Bhadradri District News
-
‘ఏకలవ్య’ సిద్ధం!
నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ములకలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణం పూర్తయింది.8లో●మూగజీవాలు జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వడదెబ్బ బారిన పడకుండా తగిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఉత్పాదక శక్తిని రక్షించినట్లవుతుందని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ తెలిపారు. ఈమేరకు ఆయన ఇచ్చిన సూచనలిలా.. ●అధిక వేడి, గాలి ప్రసరణ సరిగా లేకపోవటం, షెడ్లలో కిక్కిరిసి ఉంచడం, నీటి సౌకర్యం సరిగ్గా లేక పశువులు, జీవాలు వడదెబ్బకు గురవుతాయి. తద్వారా నీరసమై జీర్ణక్రియ తగ్గి ఆకలి మందగించి ఉత్పత్తి పడిపోతుంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి తగ్గి, చూడి పశువులకు గర్భస్రావమయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిండి పదార్థాలు గంజి, జావ వంటివి పశువులకు ఆహారంగా ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం పచ్చిగడ్డి, రాత్రికి ఎండుగడ్డి ఇవ్వాలి. పాడి పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వటం మంచిది. మేతకు ఉదయం, సాయంత్రమే తీసుకెళ్లాలి. వ్యాధులు దరిచేరకుండా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాక్సిన్లు వేయించాలి. పశువులకు మంచి, చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురైన పశువులను చల్లని గాలివచ్చే ప్రదేశంలోకి చేర్చి శరీర ఉష్ణోగ్రత తగ్గేలా పలుసార్లు నీటితో కడగాలి. తల, నుదుటిపై చల్లని గోనె సంచి కప్పాలి. ఆపై పశువైద్యులను సంప్రదించాలి. -
ముందు జాగ్రత్త్తే మందు
ఉమ్మడి జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఎండలు ● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం ● వాహనాలు, మొక్కల సంరక్షణా కీలకమే..●వాహనాల నిర్వహణలో అప్రమత్తత జీవన యానంలో వాహనాల వినియోగం కీలకంగా మారింది. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యాన వాహనదారులు జాగ్రత్తలు పాటించాల ని మెకానిక్లు సూచిస్తున్నారు. ఖమ్మంకు చెందిన మెకానిక్ ఎం.రామాచారి ఇచ్చిన సూచనలు ఇలా.. ●బైక్లు, కార్లే కాక ఎలక్ట్రికల్ వాహనాలను ఎండ సమయంలో వినియోగించినప్పుడు టైరు, ట్యూబ్లు చూసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ చేయించొద్దు. నిర్ణీత వ్యవధిలో ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు. ఇంజన్ ఎప్పుడూ చల్లగా ఉండేలా ప్రయాణం కొనసాగించాలి. రేడియేటర్ కూలింగ్ తనిఖీ చేసుకోవాలి. బ్యాటరీ వాహనాలు అటు ఫుల్, ఇటు జీరో చార్జింగ్ అయ్యే వరకు చూడొద్దు. పార్కింగ్ సమయాన నీడ ప్రాంతాలనే ఎంచుకోవాలి.●ఎండతో అనారోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వీటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ నారగాని రాంప్రసాద్, పీడియాట్రీషియన్ పవన్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అధిక వేడితో చెమట కారణంగా ఒంట్లో నీటిశాతం తగ్గి, లవణాలు బయటకు వెళ్తాయి. ఫలితంగా డీహైడ్రేషన్కు గురై తలనొప్పి, స్పృహ కోల్పోవడం, మాట తడబడడం, వికారం, అలసట, కళ్లుతిరగడం, రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. ఎండ ప్రభావం ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులపై పడే అవకాశముంది. వీటి నివారణకు శరీరానికి కావాల్సినంత నీరు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కొబ్బరినీరు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం మంచిది. నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, ధూమపానానికి దూరంగా ఉండాలి. వడదెబ్బతో అస్వస్థతకు గురైన వారిని చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి తల నుంచి కాళ్ల వరకు తడిగుడ్డతో తుడవాలి. గాలి అడేలా చూస్తూ తేరుకున్నాక ఓఆర్ఎస్ తాగించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. వీటన్నింటికి మించి ఉదయం 11 నుంచి సాయంత్రం 4లోపు తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దు. పిల్లలు ఎండలో ఆడకుండా పర్యవేక్షించాలి. తగిన నీరు తాగేలా చూడాలి. డయేరియాకు గురికాకుండా తేలికపాటి ఆహారమే ఇస్తూ నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలి. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత
ఇల్లెందు: షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. నెల రోజులుగా ప్రభుత్వాస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో బాధితులపై ఆర్థికభారం పడుతోంది. ఇన్సులిన్ అవసరమైనవారికి రోజూ రెండు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలోనే వెయ్యి మంది వరకు ఇన్సులిన్ పొందేవారు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా కనీసం 10 వేల మంది వరకు ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికో ఇంజెక్షన్ల బాక్స్ అవసరమవుతుందని, ఒక్కో దాని ఖరీదు రూ. 250 వరకు ఉండగా, నెలకు రూ. 1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో 29 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 376 సబ్ సెంటర్లు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మణుగూరు, అశ్వారావుపేటలో పాత స్టాక్ కొంత ఉండగా మిగతా అన్ని చోట్ల కొరత ఏర్పడింది. ప్రభుత్వ దవాఖానాకు వచ్చే 10 మందిలో 8 మంది రోగులు షుగర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. షుగర్ ఎక్కువ ఉందని రిపోర్టు రాగానే డాక్టర్ సంప్రదించటం, అక్కడి నుంచి మందులు ఇచ్చే గదికి పరుగులు తీయటం, అక్కడి ఫార్మాసిస్ట్ ఇన్సులిన్ లేదనటంతో భయంతో మెడికల్ షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ల సరఫరా నిలిచిపోయింది. ఏరియా ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పంపించగా, మందు లేదని సమాచారం వస్తుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే బాధితులు మాత్రం ఫార్మసీ సిబ్బందితో ఇంజెక్షన్ కావాలని ఘర్షణకు దిగుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్ను వివరణ కోరగా.. ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత వాస్తవమేనని తెలిపారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి నిలిచిపోయిన సరఫరా విధిలేక ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్తున్న బాధితులు నెలకు ఒక్కొక్కరిపై రూ.1000 అదనపు భారం -
●తేమ, నీడతో మిద్దె, పెరటి తోటల రక్షణ
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యాన మిద్దె తోటలు, పెరటి తోటల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్ సూచిస్తున్నారు. తోటల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. ●తెల్లవారుజాము, సూర్యాస్తమయ సమయాల్లో తోటలకు నీరు పెట్టాలి. మధ్యాహ్నం నీరు పెడితే ఎక్కువగా ఆవిరవుతుంది. తోటకు మల్చింగ్ చేస్తే ఎక్కువ సేపు తేమ ఉంటుంది. ఎండుగడ్డి కూడా మల్చింగ్గా వాడొచ్చు. పాత షీట్లు, పాత కిటికీ తెరలను మొక్కలపై కప్పినా ఫలితం ఉంటుంది. అధిక నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది, ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అంతేకాక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. తోటలో క్రమం తప్పకుండా కలుపు నివారించాలి. వేడిగాలుల సమయాన ఎరువులు వేయొద్దు. ఎండతో ఒత్తిడికి గురైన మొక్కలు కోలుకునే వరకు ఎరువు వేయకూడదు. -
గ్రామాల్లోనే భూ రికార్డులు
సూపర్బజార్(కొత్తగూడెం): భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి వివరాలతో కూడిన రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలస్థాయిలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వివాదాలకు అవకాశం లేకుండా రైతులకు సాగు భూములపై యాజమాన్య హక్కు కల్పించేలా నూతన చట్టం ఉందన్నారు. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం ఉండేదని, కానీ భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసే తహసీల్దార్ కాపీ జారీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం, చుంచుపల్లి తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
●ఎండ, అల్ట్రా వైలెట్ కిరణాలతో చెడు ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 41–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతకు తోడు అల్ట్రా వైలెట్ కిరణాలు, వడగాలులు శరీరంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. వివిధ వృత్తులు చేసేవారు, రైతులు, వ్యవసాయ కూలీలు తీసుకోవాల్సి న జాగ్రత్తలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రవి కుమార్ వివరించారు. ●వీలైనంత వరకు వ్యవసాయ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకోవాలి. తప్పనిసరై మధ్యాహ్నం చేయాల్సి వస్తే తలపై ఎండ పడకుండా టోపీ, గొడుగు ధరించాలి. నీరు చెమట రూపంలో బయటకు వెళ్లనున్నందున నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి. రైతులు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లినప్పుడు నీడ పట్టున చెట్ల కింద సేద తీరేలా చూడాలి. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో దర్బార్కు హాజరు కావాలని పేర్కొన్నారు. -
●ఉపకరణాలన్నీ ఒకేసారి వాడొద్దు
వేసవి.. అందునా అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యాన ఇళ్లలో అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒకేసారి వినియోగించకపోవడమే మేలని ఖమ్మానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె.ద్రోణయ్య చెబుతున్నారు. ఆయన సూచనల మేరకు గృహవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ●ఏసీలు, గీజర్ వంటి అధిక లోడ్ తీసుకునే పరికరాలను ఒకేసారి వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అవసరాలకు అనుగుణంగా.. ఓల్టేజీ ఆధారంగా ఉపకరణాలను వినియోగించాలి. ఎండ తీవ్రత ఉన్న కాలంలో వైరింగ్ సరిచూసుకోవాలి. ఇంటి వైరింగ్కు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండేలా చూసుకుని.. ఎర్తింగ్ ప్రాంతంలో అప్పుడప్పుడు నీరు పోయాలి. -
పోలీసులకు ప్రశంసా పత్రాలు
కొత్తగూడెంటౌన్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, గంజాయి రవాణాను అడ్డుకుంటున్న పోలీసులకు శనివారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసి అభినందించారు. గతంలో సీసీఎస్ సీఐగా పని చేసిన బెల్లం సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్, సుమన్, సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయిరెడ్డి డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 360 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,660 ఆదాయం లభించగా, 120మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,270 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రజతోత్సవాలకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మణుగూరు రూరల్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. తొలుత పట్టణంలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గులాబీ జెండాను పార్టీ జిల్లా ఽఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎగురవేశారు. అనంతరం కార్లను, ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మార్గమధ్యలో మాజీ ఎమ్మెల్యే, నాయకులు నృత్యాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మండల వ్యాప్తంగా వాడవాడనా పార్టీ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేసి సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, నాగెల్లి వెంకటేశ్వర్లు, నూకారపు రమేష్, ఎడ్ల శ్రీనివాస్, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, ఎడవల్లి వెంకటయ్య, ముత్యంబాబు పాల్గొన్నారు. -
మేమిక ఉండలేం..
● బదిలీల కోసం ఎకై ్సజ్ ఉద్యోగుల ఎదురుచూపులు ● ఆరేళ్లుగా 180 మందికి స్థానచలనం లేదు.. ● దూర ప్రాంతాల ఉద్యోగుల్లో ఆవేదన ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకై ్సజ్ శాఖలో ఆరేళ్లుగా బదిలీలు జరగకపోవటంతో సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో అయిపోతుంది, వచ్చే నెలలో అయిపోతుంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప బదిలీల గురించి పట్టించుకోనే పరిస్థితి లేదు. సీఐ మొదలు కానిస్టేబుళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2, నేలకొండపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి, సింగరేణి మొత్తం 7 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు కలిపి 6 స్టేషన్లు ఉన్నాయి. దీనికితోడు రెండు డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్)లు, ఒక ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 180 మంది సిబ్బంది ఆరేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు ఉండగా 37 మంది హెడ్కానిస్టేబుళ్లు 140 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2 ఒకప్పుడు బూర్గంపాడు ఎకై ్సజ్ స్టేషన్ కాగా ముంపు మండలాలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కలపటంతో ఆ స్టేషన్ను అక్కడి నుంచి ఖమ్మం తరలించి ఎకై ్సజ్స్టేషన్–2గా మార్చారు. అయితే దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఈ స్టేషన్లో 8 మందికి పైగా సిబ్బంది అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. ఏళ్ల తరబడి అవే స్టేషన్లలో పనిచేస్తుండటంతో సిబ్బందిపై సైతం పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఎంతోకాలంగా ఏజెన్సీ ప్రాంతాలు, దూరప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఈ స్టేషన్లలో ఎంతకాలం పనిచేయాలనే ధోరణితో నిరాశ చెందుతున్నారు. త్వరలోనే పక్రియ..? గతంలో మాదిరిగా ఈసారి బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం లేదని దాదాపు బదిలీలు జరగటం ఖాయమని కొందరు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారం లేదా, మే మొదటివారంలో బదిలీలు జరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ రాష్ట్ర ఉన్నతాధికారి విదేశాల్లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు, వచ్చేనెల వరకు బదిలీ పక్రియ జరిగితే తమ పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బంది ఉండదని ఆలస్యం అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. -
విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం
ఇల్లెందురూరల్: మండలంలోని తిలక్నగర్ జీపీ కల్తీ రామయ్య గుంపు గ్రామంలో ఆజ్మీర కిశోర్ ఇంట్లో ఆదివారం విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధమైంది. కిషోర్తోపాటు కుటుంబ సభ్యులు తెల్లవారుజామున నిద్ర లేచి ఆరుబయిట పనులు చేసుకుంటుండగా ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు ప్రయత్నించారు. విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో కంగారుపడి ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఆరు మందుపాతరల నిర్వీర్యం చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దాంతరి జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆరు మందుపాతరలను ఆదివారం బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. దాంతరి జిల్లా ఎస్పీ సూరజ్సింగ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బల్లారి సమీపంలో గల సాల్హీబాట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్జీ బలగాలు మూడు రైస్ కుక్కర్ బాంబులు, రెండు పైపు బాంబులు, ఒక టిఫిన్బాంబును గుర్తించాయి. వాటిని అక్కడే నిర్వీర్యం చేశాయి. వీటితో పాటు ఒక వాకీటాకీ కూడా లభ్యమైందని ఎస్పీ వెల్లడించారు. -
30 కిలోల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ లారీయార్డులో పార్కింగ్ చేసిన ఓ లారీలో 30 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎకై ్సజ్ (ఎస్టీఎఫ్) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఐటీసీ పేపర్బోర్డుకు జామాయిల్ కర్రను తీసుకొస్తున్న లారీడ్రైవర్ శివ ఒడిశా రాష్ట్రంలో అర్జున్ అనే వ్యక్తిని లారీలో ఎక్కించుకుని సారపాకకు తీసుకొచ్చాడు. ఆ లారీలో గంజాయి ఉందనే పక్కా సమాచారంతో హైదరాబాద్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు సిబ్బందితో సారపాకకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం లారీయార్డులో నిలిపి ఉంచిన లారీని తనిఖీ చేయగా అందులో 30 కిలోల గంజాయి దొరికింది. లారీడ్రైవర్ శివతో పాటుగా ఒడిశాకు చెందిన అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.వారిద్దరూ పలుమార్లు లారీలోగంజాయి తీసుకొచ్చి భద్రాచలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విలువ రూ.15 లక్షలు ఉంటుందని, గంజాయితో పాటు లారీని కూడా సీజ్ చేశామని,శివ, అర్జున్తో పాటు వచ్చిన ప్రహ్లాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
లౌకిక తత్వంపై మాట్లాడితే సస్పెన్షనా?
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం వంటిదని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని, లౌకికతత్వంపై మాట్లాడితే రీసెర్చ్ స్కాలర్ రాందాస్పై రెండేళ్ల పాటు యూనివర్సిటీ నుంచి బహిష్కరించిందని ఆరోపించారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు సాగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నితీష్ నారాయణ్ మాట్లాడుతూ.. ధనిక, ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన తమ సంఘం నిలబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్సీయూ భూములను కాజేస్తోందన్నారు. ఎస్ఎఫ్ఐ దేశానికి ఎంతోమంది నిష్ణాతులను ఇచ్చిందని, జై భీమ్ చిత్ర ఇతివృత్తానికి సంబంధించిన జస్టిస్ చంద్రు ఎస్ఎఫ్ఐకి చెందిన వారే కావడం గర్వకారణమని అన్నారు. త్యాగధనులు పుట్టిన గడ్డ ఖమ్మంలో మహాసభలు జరగడం హర్షణీయమని అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో జ్యోతిష్యం, మూఢ విశ్వాసాలను చొప్పించి పాఠ్య పుస్తకాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోయ చంద్రమోహన్, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం..
● వ్యాధి భయపెట్టినా.. లక్ష్యాన్ని చేరిన యువతి.. ● గ్రూప్–1తో పాటు 5 ఉద్యోగాల విజేత జ్యోతి శిరీష ఖమ్మంవైద్యవిభాగం: యాభైసార్లు రక్తం ఎక్కించుకుని, ఒకవైపు తన వ్యాధిని నయం చేసుకుంటూనే మరోవైపు సర్కారు కొలువు కొట్టాలనే సంకల్పంతో పోరాడి.. తన లక్ష్యాన్ని చేరుకున్న జ్యోతి శిరీష ఆదర్శప్రాయురాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఏకంగా 5 సర్కారు కొలువులను కొట్టిన యువతి.. ఖమ్మం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, బాల్యం నుంచే సికిల్సెల్ రక్తహీనతతో కూడిన వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఐదు ఉద్యోగాలు సాధించిన తీరు అద్భుతమన్నారు. ఆమె పూర్తి వైద్య ఖర్చులతో పాటు మందులను కూడా ఉచితంగా అందిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఆదివారం ఆయన వైద్యశాలలో జ్యోతి శిరీషను సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతిశిరీష మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన సికిల్సెల్ వ్యాధితో తాను బాధపడుతూ అనేక సందర్భాల్లో తాను సమాజాన్ని చూస్తానో లేదో అని భయపడినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే అకుంఠిత దీక్షతో తాను గ్రూప్–1లో ర్యాంకును సాధించానని తెలిపారు. తనది జిల్లాలోని మిట్టపల్లి గ్రామమని, తండ్రి సుతారీ మేస్త్రి, అమ్మ వ్యవసాయ కూలీ అని తెలిపారు. తాను సికిల్ సెల్ ఎనీమియా (తీవ్ర రక్తహీనత) బాధితురాలినని, ఆరో తరగతిలో తనకీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారని, తరచూ రక్తం తగ్గిపోయి కాళ్లు, చేతులు వాపు వచ్చేవని, దానికితోడు తలనొప్పి, ఎముకల మధ్య సూదులతో గుచ్చినట్టు బాధ ఉండేదని, అన్నీ భరించి, ఉద్యోగాలు సాధించానని, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. -
నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అధికారులు భక్తుల కోసం ఆలయం నుంచి సత్రం వరకు తివాచీ ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో భక్తులు అన్నదాన సత్రానికి నడిచిరావాలంటే తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. దీంతో ఆలయం నుంచి సత్రం వరకు రోడ్డు మీద తివాచీ (మ్యాట్)ని పరచగా.. భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. సెలవులకు ఊరెళ్తే సమాచారం ఇవ్వండి.. ఎస్పీ రోహిత్రాజు కొత్తగూడెంటౌన్: వేసవి సెలవులకు ఊరెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ లేని ఇంట్లో దొంగతనాలకు పాల్పడేందుకు దుండగులు యత్నిస్తారని, చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేశామని, ఊరికి వెళ్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. వెదురు ఉత్పత్తులు అద్భుతం భద్రాచలం/చండ్రుగొండ/ములకలపల్లి: వెదురు ఉత్పత్తులతోపాటు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా భద్రాచలంలో ఏర్పాటు చేసిన మ్యూజియం అద్భుతంగా ఉన్నాయని గుల్లాకారి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుస్మిత కనేరి అన్నారు. ఆదివారం ఆమె భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు శివారులోని బ్యాంబో క్లస్టర్తోపాటు ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ యూనిట్ను సందర్శించి మాట్లాడారు. గిరిజన సంప్రదాయ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వెదురు ఉత్పత్తుల తయారీలో గిరిజన సంస్కృతి ఉట్టిపడుతోందని, మార్కెటింగ్పై కలెక్టర్తో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెంకయ్య, వీరస్వామి, హరికృష్ణ, అంజన్, ఈసం నాగభూషణం, మల్లం కృష్ణయ్య, బొర్రా సురేశ్, వి.గోవర్దన్ పాల్గొన్నారు. లాక్రోస్ జాతీయస్థాయి టోర్నమెంట్కు కార్తీకరెడ్డి తల్లాడ: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ నెల 28 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించనున్న లాక్రోస్ 3వ జూనియర్, సీనియర్ జాతీయస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు తల్లాడకు చెందిన డి.కార్తీకరెడ్డి ఎంపికై ంది. తల్లాడకు చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కార్తీకరెడ్డి హైదరాబాద్లోని గురుకుల పాఠశాలలో 9 వతరగతి చదువుతోంది. క్రీడల్లో కూడా రాణిస్తూ జాతీయ పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ జట్టు తరఫున కార్తీకరెడ్డి ఆదివారం బయలుదేరి ఆగ్రా వెళ్లింది. కాంటాల జ్యాపంపై రైతుల ఆగ్రహం నేలకొండపల్లి: మండలంలోని రాజారాంపేట ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇష్టారాజ్యంగా కాంటాలు వేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాంటాల్లో జాప్యం చేస్తున్నారని రైతులు ఆదివారం కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కేంద్రంలో ధాన్యం ఆరబెట్టినప్పటికీ కాంటాలు వేయటం లేదని.. కొందరికి మాత్రం అప్పటికప్పుడే వచ్చిన ధాన్యానికి కూడా కాంటాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై రాజారాంపేట సొసైటీ సీఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
అల్లాడుతున్న మూగజీవాలు
పాల్వంచరూరల్/టేకులపల్లి: అధిక ఉష్ణోగ్రతలతో పశువులు, గేదెలు అల్లాడిపోతున్నాయి. ఎండ వేడిమికి బురద, బూడిద నీరు కూడా తాగి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఎక్కడ చెట్లు కనబడితే అక్కడ నీడలో సేదతీరుతున్నాయి. పాల్వంచ మండలం సూరారం, బిక్కుతండా, సోములగూడెం గ్రామాల మీదుగా కేటీపీఎస్ యాష్పాండ్లోని కలుషితమైన బూడిదనీరు వాగులో ప్రవహించి కిన్నెరసానిలో కలుస్తుంది. వేసవిలో మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెలు కలుషిత బూడిద నీటిని తాగి దప్పిక తీర్చుకుంటున్నాయి. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలుతండా పాఠశాల, టేకులపల్లి హైస్కూల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు ఉండగా, నిత్యం పశువులు చెట్ల కిందకు వచ్చి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నాయి. -
పాడి వృద్ధి.. పాలు సమృద్ధి..
● సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ ద్వారా రుణాలు ● పాడి యూనిట్లలో 70 శాతం మేర లోన్ ● ఆపై సొసైటీల ద్వారా పాల సేకరణకు ప్రణాళిక ఖమ్మంవ్యవసాయం: చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాడి పథకానికి రూపకల్పన చేసింది. పాలు, పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టును రూపొందించగా.. రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం కొనసాగుతున్న సహకార సంఘాల్లో సభ్యులకు లబ్ధి జరగనుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమాన అనుబంధంగా పాడి పరిశ్రమకూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రూ.3,460.70 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కొనసాగుతున్న ఖమ్మం డీసీసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కాక మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని బయ్యారం, గార్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించి ఉంది. మొత్తంగా 100 సహకార సంఘాలతో 1.70 లక్షల మంది సభ్యులతో కూడిన ఈ బ్యాంకు 50 బ్రాంచ్లతో లావాదేవీలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది రూ.9.64 కోట్ల లాభాలతో ఉన్న నేపథ్యాన పాడి పరిశ్రమపై ఆసక్తి ఉన్న వారికి చేయూతనివ్వాలని కొత్త పథకాన్ని రూపొందించింది. తద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి అవసరం లేకుండా స్థానికంగా పాల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు. 30 శాతం నిధులు చాలు.. పాడి యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే రైతులకు డీసీసీబీ రుణాలు ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు 30 శాతం నిధులతో ముందుకొస్తే మిగతా 70 శాతం నిధులను బ్యాంకు వాటాగా సమకూరుస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష విలువైన గేదెకు రైతు రూ.30 వేలు తన వాటాతో సిద్ధమైతే మిగతా రూ.70 వేలు రుణంగా అందుతుంది. గరిష్టంగా రెండు గేదెల వరకు అవకాశం కల్పిస్తారు. సొసైటీ సభ్యులకే అవకాశం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల్లో సభ్యులైన వారికి మాత్రమే ఈ పథకంలో చోటు కల్పిస్తారు. వ్యవసాయ భూమి, సాగునీటి వనరులు ఉండి, పంటలు సాగు చేసే వారికి పాడి పరిశ్రమలో ప్రాధాన్యత ఇస్తే బహుముఖ లాభాలు ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా సహకార సంఘాల ఉద్దేశం కూడా నెరవేరి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశముంటుందని చెబుతున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత డీసీసీబీ పరిధిలో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాడి పరిశ్రమ పథకాన్ని అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంతో పాటు ఇతర జలవనరులు ఉన్న ప్రాంతాల్లో సహకార సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనుండగా.. ఉమ్మడి జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, కూసుమంచి, భద్రాచలం, పినపాక వ్యవసాయ డివిజన్లలో అవకాశం దక్కనుంది. స్థానిక వాతావరణాన్ని తట్టుకునే జాతుల గేదెలనే రైతులు ఎంపిక చేసుకునేలా పశుసంవర్థక శాఖ పర్యవేక్షణ ఉంటుంది. పీఏసీఎస్ల ద్వారా పాల సేకరణ రైతులు పాడి యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే పాలను సైతం పీఏసీఎస్ల ద్వారా సేకరిస్తారు. దళారులు లేకుండా వెన్న శాతం ఆధారంగా కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రక్రియతో సహకార సంఘాలతో పాటు పాడి రైతులకు ప్రయోజనం కలగనుంది. పాల కొనుగోలుకు అవసరమైన శీతలీకరణ యంత్రాలు, పరికరాలను పీఏసీఎస్లు సమకూర్చుకుంటాయి. కలెక్టర్ అనుమతితో అమలు చిన్న రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పాడి పరిశ్రమ ప్రాజెక్టును రూపొందించాం. సౌకర్యాలు ఉన్న ప్రాంతాల రైతులకు ప్రాధాన్యత ఉంటుంది. సహకార లక్ష్యం నెరవేరేలా పథకాన్ని అమలుచేస్తాం. బ్యాంకు పాలకవర్గం నిర్ణయంతో పాటు కలెక్టర్ అనుమతితో జూన్ నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. –ఎన్.వెంకటఆదిత్య, సీఈఓ, డీసీసీబీ ఖమ్మం -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాడికి నిరసనగా శ్రీరామస్తోత్ర పారాయణం కశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన దాడికి నిరసనగా శనివారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బేడా మండపంలో శ్రీరామస్తోత్ర పారాయణం గావించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుతూ పూజలు చేశారు. వైభవంగా రుద్ర హోమం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా శనివారం రుద్రహోమం జరిపించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన అర్చకులు.. మండపారాధన, గణపతి పూజ చేశారు. ఆ తర్వాత రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనిత్రయోదశిని పురస్కరించుకుని శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
సుజాతనగర్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ రైతు వేదికలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా నూతన ఆర్ఓఆర్ తెచ్చిందని తెలిపారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి..అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ శిరీష, పీఏసీఎస్ చైర్మన్ మండే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలని, జాబితాలో పేరు లేని నిరుపేదలుంటే వారి పేర్లు కూడా జతచేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను త్వరగా పరిశీ లించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పెపులైన్ల లీకేజీ, పంపుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. తాగునీటి సమస్య ఉంటే ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
మహిళా ఉత్పత్తులకు విశేష ఆదరణ
కొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం) : హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో జిల్లా మహిళల ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. గతంలో కలెక్టర్ ఆలోచన మేరకు ‘రన్ ఫర్ హర్‘ కార్యక్రమంలోనూ జిల్లా మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో మరింతగా ప్రేరణ పొందిన మహిళలు.. ఇప్పుడు భారత్ సమ్మిట్లో ఉత్పత్తులను ప్రదర్శించారు. డీఆర్డీఏ నుంచి మహిళా సమాఖ్య సభ్యులు హాజరై పిండివంటల, వెదురు, సిమెంట్తో చేసిన గదలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించగా మంచి స్పందన లభించిందని డీఆర్డీఏ డీపీఎం నాగజ్యోతి తెలిపారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్కొత్తగూడెంటౌన్: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14 వరకు జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్లు, ఆర్థిక సంస్థల ఆధికారులతో ఈనెల 29న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు, చిన్న ఆర్థిక సంస్థలు, ప్రతివాదులు సంబంధిత కోర్టులకు వెళ్లి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. నలుగురు ఎస్సైల బదిలీ కొత్తగూడెంటౌన్: జిల్లాలో నలుగురు ఎస్సైలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుండాల ఎస్సై సీహెచ్ రాజమౌళిని వీఆర్ కింద జిల్లా కార్యాలయానికి, అశ్వాపురం ఎస్సై ఎండీ సైదా రహుఫ్ను గుండాలకు, భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మధు ప్రసాద్ను ఆశ్వాపురానికి, అక్కడి ఎస్సై టి.తిరుపతిరావును భద్రాచలం ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. కొత్తగూడెంలో ఏసీబీ సోదాలుకొత్తగూడెంఅర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరు ఇన్ చీఫ్ హరిరామ్ సొంత ఇల్లు లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో ఉండగా, శనివారం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరిరామ్ బంధువుల ఇళ్లలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో కూడా తనిఖీలు జరిపారు. కాగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని డీఎస్పీ రమేష్ వెల్లడించారు. -
కారులన్నీ అటే...
