breaking news
Bhadradri District News
-
అండర్గ్రౌండ్లోకి స్వతంత్రులు
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు సరైన మెజార్టీ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కార్పొరేటర్లపై పార్టీలు గురి పెట్టాయి. ఈ క్రమంలో ఆరుగురు ఇండిపెండెంట్లను తమ గూటికి తీసుకొస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఆ పార్టీలు పడ్డాయి. అధికార పార్టీ ఒకడుగు ముందుకేసీ స్వతంత్రులను తమవైపు మళ్లించేందుకు గట్టి ప్రయత్నాలు చేపట్టడంతో పలువురు ఇండిపెండెంట్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు సమాచారం. వారంతా అధికార పార్టీతో మంతనాలు జరుపుతున్నారా లేక సీపీఐతోనా అనేది చర్చనీయాంశంగా మారింది. 32 డివిజన్ కార్పొరేటర్ ఇంటి ఎదుట ఆందోళన ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ నుంచి 32వ డివిజన్లో గెలుపొందిన గుగులోతు రాంబాబు పార్టీ ముఖ్యనేతలకు అందుబాటులో లేకుండా వెళ్లారు. దీంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వనమా వెంకటేశ్వరరావు నవభారత్ గాంధీనగర్లోని రాంబాబు ఇంటికి చేరుకుని అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీనే బలవంతంగా రాంబాబును కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ గూటికి వెళ్లనున్నట్టు సమాచారం -
కాంగి‘రేస్’లో నెగ్గింది..
● ఉమ్మడి జిల్లాలోని 141 స్థానాల్లో విజయం ● 34 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ● రెండింట గెలుపుతో బోణీ కొట్టిన బీజేపీ ● సీపీఐ 26, సీపీఎం నాలుగు స్థానాలు కై వసం ● 16 స్థానాలతో సత్తా చాటిన ఇండిపెండెంట్లు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ మినహా ఏడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్లింది. డివిజన్లు, వార్డులు కలిసి మొత్తం 223 ఉండగా.. అందులో కాంగ్రెస్ 141 స్థానాలు దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్కు 34, బీజేపీకి రెండు, సీపీఎంకు నాలుగు, సీపీఐకి 26, ఇండిపెండెంట్లకు 16 సీట్లు దక్కాయి. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లాగే మున్సి‘పోల్స్’లో కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్దే పై ‘చేయి’ అయింది. చాలెంజ్గా తీసుకుని.. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలెంజ్గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పార్టీ సభకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం కావాలని పిలుపునిచ్చారు. ఆపై రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోనే కాక కొత్తగూడెం కార్పొరేషన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, సత్తుపల్లిలో ఆ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర మున్సిపాలిటీతోపాటు వైరాలో ప్రచారం చేశారు. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల సమష్టి ప్రణాళికతో పార్టీకి భారీ విజయం చేకూరింది. ముందుకు వెళ్లని ‘కారు’ ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కలిసొచ్చే పార్టీలతో జతకట్టింది. అయినా ఆ పార్టీ ఎక్కడా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కేవలం రెండే దక్కగా, మధిరలో ఒక్క స్థానానికే పరిమితమైంది. అశ్వారావుపేటలో రెండు, ఇల్లెందులో మూడు వార్డులతో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అయితే, సత్తుపల్లిలో ఆరు, కల్లూరు మున్సిపాలిటీలో ఈ పార్టీకి ఏడు వార్డులు దక్కాయి. మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్ విజయపరంపరకు బీఆర్ఎస్ బ్రేకులు వేయలేకపోయింది. అనుకున్న మేర సత్తా చాటక.. సీపీఎం, సీపీఐ పోటీ చేసిన స్థానాల్లో అనుకున్న మేరకు సత్తా చాటలేకపోయాయి. ఉమ్మడి జిల్లాలో సీపీఎంకు నాలుగు స్థానాలే దక్కాయి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఎనిమిది డివిజన్లు గెలిచి కింగ్మేకర్ అయితే.. సీపీఐ 22 స్థానాల్లో గెలిచింది. ఇక అన్నిచోట్ల కలిపి 16 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటడం గమనార్హం. కొత్తగూడెంలో గెలిచిన ఆరుగురు ఇండిపెండెంట్లు మేయర్ పీఠం దక్కించుకోవాలనుకునే కాంగ్రెస్, సీపీఐకి కీలకమయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం రెండింటినే దక్కించుకుది. అశ్వారావుపేటలో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక డివిజన్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. -
సప్తహస్తం!
అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో తొలి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఇక్కడ 22 వార్డులు ఉండగా.. 17 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. రెండు వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా.. బీజేపీ ఒక వార్డులో నెగ్గింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఇక్కడ 24 వార్డులు ఉండగా.. 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మూడు వార్డులను బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో 25 ఏళ్ల తర్వాత ఇల్లెందు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా.. మిగతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. చేతికి జైకొట్టిన ఏడు మున్సిపాలిటీల ఓటర్లుమున్సి‘పోల్స్’లో పట్టణ ఓటర్లు ‘చేతి’కే జై కొట్టారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. పూర్తిస్థాయి మెజార్టీతో ఆ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకోనుంది. ఇదే సమయాన బీఆర్ఎస్కు ఏడు చోట్లా ఆశాభంగమే ఎదురైంది. ఎక్కడా కాంగ్రెస్కు ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా కొత్తగూడెంలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కీలకం కానున్నారు. మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కకపోవడంతో సంకీర్ణంతో పాలకవర్గం ఏర్పడనుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్.. సీపీఎంతో జత కట్టింది. ఇక సీపీఐ, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. ఈమేరకు కాంగ్రెస్, సీపీఐకి సమానంగా 22 చొప్పున డివిజన్లు దక్కాయి. బీఆర్ఎస్కు ఎనిమిది, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్లో గెలవగా, ఆరు స్థానాలు ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎనిమిది డివిజన్లు దక్కించుకుని కింగ్మేకర్ అయింది. అయితే మేయర్ పదవిని దక్కించుకోవడానికి స్వతంత్రులు ఎవరికి సహకరిస్తారు, ఎక్స్ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయో లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన కూనంనేనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేయగా.. కాంగ్రెస్లోని పలువురు మంత్రులు ఆయనతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలియగా పాలకవర్గం ఏర్పాటుపై శనివారం స్పష్టత రానుంది.నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ అధిష్టించనుంది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందనే అంచనాలు ఉండగా.. వాటిని పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఏడు వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సత్తుపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక్కడ మొత్తం 23 వార్డులు ఉండగా కాంగ్రెస్కు 17, బీఆర్ఎస్కు ఆరు వార్డులు దక్కాయి. ఇక్కడ బరిలో నిలిచిన ఇతర పార్టీలేవీ ప్రభావం చూపలేకపోవడంతో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యత చాటింది.వైరా మున్సిపాలిటీకి రెండోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా.. మిగిలిన బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమిగా ముందుకెళ్లాయి. ఇక్కడ మొత్తం 20 వార్డులకు 12 వార్డుల్లో కాంగ్రెస్, ఐదు వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచాయి. సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానం సాధించారు. -
నాడు కుమారుడు..నేడు తల్లి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీలో గత పాలకవర్గంలో వైస్ చైర్మన్గా పని చేసిన వేల్పుల దామోదర్ కార్పొరేషన్ అయిన తర్వాత ఆ డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తల్లిని బరిలో నిలిపారు. బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న వేల్పుల వీరమ్మకు ప్రస్తుతం 75 ఏళ్లు. అయినప్పటీకి ప్రచారంలో వీరమ్మ చురుకుగా పాల్గొని డివిజన్లో వీధులన్నీ తిరిగారు. కార్పొరేషన్లో ఉన్న మిగతా 59 మంది కంటే వయసులో పెద్దది ఆమే కావడం విశేషం. శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో ఆమె 263 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కనుకుంట్ల వెంకటరమణపై విజయం సాధించారు. -
ఆది నుంచీ సీపీఐదే ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చివరి వరకు సీపీఐ జోరు కనబరిచింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా 11 గంటల నుంచే డివిజన్ల వారీగా తొలి రౌండ్లో అభ్యర్థుల ఆధిక్యాల వివరాలు వెల్లడి కాగా, ఆరంభం నుంచే సీపీఐ హవా నడిచింది. అంతవరకు ఆధిక్యంలో ఉన్న సీపీఐ అభ్యర్థుల సంఖ్య మధ్యాహ్నం 1 గంట సమయానికి 22కి చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య 19కే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అనే పరిస్థితి నుంచి సీపీఐ ఏం చేయబోతుందో అనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు గెలుపుపై నమ్మకం సన్నగిల్లిన కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావడం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సీపీఐ ఆధిక్యం 26కు చేరుకోగా కాంగ్రెస్ బలం 22కు వచ్చింది. అప్పటికే నాలుగు స్థానాల్లో స్వతంత్రులు స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ మధ్య ఆధిక్యం వెంటవెంటనే మారుతూ విజయం దోబుచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యే సరికి సీపీఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్లు 08 డివిజన్లలో విజయం సాధించాయి బోణీ కొట్టిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. కొత్తగూడెం కార్పొరేషన్లో నాలుగో డివిజన్ నుంచి ఆ పార్టీ తరఫున చేరుగు భాగ్యలక్ష్మి 115 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అశ్వారావుపేటలో 17వ వార్డు నుంచి గుంటా గీతాశ్రీ 45 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆమే పిన్న వయస్కురాలు. టీడీపీకి నిరాశే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు సైకిల్ గుర్తుపై కాకుండా స్వతంత్రులగా మూడు చోట్ల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ విజయభేరీ మోగించగా దాని మిత్రపక్షమైన టీడీపీ మూడు చోట్ల ఓడిపోయింది. ఇల్లెందులో 7 వార్డు నుంచి ముద్రగడ వంశీ బరిలో నిలిచినా విజయం దక్కలేదు. కొత్తగూడెంలో ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించగా ఇల్లెందులో ఇద్దరు గెలిచారు. అశ్వారావుపేటలో రెండు వార్డులు ఇండిపెండెంట్ల ఖాతాలో పడ్డాయి. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
రుద్రంపూర్/పాల్వంచరూరల్/కొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్తో గురువారం చేపట్టిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సంస్థ వ్యాప్తంగా గల 12 ఏరియాల్లో 80 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొనగా అత్యవసర విభాగాలకు చెందిన 20 శాతం మంది మాత్రమే విధులకు హాజరయ్యారని సింగరేణి గణాంకల్లో తేలింది. రెండు షిఫ్టుల్లో కలిపి 32,472 మంది కార్మికులకు గాను 5,446 మంది మాత్రమే హాజరయ్యారు. 432 మంది సెలవులో ఉండగా మిగిలిన 26,598 మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 1.60 లక్షల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ స్తంభించింది. సమ్మెతో సింగరేణికి సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లగా, కార్మికులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోయారు. కాగా, సార్వత్రిక సమ్మె నేపథ్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే నిలిపివేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, 12 గంటల పని విధానం రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, కొత్త బొగ్గు బావులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్తంభించిన రవాణా.. సార్వత్రిక సమ్మె ప్రభావంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నుంచి సరుకుల రవాణా స్తంభించింది. జీసీసీలోని 20 మందికి పైగా హమాలీలు, కార్మికులు లోడింగ్, అన్లోడింగ్ విధులు బహిష్కరించారు. దీంతో పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల పరిధిలోని డీఆర్ డిపోలకు, రేషన్ షాపులకు బియ్యంతో పాటు గిరిజన హాస్టళ్లకు సరుకుల సరఫరా నిలిచిపోయింది. జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట కూడా ఆయా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి ధరల నిర్ణయం పంపిణీ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు విద్యుత్ బిల్లు తీసుకొచ్చారని నాయకులు విమర్శించారు. ఇది చాలా ప్రమాదకరమని, రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, వంగా వెంకట్, పీతాంబరం, కంచర్ల జమలయ్య, యర్రగాని కృష్ణయ్య, క్రిస్టఫర్, నరేష్, సుధీర్, భూక్య రమేష్, ఎన్.సంజీవ్, ఎం.మల్లికార్జున్, గుడిల్లి యాకయ్య, విద్యుత్ డీఈ జీవన్కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, వివిధ సంఘాల నాయకులు హేమంత్, రామకృష్ణ, బొల్లి వెంకటరాజు, -
నవమికి 43 రోజులే..
● ఖరారు కాని భద్రగిరి అభివృద్ధి ప్లాన్ ● సీఎం రేవంత్తో శంకుస్థాపనకు సన్నాహాలు ● మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తేనే పనులు మందుకు ! ● వచ్చే నెల 4 నుంచి రామయ్య పెళ్లి పనులుభద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ శ్రీ సీతారాముల కల్యాణం. ఈ మహోత్సవానికి మరో 43 రోజుల గడువు మాత్రమే ఉండగా ఉత్సవాల నిర్వహణ పనులను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న భద్రగిరి అభివృద్ధికి సంబంధించిన పనులకు శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన మాస్టర్ ప్లాన్పై కీలక నిర్ణయం వెలువడాల్సి ఉంది. అభివృద్ధికి ఇప్పుడిప్పుడే అడుగులు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రగిరి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మాఢ వీధుల విస్తరణకు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. రెవెన్యూ అధికారులు ఆ భూమిని చదును చేసి 33.50 కుంటలు ఇటీవలే ఆలయ అధికారులకు అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన నమూనాను పక్కనపెట్టి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఆధారంగా నాలుగు బ్లాక్లుగా విభజించి ప్లాన్ను రూపొందించారు. దీనిపై వైదిక పెద్దల సలహాలు, సూచనలు సైతం స్వీకరించారు. అనంతరం రూ. 350 కోట్ల ప్రతిపాదనలతో దేవాదాయ శాఖ ప్లాన్ను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. శ్రీరామనవమి పనులకు 4న శ్రీకారం.. మార్చి 27న జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నేపథ్యంలో వచ్చే 4వ తేదీన పసుపు, కుంకుమ దంచి తలంబ్రాలను కలిపే వేడుకతో పనులు ప్రారంభించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు కీలకమైన పలు పనులకు రూ.1.50 కోట్ల వ్యయంతో టెండర్లను ఖరారు చేయనున్నారు. ఉగాది రోజున సీఎం, గవర్నర్, ఇతర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. వీటన్నింటికీ మరి కొద్ది రోజులే గడువు ఉండగా మాస్టర్ ప్లాన్పై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు. శ్రీరామనవమి రోజున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తీసుకుని రావడం ఆనవాయితీ. ఈ క్రమంలో మార్చి 27న సీఎం రేవంత్రెడ్డి రానుండగా ఆ రోజునే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించాలని అధికారులు, మంత్రులు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో చివరి క్షణంలో హడావుడి లేకుండా ముందుగానే ప్రభుత్వ నిర్ణయం వెలువడాలని భక్తులు కోరుతున్నారు. భద్రగిరి అభివృద్ధి పనుల ప్లాన్ను సీఎం రేవంత్రెడ్డి అమోదించాల్సి ఉంది. కాగా ఇటీవల మేడారం జాతర, మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న సీఎం ఇకనైనా ప్లాన్పై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. భద్రగిరిని అయోధ్య కంటే ఉన్నతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సభల్లో పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం నిర్ణయంపై భక్తులు, స్థానికులు గంపెడాశలు పెట్టుకున్నారు. -
మున్సి‘పోరు’లో విజేత ఎవరో?
´ëËÓ…^èlÌZ° Mú…sìæ…VŠæ MóS…{§é°² ç³ÇÖÍçÜ$¢¯]l² MýSÌñæMýStÆŠḥh™ól‹Ù Ñ ´ësìæÌŒ , Gïܵ Æøíßæ™ŒæÆ>kకొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 354 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,34,775 ఉండగా అందులో 1,00,432 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పాల్వంచ అనుబోస్ కాలేజీలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రికార్డు స్థాయిలో 60 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించిన లెక్కింపు కేంద్రాన్ని 24 ఏరియాలోని కమ్యూనిటీ హల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 వార్డుల్లో 33,723 ఓటర్లు ఉండగా 23,121 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 108 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక్కడ 16 టేబుళ్లు ఏర్పాటు చేయగా రెండు రౌండ్లలో ఫలితాలు వెల్ల డయ్యే అవకాశం ఉంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా 76 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 16,850 ఉండగా అందులో 12,849 ఓట్లు పోలయ్యాయి. వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 22 టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడతాయి. ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 163 చట్టాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. డీజేల వినియోగం, బాణాసంచా కాల్చడం వంటి సంబరాలనూ నిషేధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబుస్క్వాడ్ బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్ని వార్డులు/డివిజన్లలో తమకు గెలుపు దక్కుతుందనే అంచనాల్లో మునిగిపోయాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ – సీపీఐ తమ మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో సర్వశక్తులు ఒడ్డాయి. మెజారిటీ సీట్లు ఈజీగా సాధిస్తామనే ధీమా కాంగ్రెస్లో ఉండగా.. మేజిక్ ఫిగర్ తమకు దక్కుతుందనే నమ్మకంతో సీపీఐ ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కించుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు పన్నాలి.. తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎలా కాపాడుకోవాలి.. అనే అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అవసరాన్ని బట్టి ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగంపైనా సమాలోచనలు చేస్తున్నాయి. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో చైర్ పర్సన్ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసిన వార్డులు కీలకంగా మారాయి. పోలింగ్ రోజున ఈ వార్డుల వద్ద మోహరించిన పోలీసు బందోబస్తు, రాజకీయ పక్షాల హడావుడితో ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డివిజన్లు/వార్డుల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు బూత్ల వారీగా పోలైన ఓట్లు, అందులో తమకు పడేవి ఎన్ని, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలను బేరీజు వేసుకునే పనిలో ఉన్నారు. కొందరు అభ్యర్థులైతే లక్షల రూపాయలు ఖర్చు చేసినా, అయిన వారి వల్లే తాము ఓటమి దిశగా వెళ్తున్నామనే దిగులుతో ఉన్నారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు నిషేధిత వస్తువులైన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటిళ్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు హాట్హాట్గా మార్చాయి. ఎన్నికల్లో ఫలితాల కంటే ముందే, పోలింగ్ రోజు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న హైడ్రామా ఫలితాల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
బయోచార్తో భూసార పరిరక్షణ
టేకులపల్లి: భూసార పరిరక్షణకు బయోచార్ ఎంతో మేలు చేస్తుందని, పంటల ఎదుగుదల, దిగుబడి పెరుగుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మండలంలోని తంగెళ్లతండా సమీపంలో బయోచార్ తయారీ విధానంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయోచార్ బొగ్గులో ఆవుపేడ, ఆవు మూత్రం కలిపి ఎరువుగా వేస్తే భూసారం పెరుగుతుందని తెలిపారు. రైతులు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకోవాలని, సాగుతో పాటు అదనంగా మూడు, నాలుగు రకాల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. కౌజు పిట్టల పెంపకం, మునగ తోటలు, చేప పిల్లలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంతో పాటు కూరగాయల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీఓ మల్లేశ్వరి, తహసీల్దార్ లంకా వీరభద్రం, సర్పంచ్లు ఊకే సునీత, బానోతు పూర్ణ, ఎంపీఓ గాంధీ, ఏఓ అన్నపూర్ణ, డీఆర్డీఏ కన్సల్టెంట్ రాజు, ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఏపీఎం హేమరత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతం
● డీఏఈ డీసీఎస్ఈఎం డైరెక్టర్ మహాపాత్ర ● అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం అశ్వాపురం: అణుశక్తి విభాగం యూనిట్లలో ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న క్రీడా పోటీలతో ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె.మహాపాత్ర అన్నారు. స్థానిక గౌతమీనగర్ కాలనీలోని మణుగూరు భారజల కర్మాగారం ఆధ్వర్యంలో భారత అణుశక్తి విభాగం(డీఏఈ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను డీఏఈ డైరెక్టర్ కె.మహాపాత్ర బుధవారం ఘనంగా ప్రారంభించారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావుతో కలిసి ఆయన డీఏఈ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుందని చెప్పారు. మణుగూరు భారజల కర్మాగారం ఆధ్వర్యంలో పోటీలకు చేసిన ఏర్పాట్లు, వసతులు, సౌకర్యాలు బాగున్నాయని అభినందించారు. కర్మాగారం జీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారని, వారికి, మేనేజర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతీ ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడల స్టీరింగ్ కమిటీ కన్వీనర్, డీజీఎం జగన్నాథ శర్మ, డీజీఎంలు రఫీక్ అహ్మద్, మోహన్కుమార్, సీఏఈ లక్ష్మీదేవి, ఏడీఎంఓ లత, ఐఆర్ఓ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. 8 యూనిట్లు.. 150 మంది క్రీడాకారులు భారత అణుశక్తి విభాగం(డీఏఈ) ఆలిండియా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ అథ్లెటిక్స్ పోటీల్లో అణుశక్తి విభాగంలోని 8 యూనిట్ల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి గోల్కొండ, నాగార్జున జట్లు, మహారాష్ట్ర నుంచి అజంతా, ఎల్లోరా, గుజరాత్ నుంచి ద్వారకా, ఒడిశా నుంచి కోణార్క్, తమిళనాడు నుంచి రామేశ్వరం, రాజస్థాన్ నుంచి పుష్కర్ జట్లు తలపడనున్నాయి. కాగా, పోటీలు ఈనెల 13న ముగియనున్నాయి. క్రీడోత్సవాల సందర్భంగా అణుశక్తి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
రోప్ వే ఏర్పాటెప్పుడో..?
● కిన్నెరసానిలో పరిశీలించిన పుణే బృందం ● నెల రోజులు గడిచినా కదలికలేని ప్రక్రియ పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకుల ఆహ్లా దం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో అమలు చేయడంలేదు. సఫారీ ఏర్పాటకు అటవీశాఖ ప్రత్యేకంగా రూ.45లక్షలతో వాహనాలు కొనుగోలు చేసింది. ఇంతవరకు సఫారీ ఏర్పాటు జాడలేదు. రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించా రు. నెలరోజుల క్రితం పుణే నుంచి ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. ఆతర్వాత రోప్ వే ఊసే లేదు. పర్యాటకులు, సహసయాత్రికుల కోసం రోప్ వే (జిప్లైన్)ను ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేశారు. కిన్నెరసానిలోని అద్దాల మేడ నుంచి జలా శయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.25 లక్షల వ్యయం అవుతుందని అంచనా రూ పొందించారు. నిధుల కొరత కారణంగా తొలు సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోప్ వే ఏర్పాటుకు పుణే నుంచి నెయిల్ అడ్వెంచర్స్ పంకజ్ కుమేరియా బృందం గత నెల 23న కిన్నెరసానిలో పర్యటించింది. నివేదికను కలెక్టర్కు అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. కానీ ఆ తర్వా రోప్ వే ఏర్పాటులో కదలిక లేకుండాపోయింది. డార్జిలింగ్ తరహాలో.. రోప్వేలు కేరళ, మయన్మార్, డార్జిలింగ్ ప్రాంతాల్లో ఎత్తైన కొండ ప్రదేశాల మధ్య ఉన్నాయి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కిన్నెరసానిలో కూడా రోప్వే ఏర్పా టు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. -
విచారణ పేరుతో వేధిస్తారా..?
● పోలీసులపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం ● రాత్రి 10 గంటల వరకు స్టేషన్ ఆవరణలో బైఠాయించి నిరసన పాల్వంచ: దొంగ ఓటు వేసేందుకు వచ్చిందనే అనుమానంతో పోలీసులు ఓ మైనార్టీ మహిళను స్టేషన్కు తరలించారు. విచారణ పేరుతో ఆమెను నాలుగు గంటల పాటు స్టేషన్లోనే ఉంచగా, దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్టేషన్ ప్రాంగణంలోనే బైఠాయించారు. వివరాలిలా ఉన్నాయి.. పాత పాల్వంచకు చెందిన ఓ మైనారిటీ మహిళ ప్రస్తుతం కొత్తగూడెంలో నివాసం ఉంటోంది. కాగా, బుధవారం ఓటు వేసేందుకు పాల్వంచలోని 46వ డివిజన్లోని పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాల కేంద్రం వద్దకు వచ్చింది. అయితే ఆమె కొంతకాలంగా కొత్తగూడెంలో నివాసం ఉంటుండగా ఇక్కడి ఓటరు జాబితాలో పేరు తొలగించారు. దీంతో ఆమె దొంగ ఓటు వేసేందుకు వచ్చిందని ఆరోపిస్తూ కొందరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. వెంటనే సీఐ సతీష్కుమార్ ఆ మహిళను తమ వాహనంలో స్టేషన్కు తరలించారు. విచారణ పేరుతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. కాగా ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా దృష్టికి తీసుకురాగా, ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెంటనే స్టేషన్కు చేరుకున్నారు. రాత్రి వరకు బైఠాయింపు.. సీఐతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్టేషన్కు రాగా, ఆయన పోలింగ్ విధుల్లో బయటే ఉన్నారని సిబ్బంది చెప్పడంతో వచ్చేవరకు ఉంటానని చెబుతూ తన అనుచరులతో అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన వారు ఓ పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు. ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే విచారించి పంపించాలే తప్ప ఓ మహిళను అంతసేపు స్టేషన్లో ఉంచడం సరైంది కాదన్నారు. చివరకు రాత్రి 10 గంటల సమయాన డీఎస్పీ సతీష్తో మాట్లాడి.. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి సీఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. -
● పోలింగ్ కేంద్రాల్లో ఎస్పీ పరిశీలన
అశ్వారావుపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్రాజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి అశ్వారావుపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను వేర్వేరుగా పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి పోలింగ్ వివరాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఆయన వెంట సీఐ పి.నాగరాజు రెడ్డి, ఎస్ఐలు యయాతిరాజు, సాయికిషోర్ రెడ్డి ఉన్నారు. -
గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజా యిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవా రం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కని పించిన కారు, స్కూటీలను ఆపి తనిఖీచేయగా 14.6 కిలోల గంజాయి లభించింది. విచారించగా నిందితులు, సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్ మస్తాన్, మహమ్మద్ ఇఫ్తాకర్, తోటపల్లి గోపి రెడ్డి, తోటపల్లి దిశ్వంత్ రెడ్డి, సికింద్రాబాద్కు చెందిన నీర్ల అంజన్ కుమార్ ఒడిశాలోని కలిమెల నుంచి సూర్యాపేట, హైదరాబాద్లకు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి, వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 11.05లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. -
పాల్వంచలో ‘పాతికేళ్ల’ జోష్
● 25 సంవత్సరాల తర్వాత పుర పోరు ● 2000 సంవత్సరంలో చివరి మున్సిపల్ ఎన్నికలుపాల్వంచ: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో పాతికేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో పట్టణ వాసుల్లో నూతనోత్సాహం నెలకొంది. దీంతో ఓటు వేసేందుకు పలు కేంద్రాల్లో బారులుదీరారు. ద్వితీ య శ్రేణి మున్సిపాలిటీగా ఉన్న పాల్వంచలో గతంలో 24 వార్డులు ఉండగా కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం కావడంతో 27 డివిజన్లు ఏర్పాటయ్యా యి. పాల్వంచ మున్సిపాలిటీకి 2000 సంవత్సరంలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఏజెన్సీ చట్టాల పేరుతో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అధికారుల పాలనే కొనసాగుతుండగా, ఇతర చోట్ల ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం పాలక వర్గం లేక ప్రజల్లో నైరాశ్యం నెలకొంటోంది. వీధి లైట్లు, డ్రెయినేజీ, పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు పౌర సేవల కోసం పట్టణవాసులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. సమస్యలు చెప్పుకునేందుకు వార్డు కౌన్సిలర్లు లేక ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో కార్పొరేషన్ ఏర్పాటైంది. తాజా ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో పట్ణణంలో 354 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో యువకులే ఎక్కువగా ఉన్నారు. పాల్వంచకు ఎన్నికలు రావడంతో పట్టణంలో పాతికేళ్ల తర్వాత కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటివరకు ప్రజల్లో ఉన్న నైరాశ్యం తొలగింది. సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. –కాల్వ దేవదాస్, పట్టణవాసి కార్పొరేషన్ అవడం వల్లే ఎన్నికలు వచ్చాయి. గతంలో ఎన్నికలు లేకపోవడంతో సమస్యల పరి ష్కారం కోసం అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చే ది. –కుడికాలు ఆంజనేయులు, న్యాయవాది -
లారీ ఢీకొని మహిళ మృతి
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు సెంటర్లో జరిగిన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల మండలం బీఎస్ రామ య్య నగర్ గొల్ల గూడేనికి చెందిన కొట్టెం కమల (30) మృతి చెందింది. చర్లకు చెందిన కొట్టెం రాజు, కమల, కుమారుడితో కలిసి బైక్పై పెద్ద ఆర్లగూడెం వెళ్తున్నారు. ఈ క్రమంలో ములకపాడు దగ్గర ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. కమల తలపై నుంచి లారీవెనుక చక్రాలు వెల్లడంతో నుజ్జునుజ్జయి ఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందింది. భర్త, కుమారుడు పక్కకు పడటంతో వారు క్షేమంగా ఉన్నారు. కమల మృతితో భర్త, కుమారుడు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ ఏర్పడగా, సీఐ వెంకటప్పయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్రమద్ధీకరించారు. మృతదేహాన్ని స్వయంగా రోడ్డు పక్కకు పెట్టారు. ఎస్ఐ గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ములకపాడు దగ్గర ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతుల వల్లే ప్రమాదం జరిగిందని, ఇప్పటికై నా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ ఢీకొని వ్యక్తి.. అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని లక్కీ–3 అపార్ట్మెంట్ ప్రాంతానికి చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు(52) ద్విచక్రవాహనంపై సమీపంలోని ఏపీ రాష్ట్రం జీలుగుమల్లి మండలం తాటియాకులగూడేనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కాగా, ఇతనికి అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఓటు హక్కు ఉంది. తాటియాకులగూడెం నుంచి వచ్చి ఓటు వేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీలుగుమిల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రమణీయంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజేయంద్రప్రసాద్ అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయనకు ఆలయ అధికారులు ప్రొటోకాల్ దర్శనం కల్పించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి భద్రాచలానికి చెందిన వెంకటరమణారావు జ్ఞాపకార్ధం పద్మావతి, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేయగా, అధికారులు వారికి రశీదు ఇచ్చారు. టీ, కాఫీ దుకాణానికి వేలం.. విస్తా కాంప్లెక్స్లోని టీ, కాఫీ, కూల్డ్రింక్స్ విక్రయ దుకాణానికి బుధవారం వేలం నిర్వహించగా ఒకరు రూ.92 వేలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ దుకాణానికి రూ.81,600గా ఉంది. ఇతర షాపులకు కూడా టెండర్లు ఆహ్వానించినా ఎవరూ దాఖలు చేయకపోవడంతో వాటి వేలాన్ని వాయిదా వేసినట్లు ఈఓ దామోదర్ తెలిపారు. సమ్మెకు దూరంగా ఉండండి..సింగరేణి కార్మికులకు అధికారుల సూచన రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సమ్మెను సింగరేణిలో కూడా విజయవంతం చేసేలా వివిధ సంఘాల నాయకులు ప్రచారం చేశారు. అయితే, సంస్థ భవిష్యత్, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యం కోరుతోంది. సమ్మెకు పిలుపునిచ్చిన డిమాండ్లలో సింగరేణి కార్మికులకు సంబంధించినవి తక్కువగా ఉన్నాయని, వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెబుతోంది. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో వెనుకబడి ఉన్నందున, సమ్మె చేస్తే మరింత నష్టం జరుగుతుందని అధికారులు సూచించారు. ఒకరోజు సమ్మెతో సంస్థకు సుమారు రూ.76 కోట్ల నష్టం జరుగుతుందని, కార్మికులు వేతన రూపంలో సుమారు రూ.18 కోట్లు కోల్పోనున్నందున సమ్మెకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో సూచించారు. 20 నుంచి కళాభారతి నాటకోత్సవాలుభద్రాచలంటౌన్: భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 20 నుంచి అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు ఫౌండర్ సెక్రటరీ అల్లం నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని జీయర్ మఠంలో ఈ ఉత్సవాల కరపత్రాలు, ఆహ్వాన బ్రోచర్లను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ వి. జంగయ్య, తాళ్లూరి పంచాక్షరయ్య, పాకాల దుర్గాప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా ఖమ్మంఖమ్మం స్పోర్ట్స్: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగియడంతో వివిధ అంశాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనేపథ్యాన జిల్లాల వారీగా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఆర్చరీ, బాల్బ్యాడ్మింటన్ పోటీలు ఖమ్మంలో నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 20నుంచి 22వ తేదీ వరకు ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఇక్క డ జరగనున్నాయి. అలాగే, అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండలో, జిమ్నాస్టిక్స్ కరీంనగర్లో, నెట్బాల్, సాఫ్ట్బాల్, ఖో–ఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, సెపక్తక్రా, సైక్లింగ్ పోటీలు మహబూబ్నగర్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. -
విలువిద్యలో లోహితకు స్వర్ణం
దమ్మపేట: పాల్వంచలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి సీఎంకప్ క్రీడా పోటీల్లో మండలంలోని పట్వారిగూడేనికి చెందిన కనకం లోహితశ్రీ ప్రథమస్థాయిలో నిలిచి స్వర్ణ పత కం సాధించింది. లోహితశ్రీ హైదరాబాద్లోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఆమెను నాయకులు కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కూరం అర్జునరావు, బొల్లికొండ నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికభద్రాచలంటౌన్: పట్టణంలోని సిటీ స్టైల్ జిమ్ సెంటర్లో నిర్వహించిన జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో క్రీడాకారిణులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ రామి రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి భూమిక బంగారు పతకం, డి.మేఘనా చౌదరి రజత పతకం సాధించారని, వీరు ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. వ్యాధులపై అవగాహన ఉండాలిపాల్వంచరూరల్: వ్యాధులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసానిలో ఉన్న పీహెచ్సీ సబ్సెంటర్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పనితీరుపై ప్రత్యేక శ్రద్ధచూపాలని, అత్యవసర మందులు, ఓసీ రిజిస్టర్ను క్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా గిరిజన గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధువరన్, ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్, వైస్ప్రిన్సిపాల్ మోహన్ పాల్గొన్నారు. ఆర్టీఐ కమిషనర్ తనిఖీ ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం, ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాల్లో తనిఖీ చేసిన ఆయన ఆర్టీఐ దరఖాస్తులు, పరిష్కారంపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు ఇవ్వాలని తెలిపారు. నేడు కార్మికుల సమ్మె లేబర్ కోడ్ల రద్దు డిమాండ్తో పిలుపు ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సమ్మె జరగనుంది. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సరికాదని నిరసించడంతో పాటు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ సమ్మె చేపడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు అమలుచేయడంతో పాటు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీయూసీఐ, సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎఫ్టీయూ సంఘాల ప్రతినిధులు కొద్దిరోజులుగా సమ్మెను విజయవంతం చేయాలని పారిశ్రామిక ప్రాంతాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పని ప్రదేశాల్లో ప్రచారం చేయడమే కాక యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంపాల్వంచరూరల్: మద్యం మత్తులో బుధవారం ఓ వ్యక్తి పురుగుల మందుతాగాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన పడిగె నర్సింహులు మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఓడరేవుల్లో సివిల్ ఇంజనీర్గా ఎంపిక
చింతకాని: భారత ఓడరేవుల(పోర్ట్లు)కు సంబంధించి సివిల్ ఇంజనీర్ల ఎంపికకు జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన షేక్ సలీం ప్రతిభ కనబరిచి ఐదో ర్యాంక్ సాధించాడు. సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో 14 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, ఇందులో తొమ్మిది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ఐదు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు 2025 డిసెంబర్ 2వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎనిమిది మంది ఇతర రాష్ట్రాల వారు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి సలీం మాత్రమే 160 మార్కులకు గాను 146.25మార్కులతో ఐదో స్థానాన నిలిచి ఉద్యోగానికి అర్హత సాధించాడు. ఆయన 1నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రియ విద్యాలయంలో, ఇంటర్ న్యూవిజన్ కళాశాలలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వరంగల్ ఎన్ఐటీలో పూర్తిచేశాడు. సలీం తండ్రి నాగుల్మీరా ఖమ్మం మామిళ్లగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తుండగా గ్రామస్తులు అభినందించారు. అయితే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్) సాధించడమే తన లక్ష్యమని సలీం వెల్లడించాడు.నాగులవంచ వాసికి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ -
ఓటుకు.. పోటెత్తారు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.60 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోని 46 వార్డుల నుంచి 354 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 9 గంటల తర్వాత జోరు.. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, అశ్వారావుపేటలో అప్పటి నుంచే ఓట్లరు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుదీరారు. కొత్తగూడెం, ఇల్లెందులో ఆరంభంలో పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. అయితే, ఉదయం 9 గంటలు దాటిన తర్వాత మూడు చోట్లా పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇల్లెందు మినహాయిస్తే మిగిలిన రెండు చోట్లా సగానికి పైగా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత పోలింగ్లో ఊపు తగ్గింది. చివరకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మళ్లీ సందడి మొదలైంది. ఐదు గంటల వరకే పోలింగ్ సమయం ముగిసినా ఇంకా పలు కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూలో నిల్చున్నారు. దీంతో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పేటలో జోరు.. బొగ్గుట్టలో ఆఖరు.. గ్రామపంచాయతీగా ఉన్న అశ్వారావుపేటకు మున్సిపాలిటీ హోదా దక్కిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు చురుగ్గా పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, అంతకుముందే బూత్ల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల సమయానికే 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాలో సీనియర్ మున్సిపాలిటీగా ఉన్న ఇల్లెందులో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా మొదలై.. ఆ తర్వాత కొంతమేర పుంజుకున్నప్పటికీ చివరికి ఆఖరు స్థానంలోనే నిలిచింది. తోపులాటలు.. వాగ్వాదాలు ● అశ్వారావుపేట 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ ఏజెంట్ దగ్గరున్న ఓటర్ల జాబితాను బయటకు తీసుకొచ్చారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునేందుకు ఈ పని చేయగా, దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పి ఇరువర్గాలను వెనక్కి పంపారు. ● కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి ఆరో డివిజన్లో తమకు ఎందుకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ కొందరు ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రశ్నించేందుకు పోలింగ్ బూత్ దగ్గరకు రాగా వారిని ఆ పార్టీ కార్యర్తలు అడ్డుకునేందుకు ప్రయ్నతించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పాత పాల్వంచలోని 40 డివిజన్కు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, బయటి వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 19 డివిజన్ (రామవరం)లో సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్పస్థాయిలో తోపులాట జరగగా 52వ డివిజన్ (మేదరబస్తి)లో వాగ్వాదం చోటుచేసుకుంది. ● ఇల్లెందు గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బూత్లోకి వెళ్లేందుకు బయటి వ్యక్తులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మెయిన్రోడ్ హైస్కూల్ దగ్గర గులాబీ కండువాలు వేసుకుని నిషేధిత ప్రాంతంలోకి వచ్చిన బీఆర్ఎస్ కార్యర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 13వ వార్డులో సీనియర్ రాజకీయ నేత మడత వెంకట్గౌడ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 24వ వార్డులో సామాజిక కార్యకర్త బొల్లం సాల్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మహిళా ఓటర్లు సత్తా చాటారు. ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటింగ్ 73.51 శాతంగా ఉండగా మహిళలు 73.70 శాతం మంది ఓటు వేశారు. పాల్వంచ: పోలింగ్ సిబ్బంది ఓ ఖాళీ బ్యాలెట్ బాక్స్ను బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకురావడంతో అక్కడున్న కొందరు సీపీఐ, బీఆర్ఎస్ కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఖాళీ బాక్స్ను వెంటనే పోలింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉండగా స్టేషన్కు ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీశారు. దీంతో ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని పోలీస్ ఎస్కార్ట్తోనే ఖాళీ బాక్స్ను స్టేషన్లో ఉంచారని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని, సిబ్బంది వైఫల్యం లేదని తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.జిల్లా వ్యాప్తంగా 73.60 శాతం పోలింగ్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను ఐడీఓసీ నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రధానంగా పరిశీలించిన ఆయన.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా పాల్వంచ: పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 7వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి సింధు తపస్వికి, స్వతంత్ర అభ్యర్థి లోకేష్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో లోకేష్ సింధు తపస్విపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో సింధు తపస్వి కూడా కేసు పెట్టేందుకు స్టేషన్కు రాగా, అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వేచి ఉండగా.. ఆమెకు మద్దతుగా రేగా కాంతారావు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదని, జరిగిన విషయాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ఇతరులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు వనమా రామకృష్ణ, మల్లెల రవిచంద్ర తదితరులు ఉన్నారు. -
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా సున్నితమైన పోలింగ్ స్టేషన్ల సంఖ్య 49గా ఉంది. ఇక్కడ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం అదనపు భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 4 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 31 జోనల్ అధికారులు, 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 10 స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్లు (ఎస్ఎస్టీలు) ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని ఇప్పటికే జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో బీఎన్ఎస్ సెక్షన్ 163 నిబంధనలు అమలులో ఉంటాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. -
● పోటాపోటీగా నగదు పంపిణీ?!
● ఏదులాపురంలో రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 32 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంత ఖర్చయినా పర్వాలేదు.. గెలుపు ముఖ్యం అన్నట్లుగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం కొందరు అప్పులు చేసి మరీ ఎదుటి అభ్యర్థికి దీటుగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియగా, మంగళవారం ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నికల సమయాన ఎవరైనా అభ్యర్థి డబ్బు పంపిణీ చేస్తుంటే ప్రత్యర్థులు అధికారులకు సమాచారం ఇచ్చేవారు. కానీ, ఈ సారి అభ్యర్థులు, వారి అనుచరులు బహిరంగంగా పంపకాలు చేపట్టినా ఎవరూ ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం. దాదాపు అన్ని వార్డుల్లో ఓటుకు కనీసం రూ.2 వేలకు తగ్గకుండా రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఓ అభ్యర్థి ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకు రూ.500 కలిపి ఎదుటి అభ్యర్థి ఇవ్వగా.. ఇంకొందరు నగదుకు తోడు చీర, చికెన్, మద్యం క్వార్టర్ సీసాలు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విద్యుత్ అంతరాయాలు అరికట్టాలి
పాల్వంచ: విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) మధుసూదన్ అన్నా రు. స్థానిక జెన్కో ట్రైనింగ్ సెంటర్లో మంగళవా రం ఆయన వివిధ విభాగాల అధికారులతో సీఈ రాజుచౌహాన్తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలి పోకుండా చూడాలని, ప్రమాద భరితంగా ఉన్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవి కాలంలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, 33/11 కేవీ లైన్లు, ఇంటర్ లింక్ లైన్లు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. పొలంబాట, ప్రజాబాట వంటి కార్యక్రమాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉంచాలని అన్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు, పరిశ్రమలకు నిర్ణీత కాలవ్యవధిలో కనెక్షన్లు మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ జి.మహేందర్, డీఈలు పి.నందయ్య, రంగస్వామి, జీవన్కుమార్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ఈఈ వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి ● ఎస్పీ రోహిత్రాజు పాల్వంచ: జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ సతీష్, సీఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి
ఖమ్మంసహకారనగర్: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్కు వెళ్లేలా అనుమతి మంజూరు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖాధికారులకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ● కలెక్టరేట్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ ఖమ్మంసహకారనగర్: మున్సిపాలిటీల్లో పోలింగ్ను నిరంతరం పర్యవేక్షించేలా ఖమ్మం కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు వెబ్క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 117 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేయగా.. అక్కడి పోలింగ్ సరళి పరిశీలనకు కలెక్టరేట్లో ఐదు స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, టెక్నికల్ మేనేజర్ హనుమాచారి, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
ఆత్మహత్యాయత్నం కాదు.. నిప్పంటించారు..!
మణుగూరురూరల్: మండలంలోని అశోక్నగర్ ప్రాంతానికి చెందిన అడ్డగార్ల సురేశ్ అత్మహత్యాయత్నం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని భావించిన ఘటన.. తాజాగా కొత్తమలుపు తిరిగింది. గత శుక్రవారం గాయాలపాలైన సురేశ్ను తొలుత భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. సురేశ్ భార్య తన భర్త ఆత్మహత్యాయత్నానికి నలుగురు కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న సురేశ్.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కొందరు వ్యక్తులు మాట్లాడాలని పిలిపించి తనపై పెట్రోల్ పోసి, నిప్పంటించారని మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకు నిప్పంటించిన వారి పేర్లను సురేశ్ స్పష్టంగా పేర్కొనడంతో వ్యవహారం వేడెక్కింది. మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయమై మణుగూరు పోలీసులను సంప్రదించగా.. ఘటనపై ఇప్పటికే కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వాంగ్మూలంలో వెల్లడించిన సురేశ్ -
పురపోరు నేడే..
సిద్ధంగా పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు కలిపి మొత్తం 106 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 1,85,348 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులకు 1,34,775 మంది ఓటర్లు, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డుల్లో 16,850 మంది ఓటర్లు, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు 33,723 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 90 పోలింగ్ లొకేషన్లలో 288 కేంద్రాలు ఏర్పాటు చేశా రు. అన్ని సెంటర్లలోనూ తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. సామగ్రి పంపిణీ పోలింగ్ ప్రక్రియలో ఉపయోగించే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి పంపిణీ ని మంగళవారం మధ్యాహ్నమే పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహణకు జిల్లాలో మొత్తం 345 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,036 మంది ఇతర పోలింగ్ అధికారులను (రిజర్వ్తో కలిపి) నియమించారు. పోలింగ్ విధుల్లో 48 మంది రిటర్నింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణకు ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. నేడు సెలవు పోలింగ్ జరిగే మున్సిపాలిటీ ప్రాంతాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హత కలిగిన ప్రతీ ఓటరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలన్నారు. కౌంటింగ్కు కూడా సిద్ధం కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కేంద్రాలను గుర్తించి నోటిఫై చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లెందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సిబ్బందిని ముందుగానే గుర్తించి ఇప్పటికే వారికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు కూడా సిద్ధం చేశారు.మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం -
మాధారం అడవిలో కార్చిచ్చు..
ములకలపల్లి: మండలంలోని మాధారం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. ఆ ప్రదేశమంతా పొగతో కమ్ముకుంది. వేసవి సమీపిస్తున్న తరుణంలో అడవిలోని ఎండిన ఆకులకు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మాధారం – పూసుగూడెం మధ్యలోని అడవిలో క్రమేపీ మంటలు అంటుకుంటుండగా, పాల్వంచ – మందలపల్లి ఆర్ఆండ్బీ రోడ్డు పక్కగా నాటిక మొక్కలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి. చిక్కటి అడవిలో మంటలు అంటుకోవడంతో, చెట్టన్నీ నిలువునా మాడిపోతున్నాయి.గుడుంబా స్థావరాలపై దాడి కరకగూడెం: మండలంలో గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం కరకగూడెం ఎస్ఐ పీవీఎన్ రావు ఆధ్వర్యంలో కౌలూరు, కలవలనాగారం మధ్యలోని పెదవాగు సమీపంలో 1000 లీటర్ల బెల్లం పానకం, సారా తయరీకి ఉపయోగించే సామగ్రిని గుర్తించి ధ్వంసం చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా సమాచారాన్ని 87126 82102, 87126 82103 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. అనారోగ్యంతో ఆత్మహత్య కామేపల్లి: పింజరమడుగుకు చెందిన మల్లెంపాటి రంగయ్య(70) మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి సమీపాన చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
ఇల్లెందు: ప్రతీ రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించి ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కలిగించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కోరారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను తనఖీ చేశారు. అక్కడి ఔషధాల పంపిణీ విభాగం, రక్త పరీక్ష కేంద్రం, ఇన్పేసెంట్, గర్భిణులు, గైనిక్ వార్డులు, ఎక్స్రే, స్టోర్ రూంలను తనిఖీ చేశారు. సౌకర్యాలు, నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్పేసెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన కలెక్టర్ మెటీరియల్ అవసరం అయితే ప్రతిపాదనలు పంపాలని కోరారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ హర్షవర్దన్, ఆర్ఎంఓ రాంనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జయ, హెడ్ నర్సు ఫర్జానా, నర్సులు భవానీ, భారతి తదితరులు ఉన్నారు.కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ -
ఐటీడీఏలో ఇక డీడీఈఓ !
● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● సీనియర్ హెచ్ఎంలకు డిప్యుటేషన్పై బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు భద్రాచలం: గిరిజన విద్య బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలో డిప్యూటీ డీఈఓ పోస్టులు భర్తీచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ పర్యవేక్షిస్తుండగా.. వారిపై విధుల భారం, ఒత్తిడి పెరుగుతుండడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు జిల్లాకు తరలిపోవడంతో ఖాళీ అయింది. కాగా తాజాగా మళ్లీ డిప్యూటీ డీఈఓ పోస్టుతో ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. 2016లో పోస్టు మాయం.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గతంలో ఏజెన్సీ డీఈ ఓ పోస్టు ఉండేది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, గిరిజన గురుకులాలను ఈ డీఈఓ పర్యవేక్షించేవారు. ఆయా పాఠశాలల్లో తనిఖీ లు చేస్తూ, గిరిజన విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను రూపొందించేవారు. అయితే 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టును జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుగా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్ని రకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతో ఐటీడీఏలో ఏజెన్సీ డీఈఓ పోస్టు మాయమైంది. చివరి ఏజెన్సీడీఈఓగా రవీందర్ బాబు బాధ్యతలు నిర్వర్తించారు. నిరాశ పరుస్తున్న ఫలితాలు.. 2016 తర్వాత ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఈ పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిధిలోకి వెళ్లడం, ఆ అధికారికి ఇతర శాఖల పర్యవేక్షణ, పని ఒత్తిడితో పాఠశాలలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక డీడీలు ఉద్యోగ విరమణ చెందినప్పుడు ఏపీఓ జనరల్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం, మళ్లీ నూతన డీడీ రాగానే విధుల బదలాయింపు.. ఈ తరుణంలో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ విషయమై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ఐటీడీఏలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. గిరిజన సంక్షేమ శాఖలోని సీనియర్ ప్యానల్ గ్రేడ్ హెచ్ఎంను డిప్యుటేషన్ పద్ధతిలో ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు తదితర బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు. ఐటీడీఏ పీఓగా రాహుల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక విద్యలో తెలుగు, గణితం, సైన్స్లో లోపించిన నైపుణ్యాలు, బేసిక్ అంశాలను పెంపొందించేందుకు ఉద్దీపనం, ప్రాక్టిస్ బుక్లు తయారుచేశారు. కెరీర్ గైడెన్స్, 100శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. అయితే విద్యాశాఖ పోస్టు లేక ఆయనే పర్యవేక్షించాల్సి రాగా, పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ అయితే గిరిజన విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే పీఓ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం గిరిజన ఆశ్రమ పాఠశాలలను భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్లుగా విభజించారు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉండగా, గిరిజన గురుకులాలు జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో మరో 6 ఉన్నాయి. మొత్తంగా 27 గురుకులాలు, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు రాగానే అమలుపరుస్తాం. గతంలో ఉన్న డీఈఓ పోస్టును తిరిగి భర్తీ చేయాలని గతంలో ప్రభుత్వానికి నివేదిక అందించాం. – డేవిడ్రాజ్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ -
జిల్లాకు మంచి పేరు తేవాలి
పాల్వంచ: జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్థానిక శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ –2026 క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టేబుల్ టెన్నిస్, షాట్పుట్ ఆటలు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆ తర్వాత 100, 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్జంప్, హైజంప్, టెన్నిస్, ఆర్చరీ, జూడో పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, కోచ్లు నాగేంద్ర, మల్లికార్జున్, నాగరాజు, కల్యాణ్, ప్రసాద్, గిరి, డానియల్ రాంబాబు, రియాజ్, నరేష్, శ్రీనివాస్, వీరన్న, ఆదినారాయణ, అనిల్, రాము, సురేష్, సుజాత, మల్లేష్, మంజులాల్, శ్రీనివాస్, కృష్ణ, కావ్య పాల్గొన్నారు.క్రీడాకారులకు కలెక్టర్ సూచన -
రూ.4.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
అశ్వాపురం: బైక్పై ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా మండలంలోని మొండికుంటలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీహరిరావు ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా, అశ్వాపురం వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరి వద్ద రూ.4.60 లక్షల విలువైన ఏడు కేజీల గంజాయి లభించింది. సూర్యాపేట జిల్లా తెల్లబెల్లికి చెందిన బడేటి వెంకటేశ్, ఏపీలోని కృష్ణా జిల్లా వెంగనాయకునిపాలెంనకు చెందిన మోరుబోయిన గోపయ్య.. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని మణుగూరు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
తొలి పీఠానికి పోటా పోటీ
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు బుధవారం తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ బలాన్ని చూపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో మేయర్ పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీగా తాయిలాలు అందిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఒక్కో ఓటుకు రూ.2000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. మిగతా వార్డుల్లోనూ గెలుపు ధీమా ఉన్న వారు రూ.2000 వరకు పంపిణీ చేయగా, మిగిలిన అభ్యర్ధులు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఇచ్చారని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకోగా.. సీపీఐ, టీడీపీతో జత కట్టింది. బీఆర్ఎస్ అధికారికంగా ఎవరితోనూ పొత్తు లేకున్నా.. ఆయా డివిజన్లలో స్థానిక పరిస్థితులను బట్టి లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతోంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 30 సీట్లు మహిళలకు రిజ్వర్ కాగా పాలకవర్గంలో 30 మంది పురుషులు, 30 మహిళలు ఉండే అవకాశం ఉంది. మేయర్ స్థానం ఎస్టీ జరనల్కు రిజర్వ్ కాగా ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ సామాజిక వర్గం వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ సారి 56 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి నాలుగు సార్లు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 1971లో నోటిఫైడ్ ఏరియాగా ఏర్పాటు కాగా, 1988లో నోటిఫైడ్ ఏరియాకు కమిటీని నియమించారు. అందులో చైర్మన్, కమిటీ సభ్యులు ఉండే వారు. అధికారులు కమిటీ సభ్యుల నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహించే వారు. కాలక్రమేణా 1995లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. తర్వాత 2000 సంవత్సరంలో 25 వార్డులతో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అ సమయంలో గరీబ్పేట పంచాయతీలో ఉన్న చిట్టి రామవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పడు పాతకొత్తగూడెం మొదటి వార్డుగా ఏర్పాటుచేసి, వరుసగా వార్డులకు నంబర్లు కేటాయించారు. ఆ తర్వాత 2005లో కూడా 25 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గొల్లగూడెంను మొదటి వార్డుగా కేటాయించి, మిగతా వార్డులకు వరుసగా నంబర్లు కేటాయించారు. 2014లో మూడోసారి ఎన్నికలు జరగగా, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 33కు పెంచారు. 2020లో 36 వార్డులతో నాలుగోసారి ఎన్నికలు నిర్వహించారు. 2025లో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలిపి మొత్తం 60 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, తొలిసారి బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్కు నేడు మొదటిసారి ఎన్నిక -
దొంగల ముఠా అరెస్టు
చండ్రుగొండ: పలు చోరీలకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. చండ్రుగొండలో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకుని విచారించగా ఏపీలోని శారదకాలనీకి చెందిన చిల్లరి సురేశ్, గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన జల్లెపల్లి వెంకటేశ్వరరావు, హైదరాబాద్కు చెందిన బండారి వంశీ, ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన గాదె నాగరాజుగా తేలింది. వీరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఎవరూ లేని ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, డబ్బు, ఆభరణాలు చోరీ చేస్తున్నారని, వీరి నుంచి రూ.50 వేలు నగదు, రూ.3.5 లక్షల విలువైన నకలీ నోట్లు, నాలుగు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అపహరించిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించి హైదరాబాద్లో కొనుగోలు చేసిన నకిలీ రూ.500 నోట్లను కొత్తగూడెం, చండ్రుగొండ, గుంటూరు ప్రాంతాల్లో చలామణి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, చండ్రుగొండ, జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐలు శివరామకృష్ణ, బాదావత్ రవి, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రామయ్యను దర్శించుకున్న విజయేంద్రప్రసాద్భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ దామోదర్రావు స్వాగతం పలకగా అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి క్షేత్ర విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనతరం అనుబంద ఆలయాలను సందర్శించారు. నేటి నుంచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో ఆల్ ఇండియా డీఏఈ 40వ స్పో ర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో భాగంగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. భారత అణుశక్తి విభాగంలోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె.మహాపాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రతీ ఏడాది డీఏఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో అణుశక్తి విభాగం పరిధిలో ఒక్కోయూనిట్లో ఒక్కో క్రీడా పోటీలను నిర్వ హిస్తుండగా అశ్వాపురం భారజల కర్మాగారం అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవాలకు డీఏఈ పరిధిలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులు రానున్నారు. పోటీల విజయవంతానికి జీఎం శ్రీని వాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానంచుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం మొ క్కలు నాటుతున్న కొత్తగూడేనికి చెందిన విశ్వామిత్ర చౌహాన్కు వరల్డ్బుక్ఆఫ్ రికార్డ్స్లోస్థానం దక్కింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో ఆయనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకుడు, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ వరి ధర్ శ్రీరామ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రముఖులు విలియం జెజ్లర్, పూనమ్ జెజ్లర్, నవాల్సాగర్ తదితరులు పాల్గొనగా ఇప్పటివరకు విశ్వామిత్ర 1,119 మొక్కలు నాటడంపై అభినందించారు. 1,334.97 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఐపీఎల్కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 634.97 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 200 మె.టన్నులతో పాటు మహబూబాబాద్ జిల్లాకు 400 మె. టన్నులు సరఫరా చేసినట్లు ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ తెలి పారు. మిగిలిన వంద మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. -
20 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని పత్తి రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. 2025 – 26 సీజన్కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు ఈ నెల 20 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని తెలిసిందని, త్వరలోనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. సీఎం కప్ పోటీల్లో బంగారు పతకం దుమ్ముగూడెం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యా ర్థిని పూసం ప్రజ్ఞిద జిల్లాస్థాయిలో నిర్వహించిన సీఎం కప్ అండర్ – 18 అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. మంగళవారం విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. పామాయిల్ హబ్గా తీర్చిదిద్దుతా● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట: దేశానికే తలమానికంగా ఉండేలా రాష్ట్రాన్ని పామాయిల్ హబ్గా తీర్చిదిద్దుతా నని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గండుగులపల్లిలో తన నివాసంలో ఆయిల్ ఫెడ్ క్యాలెండర్ల ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పామాయిల్ సాగుచేస్తున్న రైతులు ఎకరాకు రూ.లక్ష స్థిర ఆదాయంతో ఆర్థికాభివృద్ధి చెందారని అన్నా రు. కేంద్ర బడ్జెట్లో పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని ఆశించినంతగా పెంచకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయ యాంత్రీకరణను బలోపేతం చేసి, సాగును సులభతరం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ మేనేజర్లు నాగబాబు, కార్తీక్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కె.వి. తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది క్వింటాళ్ల మిర్చి చోరీ రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల రైతులు కల్లాలో ఆరబెట్టిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. ఇటీవల రెండు ఘటనలు చోటుచేసుకోగా సోమవారం అర్ధరాత్రి చిమ్మపూడిలో గ్రామానికి చెందిన రైతు జానేబోయిన పాపయ్య కల్లం నుంచి ఎనిమిది క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. ఈ మిర్చి విలువ సుమారు రూ.1.60 లక్షలు కాగా ఘటనపైరఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు. -
ఓటుకు బహుమతులు..!
● అశ్వారావుపేట పలు వార్డుల్లో నగదు పంపిణీ? ● మహిళలకు చీరలు, కుక్కర్లు కూడా..అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అశ్వారావుపేటలోని పలు వార్డుల్లో కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీలతో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఓటుకు నోటుతో పాటు బహుమతుల పంపిణీ మొదలుపెట్టినట్లు తెలిసింది. రెండు వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు చైర్మన్ రేసులో ఉండగా, ఒకరు ఓటుకు రూ.5 వేలు, ఇంటికో చీర, ఇంకొకరు ఓటుకు రూ.2,500 ఇచ్చాడని సమాచారం. అలాగే, ఇంకో వార్డులో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3 వేలు, చీర, జాకెట్, గాజులు, ఇదే వార్డులో మరో అభ్యర్థి ఓటుకు రూ.3 వేలతోపాటు రైస్ కుక్కర్, స్టీల్ క్యారేజీ, మరో వార్డులో ఓటుకు రూ.2,500, చీర, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పంపిణీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఇంకొన్ని వార్డుల్లో ఓటుకు రూ.వేయి, చీర, జాకెట్ ఇవ్వగా.. వీటికి తోడు మద్యం, బిర్యానీతో విందులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే, కొందరు అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు బహిరంగంగానే ఓటర్లకు నగదు, బహుమతులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
భయపెడుతున్న మొసళ్లు..
● గోదావరి తీరంలో వాటి సంచారం ● నాగినేనిప్రోలు సమీపంలో 30కి పైగా మొసళ్లు ● హడలిపోతున్న స్థానికులు బూర్గంపాడు: గోదావరి తీరంలో మొసళ్లు భయపెడుతున్నాయి. మండలంలోని నాగినేనిప్రోలు సమీపంలోని గోదావరి తీరంలో 30కి పైగా మొసళ్లు సంచరిస్తున్నట్లు స్థానికంగా చర్చసాగుతోంది. మొసళ్ల సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భద్రాచలం రామాలయానికి ఎదురుగా గోదావరి ఒడ్డున మొసళ్లు కనిపిస్తున్నాయి. ఐటీసీ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల్లో ఐదేళ్లుగా మొసళ్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొసళ్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని అటుగా వెళ్తున్న రైతులు, పశువుల కాపరులు చెబుతున్నారు. ఐటీసీ వ్యర్థ జలాలు పైప్లైన్తో గోదావరిలో విడుదలయ్యే ప్రాంతంలో ఈ మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంది. అక్కడ నీరు లోతుగా ఉండటంతో మొసళ్లకు అనువుగా మారింది. ఇసుక తిన్నెలపై పడుకుని ఏదైనా శబ్దమైతే మొసళ్లు నీటిలోకి తక్షణమే జారుకుంటున్నాయి. ఈ మొసళ్లు సారపాక – నాగినేనిప్రోలు మధ్యన ప్రవహించే పెదవాగు గోదావరిలో కలిసే ప్రాంతం నుంచి పాత గొమ్మూరు వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మొసళ్ల సంచారం ఉంటోంది. చేపలు, అక్కడ తిరిగే పక్షులు, పురుగులను మొసళ్లు తింటున్నాయి. అప్పుడప్పుడూ నీళ్లలోకి దిగే మేకలు, గొర్రెలు, దూడలను కూడా మొసళ్లు పట్టుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందే.. భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులు గోదావరిలో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. వారు భద్రాచలం వైపున రద్దీగా ఉండటంతో పడవలలో ఇవతలి వైపునకు వచ్చి స్నానాలు చేస్తుంటారు. అటు నుంచి ఇటు వైపునకు భక్తులు వచ్చే ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఈ మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు గోదావరి ఒడ్డున విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుంటారు. మొసళ్ల భయంతో వారు అటు వైపునకు వెళ్లేందుకు భయపడుతున్నారు. విద్యుత్ మోటార్ల మరమ్మతులు ఉంటే చాలా జాగ్రత్తగా నీళ్లలోకి దిగి మోటార్లను బయటకు తీయాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటికేడు మొసళ్ల సంఖ్య పెరుగుతుండటం భయాందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి ఒడ్డున ఐటీసీ వ్యర్థ జలాల్లో సంచరిస్తున్న మొసళ్లను కిన్నెరసానిలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రలోభాలకు గురి కావొద్దు
● స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇల్లెందు: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో మున్సిపల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధులు కేటాయించినా, హాజరు కాని అధికారులుంటే వారిపై చర్యలు తప్పవన్నారు. ఏ ఎన్నికల్లో అయినా పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి.. పాల్వంచ: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళశారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ బ్యాలెట్ బండిల్పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, టెంట్లు వంటి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అశ్వారావుపేటరూరల్: ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్, పరిశీలకులు అమయ్కుమార్ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.సుజాత, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్లు గణేష్, బి.నాగరాజు, తహసీల్దార్లు రవికుమార్, రామకృష్ణ, ఎంపీడీఓలు ధన్సింగ్, అప్పారావు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కార్తీక్, ఇల్లెందు మున్సిపల్ మేనేజర్ అంకుషావళి, డీఈ మురళి, ఏఈ నవీన్ పాల్గొన్నారు. -
మేయర్ పీఠం సీపీఐదే..
సూపర్బజార్(కొత్తగూడెం): కార్పొరేషన్ ఎన్నికలు అహంకారానికి ఆత్మీయతకి మధ్య జరుగుతున్నాయని, మేయర్ పీఠం సీపీఐదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రామవరంలోని ఆరు డివిజన్లు, బర్మాక్యాంపు, ప్యూన్బస్తీ, ఏ–పవర్హౌస్బస్తీ, గంగబిషన్బస్తీలో రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎర్ర జెండాది ఏముందిలే అంటూ అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లు సీపీఐకి అందుతున్న ఆదరణను చూసి ఎందుకు హైరానా పడుతున్నారని, 60 డివిజన్లలో ఎరుపు, పసుపు రంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి కార్పొరేషన్ను ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయని, అన్నిరంగాలు అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల ఆశీర్వాదమే బలమని, సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా సుపరిపాలనను స్వాగతించినట్లు అవుతుందని వివరించారు. కార్పొరేషన్వ్యాప్తంగా చక్కటి ఫలితాలు రానున్నాయని, మేయర్ పీఠం సీపీఐదేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
13 వరకు అక్షరాస్యత వారోత్సవాలు
సూపర్బజార్(కొత్తగూడెం): కేవైసీ – మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు’అనే ఇతివృత్తంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రతీ బ్యాంక్ శాఖ తమ పరిధిలోని ఒక గ్రామంలో ప్రజలకు కేవైసీపై అవగాహన కల్పించేందుకు శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సోమవారం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆవిష్కరించారు. ఒక బ్యాంక్లో కేవైసీ అప్డేట్ చేయడం ద్వారా మిగిలిన బ్యాంకుల్లోనూ అప్డేట్ చేసే వ్యవస్థ సీకేవైసీ అందుబాటులోకి వచ్చిందని, ఈ విధానంలో 14 అంకెల సీకేవైసీ నంబర్ జారీ చేస్తారని, ఈ నంబర్ను అన్ని బ్యాంకుల్లోని ప్రజల ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా కేవైసీ అప్డేట్ అవుతుందని వివరించారు. 77990 22129 నంబర్కు కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే సీకేవైసీ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలు పకడ్బందీగా అమలు జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ఆహార భద్రతా, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ నెల ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. రాబోయే శ్రీరామనవమిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాళ్లు, హోటళ్ల యజమానులకు ఆహార భద్రతా ప్రమాణాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్తోపాటు అధికారులు తుకారాంరాథోడ్, స్వర్ణలత లెనీనా, త్రినాథ్బాబు, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ రాణి కుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం.. మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, సైలెన్స్ పీరియడ్లో అక్రమ ప్రచారాలు, ఎంసీఎంసీ అంశాలు, మీడియా సెల్ సమాచారం సహా ఇతర ఎన్నికల ఫిర్యాదులను కంట్రోల్ రూమ్కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. 24 గంటలూ పనిచేస్తూ, ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం 9381082501 నంబర్ను కేటాయించినట్లు వెల్లడించారు. ప్రచారం ముగిసింది.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. పోలింగ్కు 48 గంటల ముందు నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికలతో సంబంధం ఉండేలా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రచారాలు నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసీ ఆదేశాల మేరకు ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. ర్యాండమైజేషన్ పూర్తి.. మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు ఓపీఓల చొప్పున నియమించామని, అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ విధానం ద్వారా కేటాయించామని తెలిపారు. అశ్వారావుపేటలో 42 మంది ప్రిసైడింగ్ అధికారులు, 126 మంది ఓిపీఓలు, ఇల్లెందులో 62 మంది ప్రిసైడింగ్ అధికారులు, 187 మంది ఓపీఓలు, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 241 మంది ప్రిసైడింగ్ అధికారులు, 723 మంది ఓపీఓలను కేటాయించినట్లు వివరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు కలెక్టరేట్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో ప్రతీ దశలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. మొదట మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనలు, విధి విధానాలు, చెక్ లిస్టులు తదితర అంశాలను వివరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్, ఎన్నికల పరిశీలకులు అమయ్కుమార్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్బాబు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
కుళ్లిన మాంసం విక్రయాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం త్రీటౌన్ పరిధి మూడు బొమ్మల సెంటర్ వద్ద ఓ షాపు నుంచి దుర్వాసన వస్తుండడంతో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారనే అనుమానంతో స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోనూ మటన్ షాప్ నిర్వాహకుడు రాజేందర్ తక్కువ ధరకే కొన్నేళ్లుగా పలు హోటళ్లు, ప్రభుత్వ సంస్థలకు మాంసం సరఫరా చేస్తున్నట్లు తెలియగా, షాప్ నుంచి కొద్దిరోజులుగా తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం సమాచారం ఇచ్చారు. దీంతో కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో కుళ్లి, బూజు పట్టిన మాంసం బయటపడింది. ఆపై డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు చేరుకుని విచారణ చేపట్టారు. బూజు పట్టి, కొంత మురిగిపోయిన 50 కేజీల మాంసం రెండు వారాల క్రితం కోసినదిగా నిర్ధారించారు. అంతేకాక షాపునకు అనుమతులు లేవని తేల్చారు. కాగా, అధికారుల తనిఖీ సమయాన రోగాల బారిన పడిన గొర్రెలను ఆటోల తీసుకురాగా, ఆరా తీయడంతో ఈ దుకాణంలో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు ఆటో డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. ఈమేరకు షాప్ నిర్వాహకుడు రాజేందర్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ లోకేష్ సమక్షాన కేఎంసీ అధికారులు ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.దుర్వాసన రావడంతో వెలుగులోకి వచ్చిన బాగోతం -
పరిమితికి మించి వైద్యం చేయొద్దు
అశ్వారావుపేటరూరల్/చుంచుపల్లి: గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం, గుమ్మడవల్లి పీహెచ్సీలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఆ తర్వాత గ్రామీణ వైద్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పేషెంట్లకు అధిక మోతా దుతో కూడిన యాంటిబయోటిక్స్ వేయొద్దని సూచించారు. అనంతరం హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు రాందాస్నాయక్, మధుళిక, మోహన్, వెంకటేశ్వరరావు, దుర్గమ్మ పాల్గొన్నారు. కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించాలి కుష్ఠు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. సోమవా రం తన కార్యాలయంలో వైద్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి మందుల వాడకం, లభ్యత వంటి వివరాలు తెలియజేయాలన్నారు. శరీరంపై మచ్చలు ఏర్పడితే సమీపంలోని పీహెచ్సీలో పరీక్ష చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
సీఎం కప్ కబడ్డీ పోటీల్లో 100 మంది..
