడం లేదు. జూలూరుపాడు వద్ద టన్నెల్ తవ్వకం ప్రారంభానికే నోచుకోకపోగా, తిరుమలాయపాలెం వద్ద టన్నెల్ సగంలో నిలిచిపోయింది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండడంతో పనులు ఊపందుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో నత్తనడకన.. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు జిల్లాల్లో పనులను 16 ప్యాకేజీలుగా విభజించారు. భద్రాద్రి జిల్లాలో ప్రధానకాల్వ నిర్మాణం, మూడు పంప్హౌస్ల పనులు పూర్తికాగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి టెండర్లు, భూసేకరణ సాగుతోంది. డిస్ట్రిబ్యూటరీలను భద్రాద్రి జిల్లాలో 1, 2, 7, 8, ఖమ్మం జిల్లాలో 3, 4, 5, 6 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 6వ ప్యాకేజీ మినహా మిగతా వాటికి అనుమతులే రాలేదు. అలాగే, ప్రధాన కాల్వ పనులు పూర్తి కాలేదు. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్ ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రధాన కాల్వకు అడ్డంకులు ఖమ్మం జిల్లాలో 13 నుంచి 16 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వలు నిర్మించాలి. ఏన్కూరు నుంచి 75 కి.మీ. మేర ప్రధాన కాల్వ తవ్వితేనే గోదావరి జలాలు రిజర్వాయర్లోకి చేరతాయి. దీంతో ఎన్నెస్పీ ఆయకట్టును స్థిరీకరించినట్టవుతుంది. కానీ భూసేకరణ, నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాక 13వ ప్యాకేజీలో 10.53 కి.మీ. కాల్వ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్యాకేజీలో 167.76 ఎకరాల పట్టా, 213.60 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని ప్యాకేజీల్లో ఇలా.. ప్యాకేజీ 14లో 10.50 కి.మీ. నుంచి 39.50 కి.మీ. వరకు 29 కి.మీ. మేర కాల్వ నిర్మించాలి. ఇంకా 26.11 కిలోమీటర్లు పూర్తి కావాలి. ఈ పరిధిలో రెండు రైల్వేలైన్లు, ఒక గ్యాస్ పైప్లైన్ ఉండగా, 1,021 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో 872 ఎకరాలు మాత్రమే సేకరించగా 761 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.80.85 కోట్లు పెండింగ్ ఉంది. ప్యాకేజీ 15లో 23.20 కి.మీ. కాల్వకు గాను 16.96 కి.మీ. పనులు జరుగుతున్నాయి. ఇందులో రెండు అక్విడెక్ట్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీలో 740 ఎకరాలకు గాను 685 ఎకరాలు సేకరించి 34 ఎకరాలకే పరిహారం చెల్లించారు. ప్యాకేజీ 16లో 4.57 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి 1.20 కి.మీ.మేర పనులు సాగుతున్నాయి. ఇక్కడ అవసరమైన 336 ఎకరాల్లో 321 ఎకరాల భూమి సేకరించి 12 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.2.09 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలో అప్రోచ్ కెనాల్ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం జిల్లాలోని 16వ ప్యాకేజీ కింద తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8.2 కి.మీ. టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు నాలుగు కి.మీ. పూర్తికాగా రూ.170 కోట్ల బిల్లుల్లో రూపాయీ విడుదల కాక కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. పూర్తయిన టన్నెల్లోనూ నిలిచిన నీటిని తొలగించడానికి మూడు నెలలు పడుతుంది. 2022లో ప్రారంభమైన ఈ టన్నెల్ పనులను తొలుత 2024 నాటికి, ఆతర్వాత 2026 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధులు రాక, టన్నెల్లో నీరు నిలిచి అప్పటికీ పూర్తవడం కష్టమే. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు వద్ద 1.650 కి.మీ. టన్నెల్ నిర్మాణం మొదలే కాకపోగా, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో యాతాలకుంట వద్ద కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన కాల్వ పనులతో పాటు టన్నెల్ పనులు పూర్తయితేనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి అందుతాయి.
- 
      
                   
                                 ముగిసిన మద్యం టెండర్లుకొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. మొదట ఈనెల 18తో గడువు ముగియగా.. దీపావళి, ఇతర సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు ఈనెల 22వ తేదీ వరకు 3,816 దరఖాస్తులు రాగా, చివరి రోజైన గురువారం 106 దరఖాస్తులు స్వీకరించామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మొత్తంగా 3,922 టెండర్లు దాఖలయ్యాయని, ఈనెల 27న కొత్తగూడెం క్లబ్ లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తామని వెల్లడించారు. 88 షాపులకు 3,922 దరఖాస్తులు
- 
      
                   
                                 వృద్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలిజిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతా లెనీనా అశ్వాపురం/మణుగూరురూరల్ : వృద్ధులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని, వారికి ఏ విధమైన ఇబ్బంది కలగనీయొద్దని జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలతా లెనీనా అన్నారు. అశ్వాపురం, సీతారాంపురంలోని వృద్ధాశ్రమాలను గురువారం ఆమె సందర్శించారు. పడకగదులు, సామగ్రి, వంటగది, భోజనశాలలను పరిశీలించారు. ఆశ్రమాల నిర్వహణకు నిధులు ఎలా సమకూరుస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మానవీయ వృద్ధాశ్రమం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి రమేశ్బాబు, కమటం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దైదా నారాయణరెడ్డి, అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. శ్రీసత్యసాయి పాఠశాలలో తనిఖీ.. మణుగూరు మండలం సంతోష్నగర్లో సింగరేణి సేవా సమితి సహకారంతో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి పాఠశాలను స్వర్ణలతా లెనీనా గురువారం తనిఖీ చేశారు. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు కల్పిస్తున్న వసతి, విద్యాబోధన, క్రీడల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్పీచ్ థెరపీ ద్వారా విద్యాభోదన చేయడాన్ని చూసి నిర్వాహకులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు, ఎంపీఓ పి.వెంకటేశ్వరరావు, పాఠశాల నిర్వాహకులు టి.నాగమణి, దుర్గా వరప్రసాద్, ఉపాధ్యాయురాలు రోజారమణి పాల్గొన్నారు.
- 
      
                   
                                 75 శాతం హాజరు తప్పనిసరి● డీఐఈఓ వెంకటేశ్వరరావు ● దుమ్ముగూడెం ప్రభుత్వ కళాశాలలో తనిఖీ దుమ్ముగూడెం : ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలని, అప్పుడే పరీక్ష ఫీజులు తీసుకుంటామని డీఐఈఓ హెచ్.వెకంటేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి హాజరవ్వాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అపార్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెరిగేలా తమకు కేటాయించిన పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధ్యాపకులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ కృష్ణవేణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు.. నషా ముక్తి భారత్ అభియాన్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ రవి, డీడీఏసీ ప్రతినిధి సీహెచ్ స్వరూప, యాంటీ డ్రగ్ కౌన్సిలర్ కేపీడీ వరరాజు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 అభివృద్ధి ప్ర‘దాతలు’భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు కరువవుతోంది. అయితే తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్న భక్తులు రామయ్యకు పలు రూపాల్లో విరాళాలు అందజేస్తున్నారు. కానీ వారికి దేవస్థానంలో తగిన మర్యాద, మన్ననలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు ఆలయ, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. వితరణలతోనే వసతులు.. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో రామయ్య దేవస్థానానికి పునాది పడింది నాడు కంచర్ల గోపన్న సేకరించిన ప్రభుత్వ ఖజానాతోనే. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని నేటి వరకు ప్రభుత్వం ఎంతో కొంత అభివృద్ధి చేసినా.. భక్తులు సమర్పించిన విరాళాలు, వితరణలతోనే మరిన్ని వసతులు సమకూరాయి. ఇందులో ప్రధానంగా అంతరాలయంలో బంగారు వాకిలి, వెండి వాకిలి, స్వర్ణ పూరిత వాహనాలు, మూలమూర్తులకు స్వర్ణ కవచాలంకరణ, ఆలయంలో, చుట్టుపక్కల షెడ్ల వంటివి భక్తులు సమర్పించిన విరాళాలతోనే చేయించారు. ఇంకా దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానం, గోశాల, సత్రాలు, వసతిగదులు, కాటేజీల నిర్మాణానికి పలు రాష్ట్రాల దాతలు ముందుకొచ్చారు.. వస్తూనే ఉన్నారు. వీటితో పాటు ఉత్సవాల నిర్వహణకు వితరణలు, స్వామి, అమ్మవార్లకు బంగారు ఆభరణాలు అందిస్తున్నారు. ఇలా ప్రభుత్వం చేసే అభివృద్ధి కంటే ఇప్పటికీ దాతలు భూ, ధన, వస్తు రూపాల్లో ఇచ్చే విరాళాలపైనే ఆలయాభివృద్ధి ఆధారపడి ఉంటోంది. విరాళాలకు భరోసా ఏదీ..? శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు అందించే విరాళాలు సద్వినియోగం అయ్యేలా అధికారులు భరోసా కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది దేవస్థానంలో ఓ కాటేజీ నిర్మాణానికి దాతలు అందించిన నగదు దుర్వినియోగం అయిందనే ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. అలాగే భక్తులు అందించే బంగారం, వెండి ఆభరణాల విషయంలోనూ పారదర్శకత పాటించాలని అంటున్నారు. ఇక దాతలకు దేవస్థానంలో సముచిత స్థానం దక్కడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఆలయంలో దర్శనాలు, ఉత్సవాల సమయంలో తగు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. నిర్దిష్ట విరాళం అందజేసిన దాతలకు ఆలయంలోనే స్వామివారి కండువాలు, ప్రసాదాలు అందించడంతో పాటు వేదాశీర్వచనం చేయాలని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఏడాది నిర్వహించే దాతల సత్కార కార్యక్రమంలోనూ ప్రస్తావిస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన వేడుకలోనూ ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయానికి భక్తుల నుంచి అధికారులు భారీ స్థాయిలో విరాళాలు సేకరించలేకపోతున్నారనే అపవాదు సైతం ఉంది. వివిధ రాష్ట్రాలు, ప్రదేశాల నుంచి వచ్చే భక్తులను దాతలుగా మార్చడంలో విఫలమవుతున్నారు. దేవస్థానం వద్ద రశీదు కౌంటర్ మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఆలయ ప్రాంగణంలో దాతలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రత్యేక ప్రొటోకాల్ దర్శన టికెట్లతో పాటు భక్తుల రద్దీని బట్టి వెయింటింగ్ హాల్ నిర్మించాలని పలువురు సూచిస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే మహారాజ పోషకులకు కొదవేమీ ఉండదని అంటున్నారు. ఈ ఏర్పాట్లతో పాటు చెంతనే ఉన్న నవభారత్, ఐటీసీ, బీటీపీఎస్, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, పలు కార్పొరేట్ సంస్థల వారితో ఆలయాభివృద్ధిపై చర్చిస్తే విరివిగా నిధులు సమకూరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- 
      
                   
                                 నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. అధికారులకు మంత్రి ప్రశంసఇల్లెందు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు అందుతున్న సేవలు, ప్రసవాల పెరుగుదల, ప్రజలకు తగ్గిన ఆర్థికభారం తదితర అంశాలపై ‘ప్రసవ వే‘ధన’ తగ్గింది’ శీర్షికతో గురువారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఐఅండ్పీఆర్ విభాగం ఉన్నతాధికారులు కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో మారుమూల పల్లెల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అధికారులు, సిబ్బంది శ్రమించి పనిచేయడం వల్లే భద్రాద్రి జిల్లాలో గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం పొంది ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. శబరిమలకు ఆర్టీసీ బస్సులు ఖమ్మంమయూరిసెంటర్: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ చార్జీలతో ఆర్టీసీ బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్లోని ఏడు డిపోల నుంచి పుష్బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బస్సుల కోసం ఖమ్మం డిపో మేనేజర్(99592 25958), సత్తుపల్లి డిపో(99592 25962), కొత్తగూడెం డిపో (99592 25959), భద్రాచలం డిపో (99592 25960), మధిర డిపో (99592 25961), మణుగూరు డిపో (99592 25963) మేనేజర్ను సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. గుండాల – తాడ్వాయి అడవుల్లో పులి సంచారం ?గుండాల: గుండాల, మహబూబాబాద్ జిల్లా పాఖాల కొత్తగూడ, ములుగు జిల్లా తాడ్వాయి సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పాఖాల కొత్తగూడెం మండలంలో ఓ వ్యక్తి అడవిగేదె దాడిలో మృతి చెందినట్లు గుర్తించిన విషయం విదితమే. కాగా, సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుండాల–పస్రా మధ్య లింగాల, గుండాల– దామరతోగు అటవీ ప్రాంతంలో సంచిరిస్తోందని మరి కొందరు అంటున్నారు. అయితే పులి అడుగుజాడలు కానీ, ఆచూకీ కానీ ఇంతవరకూ తెలియరాలేదు. పులి సంచరిస్తోందనే ప్రచారంతో పశువుల కాపరులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి తీసే దశలో ఉండగా ఆ పనులకు వెళ్లేందుకు కూలీలు వణికిపోతున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని అంటూనే సమాచారం సేకరిస్తున్నామని చెబుతున్నారు.
- 
      