నేడు వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ● అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీలో తగ్గిన జోష్ ● ఏడాదిన్నరగా స్తబ్ధుగా ఉన్న పార్టీ శ్రేణులు ● నైరాశ్యాన్ని తొలగించిన వేడుకలుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు భారత రాష్ట్ర సమితికి కొత్త ఊపు తెచ్చాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గత 15రోజులుగా శ్రమిస్తున్నారు. 2023 సాధారణ ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్ ఈ వేడుకలతో ఉత్సాహంగా పని చేస్తోంది. అప్పుడు గులాబీమయం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే పది అసెంబ్లీ స్థానాల్లో ప్రతీ సారి ఒక్కోచోట మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. జిల్లాలో 2014 ఎన్నికల్లో కొత్తగూడెం, 2023లో భద్రాచలం స్థానాల నుంచి కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ప్రతీసారి కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తూ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఏ చిన్న పిలుపు ఇచ్చినా.. ఊరువాడా అంతా గులాబీ మయంగా మారిపోయేది. తగ్గిన జోరు.. తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఐదు స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన మూడు చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో ఆ పార్టీ మద్దతుతో సీపీఐ విజయం సాధించాయి. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో అటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్ స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంతకుముందే ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో పట్టణాల్లోనూ పార్టీ ఊపు తగ్గింది. దాదాపు ఏడాది కాలంగా పార్టీ తరఫున చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కూడా జరగలేదు. అంతకుముందు పదేళ్ల పాటు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగగా.. మారిన పరిస్థితులతో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే నేతల సంఖ్య పెరిగింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికై నా పార్టీలో పూర్వపు జోష్ వస్తుందా రాదా అనే సందేహాలు నెలకొన్నాయి. సన్నాహక సమావేశాలతో.. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, దీనికి భారీగా జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ నాయకులు తిరిగి జనాల్లోకి రావడం మొదలైంది. వార్డులు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, నియోజకవర్గాల వారీగా నేతల ను సమన్వయం చేశారు. ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన సైతం వేర్వేరుగా ఉన్న నేతలను ఒక్క తాటిపైకి తెచ్చింది. ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు జన సమీకరణపై దృష్టి సారించారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలతో తిరిగి గులాబీ జెండాలను రెపరెపలాడించారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ కావడంతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఈ వేడుకల్లో వెల్లడవుతుందనే నమ్మకం కేడర్లో నెలకొంది. దీంతో గ్రామ, మండలస్థాయి నుంచి పార్టీ నేతలంతా వరంగల్ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా రజ తోత్సవాలు బీఆర్ఎస్ కేడర్లో నెలకొన్న నిస్తేజాన్ని దూరం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సభను విజయవంతం చేయాలి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతంలో పాలు పంచుకోవాలి. జనం వెళ్లేలా బస్సులు, కార్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఇది రజతోత్సవ సభగానే కాక రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంగా ఉంటుంది. – పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి ఖమ్మం సత్తా చాటుదాం.. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఈ నేపథ్యాన ఎల్కతుర్తి సభకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరై కేసీఆర్కు మద్దతు ప్రకటించాలి. ఇక్కడి నుంచి అత్యధికంగా జనం వెళ్లడం ద్వారా జిల్లా సత్తా చాటాలి. – వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు -
కదం తొక్కిన విద్యార్థులు
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం వీధుల్లో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కుతూ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని జెడ్పీసెంటర్ వద్ద ప్రముఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా వైరా రోడ్ మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎస్ఎఫ్ఐ జెండాలు, భగత్ సింగ్, చేగువెరా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలతో సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సభ ప్రారంభానికి ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి జెండా ఆవిష్కరించగా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం విద్యార్థుల భారీ ప్రదర్శన -
‘సీతారామ’పై నజర్
పర్యావరణ అనుమతులపై దృష్టి సారించిన అధికారులు ● 15 నెలలుగా పెండింగ్లోనే ఈసీ ఫైల్ ● ఈసీ వస్తేనే పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశాలు ● ఇటీవలే సీతారామకు టీఏసీ నుంచి గ్రీన్ సిగ్నల్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా సీతమ్మ సాగర్ పేరుతో గోదావరిపై బరాజ్ నిర్మిస్తోంది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల కోసం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఆ వెంటనే వివిధ ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులను విభజించి నిర్మాణ పనులు ప్రారంభించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మిస్తున్నారని, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయంటూ భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు వ్యక్తులు 2022 డిసెంబరులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చైన్నె బెంచ్ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2022 ఏప్రిల్ 26న ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆగ్రహం గ్రీన్ ట్రిబ్యునల్లో వివాదం కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టింది. దుమ్ముగూడెం, అశ్వాపురంల మధ్య గోదావరి నదిపై 1.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసం కుడివైపున గట్టు నుంచి 200 మీటర్లు వదిలిపెట్టి, మిగిలిన 1.3 కి.మీ పొడవుతో మొత్తం ఆరు బ్లాకులుగా విభజించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి నాలుగు బ్లాకుల్లో పియర్లు, స్పిల్వేల నిర్మాణం పూర్తయింది. క్రస్ట్ గేట్లు బిగించడమే తరువాయి అనుకునే తరుణంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ మరోసారి ఎన్జీటీని బాధితులు ఆశ్రయించారు. బరాజ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యాలను ఫొటోలతో సహా సమర్పించారు. దీంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడిపనులు అక్కడే ఆపాలంటూ 2023 మే 29న ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనకు ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్జీటీ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖకు చెందిన రీజినల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి నదీ జలాల నిర్వాహణ బోర్డులో ఎస్ఈ స్థాయి అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ 2023 జూన్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, జూలైలో నివేదిక అందించింది. అయితే నివేదిక లోపభూయిష్టంగా ఉందంటూ ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పని ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సూచన చేసింది. పదేపదే తమ ఆదేశాలు ధిక్కరిస్తూ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ గోదావరి రివర్బోర్డు మేనేజ్మెంట్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలను ఇటీవల ఆదేశించింది. దీనిపై 2023 సెప్టెంబరు 23న ఎన్జీటీలో వాదనలు జరిగాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన రావడంతో ఈ అంశం మరుగున పడింది. డీపీఆర్కు లైన్ క్లియర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ వ్యయం, అనుమతులపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా సీతారామకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, డీపీఆర్)కి కూడా ఎకనామిక్ ఫీజుబులిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు లేని విషయాన్ని గుర్తించింది. దీంతో ముందుగా ఈ రెండు అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. 2024 ఆగస్టులో ఈ ప్రయత్నాలు మొదలైతే 2025 ఏప్రిల్ 24న డీపీఆర్కు టీఏసీ అనుమతులు కూడా వచ్చాయి.ఈసీపై దృష్టి ఇప్పుడు కీలకమైన పర్యావరణ అనుమతు (ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్)లు సాధించడంపై దృష్టి సారించాల్సి ఉంది. అందులో భాగంగా నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి, ఈసీ క్లియరెన్స్ వచ్చాక, అపెక్స్ కమిటీ నుంచి మిగిలిన అనుమతులు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బరాజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. -
‘రాజీవ్ యువ వికాసం’తో జీవనోపాధి
ఐటీడీఏ పీఓ రాహుల్ బూర్గంపాడు/భద్రాచలంటౌన్: రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువత జీవనోపాధులు మెరుగుపడతాయని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. శుక్రవారం ఆయన సారపాక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. గ్రామపంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. అనంతరం భద్రాచలంలోని సుందరయ్య నగర్ డీఆర్సీసీ పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత సుందరయ్య నగర్లో ఇందిరమ్మ కాలనీని సందర్శించారు. స్థలం ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆదివాసీ మహనీయుల విగ్రహాల మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హరీష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నరసింహారావు, ఏఈ శివ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్, సిబ్బంది రాములు, ఠాగూర్, ప్రశాంతి, మురళి పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అవగాహన ఉండాలి
ఆర్బీఐ మేనేజర్ సాయితేజ రెడ్డి గుండాల : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలని ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ సాయితేజ రెడ్డి అన్నారు. యాస్పిరేషనల్ బ్లాక్ గుండాల మండలం కాచనపల్లిలో శుక్రవారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక ప్రణాళిక, పొదుపు, వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంక్ లావాదేవీలపై అవగాహన ఉండాలని, ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, కాచనపల్లి ఎస్బీఐ మేనేజర్ వేణు, కోటేశ్వర రావు, నాగేశ్వర రావు, జగ్యా తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 20వ తేదీ నుంచి మొదలైన సార్వత్రిక పీఠం ఓపెన్ ఇంటర్, పదో తరగతి ఽథియరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, శనివారం నుంచి ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టీకల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ‘మిషన్ భగీరథ’ను పరిశీలించిన సీఈఅశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్ను, మిట్టగూడెం రథంగుట్ట వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను శుక్రవారం మిషన్ భగీరథ సీఈ కే.శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవల ఇన్టేక్ వెల్ వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో సమ్మక్క–సారక్క బ్యారేజీ నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఈ సందర్శించి నీటిమట్టాన్ని పరిశీలించారు. మే నెల వరకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎస్ఈ శేఖర్రెడ్డి, ఈఈ నళిని, డీఈ మహేందర్ పాల్గొన్నారు. మలేరియా నివారణ ర్యాలీ కొత్తగూడెంఅర్బన్: మలేరియాను నివారించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ముర్రేడువాగు నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం సర్వజన ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను సందర్శించి, సేవలపై ఆరా తీశారు. వైద్యాధికారులు సుకృత, బాలాజీనాయక్, మధువరన్, ఫయాజ్మొహియుద్దీన్, జేతు, హరికిషన్, రాంప్రసాద్ పాల్గొన్నారు. అర్హులనే ఎంపిక చేయాలిదమ్మపేట/అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులనే ఎంపిక చేయాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం దమ్మపేట మండలం అల్లిపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హుల ధ్రువీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అన్నారు. దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నారంవారిగూడెం కాలనీ పంచాయతీలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు రవీంద్రా రెడ్డి, రామారావు, స్పెషల్ ఆఫీసర్ జుంకీలాల్, ఎంపీఓ సోయం ప్రసాద్, ఇతర అధికారులు రంజిత్ కుమార్, అక్షిత, శ్రీనివాస్, శివరాంప్రసాద్, రామకృష్ణ, మురళి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో వివాదాలకు చెక్
● అర్హులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు ● సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చండ్రుగొండ : భూ భారతి చట్టంతో భూ వివాదాలకు ఇక పుల్స్టాప్ పడనుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని అయన్నపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రెవెన్యూశాఖలో పూర్తిస్థాయిలో యంత్రాంగం ఉంటేనే పనులు జరుగుతాయని, ఆ దిశగా వ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంతో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని, భూమికి నక్షాతో కూడిన పాస్బుక్లు వస్తాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందన్నారు. కుటుంబాల్లో సైతం ఏర్పడే భూ వివాదాలకు ఇక ఆస్కారం ఉండబోదన్నారు. భూ వివాదాల్లో గతంలో కోర్టును ఆశ్రయించేవారని ఇకపై ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి రికార్డులు సృష్టించుకుంటే విచారించి రద్దు చేసే అధికారం భూభారతి చట్టం ద్వార రెవెన్యూ అధికారులకు లభించిందన్నారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం గ్రామంలో మునగతోటను కలెక్టర్ పరిశీలించారు. రైతు చాపలమడుగు నాగేందర్తో మాట్లాడి సేద్యం చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకుని అభినందించారు. మునగ, ఆయిల్పామ్ సేద్యం వైపు రైతులు ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ మధు, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏఓ వినయ్, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు పాల్గొన్నారు. -
పెట్రోలింగ్, గస్తీ పెంచాలి
● ఇల్లెందు పోలీసుల పనితీరు అభినందనీయం ● ఎస్పీ రోహిత్రాజు ఇల్లెందు: వేసవి కాలం దృష్ట్యా చోరీ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పెంచాలని, బ్లూకోల్ట్స్ సిబ్బంది గస్తీ పెంచాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను, స్టేషన్ పరిసరాలను, కంప్యూటర్ గదిని, లాకప్లను పరిశీలించారు. నిఽఘా వ్యవస్థ పనితీరుపై ఆరా తీశారు. ఇటీవల ఓ చోరీ సంఘటనను ఛేదించి 29 తులాల బంగారం రికవరీ, ఓ పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినందుకు పోలీసులను అభినందించారు. ఇల్లెందు పోలీస్ యంత్రాంగం పని తీరు జిల్లాలోనే టాప్ లెవల్లో ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కష్టాల్లో ఉండి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు తక్షణ న్యాయం అందాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా తీవ్రతరం చేయాలని, పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని, విస్త్రృతంగా సభలు సమావేశాలు పెట్టి చైతన్యపర్చాలని సలహా ఇచ్చారు. బెట్టింగ్, గంజాయి సరఫరా మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు పి. శ్రీనివాసరెడ్డి, బి. సూర్య, సిబ్బంది ఉన్నారు. -
కార్పొరేషన్ సరే.. సమస్యల సంగతేంటీ..?
● మున్సిపల్ కార్పొరేషన్తో పెరిగిన కొత్తగూడెం హోదా ● త్వరలో జీఓ విడుదలయ్యే అవకాశం ● గూడెం, పాల్వంచ పట్టణాలను వేధిస్తున్న సమస్యలు ● అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ అవసరం కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను స్వాగతిస్తున్న ప్రజలు అక్కడి సమస్యల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక అవస్థ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి క్రమంగా కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. రేపోమాపో జీవో విడుదల అయితే పూర్తిస్థాయిలో కార్పొరేషన్గా మారనుంది. 1971లో నోటిఫైడ్ ఏరియాగా పాలన ప్రారంభమైంది. 1995లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో 79,721 మంది జనాభా కలిగి ఉండగా, 33 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు కౌన్సిల్ ఎన్నికలు జరగ్గా, నాలుగుసార్లూ మహిళలే మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గెజిట్ విడుదల కాగా, జీఓ విడుదలయ్యాక పూర్తిగా కార్పొరేషన్గా మారనుంది. అనంతరం స్పెషల్ ఆఫీసర్ నియామకం, డివిజన్ల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. రెండు పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలు కార్పొరేషన్లో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రజలను సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు చెక్కు చెదరకుండా ఉంటే, రెండు, మూడేళ్ల క్రితం నిర్మించిన రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. పెచ్చులు ఊడిపోతున్నాయి. అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కిన్నెరసాని ప్రధాన పైపులైన్ పగలడం, లీకవడంతో కొత్తగూడెం ప్రజలకు తరచూ తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. పట్టణంలో పార్కింగ్ జోన్ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వాహనాలు నిలిపితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో చెప్పుకోదగిన పార్కులు లేవు. ఉన్న పార్కులు సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా మారుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. రామవరంలోని ఏడు వార్డులకు దశాబ్దాలుగా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వడం లేదు. ఇక రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. తొలుత పన్నులు పెరుగుతాయి.. కొత్తగూడెం కార్పొరేషన్తో ఇక్కడి ప్రజల 20 ఏళ్ల కల నెరవేరింది. అదే తరుణంలో కార్పొరేషన్లో ఇంటి పన్నులు, పంపు బిల్లులతో పాటు భూమి ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పడున్న ఆస్తి విలువ రెట్టింపయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లో అధికారులు, సిబ్బంది సంఖ్య పెరగనుండగా, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉంటారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకునేవారు. కానీ కార్పొరేషన్కు ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండనుండటంతో పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కార్పొరేషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడంతోపాటు స్థానికంగా వివిధ రకాల పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కార్పొరేషన్ కాగానే తొలుత ప్రజలే పెరిగిన ఇంటి పన్నులు, పంపు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత కార్పొరేషన్కు అభివృద్ధి నిధులు వస్తాయో, రావోననే అభిప్రాయం కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతోపాటు జిల్లాలో 1/70 యాక్టు ఉండటంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలు ఉండదని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా కార్పొరేషన్ ఏర్పాటుపై తొలుత సుజాతనగర్లోని ఏడు పంచాయతీల ప్రజలు నిరసన తెలిపారు. -
హక్కుల సాధనకు ఐక్యం కావాలి
భద్రాచలంటౌన్: హక్కుల సాధన కోసం గిరిజనులంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అన్నారు. స్థానిక గిరిజన అభ్యదయ భవన్లో ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని చట్టాల్లో గిరిజనులకు ఉన్న హక్కుల అమలు కోసం అందరినీ ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన సమూహల మధ్య ఉన్న తేడాలు, విభేదాలను మిత్ర వైరుద్యంగానే భావించాలని, హిందుత్వవాదులు, కార్పొరేట్ కంపెనీ యజమానులతో కుమ్మకై ్క అడవిలోని ఖనిజాలతోపాటు ఇతర సంపదను దోచుకుపోతున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే ‘కగార్’పేరుతో ఆడ, మగ తేడా లేకుండా ఊచకోతకు దిగుతున్నారని విమర్శించారు. అంతకుముందు పట్టణంలో గిరిజన నృత్యాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సదస్సులో ముర్ర వీరభద్రం, సుర్ణపాక నాగేశ్వరరావు, వేట్ల శాంతన్, కుమార్రెడ్డి, మురళీకృష్ణ, కృష్ణ, ఉదయ్, రజిత, భూద్ర, భూలక్ష్మి, పెంటన్న, చంద్రకళ, రాధ, సురేశ్ పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఈఓ రజనీకుమారి, భక్తులు పాల్గొన్నారు. నేడు శనీశ్వరునికి తైలాభిషేకం పెద్దమ్మగుడి సముదాయంలోని శివాలయంలో శనిత్రయోదశి సందర్భంగా శనివారం శనీశ్వరుడికి తైలాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. న్యాయమూర్తిని కలిసిన పోలీసులుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లును కోర్టు హాల్లో శుక్రవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఇతర పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐలు ఎం.కరుణాకర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ పాల్గొన్నారు.పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి మణుగూరుటౌన్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల లాభాల వాటా అందించామని, పెండింగ్లోని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ అన్నారు. శుక్రవారం ఓసీ–2లో ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన గేట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వేల కుటుంబాల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత కార్మికులపైనే ఉందన్నారు. సమావేశంలో మల్లికార్జున్, షాబుద్దీన్, షేక్ అబ్దుల్ రవూఫ్, బానోత్ కృష్ణ, బుర్ర వెంకటేశ్వర్లు, జయరాజు, మిట్టపల్లి శ్రీను, జీవరత్నం, రామారావు, సంతోష్ చరణ్, పొదిల రామకృష్ణ, జంపాల శ్రీను, తాళ్లూరి రాము, యాకూబ్పాషా, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యటన
దమ్మపేట: సీతారామ ప్రాజెక్టు కాల్వ భూసేకరణకు నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్తీక్ మండలంలోని నాగుపల్లి గ్రామంలో శుక్రవారం పర్యటించారు. సేకరించిన భూములను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారు. స్పందించిన ఆయన.. ప్రతి నిర్వాసిత రైతుకు పరిహారం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మోతీలాల్, గపూర్పాషా, సాగర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు అడ్డుకట్ట అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్న అధికారులను శుక్రవారం కొందరు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామానికి 21 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా వచ్చిన లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు వెళ్లిన డీటీ రామకృష్ణ, కార్యదర్శి స్వప్న, మున్సిపాలిటీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ పేర్లలో అనర్హులు ఉన్నారని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని వాగ్వాదానికి దిగారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని, సర్వేలో నిర్ధారించి అనర్హులు ఉంటే వారి పేర్లు తొలగిస్తామని అధికారులు చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. -
కలెక్టర్ను కలిసిన మణుగూరు సింగరేణి అధికారులు
మణుగూరుటౌన్/సూపర్బజార్(కొత్తగూడెం): గతేడాది ఆగస్టు 30వ తేదీన గొర్రెపేటవాగు వరద, సింగరేణి నుంచి వచ్చిన వరద, భారీ వర్షం కారణంగా మణుగూరు జలదిగ్భందంలో చిక్కుకుంది. కాగా, ‘ముంపుపై ముందస్తు చర్యలేవి’అనే శీర్షికన ‘సాక్షి’లో గతేడాది మే 30న కథనం వచ్చింది. మణుగూరు మునకతో పట్టణంలోని ప్రధాన కాల్వలు, మొట్లు వాగు పూడిక తీయకపోవడం, సింగరేణి నుంచి వచ్చిన వరదలే ప్రధాన కారణంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచన మేరకు సింగరేణి అధికారులు రూ.82.25 లక్షలతో శుక్రవారం ఎంఓయూ చేసుకున్నారు. ఈ నిధులను కట్టువాగు, మొట్ల వాగు పూడికతీత, మున్సిపాలిటీ ముంపునకు గురికాకుండా వినియోగించనున్నారు. కార్యక్రమంలో సంజీవరావు, ధనసరి వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. నేటి నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్కొత్తగూడెంఅర్బన్: సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పర్సనల్ విభాగం జీఎం కవితానాయుడు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు 18 సంవత్సరాల లోపువారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శనివారం నుంచి మే 20వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం, సీఈఆర్ క్లబ్లో శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఉషు, కరాటే, డ్రాయింగ్ విభాగాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుందని, ఆసక్తి కలిగినవారు నేటి సాయంత్రం ప్రకాశం స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. -
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
పాల్వంచ: పట్టణంలోని నవభారత్ కాలనీలో ఉద్యోగుల క్వార్టర్లలో చోరీలు జరిగిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఒకరిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకోగా.. తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సతీశ్కుమార్ వెల్లడించారు. గత జనవరి 25వ తేదీ అర్ధరాత్రి నవభారత్త్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్లలో తాళాలు వేసి ఉన్న వాటిల్లోకి చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలతో మధ్యప్రదేశ్కు చెందిన అనిల్సంఘార్ను గతంలోనే అరెస్ట్ చేసి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనిల్సంఘార్కు బెయిల్ ఇప్పించడం కోసం కొత్తగూడెం కోర్టుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా, తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పింటు భవార్, శోభన్సింగ్ పోలంకిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల్లో వీరి హస్తం ఉన్నట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరి నుంచి 240 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ఫోన్, కీపాడ్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించామని ఆయన వివరించారు. సమావేశంలో సీఐ సతీశ్, ఎస్ఐలు సుమన్, ప్రవీణ్, రాఘవయ్య, జీవన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. 240 గ్రాముల బంగారం స్వాధీనం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పెద్దారపు రాజేశ్, పలగాని ఉదయ్కిరణ్ (16) ద్విచక్రవాహనంపై భద్రాచలం వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మండలంలోని మామిళ్లగూడెం సమీపంలో బైక్ కుక్కను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఉదయ్కిరణ్ ఎగిరి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేశ్ స్వల్పగాయాలు కాగా.. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పురుగులమందు తాగి లారీడ్రైవర్ ఆత్మహత్య టేకులపల్లి: పురుగులమందు తాగి లారీడ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన బాదావత్ బాలు (55) అలియాస్ కృష్ణ లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి గ్రామంలో ఉన్న తన మొక్కజొన్న చేనులో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొత్తగూడెం.. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బాదావత్ శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆఫ్టైప్ మొక్కల పరిశీలన
దమ్మపేట: మండలంలోని జగ్గారం గ్రామ పరిధిలోని రైతుల పామాయిల్ క్షేత్రాల్లో అంతగా దిగుబడి రాని ఆఫ్టైప్ మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఐఐఓపీఆర్ విశ్రాంత శాస్త్రవేత్త బీఎన్.రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జన్యులోపం, విత్తనలోపం, పెంపకంలో లోపాలు తదితర కారణాల వల్ల ఆఫ్టైప్, నాణ్యత లేని మొక్కలు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్త తెలిపారు. దిగుబడి లోపంపై పూర్తిస్థాయిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గాడ్రెజ్ కంపెనీ ద్వారా మొక్కలు తెచ్చి, సాగు చేసిన క్షేత్రాల్లో ఆఫ్టైప్ మొక్కలు రాలేదని, ఆయిల్ ఫెడ్ నర్సరీ మొక్కల్లోనే అధికంగా ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని చైర్మన్ను కోరారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్రెడ్డి, డివిజనల్ నర్సరీ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు, ప్రవీణ్రెడ్డి, రైతు సంఘం నాయకులు తుంబూరు ఉమామహేశ్వరరావు, కొక్కెరపాటి పుల్లయ్య, చెలికాని సూరిబాబు, కారం శ్రీరాములు, మడివి బాలరాజు పాల్గొన్నారు. -
సీతాపతి.. కరోడ్పతి!
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఈ ఏడాది రూ.2.69 కోట్లు.. ఈ ఏడాది రామయ్యకు నవమి ఆదాయం భారీగా పెరిగింది. అన్ని విభాగాల్లో కలిపి రూ.2,69,09,390 సమకూరింది. ఇందులో అధికంగా సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారానే రూ.1,32,83,000 వచ్చింది. చిన్న లడ్డూల అమ్మకం ద్వారా రూ.49,07,775, మహా లడ్డూల ద్వారా రూ.2,89,000 సమకూరింది. ఇక తలంబ్రాల అమ్మకంలో పోస్టల్ ద్వారా రూ.6,64,225, ఆర్టీసీ కార్గో ద్వారా 41,09,200, ఆలయ వెబ్సైట్ ద్వారా 5,06,750, ఆలయ ప్రచార శాఖ ద్వారా 13,87,050 ఆదాయం వచ్చింది. ఆన్లైన్లో పరోక్ష సేవల ద్వారా 5,02,200, రూ.5 వేల పరోక్ష సేవల ద్వారా రూ. 3 లక్షల 45 వేల ఆదాయం చేకూరింది. పోస్టల్ శాఖ ద్వారా చేపట్టిన అంతరాలయ అర్చనకు భారీ స్పందన లభించింది. 2702 బుకింగ్లతో రూ.8,78,150 నిధులు సమకూరాయి. గతేడాది కంటే రూ.80 లక్షలు అదనం శ్రీరామనవమికి 2024లో వచ్చిన ఆదాయం కంటే ఈ ఏడాది ఆదాయం పెరగం విశేషం. గతేడాది సుమారు రూ. కోటి 89 వేల 61 వేలు రాగా ఈ ఏడాది అదనంగా సుమారు రూ. 80 లక్షల ఆదాయం పెరిగింది. ఇందులో సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారా సుమారు రూ.10 లక్షల ఆదాయం పెరిగింది. గతేడాది ముత్యాల తలంబ్రాల విక్రయం ద్వారా కేవలం రూ. 30 లక్షలు రాగా, ఈ ఏడాది రూ.66 లక్షల 67 వేల 225 ఆదాయం సమకూరింది. పోస్టల్ శాఖ ద్వారా బుకింగ్ చేసిన అంతరాలయ అర్చన ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కేవలం రూ.91 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,78,150కు పెరిగింది. ఇందులో సీఎం, వీవీఐపీ సెక్టార్ల కోసం ఉభయదాతల టికెట్లను తగ్గించారు. దీనివల్ల సుమారు రూ.16 లక్షల ఆదాయానికి గండి పడింది. దీంతోపాటు మరికొన్ని పొదుపు చర్యలను పాటించి ఉంటే ఆదాయం సుమారు రూ. 3 కోట్లకు చేరేది. న్యూస్రీల్గణనీయంగా పెరిగిన శ్రీరామనవమి ఆదాయం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి రూ.2.69 కోట్ల రాబడి ముత్యాల తలంబ్రాల విక్రయాలకు విశేష ఆదరణ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణ మహోత్సవ ఆదాయం లెక్క తేలింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 6,7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. వేడుకల్లో టికెట్లు, తలంబ్రాలు, లడ్డూల అమ్మకాలు, పరోక్ష సేవల ద్వారా రామయ్యకు భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కంటే గణనీయంగా పెరిగింది. ఆ లెక్కలను ఆలయ అధికారులు గురువారం వెల్లడించారు. –భద్రాచలంపెరిగిన ముత్యాల తలంబ్రాల అమ్మకాలు.. ప్రతీ ఏడాది ముత్యాల తలంబ్రాలకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. దేవస్థానం కౌంటర్లు, ప్రచార శాఖలతోపాటు ఆర్టీసీ కార్గో, పోస్టల్ శాఖల ద్వారా తలంబ్రాలు విక్రయిస్తున్నారు. దీంతో దేవస్థానంతోపాటు ఆర్టీసీ, పోస్టల్ శాఖలకు కూడా ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఆర్టీసీ కార్గో ద్వారా 46,400 ఫ్యాకెట్లను అమ్మగా, ఈఏడాది లక్షా 64 వేల 368 ప్యాకెట్లను విక్రయించారు. సుమారు 80 వేల ప్యాకెట్ల అదనంగా అమ్మకం చేశారు. పోస్టల్ శాఖ ద్వారా గతేడాది 2,531 ప్యాకెట్లు విక్రయించగా, ఈ ఏడాది 26,569 ప్యాకెట్లను అమ్మారు. దేవస్థానం ప్రచార శాఖ ద్వారా గతేడాది 31,518 కాగా, ఈ ఏడాది 55,482 ప్యాకెట్లను విక్రయించారు. ముత్యాల తలంబ్రాలు, దేవస్థాన కేలండర్లు, డైరీలు, వివిధ పుస్తకాలను అన్ని శాఖల ద్వారా ఏడాదంతా భక్తులకు అందుబాటులో ఉంచితే మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. -
రామయ్య కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, వేదపడింతులు, భక్తులు పాల్గొన్నారు. రేపు రుద్రహోమంమండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు వరకు హోమం జరుగుతుందని పేర్కొన్నారు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లలో సంప్రదించాలని కోరారు. వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు వైద్యుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రుల్లో జనరల్ సర్జన్ వైద్య నిపుణులు, ఇతర ఆస్పత్రులలో డెర్మటాలజిస్టులు, భద్రాచలం, బూర్గంపాడులలో ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. పలువురు సీఐల బదిలీకొత్తగూడెంటౌన్: జిల్లాలోని పలువురు సీఐలను బదిలీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కొత్తగూడెం డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తున్న సీఐ మడిపెల్లి నాగరాజును భద్రాచలం టౌన్ ఎస్హెచ్ఓగా, కొత్తగూడెం సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న పింగిలి నాగరాజును అశ్వారావుపేట సర్కిల్కు బదిలీ చేశారు. తాటిపాముల కరుణాకర్ను అశ్వారావుపేట నుంచి బదిలీ చేస్తూ హైదరాబాద్ మల్టీజోన్–1 ఐజీపీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భద్రాచలంలో.. భద్రాచలంఅర్బన్: ఈ నెల 10న భద్రాచలం సీఐ బర్పాటి రమేష్ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో దీంతో 15 రోజుల నుంచి అక్కడ సీఐ పోస్టు ఖాళీగా ఉండగా, ఆ స్థానంలో నాగరాజును నియమించారు. నేడు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి
చర్ల/దుమ్ముగూడెం: వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలను, వసతి గృహాలను ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వార్డెన్లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్, బాత్రూం ఇతర మౌలిక వసతులకు నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 15 రోజుల్లోగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డైనింగ్ హాల్ ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. వేసవి సెలవుల్లో పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంచకుండా రోజూ శుభ్రం చేయించాలని చెప్పారు. హెచ్ఎం సావిత్రి, డీఈ హరీష్, ఏఈ రవి, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ -
ఆదివాసీల భూములకు నష్టం ఉండదు
ములకలపల్లి/జూలూరుపాడు: భూ భారతి చట్టంతో ఏజెన్సీలో ఆదివాసీల భూములకు ఏ మాత్రమూ నష్టం వాటిల్లదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ స్పష్టం చేశారు. ములకలపల్లి, జూలురుపాడులలో గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఏజ్సెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను గౌరవిస్తూనే స్థానిక భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కామారెడ్డి, నారాయణపేట, ఖమ్మం, ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా భూభారతి సర్వే చేపడుతున్నట్లు వివరించారు. ధరణి పోర్టల్లోని లోపాలను సవరిస్తూ భూ భారతి చట్టం రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల భూములకు రక్షణతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు ఆందోళనలు, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధరణితో నష్టపోయారు.. అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాలోత్ రాందాస్ నాయక్లు మాట్లాడుతూ భూభారతి ద్వారా రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు దక్కుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు నష్టపోయారని అన్నారు. ధరణి వల్ల మ్యానువల్ పహాణీ పొందే అవకాశం కోల్పోయారని, బ్యాంకులు రుణాలు పొందలేక పోయారచని, రుణమాఫీ కూడా వర్తించలేదన్నారు. కానీ భూ భారతి చట్టంతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డీఓ డి.మధు, తహసీల్దార్లు గుడ్ల పుల్లారావు, కె.స్వాతిబిందు, ఎంపీడీఓలు రేవతి, డి.కరుణాకర్ రెడ్డి, ఏడీఏలు, నరసింహారావు, రవికుమార్, ఏఓలు దీపక్ ఆనంద్, అరుణ్బాబు, ఎంపీఓ తులసిరామ్, ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాళోత్ మంగీలాల్ నాయక్, తాండ్ర ప్రభాకర్రావు, నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, బానోత్ విజయాబాయి, పర్వతనేని అమర్నాఽథ్, కరుటూరి కృష్ణ, తిరుపతిరెడ్డి, ప్రసాద్, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూ భారతి చట్టం అవగాహన సదస్సుల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి కొత్తగూడెంఅర్బన్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెలా తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శరత్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సీఐ కరంచంద్, ఎకై ్సజ్ సీఐ జానయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్టీఓ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నూనె గింజల సాగును ప్రోత్సహించాలిజిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం నిర్వహించిన నూనె గింజల మిషన్ జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నూనె గింజల సాగుకు వ్యయం, చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, ఆదాయం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ జితేష్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఉద్యానవన శాఖాధికారి కిషోర్బాబు, కేవీకే శాస్త్రవేత్త నారాయణమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..