●డీవైఎస్ఓ పరంధామరెడ్డి వెల్లడి సూపర్బజార్(కొత్తగూడెం): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఖేలో ఇండియా)లో భాగంగా సోమవారం నిర్వహించిన అండర్ –17 బాలికల కబడ్డీ పోటీల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 100 మంది బాలికలు హాజ రయ్యారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖేలో ఇండి యా పోర్టల్లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని ఖేలో ఇండియా శిక్షణా కేంద్రానికి ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడా పోటీలను ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ స్వాతిముత్యం, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది తిరుమలరావు, పి.లక్ష్మయ్య తదితరులు పరిశీలించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు.. ●సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ముదిగొండ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఏర్పాటుచేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బాజీ హనుమంతుతో పాటు గండ్లూరి కిషన్రావు, మొక్క చిన్ననర్సయ్య విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో పార్టీ కార్యకర ్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్వెస్లీ మాటాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాక ఎరువులపై సబ్సిడీ తగ్గించి రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం కార్యకర్తలకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, రాంబాబు, మన్నేపల్లి సుబ్బారావు, బండి పద్మ, బట్టు పురుషోత్తం, రాయల వెంకటేశ్వర్లు, పాండురంగారావు, కూరపాటి శ్రీనివాసరావు, చింతకాయ రామారావు, కందిమళ్ల తిరుపతి, మరికంటి వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, కోలేటి ఉపేందర్ పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చా రు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 20 నుంచి ఫాల్గుణ మాసోత్సవాలుశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20న ఫాల్గుణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈఓ కె. దామోదర్రావు, వైదిక పెద్దలు తెలిపారు. 27న సంధ్యా హారతి, 28న పునర్వసు సందర్భంగా తిరుమంజనం, సార్వభౌమ వాహన సేవ, 29న పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని పట్టాభిషేకం ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7.30 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసేస్తామని, తిరిగి రాత్రి 7గంట లకు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం చేశాక 8.30 గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని వివరించారు. 4వ తేదీన వసంతో త్సవం, డోలోత్సవం సందర్భంగా పసుపు, కుంకుమ దంచి తలంబ్రాలు కలపడంతో శ్రీరామనవమి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 7న సుదర్శన హోమం, 15న లక్ష కుంకుమార్చన ఉంటాయని వెల్లడించారు. నేడు అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు పాల్వంచ/పాల్వంచరూరల్ : సీఎం కప్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం స్థానిక శ్రీనివాస కాలనీ క్రీడామైదానంలో నిర్వహించనున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల అనంతరం విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్ల డించారు. మొత్తం 58 అంశాల్లో ఐదు వయో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, ఉత్తమ ప్రతిభ చూపిన 30 మందిని ఎంపిక చేసి ఈనెల 21న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. -
జెండా పాటే ప్రామాణికం
ఖమంవ్యవసాయం: మిర్చి కొనుగోళ్లలో జెండా పాట ధరను వ్యాపారులు ప్రామాణికంగా పాటించాలని మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి సూచించారు. జెండాపాట కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయగా ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రస్తుతం విదేశీ ఎగుమతులు లేవని, దేశీయంగా 15వేల బస్తాల వరకు పంపించే అవకాశముండగా అంతకు మించి సరుకు వస్తే సమస్యలు ఎదురవుతున్నాయని వ్యాపారులు వివరించారు. ఈ సంర్భంగా డీడీ మాట్లాడుతూ జెండాపాట, మోడల్ ధరలకు మిర్చి కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు, దిగుబడులు తగ్గాయని తెలుస్తోందన్నారు. ధర గత ఏడాది ఇదే సమయాన రూ. 14 వేలు ఉంటే ఇప్పుడు రూ. 19వేల వరకు పలుకుతోందని తెలిపారు. ఈనేపథ్యాన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత ఏడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు(టీఆర్) అమలుచేయగా జరిగిన అక్రమాలపై ఉద్యోగులకు చార్జిమెమోలు జారీ చేయగా, వారు ఇచ్చే సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని డీడీ తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సరెండర్ చేశామని వెల్లడించారు. డీడీ వెంట ఖమ్మం మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు తదితరులు ఉన్నారు. మిర్చి కొనుగోళ్లను పరిశీలించిన డీడీ పద్మావతి -
● ఆయువుపట్టు.. సూపర్బజార్!
సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల నిత్యావసరాల కొనుగోళ్లకే కాకుండా ఇతర వర్గాల ప్రజానీకానికి సైతం అన్ని వస్తువులు దొరికే ప్రాంతంగా కొత్తగూడెంలోని సూపర్బజార్ సెంటర్ నిలుస్తోంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపాన జాతీయ రహదారి పక్కన సూపర్బజార్ను సింగరేణి సంస్థ ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అంతకముందు నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ కావడంతో త్రీటౌన్ సెంటర్ లేదా రైల్వేస్టేషన్ సెంటర్గా పిలిచేవారు. సూపర్బజార్ ఏర్పాటయ్యాక అదే పేరు స్థిరపడింది. సూపర్బజార్ ఎదురుగా జాతీయ రహదారి ఇరువైపులను కలుపుతూ ఆర్చి కూడా ఉంటుంది. ఈ సెంటర్లో ప్రతీ ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిలుపుతుండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
ఇల్లెందురూరల్/కారేపల్లి: ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధి ఐటీఐ సమీపాన పనులు చేస్తున్న కేబుల్ ఆపరేటర్ జువ్వాజి లాలయ్య (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సుభాష్నగర్ నుంచి లలితాపురం వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇటీవల కొత్త స్తంభాలను అమర్చారు. ఈ మేరకు రాఘవాపురంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న లాలయ్య స్తంభాలపై టీవీ కేబుల్ అమర్చే పనులకు సోమవారం సిద్ధమయ్యాడు. అయితే, స్తంభాల పక్కనే బూడిదంపాడు నుంచి ఇల్లెందు సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసే 33 కేవీ లైన్ ఉంది. కేబుల్ వేసే పనుల్లో నిమగ్నమైన లాలయ్య పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకగా షాక్కు గురై పైనుంచి కిందపడ్డాడు. ఆయనను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, లాలయ్యకు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కవల కుమార్తెలు సహా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో భార్య, పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు నాగేశ్వరరావు – సరోజ చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు సీఐ సురేశ్ తెలిపారు. పురుగులమందు తాగిన వ్యక్తి..భద్రాచలంఅర్బన్: ఇంట్లో గొడవపడి పురుగులమందు సేవించిన ఓ వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడని పోలీసులు తెలిపారు. భద్రాచలం పట్టణంలోని సుభాష్నగర్కాలనీకి చెంది కృష్ణార్జున్రావు (33) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మంలో ఉంటున్నాడు. ఇంట్లో గొడవపడి.. కాలనీలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చాడు. ఈ నెల 7వ తేదీన కృష్ణార్జున్రావు పురుగులమందు తాగగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్పై కేసు పాల్వంచరూరల్: వెనుక నుంచి వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాలోతు చంద్రమోహన్ ఈ నెల 5న ద్విచక్రవాహనంపై పినపాక పట్టీనగర్ నుంచి ఇంటికి వస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో చంద్రమోహన్ గాయపడ్డాడు. బాధితుడి సోదరుడు రమేశ్ ఫిర్యాదు చేయగా.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ చింతా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
అభివృద్ధి బాధ్యత నాదే..
● కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యం ● కాంగ్రెస్, మిత్రపక్షాలను గెలిపించండి ● ఎన్నికల ప్రచార సభలో మంత్రి పొంగులేటికొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని త్రీటౌన్ సెంటర్, రామవరంలో సోమవారం జరిగిన కార్నర్ మీటింగ్లలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో 76 జీఓ క్రమబద్ధీకరణ పట్టాల సమస్య ఉందని, దాన్ని పరిష్కరించడంతో పాటు రోడ్లు, డ్రెయినేజీల అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత వాసులకు పెద్దకొడుకుగా ఉంటానని, యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. కొత్తగూడెం తన సొంత గడ్డ అని, కార్పొరేషన్పై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే బాధ్యత కూడా తనదేనని ప్రకటించారు. రంగురంగుల కండువాలతో కొంత మంది వస్తారని, మంత్రి శ్రీనన్న తమకు దగ్గర వాడంటూ చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. ఏ పని కావాలన్న ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో కత్తి మరొకరికి ఇస్తే యుద్ధం తాము చేయలేమని అన్నారు. చిట్టి రామవరంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా ఓట్లతోనే సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, పార్టీ నాయకులు ఆళ్ల మురళి, కంచర్ల చంద్రశేఖర్, జేవీఎస్ చౌదరి, అభ్యర్థులు కనుకుంట్ల శ్రీను, బాలిశెట్టి సత్యభామ, కనుకుంట్ల కుమార్, కనుకుంట్ల వెంకటరమణ, ఆకునూరి సుప్రియ, పోతు పురుషోత్తం, పల్లా రాజనర్సు, సీపీఎం నాయకులు రమేష్, జలాల్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి
మణుగూరురూరల్: మండలంలోని విజయనగరం వద్ద ఉన్న ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ పెట్రోల్ బంక్ సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకున్నారు. అనంతరం రూ.500 నోట్ ఇవ్వగా.. దానికి రంగు ఉండటంతో మరొకటి ఇవ్వాలని సిబ్బంది కోరారు. దీంతో వారు వాగ్వాదానికి దిగడమే కాకుండా సిబ్బందిపై దాడి చేశారు. బంకులోని సామగ్రిని ధ్వంసం చేసి, తాము ఇదే గ్రామానికి చెందినవారమని బెదిరించి, పరారయ్యారు. ఘటనపై బంక్ నిర్వాహకులు, సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డివైడర్ను ఢీకొట్టిన వాహనం మణుగూరురూరల్: మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీ పరిధి అశోక్నగర్ ప్రాంతంలో హోండా షోరూమ్ ఎదురుగా గల డివైడర్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో డివైడర్ ధ్వంసమైంది. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పడిపోయింది. సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. -
‘భరోసా’ ఏదీ ?
బూర్గంపాడు: యాసంగి పంటల సాగు మొదలై రెండునెలలు కావొస్తున్న ప్రభుత్వం నుంచి రైతు భరో సా నిధులు విడుదల కాలేదు. సంక్రాంతికి యాసంగి రైతుభరోసా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్లో ప్రకటించినా.. ఇంతవరకు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే యాసంగిలో సాగు భూములకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా, వ్యవసాయ శాఖ అధికారులు సాగుచేసిన పంటల వివరాలను నమో దు చేస్తున్నారు. క్రాప్ బుకింగ్తో పాటుగా శాటిలైట్ సర్వే నిర్వహించి సాగు భూముల వివరాలను గుర్తించాకే రైతు భరోసా అందుతుందని తెలుస్తోంది. 1.90లక్షల ఎకరాల్లో సాగు ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అంచనా. ఇందులో ఎక్కువ విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. ఈ ఏడాది మిర్చి, కూరగాయల సాగు కొంతమేర తగ్గగా అపరాల సాగు పెరిగింది. వరి నాట్లు పూర్తయి నెలరోజులు దాటగా, మొక్కజొన్న పంట సాగు చేసి కూడా నెలన్నర కావొస్తోంది. రైతులు ప్రస్తుతం పంటలకు ఎరువులు వేయడంతో పాటు పురుగుమందులు చల్లుతున్నారు. యూరి యా కొరత రైతులను యాసంగిలో కూడా వేధిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు వానాకాలం సీజన్ కంటే బస్తాకు రూ.150 నుంచి రూ.200 వరకు పెరి గాయి. పురుగుమందుల ధరలు కూడా వానా కాలం సీజన్తో పోలిస్తే పెరిగాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడం, ఉపాధి హామీ పనులు ప్రారంభం కావడంతో కూలీల కొరత ఏర్పడుతుండగా.. వారు కూడా ధరలు పెంచుతున్నారు. వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగిరావడం గగనమే అయింది. యాసంగిపై ఆశలతో రైతులు పంటల సాగు మొదలుపెట్టారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.6వేలు అందిస్తే పెట్టుబడులకు కొంతమేర అందుతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. గత యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా అందకపోవడంతో ఈ ఏడాది అయినా అందుతుందా లేదా అని భయపడుతున్నారు. యాసంగిలో పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్రాప్ బుకింగ్ సర్వే ఇంకా పూర్తి కాలేదు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడిప్పుడే బుకింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తరువాత శాటిలైట్ సర్వేతో పంట సాగు వివరా లను గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి కావడానికి మరో నెలన్నర సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో యాసంగి పంట చేతికి కూడా వస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులతో సర్వే చేయించి పంటల నమోదు ప్రకారం రైతు భరోసా అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి నెల సగం పూర్తి కాగా, కొన్నిచోట్ల మొక్కజొన్న చేతికందే దశకు చేరిందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుభరోసా అందించి తమకు అండగా నిలవాలని వారు వేడుకుంటున్నారు. యాసంగిలో నాలుగెకరాలు వరి సాగు చేశాను. పెట్టుబడులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం రైతు భరోసా అందిస్తే ఎరువులు, పురుగుమందులకు ఉపయోగపడతాయి. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. – ఆవుల వెంకటేశ్వరరెడ్డి, నాగినేనిప్రోలు -
ఓటు వేయడం కష్టమే...
● గడప దాటలేని స్థితిలో పలువురు వృద్ధులు, దివ్యాంగులు ● ‘హోం ఓటింగ్’ అవకాశం లేక ఆవేదనసత్తుపల్లిటౌన్: వృద్ధులు, దివ్యాంగులు పలువురు గడప దాటలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలంటే యాతన పడాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం గతంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు అవకాశం కల్పించింది. ఎన్నికల అధికారులకు ముందస్తుగా సమాచారం ఇస్తే పరిస్థితి తీవ్రత ఆధారంగా జాబితాలో చోటు కల్పించే వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించేవారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ఓటు వినియోగించుకోవాలనే ఆకాంక్ష ఉన్నా శరీరం సహకరించని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొందరిని కుటుంబీకులు, మరికొందరిని అభ్యర్థులు అతికష్టంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నా.. ఇంకొందరు మాత్రం ఓటుకు దూరం కావాల్సి వస్తోంది. -
అటు ఏపీ.. దాటొస్తే తెలంగాణ
అశ్వారావుపేట: మున్సిపాలిటీగా తొలిసారి ఎన్నికలు జరగనున్న అశ్వారావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆహ్లాదకర వాతావరణం, పచ్చని పంటలు, జాతీయ స్థాయి ఖ్యాతి కలిగిన పలు సంస్థలు.. ఇలా అనేక అంశాలు ఈ మున్సిపాలిటీ సొంతం! 1950లోనే ఇక్కడ ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహం అశ్వారావుపేటలో ప్రధాన సెంటర్గా ఉండేది. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ పాత అశ్వారావుపేటగా ఉంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణకు సరిహద్దుగా ఉండే అశ్వారావుపేటలో హైదరాబాద్, రాజమండ్రి, భద్రాచలం రోడ్లను కలిపే రింగ్ సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో వివేకానందుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రింగ్ సెంటర్ వచ్చిందంటే తెలంగాణలోకి ప్రవేశించామని వాహనదారులు, డ్రైవర్లు గుర్తిస్తారు. అశ్వారావుపేట వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలతో స్థానిక, స్థానికేతర యువతకు ఉపాధి లభిస్తోంది. అశ్వారావుపేటలో పేపర్ మిల్లుతో పాటు పవర్ ప్లాంట్ కూడా ఉంది. అలాగే, కెమిలాయిడ్స్, హెర్బెక్స్ పరిశ్రమలు ఉండగా, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది. అశ్వారావుపేటలోనే తెలంగాణలో మొట్టమొదటి ఆయిల్పామ్ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో నిర్ణయించిన నూనె దిగుబడి శాతాన్ని అనుసరించే ఆయిల్పామ్ గెలల ధర నిర్ణయిస్తుండడం విశేషం. అశ్వారావుపేట ఏర్పాటైన తొలినాళ్లలో కులాల వారీగా బజార్లు ఏర్పాటయ్యాయి. గౌడ బజార్, వడ్డెర బజార్, మంగలి బజార్, దూదేకుల బజార్, శివయ్యగారి బజార్, మేరీల బజార్ ఇలా సులువుగా గుర్తిస్తుంటారు. కాలక్రమేణా కాళింగుల బజార్ కూడా ఏర్పడింది. బందరు నుంచి వ్యవసాయం నిమిత్తం అశ్వారావుపేటకు వచ్చి స్థిరపడిన వారితో బందరు మకాం, కోత మిషన్ ఉన్నందుకు కోత మిషన్ బజార్ ఏర్పడ్డాయి. పుల్లలు కొట్టే వారు నివసించే ప్రాంతం పుల్లల కాలనీ, డ్రైవర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ డ్రైవర్ల కాలనీగా ఏర్పడినా ప్రస్తుతం బీసీ కాలనీగా రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అటెండర్స్ కాలనీ, ఎన్టీఆర్ హయాంలో మంజూరైన ఇళ్లతో నందమూరి కాలనీ, జలగం ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలతో జలగం కాలనీ, ఫైర్ సిబ్బంది నివాసాలతో ఫైర్ కాలనీ, వైఎస్సార్ హయాంలో నిరుపేదలకు మంజూరు చేసిన కాలనీ మోడల్ కాలనీగా పేరు పొందాయి. దీనిని అల్లుళ్ల కాలనీగా కూడా పిలుస్తుంటారు. ఇవి కాక అల్లూరి సీతారామ రాజు కాలనీ, అశ్వారావుపేట జమీన్దారుల గుర్రాలు నీళ్లు తాగిన ప్రాంతం గుర్రాలచెరువుగా ఉండేది. ఈ గ్రామపంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది. అలాగే, దొంతికుంట చెరువుకు సమీపంలో పేదలకు మంజూరు చేసిన కాలనీ దొంతికుంటగానే కాక దివ్యాంగుల కాలనీ, కార్మికులతో ఆటోనగర్ పేర్లు స్థిరపడ్డాయి. సరిహద్దులో ‘పేట’ మున్సిపాలిటీ -
పూర్వ విద్యార్థికి రెండు బంగారు పతకాలు
అశ్వారావుపేటరూరల్: స్థానిక వ్యవసాయ కళాశాలకు చెందిన 2021 బ్యాచ్ విద్యార్థి హలావత్ చిన్నారికి విద్యారంగంలో చూపిన ప్రతిభకు రెండు బంగారు (డాక్టర్ సీహెచ్ కృష్ణమూర్తిరావు గోల్డ్ మెడల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గోల్డ్ మెడల్) పతకాలు దక్కాయి. సోమవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ల చేతుల మీదుగా పతకాలు అందుకుంది. దీంతో స్థానిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్, ప్రొఫెసర్లు, తోటి విద్యార్థులు చిన్నారికి అభినందనలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు. రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనంఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో నమోదైన 47 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 953 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు సోమవారం దహనం చేశారు. తల్లాడ మండలం గోపాల్రావుపేటలో ఈ గంజాయిని కాల్చివేయగా, దీని విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 21 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 194 కేజీలు, భద్రాద్రి జిల్లాలోని 47 కేసుల్లో పట్టుబడిన 760 కేజీల గంజాయిని దహనం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్రెడ్డి, ఏఈఎస్లు పాల్గొన్నారు. అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య రఘునాథపాలెం: మండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన కౌలు రైతు భూక్యా లక్ష్మా(40) కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే, పంటలు దెబ్బతినడంతో అప్పులు మిగిలిపోగా మద్యానికి బానిసైన లక్ష్మా జనవరి 13న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై లక్ష్మా భార్య చంద్రావతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బారులో ఆయన పాల్గొని, గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందజేసి అర్హత మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గిరిజన దర్బార్లో సమర్పించిన అర్జీలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబుతోపాటు అశోక్, మధూకర్, అరుణకుమారి, వేణు, సైదులు, లక్ష్మీ నారాయణ, గన్యా, ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఇక ప్రలోభ పర్వం
లౌడ్ స్పీకర్లలో పాటలు, డప్పు నృత్యాల కోలాహలం ఆగిపోయింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని ఇంటింటికీ తిరిగిన అభ్యర్థులు సేద తీరుతున్నారు. వారి గెలుపు కోసం ప్రచార రథాలు ఎక్కి ఎన్నికల నినాదాలు వల్లించిన నాయకులు వ్యూహ రచనల్లో బిజీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగియడంతో కీలక అంకమైన ప్రలోభ పర్వాలకు తెర లేచింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంజోరుగా ప్రచారం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతి పక్ష బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈసారి రెబల్స్ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్ తరఫున మంత్రిపొంగులేటి శ్రీనివారెడ్డి ప్రధానంగా ప్రచార బాధ్యతలు తీసుకోగా, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర శ్రమించారు. సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ నేత కె. నారాయణతో పాటు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మరో అగ్రనేత పొంగులేటి సుధాకర్రెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇక పీసీసీ నియమించిన ఇన్చార్జ్ లు మాత్రం ప్రచార పర్వంలో ‘నామ్ కే వాస్తే’ అన్నట్టుగా మిగిలిపోయారు. కొన్ని వార్డులు/డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేశారు. పోల్ మేనేజ్మెంట్.. ప్రచార పర్వం ముగిసిపోవడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు రాజకీ య పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి. ప్రతీ ఇంటికి వెళ్లి పోల్ చిట్టీలు అందించడంతో పాటు గల్లీల వారీగా ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ 20 ఇళ్లకు ఒక కో ఆర్డినేటర్ చొప్పున నియమించుకున్నారు. అలాగే ఇతర ఊళ్లలో ఉన్న ఓటర్లను రప్పించే పనులు కూడా మొదలెట్టారు. అ‘మూల్యమైన’ ఓటు ఎన్నికల ప్రచారంలో ‘మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన’ అనే నినాదం బాగా వినిపించింది. వాల్పోస్టర్లలోనూ ఇదే కనిపించింది. కానీ ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రధాన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్న మెజారిటీ అభ్యర్థులు ఓటుకు విలువ కట్టే పనిలో ఉండడం గమనార్హం. ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీలో ఉన్న వారు ఓటుకు ఎంత ఇస్తున్నారు ? దాన్ని బట్టి తామెంత ఇవ్వొచ్చనే అంశంపై బహిరంగంగానే చర్చలు సాగిస్తుండడం విశేషం. ఇక మరికొందరు అభ్యర్థులైతే ఓ వైపు ప్రచారం జరుగుతుండగానే తమ పరిధిలోకి వచ్చే ఓటర్లకు చీరలు, ప్యాంట్షర్టుల వంటి బహుమతులు అందించి ‘అడ్వాన్స్ బుకింగ్’ తరహా ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి వరకు సంక్షేమం, అభివృద్ధి, మచ్చలేని పాలన అంటూ ఊదరగొట్టిన అభ్యర్థులు కీలక సమయంలో అమూల్యమైన ఓటు కు విలువ కట్టడాన్ని ప్రజాస్వామికవాదులు తప్పుపడుతున్నారు. మరోవైపు తమ ఓటుకు ఏ అభ్యర్థి ఎక్కువ ధర చెల్లిస్తాడని చూసే వారి సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంమున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధానం ఈ ఎన్నికల్లో కనపించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీలు ఇవ్వడంపైనే ఫోకస్ చేశా యి. కొత్తగూడెంలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ – సీపీఐ సైతం ఎన్నికల ప్రచారంలో ఎదుటి పార్టీపై ఎదురుదాడి చేసేప్పుడు సంయంమనం కోల్పోలేదు. ఇదే సమయంలో రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలు.. అధికారం అప్పగిస్తే తాము చేయబోయే మార్పు ఏంటనే అంశంపై స్పష్టమైన మేనిఫెస్టో ప్రకటించడంలో విఫలమయ్యాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధి నినాదాలకే పరిమితమయ్యాయి. ఇక కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు పైసా ఖర్చులేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు అందిస్తామంటూ హామీలు గుప్పించారు. -
విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉన్నప్పుడే 1995లో అంబాజీపేటతోపాటు అశ్వారావుపేటలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటుచేశారు. అంతకుముందు 1988లో పట్టు పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ ఆవరణలో మల్బరీతోట సాగు చేస్తూనే ఆయిల్పామ్ మొక్కలు పెంచుతున్నారు. ఇదే ప్రాంగణాన్ని ఇటీవల ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించారు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1989లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే, 1988లో హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ కూడా ఏర్పాటైంది. ఉద్యాన యూనివర్సిటీ ద్వారా ఈ కేంద్రంలో పలు రకాల ఉద్యాన పంటల సాగు చేస్తూనే కొత్త వంగడాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అలాగే, అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన రూరల్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్వీటీసీ) ఐటీఐ కళాశాలను 1981లో ప్రారంభించారు. ఇక్కడ ఐటీఐతోపాటు అగ్రికల్చరల్ ఇంటర్మీడియట్ కోర్సు నిర్వహిస్తున్నారు. కాగా, అశ్వారావుపేట పంచాయతీ సమితిగా ఉన్నపుడు స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. -
‘మల్బరీ’తో నికర ఆదాయం
● కుటీర పరిశ్రమ తరహాలో ఉపాధి ● రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులుసూపర్బజార్(కొత్తగూడెం): మల్బరీ సాగుతో రైతులు నికర ఆదాయం పొందేలా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం రెండెకరాల్లో సాగు చేసినా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మేర ఆదాయం వస్తుందని చెబుతున్నారు. జిల్లాలో ప్రసుత్తం 95 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. మరింత మంది రైతులు ముందుకొచ్చేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగ కిషోర్ మల్బరీ సాగుపై వివరాలు వెల్లడించారు. ఏడాదంతా ఉపాధి గ్రామీణ ప్రాంత పేద, నిరుపేద రైతులు పట్టు పరిశ్రమను కుటీర పరిశ్రమలా ఎంచుకోవచ్చు. 60 శాతం కంటే ఎక్కువ మహిళా భాగస్వామ్యం కలిగి కుటుంబ సభ్యులందరికీ ఉపాధి లభిస్తుంది. ఎకరం మల్బరీ తోట సాగు చేస్తే ఏడాది పొడవునా ఉపాధికి ఢోకా ఉండదు. మల్బరీ బహువార్షిక పంట కావడం, అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోవడమే కాక తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభం పొందొచ్చు. జిల్లా భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట మండలాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. సాగు ఇలా... ఎకరం మల్బరీ సాగుకు 5,500 నారు మొక్కలు అవసరమవుతాయి. వీటిని 3 ఇంటూ 3 సాళ్ల పద్ధతిలో నాటుకోవాలి. అధిక దిగుబడినిచ్చే వీ1, ఎస్5 తదితర రకాలను జూన్లో నాటి కలుపు తీస్తూనే తగు మోతాదులో పశువుల ఎరువు వేయాలి. భూసార పరిరక్షణకు పశువుల ఎరువు ఎనిమిది టన్నులను ఏటా నాలుగు విడతలుగా వేయాలి. చాకీ తోట అయితే 16 టన్నులు అవసరమవుతుంది. ఈ పరిశ్రమ ద్వారా ఏడాదిలో 5 నుంచి 10 పంటలు రావడం ద్వారా ప్రతీనెల ఆదాయాన్ని పొందే వీలుంటుంది. కాగా, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 75 శాతం సబ్సిడీ అందుతుంది. ఇక ఎకరం మల్బరీకి అవసరమైన పట్టు గుడ్లను చాకీ సెంటర్ల నుండి రూ.450(వంద గుడ్లకు) చెల్లించి పొందొచ్చు. ఆపై ఎకరం పంటకు 75 నుండి 100 కేజీలను ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం పట్టుగూళ్ల ధర కేజీకి రూ.500 నుంచి రూ.700 పలుకుతోంది. తద్వారా ఎకరం మల్బరీ సాగు చేస్తే సంవత్సరంలో రూ.5లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం పొందొచ్చు. -
గోదావరికి ఘనంగా నదీ హారతి
భద్రాచలం: గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీహారతిని వైభవోపేతంగా జరిపారు. భాను సప్తమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భానుసప్తమి రోజున నదీ హారతి విశిష్టతను పురోహితులు వివరించారు. రామాలయ ఈఓ కె. దామోదర్రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, పురోహితులు సురేష్ వర్మ, పవన్ కుమార్ వర్మ, అశోక్ కుమార్ పాల్గొన్నారు.భద్రగిరిలో మూలమూర్తులకు అభిషేకం అంతరాలయంలో ఆదివారం మూలమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. విశాఖపట్నంలో భద్రగిరి రామయ్య కల్యాణం ఆదివారం వైభవోపేతంగా జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారంలో భాగంగా భక్తుల కోరిక మేరకు నిర్ణీత రుసుముతో స్వామి వారి కల్యాణం జరుపుతారు. ఈ క్రమంలోనే బీర్రోడ్లో ఉన్న గాదిరాజు ప్యాలెస్లో కల్యాణ వేడుక కమనీయంగా జరిపారు. భద్రగిరి నుంచి వచ్చిన సీతారాముల ఉత్సవమూర్తులకు శోభాయాత్రతో ఘన స్వాగతం పలికారు. కల్యాణ తంతును అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ శ్రవన్కుమార్ దంపతులు, స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ పాల్గొన్నారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి కృషి
ములకలపల్లి: సహజసిద్ధ ప్రశాంత వాతావరణంతోపాటు చక్కటి వెదురు ప్లాంటేషన్లతో నిండిఉన్న అక్షరాలలొద్ది, పాండవుల గుట్టల ప్రదేశాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మండలపరిధిలోని మధ్యతరహా నీటిపారుదల జలాశయం మూకమామిడి ప్రాజెక్ట్, నల్లముడి శివారులోని అక్షరాలలొద్ది గుహ, పాండవుల గుట్టను ఆదివారం ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిఽశీలించి, పురాతన కాలంనాటి చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. స్థలపురాణాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పాల్వంచ వైద్యుడు సోమరాజు దొర, స్థానికులు తాండ్ర బుచ్చిబాబు, చిన్నారి, వాసు తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్తో క్రీడాకారులకు ప్రోత్సాహంసూపర్బజార్(కొత్తగూడెం): సీఎం కప్తో గ్రామీణస్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సీఈఆర్ క్లబ్లో సీఎం కప్ క్రీడా పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు ప్రతిభ చాటుతూ రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరాటే, యోగా, బాస్కెట్బాల్, బాక్సింగ్, అత్యపత్య, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్బాల్, హాకీ, నెట్బాల్, తైక్వాండో, బ్యాడ్మింటన్ తదితర 13 రకాల క్రీడాపోటీలను పరిశీలించారు. తొలిరోజు విజేతలకు పతకాలు బహూకరించారు. ఈకార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రామాలయంలో ఐటీడీఏ పీఓ పూజలుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాగతం పలికిన అనంతరం తన సతీమణితో కలిసి అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అదృత్ అవన్కు ఆలయ ప్రాంగణంలో అన్నప్రాశన జరిపారు. ఈ కార్యక్రమంలో పీఓ సతీమణి మనీషా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సతీమణి ప్రవీణ పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయం వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 408 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,800 ఆదాయం లభించింది. 180 మంది బోటింగ్ చేయడంతో 11,180 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల తమ సమస్యలపై వినతులు అందజేయాలని కోరారు. తహసీల్లోనూ.. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో కూడా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, మండల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభబూర్గంపాడు: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలురి సాధ్విక కరాటే పోటీలలో జాతీయ స్థాయిలో సత్తాచాటింది. రెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జిల్లా, రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపింది. ఆదివారం ముంబైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆమెను మండల విద్యాశాఖ అధికారి యదుసింహారాజు, సర్పంచ్ బానోతు సరోజ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
దాదాపు వారం పాటు హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. అభ్యర్థులు ఖరారైనప్పటి నుంచి ప్రచారం, కార్యకర్తలు, నేతల ప్రదర్శనలు, మైకుల హోరుతో దద్దరిల్లిన కొత్తగూడెం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు,
ఆఖరి మోఖా!విస్తృతంగా ప్రచారం.. ఈనెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు వార్డుల్లో ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాహనాలకు మైకులు అమర్చి ప్రచారాన్ని వేడెక్కించారు. ఇక రాజకీయ పార్టీల నుంచి ప్రధాన నేతలు సైతం ప్రచారంలో పాలు పంచుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల ఆధ్వర్యాన రోడ్షోలు కూడా నిర్వహించారు. మరోమారు ముఖ్యనేతలు ప్రచారానికి చివరిరోజు కావడంతో డివిజన్, వార్డుల్లో ప్రచారం చేయాలని అభ్యర్థులు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. దీంతో నేతలు కూడా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించుకున్నారు. అభివృద్ధిని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేసేలా బీఆర్ఎస్.. మరోపక్క బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా చివరి రోజున ప్రచారాన్ని రక్తికట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కార్నర్ మీటింగ్లు, పాదయాత్రల ద్వారా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి కూడా ప్రచారానికి హాజరవుతారు. ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు కూడా ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లెక్కలు సిద్ధం! బహిరంగ ప్రచారం గడువు ముగియగానే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఓటు మేనేజ్మెంట్ ఎలా చేయాలనే అంశంపై ఇప్పటికే దృష్టి సారించగా.. రహస్యంగా ఓటర్లను కలిసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు వరకు మద్యం, నగదు పంపిణీపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏ వార్డులో పరిస్థితి ఎలా ఉంది.. ఎందరికి ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే లెక్కలను ముందుగానే వేసుకున్నట్లు తెలిసింది. వీటికి తోడు సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఓటర్లతో టచ్లోనే ఉండేలా సిద్ధమవుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో సోమవారం సాయంత్రం 5గంటలకు మైకుల మోత నిలిచిపోనుంది. చివరి రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ ఎత్తున ర్యాలీలు, రోడ్షోలకు ఏర్పాట్ల్లు చేసుకున్నారు. ఓవైపు అభ్యర్థులు, మరోవైపు కార్యకర్తలతో ప్రదర్శనలు, వాహనాల్లో మైక్లు, ప్లెక్సీల ద్వారా ఎన్నికల గుర్తును ఓటర్లకు వివరించేలా హోరెత్తించనున్నారు.నేడు ముగియనున్న ఎన్నికల ప్రచారం -
తీరంలో అపరిశుభ్రత
భద్రాచలం: ప్రతీ ఆదివారం అర్చకులు, భక్తులు సమర్పిస్తున్న నదీ హారతితో గోదావరి తల్లి పులకరిస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణంతో మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పుణ్యస్నానాలకు, నదీ హారతికి వచ్చే భక్తులకు అపరిశుభ్రత స్వాగతం పలుకుతోంది. భక్తులు వాడే ప్లాస్టిక్ సంచులు, దుస్తులు, పూజా సామగ్రి అట్టలు, చిరు దుకాణాల వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. పారిశుద్ధ్య మెరుగుకు రైల్వే, బస్ స్టేషన్లలో మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామపంచాయతీ కార్మికులను కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. నదీ హారతికి ముందు తప్పనిసరిగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొంటున్నారు. మహిళా భక్తుల బాధలు వర్ణనాతీతం గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే మహిళా భక్తుల బాధలు వర్ణనాతీతం. స్నానాలు ఆచరించాక వస్త్రాలను మార్చుకోవాలంటే గోదావరి తీరం నుంచి కరకట్ట(వస్త్రాలు మార్చుకునే గదుల) వరకు అదే తడి బట్టలతో రావాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. పురుషులు, ఇతరుల నడుమ తడి బట్టలతో రావాల్సి వస్తుండటంతో పలువురు పుణ్యస్నానాలకు జంకుతున్నారు. గోదావరి తీరంలోనే తాత్కాలిక గదులు ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ర్యాంప్ ఏర్పాటు చేయరూ.. గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు పాట్లు తప్పడంలేదు. ఎక్కువ దూరం నడిచి, మళ్లీ మెట్లపైకి చేరాలంటే అక్కడే వైకుంఠ రాముడు కనిపిస్తున్నాడని పేర్కొంటున్నారు. సినిమాహాళ్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని, మరి భక్తులు వచ్చే గోదావరి తీరంలో ర్యాంపులు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నిస్తున్నారు. నీడలో కూర్చొని వీక్షించాలన్నా, కొద్ది మేర భక్తులు సేద తీరాలన్నా తీరంలో కనీస షెడ్లు లేవు. కరకట్టపై ఓపెన్ షెడ్లు నిర్మిస్తే రోజూ వచ్చే భక్తులతోపాటు ప్రధాన ఉత్సవాలైన ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నదీ హారతికి శాశ్వత వేదిక ఏర్పాటు చేయాలని, కాశీ తరహాలో విశ్వవ్యాప్తం చేయటానికి మరిన్ని వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. అవగాహన, భాగస్వామ్యం ప్రధానం నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. రోజుకో శాఖ అధికారులు, భక్తులు, యువతతో ఉచిత పారిశుద్ధ్య సేవలు నిర్వహించాలి. తద్వారా గోదావరి తీరం పరిశుభ్రంగా ఉండటంతోపాటు భక్తుల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడే నదులను, వాటి విశిష్టతను యువతరానికి పరిచయం చేయాలనే కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్ష్యం నెరవేరుతుంది. నదీ హారతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ గోదావరి తీరంలో, కరకట్ట సమీపంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
సింగరేణిలో భారీగా అవినీతి
● రెండు పార్టీలు సంస్థను నిర్వీర్యం చేశాయి ● కొత్తగూడేన్ని అమృత్ సిటీగా మార్చుతాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు చుంచుపల్లి: సింగరేణి టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, పారదర్శకత లేపోవడంతోనే ఆరోపణలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ఫలితంగా సింగరేణి నేడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో పాటు అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక రాష్ట్రాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్, గత రెండేళ్లుగా దోచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలకు ఓట్లడిగే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు మినహా మిగిలిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్రెడ్డి రాహు కేతువుల్లా మారారని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై అనుమానాలు ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో అనుమానాలు ఉన్నాయని రామచందర్రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సైతం సెక్రటేరియట్లో ఫైళ్లు దగ్ధమయ్యాయని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ముఖ్యమైన రికార్డులు తగలబడి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి వ్యవహారంలో అధికారులను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద నాయకులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదన్నారు. కార్పొరేషన్ను బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐలు పట్టించుకోకపోవడంతో గోదావరి పక్కనే ఉన్న ప్రతీ ఇంటికి నీళ్లు కూడా రాలేదన్నారు. కొత్తగూడేన్ని అమృత్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, నాయకులు జీవీకే మనోహర్, రంగాకిరణ్, ముసుగు శ్రీనివాసరెడ్డి, పొడియం బాలరాజు, విద్యాసాగర్, గొడుగు శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పరీక్షలంటే భయం వీడాలి..
సూపర్బజార్(కొత్తగూడెం): పరీక్షలంటే భయపడొద్దని, మార్కులు సాధించడమే లక్ష్యం కాదని, జీవితంలో విజయం సాధించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో ఆదివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాలకు చెందిన 200 మంది పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ, అవగాహన తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాటిల్, బీసీ సంక్షేమాధికారి పి.విజయలక్ష్మి మాట్లాడారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలకు కృషి చేయాలని కోరారు. మోటివేటర్ జువ్వాది వెంకటేశ్వరబాబు మాట్లాడుతూ.. వివిధ సబ్జెక్టులపై పట్టు సాధించడం, పరీక్షలకు సిద్ధం కావడంపై వివరించారు. కార్యక్రమంలో పి.అపర్ణ, కె.హనుమంతరావు, జి.వెంకటేశ్వర్లు, కె.రవి, ప్రదీప్రెడ్డి, శ్రీనివాస్, దుర్గ, శ్రీదేవి, లావణ్య, అరుణ, భవ్య పాల్గొన్నారు. -
కొత్తగా గూడెం..
రుద్రంపూర్: సుమారు 110 ఏళ్ల కిందట ఏర్పాటైన సింగరేణి గనుల ద్వారా కొత్తగూడెం ఏర్పడింది. ఒకప్పడు అటవీ ప్రాంతంతోకూడిన చిన్న, చిన్న గ్రామాల సమూహంగా కొత్తగూడెం ఉండేది. ఇక్కడి ప్రజలు గోదావరి ఉపనదులను ఆధారం చేసుకుని జీవించేవారు. బ్రిటీష్ కాలంలో మలుపు.. బ్రిటీష్ హయాంలో 1880లో డాక్టర్ విలియం నేతృత్వంలో బొగ్గు గనుల అన్వేషణతో కొత్తగూడెం పేరు తెరపైకి వచ్చింది. 1886లో బొగ్గు తవ్వకాల కారణంగా పట్టణంగా మారింది. ఆ రోజుల్లోనే రైల్వేలైన్, కార్మికవాడలు, ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. నల్లగొండ, ఏపీ, ఇతర ప్రాంతాల నుంచి మార్వాడీలు, వైశ్యులు ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించారు. కాగా, సింగరేణి ఏర్పాటు చేసిన 12 భూగర్భ గనుల్లో సుమారు 15, 16 వేల మంది కార్మికులు పనిచేసేవారు. దీంతో కార్మిక సంఘాల ఏర్పాటు, కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ ఈ ప్రాంతం కీలక పాత్ర వహించగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ల పేర్లతోనే కాలనీలు.. నాడు సింగరేణిలో ఏపనులనైనా కాంట్రాక్టర్ల ద్వారా చేయించేవారు. దీంతో వారి పేర్లపైనే కార్మికవాడలు వెలిశాయి. గోరఖ్పూర్ వారిని నియంత్రించేందుకు సీఆర్పీ వారు రవడంతో సీఆర్పీ క్యాంపు, బర్మాదేశస్తులు రావడంతో బర్మాక్యాంపు.. ఇలా గాజులరాజంబస్తీ, బాబూక్యాంపు, నాగయ్యగడ్డ, వనందాస్గడ్డ, పంజాబ్గడ్డ ఏర్పాటయ్యాయి. 2016లో జిల్లా కేంద్రంగా.. 1970లో పాల్వం తాలుకా నుంచి విడివడి.. కొత్త తాలూకాగా ఏర్పడింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక 2016లో భద్రాద్రి కొత్తగూడెంను జిల్లాగా మార్చారు. తొలుత, 1971లో నోటిఫైడ్గా మారిన కొత్తగూడెం సుమారు 24 ఏళ్ల తరువాత 1995లో మున్సిపాలిటీగా మారగా.. మరో 30 ఏళ్ల తరువాత కార్పొరేషన్గా అవతరించింది. నేడు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఒకనాడు ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో యువత వలస బాట పడుతున్నారు. కార్పొరేషన్ అయినప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధి లేకపోవడం కూడా వెలితిగా మారింది. నాడు అటవీ ప్రాంతం.. నేడు పరిశ్రమల కేంద్రం -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ములకలపల్లి: ములకలపల్లికి చెందిన ఇద్దరు క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. కొత్తగూడెం సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి పోటీల్లో మహిళా విభాగంలో నరాటి సృజన, పురుషుల విభాగంలో భాస్కరిణి అయ్యప్ప ప్రతిభ చూపి పతకాలు సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎన్నికల నేపథ్యాన సెక్షన్ 163 అమలుఖమ్మంక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఇది 9వ తేదీ నుంచి 13వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించే వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు, నాయకులు సహకరించాలని, ఓటర్లకు భద్రతా రీత్యా సమస్యలు ఎదురైతే డయల్ 100కి ఫోన్ చేయాలని సీపీ సూచించారు. ఇవీ సూచనలు ఐదుగురికి కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండొద్దు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా, డబ్బు, మద్యం, కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినా చర్యలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వేయడానికి అనుమతి లేదు. ఆంక్షల సమయాన మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధం. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా నేరంగా పరిగణిస్తారు. -
● ప్రచారంలో వాకీ టాకీ !
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న రీతిలో ప్రచారం కొనసాగుతోంది. 56వ డివిజన్ నుంచి ఆర్ఎల్డీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈసంపల్లి మౌనిక లైసెన్డ్స్ వాకీటాకీని ఉపయోగిస్తూ.. అదే డివిజన్లోని ఇతర వీధుల్లో తన అనుచరులతో మాట్లాడుతూ.. ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. ● మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు !కొత్తగూడెంఅర్బన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఓ ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరానికి చెందిన సందీప్ తన ఇంటి గేటుకు ఈ మేరకు బోర్డులు ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్..
అశ్వాపురం: మండలంలోని చవిటిగూడెంలో ఈ నెల 6న భాతిక విజయ్ను కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడైన అతడి సోదరుడు బాతిక అరుణ్ను ఆదివారం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ కేసులో ఖమ్మం వాసులు ● అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు రఘునాథపాలెం: సైబర్ నేరానికి సంబంధించిన కేసులో జిల్లాకు చెందిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిన్నెవేలీ జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధుడు జి.రంగనాథన్కు ముంబై పోలీసుల పేరిట ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించడమే కాక రూ.15 లక్షలు వసూలు చేయడంతో తమిళనాడులో కేసు నమోదైంది. ఈమేరకు దర్యాప్తులో రఘునాథపాలెం మండలం వీవీ.పాలెం గ్రామానికి చెందిన తగరం శ్రీనివాస్, ఆయన కుమారుడు సాయి సిద్ధార్థ ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు తేలగా తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన సీఐ అనిత ఆధ్వర్యాన ఇద్దరు ఎస్ఐలు, ఐదుగురు సిబ్బంది శనివారం ఖమ్మం వచ్చారు. ఈమేరకు రఘునాథపాలెం పోలీసుల సహకారంతో ఆదివారం తెల్లవారుజామున తండ్రీకుమారులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి తమిళనాడు తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక విచారణలో డిసెంబర్ 27న రంగనాథన్ను బెదిరించగా, అదే నెల 30న ఆయన ఖాతా నుంచి నగదు శ్రీనివాస్, సాయిసిద్ధార్థ ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. అంతేకాక వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించారని సమాచారం. ఈ కేసులో మరికొందరి పాత్రపైనా విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా, తమిళనాడు నుండి వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు తమ సహకారం కోరారని, తండ్రీకుమారులను కోర్టులో హాజరుపరిచాక తమిళనాడు తీసుకెళ్లారని రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ ధ్రువీకరించారు. -
● రండీ.. వచ్చి వెళ్లండి !
● వలస ఓటర్లపై అభ్యర్థుల గురి ● దూరం నుంచి వస్తే చార్జీలు, ఖర్చుల పేరిట వలఅశ్వారావుపేట రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో బరిలో ఉన్న ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వస్థలాలకు రప్పించేలా పాట్లు పడుతున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 78 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, 16,850 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఒక్కో వార్డులో 657 – 848 మంది ఓటర్ల గాను కనీసం 30 – 60 మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పటికే వీరి జాబితా సిద్ధం చేయడంతో పాటు ఫోన్ నంబర్లు సేకరించి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, ఏపీలోని ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో వివిధ పనులు, ఉన్నత విద్య, ఉపాధి కోసం పలువురు వెళ్లారు. వీరందరినీ పోలింగ్ జరిగే ఈనెల 11వ తేదీన రప్పించేలా పార్టీల నాయకులు, అభ్యర్థులు దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో పాటు ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. సామూహికంగా వస్తే ప్రత్యేక వాహనం కూడా సమకూరుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు కూడా పంపినట్లు సమాచారం. ఒకటి, రెండు ఓట్లే కీలకంగా మారనున్న నేపథ్యాన ఎవరినీ వదలకుండా పోలింగ్ స్టేషన్కు రప్పించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
సత్తుపల్లి.. రూటే సెపరేటు!
● ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ● ప్రతీ ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పు సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, ఆపై ఖమ్మం ఎంపీగానూ ఎన్నికై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక జలగం ప్రసాదరావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే, గతంలో ఇక్కడ, ఆ తర్వాత పాలేరు, ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన పొంగులేటి శ్రీనివా సరెడ్డి తొలిసారి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గుండెకాయలా మున్సిపాలిటీ.. సత్తుపల్లి పట్టణ ఓటరు తీర్పు ప్రతీసారి విలక్షణంగా ఉంటుంది. అధికార పార్టీ హవా నడిచే సమయాల్లోనూ ఓటర్లు నిశ్శబ్ద తీర్పుతో ఆశావహులకు ముచ్చెమటలు పట్టించిన దాఖలాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రకంగా.. లోక్సభ ఎన్నికల్లో మరో రకంగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంకో రకంగా తీర్పు ఇవ్వడం ఓటర్ల ప్రత్యేకత. అందుకే సత్తుపల్లి నియోజకవర్గానికే గుండెకాయ వంటి మున్సిపాలిటీ ఓటరు తీర్పుపై అన్ని పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి. ఊహించని విధంగా తీర్పులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అధికారం చెలాయించే సమయాన 1992 ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం విశేషం. తుమ్మల మంత్రిగా అధికారం శాసిస్తుండగా 2001 లో సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన కొత్తూరు ప్రభాకర్రావును కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి కోటగిరి మురళీకృష్ణారావు ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. 2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తుపల్లిలోని ఆరు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకటరావు చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చవిచూశారు. నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ సత్తుపల్లి నగర పంచాయతీగా ఉన్నప్పుడు 2014లో జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు గాను టీడీపీ 17చోట్ల గెలవగా, మరో మూడింటిని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. ఆతర్వాత మున్సిపాలిటీగా ఏర్పడ్డాక తొలిసారి 2020లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను వంద శాతం బీఆర్ఎస్కు దక్కించుకోవడం విశేషం. అప్పుడు బీఆర్ఎస్లో ప్రస్తుత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ఉన్నారు. ఈసారి వీరందరూ కాంగ్రెస్ ఉండగా, రాజకీయ సమీకరణల నేపథ్యాన ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. పాలకులు వీరే.. సత్తుపల్లి పంచాయతీ ఏర్పడ్డాక 1961లో తొలి సర్పంచ్గా మొరిశెట్టి రాజయ్య ఎన్నికై 1966 వరకు కొనసాగారు. ఇక గాదె నర్సయ్య 1966 నుంచి 70వరకు, అనుమోలు నర్సింహారావు 1970 నుంచి 83వరకు, కొత్తూరు ప్రభాకర్రావు 1983–88 వరకు సర్పంచ్గా ఉన్నారు. అలాగే, కోటగిరి మురళీకృష్ణారవు 1988 నుంచి 95వరకు, కొత్తూరు పార్వతి 1995 నుంచి 2001 వరకు, కోటగిరి మురళీకృష్ణారావు 2001 నుంచి 2005 వరకు సర్పంచ్గా కొనసాగారు. సత్తుపల్లి గ్రామ పంచాయతీ 2005లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయ్యాక చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. తొలి చైర్ పర్సన్గా పూచి యశోద 2010 వరకు, రెండో సారి బీసీ మహిళకు రిజర్వ్ అయితే దొడ్డాకుల స్వాతి 2014 నుంచి 2019 వరకు కొనసాగారు. 2020 లో మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాక తొలి చైర్మన్గా కూసంపూడి మహేష్ ఎన్నికై 2025 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మున్సిపాలిటీకి రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు
చుంచుపల్లి: కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, సేవల ధరల జాబితాను ప్రజలకు కనిపించేలా ఉంచాలని సూచించారు. నిబందనల రేట్ల ప్రకారం మాత్రమే చార్జీలు వసూలు చేయాలని, విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేవించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరమైన అన్ని పత్రాలను రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భద్రు, సిబ్బంది మోహన్ తదితరులు పాల్గొన్నారు. వెదురు ట్రాక్టర్ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా వెదురును తరలిస్తున్న ట్రాక్టర్ను దమ్మపేట అటవీ శాఖ సిబ్బంది సీజ్ చేశారు. దమ్మపేట ఫారెజ్ట్ రేంజ్ కార్యాలయ అధికారి శ్రీనివాస్ కథనం ప్రకారం.. దమ్మపేట రేంజ్లోని పూసుకుంట సెక్షన్ పరిధిలోని బండారుగుంపు నుంచి ఆదివారం అక్రమంగా వెదురును తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బండారుగుంపులో వెదురు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని, రేంజ్ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని శ్రీనివాస్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికరకగూడెం/కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరకగూడెం మండలం రఘనాథపాలెం జీపీ వెంకట్రాంపురం గ్రామానికి చెందిన సాధు శ్రీను (41) మృతిచెందాడు. శ్రీను బైక్పై మరిపెడ నుంచి సొంత గ్రామానికి వస్తుండగా చింతపల్లి నుంచి క్రషర్ మిల్లు వైపునకు నలుగురు కూలీలు వెళ్తున్నారు. అందులో సునీల్ అనే వ్యక్తిని శ్రీను బైక్ ఢీకొట్టింది. సునీల్కు స్వల్ప గాయాలవగా.. బైక్ పైనుంచి పడగా శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీనును మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ పోలీసులు తెలిపారు. ఇల్లు దగ్ధంభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి పవన్ అనే వ్యక్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ స్విచ్బోర్డులో నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న సోఫాకు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రూ.3 లక్షల నగదు, 16 గ్రాముల బంగారం దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో వచ్చిన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. వాగులో పడి వ్యక్తి మృతి చుంచుపల్లి: ఇసుక కోసం వెళ్లిన వ్యక్తి వాగులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సాటివారిగూడేనికి చెందిన ఈసం వెంకటేశ్వర్లు (39) ఎడ్ల బండితో ఇసుకను తీసుకొచ్చే క్రమంలో వాగులో పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● బరిలో దంపతులు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భార్యాభర్తలు బరిలో నిలిచారు. 49వ డివిజన్ నుంచి కనుకుంట్ల కుమార్, 10వ డివిజన్లో ఆయన సతీమణి కనుకుంట్ల వెంకటరమణ పోటీ చేస్తుండగా ఆదివారం ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తామిద్దరమూ పోటీ చేస్తున్నామని, గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్లను అభివృద్ధిపథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వారికి పద్మశాలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. -
మిగిలింది రెండు నెలలే..
● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● లక్ష్యంలో ఇంకా 24 మిలియన్ టన్నులు బాకీ ● జనవరిలో 74శాతానికే ఉత్పత్తి పరిమితంరుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, గడిచిన పది నెలల్లో 58.47 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 48 మిలియన్ టన్నుల(84శాతం) ఉత్పత్తి మాత్రమే నమోదైంది. అంటే ఇంకా మిగిలిన రెండు మాసాల్లో 24 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుకంజ వార్షిక లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 2.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి. కానీ ఇప్పుడు రోజుకు 1.50 లక్షల టన్నులు (55 శాతం) దాటడం లేదు. జవనరిలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 18 ఓపెన్కాస్ట్ గనులు, 20 భూగర్భ గనుల్లో 70,01,100 టన్నుల లక్ష్యానికి 51,55,921 టన్నుల(74శాతం) మాత్రమే నమోదు కాగా, 26శాతం వెనుకంజలో ఉన్నట్లు సంస్థ వెల్లడించిన గణాంకాల ద్వారా వెల్లడైంది. సత్తుపల్లి ఏరియా టాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచిపోయాయి. ఈసమయంలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో ఒక్క సత్తుపల్లి ఏరియానే 39.45లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 40,39,200 (102శాతం) టన్నుల ఉత్పత్తి సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ ఏరియా కూడా 100శాతం ఉత్పత్తి సాధించలేక పోయాయి. జనవరి నెలలో పరిశీలిస్తే బెల్లంపల్లి ఏరియా మొదటి స్థానంలో, సత్తుపల్లి ఏరియా రెండో స్థానంలో నిలిచాయి. రోజు వారీ ఉత్పత్తిలో ఒక్క ఏరియా కూడా 100శాతం నమోదు చేయలేకపోవడం గమనార్హం. 52 మిలియన్ టన్నులతో సరి? సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో వెనకపడేలా ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉత్పత్తిలో కోలిండియాకు దీటుగా నిలిచిన సింగరేణి ఈ ఏడాది 80శాతం దాటడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఇటీవల సింగరేణిలో అధికారుల ప్రక్షాళన, ఓబీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భూగర్భగనుల్లో మొండికేసిన యంత్రాలు.. వెరసి ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది. మిగిలిన రెండు నెలల్లో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైనా మొత్తంగా 52 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించే అవకాశముందన్న భావన వ్యక్తమవుతోంది. ఫలితంగా లక్ష్యసాధనలో 20 మిలియన్ టన్నుల మేర వెనకంజలో ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. సింగరేణిలోని భూగర్భగనుల్లో కొంత ఉత్పత్తి నష్టం ఉంది. ఈ నేపథ్యాన ఓపెన్ కాస్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఓబీ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి గనుల వారీగా లోపాలను సవరించి లక్ష్యసాధనకు కృషి చేస్తాం. – ఎల్.వీ.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్) -
ఎన్నికల్లో కిక్కే కీలకం !
వైరా: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో కీలకమైన మద్యాన్ని పోలింగ్ ముందు రోజు పంపిణీ చేసేలా భారీగా స్టాక్ సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాక తమ వెంట రోజు వారీ ప్రచారంలో పాల్గొంటున్న వారికి అల్పాహారం, భోజనంతో పాటు రాత్రివేళ మద్యం సమకూరుస్తున్నారు. కాగా, వైరాలో ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి ఈనెల 2వ తేదీన రూ.5.60కోట్లు, 3వ తేదీన రూ.5.60కోట్లు, 4వ తేదీన రూ.6.60కోట్లు, 5వ తేదీన రూ.7కోట్లు, 6వ తేదీన రూ.6.10కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగాయి. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే, పోలింగ్కు ముందే మద్యం షాపులు బంద్ చేయనుండడంతో ముందస్తుగా స్టాక్ సమకూర్చుకోవడంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఐదు రోజుల్లో రూ.30.90 కోట్ల మద్యం విక్రయాలు -
దేవాదాయ శాఖ ఆదాయానికి గండి
● గతేడాది కంటే తక్కువ అద్దెకు షాపుల కేటాయింపు ● పెద్దమ్మతల్లి ఆలయంలో రూ.6.22 లక్షలు కోల్పోయిన వైనం పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ ఆదాయానికి గండి పడింది. గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలో దేవాదాయ శాఖ అధికారులు రెండు దుకాణాలను తక్కువ ఽఅద్దెకు కేటాయించారు. చీరలు పోగుచేసే పాట కూడా తక్కువకే అప్పగించారు. అమ్మవారి ఆలయ పాత కాంప్లెక్స్లోని 3వ నంబర్ షాపునకు గతేడాది నెలకు రూ.75 వేల అద్దెకు కేటాయించారు. ఈసారి మాత్రం రూ.42 వేలకే అప్పగించారు. గతం కంటే రూ.33 వేలు తగ్గింది. 4వ నంబర్ షాపునకు గతేడాది నెలకు రూ.42 వేల అద్దెకు కేటాయించగా, ఈసారి రూ.27 వేలకే అప్పగించారు. గతం కంటే ఈసారి రూ.15 వేల ఆదాయం తగ్గింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు పోగు చేసుకునేందుకు గతేడాది రూ.16 లక్షలకు కేటాయించగా, ఈసారి రూ.15.06 లక్షలకే కేటాయించారు. ఫలితంగా గతేడాదికంటే రూ.94 వేల ఆదాయం తగ్గింది. కేటాయింపులపై పలు సందేహాలు! దేవాదాయ శాఖ అధికారులు వేలంపాటను 11 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 3,4 నంబర్ షాపులు రెండింటికి కలిపి గతం కంటే నెలకు రూ.48 వేల ఆదాయం తగ్గిపోయింది. 11 నెలలకు రూ.5.28 లక్షల మేర ఆదాయం తగ్గింది. చీరల వేలంపాటలో రూ. 94 వేల ఆదాయం తగ్గింది. దుకాణాలు, చీరలకు కలిపి మొత్తం రూ.6.22 లక్షల ఆదాయం పెద్దమ్మతల్లి ఆలయం ద్వారా దేవాదాయ శాఖ కోల్పోయినట్లయింది. వేలంపాట తక్కువ ధరలకు కేటాయించడంపై భక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. షాపులు, చీరలు పోగుచేసుకునేందుకు పలుమార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మూడు నెలలుగా షాపులు ఖాళీగా ఉంటున్నాయని, దీంతో శుక్రవారం జరిగిన వేలంపాటలో తక్కువ అద్దెకు కేటాయించామని వివరించారు. -
● బ్యాలెట్ పేపర్లు వచ్చేశాయ్..
సత్తుపల్లిటౌన్: మున్సి పల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి కావడంతో ప్రత్యేక వాహనంలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేర్చి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంకు సీల్ వేయడంతో పాటు సాయుధ బలగాలతో గస్తీ ఏర్పాటు చేశారు. వీటిని 10వ తేదీన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేర్చి అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అందించనున్నారు. కాగా, సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, 28,830 మంది ఓటర్లు ఉండగా అదనంగా 15 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించినట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ తెలిపారు. ● వంద రోజుల్లో ఇల్లెందుకు రైలు! ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో 17 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారని, వీరిలో కనీసం పది మందిని గెలిపిస్తే వంద రోజుల్లో ఇల్లెందుకు రైలు వచ్చేలా కేంద్రంలో చక్రం తిప్పుతామని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. శనివారం ఇల్లెందులో బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే నిధుల పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు డాక్టర్ విజయ చంద్రా రెడ్డి, బలగానీ గోపీకృష్ణ, మురళీకృష్ణ, పూన్యా నాయక్, మహేశ్వర్, మాధవ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారమంతా కేటీపీఎస్దే..
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో రెండు డివిజన్ల నిర్వహణ మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటోంది. ఈ వార్డుల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ యాజమాన్యం చూస్తుండగా, పన్నులు మాత్రం మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. 2వ డివిజన్ పరిధిలో కేటీపీఎస్ కాలనీతో పాటు ప్రశాంత్కాలనీ కలిసి ఉంటుంది. ఇక్కడ సుమారు 2,600 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. నాలుగో డివిజన్లో కేటీపీఎస్ కాలనీతో పాటు రాహుల్గాంధీ నగర్ కలిసి ఉంది. ఇక్కడ సుమారు 2,400 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ కాలనీల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ అధికారులే నిర్వహిస్తుంటారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, రోడ్లు ఇలా అన్ని రకాల వసతులు సంస్థనే చూస్తుంది. రోజువారీ నిర్వహణ బాధ్యతలు సైతం అక్కడి సిబ్బందే చేస్తుంటారు. కాలనీల నిర్వహణ మొత్తం కేటీపీఎస్ యాజమాన్యం చూస్తున్నా, క్వార్టర్లకు సంబంధించిన పన్నులు మాత్రం 50 శాతం మేర మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. ఈ డివిజన్ల నుంచి ఇద్దరు కేటీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు.పాల్వంచ రెండు డివిజన్లలో కేటీపీఎస్ కాలనీలు -
ఎఫ్డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్
చుంచుపల్లి: ఏసీబీ కేసులో నిందితురాలిగా ఉండి పరారైన కొత్తగూడెం ఫారెస్టు డెవలఫ్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణిని శనివారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్, ఇతర అధికారులు విశాఖపట్నంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జమాయిల్ కటింగ్ విషయంలో రూ. 28 లక్షలు డిమాండ్ చేసిన ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ కుమార్, మధ్యవర్తి ద్వారా రూ. 3.50 లక్షలు లంచంగా తీసుకుంటున్న సందర్భంలో చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో జనవరి 3న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ. 28 లక్షలు డిమాండ్ చేశారు. అదే రోజు ప్లాంటేషన్ మేనేజర్ను ఏసీబీ బృందం హైదరాబాద్లో అదుపులోకి తీసుకోగా, అప్పటి నుంచి డివిజనల్ అధికారి శ్రావణి మాత్రం పరారీలోనే ఉన్నారు. ఏసీబీ నిఘా పెట్టి విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్కు కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న శ్రావణిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు అటవీ అభివృద్ధి సంస్థలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మొక్కజొన్న లోడ్ లారీ బోల్తా ఇల్లెందురూరల్: గుండాల నుంచి శెట్టుపల్లి మీదుగా ఇల్లెందుకు వస్తున్న మొక్కజొన్న లోడ్ లారీ శనివారం మండలంలోని పోచారంతండా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కొమరారం ఎస్సై నాగుల్మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మద్దుకూరులో చోరీచండ్రుగొండ : మండలంలోని మద్దుకూరు గ్రామంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మద్దుకూరులోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉండే పొలెబోయిన కల్యాణి ఇంట్లో ఈ నెల 4న మధ్యాహ్నం చోరీ జరిగింది. తలుపు, తాళం పగలగొట్టిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. నాలుగు గ్రాముల బంగారు ఆభరణం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ. 35 వేల నగదు అపహరించారు. ఆ సమయంలో కల్యాణి వ్యవసాయ పనులకు, ఆమె కుమారుడు పాఠశాలకు వెళ్లారు. మొత్తం రూ. 58,500 విలువైన సొత్తు చోరీ జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బంగారం, వెండి, నగదు కలిపి రూ. 1.70 లక్షలు ఉంటుందని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడి మృతి● సోదరుడిపై హత్య కేసు నమోదు అశ్వాపురం: కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో మండల కేంద్రంలోని చవిటిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాతిక విజయ్(25) రెండేళ్లుగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నాడు. ఈ నెల 6న అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లితో గొడవపడి కొట్టాడు. దీంతో పక్కనే ఉన్న విజయ్ సోదరుడు అరుణ్ కుమార్ మంచంకోడుతో దాడి చేశాడు. దీంతో విజయ్కు తీవ్రగాయాలు కాగా, మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు అరుణ్కుమార్పై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. -
‘మిషన్ పదో తరగతి’ పోస్టర్ల ఆవిష్కరణ
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ పదో తరగతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి శనివారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 111 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.2.2 కోట్ల నగదు బహుమతులు, మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్కు రూ.2 లక్షలు, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల టాపర్లకు రూ. లక్ష చొప్పున, 612 మండలాల టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 2026 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈడీఎం సైదేశ్వర రావు , శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీహరిరావు, మేనేజర్ ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆం బజార్.. కేరాఫ్‘చౌక్’లు..
ఇల్లెందు: ఇల్లెందులో ఆం బజార్ అంటేనే వ్యాపార కూడలి. అక్కడి పలు ప్రధాన సెంటర్లకు జాతీయోద్యమ నేతల పేర్లు ఉండగా అవన్నీ ప్రసిద్ధి చెందాయి. ఒక్క ఆం బజార్లోనే మూడు ప్రధాన కూడళ్లకు నెహ్రూ చౌక్, పటేల్ చౌక్, గాంధీచౌక్గా పేర్లు ఉన్నాయి. ఆయా బజార్లలో విగ్రహాలతోపాటు ఆ ప్రాంతాలను(ల్యాండ్ మార్క్) జాతీయోద్యమ నేతల పేర్లతో ‘చౌక్’లుగా పిలుస్తున్నారు. జాతీయ నేతల జయంతి, వర్ధంతి రోజున అక్కడి విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇల్లెందుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ప్రతిష్టించిన విగ్రహాలు, వాటి సెంటర్లు సజీవంగా నిలుస్తున్నాయి. ఇవికాక ఎల్బీఎస్ నగర్లో లాల్బహుదూర్శాస్త్రి విగ్రహం, మార్కెట్లో సుభాష్చంద్ర బోస్ విగ్రహం, ఇందిరానగర్లో ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నాయి. జాతీయోద్యమ నేతల పేర్లతో సెంటర్లు -
అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారట ?!
● కూడళ్లు, టీ స్టాళ్లలో ఎడతెగని చర్చలు ● ప్రచారంపై ఆరా, గెలుపోటములపై జోస్యం సత్తుపల్లి: ‘ఎలా ఉంది మీ వార్డులో పరిస్థితి.. ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశముంది.. ప్రచారం అయితే ఇద్దరు బాగా చేస్తున్నారు..’ఇలా మున్సిపాలిటీల్లో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. మిగిలిన అంశాలతో పోలిస్తే ఎన్నికల చుట్టే ముచ్చట్లు సాగుతున్నాయి. ఎవరికి వారు వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేస్తూ ఫలానా అభ్యర్థికే గెలుపు అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే, అన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో గెలుపోటములపై రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి. ప్రతీ వార్డులో సర్వేలు చేస్తున్నాం.. చాలా మంది అభిప్రాయం అడిగా.. మున్సిపాలిటీ పీఠం ఫలానా పార్టీకే వస్తుందని ఇప్పటికే ఒక అంచనా వచ్చిందంటూ కొందరు జోస్యం చెప్పేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నేను చెప్పిందే జరిగింది.. కావాలంటే ఫలానా వాళ్లని అడగండి అని చెప్పే వారూ కనిపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల్లా కొందరు మరో అడుగు ముందుకేసి.. ఈసారి డబ్బు ప్రభావం పని చేయదు.. ఇప్పటికే ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.. అని తేల్చేస్తుండడం గమనార్హం. ఫలానా కులం, ఫలానా మతం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు ఉంటాయంటూ మరికొందరు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికే మొగ్గు చూపుతున్నారు. వార్డు వదిలి స్థానికంగానే మరోచోట ఉంటున్న వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమాన వారితో అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్ చేసి పోలింగ్ రోజున తప్పక రావాలని సూచిస్తున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి – దయానంద్ దంపతులు వేర్వేరుగా వార్డులకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రతీ రోజు ఒక్కో వార్డులో ముఖ్యులను కలిసి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
పాత పద్ధతికే సై..
ప్రయాణ టికెట్ల బుకింగ్ నుంచి ఆఫీసులో పనులు చేసేవరకు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారుతోంది. గంటలు, రోజుల సమయం పట్టే పనులను క్షణాల్లో చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. నిత్య జీవితంలో సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం ఏఐ హవా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయె ున్సర్ల ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. సంప్రదాయ పద్ధతిలోనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపాటలు, పోస్టర్ల రూపంలో.. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి పోటీ చేసే స్థానం, ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు, బలపరుస్తున్న పార్టీలు.. ఇలా అన్ని అంశాలను వివరించే వాల్పోస్టర్లు, కరపత్రాలు ఇంటింటి ప్రచారంలో ఉపయోగపడతాయి. అలాగే లేటెస్ట్ ట్రెండ్ను అనుసరిస్తూ ప్రచార రథం, అభ్యర్థి గుణగణాలు, లక్ష్యాలను వివరించే పాటలు వినిపించడం కూడా ఇప్పుడు తప్పనిసరిగా మారింది. రాష్ట్రంలో ప్రతీ రాజకీయ పార్టీకి అందులో అగ్రనేతల కోసం రూపొందించిన ప్రత్యేక పాటలు సందర్భానుసారంగా ఇప్పటికీ ప్రజల నోళ్లలో విస్తృతంగా నానుతున్నాయి. చిటికెలోనే డిజైన్.. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, నాయకుల కోసం ప్రచార సామగ్రి తయారీ, పాటల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. కానీ స్థానిక అంశాల ఆధారంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రత్యేక సంపత్తిని సమకూర్చుకోవడం కష్టం. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకు ఏ డివిజన్/వార్డు నుంచి ఎవరు, ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బరిలో నిలిచే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రచారానికి తక్కువ సమయం చిక్కింది. దీంతో ఏ పనైనా క్షణాల్లో చక్కబెట్టే చాప్ జీపీటీ, గూగుల్ జెమినైన్ వంటి ఏఐ టూల్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా పేజీలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తాయనే వాదనలు ముందుగా వినిపించాయి. దీనికి తగ్గట్టే ఏఐ సాయంతో చిటికెలో కరపత్రాల డిజైన్, నిమిషాల వ్యవధిలో పాటల రూపకల్పనకు అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో ఏఐని ఎలా ఉపయోగించాలనే అంశంపై సవివరమైన ప్రాంప్ట్లతో సహా విస్తృతమైన కంటెంట్ అందుబాటులో ఉంది. అదే విధంగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇన్ఫ్లుయె ున్స ర్లు, వారికి సంబంధించిన పేజీలు వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొత్త తరహా ప్రచారంపై పెద్దగా మక్కువ చూపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఓటర్లను ఆకట్టుకునేందుకు అధునాతన సాంకేతికతపై ఆధారపడడం కంటే గడపగడపకూ వెళ్లడమే శ్రేయస్కరమనే అభిప్రాయం ఇప్పటికీ రాజకీయ పక్షాల్లో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు సైతం స్థానికంగా ఉన్న ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే క్యాంపెయిన్ మెటీరియల్ డిజైన్ చేయించుకునేందుకు మొగ్గు చూపారు. ఇక ఏఐ టూల్స్తో కొత్త పాటలు కంపోజ్ చేయడం కంటే ఇప్పటికే పాపులరైన ‘మూడు రంగుల జెండా పట్టి’ ‘గులాబీ జెండలమ్మా’, ‘ఎర్రజెండెర్రజెండ ఎనియ్యల్లో’ తదితర ట్యూన్లకే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త సాహిత్యంతో పాటలు తయారు చేయించుకుని ప్రచారంలోకి దూకారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో చెమటోడ్చుతుండగా.. స్టార్ క్యాంపెయినర్ల కార్నర్ మీటింగ్లకు జనం పోటెత్తుతున్నారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఏఐ టూల్స్ -
పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
చుంచుపల్లి: ెపరటి కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం సమాకూరుతుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోళ్ల పెంపకంతో కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం లభించడంతో పాటు పోషక విలువలు గల ఆహా రం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపా రు. లబ్ధిదారులు కోళ్లను సరైనసంరక్షణతో పెంచా లని సూచించారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధి కారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ప్రాథమిక అంశాలు, కోళ్లకు అందించాల్సినఆహారం, నివాస ఏర్పాట్లు, వ్యాధు ల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సైంటిస్ట్ యోగేష్ దడేకర్ మాట్లాడుతూ పెరటి కోళ్లపెంపకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని వివరించారు. 50 మంది మహిళలకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలతో పాటు 10 కిలోల దాణా అందజేశారు. కార్యక్రమంలో పశు వైద్యులు ఆనందరావు పాల్గొన్నారు. -
‘వాడిన’ పూలే వికసించెలే...