                   
                                 శిక్షణ పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలిభద్రాచలంటౌన్ : గిరిజన నిరుద్యోగ యువత డ్రైవింగ్లో శిక్షణ పూర్తయ్యాక సమయం వృథా చేయకుండా డ్రైవర్ ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. టీజీఆర్టీసీ వరంగల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ సెంటర్లో శిక్షణ పొందిన గిరిజన యువకులకు గురువారం తన చాంబర్లో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. భద్రాచలం ఆర్టీఓ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆ లైసెన్సులను సద్వినియోగం చేసుకోవాలని, డ్రైవర్ ఉద్యోగాలు పొందాలని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 సమీకృత వ్యవసాయమే భేష్● తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్బూర్గంపాడు: వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను సమ్మిళతం చేసి రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను పాటించాలని, దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మోరంపల్లిబంజర గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ డెమో ఫామ్ షెడ్ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటలతో పాటు పశుపోషణ, కూరగాయలు, పూల మొక్కలు, పండ్లతోటల పెంపకం, కోళ్లు, కౌజు పిట్టలు, చేపలు, మేకల పెంపకం వంటి పనులు చేపట్టాలని సూచించారు. తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి మోడల్ ఫామ్షెడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఈసీ రాజు, అధికారులు వెంకయ్య, వెంకటలక్ష్మి, హేమంతిని, పంచాయతీ కార్యదర్శి భవాని పాల్గొన్నారు. వైద్య విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలి చుంచుపల్లి : వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాన్ని పరిశీలించి, పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుందని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటలని, విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్, డాక్టర్ సురేష్ బాబు, వార్డెన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 మాదక ద్రవ్యాలను వదిలేయాలి..సూపర్బజార్(కొత్తగూడెం)/మణుగూరురూరల్: మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి ఆకాంక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగూడెం, మణుగూరు పట్టణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. కొత్తగూడెంలో 37 బైకులు, 2 ఆటోలు, ఒక కారు, 20 బీర్ బాటిళ్లు, 223 క్వార్టర్లు (విలువ రూ.46,190) స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఇక మణుగూరులోని సురక్షా బస్టాండ్ ప్రాంతంలో అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో డీఎస్పీలు మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అల వాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మూడు టౌన్లు, చుంచుపల్లి సీఐ లు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐలు, మణుగూరు ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నగేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం, మణుగూరుల్లో కార్డన్ సెర్చ్
- 
      
                   
                                 భద్రాద్రిలో కార్తీక పూజలుభద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన అనుబంధంగా ఉన్న ఉమామహేశ్వరి సమేత రామలిగేశ్వర స్వామి ఉపాలయంలో జరిగిన కార్తీక మాస పూజల్లో ఈఓ దామోదర్రావు దంపతులు పాల్గొన్నారు. పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కార్తీక మాస పురాణ విశిష్టత, సంగీత, నృత్య కార్యక్రమాలు జరిపారు. ఇదిలాఉండగా గోదావరి తీరం కార్తీక శోభను సంతరించుకుంది. తొలిరోజు బుధవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు బారులుదీరారు. మహిళలు స్నానాలు ఆచరించి, ఒత్తులను వెలిగించి గోదావరిలో వదిలారు. రామాలయంతో పాటు అనుబంధ ఆలయాలను సందర్శించారు.
- 
      
                   
                                 కొండరెడ్లకు చేయూతనిస్తాందమ్మపేట : కొండరెడ్లకు జీవనోపాధితోపాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీడీఏ భద్రాచలం ద్వారా చేయూతనిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ అన్నారు. మండలంలోని పూసుకుంట గ్రామంలో కొండరెడ్ల (గిరిజన) కుటుంబాల జీవనోపాధిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన మౌలిక వసతులు, కార్యాచరణ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ కొండరెడ్ల జీవనోపాధికి టెంట్ హౌస్లు, పవర్ టిల్లర్ యంత్రాలను అందజేసి, 14 మంది రైతులకు వ్యవసాయ క్షేత్రాల్లో నీటి బోర్లు వేయించి, పామాయిల్ మొక్కలను నాటించామని వివరించారు. తేనెటీగలు, పుట్టగొడుగులు, మేకలు, గొర్రెలు, గేదెల పెంపకంను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో 25 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, ఏపీఓ డేవిడ్ రాజ్, ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, డీఈ బాపనయ్య, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సీడీపీఓ హేమసత్య, హరికృష్ణ, సాయికృష్ణ, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్
- 
      
                   
                                 ● సాఫ్ట్వేర్ మొరాయించడంతో నిలిచిన కొనుగోళ్లు ● వచ్చే సోమవారం నుంచి తీసుకురావాలని సూచనపత్తి కొనుగోళ్లలో సాంకేతిక సమస్యఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సాఫ్ట్వేర్లో ఎదురైన సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లు నిలిచిపోగా, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు నిర్ణయించగా, రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళ, బుధవారాల్లో నాలుగు కేంద్రాలు మొదలయ్యాయి. ఈమేరకు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని వాహనాల్లో పత్తి తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంట సాగు వివరాలు, స్లాట్ వివరాలు పరిశీలించాక కొనుగోలు చేయాల్సి ఉండగా.. సాఫ్ట్వేర్లో సమస్యతో బ్రేక్ పడింది. ఈమేరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సమస్యపై సాఫ్ట్వేర్ సమకూర్చిన సంస్థ నిర్వాహకులతో మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలిరోజు ఒక్కో మిల్లు వద్దకు 10 – 15 వాహనాల్లో పత్తితో రైతులు రాగా, సాయంత్రం కురిసిన వర్షంతో పత్తి కొంతమేర తడిసింది. ఈవిషయమై వివరణ కోరేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా, గోల్తండాలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలుసుకున్న మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్రెడ్డి, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేష్ చేరుకుని మార్కెట్, సీసీఐ అధికారులతో మాట్లాడాక తేమ శాతం పరీక్షించి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల నేపథ్యాన రైతులు నుంచి పత్తి తీసుకురావాలని అధికారులు సూచించారు.
- 
      
                   
                                 భారీ క్రేన్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జి..12 మీటర్ల వెడల్పుతో నిర్మాణం అమృత్ భారత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్టేషనలోని మొదటి ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం నుంచి భారీ క్రేన్లు తెప్పించి నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కాగా భారీ క్రేన్లతో జరుగుతున్న పనులను స్థానికులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. – కొత్తగూడెంఅర్బన్
- 
      
                   
                                 ప్రసవ వేధన తగ్గింది..ఇల్లెందు: ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న చికిత్స కారణంగా ప్రసవ వేదన తగ్గింది. ఫలితంగా జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే, ఎందరికో ఖరీదైన వైద్యం కూడా ఇప్పుడు ఖర్చు లేకుండా అందుతోంది. ఏడు వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు, చర్లలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి.. వాటి ల్లో 12 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. భద్రాచ లంలో ముగ్గురు, పాల్వంచ, బూర్గంపాడు, చర్లలో ఒక్కొక్కరు, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు లో ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. గత మార్చికి ముందు భద్రాచలంలో 120 వరకు ప్రసవాలు జరుగగా అక్టోబర్లో 257వరకు జరిగాయి. ఇక పాల్వంచలో 15 వరకు జరగగా ప్రస్తుతం 50 వరకు జరిగాయి. ఇల్లెందులో 20 నుంచి 51 వరకు జరిగాయి. అశ్వారావుపేటలో 12నుంచి 52 వరకు.. మణుగూరులో 10 నుంచి 101 వరకు పెరిగాయి. చర్ల, బూర్గంపాడులో ఇటీవల గైనకాలజిస్టు నియా మకంతో 15 వరకు జరిగాయి. అన్ని జిల్లాలతో పోలిస్తే తెలంగాణలోని ఇతర అన్ని జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుఖ ప్రసవాల సంఖ్య ఆరు నెలల కాలంలో పెరిగింది. కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, పీఓ రాహుల్, డీసీహెచ్ఎస్ జి.రవిబాబు ప్రత్యేకచొరవ తీసుకోవడంతోపాటు అందుకు తగిన సదుపాయాలు కల్పన, గైనకాలజిస్టుల నియామకంతో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఇక మత్తు వైద్యులు, ల్యాబ్లు, ఆపరేషన్ థియేటర్లు, స్కానింగ్ సెంటర్లు, టీ పాస్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు కూడా సుఖ ప్రసవాల పెంపునకు దోహదపడినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇల్లెందు ఏరియా వైద్యశాలలో ఉచితంగా వైద్యంఅందించి సుఖ ప్రసవం చేశారు. ప్రైవేట్ కు వెళి తే రూ.70వేలవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉండేది. వైద్యు లు, సిబ్బంది సహకారం కూడా బాగుంది. ప్రభుత్వ దవాఖాన పేదలకు ఎంతో ఉపయోగంగా మారింది. –పూనెం వినతి, మొట్లగూడెం, ఇల్లెందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్చొరవ కారణంగా జిల్లాలోని ఏడు ఏరియా వైద్యశాలల్లో సుఖ ప్రసవాలు పెరిగాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించటం, వైద్యశాలల్లో గైనకాలజిస్ట్, మత్తు, స్కానింగ్ వైద్యుల నియామకంతో పాటు ల్యాబ్, ఆపరేషన్ థియేటర్లు, మందులు అందుబాటులో ఉంచటంతో ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. –డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ ప్రభుత్వ వైద్యశాలల్లో సుఖ ప్రసవాలు జరుగుతుండటం వల్ల పేదలపై ఆర్థిక భారం తగ్గింది. ఒక్కో ప్రసవానికి ప్రైవేట్ వైద్యశాలలో అయితే రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వ వైద్యశాలలో ఖర్చు లేకుండా సుఖ ప్రసవాలు జరుగుతుండటంతో పేదలు ఊపిరిపీల్చుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, అశ్వారావుపేట ఏరియా వైద్యశాలలు, 29 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. వందల సంఖ్యలో ప్రతీనెలా ప్రసవాలు జరుగుతుంటే ఇందులో ఎక్కువ మంది గతంలో ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకున్నవారే. ఇప్పుడు ఏరియా వైద్యశాలల్లో సదుపాయాల కల్పన, గైనకాలజిస్టుల నియామకం వల్ల ఎంతో ఉపయోగంగా మారింది. దీనికి తోడు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తమ సతీమణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించి, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించారు.
- 
      