● జిల్లాకు చేరిన మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ ● స్టిచ్చింగ్ పనులు చేపడుతున్న మహిళా సంఘాలు ● ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంనాటికి అందించే అవకాశం కొత్తగూడెంఅర్బన్: 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ చేరుకుంది. పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రంలోని పాతకొత్తగూడెం స్కూల్లో భద్రపరిచారు. మిగతా విడతల్లో కూడా వచ్చే పుస్తకాలను గోదాంలో ఉంచి, మే చివరిలోగా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పంపించనున్నారు. పాఠశాలల పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు కొత్త యూనిఫాం అందించనున్నారు. మొదటి విడతగా యూనిఫాం సంబంధించిన బాటమ్ క్లాత్ చేరుకోగా, మహిళా సంఘాల సభ్యులకు స్టిచ్చింగ్ నిమిత్తం అందజేశారు. వారు యూనిఫాం కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందజేస్తున్నారు. గతేడాది ఒక్కో యూనిఫాంకు స్టిచ్చింగ్ చార్జీ రూ.50 చొప్పున అందజేయగా, ఈసారి రూ.75కు పెంచారు. రెండు జతలు కుట్టినందుకు రూ.150 అందించనున్నారు. పట్టణాల్లో మెప్మా, మండలాల్లో సెర్ప్ సిబ్బంది స్టిచ్చింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా యూనిఫాం చొక్కాల క్లాత్ రెండో దశలో రానుందని అధికారులు తెలిపారు. గోదాంకు చేరిన 1,10,200 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రానున్న విద్యాసంవత్సరంలో 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంది. మొదటి విడతగా 1,10, 200 పుస్తకాలు చేరాయి. ఇంకా 3,98, 200 పుస్తకాలు రావాల్సి ఉంది. వచ్చిన పుస్తకాలను కొత్తగూడెం గోదాంలో భద్రపరిచారు. దీంతోపాటు మొదటి విడతలో యూనిఫాంలో ప్యాంట్కు సంబంధించిన క్లాత్ 2,50,060.45 మీటర్లు అందజేశారు. -
అందరికీ న్యాయం దక్కాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కొత్తగూడెంటౌన్: అందరికీ న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంతత్ అన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జడ్జి ఎస్. సరిత, కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా రాజేందర్ కొత్తగూడెంటౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం.రాజేందర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. -
అడవులను కాపాడుకుందాం
చండ్రుగొండ : అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి అన్నారు. మండలంలోని చండ్రుగొండ రేంజ్ పరిధిలో బెండాలపాడు అటవీప్రాంతంలో గురువారం ఆయన పర్యటించారు. మారుజాతి ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడవులను నాశనం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఆయన వెంట రేంజర్ ఎల్లయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి -
ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కల పరిశీలన
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఆఫ్టైప్ మొక్కలు ఉన్న ఆయిల్పామ్ తోటలను రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అశ్వారావుపేట మండలం గంగారం, వాగొడ్డుగూడెం గ్రామాలు, ములకలపల్లి మండలం తిమ్మంపేట, పొగళ్లపల్లి గ్రామాల్లోని పామాయిల్ తోటల్లో ఉన్న ఆఫ్టైప్ మొక్కలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నర్సరీ నుంచి 2017–2022 మధ్య కాలంలో రైతులకు అందించిన ఆయిల్ పామ్ మొక్కల్లోనే ఆఫ్టైప్ మొక్కలు అత్యధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే క్షేత్ర సందర్శన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ ఐఐఓపీఆర్ అధికారి బీఎన్రావు మాట్లాడుతూ నర్సరీ దశలో చీడపీడలు సోకినా, పెంపకంలో నాణ్యతాలోపాలు ఉన్నా అనారోగ్యమైన మొక్కలు పెరిగే అవకాశం ఉంటుందని, వీటిని సకాలంలో గుర్తించి కల్లింగ్ చేయాల్సిందని వివరించారు. కానీ కల్లింగ్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని తెలుస్తోందని తెలిపారు. డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, అధికారులు శంకర్, రాధా కృష్ణ, నాగబాబు, కల్యాణ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్రమహాసభలు
తొలిరోజు ప్రదర్శన, బహిరంగ సభ ఖమ్మంమయూరిసెంటర్: విద్యా రంగ సమస్యలపై చర్చించి, పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు వేదికగా నిలవనున్నాయి. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంతోపాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట ఎర్రతోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2002లో ఖమ్మంలో సంఘం రాష్ట్ర మహాసభలు జరగ్గా.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. సభల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం జెడ్పీ సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన, ఆతర్వాత కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది ప్రతినిధులతో పాటు జిల్లా నాయకులు పాల్గొననున్నారు. కాగా, సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీ.పీ.సాను ప్రసంగించనుండగా.. సినీ నటుడు మాదాల రవి, ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ్, ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
చేపల వలకు చిక్కిన మొసలి కళేబరం
అశ్వాపురం: మండలంలోని తుమ్మలచెరువులో గురువారం చేపలు పడుతుండగా వలలో మొసలి పిల్ల చిక్కింది. అది కూడా చనిపోయి ఉండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఎఫ్ఆర్ఓ రమేశ్, సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో ఖననం చేశారు. ఏడుగురిపై కేసు నమోదు బూర్గంపాడు: పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ మండల అధ్యక్షులు బీరక సాయిశ్రీనివాస్, గుణపాటి వెంకటరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులపై గురువారం బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. జింకలగూడెం గ్రామం వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన బీరక సాయిశ్రీనివాస్, గుణపాటి వెంకటరెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్ లక్ము, ఇస్మాయిల్, నాగుల్మీరా, చాంద్బీ, హుస్సేన్, నాగుల్మీరా, ఎండీ మోహిన్ దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. సాయిశ్రీనివాస్ తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి గుండాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. జూలూరుపాడుకు చెందిన కళ్లెం సాయిచరణ్ కొంతకాలంగా ఆళ్లపల్లి మండలం అనంతోగులో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో జిన్నెలగూడెంలో వివాహానికి హాజరై వస్తున్న క్రమంలో రాయికి గుద్దుకుని బైక్ పల్టీకొట్టింది. గాయపడిన సాయిచరణ్ను స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి
చండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కుక్కలదాడిలో 12 గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం వెలుగుచూసింది. రావికంపాడు గ్రామంలో ఆనంగి పెద్దపకీర్ తన గొర్రెలను ఇంటికి దూరంగా ఉన్న పాకలో ఉంచాడు. అర్ధరాత్రి వేళ కుక్కలగుంపు దాడి చేయడంతో 12 గొర్రెలు మత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాలపాలై అపస్మారకస్థితికి చేరాయి. గమనించిన బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. యువకుడి ఔదార్యం కొత్తగూడెంఅర్బన్: ఏటీఎంలో దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి ఓ యువకుడు ఔద్యార్యం చాటుకున్నాడు. కొత్తగూడెంలోని యాక్సిన్ బ్యాంకు ఏటీఎంలో రామవరానికి చెందిన టంగుటూరి సుదీప్కు రూ.50 వేలు దొరికాయి. ఆ డబ్బును సుదీప్ బ్యాంకు అధికారులకు అందించి, వారి సమక్షంలో పోగొట్టుకున్న వ్యక్తికి అందించాడు. దీంతో బ్యాంకు అధికారులు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి సుదీప్ను సన్మానించారు. -
క్రీడలు లేని ప్రాంగణాలు
లక్ష్యానికి దూరంగా క్రీడా ప్రాంగణాలు ● పంచాయతీలకే పరిమితమైన క్రీడా కిట్లు ● జిల్లాలో 730 ప్రాంగణాలకు కిట్లు పంపిణీ ● వేసవి దృష్ట్యా వినియోగంలోకి తెస్తే మేలు చుంచుపల్లి: గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు సమయంలో అధికారులు చూపిన ఉత్సాహం, వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో చూపకపోవడంతో మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో ప్రాంగణానికి క్రీడా సామగ్రిని పంపిణీ చేసినా వాటిని బయటకు తీసి ఆటలు ఆడిన దాఖలాలు ఎక్కడా లేవు. గత ప్రభుత్వం 2022లో అనువైన స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. యువకులు ఆటలాడేందుకు ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ కోర్టులను ఏర్పాటు చేయించడమే కాకుండా, కోచ్ల ద్వారా యువత, చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. కానీ, క్షేత్రస్థాయిలో క్రీడా ప్రాంగణాల లక్ష్యం ఆచరణకు ఆమడ దూరంలోనే ఆగిపోయింది. జిల్లాలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్లుగా చెత్తా చెదారం పేరుకుపోయి ఆదరణకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన ఐరన్ సామగ్రి దొంగల పాలైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని క్రీడా పరికరాలను తెలంగాణ క్రీడాశాఖ ద్వారా హడావుడిగా పంపిణీ చేసింది. క్రికెట్, ఖో–ఖో, వాలీబాల్, ఫుట్బాల్, స్కిప్పింగ్తో పాటు పలురకాల పరికరాలను గ్రామ పంచాయతీలకు అందజేసింది. వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా ఓ గదిలో మూలకు పడేశారు. అధికారులు క్రీడా పాంగాణాల్లో సరైన వసతులు కల్పించి, ఆట పరికరాలను వినియోగంలోకి తేవాలని యువకులు కోరుతున్నారు. అలంకారప్రాయంగా ప్రాంగణాలు గ్రామాల పారిధిలో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండటంతో శ్మశానవాటికల పక్కన, పాఠశాలల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్ది పాటి స్థలాల్లో తెలంగాణ ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్ కోర్టు, వ్యాయామం చేసేందుకు రెండు పరికరాలు ఏర్పాటు చేసి నామ్కేవాస్తేగా వదిలేశారు. కొన్ని చోట్ల కేవలం క్రీడా ప్రాంగణం పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను మరిచారు. ఇక పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగా స్థలం కొరత వల్ల నాలుగైదు వార్డులకు కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేశారు. సరైన వసతులు కల్పించకపోవడంతో యువకులు, క్రీడాకారులు ఆటలు ఆడేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. అటు గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. మరోవైపు నిధుల కొరత వల్ల పంచాయతీలు వీటి నిర్వాహణ చేపట్టలేక పూర్తిగా గాలికొదిలేశాయని పలువురు అంటున్నారు. అటకెక్కిన క్రీడా సామగ్రి జిల్లాలో పలు క్రీడా ప్రాంగణాలకు 2023 అక్టోబర్లో 730 కిట్లను పంపిణీ చేశారు. ముందుగా మండల కేంద్రాలు, మున్సిపాలిటీలకు సరఫరా చేయగా అక్కడి నుంచి అధికారులు గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఒక్కొక్క క్రీడా యూనిట్ విలువ రూ.63 వేలు. ఇందులో జిమ్ పరికరాలతో పాటు క్రికెట్, వాలీబాల్ ఆటలకు సంబంధించిన సామగ్రి ఉంది. కిట్లతో పూర్తిస్థాయిలో ఆటలాడిన దాఖలాలే లేవు. అటు పంపిణీ చేసిన క్రీడా కిట్లు చాలా చోట్ల వినియోగంలో లేక గ్రామ పంచాయతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటికైనా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఈ క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేకపోవడంతో అవి ఏళ్లుగా ఆదరణకు నోచుకోవడం లేదు. వీటిపై పర్యవేక్షణ కొరవడటంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా అధికారులు చొరవ తీసుకొని ప్రాంగణాలను వినియోగంలోకి తేస్తే యువతకు మేలు జరుగుతుంది. –మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో యువకుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కొంత నిర్లక్ష్యానికి గురువుతున్న మాట వాస్తవమే. గ్రామ పంచాయతీల ఆధ్వర్యలో వీటి నిర్వహణను చేపట్టాల్సి ఉంది. కొన్ని నెలలుగా నిధుల కొరతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. వినియోగంలోకి తేవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. –వి.చంద్రమౌళి, డీపీఓ -
యువజన సంఘాల పాత్ర కీలకం
ములకలపల్లి: దేశ రక్షణలో విద్యార్థి యువజన సంఘాల పాత్ర కీలకమని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శులు కల్లూరి ధర్మేంద్ర, ఇటుకల రామకృష్ణ, వేముల కొండల్రావు అన్నారు. ములకలపల్లిలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో గురువారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ప్రజా నాట్య మండలి బాధ్యుల వర్క్షాప్ నిర్వహించారు. లౌకిక భారతావనిలో మతం పేరుతో చిచ్చులు పెట్టడంతో ఉగ్రమూకలు ప్రజలపై ఆకస్మిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు దేశంలో మారణహోమం సృష్టిస్తున్నాయన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉప్పుశెట్టి రాహుల్, హరీశ్, అజిత్, ఎండీ యూసుఫ్, నరాటి రమేశ్, జబ్బార్, అనుమల సాయి తదిరులు పాల్గొన్నారు. గిరిజనుల రుచులతో ఆకట్టుకోవాలి భద్రాచలంటౌన్: ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులను గిరిజనుల రుచులతో ఆకట్టుకోవాలని ఏపీఓ డేవిడ్రాజ్ అన్నారు. మ్యూజియం ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులతో వంటకాల తయారీపై గురువారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. స్టాళ్ల నిర్వాహకులు పరిశుభ్రత పాటించి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. స్టాళ్ల ఎదుట కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించడంతో పాటు తినుబండారాలు తయారు చేస్తున్న సిబ్బంది చేతులకు గ్లౌజులతో పాటు, తలకి రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ప్రతీది ఎంఆర్పీకే విక్రయించాలని, పర్యాటకులు కోరిన తినుబండారాలు అధిక ధరకు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే ఆ స్టాల్ను తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, గిరిజన స్టాళ్ల నిర్వాహకులు సుధారాణి, రాజేందర్, భూలక్ష్మి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలి పాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. మండలంలోని తోగ్గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌజింగ్ పీడీ శంకర్తో కలిసి గురువారం ఆయన పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. పనుల వివరాలు, డబ్బుల జమ గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని చెప్పగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. హౌజింగ్ బోర్డు ఏఈ రమేశ్, గ్రామ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు బీట్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం రేంజ్ పరిధిలోని మర్రిగూడెం సెక్షన్ ఎల్లాపురం బీట్ అధికారి చంద్రయ్య, సర్వాపురం బీట్ అధికారి నగేశ్ను సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ కృష్ణగౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఎల్లాపురం గ్రామ శివారులో అటవీ భూమికి పక్కనే సాగు చేసుకుంటున్న రైతులు సరిహద్దు ప్రాంతంలో పోడు నరకడాన్ని బీట్ అధికారుల నిర్లక్ష్యంగా నిర్ధారించి, అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో డీఎఫ్ఓ పేర్కొన్నారు. కుక్కల దాడిలో బాలుడికి గాయాలు కొత్తగూడెంఅర్బన్: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 5వ వార్డు నర్సు క్వార్టర్స్ ఏరియాలో ఇంటి ముందు గురువారం ఆడుతున్న బాలుడిపై రెండు కుక్కలు దాడి చేయగా చేతికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి.. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. -
పాడి రైతుల సంక్షేమానికి కృషి
● పాల ధర పెంపు, ఎప్పటికప్పుడు చెల్లింపులు ● రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్రెడ్డి ఖమ్మంవ్యవసాయం: పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(విజయ డెయిరీ) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. ఖమ్మంలో గురువారం రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు చెల్లించడమేకాక గేదె పాల ధరను లీటర్కు రూ.5 పెంచామని తెలిపారు. అనంతరం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో సంఘాలను ఏర్పాటుచేసుకుని, సేకరించిన పాలను విజయ డెయిరీకి పంపిస్తున్నామని తెలిపారు. అనంతరం చైర్మన్ విజయ డెయిరీలోని వివిధ విభాగాలను పరిశీలించి డిప్యూటీ డైరెక్టర్ పి.మోహనమురళితో చర్చించారు. సంస్థ జనరల్ మేనేజర్ మధుసూదన్రావు, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, పశుగణాభివృద్ది సంస్థ జిల్లా చైర్మన్ కె.నాగేశ్వరరావు, మేనేజర్ మురళీకృష్ణ, ఉద్యోగులు నాగమణి, హనుమంత్, కృష్ణ, అనితకుమారి, నాగశ్రీ, శ్రీలత, అప్పారావు, వి.మురళీకృష్ణ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత మార్కెట్లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ను చైర్మన్ అమిత్రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, పువ్వాళ్ల దర్గా ప్రసాద్, దొబ్బల సౌజన్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే పంచాయతీరాజ్ లక్ష్యం
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): గ్రామాల అభివృద్ధే పంచాయతీ రాజ్ శాఖ లక్ష్యమని, ఆ దిశగా గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.నాగలక్ష్మి సూచించారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని అబ్బుగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.చంద్రమౌళితో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రతి కుటుంబం తన ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహాలక్ష్మి పాల్గొన్నారు. -
ఏడు కిలోల గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎకై ్సజ్, టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకుని సీజ్ చేశారు. కొత్తగూడెం టాస్క్ఫోర్స్ ఎస్ఐ గౌతమ్ కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పల్సర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగుల్లో ఏడు కిలోల గంజాయి లభించింది. ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, గంజాయి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు. తనిఖీల్లో సిబ్బంది హబీబ్పాషా, వెంకటనారాయణ, గురవయ్య, శ్రావణి, పార్థసారథి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఏడాది జైలు శిక్ష భద్రాచలంటౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి భద్రాచలం ఫ్లస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. బుర్గంపాడుకు చెందిన ఆకుల లక్ష్మినారాయణరెడ్డి వద్ద కేటీపీఎస్ సీనియర్ ఇంజనీర్ సరిగొమ్ముల యుగపతి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. అవి తీర్చేందుకు యుగపడి చెక్కు ఇవ్వగా బ్యాంకులో జమ చేస్తే తిరస్కరణకు గురైంది. దీంతో లక్ష్మీణారాయణరెడ్డి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయగా.. వాదనలు విన్న న్యాయమూర్తి శివనాయక్ యుగపతికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6.50 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. -
పెసలు.. ధర లేక దిగాలు
● ఉమ్మడి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట సాగు ● ప్రభుత్వ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం ● క్వింటాకు రూ.2,500 మేర నష్టపోతున్న రైతులు ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో రైతులు సాగు చేసిన పెసర పంటకు కనీస మద్దతు ధర కరువైంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించినా ఎక్కడా అది అమలు కావడం లేదు. పెసర పంట ప్రస్తుతం చేతికందుతుండగా, కొందరు రైతులు విక్రయిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటకు వ్యాపారులు గురువారం గరిష్టంగా రూ.7,050 ధర నిర్ణయించగా, మోడల్ ధర రూ.6,200, కనిష్ట ధర రూ.4 వేలే అందుతోంది. జెండాపాట ధర గరిష్ట ధర ఖరారు చేస్తున్నప్పటికీ.. ఎక్కువ పంటను మోడల్, కనిష్ట ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. దిగుబడి అంతంతే.. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి పంటగా 10 వేల ఎకరాల్లో పెసర సాగు చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఎక్కువ మంది మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పెసర విస్తీర్ణం తగ్గింది. నీటి తడులు సమృద్ధిగా అందించిన చోట ఎకరాకు 5 – 6 క్వింటాళ్లు, మిగతా ప్రాంతాల్లో 2 – 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దిగుబడి తగ్గిన నేపథ్యాన ధర అయినా మెరుగ్గా ఉంటుందని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిమాండ్ ఉన్నా తక్కువ ధర పెసల కొనుగోళ్లలో వ్యాపారుల ఇష్టారాజ్యం కొసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.8,682 మద్దతు ధర నిర్ణయించినా ఆ ధర రైతులకు లభించటం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ ధర దక్కే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పంట నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు చెల్లిస్తుండగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.700 నుంచి రూ.7,300 వరకు ధర పలుకుతోంది. దిగుబడి తగ్గిన నేపథ్యాన పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్ఫెడ్ కొనుగోళ్లు లేక.. పంట నాణ్యతగా ఉండడం.. డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారుల తీరుతో క్వింటాకు రూ.2,500 వరకు రైతులు నష్టపోతున్నారు. నాణ్యత లేని పంటకు రూ.3,700కు మించి చెల్లించడంలేదు. పెసల విక్రయాలు ప్రారంభమై, రైతులు దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు నాఫెడ్ సహకారంతో మార్క్ఫెడ్ పెసలను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏదీ లేనట్లు తెలుస్తుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూ భారతితో రైతులకు మేలు
దుమ్ముగూడెం/చర్ల : భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం గంగోలు, చర్ల మండల కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న లోపాలను సరి చేస్తూ నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. రైతులు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వారసత్వ హక్కులతో పాటు సాదాబైనామాను సులభంగా చేసుకోవచ్చన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి సమస్యలకు ఈ చట్టం పరిష్కారం చూపుతుందని వివరించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు, ఏడీఈ సుధాకర్రావు, తహసీల్దార్లు అశోక్కుమార్, ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఓలు నవీన్కుమార్, లావణ్య, ఏఎంసీ చైర్మన్లు ఇర్పా శ్రీను, తెల్లం సీతమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు కిలిమి ఎల్లారెడ్డి, పరుచూరి రవికుమార్, మందపాటి అచ్యుత శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి
డీఈఓ వెంకటేశ్వరా చారిబూర్గంపాడు: ప్రాథమిక విద్యలో ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాముఖ్యత పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి అన్నారు. అంజనాపురం ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న ఏఐ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంజనాపురం పాఠశాల అభివృద్ధిలో జిల్లాలోనే ముందుందని తెలిపారు. పాఠశాల వాతావరణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఏఐలో కూడా అంజనాపురం పాఠశాల జిల్లాలో అగ్రస్థానం సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, నోట్ పుస్తకాలు అందించారు. ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కిషన్రావు, ఉపాధ్యాయులు బాబూరావు, శంకర్, సునీత, పద్మ పాల్గొన్నారు. -
తాగునీటికి ఢోకా లేనట్టే..
సమ్మక్క బరాజ్ నుంచి దుమ్ముగూడెం ఆనకట్టకు నీరు అశ్వాపురం : కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆనకట్ట వద్ద ఇటీవల నీరు తగ్గగా ఏప్రిల్, మే నెలల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క బరాజ్ నుంచి ఈనెల 14న 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు బుధవారం ఆనకట్ట వద్దకు చేరింది. దీంతో నీటిమట్టం 47.7 మీటర్లకు చేరింది. నిరంతరాయంగా నీరు విడుదలై నీటిమట్టం 49.6 మీటర్లకు పెరిగితే ఈ వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. -
ఎంసీహెచ్ కిట్.. కట్..
పేరు మార్చారు.. సరఫరా మరిచారు.. ● జిల్లాలో ఏడాదికి 15 నుంచి 20 వేల వరకు ప్రసవాలు ● ప్రారంభంలో వెయ్యి కిట్లు పంపిణీ.. ● తర్వాత చేతులెత్తేసిన ప్రభుత్వం ఇల్లెందు: గర్భిణులు, బాలింతలకు అందించే పథకాల పేర్లను ప్రస్తుత ప్రభుత్వం మార్చింది. కానీ, ఆ కిట్లను సరఫరా చేయడం లేదు. నాటి ప్రభుత్వంలో కేసీఆర్ కిట్గా చెలామణిలో ఉన్న పథకానికి ఎంసీహెచ్ కిట్గా పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సరఫరా చేయడం మానేసింది. 10 నెలలుగా గర్భిణులు, బాలింతలకు అందజేసే ఏ కిట్టు కూడా అందటం లేదు. ఎంసీహెచ్ కిట్తో పాటు న్యూట్రీషియన్ కిట్, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు నగదు ప్రోత్సాహం కూడా అందటం లేదు. ప్రస్తుతం కిట్ల కోసం గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024–25 సంవత్సరానికి గాను సుమారు 13,500 వరకు ప్రసవాలు జరిగాయి. అందులో ఒక్కరికి కూడా కిట్ అందలేదు. జిల్లాలో 29 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 376 సబ్ సెంటర్లు, 7 ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఒక్క ఇల్లెందు ఏరియా వైద్యశాలలోనే 1,949 ప్రసవాలు జరగగా 1,624 మందికి ఎంసీహెచ్ కిట్లు అందజేశారు. ఇంకా 324 మందికి అందలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి అందడంలేదు. ప్రసవాల సంఖ్య పెరిగేదెలా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఎంసీహెచ్ కిట్, న్యూట్రీషియన్ కిట్లతో పాటు నగదు ప్రోత్సాహం కూడా ప్రస్తుతం అందటం లేదు. ప్రభుత్వం నుంచి ఈ పథకాల పంపణీ ఊసే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ కిట్ను తొలిగించి గర్భిణుల కోసం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కిట్ను ప్రవేశపెట్టారు. ఏరియా వైద్యశాలల్లోనే ఏడాదికి 15 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఎంసీహెచ్ కిట్గా పేరు మార్చిన తర్వాత జిల్లాలో వెయ్యి కిట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత సరఫరా ఆగిపోయింది. రూ.12 వేలు, రూ.13 వేల పారితోషికం కూడా రావడం లేదు. గర్భిణులకు 5వ నెల నుంచి 8వ నెల వరకు ఏడాడిలో రెండు సార్లు ఇచ్చే న్యూట్రీషియన్ కిట్లు కూడా ఇవ్వడం లేదు. మూడు దశల్లో రూ.12 వేలు అందజేయటం, అమ్మాయి అయితే మరో వెయ్యి అదనంగా అందించే నగదు ప్రోత్సాహానికీ చెక్ పడింది. తొలి విడత రూ.3 వేలు, రెండో విడత రూ.4 వేలు, తర్వాత రూ.5 వేలు అందిస్తే అవి పేదలకు ఎంతగానో ఉపయోగపడేవి. ఎంసీహెచ్ కిట్లో తల్లీ, బిడ్డకు కావాల్సిన దుస్తులు, సబ్బులు, నూనెలు, పౌడర్లు, ఈగలు, దోమలు వాలకుండా తెర, టవళ్లు లాంటి వస్తువులు ఉండేవి. న్యూట్రీషియన్ కిట్ అందలేదు.. గర్భిణులకు ఇచ్చే న్యూట్రీషియన్ కిట్ అందలేదు. ప్రసూతి సమయంలో అందజేసే కిట్ కూడా ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న వస్తువులను వాడుకున్నాం. గతంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం అయితే అందజేసే కిట్ను ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే.. ప్రభుత్వం నుంచి రాలేదంటున్నారు. –స్రవంతి, బాలింత, లక్ష్మీపురం, ఆళ్లపల్లి ప్రభుత్వం నుంచి సరఫరా లేదు ప్రభుత్వం నుంచి సరఫరా నిలిచిపోయింది. గతంలో కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్ ఉండగా ప్రస్తుతం ఎంసీహెచ్ కిట్గా మార్చారు. ఏటా ఏరియా ఆస్పత్రుల్లో 15 నుంచి 20 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అందరికీ ఈ కిట్లు, నగదు ప్రోత్సాహం అందటం లేదు. – డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ -
ఆమోద ముద్ర పడేనా?
‘సీతారామ’పై నేడు ఢిల్లీలో టీఏసీ సమావేశం ● ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించనున్న టెక్నికల్ కమిటీ ● గత ఫిబ్రవరిలోనే జారీ కావాల్సిన అనుమతులు ● ఇప్పటికై నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, బరాజ్ పనుల్లో పెరగనున్న వేగంనిలిచిపోయిన సీతమ్మ సాగర్ బరాజ్ పనులు (ఫైల్) మేడిగడ్డ ప్రభావంతో.. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీ బరాజ్) కుంగుబాటుతో కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసేప్పుడు ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట వరద ప్రవాహాలు, వాటి వేగం, బరాజ్ నిర్మించే ప్రదేశంలో నేల స్వభావం.. వీటికి అనుగుణంగా బరాజ్ డిజైన్లు ఉన్నాయా.. ఇలా ప్రతీ అంశాన్ని కమిటీ సభ్యులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పైగా సీతమ్మసాగర్లో 282 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఈ బరాజ్ డిజైన్లను మరింత వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని గత సమావేశంలో టీఏసీ అభిప్రాయపడింది. ఫిబ్రవరిలోనే రావాల్సింది.. సీతారామ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు (డీపీఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల ఫైల్ ఈ ఏడాది ఫిబ్రవరి 11న సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ముందుకు వచ్చింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నాడు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఈఎన్సీలు అనిల్కుమార్, విజయభాస్కరరెడ్డి, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. అశ్వాపురం మండలంలో గోదావరిపై సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మించడంతో 67 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను వారు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అనుమతులు ఇప్పటికే లభించాయని, కీలకమైన టీఏసీ అనుమతి వస్తే బరాజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతాయని కమిటీ సభ్యుల దృష్టికి తెచ్చారు. అయితే సీతారామ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సీతమ్మ సాగర్ బరాజ్ డిజైన్లను మరోసారి పరిశీలిస్తామని చెప్పడంతో అనుమతులకు ఆలస్యమైంది. అనుమతుల సాధన తప్పనిసరి.. జీవ నదులపై ఏమైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే ముందుగా ఆ నదీ యాజమాన్య బోర్డు, ఆ తర్వాత కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పనిసరి. ఈ రెండు చోట్లా అనుమతులు వచ్చాక సీడబ్ల్యూసీ నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పరిశీలనకు పంపాలి. ఈ కమిటీ డీపీఆర్ను పరిశీలించి ఆమోదం తెలిపితే ఆ ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ వచ్చినట్టుగా భావిస్తారు. అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కమిటీ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంటుంది. వివాదాస్పద ప్రాజెక్టులను మినహాయిస్తే అపెక్స్ కమిటీ అనుమతి లాంఛనప్రాయమే.ఆగుతూ.. సాగుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు 2016లో ప్రారంభమయ్యాయి. అనూహ్య కారణాలతో 2018లో డిజైన్లు మారాయి. దీంతో మరోసారి డీపీఆర్ సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా కష్టాలు కమ్ముకున్నాయి. ఎట్టకేలకు తుది డీపీఆర్ రెడీ చేసి 2023 జనవరి 23న టెక్నో అప్రైజల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ రిపోర్టును పరిశీలించిన కేంద్ర జల సంఘం.. సీతమ్మ సాగర్ బరాజ్లో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అప్రైజల్ను తిరస్కరించింది. దీంతో విద్యుత్ కేంద్రం మినహా మిగిలిన బరాజ్ నిర్మాణ పనులు జరుగుతున్న తరుణంలో ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లగా.. ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలంటూ 2023 మేలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. -
‘నవమి’ లెక్క తేలేదెప్పుడో ?
● ఆదాయానికి మించి ఖర్చులతో రామయ్యపై భారం ● ఈ ఏడాదీ అందని ప్రభుత్వ ఫెస్టివల్ ఫండ్భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యా ణం, పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ముగిశాయి. ఇక రామయ్య ఆదాయ, వ్యయాల లెక్కలు తేలాల్సి ఉంది. నవమి అనంతరం పనులు, వరుస సెలవులు రావడంతో లెక్కల వివరాలను తెలపడంలో జాప్యం జరుగుతోందని ఆలయ అధికారులు అంటున్నారు. అయితే ఈ ఏడాది సైతం ఆదాయ, వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా హాజరైన ఈ ఉత్సవానికి ప్రభుత్వ సాయం ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూసినా.. ఉత్సవాల నిర్వహణ ఫండ్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో భక్తులు, ఆలయ సిబ్బంది నిరాశకు లోనయ్యారు. టికెట్ల విక్రయమే ప్రధాన వనరు.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానానికి రూ.2.50 కోట్లు ఖర్చవుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీరామనవమికి విక్రయించే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే ఆలయానికి ప్రధాన వనరుగా మారుతోంది. ఈ టికెట్లను ఆన్లైన్, కౌంటర్ల ద్వారా విక్రయించారు. ఆన్లైన్లో ఈ ఏడాది ముందుగానే టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే సీఎంతో పాటు వీవీఐపీలు కల్యాణానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఉభయ దాతల సెక్టార్ను కుదించారు. 1000 టికెట్లను 725కే పరిమితం చేయడంతో సుమారు రూ.16 లక్షల ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు రెవెన్యూ అధికారులు విక్రయించిన టికెట్ల ఆదాయం సైతం తగ్గే అవకాశం ఉంది. ఇలా ఆన్లైన్, కౌంటర్ల ద్వారా విక్రయించిన టికెట్లతో పాటు పరోక్ష సేవల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కలిపి సుమారు రూ.2.75 కోట్ల మేర సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆలయ హుండీ ఆదాయం సైతం లెక్కించాల్సి ఉంది. గత లెక్కల ప్రకారం 45 రోజులకు సుమారు రూ.కోటి ఆదాయం వచ్చింది. శ్రీరామ నవమి అనంతరం వరుస సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ కూడా బాగానే ఉంది. దీంతో నెల రోజులకు హుండీ ఆదాయం రూ.కోటి వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది రెండు లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇలా మొత్తంగా శ్రీరామనవమి ఉత్సవాల ద్వారా రూ.3.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెస్టివల్ ఫండ్ ప్రకటిస్తే బాగు.. ఏటా శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ ఉత్సవాలుగా ప్రకటించి ఫెస్టివల్ ఫండ్ విడుదల చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక నిధులతో ఉత్సవాలను విజయవంతం చేస్తే దేవస్థానానికి రూ.2.50 కోట్ల వరకు ఆదా అవుతుంది. దీనికి తోడు నవమి ఆదాయం అదనంగా మారనుంది. అంటే సుమారు రూ. కోట్ల మేర నిధులు రామయ్య చెంతన ఉంటాయి. దీంతో భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు, ఇతర సేవలు శాశ్వతంగా అందించే అవకాశం ఉంటుంది. ఇంకా నిత్యాన్నదానాన్ని ప్రతిరోజూ అసంఖ్యాకంగా అందజేయాలనే సంకల్పం సైతం నెరవేరుతుంది. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భద్రాచలంలో ఉన్న పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు ముందు జరిగే 2026 నవమి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్ ఫండ్ విడుదల చేసి శాశ్వత వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
ఇల్లెందు : నిత్యం వందలాది మంది సంచరించే చోట ఓ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ అయి అక్కడే పార్కింగ్ చేసిన ఆటోను ఢీ కొట్టింది. ట్రాక్టర్ వేగానికి ఆటో పల్టీ కొట్టగా నుజ్జునుజ్జయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లెందులోని పాత బస్టాండ్ సమీపంలో పోలీస్స్టేషన్కు 200 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్ వద్ద బ్యాంక్లో పని కోసం వచ్చిన వారు ఆటోను పక్కన అపారని, ఆ సమయంలో వచ్చిన ట్రాక్టర్ బ్రేక్లు ఫెయిల్ కావడంతో ఆటోను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ జి. భద్రు పిర్యాదు మేరకు ఇల్లెందు మండలం పోచారం తండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బానోతు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. 23వైఎల్డి09: బ్రేకులు ఫెయిల్ కావడమే కారణం -
ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట రైతుల నిరసన
చండ్రుగొండ: స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాన్వాయ్ని మొక్కజొన్న రైతులు అడ్డుకున్నారు. బుధవారం ఆయన మండల పర్యటనకు రాగా, తమకు న్యాయం చేయాలంటూ పోలకగూడెం గ్రామ రైతులు అడ్డగించారు. తమ గ్రామంలో 20 మంది రైతులు ఓ ప్రైవేట్ కంపనీ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని, అవి నకిలీవి కావడంతో పంట దిగుబడి రాలేదని అన్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కంపెనీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా, బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే పోలీసులు వారిని పక్కకు నెట్టివేసి ఎమ్మెల్యే కాన్వాయ్ని పంపించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చిన సింగరేణి అధికారులుసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధి సంజయ్నగర్లో సింగరేణి పంప్హౌస్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న గదిని సింగరేణి ఎస్టేట్స్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో బుధవారం కూల్చివేయించారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు సింగరేణి అధికారులకు సమాచారం అందించగా ఈ మేరకు చర్యలు చేపట్టారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలిటేకులపల్లి: జిల్లాలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకె శేఖర్రావు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫాలశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదాముల్లో బియ్యం తూకం వేసి లోడ్ వేయాలని, షాపులో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని గోడౌన్లకు తరలించాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రామా, కోశాధికారి బి.బాలు, ప్రచార కార్యదర్శి వి. వెంకటేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడు ఎ.సంతులాల్ పాల్గొన్నారు. ఘనంగా పీటీఎం సమావేశాలుటేకులపల్లి: పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చివరి రోజైన బుధవారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పీటీఎంలు ఏర్పాటు చేయగా తల్లిదండ్రుల సలహాలు, సూచనలు నమోదు చేసుకున్నారు. రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్న, చదువులో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చేందుకు కలెక్టర్ తరఫున అందించిన తెలుగు, ఇంగ్లిష్ కాపీ రైట్ నోట్ పుస్తకాలను 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అందజేశారు. ఆటో బోల్తా.. మహిళ మృతి నేలకొండపల్లి: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. మండలంలోని శంకరగిరితండాకు చెందిన వ్యవసాయ కూలీలు ముదిగొండ మండలం మాధాపురంలో మిర్చి తోట ఏరేందుకు కొద్దిరోజులుగా వెళ్తున్నారు. బుధవారం కూడా పని ముగిశాక వారు వస్తున్న ఆటోలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో మాధవి(25)కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా చికిత్స చేయించి ఖమ్మం తరలించగా మృతి చెందింది. చెరువులో వ్యక్తి గల్లంతు తల్లాడ: మండలంలోని ముద్దునూరు చెరువులో బుధవారం పడి రిటైర్డ్ ఉద్యోగి గల్లంతయ్యాడు. సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన గ్రామ వాసి కాకర్ల అప్పారావు(63) తన గేదె, దూడ మేత కోసం పొలంలో ఉండగా తీసుకొచ్చేందుకు వెళ్లాడు. సమీపంలోని చెరువులోకి గేదె, దూడ దిగి లోతులోకి వెళ్తుండగా అప్పారావు దూడను బయటకు తీసుకొచ్చే క్రమాన ఆయన ఊబిలో కూరుకుని గల్లంతయ్యాడు. ఈమేరకు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. -
రేపటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మం సుందరయ్య భవనంలో బుధవారం ఆయన మాట్లాడుతూ 2002 తర్వాత ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో 33 జిల్లాలు, పదహారు యూనివర్సిటీల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. తొలిరోజైన శుక్రవారం ఉదయం వేలాది మందితో ర్యాలీ నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభలో ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు వీ.పీ.సాను, సినీ నటుడు మాదాల రవి, ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి పాల్గొంటారన్నారు. విద్యార్థులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, టి.ప్రవీణ్, నాయకులు దొంతబోయిన వెంకటేష్, వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ పాల్గొన్నారు. -
కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన జడ్జీలుకొత్తగూడెంటౌన్: జిల్లా మొదటి అదనపు జడ్జిగా ఎస్.సరిత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా కిరణ్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో విధులు నిర్వహిస్తున్న సరిత కొత్తగూడెం కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆమె జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఇక సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి మీరా ఖాసీం నుంచి కిరణ్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వీరిద్దరూ జిల్లా జడ్జి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సరిత, కిరణ్కుమార్కు రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రదాన కార్యదర్శి భాగం మాధవరావు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోహన్దాస్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. గృహ నిర్మాణాల్లో నాణ్యత పాటించాలిఅదనపు కలెక్టర్ వేణుగోపాల్ మణుగూరురూరల్/పినపాక : ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. మణుగూరు మండలంలో నిర్మిస్తున్న ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యంగా చేపట్టాలే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం సాంబాయిగూడెం, పినపాక మండలం పొట్లపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తేగా.. వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ పి.రుక్మిణి దేవి, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాథ్ బాబు, మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, సివిల్ సప్లయీస్ డీటీ శివకుమార్ ఉన్నారు. ప్లాంటేషన్ను పరిశీలించిన విజిలెన్స్ డీఎఫ్ఓబూర్గంపాడు: ఇరవెండి, సారపాక అటవీ బీట్లలోని ప్లాంటేషన్లను విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందరెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కల ఎదుగుదల, అటవీ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటవీ శాఖ అధికారులకు సూచించారు. వనసంరక్షణతో పాటు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎఫ్ఆర్ఓ రమేష్, సారపాక డీఆర్ఓ సుజాత, ఎఫ్బీఓ భీమ్చందర్ నాయక్ పాల్గొన్నారు. -
వేసవి సెలవులు వచ్చేశాయ్..