● భద్రగిరి ఆలయంలో పూజకు వినియోగించిన పుష్పాలతో అగర్బత్తీలు ● టీటీడీ తరహాలో తయారీకి జైళ్ల శాఖ నిర్ణయం ● కరీంనగర్ జైలులో ఏడాది క్రితం, ఇప్పుడు భద్రాద్రిలో ప్రారంభం ● మార్కెట్ ధర కంటే తక్కువగా లభ్యం భద్రాచలంఅర్బన్: ఆలయాల్లో పూజ చేశాక తొలగించే పూలతో అగరుబత్తీల తయారీకి జైళ్ల శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో రాష్ట్రంలోనూ వాడిన పూలతో అగర్బత్తీలు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించింది. కరీంనగర్ జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో వివిధ వస్తువుల తయారీతో పాటు పెట్రోల్బంక్లు నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో భద్రాచలం రామాలయంలో పూజకు విని యోగించిన పూలతో అగరుబత్తీలు తయారు చేస్తుండగా.. మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తుండడం విశేషం. పెట్రోల్ బంక్ ఏర్పాటుకూ సన్నాహాలు.. జైళ్లశాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో త్వరలో పెట్రోల్బంకు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సబ్ జైలు అధికారి నివేదిక పంపగా అనుమతి లభించింది. ఇప్పటికే ఆర్టీసీ, జీసీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్బంకులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే జైళ్లశాఖ సైతం పలు నగరాల్లో పెట్రోల్బంకులు ఏర్పాటు చేయగా భద్రాచలంలో రెవెన్యూ అధికారులు ఇటీవలే స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే, బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భద్రాచలంలో ఏర్పాటు చేసే బంక్లో శిక్ష అనుభవించి సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.భద్రాచలం రామాలయంలో పూజకు ఉపయోగించిన పూలతో సబ్ జైలులో అగర్బత్తీలు తయారు చేస్తున్నాం. ఎలాంటి రసాయనాలు లేకుండా పూలను ఎండబెట్టి ఆ పొడితో పాటు సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తూ మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నాం. డిమాండ్ పెరిగి తే తయారీ సంఖ్యను కూడా పెంచుతాం. – ఉపేందర్, సబ్ జైల్ సూపరింటెండెంట్, భద్రాచలం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న అగరుబత్తీలు రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా ఉంటున్నాయి. ఆలయాల్లో వాడిన పూల ను ఎండబెట్టి, పొడిచేశాక కొన్నిసుగంధ ద్ర వ్యా లు కలిపి అగర్బత్తీలు తయారు చేస్తున్నా రు. ఇటీవల భద్రాచలం జైలు సందర్శనకు వచ్చిన డీజీపీ సౌమ్యా మిశ్రా ఈ యూనిట్ను ప్రారంభించారు. ఆ తర్వాత భద్రాద్రిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సైతం యూనిట్ను పరి శీలించి పలు సూచనలు చేశారు. ఒక్కో బాక్స్లో 20 స్టిక్స్ ఉంటుండగా రూ.20 చొప్పు న లభిస్తున్నాయి. ఖైదీలతో రోజుకు 100 బాక్సులు(2000 అగర్బత్తీలు) తయారు చేయిస్తున్నారు. భవిష్యత్లో ఆర్డర్లు పెరిగితే ఆ మేరకు తయా రు చేసేలా చర్యలు చేపడుతున్నారు. భద్రాచలంలో శాండిల్, రోజ్తో పాటు మరో ఫ్లేవర్లో అగర్బత్తీలు లభ్యమవుతున్నాయి. -
ఆమెదే ఓటు, సీటు!
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల బరిలో అతివలు దూసుకెళ్తున్నారు. ఓటర్లలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండగా, అభ్యర్థులు కూడా అదే స్థాయిలో పోటీ పడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో వీరి ఆధిక్యత స్పష్టమవుతోంది. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 8,467 మంది ఎక్కువగా ఉండగా.. ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చైర్పర్సన్ పీఠాలు వారికే రిజర్వ్ అయ్యాయి. దీంతో మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా బరిలోకి దిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంమహిళలు పురుషులు కొత్తగూడెం కార్పొరేషన్ 70,314 64,431ఏడు మున్సిపాలిటీలు 1,01,164 92,697 వారిదే అధిపత్యం కొత్తగూడెం కార్పొరేషన్తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లసంఖ్యే ఎక్కువగా ఉంది. ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 1,93,893 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 92,697 మంది, మహిళా ఓటర్లు 1,01,164 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 8,467 మంది ఎక్కువగా ఉండడం విశేషం. ప్రతీ మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి ఉండగా, అభ్యర్థుల జయాపజయాల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అతివలు ఎవరికి మద్దతుగా నిలిస్తే వారిదే విజయమనే చర్చ సాగుతోంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోనూ 1,34,775 మంది ఓటర్లు ఉండగా.. 64,431 మంది పురుషులు, 70,314 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏడింటిలో ఆరు వారికే.. రాజకీయాల్లో తమ సత్తా చాటడమే కాక ప్రజాసేవ చేయాలనుకునే అతివలకు మున్సిపల్ ఎన్నికలు వేదికగా మారాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లి, మధిర, వైరా, అశ్వారావుపేట చైర్పర్సన్ పీఠాలు జనరల్ మహిళకు రిజర్వు కాగా.. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు, ఇల్లెందు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. కల్లూరు మున్సిపాలిటీ ఒక్కటే ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి కూడా ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. బరిలో 473 మంది.. కొత్తగూడెం కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీల్లో 223 డివిజన్లు, వార్డుల్లో మొత్తం 953 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో దాదాపు సగం మేర 473 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. డివిజన్లు, వార్డుల్లో మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లోనే కాక కొన్ని జనరల్ సీట్లలోనూ ఆయా పార్టీలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి. మహిళల ఓట్లను రాబట్టుకోవడం ఇందుకు ఒక కారణమైతే, ఎక్కువ మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వ్ కావడంతో ముందు జాగ్రత్తగా వారినే బరిలో నిలిపినట్లు చర్చ సాగుతోంది. కౌన్సిలర్లుగా విజయం సాధిస్తే చైర్పర్సన్ పీఠానికి పోటీలో ఉండొచ్చనే భావనతో మహిళా అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా రు. ఆరింటనాలుగుస్థానాలు జనరల్మహిళలకు రిజ ర్వ్ అయిన నేపథ్యాన అందరూ చైర్పర్సన్ రేసులో ఉన్నట్లుగా భావిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా.. అభ్యర్థులంతా మహిళా ఓట్ల సాధనే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఏ డివిజన్ / వార్డులో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒకటికి రెండుసార్లు ప్రచారానికి వెళ్తున్నారు. దాదాపు ప్రతీ డివిజన్, వార్డులోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో అందరినీ పోలింగ్ స్టేషన్కు రప్పించి తమకే ఓటు వేయించేలా ‘ముందస్తు’ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బరిలో ఉన్న మహిళా అభ్యర్థులు సెంటిమెంట్గా అతివల ఓట్లు దక్కించుకునేలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.మున్సిపల్ బరిలో 473 మంది మహిళలు -
కమ్యూనిస్టులు గెలిస్తేనే అభివృద్ధి
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె.నారాయణ అన్నారు. శనివారం ఆయన రామవరం, బర్మాక్యాంపు, ప్యూన్బస్తీ, పాత కొత్తగూడెం ఏరియాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిని గెలిపించడం ద్వారానే పాల్వంచతో కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైందనే విషయాన్ని ఓటర్లు గుర్తించాలన్నారు. మూడు దశాబ్దాలుగా పాలకవర్గం లేని పాల్వంచకు ఎన్నికలు జరిపిస్తున్న ఘనత కూడా సీపీఐదే అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఊరు,పేరు లేనివారు వస్తున్నారని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచాక ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా తదితరులు మాట్లాడగా నాయకులు సలిగంటి శ్రీని వాసరావు, దుర్గరాశి వెంకటేశ్వర్లు, ఎస్కే ఫహీమ్, జి. వీరస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శాంతి శ్రీ, సాహేరా బేగం, వడాల ఆకాంక్ష పాల్గొన్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణ -
గిరిజన సంస్కృతికి ప్రతీకగా మ్యూజియం
భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూ జియం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని ఐ కార్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన కుటుంబసభ్యులతో కలి సి మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ పొందుపరిచిన చిత్రాలు, పరికరాలు గిరిజనుల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నేటితరానికి తెలిసేలా ఏర్పాట్లు చేయ డం బాగుందన్నారు. ఈ మేరకు కృషి చేసిన పీఓ రాహుల్, సిబ్బందిని అభినందించారు. అంతకుముందు శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. గిరిజన మ్యూజియానికి హంగులు.. దేశ, విదేశీ పర్యాటకుల ఆదరణ పొందుతున్న గిరిజన మ్యూజియాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మ్యూజియం ప్రాచుర్యాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై యూనిట్ అధికారులతో చర్చించారు. బోటింగ్, సెల్ఫీ పాయింట్, పెయింటింగ్, మినీ థియేటర్ ఏర్పాటుకు సంబంధించిన పరిసరాలను పరిశీలించారు. గిరిజన సంప్రదాయ దుస్తులను ధరించి ఫొటోలు దిగేందుకు పర్యాటకులకు సహకరించాలన్నారు. ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, అధికారులు రాంబాబు, ఉదయ్కుమార్, హరీష్, ప్రభాకర్ రావు, వీరాస్వామి పాల్గొన్నారు. -
రామాలయంలో సుదర్శన హోమం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం జరిపించారు. అలాగే అంతరాలయంలోని స్వామి వారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వా త స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కల్యాణ ముత్యాలకు రూ.19 లక్షల విరాళ ంభద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించే ముత్యాల కోసం ఎన్ఆర్ఐ జి.పుష్పారావు శనివారం రూ.19 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. మొదట ఆయన స్వామివారిని దర్శించుకున్నా రు. ఆ తర్వాత ముత్యాల కొనుగోలు నిమిత్తం దేవస్థానం ఖాతాకు రూ. 19 లక్షలు బదిలీ చేశారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ఆలయ విశిష్టతను వివరించగా ఈఓ దామోదర్రావు జ్ఞాపిక అందజేశారు. జూలూరుపాడు వాసికి డాక్టరేట్జూలూరుపాడు: జూలూరుపాడుకు చెందిన జేఎన్టీయూహెచ్–జేఏసీ చైర్మన్ మందారంజిత్కుమార్కు డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కె.విజయకుమార్రెడ్డి పర్యవేక్షణ లో ఆయన ‘డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ ఎస్పీవీ సిస్టమ్స్ ఫర్ హైయర్ ఎలక్ట్రికల్ ఔట్పుట్ విత్ డిఫరెంట్ ఎంపీపీటీ టెక్నిక్స్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు.హైదరాబాద్లో శనివారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో వీసీ చేతుల మీదుగా రంజిత్ డాక్టరేట్అందుకోగా పలువురు అభినందించారు. -
‘డబుల్’ ధమాకా
●ఇసీ్త్ర చేస్తూ.. సమోసా వేస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెంలోని 56వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలిశెట్టి సత్యభామ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ, టైలరింగ్ పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 55వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి హరిహరన్ సమోసాలు కాల్చుతూ అక్కడి వారిని ఓటు అభ్యర్థించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్కే సాహెరాబేగం కూడా ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాగా, ఆమె ప్రత్యర్థి అపర్ణ రజక కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, వారికి ఇసీ్త్ర దుకాణం ఉండడం గమనార్హం. – కొత్తగూడెంఅర్బన్/సత్తుపల్లిరూరల్ ఒకే కుటుంబం నుంచి బరిలో ఇద్దరు.. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోరు ఆసక్తికరంగా మారింది. పలువురు ఒకే కుటుంబం నుంచి వేర్వేరు వార్డుల్లో బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భార్యకు మద్దతు తెలిపేందుకు భర్త, కూతురుకు మద్దతుగా తండ్రి.. ఇలా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో భార్యాభర్తలు నిలవగా, బీజేపీ నుంచి తండ్రీకూతురు బరిలో నిలిచారు. కాగా, ఈ డబుల్ ధమాకా పోటీపై పట్టణంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. – సత్తుపల్లిఅభ్యర్థుల వినూత్న ప్రచారం.. -
వరి వెదజల్లే పద్ధతిపై శిక్షణ
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతి యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ భారతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్టులు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ పద్మావతి హాజరవగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహేంద్రకుమార్, పద్మావతి మాట్లాడుతూ.. వరిలో చీడపీడల నివారణ కోసం అభివృద్ధి చేసిన లింగాకర్షక బుట్టలు, జిగురట్టలు, నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, వచ్చే లాభాలు, గడ్డిని ఎలా నియంత్రించాలో వివరించారు. అభ్యుదయ రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కేవీకే ఫామ్లో డ్రోన్ పద్ధతిలో వరి సాగు విధానాల గురించి రైతులకు చూపించారు. గిరిజన రైతులకు డ్రమ్ సీడర్ పరికరాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి మండలం రాయపాడు, చుంచుపల్లి మండలం పెనగడప, సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణ పనుల పరిశీలన
చర్ల: మండలంలోని పూసుగుప్ప మార్గంలో రూ 4.50 కోట్ల అంచనా వ్యవయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఎస్పీ రోహిత్రాజ్ పరిశీలించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులతో పూసుగుప్ప – వద్దిపేట గ్రామాల మధ్యలో దీనిని నిర్మిస్తుండగా పనులు నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ రాజువర్మ, ఎస్ఐలు కేశవ్, నర్సిరెడ్డి ఉన్నారు. లేబర్కోడ్లకు వ్యతిరేకంగా 12న సమ్మె మణుగూరు టౌన్: కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మాచారి కోరారు. శుక్రవారం వివిధ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి సమ్మైపె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ కోడ్లలో అదనపు పనిగంటలకు ఓటీ విధానాన్ని రద్దు చేశారని, 50 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేసే కాంట్రాక్టర్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించారని తెలిపారు. దీని వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధత లేకుండాపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం ఉద్యోగ భద్రత కోసం సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దల శ్రీను, కొడిశాల రాములు, సత్రపల్లి సాంబశివరావు, సాయి సుమన్, ఇమాంత్ హతిరాం, భీమయ్య, శ్రీవాణి, గట్టమ్మ, అమృతరావు, శ్రీను ఉన్నారు. -
ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం
ఇల్లెందు/పాల్వంచరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత మాది అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్లోని పాత పాల్వంచ అంబేద్కర్ సెంటర్, నటరాజ్ సెంటర్, శ్రీనివాస కాలనీ, వెంగళరావు కాలనీల్లో జరిగిన కార్నర్ మీటింగ్ల్లో, మండల పరిధి లక్ష్మీదేవిపల్లి పంచాయతీ కొమరంభీమ్ భవనంలో, ఇల్లెందులోని జగదాంబా సెంటర్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ఇల్లెందు సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే, ఇక ప్రతిపక్ష పార్టీ ఒక్క వార్డు అయినా గెలుస్తుందో, లేదోననే అనుమానం వస్తోందని అన్నారు. ఇల్లెందులో 100 పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం, బుగ్గవాగు ప్రక్షాళన, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఏటీసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుల సంఘాల భవనాలు కూడా నిర్మిస్తామని చెప్పారు. దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్సార్ జీఓ నంబర్ 76 ద్వారా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి హక్కులు కల్పించారని, అదే జీఓ ద్వారా అర్హులకు హక్కు పత్రాలు అందిస్తామని వివరించారు. త్వరలో పూసపల్లి ఓసీ చేపడుతామని తెలిపారు. అధికారంలోలేని వారికి ఓట్లు వేస్తే అభివృద్ధి జరగదని, కాంగ్రెస్తోపాటు మిత్రపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్పొరేషన్లో ప్రతీ డివిజన్కు రూ.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. 817 సర్వే నంబర్ సమస్య పరిష్కరిస్తాం పాల్వంచ పట్టణ ప్రజలను అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న 817 సర్వే నంబర్ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సర్వే నిర్వహించి అందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. ఇళ్ల మధ్య హైటెన్షన్ తీగలు లేకుండా చర్యలు తీసుకుంటామని, పాల్వంచను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 4, 5, 6, 7 డి విజన్ల అభ్యర్థులు శ్రీలత, సర్వమ్మ, డాక్టర్ బీఎస్ రావు, సుజాతమ్మలను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, ఆయితం గంగాధర్, నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, వూకంటి గోపాలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
వేడెక్కిన ప్రచారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రచారం చేస్తున్నారు. భారమంతా పొంగులేటిపైనే.. కొత్తగూడెంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం మైనస్గా మారింది. అభ్యర్థులంతా ఎవరికి వారుగా తమ డివిజన్ల వరకే పరిమితమయ్యారు. పైగా ఎన్నికల ఫలితాల తర్వాతే మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో రిజర్వేషన్ ప్రకారం మేయర్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులంతా పూర్తిగా గెలుపుపైనే దృష్టి సారించారు. ఫలితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కనిపించాల్సినంత ఊపు ప్రచారంలో లోపించింది. ఎట్టకేలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తుండటంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. సాధారణంగా మంత్రి పొంగులేటి బయటకు వస్తే ఇసుకేస్తే రాలనంత జనం తరలివస్తారు. కానీ, ఈ ఎన్నికల ప్రచారంలో ఆ జోష్ అయితే కనిపించలేదు. అయితే ఆ పరిస్థితిలో శుక్రవారం కొంత మార్పు కనిపించింది. ఇల్లెందు, పాల్వంచ మున్సిపాలిటీల్లో నిర్వహించిన ప్రచార సభలకు జనం భారీగానే తరలివచ్చారు. గమ్యంలేని కారు ప్రయాణం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీసుకున్నారు. వారం రోజులుగా ఆయన కొత్తగూడెంలోనే మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని వాడవాడలా ప్రచారంలో తిరుగుతున్నారు. కానీ, పార్టీని ఒక్కతాటిపైకి తేలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కొత్తగూడెం నియోజకర్గంలో పట్టున్న వనమా కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వనమా ఇక్కడి నుంచే సర్పంచ్ నుంచి కేబినెట్ మంత్రి వరకు ఎదిగారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాల్లో వెంట నడిచే కేడర్ ఉంది. కానీ ప్రచారంలో వనమా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో మమేకం చేయడంలో వద్దిరాజు వెనకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటీముట్టనట్టుగా రేగా.. మరోవైపు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరంభంలో కొత్తగూడెంపై ఆసక్తి చూపించినా, ఆ తర్వాత అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీలో కీలక నేతల మధ్య సమన్వయ లేమి దీనికి కారణంగా తెలుస్తోంది. రాబోయే నాలుగైదు రోజులు కీలకం కాబట్టి, ఆ పార్టీకి చెందిన నాయకత్వమంతా ఒక్కతాటిపైకి వచ్చి శ్రమిస్తే అధికార పార్టీకి షాక్ ఇవ్వగలమనే నమ్మకం బీఆర్ఎస్ కేడర్లో కనిపిస్తోంది. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేలా మిత్ర పక్షాలను కూడగట్టడంలో ఆమె సఫలమయ్యారు. మిత్రలాభం ఫలిస్తుందనే నమ్మకం ఇక్కడ కారు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ పీఠమే లక్ష్యంగా.. మిత్రపక్షమైన కాంగ్రెస్తో సీట్ల పంపకంలో తేడాలు రావడంతో సీపీఐ పార్టీ దాదాపు ఒంటరిగానే బరిలో దిగినట్టయింది. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఈ పార్టీ పోటీ నామమాత్రమే అయినప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ప్రచారంలో సీపీఐ శ్రేణులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మరుక్షణం నుంచే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వాల్ పోస్టర్లు, కరపత్రాలు, పాటలు, కళాజాతాలు ఇలా పూర్తి స్థాయి మెటీరియల్తో రంగంలోకి దిగారు. బహుజన, దళిత సంఘాలను సహకారం అందివ్వాల్సిందిగా కోరారు. కార్నర్ మీటింగుల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొంటున్నారు. గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని కామ్రేడ్లు అంటున్నారు. బీజేపీ సైతం గతానికి భిన్నంగా ఎక్కువ స్థానాల్లో పోటీలో దిగింది. పోటీ చేసే అవకాశం కొత్త తరానికి ఇచ్చింది. ఈ ప్రయోగం ఫలిస్తే పురపాలనలో కమలం మార్క్ మొదలవుతుంది. -
త్వరలో గిరిమార్ట్ ప్రారంభిస్తాం
బూర్గంపాడు/ములకలపల్లి: త్వరలో భద్రాచలంలో గిరి మార్ట్ను ప్రారంభిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. బూర్గంపాడులోని అక్షయ గ్రామీణ చెక్క గానుగ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ–4 కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ములకలపల్లి మండల పరిధిలోని పాతూరులో పచ్చళ్లు, మిల్లెట్ స్నాక్స్, ఫుడ్ తయారీ, ఆనందపురంలో వైరుబుట్టలు, పూసుగూడెంలో పేపర్పేట్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు శ్రీరామనవమికి గిరిమార్ట్ ప్రారంభిస్తామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గిరిమార్ట్ను వేదికగా మారుస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఐటీసీ, ఎల్జీడీ వంటి సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఒడినింపే కార్యక్రమంలో వారికి పండ్లు,పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్రాజ్, రేవతి,సర్పంచ్ కుంజా రవి, ఉద్యానవన అధికారి ఉదయ్కుమార్, ఎంపీడీఓ రామారావు, ఏపీఎం రామ్కుమార్, ఎంపీఓ రమేష్బాబు, అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, సుమిత్ర, ఎల్జీడి సిబ్బంది ప్రమీల, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
అధికారుల హోదాలు, విధులు
– కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వార్డుల రిజర్వేషన్లు, నోడల్ అధికారుల నియామకం, ప్రవర్తనా నియమావళి అమలు కమిటీల ఏర్పాటు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. – అదనపు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలను అదనపు కలెక్టర్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అప్పగించిన విధులు పూర్తి చేస్తారు. అలాగే, ఆర్డీఓ స్థాయి అధికారి డిప్యూటీ ఎన్నికల అధికారిగా ఉంటారు. – మున్సిపల్ కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరి స్తారు. ఓటర్లజాబితాతయారీ, వార్డు ల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల గణన, పోలింగ్ కేంద్రాల ఎంపిక, నామినేషన్ల స్వీకరణ వీరి ప్రధాన బాధ్యతలు. -
ముంచిన మొక్కజొన్న సీడ్!