                   
                                 శిశువులకు శ్రీరామరక్ష● 108 నియోనాటల్ ద్వారా అత్యవసర వైద్యం ● నవజాత శిశువు మరణాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో 1,971 మందికి సేవలు ఖమ్మంవైద్యవిభాగం: అప్పుడే పుట్టిన శిశువు మొదలు 30రోజుల లోపు వయస్సు వారిని నవజాత శిశువులుగా పరిగణిస్తారు. ఈ వయస్సు శిశువుల సంరక్షణపై అవగాహన లేక కొన్ని, సరైన పోషణ అందక ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమాన శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యాన మరణాలు తగ్గించేలా అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 నియోనాటల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ సేవలతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది శిశువుల ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాకు రెండు అంబులెన్స్లు కేటాయించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులకు సిబ్బంది వైద్యం అందిస్తూనే పెద్దాస్పత్రులకు తరలిస్తూ శిశు మరణాల తగ్గింపునకు పాటుపడుతున్నారు. రెండేళ్లుగా నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 108 నియోనాటల్ అంబులెన్స్ సేవలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 1,971 మంది శిశువులకు వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణంగా 108 వాహనంలో శిశువు చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉండవు. ఈమేరకు ప్రత్యేక పరికరాలతో నియోనాటల్ అంబులెన్స్లు సమకూర్చారు. ఇందులో వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఇంక్యూబేటర్, పల్స్ ఆక్సీమీటర్, సిరంజ్ పంప్, ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి. బరువు తక్కువ ఉన్న శిశువులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టేవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం సులువవుతోంది. నవజాత శిశు మరణాల నివారణకు.. కొన్నేళ్లుగా జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. బరువు తక్కువగా పుట్టడం, అవయవాల ఎదుగుదలలో లోపాలతో జన్మిస్తున్న వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే, శిశువు పరిస్ధితి ఇబ్బందిగా మారినప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాకు రెండు నియోనాటల్ అంబులెన్స్లను కేటాయించగా వీటిలో వైద్యం అందిస్తూ పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా శిశు మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా కొందరు వైద్యులు వైద్యం చేయకుండా రిఫర్ చేస్తున్నారని, అలా కాకుండా జిల్లాలోనే వైద్యం అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రెండు నియోనాటల్ వాహనాల ద్వారా సేవలు అందుతున్నాయి. శిశువులకు చికిత్స చేస్తూనే పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారామరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అత్యవసర వైద్యం అవసరమైన శిశువులనే రిఫర్ చేస్తే మరింత మందికి సేవలు అందుతాయి. – శివకుమార్, ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్
- 
      
                   
                                 కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారుకొత్తగూడెంఅర్బన్: కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారైంది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాలకేంద్రంలో భవన నిర్మాణానికి నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు ఇటీవల కేంద్రీయ విద్యాలయ మంజూరుకాగా, ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. నూతన భవనం అందుబాటులోకి వచ్చేవరకు పాతకొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లోని ఓ భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 గదులతో కూడిన ఖాళీ భవనం కేటాయించగా, రెండు, మూడు రోజుల్లో కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు వచ్చి పరిశీలించనున్నారు. వారి సూచనల మేరకు కొద్ది మార్పులు చేసి కొనసాగించనున్నారు. భవనం రీ మోడలింగ్కు జిల్లా విద్యాశాఖ నుంచే నిధుల విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విద్యాధికారులు తెలిపారు. ఇక పాల కేంద్రంలో కేటాయించిన నాలుగున్నర ఎకరాల్లో శాశ్వత భవనం నిర్మించనున్నారు. ఇటీవల పరిశీలించిన కలెక్టర్ పాతకొత్తగూడెంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయించిన భవనాన్ని ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. భవనంలో మార్పులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అందుబాటులోకి తేవాలన్నారు. విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారి రాజగోపాల్ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు పరిశీలించాక, వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పులు చేపట్టనున్నారు. కాగా కేంద్రీయ విద్యాలయలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్తో బోధన చేపట్టనున్నారు. అడ్మిషన్లు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు నామినల్ ఫీజులతో నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉంది.
- 
      
                   
                                 ముమ్మరంగా వాహన తనిఖీలుటేకులపల్లి: మావోయిస్టుల నిరసన నేపథ్యంలో టేకులపల్లి సర్కిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఎస్పీ రోహిత్రాజు ఆదేశాల మేరకు బోడు ఎస్ఐ పోలిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్నగర్లో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానితుల వివరాలు ఆరా తీశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. రేపు జాబ్మేళాసూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లోని వివిధ తయారీ రంగ సంస్థల్లో పనిచేసేందుకు గాను 200 మంది ఎంపిక కోసం ఈ నెల 24న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. పాల్వంచలోని డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్మేళాను 19 నుంచి 23 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్టు, వెల్డర్ ట్రేడ్లలో ఐటీఐ పూర్తిచేసిన వారు టెక్నీషియన్లుగా అర్హులని, ట్రెయినీ టెక్నీషియన్లుగా పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 90105 84000 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బీఏఎస్ స్కూళ్లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కింద కొనసాగుతున్న పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత తెలిపారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ నుంచి 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి అవకాశం ఉండగా, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటని వారు అర్హులని తెలిపారు. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు ఫొటోలతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతిములకలపల్లి: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ఆలయాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సారపాక గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్ ట్రాక్టర్ను అదే గ్రామానికి చెందిన ముత్యాల శేఖర్ (50) నడుపుతున్నాడు. బుధవారం మండలంలోని కొత్తజిన్నెలగూడెం సమీపంలో జామాయిల్ కర్ర తీసుకెళ్లేందుకు శేఖర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు. మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఆలయాన్ని ఢీకొట్టింది. శేఖర్ ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ పుల్లారావు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్పాల్వంచ: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై రాళ్లతో దాడిచేసి గాయపర్చిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి జయమ్మకాలనీలో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో కానిస్టేబుల్ అబ్బురాములు అక్కడికి వెళ్లగా.. జట్పట్ రమేశ్ రాళ్లతో దాడి చేసి గాయపర్చాడు. అబ్బురాములు ఫిర్యాదు మేరకు రమేశ్పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుమన్ పేర్కొన్నారు. మద్యం దుకాణం వద్ద ఘర్షణఆరుగురిపై కేసు పాల్వంచరూరల్: మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న యువకుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. యువకుడిపై ఆరుగురు కలిసి దాడిచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద గల మద్యం దుకాణం వద్ద నాగారానికి చెందిన ఐలపాక హరీశ్పై శనగ కిశోర్, అఖిల్, భరత్, సందీప్, హరిబాబు, సాగర్ కలిసి బుధవారం దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.
- 
      
                   
                                 ●ఇలా కూడా వాడొచ్చా..!కూల్డ్రింక్స్ తాగి వృథాగా పడేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో మట్టి నింపి.. ఓ ఉపాధ్యాయుడు మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. దీనిని చూసినవారంతా వీటిని ఇలా కూడా వాడొచ్చా? అని ఔరా అంటున్నారు. మండలంలోని బండారుగుంపులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లు కూల్డ్రింక్ ఖాళీ బాటిళ్లను సేకరించి పాఠశాల ఆవరణలో ఉన్న వృక్షాలకు కట్టి, వాటిలో మట్టి నింపి పలు రకాల మొక్కల్ని పెంచుతున్నాడు. అవి పూలు పూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను బుధవారం ‘సాక్షి’కెమెరా క్లిక్మనిపించింది. – అశ్వారావుపేటరూరల్
- 
      
                   
                                 చెక్ పోస్టులు సర్దేశారు..పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్: రోడ్డు ట్రాన్స్పోర్టు అథారిటీ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగించారు. బుధవారం సాయంత్రం సామగ్రి సర్దుకుని అధికారులు, సిబ్బంది వెళ్లిపోయారు. తనిఖీలకు ఆన్లైన్ విధానం అమల్లో భాగంగా రెండు నెలల క్రితం ప్రభుత్వం జీఓ నంబర్ 58ను జారీచేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్పోస్టులను యుద్ధప్రాతిపదికన మూసివేయాలని బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులను సంబంధిత అధికారులు మూసివేశారు. చెక్ పోస్టుల్లో 24 గంటలపాటు వాహన తనిఖీలు నిర్వహించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలకు సంబంధించిన పర్మిట్లు, ట్యాక్సీ చెల్లింపులు, లోడింగ్లను తనిఖీ చేసేవారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కేసు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించేవారు. కాగా చెక్పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆర్టీఏ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఇటీవల ఏసీబీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. ఆనవాళ్లు లేకుండా.. చెక్పోస్టుల వద్ద బోర్డులను కూడా తొలగించారు. పేరు కన్పించకుండా నల్లటి రంగు వేశారు. కంప్యూటర్లు, స్టేషనరీ, ఫర్నిచర్, ఏసీలు, బీరువాలను సర్దుకుని ప్రత్యేక వాహనంలో కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. కొత్తగూడెం జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి వెంకటరమణ పాల్వంచ చెక్పోస్టును పరిశీలించి వెళ్లారు. చెక్పోస్టు తొలగింపు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే కార్యాలయాలు వెలవెలబోయాయి. మరోవైపు చెక్పోస్టులను తొలగించడం పట్ల వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పాల్వంచలో 35 ఏళ్ల క్రితం ఏర్పాటు పాల్వంచలో 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆర్టీఏ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. 1992లో మొదటిసారిగా పాల్వంచ పట్టణంలోని జీసీసీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేశారు. 2010లో అక్కడి నుంచి జగన్నాథపురం శివారు నాగారం కాలనీ వద్దకు తరలించారు. అప్పటి నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నలుగురు ఏఎంవీఐలు, మరో నలుగురు కానిస్టేబుళ్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది చెక్పోస్టులో 1600 కేసులను నమోదు చేశారు. జరిమానా ద్వారా ప్రభుత్వానికి రూ. 2.5 కోట్ల ఆదాయం లభించింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు నాగారంకాలనీ వద్దగల చెక్పోస్టును పూర్తిగా ఎత్తివేశారు. సరిహద్దులో 11 ఏళ్ల క్రితం.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రవాణా శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టును బుధవారం మూసివేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులో 2014లో ఏర్పాటు చేసిన చెక్పోస్టు దాదాపు 11 ఏళ్లు కొనసాగింది. చెక్పోస్టు ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.8 కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చెక్ పోస్టును తొలగించినట్లు ఎంవీఐ జనార్ధన్ రెడ్డి తెలిపారు. కాగా, పొరుగున ఉన్న ఏపీ సరిహద్దు చెక్పోస్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎత్తివేశారు. ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాలతో పాల్వంచలోని ఆర్టీఏ చెక్పోస్టును మూసివేశాం. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వరంగల్లోని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వద్ద గురువారం రిపోర్టు చేయాలి. చెక్పోస్టు ఆనవాళ్లు లేకుండా తొలగించాం. –మనోహర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
- 
      
                   
                                 రమణీయం.. రామయ్య కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బుధవారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు–రాంప్రసాదమ్మ దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు ఇచ్చారు. ఈ సందర్భంగా దాత కుటుంబీకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మైలురాయిగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీవీసీ యోగితారాణాతో భేటీలో మంత్రి తుమ్మల కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాతో మంత్రి హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవేశాలు, భవన నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాసంస్థలో చదివే విద్యార్థులు భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులుగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఎన్ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. మునగ తోటల పరిశీలనఅశ్వారావుపేట(చండ్రుగొండ)/జూలూరుపాడు : చండ్రుగొండ, జూలురుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో పత్తి, వరి, మునగ పంటలను బుధవారం కృషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్ భరత్, శాస్త్రవేత్తలు శివ, శరత్ చంద్ర పరిశీలించారు. కోత సక్రమంగా రాలేదని, పూత సైతం రాలిపోయిందని చండ్రుగొండకు చెందిన రైతు మరకాల రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, అకాల వర్షాల కారణంగా ఇలా జరిగి ఉంటుందని, కొంతకాలం వేచి చూడాలని శాస్త్రవేత్తలు రైతుకు సూచించారు. వరి పంటలో బ్యాక్టీరియా, ఎండు తెగులు నివారణకు ఎకరానికి 400 గ్రాముల కాపర్ హైడ్రాకై ్సడ్, 60 గ్రాముల స్టేపీటోమైసిన్ సల్ఫై డ్ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏఓలు దీపక్ ఆనంద్, వినయ్, ఏఈఓ విజయ భాను పాల్గొన్నారు. వాలిపోయిన వరిపంటకరకగూడెం/పినపాక: గాలివానకు వరి పంట దెబ్బతిన్నది. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో కరకగూడెం, పినపాక మండలాల్లోని పద్మాపురం, జానంపేట, గోపాలరావుపేట గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. మరికొన్ని ప్రాంతాల్లో పొలాలు, చేలల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో రూ. లక్షల్లో పెట్టుబడి నష్టపోయినట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
- 
      