హాస్టళ్ల నుంచి ఇంటిబాట పట్టిన విద్యార్థులుజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బుధవారం పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను ఇచ్చారు. వేసవి సెలవులు ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. కాగా, సెలవులు రావడంతో హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ట్రంకుపెట్టెలు, లగేజీ బ్యాగులు సర్దుకుని ఇంటిబాట పట్టారు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రావడం, ఆయా ప్రాంతాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలతో సందడి నెలకొంది. విద్యార్థులు పరస్పరం వీడ్కోలు చెప్పుకుంటూ ఇళ ్లకు బయలుదేరారు. – కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్/ములకలపల్లి -
ఖమ్మం మార్కెట్లో డీడీఎం పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల కొనుగోళ్లను మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి బుధవారం పరిశీలించారు. మిర్చి జెండా పాట, ధర ఖరారుపై రైతులతో మాట్లాడిన ఆమె సమస్యలపై ఆరా తీశారు. అలాగే, కాంటాల తీరును కూడా తనిఖీ చేశారు. అనంతరం మార్కెట్లో రూ.155.35 కోట్లతో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతేకాక సీసీఐ పత్తి కొనుగోళ్లలో వచ్చిన ఆరోపణలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. తాతాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్)కు సంబంధించి ఎన్ని పుస్తకాలు ముద్రించారు, ఎవరెవరికి జారీ చేశారనే అంశాలు ఆరా తీసినట్లు తెలిసింది. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, గ్రేడ్–2 కార్యదర్శి సృజన్ బాబు, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు. -
మామిడి రైతు విలవిల
● చీడపీడలు, కోతుల బెడదకు తోడు గాలి దుమారాలు ● చేతికందే దశలో పంట నేలపాలు చండ్రుగొండ / అన్నపురెడ్డిపల్లి: మామిడి రైతులు విల్లవిల్లాడుతున్నారు. చీడపీడలు దాటుకుని అరకొరగా చేతికందే దశలో ఉన్న పంట గాలిదుమారాలు, వడగండ్ల వర్షాలతో నేలపాలవుతోంది. చండ్రుగొండ, అన్నపురెడ్డిపలి మండలాల్లో ఒకప్పుడు కళకళలాడిన మామిడితోటలు నేడు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి చండ్రుగొండ మండలంలో పదేళ్ల క్రితం వరకు ఐదు వేల ఎకరాల్లో మామిడితోటలు ఉండగా ప్రస్తుతం రెండు వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వస్తున్న గాలిదుమారాలు, వర్షం, వడగండ్లతో ఒక్క అన్నపురెడ్డిపల్లి మండలంలోనే 400 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పంటనష్టంపై నివేదిక ఇచ్చాం పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. గత 15 రోజులుగా వస్తున్న గాలిదుమారాలతో అన్నపురెడ్డిపల్లి మండలంలో 400 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. – సందీప్, ఉద్యాన విస్తరణాధికారి -
జాతీయస్థాయి అథ్లెటిక్స్లో కానిస్టేబుల్ ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ జాతీయస్థాయి అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరుగుతున్న 7వ జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సోమవారం జరిగిన జావెలిన్ త్రో పోటీలో ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ప్రసాద్ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు అభినందించారు. ఖమ్మం రీజియన్లో అగ్రస్థానం గుండాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని గురుకుల కళాశాల ఖమ్మం రీజియన్లో అగ్రస్థానంలో నిలిచింది. బైపీసీ సెకండియర్లో సఫియా 917 మార్కులు సాధించింది. కస్తూర్బా కళాశాలలో ఫస్టియర్లో 21 మందికి అందరూ, సెకండియర్లో 10 మందికి 10 మంది ఉత్తీర్ణులయ్యారు. గుండాల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ 96 మందికి 72 మంది, సెకండియర్లో 76కు 75 మంది ఉత్తీర్ణత సాధించారు. యూఆర్జేసీలో ద్వితీయ సంవత్సరం 30 మందికి 30 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బి.సతీశ్కుమార్ 985, బైపీసీలో జె.భరత్కుమార్ 863, సీఈసీలో కె.హేమంత్ 797 మార్కులు సాధించారు. కేసు నమోదు ఇల్లెందు: మండలంలోని హనుమంతులపాడు గ్రామానికి చెందిన కీసరి మౌనికను ఆమె భర్త నెహ్రూ, అత్త గురువమ్మ, బావ శ్రీను కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెహ్రూ మద్యానికి బానిసగా మారి భార్య మౌనికను ఇబ్బంది పెడుతున్నాడు. తాళలేక మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ మసీనా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి ఆత్మహత్య కరకగూడెం: మద్యానికి బానిసై ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేకుంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన తాళ్ల మురళి (63) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో పురుగులమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మొక్కజొన్న కంకులు దగ్ధం ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో బంధంకుంట చెరువు సమీపంలోని మొక్కజొన్న చేనులో కుప్పగా పోసిన కంకులు మంగళవారం దగ్ధమయ్యాయి. రైతులు గుడిపెల్లి సుధాకర్, మంచె రామనాథం, మంచె రవీందర్, మంచె శ్రీనుకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలోని మొక్కజొన్న పంటకు సంబంధించిన కంకులను కోసి, చేనులోనే కుప్పగా పేర్చారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నేల తడిగా ఉండటంతో కుప్పలు పూర్తిగా కాలిపోకుండా కాపాడుకోగలిగారు. అయినప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచర్ల : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో విద్యుత్ షాక్తో ఓ జవాను మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా గంగులూరు సీఆర్పీఎఫ్ 195వ బెటాలియన్ క్యాంప్లో జవాన్గా పని చేస్తున్న సుజోయ్పాల్ (34) సోమవారం సాయంత్రం ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుకు మరమ్మతు చేస్తుండగా షాక్కు గురయ్యాడు. దీంతో సహచర జవాన్లు గంగులూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని బీజాపూర్కు తరలించి శవ పంచనామా అనంతరం అతడి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్కు మంగళవారం తరలించినట్లు ఏఎస్పీ చంద్రకాంత్ గవర్ణ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత టేకులపల్లి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన బాణోతు వినోద్ ఎలాంటి అనుమతులు లేకుండా శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లో నింపుకుని ఇల్లెందుకు తరలిస్తుండగా ముత్యాలంపాడు క్రాస్రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి వినోద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మా ఊళ్లో ఏం జరుగుతోంది..?
‘మేరీ పంచాయతీ’ యాప్లో సమస్త సమాచారం ● నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యత ● ఆదాయ, వ్యయాలను గ్రామస్తులు తెలుసుకునే అవకాశం ● తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీలో అభివృద్ధి వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ (నా పంచాయతీ)యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్తో పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను పాలకవర్గం ఎలా ఖర్చు చేస్తోందనే విషయాన్ని ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చు. ఈయాప్ను 2019లోనే రూపొందించినా పలు కారణాలు, సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేపోయింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పారదర్శక పాలన.. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిధుల వివరాలు ఆన్లైన్లో ఉండడంతో గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులను చేపడుతున్నారో ప్రజలు తెలుసుకోవచ్చు. ఇందులో వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉండడంతో, అక్కడి పనులకు కేటాయించిన డబ్బును ఇతర చోట్ల వినియోగించేందుకు వీలుండదు. పాలకవర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. పాలకులు, అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలకు ప్రశ్నించేందుకు వీలు కలుగుతుంది. అన్ని వివరాలు నిక్షిప్తం.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల వివరాలు మాత్రమే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం పంచాయతీలకు మంజూరు చేసే నిధుల వివరాలు, ఏ పనికి ఎంత ఖర్చు చేశారు, అవి ఏ దశలో ఉన్నాయి అనే వివరాలు యాప్లో నమోదై ఉంటాయి. ఆదాయ, వ్యయాలతో పాటు పంచాయతీలో నిర్వహించే గ్రామ సభల వివరాలు సైతం యాప్లో అందుబాటులో ఉంటాయి. ప్లేస్టోర్ ద్వారా... స్మార్ట్ ఫోన్లో ఉండే ప్లేస్టోర్ యాప్లో ‘మేరీ పంచాయతీ’ పేరుతో సెర్చ్ చేయగానే వచ్చే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే ఆయా పంచాయతీలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.కొరవడిన అవగాహన ‘మేరీ పంచాయతీ’ యాప్నకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనకబడి ఉన్నారనే చెప్పాలి. చాలావరకు గ్రామాల్లో కొంత చదువుకున్న యువతకు తప్ప, ఇతరులకు ఈ యాప్ ఉన్నట్టు కూడా తెలియదు. యాప్పై అవగాహన లేకపోవడంతో చాలామంది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాలి పంచాయతీ పద్దులకు సంబంధించి ఇలాంటి యాప్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ప్రజలకు యాప్పై అవగాహన లేకపోవడంతో నిధుల వినియోగానికి సంబంధించి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నేరుగా నిధుల వివరాలను తెలుసుకునేలా అధికారులు ఈ యాప్పై అందరికీ అవగాహన కల్పించాలి. – వీవీఎన్ ప్రసాద్, భద్రాచలం -
వ్యవసాయ కుటుంబం నుంచి 697వ ర్యాంకు
కల్లూరురూరల్: కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడు బానోత్ నాగరాజు నాయక్ సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. ఆయన ఆల్ఇండియా స్థాయిలో 697వ ర్యాంక్ సాధించాడు. నాగరాజు నాయక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కల్లూరులో, 6నుంచి 10వ తరగతి వరకు పాలేరులోని నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాల, బీటెక్ హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో పూర్తిచేశారు. సివిల్స్లో సోషయాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్గా తీసుకున్న నాగరాజు ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు. నాగరాజు తండ్రి పంతులు నాయక్ – తల్లి మారోని వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. ప్రస్తుతం నాగరాజు సివిల్స్ సాధించగా.. ఆయన సోదరుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ దశ దాటిన వారికి ఇచ్చే రూ.లక్ష పారితోషికం అందుకున్న గిరిజన తండా వాసి నాగరాజు సివిల్స్కు ఎంపికవడంపై పలువురు అభినందించారు. -
ఆద్యంతం ఉత్కంఠే..
ఉద్రిక్తత నడుమ పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణస్వీకారం ● కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు ● పోలీస్ పహారా నడుమ కార్యక్రమం పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ నడుమే కొనసాగింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయింది. అమ్మవారి సాక్షిగా ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, ఓ మహిళ గాజులు పగులగొట్టుకోవడంతో పాటు మెడ కోసుకుంటానని ఆందోళనకు దిగింది. అసలేం జరిగింది.. పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి సభ్యులుగా 14 మంది పేర్లతో కూడిన జాబితా గతనెల 6వ తేదీన విడుదల కాగా, దీనిపై వివాదం తలెత్తింది. దేవాదాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ జీఓను రద్దు చేసి 19వ తేదీన 13 మంది సభ్యులతో మరో జాబితా వెల్లడించారు. ఈ కమిటీని ప్రమాణస్వీకారానికి ఈఓ రజినీకుమారి ఆహ్వానించగా.. స్థానికులకు అవకాశం కల్పించాలంటూ కేశవాపురం గ్రామస్తులు అందోళన చేయడంతో వాయిదా పడింది. రెండో జీఓ వెలువడి నెల రోజులు దాటడంతో తిరిగి మంగళవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయగా.. మళ్లీ ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో డీఎస్పీ సతీశ్కుమార్, సీఐ సతీశ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, స్థానికులు భారీగా చేరుకుని ప్రమాణ స్వీకారం నిలిపేయాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన బండి ఉదయ్, అజ్మీర రమేశ్.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. గంధం నర్సింహారావును ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని సైతం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అందోళన సద్దుమణగడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికులకు చోటేది..? అమ్మవారి ఆలయం కొలువై ఉన్న కేశవాపురం గ్రామస్తులకు కమిటీలో స్థానం కల్పించకుండా ఇతర ప్రాంతాల వారికి, అన్యమతస్తులకు అవకాశం ఇవ్వడం ఏం న్యాయమంటూ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామస్తులకు అవకాశం కల్పించాలని కోరడం తప్పా అంటూ ప్రశ్నించారు. చైర్మన్గా నాగేశ్వరరావు.. పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి చైర్మన్గా సోములగూడెం గ్రామానికి చెందిన బాలినేని నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. సభ్యులుగా భూక్యా గిరిప్రసాద్, కోరం స్వర్ణలత, పెండ్లి రామయ్య, చందుపట్ల రమ్య, ధర్మరాజుల నాగేశ్వరరావు, చీకటి కార్తీక్, చెవుగాని పాపారావు, చెరుకూరి శేఖర్బాబు, దుగ్గిరాల సుధాకర్, శనిగారపు శ్రీనివాసరావు, అడుసుమల్లి సాయిబాబా, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా అర్చకుడు మూర్తి రవికుమార్శర్మతో దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు ఈ.వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నాగేశ్వరరావు ఏడో చైర్మన్గా నియమితులయ్యారు. -
సివిల్స్లో మెరిసిన రత్నాలు
● మత్కేపల్లి వాసి చరణ్ తేజకు 231 ర్యాంక్ ● 697వ ర్యాంకు సాధించిన గిరిజన యువకుడు నాగరాజు చింతకాని: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు యువకులు ర్యాంకులు సాధించారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన నర్శింశెట్టి చరణ్ తేజ 231 ర్యాంక్ను సాధించడం విశేషం. గ్రామానికి చెందిన నర్శింశెట్టి హరినాధ్బాబు – నాగమణి దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ 10వ తరగతి వరకు హైదరాబాద్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక జేఈఈలో 88వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత తొమ్మిది నెలల పాటు రూ.32 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా సివిల్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం మానేశాడు. సొంతంగానే సిద్ధం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాక చరణ్తేజ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సివిల్స్కు సిద్ధమయ్యాడు. 2022లో తొలిసారి పరీక్ష రాసినా ప్రిలిమ్స్కు అర్హత సాధించకపోగా 2023లో ఇంటర్వ్యూ దశకు చేరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈసారి ఆలిండియా 231వ ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన తల్లిదండ్రులు 25ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడగా తండ్రి హరినాధ్బాబు ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా, తల్లి నాగమణి మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. చరణ్ సోదరుడు జైశిక్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఈ సందర్భంగా చరణ్తేజతో ‘సాక్షి’ మాట్లాడగా సివిల్స్లో ఆప్షనల్గా గణితం ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించానని, ఐఎఫ్ఎస్ ఎంచుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిపాడు. -
ఎన్నాళ్లకు మోక్షం..
● సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ● పదేళ్లుగా ఉద్యోగుల నిరీక్షణ ● ఉమ్మడి జిల్లాలో 335 మంది ఉద్యోగులు ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చుంచుపల్లి: దశాబ్దకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 335 మందికి బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ పూర్తయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో కొత్తవారు రానున్నారు. గతేడాది జూలైలో జరిపిన సాధారణ బదిలీల్లో తమకు అవకాశం కల్పించాలని సెర్ప్ ఉద్యోగులు కోరినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వర్తింపజేయటం లేదంటూ కొన్నేళ్లుగా వాపోతున్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీరి బదిలీల విషయం ఊసెత్తకపోవడంతో కొందరు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సెర్ప్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఏళ్లుగా ఒకే కేడర్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 నుంచి సెర్ప్ సిబ్బందికి పే–స్కేల్ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. వీరిలో ఎంఎస్ సీసీ నుంచి డీపీఎం స్థాయివరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో యూనియన్ నాయకులు సంబంధిత శాఖ మంత్రులతో గతంలోనూ అనేక దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ముందుకురావడంతో వారి పదేళ్ల నిరీక్షణకు త్వరలో తెర పడనుంది. 335 మందికి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి ఉపాధి కల్పనలో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్న సెర్ప్ ఉద్యోగులు దాదాపు 23 ఏళ్లుగా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సెర్ప్ పరిధిలో మినిస్టీరియల్, ఫీల్డ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు వివిధ హోదాలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లకు సంబంధించి 335 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 156 మంది, ఖమ్మం జిల్లా పరిధిలో 179 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.1.30 కోట్ల మేర వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000లో ‘వెలుగు’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం సంస్థను పరిమిత జిల్లాల్లో ప్రారంభించారు. 2002లో ఆ ప్రాజెక్టును క్రమంగా రాష్ట్రం అంతటా విస్తరింపజేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం పేరును పూర్తిగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చగా, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)గా తిరిగి నామకరణం చేసింది. ఇక ప్రాజెక్టు ప్రారంభమైన 2002 నుంచి ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతుండగా, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2023 ఏప్రిల్లో వీరి ఉద్యోగాలను క్రమబద్ధీరిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రక్రియలో పే–స్కేల్, ఇతరత్రా వర్తింపజేసినా.. ఇంకా అంశాలను అమలు చేయాల్సి ఉంది. గతేడాది జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖల పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది బదిలీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొందరు ఉద్యోగులు ఆందోళన చెందారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ముందుకురావడం మంచి పరిణామం. ఉద్యోగులు, సిబ్బంది పదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన చాలామంది సిబ్బంది పదేళ్లు, అంతకంటే ఎక్కువగానే ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వం 100 శాతం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వనుండటంతో దాదాపు అందరికీ స్థానచలనం కలుగుతుందని భావిస్తున్నాం. – డి.నీలయ్య, అదనపు డీఆర్డీఓ (సెర్ప్) -
హాస్టళ్లు, పాఠశాలలు సిద్ధంగా ఉండాలి
● నెలరోజుల్లో మరమ్మతులు పూర్తిచేయాలి ● ఐటీడీఏ పీఓ బి.రాహుల్ భధ్రాచలం: వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లు, పాఠశాలల్లోని మేజర్, మైనర్ మరమ్మతులను పూర్తి చేసి, సిద్ధంగా ఉంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో స్పెషలాఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, హెచ్ఎం, వార్డెన్లతో పీఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూంలు ఇతర మౌలిక వసతులన్నింటినీ నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాఠశాలను, హాస్టల్ను సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసి త్వరగా అందచేయాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలని, సెలవుల్లో సైతం పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉద్దీపనం వర్క్బుక్లు విద్యార్థులకు ఉపయోగపడేలా చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు సైతం వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అందుకోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 15 రోజుల్లో ప్రతిపాదనలు తనకు సమర్పించాలన్నారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, డీఈ మధూకర్, ఏఈ రవి, జీసీడీఓ అలివేలుమంగతాయారు పాల్గొన్నారు. కాగా, ఇంజనీరింగ్లో సీటు సాధించిన విద్యార్థినికి ఐటీడీఏ తరఫున ల్యాప్టాప్ను పీఓ రాహుల్ మంగళవారం అందజేశారు. అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వాసం గాయత్రి భద్రాచలంలోని టీటీడబ్ల్యూఆర్ఎస్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివి, గేట్ రాసి 8,300 ర్యాంకు సాధించింది. ఆమెకు ల్యాప్టాప్ను పీఓ అందజేశారు. కార్యక్రమంలో డేవిడ్ రాజ్, విద్యార్థిని తల్లి లలిత తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలకు చెక్
● జూన్ 2 నుంచి అందుబాటులోకి పోర్టల్ ● కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడి అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వం తాజాగా రూపొందించిన భూ భారతి చట్టం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అన్నపురెడ్డిపల్లిలో భూ భారతి చట్టంపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి పోర్టల్ అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో ఉన్న ధరణికి ఇది విరుద్ధమని, రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఏడీఏ రవికుమార్, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఏఓ అనూష, వనమా గాంధీ, పర్సా వెంకటేశ్వరరావు, వేముల రమణ పాల్గొన్నారు. ఆర్వైవీ అర్హుల జాబితా రూపొందించాలిసూపర్బజార్(కొత్తగూడెం): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, బ్యాంకు మేనేజర్లు, కమిటీ సభ్యులు కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఒకే గ్రామంలో ఒక యూనిట్కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని అన్నారు. ఆయా కార్పొరేషన్ల అధికారులు సైతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్ల ద్వారా ఆర్థిక పురోగతి ఉంటుందని తెలిపారు. సమావేవంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు హాజరయ్యారు. -
బాలికలదే పైచేయి..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం ఉత్తీర్ణత ● ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం.. ● ప్రతిభ చాటిన ప్రైవేటు కళాశాలలు, కేజీబీవీలు ● రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం కొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కాగా, బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అమ్మాయిలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్లో 3,028 మంది బాలురకు 1,570 మంది, 4,187 మంది బాలికలకు 2,944 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 860 మంది బాలురకు 402 మంది, 1,179 మంది బాలికలకు 863 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్లో2,996 మంది బాలురకు 1,855 మంది, 4,083 మంది బాలికలకు 3,190 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో బాలురు 763 మందికి 495 మంది, బాలికలు 1,024 మందికి 882 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 54.83, ద్వితీయ సంవత్సరంలో 70.72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది కొంతమేర పెరిగి రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. మే 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 421 మందికి 181 మంది, ద్వితీయ సంవత్సరంలో 376 మందికి 238 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ విభాగంలో బి. శ్వేతశ్రీ 1000కి 936 మార్కులు సాధించింది. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మేఘన 470కి 423 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కత్తి రమేష్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. కలెక్టర్ను కలిసిన డీఐఈఓసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వివరాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్కు డీఐఈఓ సీహెచ్ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందొద్దని, ఇలాంటి ఫెయిల్యూర్సే జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామివా రికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
కార్పొరేషన్గా కొత్తగూడెం
● గెజిట్ విడుదల, త్వరలో జీఓ ● రెండు మున్సిపాలిటీలు, ఏడు పంచాయతీలతో ఏర్పాటుకొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే జీఓ కూడా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు అంటున్నారు. జీఓ విడుదల అయ్యాక డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ జరుగనుంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా లక్షకు పైగా జనాభా, 65 వేల మంది ఓటర్లు ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో 24 వార్డులు, లక్ష జనాభా, 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో కలిపి 14 వేల మంది జనాభా, 10 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేయాలని గెజిట్లో పేర్కొన్నారు. కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయితే భూములు, ఆస్తుల విలువతో పాటు ఇళ్లు, పంపుల పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాగా, పాల్వంచ మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు కేసులు ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరుగలేదు. ఇక కార్పొరేషన్ ఆమోదంతో ఎన్నికలు జరుగుతాయని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు..! కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో పని చేసే ఉద్యోగులకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు చెల్లించే పన్నులు పెరిగినట్టుగానే ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. జీఓ విడుదల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్గా పేరు మార్చడం, డివిజన్ల ఏర్పాటుతో పాటు కమిషనర్ను నియమించాల్సి ఉంది. -
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెంలోని గాజులరాజం బస్తీకి చెందిన లిక్కి విశృత్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 1000కి 994 మార్కులు సాధించాడు. విశృత్ స్థానిక నలంద కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) చదివాడు. తండ్రి కోటేశ్వరరావు పాల్వంచ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా, తల్లి నివేదన నగరంలోని ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేసున్నారు. చిన్నప్పటి నుంచే ప్రణాళికాయుతంగా చదివించడంతో ఉత్తమ ఫలితాలు సాధించాడని విశృత్ తల్లిదండ్రులు తెలిపారు. ఎస్పీ రోహిత్రాజు స్ఫూర్తితో.. ఉత్తమ ఫలితాలు సాఽధించిన అనంతరం విశృత్ మాట్లాడుతూ.. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చేరడం తన లక్ష్యమని, ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నది తన జీవిత కల అని తెలిపాడు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న రోహిత్రాజు తనకు ఆదర్శమని చెప్పాడు. తండ్రి ఏఎస్ఐగా పని చేస్తున్నప్పుడు రోహిత్రాజు ఐపీఎస్కు సెలక్ట్ అయ్యారని తెలుసుకుని తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆయన తరహాలోనే తన తండ్రి పోలీస్గా పని చేస్తున్నప్పుడే తాను ఐఏఎస్ అధికారిని కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. కాగా, ఎస్పీ రోహిత్రాజు విశృత్ను మంగళ వారం అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విశృత్ -
ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్దే విజయం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం స్థానిక హరిత హోటల్లో ఉద్యమకారులు, పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచిందని, 2014, 2018 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే గెలుచుకున్నామని, అయినా కేసీఆర్ హయాంలో ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి 3.50లక్షల ఎకరాలకు నీరందించారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ఆస్పత్రులు, హాస్టళ్లు ఏమీ లేవని, ఎమ్మెల్సీలుగా తాను, తాతా మధు చట్టసభల్లో అడుగుతున్న ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క అన్నీ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండుతోందంటే అది కేసీఆర్ చలువేనని చెప్పారు. కార్యకర్తల కష్టంతో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత అధికార పార్టీలోకి వెళ్లారని అన్నారు. ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హరిప్రియనాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, ఆకోజు సునీల్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేయండి బూర్గంపాడు/పాల్వంచ/మణుగూరురూరల్ : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజోతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నివాసంలో, మణుగూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కాగా, భద్రాచలంలో మాజీ మంత్రి వనమా ఎమ్మెల్సీ కవితకు మెమెంటో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వనమా రాఘవేందర్ రావు, కిలారు నాగేశ్వరరావు, బూర్గంపాడు పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, నాయకులు పోశం నర్సింహరావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ, జలగం జగదీశ్, గోనెల నాని, సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరిగౌడ్, నూకారపు రమేష్, పాకాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మణుగూరులో వపన్ నాయక్ ప్రతాప్ నివాసంలో తేనేటి విందు, ఎక్స్లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు. పార్టీ శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మొదట రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఉద్యమకారులను పట్టించుకోండి ‘భద్రాచలంలో మొదట బీఆర్ఎస్ కండువా కప్పుకున్నది మా నాన్న నరసింహమూర్తి. మా ఇంటికి కేసీఆర్, కవితమ్మ వచ్చారు, కానీ జిల్లా నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేం దళితులమనే చిన్న చూపు చూశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీలో చేరిన పలువురు ఎవరి వర్గానికి వారు పదవులు ఇప్పించుకున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు రాలేదు. ఏదేమైనా మాకు కేసీఆరే నాయకుడు. ఇప్పుడున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి నా పేరు కూడా తెలియదు’ అంటూ భద్రాచలానికి చెందిన రాజేంద్రవర్దన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రామాలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్సీ కవిత మొదట భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీతారాములను దర్శించుకుని సీతమ్మవారికి సారె సమర్పించి గర్భగుడి నుంచి బయటకు వచ్చిన కవిత ‘రామలక్ష్మణ జానకి’ అంటూ జేజేలు పలికారు. అనంతరం లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన జడ్జి కవితకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన కర్నాటి కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నరగా ఈ పోస్టు ఖాళీగా ఉండగా హైదరాబాద్ నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి బదిలీపై వచ్చిన కవిత నియమితులయ్యారు. భాద్యతల స్వీకరణ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. నేడు పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారం పాల్వంచరూరల్ : ఎట్టకేలకు పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 19న పాలకమండలి జాబితాను ప్రభుత్వం జారీ చేయగా.. స్ధానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ కొందరు అందోళన చేయడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తుతో నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని ఈఓ వెల్లడించారు. మే 1 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణకొత్తగూడెంఅర్బన్: మే 1వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా సోమవారం హైదరాబాద్ నుంచి జూమ్ సమావేశం నిర్వహించగా జిల్లా నుంచి డీఈఓ హాజరయ్యారు. అనంతరం వివిధ విభాగాల కో – ఆర్డినేటర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పాఠశాల పని దినాలు నష్టపోకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా, మండల రిసోర్స్ పర్సన్ల ఎంపికకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో కూడా కొనసాగించాలని ఆదేశించారు. పీఎంశ్రీకి ఎన్నికై న పాఠశాలలకు విడుదలైన నిధుల వినియోగంపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమంలో భాగంగా బడిబాటను విజయవంతం చేయాలని, ఇందుకోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు ఎ.నాగరాజ శేఖర్, ఎస్కే సైదులు, జె.అన్నామణి, ఎఫ్ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం.. మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీ లోపు నిర్ణీత నమూనాలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. -
అప్పుల బాధతో ఆత్మహత్య
టేకులపల్లి: అనారోగ్యం, అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ ఎ.రాజేందర్ కథనం ప్రకారం... మండలంలోని బావోజీతండాకు చెందిన భూక్య లాలు(35) కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించగా రూ.4 లక్షల అప్పు అయింది. దీనికితోడు పంటలు కూడా సరిగా పండలేదు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.గడ్డి మందు తాగి ఒకరు.. ఇల్లెందు: మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన జి. భద్రూ(55) సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ హసీనా కథనం ప్రకారం.. భద్రూ మద్యం బానిసగా మారడంతో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆయన ఇంట్లో గడియ వేసుకుని పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపుల కేసు నమోదుచండ్రుగొండ: వివాహితను అదనపు కట్నం కోసం వేధించిన ఘటనలో భర్త, అత్తలపై సోమవారం పోలీసులు కేసు నమోౖదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని టేకులబంజర గ్రామానికి చెందిన సోనుకు టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన వీరన్నతో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలిచ్చారు. కాగా అదనపు కట్నం తేవాలని సోనును భర్త వీరన్న, అత్త లక్ష్మి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భూ భారతితో అందరికీ మేలు
● కొత్త చట్టంపై ఆందోళన వొద్దు ● కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడిమణుగూరు టౌన్/అశ్వాపురం : భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చట్టంపై ఎలాంటి ఆందోళనలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. భూ బదలాయింపులో ప్రవేశపెట్టిన నిబంధనలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ధరణి కంటే భూ భారతి చట్టంతోనే భూములకు రక్షణ కలుగుతుందన్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారి సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసి, వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ చట్టం రైతులకు, ప్రజలకు మాత్రమే కాక రెవెన్యూ అధికారులకు కూడా ధైర్యం ఇచ్చిందని, సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగంచలతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ దామోదర్రావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణలత, ఏడీఏ తాతారావు, ఎంపీడీఓ వరప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్ఐ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లంచం అడిగితే ఏసీబీకి పట్టించండి అశ్వాపురంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుల సందేహాలు తెలపాలని కలెక్టర్ సూచించగా.. ఓ రైతు మాట్లాడుతూ గతంలో ధరణిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు లంచాలు తీసుకున్నారని, భూ భారతిలో ఎంత లంచాలు తీసుకుంటారని ప్రశ్నించాడు. డైరెక్ట్గా తీసుకుంటే ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారని గ్రామానికి ఓ బ్రోకర్ ద్వారా అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చాడు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. డబ్బు తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరమని అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు పట్టించండని చెప్పారు. బ్రోకర్ల ద్వారా తీసుకుంటే ఆధారాలతో తనకు తెలియజేస్తే పోలీసు కేసు పెడతానని చెప్పగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
బోరు పూడ్చివేతపై ఆగ్రహం
చర్ల: చర్ల మండలంలోని పులిగుండాలలో పోడు సాగుదారులు వేసిన బోరును దుమ్ముగూడెం అటవీ రేంజ్ అధికారులు పూడ్చివేయగా.. వారి వైఖరిని నిరసిస్తూ రాళ్లగూడెంలో సోమవారం గిరిజన రైతులు ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలి చిపోగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చేరుకొని రైతులతో మాట్లాడారు. డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ఘటనపై వెంటనే విచారణ నిర్వహించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోరు పూడ్చివేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పులిగుండాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సోడి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ల చోరీ.. నంబర్ మార్చి విక్రయం
పెనుబల్లి: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేయడమే కాక నంబర్ ప్లేట్లు మార్చి ఇతరులకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు 18 బైక్లను చోరీ చేసిన వీరు వీఎం బంజర్ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ కె.రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ఎంఎల్.ముత్తిలింగయ్యగౌడ్, వీఎం బంజర్ ఎస్ఐ కె.వెంకటేశ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అర్బన్ కాలనీకి చెందిన మక్కెళ్ల నాగరాజు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చల్లా శివప్రసాద్ వీఎం బంజర్, సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా పెద్దవేగి స్టేషన్ పరిధిలో రూ.12.45 లక్షల విలువైన 18 ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటిలో కొన్నింటి నంబర్ మార్చి పెనుబల్లి మండలం గంగదేవిపాడు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం వాసులకు అమ్మగా, వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. మిగతా వాహనాలను ఎన్ఎస్పీ కాలువ పక్కన పొదల్లో దాచి అందులో రెండింటిని అమ్మేందుకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఖమ్మం వైపు నుంచి వీఎంబంజర్ వైపు వెళ్లే మార్గంలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఎలాంటి పత్రాలు లేకపోగా, తడబడుతుండడంతో వాహనాల చాయిస్ నంబర్ ఆధారంగా ప్రశ్నించడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో నాగరాజు, శివప్రసాద్ను అరెస్ట్ చేయడమే కాక వీరి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన ఓర్సు వెంకటనారాయణ, పందేళ్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్రావు, బత్తుల కొండల్రావు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన డేరంగుల నాగసాయి, ఉప్పతాల సతీశ్, ఉప్పతాల గోపి, ఉప్పతాల రాజుపైనా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు శ్రీగాద రాజమల్లు, పి.వెంకటేశ్వర్లు, మోహిద్పాషా, బాలకృష్ణ, సురేశ్ను ఏసీపీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. రెండు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్ -
కొత్త క్వార్టర్లు నిర్మించేనా..?