                   
                                 స్వామివారి సేవల్లోసముచితస్థానం..‘అందరి బంధువు రామయ్యపై భక్తితో విరాళాలు, వితరణలు చేశాం. స్వామివారి సేవల్లో సముచిత స్థానం, ప్రాధాన్యం కల్పించండి.’ అంటూ పలువురు దాతలు ఆలయ అధికారుల ఎదుట ఆవేదన చెందారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి, శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి, గోశాల, ఇతర అభివృద్ధి పనులకు ఏళ్లుగా సహకరిస్తున్న దాతలను బుధవారం సన్మానించారు. 2023లో అప్పటి ఈఓ రమాదేవి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టగా, అదే ఆనవాయితీని ప్రస్తుత ఈఓ దామోదర్రావు కొనసాగించారు. 1,340 మంది దాతలు ఉండగా, సన్మాన కార్యక్రమానికి 120 మంది కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. –భద్రాచలంప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి మారుతి సదనంలో జరిగిన కార్యక్రమంలో దాతలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దాతలు తమ అభిప్రాయాలను ఈఓ, వైదిక పెద్దల ముందు వెలిబుచ్చారు. దేవస్థానంలో దర్శనాల్లో ప్రొటోకాల్ అమలుపర్చాలని కోరారు. అంతరాలయంలో దర్శనానికి ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేవస్థానంలో ప్రధానమైన శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. దేవస్థానం కార్యాలయ ఆవరణలో దాతలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. బుధవారం సైతం దర్శనంలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, దాతలకు ఇదేనా అందే మర్యాద..? అని కొత్తగూడేనికి చెందిన ఓ మహిళా దాత ప్రశ్నించారు. దీంతో వైదిక పెద్దలు, ఆలయ అధికారులు ఆమెకు సర్ది చెప్పారు.–ఈవో దామోదర్రావుస్వామివార్ల సేవల్లో దాతలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆలయ ఈఓ కొల్లు దామోదర్రావు అన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అర్చకులు స్వామివార్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో దామోదర్ రావు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధిలో దాతల పాత్ర ఎనలేనిదని అన్నారు. శాశ్వత నిత్యాన్నదానం, గోశాల, బంగారు, వెండి వాకిలి ఏర్పాటు, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులన్నీ దాతల సహాయ సహకారాలతో పూర్తి చేయగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో దాతలకు ఆలయ అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు. దాతలకు దేవస్థానంలో ఎటువంటి లోటులేకుండా తగిన గౌరవ మర్యాదలను అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. దాతలందరికీ స్వామివారి అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రావణ్కుమార్, భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్, స్థానాచార్యులు స్థలశాయి, ప్రధాన అర్చకులు, పండితులు, అర్చకులు, దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వాలని దాతల సూచన
- 
      
                   
                                 మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించారు. నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు, రవాణా నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాధితులను గుర్తించి డీఅడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులను ప్రతీ నెల తనిఖీ చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఇంటర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్ సెర్చ్, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై పీఅండ్పీఎస్ కేసులు నమోదు చేస్తామని, రాబోయే రెండు వారాల్లో ఇది అమల్లోకి వస్తుందన్నారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, ఇంటర్మీడియట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు. విమానాశ్రయానికి స్థలసేకరణ.. జిల్లా కేంద్రంలో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం ఏర్పాటుకు స్థలసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం రాత్రి ఆయన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను కలెక్టరేట్లో కలిసి పలు అంశాలను విన్నవించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కు, క్రీడా స్టేడియం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు లభించాయని, స్థలం సమస్య తలెత్తకుండా చొరవతీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. వేర్ హౌస్ కార్పొరేషన్ గౌడౌన్ల నిర్మాణంకోసం 10 ఎకరాల స్థలం మంజూరు చేయాలని, ఆటో నగర్ కోసం అందుబాటులో ఉన్న ఖాళీస్థలాలు కేటాయించాలని, కేంద్రీయ విద్యాలయను త్వరితగతిన ప్రారంభించాలని కోరినట్లు వివరించారు. రుణ బకాయిలు వసూలు చేయాలి సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: జిల్లాలో రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సెర్ప్ ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. లైవ్హుడ్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చేపలు, కౌజు పిట్టలు, మేకలు, నాటు కోళ్ల పెంపకం వంటి యూనిట్లను ఒకే షెడ్లో నిర్వహించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. సమగ్రత వ్యవసాయం ద్వారా రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు లాభం పొందవచ్చని అన్నారు. రాబోయే 15 రోజుల్లో ప్రతీ సీసీ మోడల్ యూనిట్లను స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకు జిల్లా వ్యాప్తంగా 100 కొర్ర మీను చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు మహిళా సమాఖ్య గ్రూపులను గుర్తించి రుణ సహాయం కల్పించాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, సెర్ప్ ఏపీఎంలు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. కొత్తగూడెంఅర్బన్/చుంచుపల్లి: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. బుధవారం కొత్తగూడెం బాబు క్యాంపు ప్రాంతంలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం ద్వారా ప్రతీ పాఠశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మాత, శిశు ఆరోగ్య పరిరక్షణ, పిల్లలలో మానసిక, శారీరక వికాసం సాధించేందుకు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని భవిత కేంద్రం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్
- 
      
                   
                                 జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణజూలూరుపాడు: జూలూరుపాడు అటవీరేంజ్ పరిధి గుండెపుడి అటవీ బీట్లోని ప్లాంటేషన్లో జామాయిల్ చెట్లను ఓవ్యక్తినరికిన ఘటనపైటాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవా రం విచారణ చేపట్టారు. అనంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జామాయిల్ చెట్లను నరికి ఆయిల్పామ్ తోటలో డంప్ చేశాడు. ఈ విషయం తెలియడంతో గుండెపుడి డీఆర్ఓ నసూర్బీ తనిఖీలు చేపట్టి 84 జామాయిల్ కర్రలు స్వాధీనం చేసుకున్నారు. ఆపై డీఎఫ్ఓ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ డీఆర్ఓ సలోజ బృందం ప్లాంటేషన్లో తనిఖీలు నిర్వహించి చెట్ల మొదళ్లు, కొలతలు నమోదు చేసుకున్నారు. తనిఖీల్లోఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు,డీఆర్ఓ నసూర్బీ, టాస్క్ఫోర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. పశ ువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు కూసుమంచి: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అక్రమంగా పశువులను మినీ వ్యాన్లలో తరలిస్తున్న ఇద్దరిపై కూసుమంచి పోలీసులు కేసునమోదు చేశా రు. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టు గూడెంనకు చెందిన ఆవుల కృష్ణయ్య, ఎల్లయ్య రెండు మినీ వ్యాన్లలో పశువులను సూర్యాపేట సంతకు తరలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కూ సుమంచి సమీపాన చేపట్టిన తనిఖీల్లో పోలీసులు పరిశీలించగా పశువులను ఒకదానిపై ఒకటి వేసి తాళ్లతో బంధించినట్లు గుర్తించారు. వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించి కృష్ణయ్య, ఎల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. మట్టి తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లు సీజ్ జూలూరుపాడు: సీతారామ కెనాల్ మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. మండలంలోని రాజారావుపేట సమీపం నుంచి సీతారామ కాల్వ మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మట్టిని జేసీబీతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తుండగా అడ్డుకున్నారు. జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించే క్రమాన జేసీబీ యజమాని అడ్డుకున్నాడు. అంతేకాక జేసీబీ తాళాలను సీతారామ కెనాల్లోకి విసిరివేశాడు. దీంతో జేసీబీ అక్కడే ఆగిపోగా, రెండు ట్రాక్టర్లను పోలీసులు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
- 
      
                   
                                 మార్కెట్లలో హెల్ప్డెస్క్లుసీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెట్ కార్యదర్శులతో ఖమ్మంలో మంగళవారం ఆమె సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 8 – 12 శాతం తేమ కలిగిన పత్తినే తీసుకొచ్చేలా రైతుల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాక ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేలా మార్కెట్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీఎం ఉప్పల శ్రీనివాస్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు ఎంఏ.అలీం, నరేందర్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో ప్రతిభదుమ్మగూడెం: మండలంలోని సీతారాంపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల 11వ తరగతి విద్యార్థిని కీర్తన రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 17, 18వ తేదీల్లో కల్చరల్ ఫెస్ట్ జరగగా, లోకల్ క్రాప్ట్స్ విభాగంలో కీర్తన రాష్ట్రస్థాయిలో సత్తా చాగింది. మొదటి స్థానంలో నిలిచిన ఆమెను ప్రిన్సిపాల్ విజేందర్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నీరజ్ యాదవ్, ఆర్ట్ టీచర్ విజయ్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ల జేఏసీ కమిటీ హన్మకొండ: ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆర్టిజన్ల జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్పీడీసీఎల్ కమిటీ కన్వీనర్లుగా శ్రీకాంత్, డి.రవీందర్రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం వెల్లడించారు. అలాగే, కోకన్వీనర్గా జి.అనంతరెడ్డి, కోచైర్మన్గా టి.తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్గా మహేందర్గౌడ్, కోశాధికారులుగా అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు. పోస్ట్మాస్టర్ ఫొటోతో స్టాంప్ దుమ్ముగూడెం: మండలంలోని చెరుపల్లి గ్రామ వాసి, గతంలో పోస్ట్మాస్టర్గా విధులు నిర్వర్తించిన ఆనందం రాజు 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫొటోతో పోస్టల్ స్టాంప్ రూ పొందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా స్థానికులు ‘మై ఫొటో – మై స్టాంప్’సేవల కింద రూ.5 విలువైన స్టాంప్ చేయించారు. ఈ స్టాంప్ను హైదరాబాద్కు చెందిన అధికారి కొడాలి రాజేంద్రబాబు మంగళవారం గ్రామంలో విడుదల చేశారు. అనంతరం ఆల్ ఇండి యా పంచాయత్ పరిషత్ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ విజయ్వర్మ ఆధ్వర్యాన పాకలపాటి జనహితం ఫౌండేషన్కు రూ.80వేలు, ఎస్సె స్సీ, ఇంటర్లో ప్రతిభావంతులకు రూ.5వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అలాగే, కొత్తపల్లి విద్యార్థి అపక శ్రీనిధి ఎంబీబీఎస్ సీటు సాధించడంతో రూ.10వేల చెక్కు అందచేశారు. కార్యక్రమంలో ముర్రం వీరభద్రం, దాట్ల వీరభద్రరాజు, కదులూరి హరి, కల్లూరి కొర్రాజు, కొర్సా మారయ్య, రేసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సు నిలిపివేత దుమ్ముగూడెం: చర్ల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను మండలంలోని లక్ష్మీనగరంలో స్థానికులు మంగళవారం రాత్రి నిలిపేశారు. ఈనెల 16న హైదరాబాద్ నుంచి చర్లకు వస్తున్న ప్రైవేట్ బస్సు చిట్యాల – నకిరేకల్ మధ్య ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో పలువురికి గాయలయ్యాయి. దీంతో డ్రైవర్ బస్సును వదిలేసి వెళ్లిపోయాడు. క్షతగాత్రులను ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులే చికిత్స చేయించి మరో బస్సులో పంపించారు. ఈ మేరకు గాయపడిన లక్ష్మీనగరం గ్రామానికి చెందిన మద్దుకూరి సంకీర్తన తదితరులు మరుసటి రోజు ట్రావెల్స్ సిబ్బందికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం అదే ట్రావల్స్ బస్సు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ మేరకు ప్రయాణికులు ఇబ్బంది పడగా, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నదమ్ముల కుటుంబాల్లో ఘర్షణ ఇల్లెందురూరల్: చేను వద్ద నీటి పారకం విషయమై అన్నదమ్ముల కుటుంబాల్లో చోటు చేసుకున్న వివాదం ఘర్షణ దాడికి దారితీసింది. మండలంలోని మస్సివాగుకు చెందిన గుగులోత్ లాల్సింగ్ నీటి పారకంలో వంతు ప్రకారం మంగళవారం చేనుకు నీళ్లు పెట్టుకుంటుండగా ఆయన వదిన శైలజ, ఆమె తండ్రి మల్సూర్ అసభ్యంగా దూషించారు. ఆపై ఇంటి వద్ద తనపై రాళ్లతో దాడి చేయగా తలకు గాయాలయ్యాయని లాల్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- 
      
                   
                                 సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ప్రామాణికం ● విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దుఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పచ్చజెండా ఊపింది. జిన్నింగ్ మిల్లుల ఎంపిక, టెండర్ల నిర్వహణ పూర్తి కావడంతో కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈమేరకు తిరుమలాయపాలెం మండలం గోల్తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్లో తొలి కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా పత్తి క్వింటాకు గరిష్టంగా రూ. 8,110 ధర నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ, నాణ్యత పేరిట రూ.6,500కు మించి చెల్లించడం లేదు. ఇంతలోనే సీసీఐ కేంద్రాలకు ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు ముందుకు రాకపోతే ప్రభుత్వం జోక్యంతో కొనుగోళ్లకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 4.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ పంట ద్వారా 50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 14 మిల్లులకు అనుమతి పత్తి కొనుగోళ్లకు ఖమ్మం జిల్లాలో జీఆర్ఆర్ ఇండస్ట్రీస్(వెంకటగిరి), శ్రీసాయి బాలాజీ జిన్నింగ్ మిల్(తల్లంపాడు), అమరావతి టెక్స్టైల్స్(దెందుకూరు), మంజీత్ కాటన్ మిల్స్(మాటూరు), శ్రీ శివగణేష్ కాటన్ ఇండస్ట్రీస్(ఇల్లెందులపాడు), స్టాపిలచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్(తల్లాడ), జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్(పొన్నెకల్), శ్రీ భాగ్యలక్ష్మీ ఇండస్ట్రీస్(గోల్ తండా)ను ఎంపిక చేశారు. భద్రాద్రి జిల్లాలోని శ్రీరామా కాటన్ ఇండస్ట్రీస్(అశ్వాపురం), అనూశ్రీ కాటన్ ఇండస్ట్రీ(బూర్గంపాడు), మంజీత్ జిన్నింగ్ మిల్స్(కొత్తగూడెం), లక్ష్మీ కొటెక్స్ జిన్నింగ్ మిల్(కారేపల్లి)లో కొనుగోళ్లు చేపడుతారు. ఇవి కాక బూర్గంపాడు మార్కెట్ పరిధి రెండు జిన్నింగ్ మిల్లుల్లోనూ కొన్నాళ్ల తర్వాత కొనుగోళ్లు మొదలవుతాయి. ఎకరాకు 12 క్వింటాళ్లు పంట దిగుబడిని అంచనా వేశాక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అవకాశం కల్పించారు. అయితే, ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. ఎకరాకు ఐదు క్వింటాళ్లు మించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కాగా, వ్యవసాయ శాఖ పోర్టల్లో పంట నమోదై ఉండడమే కాక ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే విక్రయానికి అనుమతిస్తారు. కాగా, పత్తి విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్) విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది కౌలు రైతుల కోసం అమలుచేస్తే, కొందరు ఉద్యోగులు, వ్యాపారులు ఏకమై రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి టీఆర్ పేరిట జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేసి పట్టాదారు పేరిట పంట నమోదైన వివరాలు, పట్టాదారు అనుమతితో కౌలు రైతు పంట విక్రయానికి వీలు కల్పించే బాధ్యత ఏఈఓలకు అప్పగించారు.
- 
      
                   
                                 విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిపాల్వంచరూరల్: ముత్యాలమ్మ గుడిలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్ క్లియరెన్స్ తీసుకోకుండా ఓ ఎలక్ట్రీషియన్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. అక్కడి నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై మృతిచెండటంతో దీపావళి రోజే ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు.. పాండురంగాపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ మల్లంసాంబశివరావు (46) సోమవారం వీధిలోని ముత్యాలమ్మతల్లి ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్తంభం ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్షాక్ తగిలింది. దీంతో స్తంభం మీది నుంచి కిందపడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను తొలుత పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్ఐ.సురేశ్ తెలిపారు. మేడారంలో నాగినేనిప్రోలు వాసి మృతి బూర్గంపాడు/ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలో దైవదర్శనానికి వెళ్లిన బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు ఎస్సీ కాలనీ యువకుడు అక్కడి జంపన్నవాగులో నీట మునిగి మృతి చెందాడు. కాలనీకి చెందిన నలుగురు యువకులు కొద్దిరోజుల క్రితం మేడారంలో దైవ దర్శనానికి వెళ్లారు. అక్కడ వారు ఊరట్టం కాజ్వే వద్ద జంపన్నవాగులో స్నానం చేస్తుండగా దానూరి సాయిగౌతమ్(17) ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆయన కోసం గాలించినా ఫలితం లేక కుటుంబీకులకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చేపట్టడంతో ఆదివారం కాజ్వే వద్ద జంపన్నవాగులో గౌతమ్ మృతదేహం లభ్యమైంది. వనదేవతల దర్శనానికి వెళ్లిన గౌతమ్.. విగతజీవిగా చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, ఘటనపై ఆయన సోదరుడు సాయిగణేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కండక్టర్పై దాడి భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపో కండక్టర్ ఉమామహేశ్వరరావుపై మహిళా ప్రయాణికుల కు టుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం నుంచి భద్రాచలం వస్తుండగా పాల్వంచ వద్ద ఓ ఇద్దరు మహి ళా ప్రయాణికులు బస్సు ఎక్కారు. కూర్చోవడానికి ఖాళీ లేదని చెప్పినందుకు సదరు మహిళా ప్రయాణికు లు దిగిపోయారు. తర్వాత ఆ మహిళా ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం డిపో వద్దకు వచ్చి ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని పట్టుకొని, వారిపై కేసు నమో దు చేయాలని మంగళవారం సాయంత్రం ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోటార్ సైకిల్, సెల్ఫోన్ చోరీ పాల్వంచ: పట్టణంలోని కుంటినాగూలగూడెం సమీపంలోని వెంకటేశ్వర క్రాకర్స్ వద్ద టపాసులు కొనేందుకు వచ్చిన గట్టాయిగూడెంనకు చెందిన ఉదయ్ మోటార్ సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. టపాసులు కొనుగోలు చేసి వచ్చేసరికి బైక్ కనిపించక పోడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. కాగా, పట్టణంలోని శాసీ్త్రరోడ్లో బియ్యం దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు నటించి అక్కడి గుమస్తాకు చెందిన ఐఫోన్ను చోరీ చేశాడు. చోరీ చేసిన తీరును సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- 
      
                   
                                 ‘మోడల్’ గ్రామాలకుఖమ్మంవ్యవసాయం: మోడల్ సోలార్ గ్రామాలకు నిర్దేశించినట్లుగా రూ.కోటి నజరానా అందించేలా అధికారులు సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన, పురుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ(ఎంఎన్ఆర్ఈ) ఆధ్వర్యాన అమలుచేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(పీఎం–ఎస్జీఎంబీవై) పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేశారు. విద్యుత్ సమస్యను అధిగమించడం, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రతీ జిల్లాలో 5వేల జనాభా కలిగిన గ్రామాలకు కేంద్రం ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అధిక ప్లాంట్లు కలి గిన గ్రామాలను పరిగణనలోకి తీసుకుంటా మని వెల్లడించింది. రూ.కోటి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ పోటీలో ఖమ్మం జిల్లా నుంచి ఎని మిది, భద్రాద్రిజిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరకు ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, భద్రాద్రిజిల్లా నుంచి భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచి రూ.కోటి చొప్పున నజరానాకు అర్హత సాధించాయి. దీంతో జిల్లా స్థాయి కమిటీల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆపై రూ.కోటి చొప్పున మంజూరయ్యే నిధులను ఆయా గ్రామాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర అవసరాలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తామని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్కుమార్ తెలిపారు. గ్రామం సోలార్ ప్లాంట్లు సామర్థ్యం భద్రాచలం 208 2,098.15 మందలపల్లి 15 110.09 సారపాక 19 109.1 దమ్మపేట 16 85.4 అశ్వాపురం 14 73.82 ముల్కలపల్లి 02 55 చండ్రుగొండ 02 50 చర్ల 11 49.1 బర్గంపాడు 03 31 సిమితి సింగారం 07 29 నాగినేనిప్రోలు 01 04 రుద్రంపూర్ 01 03 బాబూక్యాంప్ –– –– కూనవరం –– ––
- 
      
                   
                                 పోలీసుల ఆకస్మిక తనిఖీలుచర్ల/ఇల్లెందు/ఇల్లెందు రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 23వరకు నిరసన వారం, 24న దేశవ్యాప్త బంద్ పాటించాలని పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చర్ల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ సెంటర్, పెట్రోల్బంక్ సెంటర్, లక్ష్మీకాలనీ, కలివేరు క్రాస్, ఆర్.కొత్తగూడెం, కుదునూరు తదితర గ్రామాల్లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్తో పాటు సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, ఇల్లెందు జగదాంబసెంటర్లో సీఐ సురేశ్ నేతృత్వంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాక ఇల్లెందు మండలంలోని ఇల్లెందు – గుండాల ప్రధాన రహదారిపై గుండాల సీఐ రవీందర్, కొవరారం ఎస్సై నాగుల్మీరా ఆధ్వర్యాన తనిఖీలు న చేపట్టి అనుమానితుల వివరాలు ఆరా తీశారు.మావోల బంద్ పిలుపుతో అప్రమత్తత
- 
      
                   
                                 సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనఖమ్మంరూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో రహదారుల నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కొండాపురం నుండి ముఠాపురం వరకు రూ.7.50కోట్లతో బ్రిడ్జి, పొన్నేకల్ నుండి కొండాపురం వరకు రూ.5.20కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే, పీహెచ్సీ నిర్మాణం, పెద్దకుంట చెరువు శాశ్వత మరమ్మతు పనులు చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తుండగా, తెల్లరేషన్కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాగా, మండలంలోని మద్దులపల్లిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. రూ.25కోట్లతో మూడు అంతస్తులు గా చేపడుతున్న నిర్మాణం తుది దశలో ఉందని తెలి పారు. డీఏఓ డి.పుల్లయ్య, ఆర్డీఓ నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 సింగరేణిలో టెండ‘రింగ్’● ఒకే సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు ● కొత్త కంపెనీలను పోటీలోకి రానివ్వని వైనం ● సంస్థ ఫారెస్ట్ విభాగంపై ఆరోపణలుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భూగర్భ గనుల్లో బొగ్గు వెలికి తీసినప్పుడు ఆ ప్రాంతంలో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ స్థలం కుంగుబాటుకు గురికాకుండా ఉండేందుకు కలప దుంగలను నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ ఏరియాలో యూకలిప్టస్(జామాయిల్) చెట్లను వందల ఎకరాల్లో సింగరేణి సంస్థ పెంచుతోంది. ఏపుగా పెరిగిన చెట్లను సంస్థ అవసరాల కోసం నరికి దుంగలుగా మారుస్తారు. డిమాండ్కు సరిపడా కలప సొంత ప్లాంటేషన్లలో లభ్యత లేకపోతే టెండర్ల ద్వారా బయట నుంచి తీసుకోవడం ఆనవాయితీ. ఈ పనులన్నీ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సింగరేణిలో ఫారెస్టు విభాగం ఉండగా.. ప్రధాన టెండర్లలో పోటీ నామ్ కే వాస్తేగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా... ఏదైనా పని చేసేందుకు వివిధ సంస్థలు పోటీ పడడం.. తద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పనులు చేయించుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. కేవలం ఒకే సంస్థ టెండర్ దాఖలు చేస్తే రద్దు చేసి మరోమారు పిలవడం అన్ని చోట్ల జరుగుతుంది. కానీ సింగరేణి ఫారెస్టు విభాగంలో ఈ స్ఫూర్తి కనిపించడం లేదు. ఏదో తప్పదు అన్నట్లుగా టెండర్లు పిలవడం, అందులో పేర్కొనే అర్హత నిబంధనలు అన్నీ ఒక కంపెనీ లేదా ఒక కాంట్రాక్టర్కు అనుగుణంగా ఉండేలా చూస్తున్నారనే ఆరోపణలు కొన్నేళ్లుగా వస్తున్నాయి. దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియలో కొత్త కంపెనీలు కూడా పోటీకి దిగుతున్నాయి. కానీ ఇందులో కనీసం నాలుగు కంపెనీలు వరుసగా పనులు దక్కించుకుంటున్నాయి. ఇదేమిటని ఆరా తీస్తే బడా కాంట్రాక్టరే రకరకాల పేర్లతో టెండర్లు వేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తద్వారా టెండర్ ప్రక్రియలో అనధికారిక రింగ్ జరుగుతుందనే విమర్శలు కొసాగుతున్నాయి. కొత్త వారు రాకుండా... రామగుండం ఏరియాలో అవసరాల దృష్ట్యా నిర్ణీత ప్రమాణాల ప్రకారం రెండు లక్షల కలప దుంగల కోసం ఇటీవల సింగరేణి ఫారెస్ట్ విభాగం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో పాల్గొనేందుకు పలు సంస్థలు చూపాయి. అయితే గతంలో లక్ష దుంగలకు పైగా సరఫరా చేసిన కంపెనీలే పాల్గొనేందుకు అర్హులు అంటూ నిబంధన చేర్చారు. ఈ కొత్త నిబంధన తమకు ప్రతికూలంగా మారిందని కొత్తగా టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధమైన సంస్థలు చెబుతున్నాయి. కొత్త వారు రాకుండా అడ్డుకోవ డం, పాత వారికి మేలు చేయాలనే తపనతో ‘లక్ష’ నిబంధనలు చేర్చారని విమర్శిస్తున్నారు. ఫారెస్టు విభాగంలో కొందరు అధికారులు కేవలం ఒక కాంట్రాక్టు సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని చెబుతున్నారు. తద్వారా ఏటా సంస్థకు రూ.కోట్లల్లో నష్టం జరుగుతోందనే ప్రచారం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి సంస్థ సొమ్ము పక్కదారి పట్టకుండా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.సింగరేణిలో కర్ర సేకరణకు నిబంధనల ప్రకారమే టెండర్లు నిర్వహించాం. ఇందులో పొందుపర్చిన అర్హతలు ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. కొన్నేళ్లుగా ఒకరికే కేటాయిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదు. దాఖలైన టెండర్లన్నీ పరిశీలించాక అర్హతల మేరకు అధికారుల ఆమోదంతో కేటాయిస్తున్నాం. తాజా టెండర్ల ఖరారుకు ఇంకా మూడు వారాలు పడుతుంది. – అభిలాష్, సింగరేణి ఫారెస్ట్ విభాగం మేనేజర్
- 
      