● శిథిలావస్థలో కేటీపీఎస్ నివాస సముదాయాలు ● అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న కార్మికులు ● నిర్మాణాలపై దృష్టి సారించని జెన్ కో యాజమాన్యం పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ కర్మాగారాల్లో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఇక్కడి ఉద్యోగులకు నివాస సముదాయాలు(క్వార్టర్లు) సక్రమంగా లేవు. దశాబ్దాల క్రితం నిర్మించినవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. కేటీపీఎస్ ఒఅండ్ఎం కర్మాగారం నిర్మించిన సమయంలో ఉద్యోగుల కోసం ఏ,బీ,సీ, ఇంటర్మీడియట్, బాంబే కాలనీలుగా క్వార్టర్ల సముదాయాలు నిర్మించారు. అప్పుడే క్వార్టర్లు నిర్మించినా చాలా ఎత్తు తక్కువ, ఇరుకు గదులతో నిర్మాణాలు చేపట్టారు. సరైన ప్రహరీలు కూడా లేవు. కాలనీల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఒఅండ్ఎం కర్మాగారం కాలం చెల్లడంతో ఆ కర్మాగారాన్ని కూల్చివేశారు. క్వార్టర్లు కూడా శిథిలావస్థకు చేరాయి. దీంతో 80 శాతం మంది కార్మికులు కార్టర్లను ఖాళీ చేసి ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారు. కొందరు రుణాలు తీసుకుని సొంత ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. శిధిలావస్థకు చేరిన క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిత్యం కొందరు యువకులు, గంజాయి, మద్యం సేవించడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ క్వార్టర్ల తలుపులు, కిటికీలు, ఐరన్ సామగ్రి చోరీకి గురవుతున్నాయి. కేటీపీఎస్ ఒఅండ్ కర్మాగారం మూతబడటంతో సుమారు 2500 మంది ఉద్యోగ, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో కాలనీలు జన సంచారం లేకుండా వెలవెలబోతున్నాయి. గతంలో కన్యూమర్ స్టోర్స్, పాల ప్యాకెట్లు, గ్యాస్ బుకింగ్, గోడౌన్, ఇతర కూల్ డ్రింక్ షాపులు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి. నిధుల విడుదలలో జాప్యం పాల్వంచ కేటీపీఎస్ కేంద్రంగా 5,6దశల కర్మాగారాల్లో వెయ్యి మెగావాట్లు, 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 1969–78 సంవత్సరంలో ఒఅండ్ఎం కర్మాగారం నిర్మించగా కాలం చెల్లడంతో తొలగించారు. ఆ స్థానంలో 7వ దశ నిర్మాణం జరిపారు. ఇటీవల మణుగూరులో నిర్మించిన బీటీపీఎస్ సిబ్బంది కోసం రూ.600 కోట్లతో క్వార్టర్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కూడా పాత నిర్మాణాలు తొలగించి వాటి స్థానంలో అపార్ట్మెంట్ తరహాల్లో నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదు. యాజమాన్యం కూడా దృష్టి సారించడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా జెన్కో యాజమాన్యం స్పందించి క్వార్టర్లను నిర్మించాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం కేటీపీఎస్లో ఉద్యోగుల కొత్త క్వార్టర్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం. ఈ విషయం యాజమాన్యం దృష్టిలో ఉంది. త్వరలో మంజూరు అవుతాయని వేచి చూస్తున్నాం. –కె.శ్రీనివాసబాబు, సీఈ, 7వ దశ -
రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్
బూర్గంపాడు/పాల్వంచ: మండలంలోని అంజనాపురానికి భూక్యా రేణుక జ్యోతిష్యంలో ఆర్యన్ పరిశోధన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆమె భర్త కిరణ్గాంధీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివాహ సంతాన అంశంలో పరిశోధన చేసినందుకు గాను రేణుకకు ఈనెల 20న సింహాచలంలో జరిగిన జ్యోతిష్య సదస్సులో డాక్టర్ నరసింహస్వామి, తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్ అందించారు. ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలిపాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలని గ్రామ కార్యదర్శులను హౌసింగ్ బోర్డు పీడీ శంకర్ ఆదేశించారు. మండల పరిధిలోనితోగ్గూడెంగ్రామపంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లనుసోమవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తేనే బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయన్నారు. ఇప్పటివరకు గ్రామంలో వంద ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని కార్యదర్శి రవికుమార్ పీడీకి వివరించారు. న్యాయవాద సంక్షేమ నిధి పెంచాలికొత్తగూడెంటౌన్: న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కార్పస్ ఫండ్ రూ. 100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని ఏఐఎల్యూ జిల్లా కార్యదర్శి రమేష్కుమార్ మక్కడ్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను అందజేయాలని, ఇన్సూరెన్స్ను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. తొలుత సంక్షేమ నిధి పెంచాలని సంతకాల సేకరణ చేశారు. కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ జె.శివరాంప్రసాద్, న్యాయవాదులు కిలారు పురుషోత్తం, గాదె సునంద, అరికాల రవికుమార్, డి.రాజేందర్, వైవీ రామారావు, ఏ.పద్మకళ, పగిడిపల్లి రవి, దేవదాసు, రామకృష్ణ, మహేష్, ఆనంద్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తాగునీటి సమస్య ఎదరుకావొద్దుడీపీఓ చంద్రమౌళి దమ్మపేట: వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అఽధికారి చంద్రమౌళి గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కనీసం వంద మంది ఉపాఽధి హామీ పనులకు వచ్చేలా చూడాలన్నారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, ఎంపీఓ రామారావు, కార్యదర్శులు పాల్గొన్నారు. అక్రమ కట్టడం కూల్చివేతకు యత్నంఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఒడ్డున అక్రమంగా చేపట్టిన నిర్మాణం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సోమవారం యత్నించారు. వాగు ఒడ్డున ఓ గది నిర్మాణం తలపెట్టగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సిబ్బంది, జేసీబీతో అక్కడికి వెళ్లి కూల్చివేతకు ప్రయత్నించారు. దీంతో నిర్మాణదారులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం కొంత గడువు ఇస్తే తామే తొలగిస్తామని నిర్మాణదారులు పేర్కొనడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు. -
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వ కృషి
భద్రాచలం: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పేర్కొన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలో కొర్రాజుల గుట్ట ఏరియాలోని ఏహెచ్ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ఆయన ఐటీటీపీ పీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం వేసవి సెలవుల్లో తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సమస్యలపై గిరిజనులు సమర్పించే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని పీఓ రాహుల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ అధికారులు మణెమ్మ, నాగార్జున రావు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, అశోక్ కుమార్, నరేందర్, హరీష్, శ్రీనివాసరావు, ప్రసాద్, మోహన్, రాంబాబు, భాస్కరన్, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్ కుమార్, నరేష్, నారాయణ రావు, ఆదినారాయణ, హరికృష్ణ, లింగా నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు, పీఓ రాహుల్ -
బ్రిడ్జి పాఠశాలలతో సత్ఫలితాలు
● వలస ఆదివాసీ ఆవాసాల్లో ఏర్పాటు ● ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ చండ్రుగొండ : జిల్లాలో ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న బ్రిడ్జి పాఠశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐడీఓ (ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ పాఠశాలలు నడుపుతున్నారు. అటవీప్రాంతాల్లో నివాసముంటున్న వలస గొత్తికోయ ఆదివాసీల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో గొత్తి కోయల ఆదివాసీ ఆవాసం ఎర్రబోడు ఉంటుంది. కనకగిరి అటవీప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు చదువు నేర్పేవారు. నిర్వహణ కష్టతరం కావడంతో ఐసీడీఎస్ అధికారులు కేంద్రం ఎత్తేశారు. ఈ క్రమంలో ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జి పాఠశాల ఏర్పాటు చేశారు. 39 మంది చిన్నారులకు 1 నుంచి 3వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 13 పాఠశాలల్లో 351 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడి మూడో తరగతి పూర్తి చేసినవారిని గత మూడేళ్లల్లో బూర్గంపాడు, ఉల్వనూరు, బూర్గంపాడులో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో 500 పిల్లల్ని చేర్పించారు. ఆకర్షించేలా విద్యాబోధన గొత్తి కోయ ఆదివాసీ పిల్లలను ఆకర్షించేలా విద్యాబుద్ధులు నేర్పుతున్నాం. అక్షరాలను నేర్పడమే కాకుండా కవితలు, కథలు నేర్పిస్తున్నాం. ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. –పద్దం విజయకుమారి, వలంటీర్, బెండాలపాడు ఆటపాటలతో నేర్పుతున్నారు.. బ్రిడ్జి పాఠశాలలో విద్యాబోధన బాగుంది. చిన్నపిల్ల లకు ఆటపాటలతో అక్షరాలు నేర్పుతున్నారు. మా ఆవాసంలో పిల్లలంతా క్రమంతప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారు. –రవ్వా రమేష్, ఆదివాసీ పెద్ద, ఎర్రబోడు జిల్లాలో బ్రిడ్జి పాఠశాలల వివరాలు మండలం గ్రామం పిల్లల సంఖ్య లక్ష్మీదేవిపల్లి క్రాంతినగర్ 31 పాల్వంచ సిర్తన్పాడు 23 పాల్వంచ కోయగట్టు 34 పాల్వంచ రాళ్లచిలుక 26 పాల్వంచ సీతారాంపురం 40 చుంచుపల్లి జగ్గారం 26 చంచుపల్లి పాలవాగు 18 పినపాక ఎర్రకుంట 32 పినపాక ఉమేష్చంద్రనగర్ 28 మణుగూరు బుడుగుల 24 ములకలపల్లి రాచన్నగూడెం 23 చండ్రుగొండ బెండాలపాడు 31 టేకులపల్లి ఒంటిగుడిసె 15 -
ఆలయాల అప్గ్రేడ్..
● ఉమ్మడి జిల్లాలోని పలు దేవస్థానాలకు భక్తుల తాకిడి ● ఖమ్మం జిల్లాలో ఆరు దేవాలయాలు 6ఏ పరిధిలోకి.. ● మరో ఆరింటికి 6 బీ హోదా ● భద్రాద్రి జిల్లాలో ఐదు ఆలయాలు 6సీ నుంచి 6బీకి.. పాల్వంచరూరల్ : ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను అప్గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగుతుండగా అంతే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. దీనికి తోడు ఆలయాల్లో ఏటా బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాల, ఇతర పండుగ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇలా ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు వాటికి గ్రేడ్లను పెంచుతుంటారు. తద్వారా భక్తులకు ఆలయాల్లో వసతులు కల్పనతో పాటు సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏడు ఆలయాలకు 6ఏ హోదా ఉండగా కొత్తగా మరో ఆరు ఆలయాలను 6బీ నుంచి 6ఏకు అప్గ్రేడ్ చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు ఆలయాలు 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఏ ఆలయమూ అప్గ్రేడ్ కాలేదు. 6ఏ ఆలయాలు ఇవే.. ఉమ్మడి జిల్లాలో పాత, కొత్తవి కలిపి మొత్తం 17 ఆలయాలు 6ఏ గ్రేడ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయం, పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం(గణేష్ టెంపుల్)తో పాటు జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి శ్రీ మారెమ్మతల్లి ఆలయం, పెనుబల్లిలోని శ్రీ నీలాద్రీశ్వరస్వామి, ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి(గుట్ట), కమాన్బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి, కాల్వొడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజయనేయస్వామి, వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు గతంలోనే 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వరస్వామి, మధిరలోని మృత్యుంజయస్వామి, ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి, ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి, ఖమ్మం ఇందిరానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి(పర్ణశాల) ఆలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. 6బీ హోదా పొందిన ఆలయాలు.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం శ్రీమల్లికార్జునస్వామి, కొణిజర్ల మండలం పల్లిపాడు శ్రీ శంభులింగేశ్వరస్వామి, కూసుమంచి మండలం పెరికసింగారం శ్రీవేణుగోపాల అంజనేస్వామి, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ శ్రీసీతారామాంజనేయస్వామి, కామేపల్లి మండలం కొత్తలింగాల శ్రీ కోటమైసమ్మ, ఖమ్మం వరదయ్యనగర్లోని శ్రీమైసమ్మ అమ్మవారి ఆలయాలు 6బీ హోదా పొందాయి. వీటితో పాటు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి శ్రీదాసాంజనేయస్వామి, కొత్తగూడెం బాబూక్యాంప్లోని శ్రీసీతారామచంద్రస్వామి, జూలూరుపాడు మండలం పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి, పాల్వంచలోని శ్రీ రామాలయం (భజనమందిరం), అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం ఉన్నాయి. భక్తుల రద్దీ, ఆదాయం ఆధారంగా.. ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాలకు భక్తుల తాకిడి, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉంటే 6ఏ, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటే 6బీ, రూ.2లక్షల లోపు ఆదాయం లభించే ఆలయాలకు 6సీ హోదా కల్పిస్తాం. – వీరస్వామి, దేవాదాయ శాఖ ఏసీ -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం గ్రామంలో ఆరబెట్టి ధాన్యం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయింది. దీంతో సోమవారం ఉదయం ధాన్యాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 80 ఎకరాల రైతులు లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద పట్టాలు వేసి వడ్లు ఎండబోశారు. పది రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా గన్నీ సంచులు లేవంటూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందని సొసైటీలో విక్రయించేందుకు వేచి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం తడిసిందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా సొసైటీలో కొనాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిని వివరణ కోరగా.. నాలుగు రోజుల క్రితం కేంద్రం ప్రారంభించామని, గన్నీ బ్యాగులు లేకపోవడంతో కొనుగోళ్లు చేపట్టలేదని, మంగళవారం నుంచి కొంటామని తెలిపారు. ఆవేదన చెందుతున్న రైతులు -
వడదెబ్బతో మహిళ మృతి
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన తౌటం వజ్రమ్మ(60) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురికాగా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం వరంగల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బైక్ను లారీ ఢీకొని ఒకరు..బూర్గంపాడు: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన పసుపుతోట నాగేశ్వరరావు (65) బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని ఓ మిల్లులో పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఈ క్రమంలో లక్ష్మీపురం బంకు సమీపంలో పాల్వంచ వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో నాగేశ్వరరావు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొగ్గు చోరీ ఇల్లెందు: సింగరేణి బొగ్గు అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను సెక్యూరిటీ విభాగం పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సోమవారం మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన బి.రాజు, కె. ప్రసాద్లు ఓ ట్రాక్టర్ ద్వారా సింగరేణి బొగ్గు చోరీ చేసుకుని వెళుతుండగా రాజీవ్నగర్ తండా వద్ద పట్టుకున్నారు. ఎస్అండ్పీసీ సిబ్బంది రామస్వామి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి సూర్య కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేశారు. మద్యం మత్తులో దాడి ఇల్లెందు: మండలంలోని ధనియాలపాడు గ్రామానికి చెందిన పి.రమాదేవి ఇంటికి సోమవారం సుదిమళ్లకు చెందిన ఆమె సమీప బంధువు వచ్చాడు. మద్యం తాగి అల్లరి చేస్తుండటంతో ప్రశ్నించిన రమాదేవి, ఆమె కుమారుడు సంతోష్ను తీవ్రంగా దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ హసీనా కేసు నమోదు చేశారు. -
పార్కులపై పట్టింపేది?
నెహ్రూ పార్కుదీ అదే పరిస్థితి.. రామవరంలో ఉన్న నెహ్రూ పార్కును ప్రస్తుతం వనమా పార్కుగా పిలుస్తున్నారు. ఈ పార్కుకు అయితే తాళం కూడా తీయడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు రానుండగా పార్కులోకి పిల్లలు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. పట్టణంలో పలు ఏరియాల్లో ఉన్న మినీ పార్కులు సైతం అధ్వానంగా మారాయి. ఇక పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ పార్కు, బొల్లోరిగూడెం పార్కుల నిర్వహణ కొంత మేర బాగానే ఉంది. అయిఏ వీటిలోనూ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ పార్కులోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. పార్కు నిర్వహణ సక్రమంగా లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట పార్కులో మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పడు శుభ్రపరుస్తున్నారు. దీంతో ఇక్కడ సమస్యలు అంతగా లేవనే చెప్పాలి. కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. పార్కుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. మున్సిపల్ నిధులు రూ.లక్షల్లో కేటాయిస్తున్నా పార్కులలో శాశ్వత సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలతో కలిసి చిన్నారులు ఆడుకునేందుకు సమీప పార్కులకు వెళ్తుంటారు. అయితే వారి ఆటలకు సంబంధించిన పరికరాలు ఎక్కడా పని చేయడం లేదు. అవి తుప్పపట్టి, ముట్టుకుంటే చిన్నారుల చేతికి గాయాలయ్యే ప్రమాదం నెలకొంది. పార్కుల అభివృద్ధి, నిర్వహణకు రూ.లక్షలు కేటాయిస్తున్నట్లు పేపర్పై చూపించడమే తప్ప ఆచరణ లేదని, దీంతో సందర్శకులు అవస్థ పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో అయినా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక నిర్వహణ లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. నాటడానికి తీసుకొచ్చిన మొక్కలు ఎండి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇలా.. కొత్తగూడెంలో ప్రధానంగా రాజీవ్ పార్కు, రైటర్ బస్తీలోని పంచతంత్ర పార్కు, సింగరేణి చిల్డ్రన్ పార్కు, రామవరంలోని వనమా పార్కుతో పాటు పలు మినీ పార్కులు ఉన్నాయి. రాజీవ్ పార్కును 2005లో ఏర్పాటుచేయగా ఆది నుంచీ ఇక్కడ సమస్యలే ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ మినహా మిగితావన్నీ మరమ్మతులకు గురయ్యాయి. పిల్లల ఆట పరికరాలు పని చేయడం లేదు. బాత్రూమ్లు వినియోగంలో లేవు. పార్కంతా పాముల పుట్టలు ఉండడంతో సందర్శకులు భయాందోళన చెందుతున్నారు. ఓపెన్ జిమ్లో పరికరాలు కొన్ని పని చేయడం లేదు. అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుపై కనీసం మూత కూడా లేక ప్రమాదకరంగా మారింది. పార్కు ఎంట్రన్స్లో ఉన్న ఫౌంటెన్ పని చేయడం లేదు. ఇక పంచతంత్ర పార్కు మరీ దారుణంగా మారింది. రూ.20 లక్షలతో నిర్మించిన ఈ పార్క్లో వాకింగ్ ట్రాక్, ఇతర ఆవరణంతా చెత్తతో నిండింది. ఓపెన్ జిమ్ పరికరాలు విరిగిపోయాయి. మున్సిపల్ అధికారులు పార్కు నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.జిల్లాలో అధ్వానంగా మున్సిపల్ ఉద్యానవనాలు పని చేయని ఓపెన్ జిమ్లు అస్తవ్యస్తంగా వాకింగ్ ట్రాక్లు.. పట్టించుకోని పురపాలక అధికారులు ఆట సామగ్రి కొత్తవి ఏర్పాటు చేయాలి పార్కుల్లో పిల్లల ఆట సామగ్రి, పరికరాలు అన్నీ మరమ్మతులకు గురై ఉన్నాయి. కొన్ని అయితే తుప్పు పట్టి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. తుప్పు పట్టిన పరికరాలతో పిల్లలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అధికారులు చర్యలు చేపట్టి నూతన పరికరాలను ఏర్పాటు చేయాలి. – చిన్ని, గాజులరాజంబస్తీ జిమ్ పరికరాలు మరమ్మతు చేయించాలి రాజీవ్ పార్కులోని ఓపెన్ జిమ్లో ట్రైనీని ఏర్పాటు చేయాలి. జిమ్లో కొంత సామగ్రి మరమ్మతుకు గురైంది. దీంతో జిమ్ చేసే వారు ఇబ్బంది పడుతున్నాం. మరమ్మతు చేయించాలని మున్సిపల్ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు. – రాజు, బూడిదగడ్డ, కొత్తగూడెం -
రన్ రాజా.. రన్ !
ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ● రూ.6.65కోట్ల నిధులతో పనులు ప్రారంభం ● మూడు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ ఖమ్మం స్పోర్ట్స్: వేలాది మంది క్రీడాకారులకు ఓనమాలు నేర్పడమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. రూ.6.65 కోట్ల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యయి. మట్టి ట్రాక్లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఖమ్మంలో అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తుండగా.. స్టేడియంలో ఇన్నాళుల సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడలేదు. జిల్లా క్రీడాశాఖ అధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు చొరవ చూపినా ఫలితం కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ మంజూరు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకా క ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ భావించినా నిధుల లేమి వేధించింది. ఇంతలోనే ట్రాక్ ప్రతిపాదిత స్థలాన్ని క్రికెట్ శిక్షణకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలా రకరకాల అడ్డంగకులతో ట్రాక్ నిర్మాణం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పట్టుబట్టడంతో... గత రెండేళ్లుగా జిల్లా క్రీడల శాఖ, అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచ్లు సింథటిక్ ట్రాక్ కోసం పట్టుపట్టా యి. స్టేడియంలో మట్టిట్రాక్పై శిక్షణ పొందిన అబ్దుల్ నజీబ్ఖరేషి, పవన్కుమార్, సుధాకర్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మరి కొందరు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇక్కడ అకాడమీకి తోడు అనుభవం కలిగిన కోచ్ ఉన్నందున సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందుతుందనే భావనతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ట్రాక్ ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ మున్సి పల్ శాఖ అధికారులతో చర్చించి నిధులు కేటాయింపునకు సూచనలు ఇచ్చారు. ఈమేరకు ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ ట్రాక్ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకరావాలనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సీఎం వచ్చిన రోజే పెళ్లి చేసుకుంటా !
● ఓ కాంగ్రెస్ కార్యకర్త స్పష్టీకరణ ● రేవంత్రెడ్డిని రప్పించాలంటూ వైరా ఎమ్మెల్యేకు వినతి కారేపల్లి: ‘సీఎం రేవంత్రెడ్డి వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తా’ అంటూ కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటున్నాడు. మేకలతండాకు చెందిన భూక్యా గణేష్కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్రెడ్డి అన్నా చాలా ఇష్టం. దీంతో రేవంత్రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. ఆయనకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కై ండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా.. అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
విద్యార్థి మృతిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: ఫోన్చూడొద్దని చెప్పినందుకు మనస్థాపంలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని బొల్లారంలో నివాసముంటున్న బందెల రాముకు ఇద్దరు కుమారులు కాగా, చిన్నకుమారుడైన శ్రీరామ్(17) శనివారం కాలనీ శివారులో ఊరివేసుకుని మృతిచెందాడు. ఇతడు పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్నగర్ కాలనీకి చెందిన బంధువు ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18న ఇంట్లోనే ఫోన్లో గేమ్ అడుతున్న శ్రీరామ్ను అమ్మమ్మ ఫోన్ చూడొద్దు, గేమ్ ఆడొద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారిని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేశారు. యువతిని వేధించిన యువకుడిపై.. కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణానికి చెందిన యువతిని అసభ్యకరంగా సోషల్మీడియా వేదికగా వేధించిన ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన యువకుడు రాహుల్పై ఆదివారం కొత్తగూడెం వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ యువతి సుజాతనగర్ మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంది. ఆ సమయాన ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడుగు గ్రామానికి బి.రాహుల్తో పరిచయం ఏర్పడి అతడి వద్ద కొంత డబ్బులు అప్పుగా తీసుకుంది. తిరిగి కొంత కాలానికి డబ్బులు తిరిగి ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధింపులకు గురి చేశాడని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు విషయాన్ని యువకుడి తల్లిదండ్రులకు చెప్పి మళ్లీ అమ్మాయి జోలికి రావొద్దని మందలించారు. అయినా సదరు యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో యువతి పేరుతో నకిలీ ఇన్స్ట్రాగాం అకౌంట్ క్రియేట్ చేసి ఆమె బంధువులు, స్నేహితులను ఫాలో అవుతున్నట్లు అసభ్యపదజాలంతో ఆమె క్యారెక్టర్ను కించపరిచేలా పోస్టులు పెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై.. పాల్వంచరూరల్: మిర్చి పరదాల విషయంలో తలెత్తిన వివాదంలో మహిళను చంపుతానని బెదిరించి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి నాగారం గ్రామానికి చెందిన అరేపల్లి ప్రమీల, జలగం అనిల్ పక్కనే మిర్చి పంట కల్లాలు చేసుకున్నారు. పంటపై రక్షణ కప్పే పరదాల విషయంలో శనివారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనిల్ తనను చంపుతానని, రాళ్లతో కొట్టడానికి వచ్చాడని అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు కరకగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కౌలూరు గ్రామానికి చెందిన మలకం రమేష్ ఆదివారం తన ట్రాక్టర్తో పని నిమిత్తం చిరుమళ్ల గ్రామం వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో చిరుమళ్ల ఎస్సీ కాలనీ మూలమలుపు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమేష్పై ట్రాక్టర్ పడగా.. కొందరు యువకులు గమనించి ట్రాక్టర్ను పక్కకు జరిపారు. అనంతరం 108లో అతడిని కరకగూడెం పీహెచ్సీకి ఆపై మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విజేతగా భద్రాద్రి గాయకుడు
భద్రాచలంటౌన్: ఖమ్మం జిల్లా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో నిర్వహించిన సినీ హంగామ సమ్మర్ స్పెషల్ సినీ ట్రాక్ సింగింగ్ పోటీల్లో భద్రాద్రి గాయకుడు పోకల శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. ఈపోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 75 మంది గాయనీ గాయకులు పాల్గొనగా.. శ్రీనివాస్ విజేతగా గెలిచి రూ.5వేల ప్రోత్సహక బహుమతి అందుకున్నాడు. న్యాయ నిర్ణేతలుగా రాజాబాబు, సరళ వ్యవహరించారు. బైక్లను ఢీకొన్న లారీ.. ● ఒకరి మృతి నేలకొండపల్లి: బైక్ను ఢీకొట్టిన లారీ.. తప్పించుకునే క్రమంలో మరో బైక్ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండ అండర్పాస్ వద్ద రాజస్థాన్కు చెందిన, క్వారీలో పనిచేసే కూలీల బైక్ను లారీ ఢీకొట్టింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో లారీని వేగంగా నడుపుతూ డ్రైవర్.. కొద్దిదూరంలో మరోబైక్ను ఢీకొట్టాడు. దీంతో మొదటి బైక్పై వస్తున్న రాజస్తాన్ కూలీల్లో హరికిరణ్ (36) మృతిచెందాడు. అదే ప్రమాదంలో రాజ్బహుదూర్, రాంజీలాల్, మరో బైక్పై వస్తున్న తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకటసాయి తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చెన్నారంలో చోరీలు.. నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చెన్నారంలో మూడు రోజుల కిందట కందగట్ల కృష్ణ, బోయినపల్లి వేణు నివాసాల్లో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదును చోరీ చేశారు. రెండిళ్లలో కలిపి రూ.6 వేల వరకు నగదు చోరీకి గురవగా.. ఆదివారం బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య నేలకొండపల్లి: ఖరీదైన మొబైల్ కొన్నందుకు తల్లిదండ్రులు మందలించారని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన ధరావత్ రాజు (24) రెండు రోజుల కిందట ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనుగోలు చేశావని.. పైగా ఏపని చేయటం లేదని.. తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రాజు పురుగులమందు తాగగా కుటుంబసభ్యులు ఖమ్మం వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు అదృశ్యం చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 64 ఏళ్ల తుడుం బక్కయ్య కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన కటింగ్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. బక్కయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బైక్ దొంగను పట్టుకున్న స్థానికులు అశ్వారావుపేట: అశ్వారావుపేటలో బైక్ను దొంగిలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఆదివారం స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక తూర్పు బజారు వాసి కొడమంచిలి రాజు ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన బల్లెం నాగేశ్వరరావు దొంగిలించే ప్రయత్నించాడు. గమనించి పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలోనే నాగేశ్వరరావుపై ఏపీలో దొంగతనం కేసులున్నట్లు గుర్తించామని, విచారించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు. -
మితిమీరితే మోతే..!