                   
                                 శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యంసూపర్బజార్(కొత్తగూడెం): శాంతిభద్రతలను పరి రక్షిస్తూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పడమే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొనియాడారు. పోలీసు అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం హేమచంద్రాపురంలోని హెడ్ క్వార్టర్స్లో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహశక్తులతో పోరాడి మరణించిన పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడంలో పోలీస్ శాఖ నిలుస్తోందని చెప్పారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని ప్రజల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. సంఘ విద్రోహశక్తులతో పోరాటంలోవీరమరణం పొందిన పోలీసుల త్యాగా లను స్మరించుకోవడం అందని బాధ్యత అని చెప్పా రు. అనంతరం ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులైన 191 మంది ఉద్యోగుల పేర్లను ఏఎస్పీ నరేందర్ చది వారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్, మల్లయ్యస్వామి, రవీందర్రెడ్డి, సతీష్ కుమార్, సత్యనారాయణ, లాల్బాబు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.పోలీస్ అమరవీరుల దినోత్సవంలో కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్రాజు
- 
      
                   
                                 స్వయం ఉపాధిపై దృష్టి సారించాలిములకలపల్లి: యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని, తద్వారా ఆర్థికంగా బలోపేతం కావొచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ములకలపల్లి మండలం రాజుపేట శివారులో చింతకాయల కుమారి, వెంకటేశ్వరరావు దంపతులు ఏర్పాటుచేసిన కౌజుపిట్టల కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా చేపలు, మేకలు, నాటుకోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వ రాయితీల ఆధారంగా మునగ, బంతి, వెదరు తోటల సాగుచేయాలని సూచించారు. ఈక్రమాన అక్కడ మేక పిల్లలను చూసిన కలెక్టర్... ఓ మేక బక్కగా ఉండడంతో మంచి ఆహారం సమకూర్చాలని ఇవ్వాలని తెలిపారు. నర్సరీల్లో బయోచార్ డంపింగ్ యార్డుల్లో తయారుచేస్తున్న బయోచార్ను ప్రయోగాత్మకంగా ప్రభుత్వ నర్సరీల్లో వినియోగించాలని కలెక్టర్ పాటిల్ ఆదేశించారు. పూసుగూడెం శివారు డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన బయోచార్ ప్లాంట్ ఆయన పరిశీలించారు. నరికేసిన చెట్ల కొమ్మలను ముక్కలుగా చేసి బయోచార్ యూనిట్లో మండించడం ద్వారా బొగ్గు తయారవుతుందని, ఆపై బొగ్గు పొడిగా చేసి ఎండిన ఆవుపేడ, మూత్రం కలపడం ద్వారా బయోచార్ తయారవుతుందని తెలిపారు. ఈ మిఽశ్రమాన్ని స్ప్రే చేయడం, మొక్కల మొదళ్లలో వేయడం ద్వారా సేంద్రియ ఎరువులా ఉపయోగపడుతుందని వివరించారు. డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్థార్ భూక్యా గనియా, ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ హుస్సేన్, ఏపీఎం రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్
- 
      
                   
                                 గిరిజనులకే తొలి ప్రాధాన్యతభద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న గిరిజన అభ్యుదయ భవనం, సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ కేటాయింపులో గిరిజనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఫంక్షన్ హాళ్లను మంగళవారం పరిశీలించిన ఆయన నిర్వహణ తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ నామమాత్రపు రుసుముతో వివాహది వేడుకలు, సభలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఆదివాసీ గిరిజనులకు ఇవ్వాలని ఆదేశించారు. గిరిజనులు లేకపోతే గిరిజనేతురులకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి, పార్కింగ్ సౌకర్యాలు కల్పించి రికార్డుల నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, డీఈ హరీష్, ఉద్యోగులు శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, పోశాలు పాల్గొన్నారు. గాయపడిన విద్యార్థికి చేయూత లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగిన గిరిజన విద్యార్థి వెలకం సంతోష్కు పీఓ రాహుల్ ఆర్థిక సాయం అందజేశారు. చికిత్స నిమిత్తం ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు అందజేశారు. ఏఓ సున్నం రాంబాబు, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి పాల్గొన్నారు.
- 
      
                   
                                 నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం● పారదర్శకత కోసం మరో అడుగు ● రెన్యూవల్ కాకపోతే సీఓపీల తొలగింపు ● ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 41 మంది సీఓపీలకు అనుమతి ● నవంబర్ 1 నుంచి ఆన్లైన్ విధానం ప్రారంభం ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత కోసం సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్లైన్ ద్వారానే స్టాంప్ వెండింగ్ అమలు చేస్తుండగా ఇప్పుడు కీలకమైన నోటరీ విధానాన్ని కూడా ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. తద్వారా నోటరీ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెరిగి, మోసాలకు తావు లేకుండా చేయొచ్చని ఆ శాఖాధికారులు భావిస్తున్నారు. లైసెన్స్ ఉంటేనే అనుమతి నోటరీ పబ్లిక్గా పనిచేసే న్యాయవాదుల విషయంలో స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ కలిగిన వారి వివరాలనే ఆన్లైన్లో నమోదు చేయిస్తోంది. తద్వారా చట్టపరమైన అర్హత కలిగిన వారే నోటరీ సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక న్యాయవాదుల వివరాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. నోటరీ పబ్లిక్లు జారీ చేసే ప్రతీ నోటరీని పోర్టల్లో నమోదు చేయడం ద్వారా కక్షిదారుడికి ఇచ్చే నోటరీ వివరాలు, సంతకాలు చేశాకే ఆన్లైన్లో పొందుపరుస్తారు. కక్షిదారుల వివరాలు, వారు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలు పక్కాగా ఉంటేనే నోటరీ జారీ చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వడం, రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపర్చడం ద్వారా భవిష్యత్లో వివాదాలు ఎదురైతే ప్రామాణికంగా ఉంటాయి. రెన్యూవల్ కాకపోతే రద్దు నోటరీ విధానంలో పాత, వినియోగంలో లేని లైసెన్స్లకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా తమ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ను రెన్యూవల్ చేసుకోని వారి లైసె న్సులు తొలగించే ప్రక్రియ మొదలైంది. సీఓపీ కలిగిన నోటరీ న్యాయవాదులు తమ లైసెన్సును ప్రతీ ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కాల పరిమితి ముగిసే ఆరు నెలల ముందే జిల్లా రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగిశాక రెన్యూవల్కు వస్తే సమస్యలు తలెత్తుతున్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సామాన్య ప్రజలకు మేలు ఆన్లైన్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నోటరీ ద్వారా ధ్రువీకరించిన పత్రాలు ఆన్లైన్లో నమోదు కానుండడంతో విశ్వసనీయత పెరుగుతుంది. అనధికార వ్యక్తులు నోటరీగా చెలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. నోటరీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొనసాగుతున్న సంస్కరణల్లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు.పారదర్శకత కోసం ప్రభుత్వం అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తోంది. అందులో భాగంగానే నోటరీలు కూడా ఆన్లైన్లో నమోదు చేశాకే కక్షిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే జిల్లాలో యాక్టివ్గా ఉండి, రెన్యూవల్ అయిన సీఓపీ లైసెన్సులను ఆన్లైన్ చేస్తున్నాం. ఈ విధానంపై న్యాయవాదులకు అవగాహన కల్పిస్తున్నాం. –ఎం.రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ
- 
      
                   
                                 సిటిజన్ సర్వేలో పాల్గొనండిసూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉన్నందున ప్రజలు www. telangana.gov.in /telanganarising వెబ్సైట్ ద్వారా తమ సలహాలు ఇవ్వాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు భద్రాచలంటౌన్: గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అవసరమైన పుస్తకాలను భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట అందజేశారు. జేఈఈ, నీట్తో పాటు హోటల్ మేనేజ్మెంట్ పరీక్షలకు సిద్ధం కావడానికి సరైన పుస్తకాలు లేవని భద్రాచలం గిరిజన కళాశాల విద్యార్థులు ఇటీవల సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వివిధ రకాల పుస్తకాలు తెప్పించి మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మ్రినాల్ శ్రేష్ట మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, తద్వారా మెరుగైన భవిష్యత్ సొంతమవుతుందని తెలిపారు.
- 
      
                   
                                 టపాసుల షాపుల వద్ద ఫైరింజనేది?కొత్తగూడెంటౌన్: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల వద్ద వ్యాపారులు నిబంధనలు పాటించడంలేదు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో 40 , రామవరంలో 6, రుద్రంపూర్లో 2 షాపులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రకాశం స్టేడియంలో 40 షాపులు ఏర్పాటు చేసినా అగ్నిమాపక ఫైరింజిన్ అందుబాటులో ఉంచలేదు. దుకాణాల ముందు డ్రమ్ములు ఏర్పాటు చేసినా వాటిలో నీళ్లు కూడా నింపలేదు. మున్సిపల్ ట్యాంకర్ మాత్రం ఒకటి అందుబాటులో ఉంచారు. మట్టి బకెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. షాపుల ఏర్పాటు, రక్షణ చర్యలను అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమీషన్లు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నామని, నిబంధనలు పాటించకపోయినా అధికారులు ప్రశ్నించరనే ధీమాతో వ్యాపారులు ఉన్నట్లు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. యజమానులు టపాసుల అమ్మకాలపై ఉంచిన శ్రద్ధను, అవి కొనేందుకు వచ్చే ప్రజలకు హాని జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చూపడం లేదని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి షాపుల వద్ద ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని, నిబంధనలను పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు పాటించని వ్యాపారులు
- 
      