భద్రాచలంఅర్బన్: ఎండలు మండుతున్న నేపథ్యాన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను అధికంగా వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. జీరో బిల్ కోసం పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. కాగా, వేసవి దృష్ట్యా 200 యూనిట్లు దాటితే బిల్లు మరింత అదనపు భారం కానుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 4,57,216 కనెక్షన్లు.. రూ.13.69 కోట్ల బిల్లులు జిల్లా వ్యాప్తంగా 4,57,216 కనెక్షన్లు ఉండగా.. ప్రభుత్వం నెలకు సుమారు రూ.5.12 కోట్లు, అదే ఏడాదికి సుమారు రూ.67.88 కోట్ల బిల్లులు చెల్లిస్తోంది. వీటిలో వ్యవసాయం, కంపెనీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు వస్తున్నప్పటికీ గృహజ్యోతి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తోంది. 1,64,080 మందికి లబ్ధి.. జిల్లా వ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 1,68,003 ఉండగా.. ప్రభుత్వం జీరో బిల్ అమలు చేసిన నాటి నుంచి 1,64,080 మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా.. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం పెరగడం ఖాయం కాగా కొందరికకే జీరో బిల్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యుత్ను పొదుపుగా వాడుకుంటే తప్పా.. 200 యూనిట్లు దాటిన వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. 3,923 మంది పథకానికి దూరం.. జిల్లా వ్యాప్తంగా 1,64,080 మంది పథకానికి అర్హులు కాగా గడిచిన ఫిబ్రవరికి సంబంధించిన విద్యుత్ను మార్చిలో మీటరు రీడింగ్ తీయగా.. 3,923 మంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. దీంతో వారు ఫిబ్రవరి బిల్లంతా చెల్లించాల్సి వస్తోంది. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. గతేడాది మార్చిలో 4,942 మంది, ఏప్రిల్లో 10,119 మంది, మేలో 16,036 మంది లబ్ధిదారులు పథకానికి దూరమై జూన్ తర్వాత నుంచి మళ్లీ పథకం లబ్ధి పొందారు. ఒక్క యూనిట్ మించినా.. ఉచిత విద్యుత్ 200 యూనిట్లకే పరిమితం. ఒక్క యూనిట్ దాటినా యూనిట్కు రూ.5.10 చొప్పున బిల్లు పడుతుంది. 201 యూనిట్లు నమోదైతే ఇతర చార్జీలతో కలిపి కనీస బిల్లు రూ.1,050 చెల్లించాల్సి ఉంటుంది. పొదుపుగా వాడుకోవాలి.. వేసవిలో ప్రతీ వినియోగదారుడు విద్యుత్ను పాదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వం 200 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. అవసరాల మేరకే వాడుకోవాలి. లేదంటే ఒక్కయూనిట్ దాటినా బిల్లు మొత్తం కట్టాల్సిందే. వృథాను అరికట్టి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – మహేందర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ జీరో బిల్లు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీరో బిల్లు అమలు చేస్తోంది. కంపెనీలు, ప్రభుత్వ భవనాలు, వ్యవసాయ బిల్లులు అధికారులు, రైతుల వద్ద వసూళ్లు చేస్తూ ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. – జీవన్కుమార్, డీఈ, భద్రాచలం బిల్లు భారాన్ని అధిగమించాలంటే.. ● అవసరం మేరకే ఫ్యాన్లు, కూలర్లు వాడాలి. ● ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే ఫ్యాన్లు, లైట్లు వినియోగించాలి. ● ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడే కూలర్లు వాడాలి. ● నాణ్యతలేని కూలర్లు, ఫ్యాన్లతో అధిక విద్యుత్ వినియోగించడానికి ఆస్కారం ఉంది. ● ఉచిత విద్యుత్ అనే భావనతో నిర్లక్ష్యం చేస్తే బిల్లు మోత తప్పదు. ● ఎల్ఈడీ బల్బులు, ట్యూట్లైట్లు వాడాలి. గత మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా విద్యుత్ వినియోగం నెల వినియోగం (మిలియన్ యూనిట్లలో) ఫిబ్రవరి 151.45 మార్చి 175.03 ఏప్రిల్ 59.62 (ఇప్పటి వరకు) వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే జీరో బిల్లుకు దూరం జిల్లా వ్యాప్తంగా 1,64,080 మందికి పథకం వర్తింపు లబ్ధిదారులూ బహుపరాక్ -
‘భూభారతి’తో రైతులకు మేలు
ఇల్లెందురూరల్/టేకులపల్లి: భూభారతి చట్టం భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు మేలు చేస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో, టేకులపల్లి తహసీల్లో ఆదివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో టేకులపల్లి వ్యవసాయ మార్కెట్ సబ్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామా సమస్యలు నిర్దిష్ట గడువులోగా పరిష్కారమవుతాయని తెలిపారు. అన్యాయం జరిగినట్లు భావిస్తే బాధితులు ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఆర్థికస్తోమత లేని రైతులకు ఉచితంగా న్యాయ సహాయం కూడా అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గతంలో ధరణి పోర్టల్ను ప్రైవేటు సంస్థ నిర్వహించడం వల్ల అనేక తప్పిదాలకు అవకాశం ఏర్పడిందని, కానీ ఽభూభారతి పోర్టల్ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, తప్పిదాలకు అవకాశం ఉండదని అన్నారు. రైతులు ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొత్త సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్కు చైర్మన్ విన్నవించారు. ధరణితో చాలా నష్టపోయారు.. తప్పుల తడకగా ఉన్న ధరణితో పోర్టల్తో రైతులు చాలా నష్టపోయారని, భూభారతి చట్టం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కాస్తుదారు కాలమ్ తొలగించడంతో అనేక మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం నెలకొల్పారు. కాగా ఇల్లెందులో ఆదివాసీ చట్టాలకు సంబంధించి ఓ న్యాయవాది సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే విషయమై సదస్సు అనంతరం ఘర్షణకు దారి తీయడంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆర్డీఓ మధు, ఏడీఏ లాల్చంద్, తహసీల్దార్లు రవికుమార్, నాగభవాని, ఎంపీడీవోలు ధన్సింగ్, రవీంద్రరావు, ఏఓలు సతీష్, అన్నపూర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటరాజశేఖర్రెడ్డి, సొసైటీ సీఈఓ పి.ప్రేమాచారి, నాయకులు భూక్య దళ్సింగ్నాయక్, చరణ్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, కోరం సురేందర్, కె.వెంకట్, శివలాల్, బి.బాలాజీ, శ్యాం, ఉదయ్ పాల్గొన్నారు. వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం పేద రైతులకు ఉచిత న్యాయసహాయం అవగాహన సదస్సులో కలెక్టర్ జితేష్ -
నిర్లక్ష్యం నీడన నిరసనల వేదిక
● పడావుగా మారుతున్న ధర్నాచౌక్ స్థలం ● కలెకర్టేట్ ఎదుటే కొనసాగుతున్న ఆందోళనలు ● చదును చేసి ఫెన్సింగ్ వేయాలని విన్నపాలు సూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపే కలెక్టరేట్ ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత చాలా ఆలస్యంగా కలెక్టరేట్ సమీపంలో ధర్నాచౌక్కు స్థలాన్ని కేటాయించారు. కానీ ఆ స్థలాన్ని చదును చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ధర్నా చౌక్ ఏర్పాటు తర్వాత వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఇబ్బడిముబ్బడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ధర్నా స్థలం కొంత శుభ్రంగా ఉండేది. ఎన్నికల కోడ్లు వచ్చిన సందర్భంగా ధర్నాలకు, ఆందోళనలకు బ్రేక్ పడింది. కోడ్ ముగిశాక మళ్లీ ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ధర్నాచౌక్ స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుటే నిరసన తెలుపుతున్నారు. మరికొందరు కలెక్టరేట్ ఎదుట గేట్ ముందు కాకుండా ఏకంగా కలెక్టరేట్ ఆవరణలోనే ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక ధర్నాచౌక్ను ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి పడావుగా మారుతోంది. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగే సమయంలో జనసమీకరణ ఎక్కువగా ఉంటుంది. కలెక్టరేట్ ఎదుటే జాతీయ ప్రధాన రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఏదైనా వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే నిరసన చేపడుతున్న ఆందోళకారులపైకి దూసుకు వెళ్తే జరిగే ప్రాణనష్టం ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇప్పటికై నా ధర్నాచౌక్ స్థలం చదును చేసి ఫెన్సింగ్ వేయాలని, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిష్కార వేదికే సమస్య కావొద్దు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు వేదిక ధర్నాచౌక్. అలాంటి ప్రాంతమే సమస్యగా మారొద్దు. జిల్లా యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలి. – ఎస్కె సాబీర్పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శినిర్లక్ష్యం సరికాదు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మనది. ఉద్యమాలకు పెట్టింది పేరు. అలాంటి జిల్లాలో ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉద్యమాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. వేదికను ఏర్పాటు చేయాలి. –మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ఆ ఊరికి రామయ్యస్వామే రుణదాత
● ఏడాదిలోగా వడ్డీతో సహా అప్పు చెల్లిస్తున్న గ్రామస్తులు ● అశ్వాపురం ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం అశ్వాపురం: సాధారణంగా ఏదైనా అవసరం వస్తే ఇతరుల వద్ద అప్పు తీసుకుంటారు. కానీ ఆ గ్రామంలో ప్రతీ ఒక్కరు దేవుడి వద్దే అప్పు తీసుకుంటున్నారు. తిరిగి ఏడాదిలోగా వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2004లో శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో హోమం, యాగాలు నిర్వహించాక గ్రామస్తులు సేకరించిన నగదులో రూ. 15 వేలు మిగిలాయి. ఆలయ అభివృద్ధికి మరో రెండు సంస్థలు రూ.25 వేల చొప్పున రూ. 50 వేలు విరాళం ఇచ్చాయి. మొత్తం రూ. 65 వేలు కాగా, ఆ నగదును ఎక్కడా ఖర్చు చేయకుండా గ్రామస్తులకు రుణం ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఒక్కరికి రూ.6 వేల వరకు రుణం ఇవ్వాలని, తీసుకున్న అప్పు ఏడాదిలోపు చెల్లించాలని, రుణానికి ఆ గ్రామంలోనివారే అర్హులని నిబంధనలు పెట్టుకున్నారు. అప్పటి నుంచి గ్రామస్తులు అప్పు తీసుకుంటూ, తిరిగి చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం స్వామివారికి గ్రామస్తులు రూ.20.90 లక్షల వరకు అప్పు ఉన్నారని ఆలయ కమిటీ వారు చెబుతున్నారు. సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకుని ప్రారంభిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. కాగా గ్రామంలో రామాలయం నిర్మించాలనుకున్న స్థలంలో ఏటా పందిరి మండపం ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహిస్తున్నారు. -
బాధితులకు భరోసా..
● వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం రూ. 4 లక్షలకు పెంపు ● త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా చెల్లింపులు ● వడగాల్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా గుర్తింపుబూర్గంపాడు/చుంచుపల్లి: వడగాడ్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రభుత్వం పరిగణించింది. వడదెబ్బతో మృత్యువాత పడిన కుటుంబాలకు అండగా నిలవనుంది. బాధిత కుటుంబాలకు అందించే పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. మండలస్థాయి కమిటీ చేసే సిఫార్సును కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక పరిహారం అందనుంది. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, హమాలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల ఆర్థికసాయమందించేది. వరుస వారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను కలెక్టర్కు పంపితే, అక్కడ కూడా వరుస వారీగా నిధుల లభ్యతను బట్టి సాయమందించేవారు. ఆపద్బంధు పథకానికి ప్రమాదవశాత్తు మరణించిన వారు, వివిధ కారణాలతో మృతిచెందిన వారు కూడా దరఖాస్తు చేసుకునేవారు. ఏడేనిమిదేళ్లుగా ఆపద్భందు పథకం దాదాపుగా నిలిచిందనే చెప్పాలి. సాయం అందకపోవటం, పరిహారం కూడా తక్కువ మొత్తంలో ఉండటం, పోస్టుమార్టం వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి కూడా చూపడంలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబీకులు పేర్ల నమోదుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితేనే.. రూ.4 లక్షల పరిహారమందించటం బాధిత కుటుంబాలకు ఒకింత ఊరటనిస్తుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలో తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థత గురై ఎవరైనా మరణిస్తే తహసీల్దార్, మండల వైద్యాధికారి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను సిద్ధం చేయాలి. మృతుని కుటుంబ సభ్యులు ముందుగా ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. శవ పంచనామా నివేదికల అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పరిశీలించి కలెక్టర్కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి, ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది. అవగాహన కల్పిస్తున్నాం పరిహారం పెంచడం వల్ల వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జిల్లాలో వేసవి రక్షణ చర్యలు చేపట్టాం. కొన్ని మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. వైద్యశాఖను అప్రమత్తం చేసి అవగాహన చర్యలు చేపడతాం. – డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ఇటీవలి వడదెబ్బ మృతులు.. ఇల్లెందు మండలం లక్ష్మీనారాయణ తండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) గత సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. టేకులపల్లి మండలం మద్రాసు తండా కొండంగులబోడుకు చెందిన కేళోత్ గోబ్రియా (49) గత నెల 24న చేలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటి రత్తాలు (55) గత నెల 15న బంధువుల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి వడదెబ్బ బారినపడి మృతి చెందింది. -
యంత్రం.. పాత మంత్రం
వ్యవసాయ యాంత్రీకరణను పునరుద్ధరించిన ప్రభుత్వం ● గత మార్చిలో పథకం విధివిధానాల వెల్లడి ● మళ్లీ పాత తరహా యంత్రాలకే సబ్సిడీల ప్రకటన ● ప్రస్తుత పరిస్థితులకు తగిన కొత్త పరికరాలకు దక్కని చోటు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(స్మామ్) పథకంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. ఇతర రైతులకు ఈ సబ్సిడీ 40 శాతం ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల విలువైన యంత్రాలను అందించే వీలుంది. గతంలోనూ ఈ పథకం అమల్లో ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టాక నిలిపివేసింది. దీంతో వ్యవసాయ యాంత్రీకరణలో వేగం తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించింది. కానీ డ్రోన్లు మినహాయిస్తే ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆధునిక యంత్రాలకు చోటు కల్పించకపోవడం లోటుగా మారింది. మారిన అవసరాలు గడిచిన ఐదారేళ్లుగా తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరిగింది. గతేడాది నుంచి సన్న రకాలు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. సాధారణంగా కోతలు పూర్తయ్యాక ధాన్యంలో తేమ 35 నుంచి 40 శాతం ఉంటుంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే తేమ 17శాతమే ఉండాలి. దీంతో ఆరబెట్టేందుకు ఆధునిక యంత్రాలు (ప్యాడీ డ్రయర్స్) అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇప్పటికీ పాత పద్ధతులే అవలంబించాల్సి వస్తోంది. కొత్త వాటికి చోటివ్వాలి ప్రస్తుతం వ్యవసాయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్ల వంటి యంత్రాల వినియోగం దాదాపు సంతృప్త స్థాయికి చేరింది. తిరిగి ఇవే యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ఆరబోత, కోత యంత్రాల అవసరం పెరిగింది. మిర్చి, పత్తి కోతల సమయంలో స్థానికంగా కూలీలు పొరుగు రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆధునిక యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు తగ్గట్టు నిబంధనల్లో మార్పు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాలు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైనవి అందుబాటులో ఉన్నాయి. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండే ధాన్యాన్ని ఆరబెట్టడంతోపాటు తాలు కూడా ఇవి వేరు చేస్తాయి. తద్వారా రోజుల తరబడి ఆరబోయాల్సిన ఇక్కట్లు తప్పుతాయి. అదే విధంగా మిర్చి, పత్తి కోత మిషన్ల అవసరం ఉన్నందున రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది.ఆఖరికి శ్మశానంలోనూ ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు గ్రామాల్లో ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, పాఠశాలలు, మైదానాలు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆరబెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎక్కడా చోటు లభించక వైకుంఠ ధామా(శ్మశాన వాటిక)ల్లోనూ ధాన్యం ఆరబోసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా పగలూరాత్రి, ఎండావానా తేడా లేకుండా కాపలా ఉంటున్నారు. పగటి వేళ కూలీలను పెట్టుకుని అరగంటకోసారి ధాన్యాన్ని నేరుపుతూ తేమ తగ్గించేందుకు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. కనీసం వారం పాటు జరిగే ఈ తంతు కారణంగా అయ్యే ఖర్చు, ప్రభుత్వం అందించే బోనస్కు సరిపోతోంది. దీంతో చాలామంది సన్నకారు, చిన్నకారు రైతులు మద్దతు ధర రాకున్నా పొలాల వద్ద ప్రైవేట్ వ్యాపారులకు పచ్చి ధాన్యమే అమ్ముకుంటున్నారు. ఫలితంగా బోనస్ చాలా మంది సన్నకారు, చిన్నకారు రైతులకు అందడం లేదు. -
రజతోత్సవ సభకు తరలిరావాలి
ఖమ్మంమయూరిసెంటర్ : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చాటి చెప్పేందుకు ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ సభల జయప్రదానికి ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణుల తరలింపుపై దిశా నిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు, భోజనాల సరఫరాతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని పార్టీ దిమ్మెలను ముస్తాబు చేయాలని, లేని చోట నిర్మించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఎల్కతుర్తి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా, వద్దిరాజు, పువ్వాడ -
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వరుస సెలవులు కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా అవగాహనా సదస్సుల నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 562 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.30,420 ఆదాయం లభించగా, 180మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.8,060 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. మ్యూజియంలోని జంతువుల బొమ్మలను వీక్షించి బోటు షికారు చేశారు. -
రైతులకు న్యాయం చేయండి
● ధాన్యం అమ్మిన వారికి బోనస్ జమ కావడం లేదు.. ● మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల దమ్మపేట : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు అందాల్సిన బోనస్ వారి ఖాతాల్లో జమ కావడం లేదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మండలంలోని గండుగులపల్లిలో తన నివాసంలో ఉన్న తుమ్మలను స్థానిక రైతులు శనివారం కలిశారు. ధాన్యం అమ్మిన తమకు ఇంకా బోనస్ జమ కాలేదని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో తుమ్మల ఉత్తమ్కుమార్కు ఫోన్ చేశారు. కొందరు మిల్లర్లు దళారులతో కుమ్మకై ్క, రైతులకు నష్టం జరిగేలా చేస్తున్నారని, ఈ విషయంలో రైతులకు న్యాయం చేరాలని కోరారు. స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. కాగా, దమ్మపేటలోని శివాలయం ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ వంతెన ఎత్తు పెంచాలని స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిన్నశెట్టి యుగంధర్ మంత్రి తుమ్మలను కోరగా.. వంతెనకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని ఆర్అండ్బీ డీఈని ఫోన్లో ఆదేశించారు. రెడ్యాలపాడుకు చెందిన మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా తుమ్మల ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, దొడ్డా ప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో మునిగి బాలుడి మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని ముదిరాజ్ బజార్కు చెందిన కొమ్ము దుర్గ కుమారుడు హర్షవర్దన్ (15), శనివారం మధ్యాహ్నం అదే కాలనీకి చెందిన ఓ మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్తుండగా, ఆమెతోపాటు గోదావరికి వెళ్లాడు. హర్షవర్ధన్ నీళ్లలో ఆడుకుంటూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. అక్కడున్నవారి సమాచారంతో వచ్చిన గజ ఈతగాడు గోదావరిలో వెతికి బాలుడిని బయటకు తీశాడు. కుటుంబ సభ్యులు బాలుడికి సీపీఆర్ చేసి, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా సాయంత్రం మృతి చెందాడు. హర్షవర్దన్ బాల్యంలోనే తండ్రి మృతి చెందగా, తల్లి దుర్గ కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని సాకుతోంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాల వాహనం ఢీకొని వృద్ధుడు..పినపాక: పాల వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు (60) తెల్లవారుజామున ఈ.బయ్యారం క్రాస్ రోడ్కు వస్తన్నాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి పాలతో రాజపేట వెళ్తున్న వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. -
ఎస్పీకి ఘన సన్మానం
కొత్తగూడెంటౌన్: అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ రోహిత్రాజును శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ సహకరించిందని, ఈ మేరకు కృతజ్ఞతనగా ఎస్పీని సత్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జే.బీ శౌరీ, మారపాక రమేష్, కూసపాటి శ్రీనివాస్, ఎర్రా కామేష్, సుబ్బారావు, నాగేందర్, చదలవాడ సూరి తదితరులు పాల్గొన్నారు. డీసీహెచ్ఎస్ రవిబాబుకు.. పాల్వంచ: డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్స్లెన్సీ అవార్డు రావడంతో శనివారం పాల్వంచ సీహెచ్సీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.రాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆస్పత్రుల బలోపేతానికి రవిబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు దొర, వైద్యులు వెంకన్న, మోహన్వంశీ, ప్రసాద్, పూజిత తదితరులు పాల్గొన్నారు. -
రేపు భద్రాచలానికి ఎమ్మెల్సీ కవిత
ఇల్లెందు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలం వస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకుంటారని, ఆ తర్వాత హరిత హోటల్లో తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసే సమావేశంలో మాట్లాడుతారని వివరించారు. ఉద్యమకారులంతా సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. ఫొటోలు తొలగించిన అధికారులుభద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విచారణ చేపట్టకుండానే బిల్లుల మంజూరుకు ప్రతిపాదించిన ఉద్యోగి పూసా జగదీష్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన విషయం విదితమే. ఈమేరకు శనివారం మరోమారు విచారణ చేపట్టిన అధికారులు సదరు ఉద్యోగి అప్లోడ్ చేసిన ఫొటోలను సైట్ నుంచి తొలగించారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెదురుసాగుపై అవగాహన కల్పించాలిసెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత చుంచుపల్లి: జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఐడీఓసీలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.కోటి టర్నోవర్ చేశారని, ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో ఎంతమంది వెదురు రైతులను గుర్తించారు, ఆన్లైన్లో ఎందరి డేటా ఎంట్రీ చేశారనే వివరాలపై ఆరా తీశారు. వెదురు సాగుతో కలిగే లాభాలతో పాటు సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మునగ సాగు, మునగ ఆకుల సేకరణ ఎలా ఉందంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎఫ్పీసీ కో– ఆర్డినేటర్ శ్రీనివాస్, టీపీఎం ఫార్మా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం వెల్ల డించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల విద్యార్థుల పరీక్ష ఫీజును యూనివర్సిటీకి చెల్లించకపోగా, నామినల్ రోల్స్ కూడా పంపలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని రాజేందర్ తెలిపారు. -
బాక్స్ క్రికెట్కు క్రేజ్
బూర్గంపాడు: పల్లె, పట్టణ ప్రాంతాల శివారు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతుండగా.. ఊరి బయట కాసేపు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా అక్కడ వసతులు శూన్యం. దీంతో యువత క్రీడలకు దూరమవుతోంది. ఈ తరుణంలో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బాక్స్ క్రికెట్ క్రేజ్ ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే బాక్స్ క్రికెట్ కోర్టులు వెలుస్తున్నాయి. మొదట ఆసక్తి చూపని యువకులు, చిన్నారులు ఇప్పుడు బాక్స్ క్రికెట్పై మోజు పెంచుకుంటున్నారు. రోజూ గంటో, రెండు గంటలో ఈ ఆట ఆడుతున్నారు. ఫ్లడ్లైట్ల వెలుగులో క్రికెట్ ఆడడం సరికొత్త అనుభూతి ఇస్తోందని కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రూ.లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టులకు ఆశించిన స్థాయిలో యువకులు రావడం లేదని నిర్వాహకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ.. జిల్లాకు చెందిన యువతీ యువకులు క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరికి సరైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉంది. పినపాక మండలానికి చెందిన తొలెం రమేష్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగిడి త్రిష క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వీరితో పాటు చాలా మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అయితే జిల్లాలో సరైన క్రీడా మైదానాలు, కోచ్లు అందుబాటులో లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో బాక్స్ క్రికెట్ కోర్టులు క్రీడాకారులకు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయి. కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు.. జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు భద్రాచలం, సారపాకలో ప్రస్తుతం బాక్స్ క్రికెట్ కోర్టులు నడుస్తున్నాయి. కోల్బెల్డ్ ఏరియాలైన ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లోనూ ఈ కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు బాక్స్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవులు సమీపిస్తుండడంతో విద్యార్థులు కూడా బాక్స్ క్రికెట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.గ్రౌండ్ లేని లోటు తీరుతోంది పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ లేదు. క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్నా గ్రౌండ్ లేకపోవడంతో నిరుత్సాహ పడేవాళ్లం. ఇప్పుడు బాక్స్ క్రికెట్ కోర్టు అందుబాటులోకి రాడంతో ఆ ఇబ్బంది తొలగింది. ఫిట్నెస్ కోసం వారానికి నాలుగు రోజులు బాక్స్ క్రికెట్ ఆడుతున్నా. – మాదినేని ఆకాశ్, సారపాకసౌకర్యంగా ఉంది సారపాకలో బాక్స్ క్రికెట్ కోర్టు వచ్చిన తర్వాత మిత్రులతో కలిసి రోజూ రెండు గంటల పాటు క్రికెట్ ఆడుతున్నాం. ఊర్లో క్రికెట్ గ్రౌండ్ లేకపోవడంతో గల్లీలోనే ఆడేవాళ్లం. ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఆటలో నైపుణ్యం పెంచుకుంటున్నాం. ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడడం కొత్త అనుభూతిని ఇస్తోంది. – కన్నెదారి తరుణ్సాగర్, రెడ్డిపాలెం జిల్లాలో వెలుస్తున్న క్రీడా కోర్టులు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడుతున్న యువత, చిన్నారులు క్రీడా ప్రాంగణాలు లేక ఇటువైపు మొగ్గు -
వన్యప్రాణి వధ!
నాటు తుపాకులతో సాగుతున్న వేట ● నీటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న వేటగాళ్లు ● కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ● ఫిర్యాదులు అందితేనే దాడులు.. అరెస్ట్లోనూ తాత్సారం వేడుక చూస్తున్న అటవీశాఖాధికారులు వేటగాళ్లు ఉచ్చులు, నాటు తుపాకులు, వలలతో వేటాడుతున్నా అటవీ శాఖాధికారులు మాత్రం వేడుక చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో పులులు, ఇతర జంతువుల సంచారాన్ని రికార్డు చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు జంతువుల జాడను గుర్తిస్తున్నాయి కానీ వేటగాళ్ల జాడను మాత్రం గుర్తించలేక పోతున్నాయా? లేక సీసీ కెమేరాల ఆధారంగా జంతువుల జాడను అటవీ శాఖలో పనిచేస్తున్నవారు వేటగాళ్లకు సమాచారం అందిస్తున్నారా..? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నెల 9న తుపాకులతో అడవిలో సంచరించిన వ్యక్తులకు ఓ బీట్ ఆఫీసర్కు మధ్య లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతా సార్కు తెలిసే జరిగిందని అనుకున్నారు. తాజాగా దమ్మపేట రేంజ్లో దుప్పి మాంసం పట్టుబడగా రెండు రోజుల జాప్యం అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై పాల్వంచ ఎఫ్డీఓ దామోదర్రెడ్డిని వివరణ కోరగా.. వన్యప్రాణులను వధిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడవిలో గస్తీ నిర్వహించేందుకు సిబ్బంది కొరత ఉందని, సీసీ కెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. అశ్వారావుపేట: వేసవి కాలం కావడంతో వన్యప్రాణులను వేటాడుతున్నారు. జిల్లాలో సీతారామ కాలువల నిర్మాణం ప్రారంభమయ్యాక అడవుల్లోకి నేరుగా మార్గాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు వేసవిలో కాలువల్లో నీళ్లు తాగేందుకు జింకలు, ఇతర వన్య మృగాలు వస్తుండటంతో కాలువల సమీప ప్రాంతాలు వేటగాళ్లకు లక్ష్యంగా మారాయి. అడవుల్లో జంతువులు దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సాసర్పిట్లను కూడా లక్ష్యంగా చేసుకున్ని వన్యప్రాణులను వధిస్తున్నారు. ఏటా శీతాకాలం చివరిలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలకు వేటకు వస్తుంటారు. తుపాకులతో వేటాడం, ఉచ్చులు పెట్టడం, విద్యుత్ వైర్లు అమర్చడం, వలలు అమర్చడం వంటి విధానాల్లో వేట జరుగుతుండేది. విద్యుత్ వైర్లు తగిలి వేటగాళ్లే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో విద్యుత్ వైర్లు అమర్చడం తగ్గించారు. కొద్దిరోజులుగా నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్నారు. కొన్ని చోట్ల ఉచ్చులు, వలలు కూడా వినియోగిస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట రేంజ్లలోని అటవీ ప్రాంతాలు, చంద్రుగొండ మండలం కనకగిరి గుట్టలు, అన్నపురెడ్డిపల్లి అటవీ ప్రాంతాలు, పాల్వంచ మండలం, ఇల్లెందు నియోజకవర్గం గుండాల, పూబెల్లి, పూసపల్లి, బేతంపూడి ప్రాంతం, బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లో జంతువుల వేట జరుగుతున్నట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నా వేటగాళ్లు వెనక్కు తగ్గటంలేదు. పాల్వంచ డివిజన్లో వరుస ఘటనలు.. ఈ నెల 9న పాల్వంచ ఫారెస్ట్ డివిజన్లోని అశ్వారావుపేట రేంజ్ కంట్లం బీట్లో ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు తుపాకులతో అడవిలో సంచరిస్తుండగా బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. గడిచిన వారం రోజుల్లో దమ్మపేట మండలంలో దుప్పి మాంసం పంపిణీ జరిగినట్లు ప్రచారం జరిగింది. స్థానికుల ఫిర్యాదుతో గత గురువారం దమ్మపేట మండలం చెన్నువారిగూడెం గ్రామంలో అటవీ అధికారులు దాడులు చేసి దుప్పి మాంసం, చర్మం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తాత్సారం తర్వాత శనివారం నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలో ఏ–1 నిందితుడు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): యాసింగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని, రేషన్ దుకాణాల ద్వారా అర్హులందరికీ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. పంపులు లేని ప్రాంతాల్లో ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని వివరించారు. వీసీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు, ఇరిగేషన్ ఈఈ అర్జున్రావు, మిషనర్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్బాబు, డీఎస్ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ
ఆలిండియాస్థాయిలో 385వ ర్యాంక్ పాల్వంచరూరల్: తాపీ మేసీ్త్ర కుమారుడు జేఈఈ మొయిన్స్ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ సాధించాడు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన బోగి లక్ష్యయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి తాపీమేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు సంతోష్ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. ఇటీవల జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయగా, ఆలిండియా స్థాయిలో 385 ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.రహదారిపై ధాన్యం.. బస్తాలకు ఎత్తిన పోలీసులుఅశ్వాపురం: మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ రైతు ట్రాక్టర్లో ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తూ కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద ట్రాక్టర్ను గుర్తు తెలియని వాహనం స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో సుమారు 10 బస్తాల ధాన్యం రహదారిపై పడిపోయింది. సుమారు రెండు, మూడు బస్తాల ధాన్యం పిండి అయింది. రహదారిపై వెళ్తున్న వాహనాలతో ధాన్యం పిండి అవుతుండగా ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అశ్వాపురం వైపు వెళ్తున్న ఏఎస్సై రామచంద్రారెడ్డి, పెట్రోలింగ్ సిబ్బంది ఆగి వాహనాలు ధాన్యం ఎక్కకుండా చూసి ధాన్యం బస్తాలలో ఎత్తి రైతుకు సహకరించారు. ధాన్యం బస్తాలకు ఎత్తి సహకరించిన ఏఎస్సై, సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలిజూలూరుపాడు: మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ, అటవీ నర్సరీలను సందర్శించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ డి.కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ టి తులసీరామ్, తాళ్లూరి రవి, ఏపీఓ రవికుమార్, హనుమంతు, లక్ష్మణ్ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలిడీపీఓను కోరిన ఎమ్మెల్యే ఆదినారాయణ అశ్వారావుపేటరూరల్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డీపీఓ చంద్రమౌళిని కోరారు. ఇందిరా బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు జీపీ కార్యదర్శి రజిని సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే పర్యటనకు కూడా హాజరు కాలేదు. దీంతో గ్రామస్తుల సమక్షంలోనే ఎమ్మెల్యే డీపీఓతో ఫోన్లో మాట్లాడి కార్యదర్శిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ కేసు నమోదుపాల్వంచరూరల్: స్మార్ట్ఫోన్లో అపరిచితుడు పంపిన లింక్ ఓపెన్ చేసి ఓ యువకుడు రూ. 35 వేలు పోగొట్టుకున్నాడు. మండల పరిధిలోని పునుకుల గ్రామానికి చెందిన ఎస్కె.మహబూబ్ గతేడాది అక్టోబర్ 30న తన ఫోన్కు అపరిచితుడు పంపిన లింక్ను ఓపెన్ చేశాడు. దీంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.35 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు శనివారం ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఆదివాసీ బిడ్డకు పతకాల పంట
స్పీడ్ స్కేటింగ్ విభాగంలో ప్రతిభజూలూరుపాడు: ఆదివాసీ గిరిజన బిడ్డ స్పీడ్ స్కేటింగ్ స్పోర్ట్స్ విభాగంలో ప్రతిభ చాటి పతకాలు సాధించింది. మండలంలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జెజ్జర గోపి సుధీర్ కుమార్ – అలివేలు దంపతుల కుమార్తె తేజస్వి.. పుదుచ్చేరి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఈనెల 17న చైన్నెలో జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్లో స్పీడ్ స్కేటింగ్ జూనియర్ విభాగం వన్ ల్యాప్ రోడ్లో గోల్డ్ మెడల్, 2వేలు, 1000 మీటర్ల ఫోర్ ల్యాప్ రోడ్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించింది. దీంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. తేజస్వి పతకాలు సాధించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
‘భూ భారతి’తో సత్వర పరిష్కారాలు
● సింగరేణి ఓసీ విస్తరణలో భూ సేకరణకు సహకరించాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మణుగూరు టౌన్/కరకగూడెం/పినపాక: భూ భారతి చట్టం రైతన్నలకు చుట్టంలా మారిందని, ఈ చట్టం ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం జెడ్పీ సెంటర్లో, పినపాక మండలం బయ్యారం క్రాస్రోడ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సింగరేణికి భూసేకరణ కోసం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో తిర్లాపురం, మణుగూరు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం సమన్యాయానికి సూచికగా నిలుస్తుందని, సాగు భూమికి రక్షణ కవచంలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బిల్డింగులకు, ప్రభుత్వ పాఠశాలలకు, అభివృద్ధి పనులకు కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు. భూ హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు కూడా పరిష్కారమవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీలు వ్యవస్థ ఉంటుందన్నారు. మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు తిర్లాపురంలో సేకరించే భూములకు పట్టణంలో మాదిరిగా ఎకరాకు రూ.22.5లక్షల వరకు చెల్లించేందుకు కృషి చేస్తామని, సింగరేణిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులతోపాటు గిరిజన సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. బయ్యారం క్రాస్రోడ్లో మునగపంటను పరిశీలించి, సాగు చేసిన రైతు కొప్పుల వర్మను అభినందించారు. ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారం కావని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, నాగ ప్రసాద్, నగేష్, ఎంపీడీఓలు కుమార్, సునీల్ కుమార్, ఎస్డీసీ సుమ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఆర్ఐ కృష్ణ ప్రసాద్, తిర్లాపురం మాజీ సర్పంచ్ పాయం కామరాజు, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.. సింగరేణిలో బ్లాస్టింగ్ల వల్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని మున్సిపాలిటీ పరిధిలోని పీకే–1, బాపనకుంట, రాజుపేట, విఠల్రావ్ నగర్ల గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. సింగరేణి కోసం భూములు ఇచ్చే రైతుల ఇళ్లు కూడా ఉన్నాయని, కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం వల్ల మా ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ జరిగితే ఎలా నివసించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ విస్తరణలో తమ నివాసాలు కూడా తీసుకుని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విఠల్రావు నగర్, పీకే–1 సెంటర్ రైతులు, గ్రామస్తులు, సీపీఐ నాయకుడు దుర్గ్యాల సుధాకర్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
● గంట ముందే కేంద్రాల్లోకి అనుమతి ● తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పించిన అధికారులుఖమ్మం సహకారగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 20నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనుండగా, ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉద్యోగుల నియామకం పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో ఎనిమిది మంది చొప్పున, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. అలాగే, వేసవి నేపథ్యాన కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి ఈ.సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. -
కరుణామయుడా..
● భక్తిశ్రద్ధలతో గుడ్ రౖఫైడే ● ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీలు పాల్వంచ/కొత్తగూడెంటౌన్: క్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటూ క్రైస్తవులు శుక్రవారం గుడ్ రౖఫైడే వేడుకలను జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా చర్చిలు, మందిరాల్లో ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల్లో క్రీస్తు సిలువ వేసిన ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. పలువురు గీతాలను ఆలపించారు. కొత్తగూడెంలోని సెయింట్ అండ్రుస్, బేతానియా, సెయింట్ థామస్ చర్చిలు, పాల్వంచలోని సీఎస్ఐ, ఆరోగ్య మాత చర్చిల్లో వేడుకలు జరిగాయి. పాల్వంచ ఆరోగ్యమాత చర్చి(ఆర్సీఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన సిలువ మార్గ ప్రదర్శన చూపరులను కంటతడి పెట్టించింది. చర్చి నుంచి బీసీఎం రోడ్లో సీ కాలనీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్ మీదుగా శ్రీనివాస కాలనీ కార్మెల్ గిరి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రదర్శన సాగింది. రాత్రి భక్తులు కార్మెల్ గుట్టకు అధిక సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు చేశారు. గిడియోన్ సంస్థ ఆధ్వర్యంలో బైబిళ్లు, న్యూలైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చల్లటి పానీయాలు పంపిణీ చేశారు. చిత్రమాలిక IIవ పేజీలో -
అంతా సవ్యంగానే ఉందా?!
● పాఠశాలల స్థితిగతులపై ఏటా యు–డైస్ సర్వే ● ఇందులో వివరాలపై థర్డ్ పార్టీ ద్వారా పరిశీలన ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన ఎలా జరుగుతోంది.. ఇంకా ఏమేం వసతులు కావాలనే సమాచార సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఏటా యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యు–డైస్) సర్వే చేయిస్తోంది. ప్రతీ ఏడాది అక్టోబర్, నవంబర్లలో ఈ సర్వే చేస్తుండగా.. ఇందులో నమోదైన వివరాలను సరిచూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించింది. డైట్ కళాశాల విద్యార్థులతో చేయిస్తున్న ఈ సర్వే 15వ తేదీన మొదలుకాగా 21వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డైట్ కళాశాల ఒకటే ఉన్నందున భద్రాచలం ఐటీడీఏలోని బీఈడీ కళాశాల విద్యార్థులను కూడా సర్వేకు వినియోగించుకుంటున్నారు. యు–డైస్ సర్వే ఇలా.. ఏటా కేంద్ర ప్రభుత్వం యు–డైస్ పేరిట సర్వే నిర్వహిస్తుంది. పాఠశాలల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా సదుపాయల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. కొన్ని తేడాలు.. కేంద్రం చేయించిన యు–డైస్ సర్వేలో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని తేల్చారు. టాయిలెట్లు, డిజి టల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం లేవని గుర్తించారు. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా వివరాలు ఇలా నమోదు కావడానికి సర్వే లోపాలే కారణమని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించినట్లు తెలిసింది. డైట్ విద్యార్థులతో.. డైట్ విద్యార్థులతో థర్డ్ పార్టీ సర్వే కొనసాగుతుండగా, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. యు–డైస్లో ఏం నమోదు చేశారు.. వాస్తవ పరిస్థితులు ఏమిటో పరిశీలించి తేడాను నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖమ్మం సమీపాన ఓ పాఠశాలలో ర్యాంప్ లేకున్నా ఉన్నట్లు నమోదు చేశారని, మరుగుదొడ్లు ఉన్నా లేనట్లుగా పేర్కొన్నారని గుర్తించినట్లు సమాచారం. అలాగే, చిన్న మరమ్మతులు అవసరమైతే భవనాలు శిథిలావస్థకు చేరాయని యు–డైస్ సర్వేలో పొందుపర్చారని తేల్చినట్లు తెలిసింది. కాగా ఈ సర్వేతో వాస్తవ పరిస్థితులు వెలుగుచూస్తాయని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.జిల్లా పాఠశాలలు సర్వే చేస్తున్న విద్యార్థులు ఖమ్మం 1,170 80 మంది భద్రాద్రి కొత్తగూడెం 530 72 మంది -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శు క్ర వారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం గావించారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. 22, 25 తేదీల్లో టీబీజీకేఎస్ నిరసనలుసింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్ వద్ద, 25న జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్ప పూల సేకరణఅశ్వాపురం: మండలంలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు ఇప్ప పూలు సేకరిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం నుంచి వర్షాలు కురిసే వరకు గిరిజన గ్రామాల్లో ఇప్ప పూల సేకరణ సాగుతుంది. తెల్లవారుజామునే అడవుల్లోకి వెళ్లి సేకరించి ఇళ్లకు తెచ్చి ఎండబడతారు. అనంతరం కేజీ రూ.15 నుంచి 20చొప్పున విక్రయిస్తుంటారు. వీరి నుంచి జీసీసీ అధికారులు, కొందరు ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేపడతారు. వేదగణితంలో విద్యార్థి ప్రతిభఅశ్వారావుపేటరూరల్: వేద గణితం శిక్షణలో అశ్వారావుపేటకు చెందిన సిద్ధాంతపు సాత్విక్ సాయికుమారాచార్యులు ప్రతిభ కనబరిచాడు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో గడిచిన ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా వేద గణితంపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ ముగిశాక పరీక్ష నిర్వహించి, శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. కాగా సాత్విక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ మేరకు సర్టిఫికెట్ను వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి, వేదగణితం శిక్షకురాలు జి.సత్య ఈ మెయిల్ ద్వారా పంపించారు. -
ధాన్యం కాపాడేదెట్టా..?
పాల్వంచరూరల్: అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను రక్షించుకునేందుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ధాన్యం, మిర్చి కల్లాల్లో ఆరబెడితే వానలకు తడిసిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెలు గుభేల్మంటున్నాయి. టార్పాలిన్ పట్టాలు కప్పుకుని కాపాడుకుందామంటే ప్రభుత్వం వాటిని సరఫరా చేయడంలేదు. దీంతో ఏటా యాసంగి సీజన్లో రైతులు నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై.. యాసంగి సీజన్లో అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 30,557మంది రైతులు 74,600 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసిపోయింది. గతంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై టార్పాలిన్లు (పట్టాలు) అందించారు. మార్కెట్లో టార్పాలిన్ ధర రూ.2500 ఉంటే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ.1250కు ఇచ్చేది. దీంతో రైతులు అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేవారు. కానీ 2017 నుంచి టార్పాలిన్ పట్టాల పంపిణీ నిలిపివేశారు. దీంతో ఎనిమిదేళ్లుగా టార్పాలిన్ల పట్టాల కొరత రైతులను వేధిస్తోంది. అద్దెకు తీసుకుందామంటే అధిక ధర ధాన్యం తడవకుండా పరదాలను రైతులు అద్దెకు తెచ్చి వినియోగించుకుంటున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు పట్టణాలకు వెళ్లి పరదాలను అద్దెకు తెస్తున్నారు. ఒక్కో పరదాకు రోజుకు రూ.20పైన చెల్లించాల్సివస్తోంది. దీనికితోడు రానుపోను చార్జీలు కలిపి రైతులపై భారం పడుతోంది. పట్టాల్లేక అకాల వర్షంతో తడిసిపోతున్న వడ్లు ఏటా యాసంగి సీజన్లో రైతులకు తప్పని ఇక్కట్లు గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు మంజూరు 2017 నుంచి పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం ప్రైవేటులో నాణ్యతలేని పరదాలు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. సమీప పట్టణాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటుగా కొనుగోలు చేసిన మన్నిక, నాణ్యత ఉండటం లేదని, నాసిరకంగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు పంటలు తడిసిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికీ పాతవి, పాడైన టార్పాలిన్లనే వినియోగిస్తున్నారు. కొందరు గోనె సంచులను ఉపయోగిస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. ధాన్యం తడిసి మళ్లీ తేమశాతం పెరిగి కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు తప్పడం లేదు. -
బూడిదే మిగులుతోంది!
● ఏటా ఏజెన్సీలో అగ్ని ప్రమాదాలతో తీవ్ర నష్టం ● ఇళ్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగులుతున్న బాధితులు ● అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్యం ● చర్ల, గుండాల, ములకలపల్లిలో ఏర్పాటు చేయాలని విన్నపం చర్ల: ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సుదూర ప్రాంతాల్లోని కేంద్రాల నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోని చర్ల, వెంకటాపురం, వాజేడు, ములకలపల్లి, దమ్మపేట, గుండాల, ఆళ్లపల్లి మండలాలు అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. ఆయా మండలాల్లో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలల్లో తీవ్రమైన ఆస్తినష్టం సంభవిస్తోంది. ఫైరింజన్లు వచ్చేసరికి నష్టం జరిగిపోతోంది.. భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి దుమ్ముగూడెం 20 కిలోమీటర్లు, చర్ల 55 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వెంకటాపురం 110, వాజేడు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పినపాక మండలంలో ఉన్న గుండాల, ఆళ్లపల్లి మండలాలకు కొత్తగూడెం అగ్నిమాపక కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, దమ్మపేట మండలాలు కొత్తగూడెంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అంత దూరం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోంది. రహదార్లు సరిగా లేని ప్రాంతాలకు ఇంకా ఆలస్యం అవుతోంది. ఆలోపే అంతా అగ్గికి బుగ్గి అవుతోంది. దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగులుతున్నారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వేసవిలో ఇళ్లతోపాటు ధాన్యం కుప్పలు, మిర్చి కల్లాలు, పత్తి కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా అగ్ని ప్రమాదాలతో సుమారు రూ.10 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అగ్ని ప్రమాదాల నుంచి ఏజెన్సీలో ఆస్తులను కాపాడేందుకు అగ్ని మాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేవలం జిల్లా, నియోజకవర్గ కేంద్రాలను తప్ప ఏజెన్సీలోని మండలాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాలను గాలికొదిలేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం ప్రాంతాలను కూడా పట్టించుకోవడంలేదు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న ములకలపల్లి, దమ్మపేట మండలాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కాలి బూడిదవుతున్నాయి.. ఏటా చర్ల మండలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తులన్నీ కాలిబూడిదవుతున్నాయి. భద్రాచలం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే సరికి బూడిద మాత్రమే మిగులుతోంది. ప్రభుత్వం స్పందించి చర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. –పి.సాంబశివరావు, ఆర్.కొత్తగూడెంఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలి చర్ల మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా అగ్ని ప్రమాదాల్లో రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వందల సంఖ్యలో పేదలు, గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించాలి. –సాయికుమార్, తేగడ ప్రతిపాదనలు పంపాం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అదనంగా అగ్నిమాపక కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నియోజకవర్గ కేంద్రాలకు సుదూర ప్రాంతంలో ఉన్న చర్ల, గుండాల మండల కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నాం. త్వరలోనే మంజూరవుతాయి. –ఎం.క్రాంతి కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అశ్వాపురం: జీవితం మీద విరక్తితో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం మండల పరిధి మల్లెలమడుగుకు చెందిన బండి అనిల్(34) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో 17న ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొండికుంట గ్రామ సమీపాన పొలాల్లో అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని చూసిన గేదెల కాపరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అశోక్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, మృతదేహం దుర్వాసన వస్తుండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో మహిళ.. జూలూరుపాడు: బ్రెయిన్ స్ట్రోక్తో ఓ మహిళ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన షేక్ జాన్బీ(53) గత కొన్ని రోజులుగా ఉపాధి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో రోజుమాదిరిగానే ఈనెల 15న పనికి వెళ్లి ఇంటికి వచ్చి రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదేరోజు రాత్రి తెల్లవారుజామున ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై ఖమ్మంకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. గత ఐదేళ్ల క్రితం జాన్బీకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. మృతురాలికి భర్త జానీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు.. బోనకల్: భర్త వదిలేసినా, ఇద్దరు కుమారులు మానసిక వైకల్యంతో బాధపడుతున్నా బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ కుమారుడిని బావి మింగేసింది. ఆ కుటుంబంతో పాటు, స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు... జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన షేక్ రేష్మాకు ఓ కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలివేసినా అధైర్యపడకుండా పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరుకు వచ్చి గుడారం వేసుకుని జీవనం సాగిస్తోంది. పాత రాతెండి సామగ్రి కొనడం, మరమ్మతు పనులతో పొట్ట పోసుకుంటుండగా, శుక్రవారం పెద్దకుమారుడు యాకూబ్(15) బోనకల్ మండలం లక్ష్మీపురం పరిధి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. దీంతో నీటమునిగిన ఆయన మృతి చెందగా తల్లి సహా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బీఆర్ఎస్ నాయకుడు పెంట్యాల పుల్లయ్య ఆటో సమకూర్చగా, స్థానికులు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈమేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి.. తిరుమలాయపాలెం: కొద్ది రోజులుగా మండలంలోని మేడిదపల్లి ప్రాంతంలో తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(30) వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మతిస్థిమితం లేని సదరు వ్యక్తి మేడిదపల్లిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తినేవాడు. ఈక్రమాన మేడిదపల్లి – మేకలతండా మార్గంలో వ్యవసాయ బావిలో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59136, 87126 59137 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కూచిపూడి జగదీష్ సూచించారు. రెండు మందుపాతరల గుర్తింపు చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం పోలీసు బలగాలు రెండు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లా మూడి మార్గంలో కోబ్రా 205 బెటాలియన్ బలగాలు తనిఖీ చేస్తుండగా 1.5 కిలోల సామర్థ్యం కలిగిన రెండు బీరు బాటిల్ బాంబులను గుర్తించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అక్కడే నిర్వీర్యం చేశారు. -
ఏడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..
టేకులపల్లి: అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న శంభునిగూడెం, సూర్యాతండా, కూనారం, చంద్రుతండా, మంగ్యతండాలకు చెందిన ఏడు ట్రాక్టర్లను సులానగర్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈమేరకు డ్రైవర్లు, యజమానులు గుగులోత్ సురేష్, గుగులోత్ సర్ధార్, బానోత్ హత్తిరామ్, బానోత్ రమేష్, గుగులోత్ శివ, గుగులోత్ గన్యా, గుగులోత్ పవన్కల్యాణ్, గుగులోత్ భద్రు, పాయం సర్వేష్, బోడ మంగ్య, కంగల రాము, ఇలాసాగర్ కృష్ణ, బానోత్ శంకర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్, మట్టి లారీలు.. బూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి, ట్రాక్టర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు తప్పవని ఎస్ఐ రాజేశ్ హెచ్చరించారు. అలాగే మండల పరిధిలోని టేకులచెరువు గ్రామ సమీపాన సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టిని రెండు టిప్పర్లలలో తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలను పోలీస్స్టేషన్కు తరలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 13 మందిపై కేసు నమోదు -
పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీలో ఓ అధికారి సరైన విచారణ చేయకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్మెంట్ లేని లబ్ధిదారులను ఆన్లైన్లో నమోదు చేశాడని ఆధునిక సాంకేతిక విచారణలో తేలింది. దీంతో పూసా జగదీష్ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం విధుల నుంచి తొలగించారు. ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సోదాలు భద్రాచలంఅర్బన్: భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ ఆధ్వర్యాన పట్టణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు బెల్ట్ షాపుల్లో నిల్వ ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఎకై ్సజ్ శాఖ సీఐ షేక్ రహీమున్నీసా బేగంకు అప్పగించారు. అనంతరం పట్టణంలోని మూడు లాడ్జీలలో ఏఎస్పీ విక్రాంత్, తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకముందు అంబేడ్కర్సెంటర్లో వాహనాలు తనిఖీ నిర్వహించి ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా రమేష్మణుగూరు రూరల్: జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా బీర రమేష్ను, మండల చైర్మన్గా భోగ వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి వాకపల్లి ప్రవీణ్బాబు నియమితులయ్యారు. శుక్రవారం మణుగూరులో నిర్వహించిన సమావేశంలో నియామక పత్రాలు అందజేశారు. జిల్లా చైర్మన్ ధూళిపూడి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బైక్ను ఢీకొట్టిన వ్యాన్.. పాల్వంచరూరల్: ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామ పంచాయతీ ధర్మన్ననగర్ చెందిన మడవి మున్నా, అతడి మేనల్లుడు కోర్స సురేష్లు శుక్రవారం ద్విచక్రవాహనంపై పాల్వంచకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో జగన్నాధపురం గ్రామ శివారు తోగ్గూడెం రోడ్డులో పాల్వంచ వైపు వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్లున్న ఇద్దరికి తీవ్ర గాయలు కాగా 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మడవి నందా ఫిర్యాదు మేరకు చండ్రుగొండ మండలం రేపల్లేవాడకు చెందిన వ్యాన్ డ్రైవర్ ఇనుము నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలుడిని ఢీకొట్టిన ట్రాక్టర్.. జూలూరుపాడు: రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో కాలు విరిగిన సంఘటన మండలంలోని భేతాళపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నాగమల్లిఖార్జున్, త్రివేణి దంపతుల మూడేళ్ల కుమారుడు సిద్దు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఊళ్లో రాత్రి పూట అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్న ఓ ట్రాక్టర్ బాలుడిని ఢీకొట్టి కాలుపై నుంచి ట్రాక్టర్ ముందు టైర్ వెళ్లడంతో విరిగిపోయింది. ఈమేరకు సిద్దును కొత్తగూడెం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. చోరీపై కేసు నమోదు దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన తాండ్ర నరసింహారావు రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చాడు. ఈక్రమంలో ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెల్లగా రూ.20 వేల విలువైన వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. భూ వివాదంలో పలువురిపై.. అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఇటీవల భూ వివాదంలో అశ్వాపురం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యాన గురువారం రాత్రి పలువురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 190/1 సర్వే నంబర్లో ఎకరం 20 కుంటల భూమికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా భూమి గ్రామకంఠానిదని రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేపట్టి మాకు ఇచ్చారని గ్రామస్తులు, తాతల కాలంగా మా కుటుంబానికి చెందిందని హరిప్రసాద్ కుటుంబసభ్యులకు గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యాన ఇటీవల హరిప్రసాద్ తన అనుచరులతో జేసీబీతో భూమి చుట్టూ ఫెన్షింగ్ వేసేందుకు రాగా రామచంద్రాపురం గ్రామస్తులకు, సారపాకకు చెందిన కొందరికి ఘర్షణ జరిగి దాడులు చేసుకున్నారు. గురువారం సామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీసీ టీఎన్టీయూసీ నాయకుడు కనకమేడల హరిప్రసాద్తో పాటు ఐటీసీ ఉద్యోగులు, మరికొందరు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కంటైనర్, కారు ఢీ..
జూలూరుపాడు: కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కంటైనర్, భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే కారు జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు కారణంగా కంటైనర్, కారు ఢీకొన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకుని తన పోలీస్ సిబ్బందితో పాటు కూలీలతో కలిసి గుంతలను పూడ్పించారు. -
7.63 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: ఏపీలోని చింతూరు నుంచి భద్రాచలం మీదుగా మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.తిరుపతి కథనం ప్రకారం.. కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 7.63 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తిని విచారించగా మధ్యప్రదేశ్కు చెందిన బ్రిజేష్ ఏపీలోని చింతూరులో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొని మధ్యప్రదేశ్లోని విదిశాకు బైక్పై తరలిస్తున్నట్లు చెప్పాడు. ఈమేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక సెల్ఫోన్, ద్విచక్ర వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని, గంజాయి విలువ సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 10 లీటర్ల నాటుసారా.. బూర్గంపాడుకు చెందిన గుండె రాజేష్, రేపాకుల సంతోష్లు ద్విచక్ర వాహనంపై 10 లీటర్ల నాటుసారాను సారపాకకు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది కరీం, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేత? అశ్వారావుపేట: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న నిషేధిత గంజాయిని అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద నార్కోటిక్ పోలీసులు పట్టకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఏపీ వైపు నుంచి ఖాళీగా వస్తున్న ఓ లారీలో టార్పాలిన్ పట్టా కింద సుమారు 400 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో దాడి చేయగా లారీ గంజాయితో సహా పట్టుబడినట్లు తెలిసింది. కాగా, ఇట్టి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. మధిరకు చెందిన రాజకొండ దుర్గారావు కొన్నేళ్లుగా బొక్కలగడ్డ వెంకటేశ్వర్నగర్లో ఉంటూ చిరువ్యాపారం చేస్తున్నాడు. అయితే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈనేపథ్యాన పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐ రమేష్ ఆయనన తనిఖీ చేయడంతో రూ.20వేల విలువైన 450 గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
ఇష్టంతో సాగు చేస్తున్నాం..