                   
                                 రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరినస్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు కార్తీకమాసం సందర్భంగా శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. మొదటి సోమవారం 27న భస్మాభిషేకం, నదీహారతులు, నవంబర్ 3న చందనోత్సవం, 5న కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రుద్రాభి షేకం, సాయంత్రం నదీహారతులు, జ్వాలతోరణం జరుపుతామని పేర్కొన్నారు. 9న స్వామి వారి కల్యాణ మహోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం, 10న పుష్పోత్సవం, 17న ఏకా దశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, 16న గోదావరి నదీతీరంలో నదీ హారతులు ఉంటాయని వెల్లడించారు. ప్రతీ సోమవారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన, ఆకాశదీపోత్సవం, నీరాజన మంత్రపుష్పం, రోజూ సాయంత్రం 6 గంటల నుంచి సామవేద పండితులు డీఎస్ఎస్ సన్యాసి శర్మ కార్తీక పురాణ ప్రవచనాలు చేస్తారని వివరించారు. స్వామివారికి విరాళాలుహనుమకొండకు చెందిన సముద్రాల రామనరసింహాచార్యులు, సుజాత దేవిదంపతులు రామదాసు పీఠం మూలనిఽధికి రూ.1,00,101, సికింద్రాబాద్ కు చెందిన కడియాల సత్యనారాయణ, కమల దంపతులు రూ. లక్ష శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందించారు. దాతలకు ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్ రశీదులు అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచా ర్యులు పాల్గొన్నారు.22 నుంచి శివాలయంలో కార్తీక పూజలు
- 
      
                   
                                 ‘ఆయిల్ఫెడ్’ జీఓ ప్రతులు దహనందమ్మపేట: తెలంగాణ ఆయిల్ఫెడ్ ఇటీవల విడుదల చేసిన జీఓ ప్రతులను తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశా రు. ఆయిల్ఫెడ్కు సంబంధించిన పామాయిల్ ఫ్యాక్టరీలు, నర్సరీల్లోకి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రైతులు, మీడియా, ఇతరులు ప్రవేశించేందుకు వీలులేదంటూ జీఓ జారీ చేశారు. ఆ జీఓను వ్యతిరేకిస్తూ దమ్మపేటలో ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్యలు మాట్లాడుతూ ఆయిల్ఫెడ్ జారీ చేసిన జీఓ బ్రిటీష్ కాలం నాటి నిర్బంధ చట్టాలను గుర్తుకు తెస్తోందని అన్నారు. పామాయిల్ నర్సరీలో నాణ్యతలేని నకిలీ మొక్కలను పెంచి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీల్లో జరిగే అవినీతి, కుంభకోణాలు బయటకు రాకుండా ఉండేందుకే ఇలాంటి జీఓ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత వహించి జీఓ ఉపసంహరించుకోవాలని కోరారు. పామాయిల్ అత్యధికంగా పండుతున్న అశ్వారావుపేట నియోజకవర్గంలోనే రిఫైనరీ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, రావుల శోభన్బాబు, కొలికపోగు శ్రీనివాసరావు, యండ్రాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 బీసీ రిజర్వేషన్లపై తప్పుడు రాజకీయాలుకరకగూడెం: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కుర్నవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కాని పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పసలేని కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతోందని, కేవలం మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేయడానికే పాలన కొనసాగిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీబీఐ సంస్థలను మోదీ జేబు సంస్థలని విమర్శిస్తుంటే, మరోవైపు రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను తేటతెల్లం చేస్తుందన్నారు. కాగా, రానున్న రోజులన్నీ తమవేనని, పార్టీ కార్యకర్తలందరూ గ్రామాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి అక్కడే డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బైరిశెట్టి చిరంజీవి, రేగా సత్యనారాయణ, లక్క మధు, కొమరం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పీఎంశ్రీతో నాణ్యమైన విద్యకరకగూడెం: {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌS-ÌZÏ A™éÅ-«§ýl$-°MýS sñæM>²-ÌS-i™ø »Z«§ýl¯]l ^ólç³-sôæt…§ýl$MýS$ MóS…{§ýl {糿¶æ$-™èlÓ… "ï³-G… çÜ*PÌŒæÞ çœÆŠæ OÆð‡h…VŠæ C…yìlĶæ* (ï³-G…}) ç³£ýlMýS… AÐ]l$-Ë$ ^ólÝù¢…¨. hÌêÏ-ÌZ ï³G…} ç³£ýl-M>°MìS 24 ´ëuý‡-Ô>-ÌS-ÌS¯]l$ G…í³MýS ^ólĶæ$-V>, ™öÍ Ñyýl-™èl-ÌZ Mö™èl¢-VýS*-yðl…ÌZ° MýS*ÎOÌñ毌l, ^èl$…^èl$-ç³-ÍÏÌZ° »êº$M>Å…ç³# VýSÆŠḥÏÞ OòßæçÜ*PÌŒæ, ´ëÌS-Ó…^èl gñæyîlµ-òßæ-^Œl-G‹Ü »êÍMýSÌS ´ëuý‡-Ô>ÌS, º*Æý‡Y…´ë-yýl$-ÌZ° ÝëÆý‡-´ëMýS {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌS-ÌZÏ Ýë…MóS-†MýS »Z«§ýl¯]l A…§ýl$-»êr$-ÌZMìS Ð]l_a…¨. AVðSÃ…sôæ-çÙ¯Œl ÇĶæ*-Ísîæ (HBÆŠæ), Ð]lÆý‡$a-Ð]lÌŒæ ÇĶæ*-Ísîæ (ÒBÆŠæ)° Eç³-Äñæ*-W…_ ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ´ëu>-Ë$ »Z«¨-çÜ$¢-¯é²Æý‡$. A«§ýl$-¯é™èl¯]l Ýë…MóS-†MýS ç³Çgêq-¯]l…-™ø MýS*yìl¯]l ÑË$OÐðl¯]l ÝëÐ]l$-{W° OòÜ™èl… ´ëuý‡-Ô>-ÌS-ÌSMýS$ A…¨…-^éÆý‡$. ఆధునిక పరికరాలు పంపిణీ పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలకు సుమారు రూ.10లక్షల విలువైన అధునాతన ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ) పరికరాలతో కూడిన కిట్ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. కిట్లో ప్రత్యక్ష అనుభూతి ద్వారా అభ్యసనం కోసం ఏఆర్/వీఆర్ డివైజ్లు, హెడ్సెట్లు, స్మార్ట్ బోర్డులు, వీడియో రికార్డింగ్ ల్యాబ్లు, కంప్యూటర్, ట్రాలీ, టాబ్లెట్ పీసీ తదితర డిజిటల్ లెర్నింగ్ టూల్స్ అందజేశారు. వీటితో 21శతాబ్దంలో ముఖ్యమైన నైపుణ్యాలపైన సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలు విద్యార్థుల్లో పెంపొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో రసాయనిక చర్యలు, భౌగోళిక అంశాలు, శరీర నిర్మాణ శాస్త్రం తదితర అంశాల బోధనతోపాటు ఏఆర్, వీఆర్ హెడ్సెట్ల ద్వారా ఆయా అంశాలను ప్రత్యక్షంగా వీక్షించడం, అనుభూతి చెందడం సాధ్యమవుతోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆధునిక టెక్నాలజీతో కూడిన బోధన అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు నాణ్య మైన విద్య అందే అవకాశం ఉంది. ఇక అధునాతన పరికరాల వినియోగంపై ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. నూతన బోధనా పద్ధతుల ను అందిపుచ్చుకోవడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టింది. విద్యార్థులు చూసి నేర్చుకోవడం, అనుభవంతో అర్థం చేసుకోవడం’అనే కొత్త పద్ధతిలో బోధన సాగుతుంది. ఏఆర్, వీఆర్ పరికరాల ద్వారా బోధన పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెంచుతుంది. –నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పుస్తకాల్లో చదివిన దృగ్విషయాలను వీఆర్ హెడ్సెట్ ద్వారా కళ్లముందు చూస్తున్నాం. సైన్స్ పాఠంలో హృదయ నిర్మాణం, స్పందనలు త్రీడీలో చూడటం అద్భుతంగా ఉంది. అగ్నిపర్వతాల పాఠం చెప్పినప్పుడు వీఆర్ హెడ్సెట్ పెట్టుకుంటే నిజంగా లావా బయటకు వస్తున్నట్టే అనిపించింది. –తేజస్విని, 10Ð]l ™èlÆý‡-VýS† ѧéÅ-Ǧ°, VýSÆŠḥÏÞ OòßæçÜ*PÌŒæ, »êº$M>Å…ç³#
- 
      
                   
                                 వైభవంగా రుద్రహోమంపాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం పూజలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో ఆదివారం అమ్మవారి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. యా గశాలలో రుద్రహోమం పూజలు జరిపారు. ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన,గణపతి పూజ రుద్రహోమం చేశారు. చివరన పూర్ణాహు తి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రవికుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. దీపావళి వెలుగులు నింపాలికలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొత్తగూడెంఅర్బన్: ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే టపాసులు ఉపయోగించకుండా హరితదీపావళి జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నేటి గిరిజన దర్బార్ రద్దుభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవా రం జరిగే గిరిజన దర్బార్ను రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బిరాహుల్ ఆదివా రం ప్రకటనలో తెలిపారు. సోమవారం దీపావళి పండుగ కావడంతో దర్బార్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, ఐటడీఏ అధికారులు, సిబ్బందికి పీఓ దీపావళి శుభా కాంక్షలను తెలిపారు. రేగులతండా వాసికి జాతీయస్థాయి ర్యాంకుటేకులపల్లి: ఎయిమ్స్లో ఉద్యోగ నియామకాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలో టేకులపల్లి మండలం రేగులతండాకు చెందిన మహిళ అజ్మీర చంద్ర మూడో ర్యాంకు సాధించింది. సుజాతనగర్ మండలం సర్వారం పంచాయతీకి చెందిన అజ్మీర చందు, సాజి దంపతుల కుమార్తె చంద్ర పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. 2019లో టేకులపల్లి మండలం రేగులతండాకు చెందిన ఇస్లావత్ నరేందర్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ అనంతరం భర్త ప్రోత్సాహంతో పీజీ డిప్లొమా పూర్తి చేసింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ నిమ్స్లో ఈసీజీ టెక్నీషియన్గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షకు హాజరై ప్రతిభ చూపింది. ముంబైలోని అంధేరి ఈఎస్ఐసీ మోడల్ ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కై వసం చేసుకుంది. కిన్నెరసానిలో బోటు షికారుపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి వాతావరణం కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 498 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ కు రూ.28,355 ఆదాయం వచ్చింది. 290 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.17,360 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
- 
      
                   
                                 శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలిపాల్వంచ: ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే సీపీఐ జాతీయ శతాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.సారయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు జాతా ఏర్పాటు చేశామని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తూ, రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం నరహత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా మాట్లాడుతూ శత వసంతాల ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మిర్యాల రంగయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, నరాటి ప్రసాద్, వై.ఉదయ్ భాస్కర్, ఎస్డి.సలీం, సలిగంటి శ్రీనివాస్, రావులపల్లి రవికుమార్, చంద్ర నరేంద్రకుమార్, వీరస్వామి, వెంకటేశ్వరరావు, ఎల్లయ్య, శంకర్, మురళి, సమలయ్య, దస్రు, నాగయ్య, రాహుల్, ఫహీం తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- 
      
                   
                                 రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడిగా లక్కినేనికొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాదల ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాధ్యులు ఎర్రపాటి కృష్ణ, సాధిక్ పాషా, అక్కినేని వెంకటదుర్గారావు, యెర్రా కామేష్, చిన్ని కృష్ణ, మారపాక రమేష్ అంబటి రమేష్, సామంత్, వడ్లకొండ హారిప్రసాత్, జె గోపికృష్ణ తదితరులు అభినందనలు లక్కినేనికి అభినందనలు తెలిపారు. ‘మద్యం’ దరఖాస్తుల గడువు పెంపుకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపా రు. శనివారం బంద్ జరిగిన నేపథ్యంలో డీడీలు తీయలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయగా, గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో 27న మద్యం షాపుల డ్రా తీస్తామని తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు 3,799 దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ. 113.97 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. గడువు పెరిగిన నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
- 
      