దమ్మపేట గ్రామంలోని పేరంటాల చెరువు ఆయకట్టు కింద నాకున్న ఎకరం భూమిలో వరి సాగు చేసేవాన్ని. గతంలో అంతగా లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే దాదాపుగా నష్టపోయినట్లే. కానీ ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్తో ఖరీఫ్లో పెట్టిన పెట్టుబడి పోగా లాభం కూడా వచ్చింది. దీంతో యాసంగిలోనూ ఇష్టంతో వరి సాగు చేస్తున్నా. – నక్కా వెంకటేశ్వరరావు, రైతు, దమ్మపేట ● -
మామిడి మొక్కల పెకిలింపు
దమ్మపేట: వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, మామిడి మొక్కలను పెకిలించడంతోపాటు చంపుతామని బెదిరించిన వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన యర్రపాటి పకీర్రావు అఖినేపల్లిలోని తన వ్యవసాయ భూమి మామిడి మొక్కలు సాగు చేస్తున్నాడు. బుధవారం మందలపల్లి గ్రామానికి చెందిన వేమవరపు రామకృష్ణ, దండాబత్తుల కాంతారావులు పకీర్రావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, సాగులో ఉన్న మామిడి మొక్కలను పెకిలించారు. ప్రశ్నించిన పకీర్రావు కుమారుడు ఏకాంబరేశ్వరరావు, అతడి మిత్రుడు కోలికపోగు కాంతారావులను చంపుతామని కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు. పెకిలించిన మొక్కల విలువ రూ.10,000 ఉంటుందని బాధితులు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. ‘రాజీవ్ యువ వికాసం’పై ఆరాచండ్రుగొండ : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులపై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. రుణాల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీఓ బయ్యారపు అశోక్ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీల్లో 3200 మంది లబ్ధిదారులు ఉన్నారని, తొలి, మలి విడతల్లో బెండాలపాడు గ్రామానికి మంజూరైన 303 ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ వివరించారు. బాల్య వివాహం.. కేసు నమోదుపాల్వంచరూరల్: మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన 21 ఏళ్ల గండికోట రవీందర్ అదే గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను ఈ నెల 11న వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై చైల్డ్లైన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవీలత ఫిర్యాదు మేరకు రవీందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సెల్ఫోన్లో గేమ్ ఆడి... రూ.68 వేలు పోగొట్టుకున్న యువకుడు పాల్వంచరూరల్: సెల్ ఫోన్లో గేమ్ ఆడి రూ. 68 వేలు పోగొట్టుకున్నాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాళోత్ రాణి కుమారుడు వంశీ ఈ నెల 14న సెల్ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో రూ.పదివేలు పెట్టి ఆడితే రెట్టింపు డబ్బులు గెలవవచ్చని అపరిచిత వ్యక్తి నుంచి లింక్ వచ్చింది. దీంతో యువకుడు లింక్ ఓపెన్చేసి గేమ్ ఆడగా, రూ.68 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులపై ఫిర్యాదుచుంచుపల్లి: మండల పరిధిలో మైక్రో ఫైనాన్స్ యజమానులు పలువురు మహిళలను రుణాల విషయంలో వేధిస్తున్నారని గురువారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవి కుమార్కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. లారీ ఢీకొని మహిళకు గాయాలు దమ్మపేట: బైక్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని వెంకటరాజాపురం సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన నడ్డి రాజు, అల్లంశెట్టి కృష్ణారావు, తంగిరాల శ్రీలత(35)లు బుధవారం రాత్రి సమయంలో బైక్పై అశ్వారావుపేట నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజాపురం గ్రామ సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రురాలి భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో చోరీజూలూరుపాడు: మండల కేంద్రంలోని కోయకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చేసరికి పాఠశాల తలుపులు, లోపల ఇనుప బీరువా పగులగొట్టి మైక్ స్పీకర్, క్రీడా సామగ్రి అపహరించారని హెచ్ఎం జర్పల కృష్ణ తెలిపారు. దీంతో ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మీనర్సయ్యలకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారని, అనంతరం తాను స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం తెలిపారు. -
ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం
ఖమ్మం మయూరిసెంటర్/పాల్వంచ/చింతకాని: అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎంఎస్) జాతీయ సమితిలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో గురువారం ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, భద్రాద్రి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్లో సభ్యులుగా స్థానం దక్కింది. నేలకొండపల్లి మండలం ముటాపురానికి చెందని హేమంతరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, గోవిందరావు 1991లో సీపీఐలో కొనసాగుతుండగా వివిధ హోదాల్లో పనిచేయడమే కాక రాఘవాపురం సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమేరకు వీరిని పలువురు అభినందించారు -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పాల్వంచ: ప్రస్తుత వేసవిలో కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కేటీపీఎస్ 5,6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. 81వ జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కేటీపీఎస్ 5,6 దశల ఫైర్, సేఫ్టీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మాగారంలో సిబ్బంది రక్షణ పరికరాలు ధరించాలన్నారు. ఎస్ఈలు జీవి.ధర్మారావు, టి.సత్యనారాయణ, ఎస్.సునీల్, ఇతర అధికారులు సతీష్, చంద్రశేఖర్, డి.కిరణ్, భాగం రాంప్రసాద్, వై.శ్రీనివాస్, సమ్మయ్య, నాగయ్య, శేషసాయి, మహేశ్వరరావు, నాగరాజు, రజిత, సిబ్బంది పాల్గొన్నారు. -
బీటీపీఎస్లో సిబ్బంది కొరత
● ఇటీవల మరో 49 మంది కార్మికుల బదిలీ ● రెండు, మూడు పని ప్రదేశాల్లో ఒక్కరికే బాధ్యతలు ● సబ్ ఇంజనీర్లు, కార్మికులపై పెరుగుతున్న పనిభారం మణుగూరు రూరల్: బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జెన్ కో యాజమాన్యం సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ఉన్న ఉద్యోగులపై తీవ్ర పనిభారం పెరుగుతోంది. బీటీపీఎస్లోని నాలుగు యూనిట్లలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కోల్ ప్లాంట్, యాష్ప్లాంట్, ఈఎస్పీ (ఎలక్రో స్టార్టర్ పెసిఫికేటర్) వంటి ప్రదేశాలు కీలకంగా ఉంటాయి. అలాంటి పని ప్రదేశాల్లోనూ రెండు నుంచి మూడు ప్రదేశాలను ఒక్కరే పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సిన పనులు కూడా పనిఒత్తిడితో కిందిస్థాయి కార్మికులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్లో సుమారు 1200 నుంచి 1500మంది ఉద్యోగులు అవసరం ఉండగా, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు. తాజాగా మరో 49 మంది బదిలీలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పనిభారమైనా విధులు నిర్వహించాలని హుకుం జారీ చేయడం, చిన్న తప్పిదాలకే బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తుండటంపై ఇటీవల ప్లాంట్లో పర్యటించిన సీఎండీకి పలు యూనియన్ల నాయకులు విన్నవించారు. నియామకాలు చేపట్టకుండా.. నిబంధనల ప్రకారం ఒక్కో పని ప్రదేశంలో కనీసం ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. ఒకరు అనారోగ్యానికి గురైనా, లేక అవగాహన, అనుభవ లేమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నా, ఔట్ సోర్సింగ్ ఉపాధి అవకాశాలు పెంచే పరిస్థితులు ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే క్రమంలోనే సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, ఉద్యోగులపై పనిభారం పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా నియామకాలు చేపట్టి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలు లేకుండా చూస్తున్నాం ప్లాంట్లో కొంత సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే. డిప్యూటేషన్పై వచ్చిన 49 మంది తిరిగి వారి స్థానాలకు వెళ్లారు. సిబ్బంది కొరతతో ఏర్పడుతున్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య ఏర్పడకుండా ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. త్వరలో నియమాకాలు చేపట్టే అవకాశం ఉంది. –బిచ్చన్న, సీఈ -
‘కొర్రమేను’ పెంపకంపై దృష్టి సారించాలి
● 5వ తేదీకి యూనిఫాం కుట్టు పనులు పూర్తి చేయాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అశ్వాపురం/ పాల్వంచరూరల్: కొర్రమేను చేపల పెంపకంపై రైతులు, మహిళలు దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ కొర్సా దుర్గారావు కొర్రమేను చేపల పెంపకం చేపడుతుండగా గురువారం అదనపు కలెక్టర్ సందర్శించారు. చేపల పెంపకానికి ఉపాధి హామీ పథకంలో ఉచితంగా నిర్మిస్తున్న ఫామ్పాండ్ను పరిశీలించారు. మల్లెలమడుగు, పాల్వంచ మండలం నాగారం, కేశవాపురం గ్రామాల్లోని కుట్టుమిషన్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొర్రమేను చేపల పెంపకం అశ్వాపురం మండలం మిట్టగూడెంలో జిల్లాలోనే ఆదర్శవంతంగా ఉందన్నారు. మే 5వ తేదీ నాటికి విద్యార్థుల యూనిఫాం ఒక జత చొప్పున కుట్టి అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లల వ్యక్తిగత కొలతలను, రిజిస్టర్లో నమోదు చేసుకుని వాటి ఆధారంగా స్టిచింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎస్కె.సైదులు, డీపీఎం జ్యోతి, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ ముత్యాలరావు, ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఏపీఎంలు రాంబాబు, ఏపీఎం సత్యనారాయణ, నాగార్జున, సీతరామయ్య, వెంకటేష్, మల్లేశం పాల్గొన్నారు. -
ఎండల్లో బండ్లు జాగ్రత్త
కొత్తగూడెంటౌన్: ఎండలు భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్తే ఎండవేడిమితో అవస్థ పడాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు మనతోపాటు వాహనాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే ట్యాంకులు, టైర్లు పేలే అవకాశం లేకపోలేదు. ఎండలో ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్ లీకై ఏ చిన్న నిప్పు రవ్వపడ్డా పెనుప్రమాదం సంభవిస్తుంది. ఎండల నుంచి మనం ఎలా రక్షణ చర్యలు తీసుకుంటున్నామో వాహనాలకూ అదే రీతిలో రక్షణ చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు, నిపుణులైన మెకానిక్లు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొత్తగూడెం ఫైర్ ఆఫీస్ 87126 99296, ఇల్లెందు ఫైర్ ఆఫీస్ 87126 99295 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ఇవి పాటించాలి ● ద్విచక్రవాహనాలను క చ్చితంగా నీడలోనే పార్కింగ్ చేయాలి.టైర్లలో గాలిని తగ్గించుకోవాలి. ● వాహనాలను గంటల తరబడి ఎండలో ఉంచితే రంగు కోల్పోతాయి. మళ్లీ రంగులు వేయించాలంటే దాదాపు రూ.6 నుండి 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ● ఎండలో ఎక్కువ సేపు నిలిపి ఉంచితే వాహనాల ట్యాంకుల్లోని పెట్రోల్ ఆవిరి అవుతుంది. ● ఫుల్ ట్యాంకు పెట్రోల్ కొట్టిస్తే ఎండలకు ట్యాంకులు పేలే అవకాశం ఉంటుంది. ● రాత్రి వేళల్లో పెట్రోల్ ట్యాంకు మూతను ఓ సారి తెరిచి మూసివేస్తే అది సెట్ అవుతుంది. కార్లు, లారీల యజమానులు.. ● కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ● వాహనాలను ఎండలో ఉంచితే ట్యాంకులో 40 నుంచి 80 శాతం ఇంధనం ఆవిరి అవుతుంది. ● వాహనాల రేడియేటర్లలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎండలకు ఇంజన్లు తరుచుగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎండ వేడికి ఇంజన్ అయిల్ తగ్గిపోతుంది. ● పెట్రోల్, డీజీల్, గ్యాస్ వాహనాలు నడిపే వారు వీలైనంత వరకు వేసవిలో గ్యాస్ కిట్ను వినియోగించుకుండా చూసుకోవాలి. కార్లలో ఏసీ వినియోగిస్తే అద్దాలకు మ్యాట్స్ను బిగించుకోవాలి. ● ఎల్పీజీ వాహనాలను వేసవిలో ఉపయోగించకపోవడమే మేలు. ● ప్రభుత్వ అనుమతి ఉన్న గ్యాస్ కిట్లను మాత్రమే ఉపయోగించాలి. నాసిరకానివి వినియోగిస్తే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ప్రస్తుతం ఉదయం 8, 9 గంటలు దాటితే ఎండ తీవ్రత ఉంటోంది. వాహనదారులు ఎండలో ప్రయాణాలను చేయకూడదు. ● ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు, కార్ల వినియోగం కూడా పెరుగుతోంది. వేసవిలో ఈవీలతో యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలి. చార్జీంగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టకూడదు. అప్రమత్తంగా ఉండాలి ఎండకాలంలో ప్రతీ వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను ఎండలో కాకుండా నీడలో పార్కింగ్ చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల్లో టైర్లలో గాలి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రీ బటన్ టైర్లను ఉపయోగించకూడదు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ను ట్యాంక్ ఫుల్ చేయించొద్దు. బైక్లపై ఎండల్లో దూర ప్రయాణాలు చేయొద్దు. – వి.వెంకటరమణ, ఇన్చార్జ్ ఆర్టీఓ వాహనదారులు నీడలోనే పార్కింగ్ చేయాలి ట్యాంక్ నిండా పెట్రోల్ నింపినా డేంజరే.. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే దూర ప్రయాణం చేయొద్దు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు -
వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం
ఇల్లెందు: ఎస్టీ వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే చందాలింగయ్య దొర అన్నారు. గురువారం ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిందని, అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చట్టం చేసి జీఓ విడుదల చేసినందున ఎస్టీల్లో వర్గీకరణ ఆశలు రేకెత్తాయన్నారు. ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అందులో 600 పోస్టులు ఎస్టీలకు వచ్చాయని, వాటిలో ఆదివాసీలకు 93 ఉద్యోగాలే వచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన 507 పోస్టులను లంబాడీలు, ఇతర ఎస్టీలు పొందారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఇతర సోదర ఆదివాసీ సంఘాల వారు పోరాటం కంటే ఇతరుల మీద ద్రుష్పచారం చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొన్నారు. వారు తమ వైఖరి మార్చుకుని ఎస్టీ వర్గీకరణ పోరాటంలో కలిసి రావాలని కోరారు. తొలుత ఫారెస్టు గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సభలో తుడుందెబ్బ కళాకారులు గీతాలు ఆలపించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, నాయకులు వట్టం నారాయణ, పొడుగు శ్రీనాథ్, యాసం రాజు, రేగ నరేందర్కుమార్, కబ్బాక శ్రావణ్కుమార్, మైపతి వీణారాణి, కోరం శేషయ్య, గంట సత్యం, గుంపిడి వెంకటేశ్వర్లు, బూర్క యాదగిరి, వట్టం కన్నయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర -
ఆదివాసీలకు మౌలిక వసతులు కల్పిస్తాం
చర్ల: సరిహద్దు ప్రాంతాల ఆదివాసీలకు విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌళిక వసతుల కల్పిస్తామని ఎస్పీ రోహిత్రాజు భరోసా ఇచ్చారు. మండలంలోని మారుమూల గ్రామం పూసుగుప్ప నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డును గురువారం ఆయన సందర్శించారు. చర్ల నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని పూసుగుప్ప వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన ఎస్పీ.. మధ్యలో నిర్మిస్తున్న వంతెనలు, లోలెవల్ చప్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా రాంపురం, బీమారంపాడు, పూజారికాంకేర్, చిన్న ఊట్లపల్లి, పెద్ద ఊట్లపల్లి తదితర గ్రామాల ఆదివాసీల కోసం రూ.3కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మించామని తెలిపారు. ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేయాలని మావోయిస్టులు చూస్తున్నారని, వారి ఆటలు చెల్లవని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ పని చేస్తున్నాయని వివరించారు. పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో త్వరలోన మొబైల్ ఆస్పత్రులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 220 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్కుమార్, చర్ల సీఐ రాజువర్మ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ఆర్.నర్సిరెడ్డి, పి.కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు భరోసా -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
పాల్వంచరూరల్ : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని ఎర్రబోరు, బండ్రుగొండ, కొయ్యగుంపు తదితర గొత్తికోయల ఆవాసాలను గురువారం ఆయన పరిశీలించారు. తాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. చేతిపంపులు నిరంతరం పనిచేసేలా చూడాలని, సోలార్ మోట్లార్లను వెంటనే మరమ్మతు చేయాలని మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కోయగట్టు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు సక్రమంగా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని పిల్లలంతా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేదని, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారని స్థానిక గిరిజనులు డీపీఓ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ బొగ్గ నారాయణ, ఏఈ మహేశ్వరి, కార్యదర్శులు ప్రవీణ్, నారాయణ, దుర్గారావు పాల్గొన్నారు.డీపీఓ చంద్రమౌళి -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
గుండాల: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, అన్ని రికార్డులు సక్రమంగా ఉన్న హక్కుదారులు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భూ భారతి చట్టంపై గురువారం ఆళ్లపల్లి, గుండాల మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, సకాలంలో విచారణ చేస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అన్నదమ్ముల భూ పంపకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుందన్నారు. హక్కుల రికార్డుల్లో ఏమైనా తప్పులుంటే ఈ చట్టంతో సవరణ చేసుకునే అవకాశం ఉందన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్ ఉన్న సాదాబైనామా దరఖాస్తులూ ఇప్పుడు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని, రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం ఈ చట్టంలో ఉందని వివరించారు. సదస్సులో ఆర్డీఓ మధు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏంపీఓ శ్యాంసుందర్ రెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్సై రాజమౌళి పాల్గొన్నారు. మునగసాగుతో అధిక లాభాలు.. ఆయిల్ పామ్, మునగసాగుతో అధిక లాభాలు పొందొచ్చని కలెక్టర్ పాటిల్ అన్నారు. ఆళ్లపల్లి మండలంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్, మునగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల ఆయిల్పామ్ సాగు పెరిగిందని, నీరు పుష్కలంగా అందిస్తూ మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని అన్నారు. పొలం గట్లపై, అంతర పంటగా మునగ సాగు చేసుకోవాలని సూచించారు. ఇది తక్కువ కాలంలో వచ్చే పంట అన్నారు. అనంతరం గుండాల మండలం యాపలగడ్డలో సమక్క–పగిడిద్దరాజు దేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
ధీమా ఇవ్వని బీమా
● ఆరేళ్లుగా అడ్రస్ లేని పశువుల బీమా పథకం ● పాడి రైతులకు కరువైన భరోసా ● పునరుద్ధరించాలని వేడుకోలు బూర్గంపాడు: పశువుల బీమా పథకం పత్తా లేకుండా పోయింది. కంటికి రెప్పలా కాపాడుకునే పశువులకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తించే పరిస్థితి లేదు. గతంలో పశువుల బీమాను ప్రోత్సహించిన ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పశువులను పోషించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఊతమిచ్చాయి. రైతులు కొంత సొమ్ము చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ప్రమాదవశాత్తు పశువులు మృతిచెందితే యజమానులకు బీమా సొమ్ము అందడం ద్వారా ఆర్థిక భరోసా దక్కేది. భారీగా పెరిగిన ధరలు.. పశు పోషణ రోజురోజుకూ కష్టంగా మారుతోంది. పశు సంపద తగ్గిపోతున్న తరుణంలో ఆవులు, గేదెల ధరలు నింగినంటుతున్నాయి. మేలు రకం జాతి పశువుల ధర రూ. లక్షల్లో ఉంటుండగా.. మాంసానికి డిమాండ్ ఉండడంతో మేకలు, గొర్రెల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పశువులు, జీవాలకు బీమా చేయించేందుకు రైతులు ఆరాట పడుతున్నారు. అవి మేతకు వెళ్లినప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రతీ సంవత్సరం విద్యుదాఘాతం, పిడుగుపాట్లతో వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రోడ్లపై గుర్తు తెలియని వాహనాలు ఢీకొని కూడా పశువులు మృతి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల బీమా అమలు చేయాలని రైతులు, యజమానులు కోరుతున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు మేలు జాతి పశువులకు బీమా చేస్తున్నా.. ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బీమా చేయించలేకపోతున్నారు. ప్రభుత్వం కొంత, రైతులు కొంత చెల్లించే అవకాశం ఉంటే ఎక్కువ మంది బీమా చేయించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అటకెక్కిన పథకం.. 2017 – 18 వరకు పశువుల బీమా పథకం పూర్తిస్థాయిలో కాకున్నా అక్కడక్కడా అమలయ్యేది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఈ పథకం అటకెక్కింది. పశువులు మృతి చెందితే రూ.లక్షల్లో నష్టపోతున్నామని, ఇకనైనా పాలకులు స్పందించి పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. బీమా అమలు చేయాలి పశువుల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ప్రైవేటుగా బీమా చేయాలంటే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. బీమా చేయకుంటే ఏదైనా ప్రమాదం జరిగి పశువులు చనిపోతే ఒక్క రూపాయి కూడా చేతికి రావడం లేదు. – నిమ్మల రాములు, రైతు, నాగినేనిప్రోలుప్రభుత్వానికి నివేదిస్తున్నాం పశువుల బీమా పథకం అమలు చేయాలంటూ చాలా మంది రైతులు అడుగుతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కోసం కొంత బడ్జెట్ను ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించేవి. గత ఆరేళ్లుగా బీమా పథకం పూర్తిగా నిలిచిపోయింది. రైతుల వినతులను ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – డాక్టర్ పురంధర్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిజిల్లాలో పశు సంపద వివరాలిలాఆవులు, ఎద్దులు : 2,00,844గేదెలు : 1,25,587గొర్రెలు : 1,55,406మేకలు : 2,00,462పందులు: 1,964 మొత్తం :6,84,263 -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణం వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించాక మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు పవర్ లిఫ్టింగ్లో బీటీపీఎస్ ఉద్యోగి ప్రతిభమణుగూరురూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బీటీపీఎస్ ఉద్యోగి పి.రాజేష్ 110 కేజీల బెంచ్ ప్రెస్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయనను బీటీపీఎస్ సీఈ బిచ్చన్న గురువారం అభినందించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ.. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని, సంస్థకు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. క్రీడలు, క్రీడాకారులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడా కార్యదర్శి కల్తీ నర్సింహరావు, డీఈ టెక్ సత్యనారాయణ, ఏడీఈ మూర్తి, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల గైర్హాజరును నివారించాలిసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఉద్యోగులు, కార్మికుల గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని పర్సనల్ జీఎం (ఐఆర్పీఎం అండ్ వెల్ఫేర్) కవితానాయుడు అన్నారు. కొత్తగూడెం రీజియన్ పరిధిలోని ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాల వారీగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగుల పదోన్నతులు, కారుణ్య నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగుల సీఎంపీఎఫ్, పెన్షన్, క్లెయిమ్, గ్రాట్యుటీ వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం కవితానాయుడు మాట్లాడుతూ.. తరచుగా గైర్హాజరయ్యే ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఫైళ్లు కూడా పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో డీజీఎంలు అజయ్కుమార్, రాజేంద్రప్రసాద్, ఎస్.రమేష్, ఎస్.వరప్రసాద్, వెంకటేశ్వరరావు, జి.వి. మోహన్రావు, వైవీఎల్ ప్రసాదరావు, రాజ్గోపాల్, ముకుంద సత్యనారాయణ, సీవీవీఎస్ మూర్తి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
హామీపై గప్చుప్!
● ఇల్లెందుకు సీతారామ నీరందించాలనికోరుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి ● గత నెల 18న రేవంత్రెడ్డిని కలిసి విన్నవించిన నర్సయ్య ● వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం ● నేటికి నెల రోజులైనా పురోగతి శూన్యం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు ఇచ్చే విషయంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడిచినా ఈ అంశంపై పురోగతి లేదు. సీఎంకు గుమ్మడి వినతి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా గత నెల 18న సీఎం రేవంత్రెడ్డిని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిసి, ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ద్వారా గోదావరి నీరు అందించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ.. ఇల్లెందుపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలను ఆహ్వానించాలని సూచించారు. గతంలో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. ఎలా చేస్తే ఇల్లెందు ప్రజలకు మేలు అనే అంశాలపై చర్చించి న్యాయం చేయాలని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందిస్తూ త్వరలోనే ఇల్లెందు సమస్యపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇల్లెందుకు అదనపు ప్రణాళిక.. సీతారామ ప్రాజెక్టులో ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి అదనపు ప్రణాళికను 2023 వేసవిలో జలవనరుల శాఖ సిద్ధం చేసింది. దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిఽధిలో కొత్తగా 1,13,287 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ అంచనా వ్యయం రూ. 3,200 కోట్లు. ఇందులో కొత్త పంపుహౌస్లు నిర్మించడంతో పాటు బయ్యారం చెరువు మత్తడిని 16 అడుగుల నుంచి 19 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. తద్వారా మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల్లోని పొలాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు. పునాది పడింది ఇక్కడే.. సీతారామ ప్రాజెక్టుకు 2016లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తొలి ప్లాన్లో ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు గోదావరి జలాలు పారించాలని నిర్ణయించారు. అయితే గోదావరి నుంచి రోళ్లపాడు వరకు నీటిని తరలించే కెనాల్ మార్గంలో కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్లు ఉండడంతో అనుమతుల సాధన సాధ్యం కాదంటూ ఈ ప్లాన్లో మార్పులు చేశారు. ఇలా సీతారామ ద్వారా లబ్ధి పొందే నియోజకవర్గాల జాబితా నుంచి ఇల్లెందు (కామేపల్లి మండలం మినహా) కనుమరుగైంది. దీంతో సీతారామతో ఇల్లెందు నియోజకవర్గానికి న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా జిల్లాతో పాటు గార్ల, బయ్యారం మండలాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ఇల్లెందుకు గోదావరి నీళ్లు ఇచ్చే అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించే సమావేశానికి పిలుపు ఎప్పుడొస్తుందా అని ప్రతీరోజు ఎదురుచూస్తున్నా. ప్రాజెక్టుకు సంబంఽధించి మీడియాలో వస్తున్న ప్రతీ విషయాన్ని ఆసక్తిగా తెలుసుకుంటున్నా. ఇల్లెందుకు న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం. – గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నెలయినా కదలిక లేదు.. సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చి నేటికి నెల రోజులైనా ఎలాంటి పురోగతి లేదు. ఈ అంశంపై గుమ్మడి నర్సయ్యకు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలకు కానీ ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు సమావేశం నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్కు ఇంకా సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అనుమతులు రాలేదు. ఈ అంశంపై కేంద్ర జల సంఘం ఈనెల 24న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. అప్పటివరకై నా ఇల్లెందు ప్లాన్పై చర్చించి సీతారామ డీపీఆర్లో చేర్చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలి
పినపాక: ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల పరిధిలోని ఈ బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందజస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ సక్రమంగా పాటించాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. తొలివిడత పాఠ్య పుస్తకాలు చేరాయి.. కొత్తగూడెంఅర్బన్: 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడతగా జిల్లాకు 39,150 పాఠ్య పుస్తకాలు వచ్చాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను ఆయన పరిశీలించారు. వచ్చ విద్యా సంవత్సరంలో 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, తొలి విడతగా 39,150 పుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలన్నీ వస్తాయని, ఆ వెంటనే మండలాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. అభ్యసన స్థాయిని గుర్తించాలికరకగూడెం: విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని భట్టుపల్లి, కరకగూడెం ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బోధనా తీరును మెరుగుపర్చుకోవాలని, నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. అనంతరం మండల వనరుల కేంద్రంలో జరుగుతున్న నవోదయ పాఠశాల తాత్కాలిక మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ గడ్డం మంజుల, భట్టుపల్లి పాఠశాల హెచ్ఎం మోహన్బాబు తదితరులు ఉన్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టండి
డీఎఫ్ఓ కిష్టాగౌడ్జూలూరుపాడు: మొక్కల సంరక్షణపై అటవీ శాఖ సిబ్బంది దృష్టి పెట్టాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం నుంచి నల్లబండబోడు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు వినోభానగర్ అటవీ నర్సరీలో మొక్కలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కల పెరుగుదల, రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. అడవిలో చెట్లు నరకకుండా నిఘా పెంచాలని, వేసవి దృష్ట్యా అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి వసతి కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు, గుండెపుడి డీఆర్ఓ ఎస్కే నసూర్బీ, ఎఫ్బీఓలు రేఖ, డి.కిషన్, సలీమ్, శరణ్ పాల్గొన్నారు. -
మ్యూజియం అభివృద్ధికి సహకరించాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆవరణలో నిర్మించిన గిరిజన మ్యూజియంపై భక్తులు, పర్యాటకులకు అవగాహన కల్పించాలని, మ్యూజియం అభివృద్ధికి అందరూ సహకరించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక గిరిజన భవనంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పర్ణశాల, పాపికొండల సందర్శనకు మొగ్గు చూపుతారని, అంతకంటే ముందు గిరిజన మ్యూజియాన్ని చూసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాత తరం కళాఖండాలతో పాటు వ్యవసాయ పద్ధతులు, గిరిజన వంటకాలు, పాతకాలపు ఇళ్లు, వెదురు బొమ్మలను మ్యూజియంలో ఏర్పాటు చేశామని వివరించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి అధిక చార్జీలు తీసుకోవద్దని చెప్పారు. అనంతరం మ్యూజియానికి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
దమ్మపేట: అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి వచ్చే వేధింపులు తాళలేక, పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి శ్రీనివాసరావు(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం మందలపల్లి, రంగువారిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. కాగా అప్పు తిరిగి చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తులు వేఽధింపులకు గురిచేశారు. దీంతో శ్రీనివాసరావు మనోవేదన చెంది బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
మూడు రోజుల వ్యవధిలో దంపతులు మృతి
తిరుమలాయపాలెం: మూడు రోజుల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతోనే మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలోని ఏలువారిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆవేదనతో ఉన్న ఆయన భార్య పద్మ (50)ను తిరుమలాయపాలెంకు చెందిన అన్న తురక వెంకన్న తమ ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఉపేందర్ చిన్న కర్మ చేయాల్సి ఉండడంతో బుధవారం ఏలువారిగూడెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలోనే కాక గ్రామంలో విషాదాన్ని నింపింది. -
మందు.. ‘ఫుల్’ ఆదాయం
● 2023–24తో పోలిస్తే 24–25లో పెరిగిన అమ్మకాలు ● 2024 మే నెలలో రూ.237 కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు ● మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.2,294 కోట్ల సేల్స్ వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతుండగా.. ప్రభుత్వానికి అంతే మొత్తంలో ఆదాయమూ పెరుగుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో వైరాలోని ఐఎంఎల్ డిపో ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైన్స్, బార్లకు రూ.2,294 కోట్ల విలువైన మద్యం సరఫరా కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 210 వైన్స్, మూడు క్లబ్లు, 50 బార్లు ఉన్నాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,281 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2024–25కు వచ్చేసరికి అమ్మకాలు మరింత పెరిగాయి. సహజంగా ఏటా వేసవిలో బీర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో శుభకార్యాలు ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఏపీలో ఎన్నికల నేపథ్యాన ఇక్కడి నుంచి మద్యం సరఫరా అయిందని తెలుస్తోంది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేరోజు 45 వేల కేసుల మద్యం, 16,500 కేసుల బీర్లు అమ్ముడవడం.. వీటి విలువ రూ.33 కోట్లు ఉండడం విశేషం. పెరిగిన బీర్ల ధరలు.. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో వేసవిలో బీర్ల అమ్మకం ఎలా ఉంటుందోనని మద్యం షాపుల యజమానుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్లకు అంతగా డిమాండ్ లేనట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో స్ట్రాంగ్ బీర్ ధర రూ.160 ఉండగా ఇ ప్పుడు రూ.190కి, లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కి చేరింది. గతంలో రోజుకు 8 వేల నుంచి 10 వేల కేసులు అమ్ముడయ్యే బీర్లు 7 వేల కేసులు దాటడం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి రాగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.60 కోట్ల విలువైన 2,92,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే, బీర్లకు డిమాండ్ తగ్గినా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం గణనీయంగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు నెల విక్రయాలు (రూ.కోట్లలో) 2024 ఏప్రిల్ 181 మే 237 జూన్ 210 జూలై 180 ఆగస్టు 196 సెప్టెంబర్ 184 అక్టోబర్ 152 నవంబర్ 134 డిసెంబర్ 225 2025 జనవరి 201 ఫిబ్రవరి 181 మార్చి 201 మొత్తం రూ.2,294 -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి గనుల పరిసర ప్రాంతాలు, సంస్థ కార్మికులు, వారి పిల్లలు, ప్రభావిత ప్రాంత నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే మందమర్రి, రామగుండం ఏరియాల్లో సంస్థ ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు కొనసాగుతుండగా, భూపాలపల్లిలోనూ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును సింగరేణి జీఎం(కార్పొరేట్ హెచ్ఆర్డీ) జి.రఘుపతి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో డీజీఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ గుండాల: అడవుల్లో మూగజీవాలకు నీటి సదుపాయం కల్పించడంతో పాటు వాటి రక్షణ కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని గణపురం, పాలగూడెం ప్లాంటేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీరందించాలని, ప్లాంటేషన్ చుట్టూ ట్రెంచ్లు ఉండాలని అన్నారు. అడవుల్లో జంతువులకు ఏర్పాటు చేసిన తొట్లలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలన్నారు. వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలికాకుండా నిఘా పటిష్టం చేయాలని, వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అడవులకు నిప్పు పెట్టకుండా జాగత్ర చర్యలు తీసుకోవాలని, ప్రమాదవశాత్తు కాలిపోతున్న ప్రదేశాలను వెంటనే ఆర్పివేయాలని ఆదేశించారు. అడవులు, అటవీ జంతువుల రక్షణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కలప రవాణాపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఇల్లెందు ఎఫ్డీఓ కోటేశ్వరరావు, గుండాల రేంజర్ నర్సింహారావు, డీఆర్ఓ బాలాజీ, సిబ్బంది కోటేశ్వరావు, రవి, వెంకన్న తదితరులు ఉన్నారు. -
అన్నదాతకు ‘అకాల’ దెబ్బ
● జిల్లాలో ఇటీవల రోజూ కురుస్తున్న వర్షం ● కల్లాల్లోనే తడుస్తున్న ధాన్యం ● వరికోతలకూ ఆటంకం బూర్గంపాడు: అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ముమర్మంగా వరికోతలు, ధాన్యం అమ్మకాల సమయంలో కురుస్తున్న వానలు కలవరపరుస్తున్నాయి. గాలి దుమారంతో కోతకు వచ్చిన వరి నేలకొరుగుతోంది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. గత పది రోజులుగా జిల్లాలో ఏదో ఓ ప్రాంతంలో గాలిదుమారంతో కూడిన వర్షాలు పడుతుండగా పంటలు పాడవుతున్నాయి. మంగళవారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు, అశ్వాపురం, గుండాల మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షం కురవగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేసి టార్పాలిన్లు, పరదాలు కప్పుతూ కొంతమేర కాపాడుకునే ప్రయత్నం చేశారు. నత్తనడకన కొనుగోళ్లు.. జిల్లాలో పలువురు రైతులు ఇప్పటికే ధాన్యం కోసినా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేయడం, ఉదయం ఆరబెట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. బూర్గంపాడు మండలంలో పలుచోట్ల రాశుల కిందకు వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. దీన్ని తిరిగి ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరో రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు, వ్యాపారులు.. అకాల వర్షాలతో వరి పొలాలు బురదమయంగా మారాయి. దీంతో పంట కోసేందుకు రైతులు ట్రాక్బెల్ట్తో నడిచే హార్వెస్టర్ల కోసం పోటీ పడుతున్నారు. గంటకు రూ. 3,500 చొప్పున చెల్లించి వరి కోతలు చేపడుతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టడం కూడా కష్టం అవుతుండడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం వేచిచూడకుండా తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన సన్నరకం ధాన్యానికి కూడా ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించినా.. రైతులు అవేవీ పట్టించుకోకుండా ఏదో ఒక ధరకు అమ్ముకోవాలని చూస్తుండగా.. ఇదే అదనుగా వ్యాపారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
గిన్నిస్ బుక్లో సంపత్నగర్వాసికి చోటు
టేకులపల్లి: మండలంలోని సంపత్ నగర్ గ్రామానికి చెందిన కుడితేటి రమేష్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో అతను పాల్గొన్నాడు. ఏకకాలంలో 1,090 మంది సంగీత కళాకారులు కీ బోర్డు ప్లే చేశారు. వారిలో 1,046 మంది సుమారు నిమిషం నిడివి కలిగిన వీడియో క్లిప్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ కూడా ప్రతిభ చూపి రికార్డు సాధించాడు. నిర్వాహకులు మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. 10 మంది స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జిల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి.. 23న కొత్త జిల్లాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యుడిని కలిసిన నాయకులు సింగరేణి(కొత్తగూడెం): జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ను ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్లో బుధవారం సింగరేణి కాలరీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలపై త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. విజిలెన్స్ అఽధికారుల వేధింపులు, ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం వంటివి సరికాదని అన్నారు. అసోషియేషన్ నాయకులు ఆంతోటి నాగేశ్వరరావు, ఆరెపల్లి రాజేందర్, బందెల విజేందర్, మొగిలిపాక రవికుమార్, చెరిపెల్లి నాగరాజు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీఅశ్వాపురం: మండల కేంద్రంలో బస్సు, లారీ స్వల్పంగా ఢీకొన్న ఘటన బుధవారం జరిగింది. మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు వైపు వెళ్తున్న లారీ అశ్వాపురంలో స్టేట్ బ్యాంక్ ఎదుట బస్సును ఢీకొని, సైడ్ రాసుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వచ్చి పునరుద్ధరించారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతిచర్ల: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన ఘటన దానవాయిపేటలో బుధవారం రాత్రి జరిగింది. మండలంలోని బోటిగూడేనికి చెందిన తాటి మహేష్(29) దానవాయిపేట వైపు నుంచి ఆర్.కొత్తగూడెం వైపు బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్.కొత్తగూడెం వైపు నుంచి దానవాయిపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో మహేష్కు తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రుడిని స్థానికులు సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి 108 అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీపీఓల విధులపై 19న సెమినార్ ఖమ్మంసహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్ల (జీపీఓ) ‘విధులు – బాధ్యతలు’అంశంపై ఈ నెల 19న ఖమ్మంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్రావు తెలిపారు. భూభారతి చట్టంలోని అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జీపీఓలుగా వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉమ్మడి జిల్లాలోని వీఆర్వోలు, వీఆర్ఏలు హాజరుకావాలని సూచించారు. -
సీతారామలో ఏదీ?
‘రాజీవ్’ స్ఫూర్తి..ప్రారంభం కాని డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ● నెలల తరబడి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ● గతంలో శరవేగంగా పూర్తయిన రాజీవ్ లింక్ కెనాల్ ● ప్రాజెక్టు ఫలాలు ‘భద్రాద్రి’కీ అందించాలంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు ఎక్కువ మంది భద్రాద్రి జిల్లాలో ఉంటే.. గరిష్ట ప్రయోజనాలు మాత్రం ఖమ్మం జిల్లాకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఈ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. పూర్తి కాని టెండర్ల ప్రక్రియ.. జిల్లా పరిధిలో నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల కోసం గతేడాది అక్టోబర్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై వేగంగా సాగుతోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనులకు గతేడాది అక్టోబర్లోనే టెండర్లు పిలిచారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో టెండర్ల గడువు పొడిగిస్తూ 2025 జనవరి వరకు లాగారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకు అగ్రిమెంట్లు జరగలేదు. దీంతో నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు. ఫలితంగా పనులకు అనువుగా ఉండే వేసవి సమయం వృథా అవుతుండగా.. అంచనా వ్యయం కూడా పెరుగుతోంది. 2024 జూలైలో ఇరిగేషన్ అధికారులు సమర్పించిన రిపోర్టులో జిల్లా పరిధిలోని నాలుగు ప్యాకేజీల నిర్మాణ అంచనా వ్యయం రూ.1,656 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ. 1,773 కోట్లకు చేరుకుంది. ‘రాజీవ్’ ఆదర్శంగా.. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. గోదావరి జలాలను తక్షణమే ఖమ్మం జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు రాజీవ్ లింక్ కెనాల్కు శ్రీకారం చుట్టడంతో పాటు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేసింది. అధికారులు యుద్ధప్రాతిపదికన భూ సేకరణ చేపట్టారు. అటవీ శాఖ అనుమతులు సాధించారు. కాలువ నిర్మాణానికి అడ్డంకులు ఎదురైనప్పుడు జాతీయ రహదారుల సంస్థ, గ్యాస్ సరఫరా కంపెనీలతో చర్చలు జరిపారు. ప్రత్యేక అనుమతులపై విదేశాల నుంచి ఇంజనీర్లను రప్పించి పంప్హౌస్ల్లో మోటార్లను సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహించారు. వెరసి రికార్డు సమయంలో రాజీవ్ కెనాల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో భద్రాద్రి జిల్లాలో నిర్మించాల్సిన 1, 2, 7, 8 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు కూడా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అప్పుడే ప్రాజెక్టు నిర్వాసిత జిల్లాగా పేరున్న ‘భద్రాద్రి’కి కొంతైనా న్యాయం జరుగుతుందని అంటున్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తాం సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించి మొత్తం ఎనిమిది ప్యాకేజీల పనులు చేపడుతున్నాం. ఇందులో జిల్లాకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. – రవికుమార్, నీటి పారుదలశాఖ డిప్యూటీ సీఈడిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్యాకేజీ వివరాలిలా.. ప్యాకేజీ కొత్త ఆయకట్టు నిర్మాణ వ్యయం లబ్ధిపొందే (ఎకరాల్లో) (రూ. కోట్లలో) నియోజకవర్గాలు 1 41,813 రూ. 523 పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట 2 36,231 రూ. 262 కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట 7 63,310 రూ. 521 అశ్వారావుపేట 8 38,598 రూ. 467 అశ్వారావుపేట, సత్తుపల్లి రైతులకు పైసా ప్రయోజనం లేదు.. సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ, పంప్హౌస్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటినా ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు నయా పైసా ప్రయోజనం కలగలేదు. ఎట్టకేలకు 2024 ఆగస్టులో ఈ ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్లను ప్రారంభించిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా 1, 2, 7, 8 ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత అయినా జిల్లా పొలాల్లోకి గోదావరి జలాలు ప్రవహించే రోజులు దగ్గర్లోకి వచ్చాయనే నమ్మకం కలిగింది.