                   
                                 అర్ధరాత్రి ఏసీబీ సోదాలు● అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు ● లెక్కకు మించి ఉన్న నగదు స్వాధీనం ● రికార్డులను వెంట తీసుకెళ్లిన అధికారులు పాల్వంచరూరల్/అశ్వారావుపేట/పెనుబల్లి: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఉమ్మడి జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని సోదాలు జరిపారు. పాల్వంచ మండలం జగన్నాథపురం, నాగారం కాలనీ గ్రామాల మధ్య బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న చెక్పోస్టులో దాడులు నిర్వహించారు. కంప్యూటర్ డేటా, రికార్డులతోపాటు చెక్పోస్టులోఉన్న అధికారి, సిబ్బంది సెల్ఫోన్లను కూడా తనిఖీ చేశారు. ఓవర్లోడ్ ఫైన్, ట్యాక్స్ కలెక్షన్ వంటి విషయాల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించి నట్లు డీఎస్పీ తెలిపారు. లెక్కలో లేని రూ.26 వేల నగదు లభించిందని పేర్కొన్నారు. దొరికిన నగదు వ్యవహారంపై ఎంవీఐ, సిబ్బందిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం. కాగా ఇదే చెక్ పోస్టులో గతేడాది ఆగస్టులో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట ఆర్టీఏ చెక్పోస్టులో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధి లోని ముత్తగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన సొమ్ము కంటే అదనంగా రూ.6,660 ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 రక్షణ సూత్రాలు పాటించాలిసింగరేణి(కొత్తగూడెం): ఓబీ డంప్లలో హాలేజీ రోడ్లపై రక్షణ సూత్రాలను పాటిస్తూ పనులు చేయాలని, సంబంధిత అఽధికారులు పర్యవేక్షించాలని సింగరేణి (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ఓసీలో చేపడుతున్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టి తొలగింపు పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అనుకున్న సమయానికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం.శాలేంరాజు, అధికారులు శ్రీరమేష్, రామచంద్ర మురళి, కిశోర్ పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు
- 
      
                   
                                 ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు 40 మంది బాలలు, 30 మంది బాలికలు హాజరయ్యారు. ఎంపికల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.రామారావు, బాస్కెట్బాల్ కోచ్లు పీ.వీ.రమణ, కృష్ణమూర్తి, రామారావు, భరత్చంద్ర పర్యవేక్షించారు. జట్లు ఇవే...అండర్–17 బాలుర బాస్కెట్బాల్ జట్టుకు అక్కి ఆయాన్, కె.స్నేహిత్, యశ్వంత్, హర్షవర్ధన్, సాత్విక్, సుమంత్, జెస్సు కిరణ్, చరణ్, సూర్య, గౌతమ్ సాహూ, ఎం.సాకేత్, రేహాన్, రైసింగ్, ఎస్.సాకేత్, అభినవ్, విశ్వతేజ, చత్రపతి శివాజీ, ఎండీ.గౌస్ అస్లాం ఎంపియ్యారు. అలాగే, బాలికల జట్టులో పి.అఖిల, రిశివశ్రీ, పూనం హన్సీ, సహస్ర, ఓంకారుణ్య, ఆయుషాన్ని, కీర్తి స్వప్నిక, తమన్ వి.తమరిత, చందనశ్రీ, దీక్షిత, యక్షిత, సాత్విక, ధతి, మనస్విని, కీర్తన, బి.హరిణి, కె.రితికాశాస్త్ర, కె.గ్రేస్కు స్థానం దక్కింది. అండర్–19 బ్యాడ్మింటన్, కరాటే జట్లు.. ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను కోచ్లు జి.రాము, గోపతి సైదులు ఎస్.కే.ఖాసీం, ఎం.బాబు, ఎండీ. మహహబూబ్, ఎం.సురేష్, హరీష్, ఎం.సందేష్ పర్యవేక్షించగా జట్ల వివరాలను అండర్–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం ప్రకటించారు. అండర్–19 బ్యాడ్మింటన్ బాలుర జట్టుకు ఎన్.నవీన్ ఉదయ్, ఎం.రాజీవ్, డి.నవీన్, ఎ.అరవింద్, జి.నవదీప్, బాలికల జట్టులో బి.ధరణి ప్రియ, ఎ.రష్మీ, కె.హెమీమా, ఎస్.గాయత్రి, జి.మహాలక్ష్మి స్థానం దక్కించుకున్నారు. అలాగే, కరాటే జట్టులో వివిధ కేటగీరీలకు గాను కె.అరుణతేజ్, డి.గౌరీశంకర్, కె.హర్షతేజ, కె.గణేష్, షాహిద్, ఎం.డీ. అసదుద్దీన్, ఎస్.కే.రియాన్, ఎం.లాస్యశ్రీ, వి.లక్ష్మీశ్రావణి, బి.సహస్రసేన్, ఎం.డీ.హఫషాజబీన్, కె.నిఖిత ఎంపికయ్యారు. జీపీ కార్మికులను పర్మనెంట్ చేయాలి ములకలపల్లి: మల్టీపర్పస్ విధానంలో చాలాఏళ్లుగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ములకలపల్లి మహాసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. తొలుత సీనియర్ నాయకుడు చిక్కుల శ్రీను సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. జీపీ కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సంఘ జిల్లా కార్యదర్శి ఏ.జే. రమేశ్ అన్నారు. సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, కన్వీనర్లు నిమ్మల మధు, రఘు, యాదగిరి, వెంకటప్పయ్య, చిక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 26న ‘సింగరేణి’ జాబ్మేళాసత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున గ్రామంలో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే, సైలో బంకర్ నుంచి వాయు కాలుష్యం వెలువడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, చల సాని సాంబశివరావు, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు పాల్గొన్నారు.
- 
      
                   
                                 హైవే సర్వేను అడ్డుకున్న రైతులుఖమ్మంరూరల్: నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు. మార్కెట్ ధర కంటే మూడింతలు రెట్టింపు పరిహారం చెల్లిస్తేనే భూమి ఇస్తామని తెలిపారు. రైతుల ఆందోళనతో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు వెనుదిరిగారు. అనంతరం రైతులతో రెవెన్యూ అధికారులు చర్చించగా, పరిహారంపై తేల్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు వేములపల్లి సుధీర్, రాధాకృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, అనంతిని శ్రీనివాస్, శ్రీధర్, రఘు, పాటి వెంకటయ్య, ఉపేందర్రావు, రంగారావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- 
      
                   
                                 కారులో జర్నీ.. స్టార్ హోటళ్లలో బస● 20 కేసుల్లో నిందితుడిగా హైటెక్ దొంగ ● వివరాలు వెల్లడించిన ఖమ్మం ఏసీపీ రమణమూర్తి ఖమ్మంఅర్బన్: యుక్త వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయి చిన్నచిన్న పనులు చేస్తే వచ్చే డబ్బుతో సంతృప్తి లభించలేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న సదరు వ్యక్తి పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మార్చుకోలేదు. చోరీసొత్తుతో కొన్న కారులోనే దొంగతనాలకు వెళ్లే ఆ నిందితుడు ఫైవ్స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవనం సాగి స్తుండగా ఖమ్మంలో పోలీసులకు పట్టుబడ్డా డు. ఈ మేరకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. గుంటూరు నుంచి హైదరాబాద్కు.. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శ్యామ్రిచర్డ్ 17 ఏళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయాడు. హైదరాబాద్లోని ఓ జిరాక్స్ సెంటర్లో పనికి కుదిరినా వచ్చే డబ్బు సరిపోక దొంగతనాలు మొదలుపెట్టాడు. అలా హైదరాబాద్లోని ఎల్బీనగర్, సరూర్నగర్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, జీడి మెట్ల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవాడు. ఫలితంగా పోలీసులకు పట్టుబడి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా తీరు మార్చుకోలేదు. జిల్లాలోని ఖానాపురం హవేలీ, ఖమ్మం – 1, 2, 3 టౌన్తో పాటు రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఇళ్లలో చోరీ చేశాడు. శుక్రవారం సాయంత్రం ఖమ్మంఅర్బన్ పోలీసులు ఖమ్మం – వైరా రహదారిపై వాహన తనిఖీలు చేపడుతుండగా కారులో వెళ్తున్న వంశీకృష్ణ వివరాలు ఆరా తీశారు. దీంతో చోరీల విషయం బయటపడింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించడంతో 452 గ్రాముల బంగారు నగలు (ప్రస్తుత విలువ రూ.51 లక్షలు), చోరీ సొమ్ముతో కొన్న ఎంజీ ఆస్టర్ కారు (రూ.15 లక్షలు) కలిపి రూ.66 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, చోరీ సొత్తును ఎప్పటికప్పుడు అమ్మేసే వంశీకృష్ణ ఆ డబ్బుతో బెంగళూరు, గోవా, హైదరాబాద్ నగరాల్లోని ఫైవ్స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, ఎస్ఐ డి.శ్రావణ్కుమార్, సిబ్బంది వి.బాబు, వి.హరికృష్ణను ఏసీపీ అభినందించారు.
- 
      
                   
                                 అక్రమంగా మట్టి తవ్వకాలుటేకులపల్లి: మండలంలోని తొమ్మిదోమైలుతండా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు వెనకాల పార్కు సమీపంలో ఉన్న గుట్ట మట్టి తవ్వకాలతో కరిగిపోతోంది. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. నాలుగు నెలల నుంచి యథేచ్ఛగా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. మట్టితోలుతున్న ట్రాక్టర్లను మైనర్ బాలురు నడుపుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడుపుతుండగా, అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆదాయానికి గండికొడుతూ, గుట్ట మట్టిని స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- 
      
                   
                                 యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలిమణుగూరు టౌన్: బొగ్గు, ఓబీ వెలికితీతలో యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమలరావు అన్నారు. శనివారం మణుగూరులో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి పీకేఓసీ–2, 4 గనులను వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీహెచ్పీ వరకు బెల్ట్ కన్వేయర్ సిస్టం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, శ్రీనివాసచారి, వెంకట రామారావు, వీరభద్రరావు, శ్రీనివాస్, రమేశ్, వీరభద్రుడు, మధన్నాయక్, బైరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు
- 
      
                    కమ్మేసిన పొగమంచుకరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు కమ్మేస్తోంది. పచ్చని పొలాలపై కమ్ముకుని ప్రకృతి రమణీయతను చాటుతోంది. సమీపంలోకి వచ్చేవరకు రహదారులపై వాహనాలు కనిపించడంలేదు. శనివారం కరకగూడెం ప్రధాన రహదారిపై, పొలాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. పాఠశాలకు శాశ్వత భవనం నిర్మిస్తాంఅసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ పాల్వంచరూరల్: పూరిపాకలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామపంచాయతీ ఆదివాసీల నివాసప్రాంతమైన కొయ్యగట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాంమూర్తి, విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్లు ఎన్.సతీష్కుమార్, ఎస్కె సైదులు పాల్గొన్నారు. రోటరీ సీఎస్సార్ అవార్డు ప్రదానంపాల్వంచ: రోటరీ ఇండియా నేషనల్ సీఎస్ఆర్ అవార్డ్–2025 అవార్డ్ను పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ అందుకుంది. ఈ నెల 17న బెంగళూరు చాంచారి పెవిలియన్ వేదికగా జరిగిన రోటరీ ఇండియా నేషనల్ సీఎసార్ అవార్డ్స్ రీజియన్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఉమారెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎల్వి.శరత్ బాబు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ విఎస్.రాజు, జనరల్ మేనేజర్(సీఎస్ఆర్) ఎంజీఎం ప్రసాద్లు అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, జీవనోపాధులు, ఇతర కార్యక్రమాల ద్వారా సామాజిక అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు అందించారని తెలిపారు. గర్భిణి కడుపులో శిశువు మృతి భద్రాచలంఅర్బన్: గర్భిణి కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పతి ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. భద్రాచలంకు చెందిన ప్రవీణ్ కుమార్ – ఉషశ్రీకి మూడేళ్ల క్రితం వివాహం జరగగా ఆమె కొద్దినెలల క్రితం గర్భం దాల్చింది. గత మూడు నెలలుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తుంటే శిశువు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఈ నెల ప్రవసం జరుగుతుందని చెప్పగా, శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉషశ్రీకి కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు నర్సులు పరీక్షలు నిర్వహించాక రాత్రి 7గంటలకు వైద్యురాలు వచ్చి పరిస్థితి విషమించిందంటూ ఆపరేషన్ చేసి మృతి శిశువును బయటకు తీశారు. ఇంకా సమయం గడిస్తే తల్లి పరిస్థితి కూడా విషమించేదని, వైద్యురాలు, నర్సుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని ఉషశ్రీ భర్త ప్రవీణ్కుమార్ ఆరోపించాడు. ఈమేరకు ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్ బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్కే నారాయణ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. కాగా, నారాయణ ప్రస్తుతం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.