అశ్వారావుపేటరూరల్: మొక్కజొన్న విత్తనాలతో అధిక దిగుబడితోపాటు టన్ను ధర భారీగా వస్తుందని ఓ ఆర్గనైజర్ ఆశ చూపించడంతో సాగు చేసిన కౌలు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతు కథనం ప్రకారం.. మండలంలోని మామిళ్లవారిగూడేనికి చెందిన కూరపాటి నరేశ్ గతేడాది అక్టోబర్లో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని దమ్మపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ ఆర్గనైజర్ ద్వారా మొక్కజొన్న పంట సాగు చేశాడు. కాగా, సీడ్ ఇచ్చే సమయంలో ఎకరానికినాలుగు టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.34 వేలు చొప్పున ధర ఇస్తామని చెప్పారు. తీరా పంట చేతికంది, 10 ఎకరాల్లో పంట కోయగా.. మొక్కజొన్న కండెలో గింజలు పూర్తి స్థాయిలో రాకపోవడం, అంతంత మాత్రంగానే గింజలు రావడంతో ఎకరానికి క్వింటా దిగుబడి మాత్ర మే వచ్చినట్లు రైతువాపోతున్నాడు. ఆశించినస్థాయి లో దిగుబడి రాకపోవడంతో ఒక ఎకరానికి రూ.80 వేల దాకా నష్టం రాగా, ఇరవై ఎకరాలకు దాదాపు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఈ విషయాన్ని సీడ్ సరఫరా చేసిన దమ్మపేట మండలానికి చెందిన సదరు ఆర్గనైజర్కు చెబితే తనకు సంబంధం లేదని, సీడ్కు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాధిత రైతు దిక్కుతోచనిస్థితిలో పడ్డా డు. కాగా, సదరు ఆర్గనైజర్ అశ్వారావుపేట మండలంలో మరో వంద ఎకరాలకు సీడ్ సరఫరా చేసినట్లు ప్రచారం సాగుతుండగా, ఆయా రైతుల్లో కుడా ఆందోళన నెలకొంది. తనను మోసం చేసిన ఆర్గనైజర్పై వ్యవసాయ, పోలీస్ శాఖ దృష్టిపెట్టి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
●నాడు భర్త.. నేడు భార్య
వైరా: వైరా మున్సిపాలిటీలో తొలి వైస్ చైర్మన్గా గతంలో ముళ్లపాటి సీతారాములు పదవి చేపట్టగా ఇప్పుడు ఆయన భార్య ముళ్లపాటి విజయలక్ష్మి పోటీలో ఉన్నా రు. నాడు అధికార బీఆర్ఎస్ నుంచి సీతారాములు పోటీ చేయగా ఆయన ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ●ప్రత్యర్థులుగా అన్నదమ్ములు కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ బరిలో అన్నదమ్ము లు ప్రత్యర్థులుగా మారారు. ఒకరు అధికార కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా, మరొకరు ప్రతిపక్ష బీఆర్ ఎస్ పోటీ చేస్తున్నారు. వైరా మున్సిపాలిటీ శివారు పల్లిపాడు 16వ వార్డులో రాచబంటి బలరామయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా అతని బా బాయి కుమారుడు రాచబంటి బాలకృష్ణ బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నాడు. మరో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే ఉంది. -
అవగాహనతో విధులు నిర్వహించాలి
పాల్వంచ: జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికులను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమితులైన పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చని, ప్రతి పోలీంగ్ అధికారి పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని చెప్పారు. ఓటింగ్ సామగ్రి, నిర్వహణ, పోలీంగ్ కేంద్రాల్లో శాంతి భద్రతలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. పారదర్శికత, నిష్పక్షపాతం కీలకమని, ఎన్నికల కోడ్ను కఠినంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ, మున్సిపల్ మేనేజర్ ఎల్వీ సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన -
ఏజెన్సీ యువత క్రీడల్లోనూ రాణించాలి
చర్ల: ఏజెన్సీ ప్రాంతంలోని యువత చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ రోహిత్రాజుతో కలిసి మండలంలోని ఉంజుపల్లి రోడ్లో సమీపంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. రూ.75 లక్షలతో నూతనంగా నిర్మించిన మైదానాన్ని యువత వినియోగించుకోవాలన్నారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను అందించేందుకు ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జిల్లాస్థాయికి ఎంపికవుతారని అన్నారు. కాగా ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు శ్రీనివాస్, రాజువర్మ, డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ చర్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల కేసులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విభాగాన్ని, వివిధ రకాల రిజిస్టర్లను పరిశీలించారు. బాధితులకు నిరంతరం వైద్యం అందించాలన్నారు. బాధితులతో మాట్లాడి మందులు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి వర్ధన్, వైద్యులు కాంత్, రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు అవగాహన కల్పించాలిదుమ్ముగూడెం: రోడ్డు ప్రమాదాల, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శుక్రవారం ఆయన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ప్రహారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలను ఎల్ల ప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై గణేష్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
నిఘా, తనిఖీ బృందాలు..
ప్రతీ మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని కలెక్టర్ నియమిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే బాధ్యత. – ఫ్లయింగ్ స్క్వాడ్లు డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఈ బృందంలో ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటారు. – స్టాటిక్ సర్వైలెన్స్ బృందం మున్సిపాలిటీ పరిధిలోని సరిహద్దులు లేదా చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తారు. ప్రతీ మున్సిపాలిటీకి ఒక బృందం (పెద్ద మున్సిపాలిటీల్లో రెండు, రెండు కార్పొరేషన్లో అంత కంటే ఎక్కువ) ఉంటుంది. వీడియో సర్వైలెన్స్ బృందం ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. కోడ్ ఉల్లంఘనలు జరిగితే సాక్ష్యంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ●వ్యయ పరిశీలకులు అభ్యర్థులు చేసే ఖర్చు పర్యవేక్షిస్తుంటారు. అభ్యర్థులు సమర్పించే లెక్కలను వీడియోల ఆధారంగా పరిశీలిస్తారు. -
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
కలెక్టర్ జితేష్ వి.పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెంలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దీనికోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బొగ్గు నాణ్యతకే ప్రాధాన్యంమణుగూరు రూరల్: బొగ్గు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ అధికారి బి.వెంకన్న జాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన సింగరేణి మణుగూరు ఏరియాలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీలు, విదేశీ బొగ్గు నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జీ–13 కంటే మెరుగైన నాణ్యత కలిగిన బొగ్గును మాత్రమే సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎంలు దుర్గం రామచందర్, టి.శ్రీనివాస్, ఎ.రవికుమార్, జె.వెంకటరమణ, ఇతర అధికారులు శ్రీనివాసచారి, వెంకటరామారావు, రాంబాబు, శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్, వేణుమాధవ్, ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఉండాలిఅశ్వారావుపేటరూరల్: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరమని, యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంటుందని రాస్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేటలోని ఆ పార్టీ కార్యదర్శి వెలుగు జాకబ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వీరిలో అశ్వారావుపేటలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరిందని విమర్శించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాలకు నిధుల కేటాయింపులు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వంటి అసమర్థ సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, గౌర బీరప్ప, గిరికుండే, కట్టా సతీష్, మడకం ప్రసాద్, యాగంపూడి ప్రసాద్ పాల్గొన్నారు. రేపటి నుంచి సీఎం కప్ పోటీలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ, జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి పరంధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అసెంబ్లీస్థాయి, 8 నుంచి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీస్థాయి వాలీబాల్, చెస్, క్యారమ్ పోటీలను ప్రకాశం స్టేడియంలో, బ్యాడ్మింటన్ పోటీలు కొత్తగూడెం హనుమాన్ బస్తీలో, కబడ్డీ, ఖోఖో పోటీలు ప్రకాశం స్టేడియంలో, అఽథ్లెటిక్స్ పాల్వంచలోని శ్రీనివాసకాలనీ మినీ స్టేడియంలో, ఫుట్బాల్ కేటీపీఎస్ ఫుట్బాల్ గ్రౌండ్లో నిర్వహిస్తామని వివరించారు. జిల్లాస్థాయి నెట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్ పోటీలు ప్రకాశం స్టేడియంలో, సైక్లింగ్ ఇల్లెందు క్రాస్రోడ్లో, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్బాల్, తైక్వాండో. యోగా, కరాటే తదితర పోటీలు ప్రకాశం స్టేడియంలో, హాకీ శ్రీరామచంద్ర కాలేజీలో, కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, ఉషూ కొత్తగూడెం సీఈఆర్ క్లబ్లో, రెఫిల్ షూటింగ్ శ్రీ రామచంద్ర కాలేజీలో, వీల్చైర్ క్రికెట్, నెట్ క్రికెట్, ప్రగతిమైదాన్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
‘రిజిస్ట్రేషన్’లో తర్జనభర్జన!
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అద్దె భవనాల్లోని కార్యాలయాలను ప్రభు త్వ భవనాల్లోకి మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా రిజిస్ట్రార్, చిట్, మార్కెట్ వ్యాల్యూ అధికారుల కార్యాలయాలు, సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మా ర్చాలని రిజిస్ట్రేషన్శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అద్దె భవనాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెల 25వ తేదీ నాటికే అద్దె భవనాలు ఖాళీ చేయాలని ఆదేశించినా సరిపడా భవనాలు లేకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు కార్యాలయాలకు మాత్రం భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని త్వ రలోనే మార్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్రమే అందుబాటులో.. జిల్లాలో ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు 11 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మధి ర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పటికే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కూసుమంచి, ఖమ్మంరూరల్, వైరా, కల్లూరు, ఇల్లెందు, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి కోసం అధికారులు ప్రభుత్వ భవనాలను వెతకగా, బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. రెండింటిని త్వరలోనే ఆయా భవనాల్లోకి మార్చనున్నట్లు సమాచారం. శంకుస్థాపన చేసినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గత ప్రభుత్వం స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసింది. నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 2016, జూన్ 12న శంకుస్థాపన చేశారు. పదేళ్లు అవుతున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద స్థలం కేటాయించింది. నిధులు మంజూరు చేయకపోవడంతో భవన నిర్మాణాలు చేపట్టలేదు. వైరా, జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం, ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నిధుల లేమితో సొంత భవనాలకు నోచుకోలేదు. ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద రిజిస్ట్రేషన్ శాఖకు కేటాయించిన స్థలంలో కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను అద్దె భవనాల్లోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఆర్ఓ–జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మా ర్చాలంటే ఎనిమిది గదులు, ఐదు పెద్దహాళ్లు, స్టోర్కు మరో నాలుగైదు గదులు ఉన్న భవనం అవసరం ఉంటుంది. దీంతో కార్యాలయ భవనం మార్పునకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక వైరా, కల్లూరు, ఖమ్మంరూరల్, కూసుమంచి కార్యాలయాలకు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వాటిలో కొనసాగించే యోచనలో ఉన్నారు. అయితే యజమానులు అద్దె లేకుండా కార్యాలయాలకు భవనాలు ఇస్తే కొనసాగిస్తామని చెబుతుండడం గమనార్హం. -
● పోస్టల్ బ్యాలెట్కు రేపటి వరకు గడువు
సత్తుపల్లిటౌన్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం తొలుత దరఖాస్తు ఫారం–12కు ధ్రువీకరణ పత్రం జత చేసి ఓటుహక్కు కలిగి ఉన్న మున్సిపాలిటీలో శనివారంలోగా అందజేయాలి. ఆపై రిటర్నింగ్ అధికారి ఫారం–15, 16, 7, 18ను అందిస్తారు. వీటిలో ఓటు నమోదు చేసి ఆదివారం 8వ తేదీ ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటు హక్కు కేంద్రాలు ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్హాల్లో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్లో వేయాలి. అలాగే, మధిర మున్సిపాల్టీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో, కల్లూరు మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు కల్లూరు జీహెచ్ఎస్లో, వైరా ఉద్యోగులు తహసీల్లో, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయంలోని సెంటర్లో ఓటు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ● పోల్ స్లిప్పులు రెడీ వైరా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా వైరా మున్సిపాలిటీ 20 వార్డుల్లో 24,689మంది ఓటర్లు ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు పోల్ స్లిప్పులను సిద్ధం చేశారు. మున్సిపల్ సిబ్బంది వీటిని ఇంటింటికీ పంపిణీ చేయనున్నారని కమిషనర్ యు.గురులింగం తెలిపారు. -
పరీక్షా కేంద్రాల తనిఖీ
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ సీహెచ్. హేమచందర్ గురువారం తనిఖీ చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట, ములకలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతులు, ప్రశ్నపత్రాల గోప్యత, పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. గురువారం రెండు సెషన్లలో కలిపి 2,412 మందికిగాను 2,320 మంది హాజరయ్యారని, 92 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. డీఐఈఓ వెంకటేశ్వరరావు ఉన్నారు. సమయ పాలన పాటించాలిఅశ్వాపురం: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని తహసీల్దార్, ట్రైనీ కలెక్టర్ సౌరభశర్మ అన్నారు. గురువారం మండల పరిధిలోని పాములపల్లి, మిట్టగూడెం, జగ్గారం, అశ్వాపురం గ్రామ పంచాయతీల్లోని రేషన్ దుకాణా లను, అశ్వాపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. పాములపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో సౌరభశర్మతో ముచ్చటించారు. -
విద్యుత్ శాఖపై ఆరోపణలు అవాస్తవం
కరకగూడెం: నిరంతరం ప్రజలకు, రైతులకు సేవలందిస్తున్న విద్యుత్ శాఖపై కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్) రవీంద్రనాథ్ తెలిపారు. ఇటీవల అనంతారం పంచాయతీలో విద్యుత్ శాఖ అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆయన విచారణ చేపట్టారు. విద్యుత్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా, నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డీఈ జీవన్ కుమార్, ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్, లైన్మన్ నరసింహారావు, సర్పంచ్ పాయం కృష్ణవేణి, ఉపసర్పంచ్ పూజారి వెంకన్న పాల్గొన్నారు.సీజీఎం రవీంద్రనాథ్ -
ఉత్పత్తి లక్ష్యం సాధించాలి
టేకులపల్లి: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమల రావు సూచించారు. గురువారం ఆయన కోయగూడెం ఓపెన్కాస్టులో పర్యటించారు. వ్యూ పాయింట్ నుంచి ఓసీలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కేఓసీ అధికారులు డైరెక్టర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు గోవింద రావు, ఆర్వీ నరసింహరాజు, మేనేజర్, శ్రీనివాస రావు, అంజిరెడ్డి పాల్గొన్నారు. 10న పవర్ లిఫ్టింగ్ ఎంపికలు భద్రాచలంటౌన్: సీఎం కప్ పోటీల్లో భాగంగా ఈ నెల 10న భద్రాచలంలో జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జి.వి. రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, పాల్గొనే క్రీడాకారులకు మధ్యాహ్నం ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు. విలువిద్య కోచ్కు ఇంటర్వ్యూపాల్వంచరూరల్: విలువిద్య కోచ్ నియామకం కోసం కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో గురువారం ఇంటర్వ్యూ నిర్వహించారు. కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ల్లో ఖాళీగా ఉన్న విలువిద్య కోచ్ పోస్టు కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడగా, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అశోక్, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్ తదితరులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ సభ్యులు పి.శంకరయ్య, హెచ్ఎం.చందు, పీడీలు బాలసుబ్రహ్మణ్యం, పద్దం రాంబాబు, పీఈటీ అంజయ్య, మారప్ప, ప్రసాద్, సంజిత్లు పాల్గొన్నారు. -
ఆటో, లారీ ఢీ
● యువతి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు ములకలపల్లి: బంధువుల ఇంటికి వచ్చిన యువతి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాలిగాయంతో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్లి వస్తున్న క్రమంలో ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలపరిధిలోని కొత్తగంగారం గ్రామానికి కారం రాజాబాబు ఇంటికి దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో నివసించే తమ్ముడు కారం వెంకటేష్ కూతురు నాగేశ్వరి (23) ఇటీవల వచ్చింది. అదే గ్రామానికి చెందిన కల్లూరి ప్రశాంత్ కాలికి గాయంకాగా కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన కణితి భూలక్ష్మి, కల్లూరి ప్రమీల, రాజబాబు కూతురు సంధ్య, మరో బంధువు పాల్వంచకు చెందిన సోడే రమేష్తో కలిసి నాగేశ్వరి కొత్తగూడెం వెళ్లి ప్రశాంత్ను పరామర్శించి వస్తున్నారు. సాయంత్రం అందరూ తిరిగి ఆటోలో వస్తుండగా మాధారం గ్రామం వద్ద పాల్వంచ వైపు వెళుతున్న లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో తీవ్ర గాయాలై నాగేశ్వరి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. కారం సంధ్య, కణితి భూలక్ష్మి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమీల స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా ఆటో నడుపుతున్న కల్లూరి రమేష్తోపాటు సోడే రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. -
ప్రచారంలో ‘సోషల్’ ట్రెండ్ !
వైరా: మున్సిపల్ ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన ఓటర్లకు మరింత చేరువయ్యేలా ప్రచార పంథా మార్చారు. గతంలో ఓటర్లను ప్రత్యేకంగా కలిసి తాము ఏమేం చేస్తామో చెబుతూ మద్దతు కోరేవారు. ఇది ఇప్పుడూ కొనసాగుతున్నప్పటికీ ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి చేతుల్లో ఇంటర్నెట్తో కూడిన సెల్ఫోన్లు ఉంటున్నాయి. అంతేకాక అందరికీ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ ప్రచార శైలి, ఇచ్చే హామీలను ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. అంతేకాక పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాల క్లిప్పింగ్లను ప్రతిరోజు ఉదయం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేలా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఓటర్లను ఆకట్టుకునేలా పాటలు రికార్డింగ్ చేయించారు. అలాగే, రీల్స్ ద్వారా కూడా తమ సందేశాన్ని పంపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రచారంలో భాగంగా గతంలో చేసిన సేవా కార్యక్రమాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అలాగే, ప్రచార సమయాన ప్రత్యేక ఫొటోగ్రాఫర్లతో చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలకు పాటలు జత చేసి పోస్ట్ చేస్తూ కొత్త ట్రెండ్తో హోరెత్తిస్తున్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులంతా వార్డుల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇందులోని వార్డులోని ఓటర్లను యాడ్ చేసి తమ ప్రచార ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తూ, తమను గెలిపిస్తే చేసే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కలిసి దిగిన ఫొటోలు, ప్రచారంలో వారి వీడియోలతో రీల్స్ కూడా పోస్టు చేస్తున్నారు. ఓటర్లను సులువుగా ఆటకట్టుకునేలా పలువురు అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలు రాయించారు. వీటిని స్టూడియోల్లో రికార్డు చేయించడమే కాక వీడియోలు జత చేస్తున్నారు. పేరున్న గాయకుడు తెలంగాణ గద్దర్ గతంలో పాడిన పాటల్లో కొంత భాగం తీసుకుని తమ వీడియోలకు జత చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఖర్చుకు వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చేస్తున్న ‘నయా’ ప్రచారంతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు -
గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కారును ఆపి సోదా చేయగా, 15.070 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులు, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన రఘు విష్ణోయి, రాజస్థాన్కు చెందిన శేఖర్ రామ్లను అరెస్ట్ చేశారు. సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కారు, సెల్ఫోన్ల విలువ సుమారు రూ. 10.73 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. బంగారు ఆభరణాలు అప్పగింత ఖమ్మంక్రైం: వైద్యం కోసం ఖమ్మం వచ్చి ఆభరణాలు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఆభరణాలు దక్కేలా పోలీసులు చేసిన కృషి ఫలించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల గ్రామానికి చెందిన గుగులోత్ లక్పతి ఖమ్మంలో ఆస్పత్రికి గురువారం రాగా, ఆయన వద్ద 35 గ్రాముల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో ఖమ్మం టూ టౌన్ పోలీసు ఉద్యోగులు డి.శ్రీను, టి.భీముడు రంగంలోకి దిగారు. లక్పతి తిరిగిన ఆస్పత్రి, మెడికల్ షాప్ ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మెడికల్ షాప్లో ఆభరణాలు మరిచిపోయినట్లు తేలింది. దీంతో వాటిని ఎస్ఐ రమేష్ సమక్షాన బాధితుడికి అప్పగించడంతో కృతజ్ఞతలు తెలిపాడు. ఇసుక వేలందమ్మపేట: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కొప్పుల రామనరేష్ ఆధ్వర్యంలో గురువారం ఇసుక వేలం పాట నిర్వహించారు. గత కొద్ది నెలలుగా అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేయడమే కాక ఇసుకను స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ కార్యాలయంలో డంపింగ్ చేశారు. ఈ ఇసుకను వేలం వేయగా రూ.60,000 ధర పలికింది. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుఅశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామ సమీపంలో మొండికుంట–భద్రాచలం రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన కార్పెంటర్ తోకల ఽశంకర్ బైక్పై మణుగూరు వైపు వస్తుండగా మల్లెలమడుగుసమీపంలో చెట్టుకు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. 108లో స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళ అదృశ్యంభద్రాచలంఅర్బన్: మహిళ అదృశ్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన కటారి శ్యామల (38) ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. బుధవారం వరకు ఫోన్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్విచ్చాప్ వస్తోంది. శ్యామల కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
గుండాల: మండలాభివృద్ధిలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. యాస్పిరేషన్ బ్లాక్గా గుర్తించిన గుండాలలో గురువారం సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు. మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో టీబీ జబ్బులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, రక్త నమూనాలు సేకరించాలని వైద్యాధికారులను సూచించారు. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను సందర్శించి వసతులను పరిశీలించాలని సూచించారు. పశువులను పరిశీలించి, గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని పశువైద్యాధికారులకు సూచించారు. తక్కువ కాలంలో అధిక లాభాలను అందించే మునగ, ఆకుకూరలను సాగు చేసుకోవాలని రైతులకు చెప్పారు. యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని అప్పటి వరకు వందశాతం అభివృద్ధి సాధించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జనవరిలో 49 రోడ్డు ప్రమాదాలు జరగగా 17 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను గుర్తించి, అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులకు రోడ్డు రిపేర్ గ్యాంగ్ను ఏర్పాటు చేయాలనానరు. బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలపై క్రమం తప్పకుండా నివేదికలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 38 బ్లాక్ స్పాట్లు, 62 ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు నాగలక్ష్మి, తుకారాం, సంజీవరావు, స్వర్ణలత లెనినా, వెంకటేశ్వరావు, మంగతార, నాగేశ్వరరావు, గుండాల తహశీల్దార్ ఖాసీం, ఎంపీడీఓ బాలస్వామి, వైద్యాధికారి మనేష్రెడ్డి, సుదీప్, సర్పంచులు, ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఈవీఎం గోదాంను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా గోదాంను తనిఖీ చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పనితీరు, పరిసరాలను పరిశీలించారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పుర పోరులో బాధ్యతల విభజన
బృందాల వారీగా విధుల కేటాయింపు ఖమ్మంమయూరిసెంటర్: పురపాలక ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పది విభాగాలకు నోడల్ అధికారులను నియమించారు. వీరంతా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మానవ వనరులు : నామినేషన్ల పరిశీలన మొదలు ఓట్ల లెక్కింపు వరకు కావాల్సిన ఉద్యోగులను ఈ విభాగం ద్వారా నియమిస్తారు. మొత్తం ఎన్నికల్లో ఇది కీలక విభాగం. బ్యాలెట్ పెట్టెల నిర్వహణ : కేంద్రాలకు బ్యాలెట్ పెట్టెలను చేర్చడం, పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్కు తరలించడం, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భద్రతను పర్యవేక్షించడం ఈ బృందం బాధ్యత. రవాణా : పోలింగ్కు ముందురోజే ఉద్యోగులు, బ్యాలెట్ పెట్టెలు, భద్రతా బలగాలను వాహనాల ద్వారా కేంద్రాలకు చేర్చే విభాగం. సామగ్రి, ముద్రణ : పోలింగ్, కౌంటింగ్కు కావాల్సిన వస్తువులను సమకూర్చడం, బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లను ముద్రించే బాధ్యతను ఈ విభాగం చూసుకుంటుంది. వ్యయ నిర్ధారణ, పర్యవేక్షణ : అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తున్నారా లేదా అని ఆరా తీసే విభాగం ఇది. ఖర్చుల వీడియోలు, సీడీలను ఈ విభాగం ఉద్యోగులు నిక్షిప్తం చేస్తారు. శిక్షణ, ఏర్పాట్లు : పోలింగ్, కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణ ఇచ్చే విభాగమిది. వివిధ విభాగాల పరిశీలకులకు కావాల్సిన ఏర్పాట్లను సమన్వయం చేస్తుంది. ఖాతాల నిర్వహణ : ప్రచార సభలు, సమావేశాలకు అయ్యే ఖర్చులను అంచనా వేసి, వాటిని అభ్యర్థుల ఖాతాల్లో చూపే విభాగం. ప్రవర్తన నియమావళి : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనుసరిస్తున్నారా, లేదా అని నిఘా వేస్తారు. ఉల్లంఘనలు ఉంటే ఆధారాలు సేకరిస్తారు. ఫిర్యాదులు, హెల్ప్లైన్, కేసులు : పార్టీలు, అభ్యర్థులు లేదా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఎస్ఈసీకి నివేదిస్తారు. హెల్ప్లైన్కు అందే ఫిర్యాదులను పరిష్కరిస్తారు. సమాచారం, నివేదికలు : ఎన్నికల సమాచారాన్ని మీడియాకు అందించడం, అవసరమైన నివేదికలు రూపొందించడం ఈ విభాగం ముఖ్య విధి. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
గుండాల: ఏజెన్సీలోని వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వాస్సత్రిని తనిఖీ నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆస్పత్రిలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల గదిని పరిశీలించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంబులెన్స్ వాహనాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధులకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
కరకగూడెం:విద్యుదాఘాతానికి గురై యువరైతు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన చందా ప్రసాద్ (35) తన మూడు ఎకరాల పొలంలో వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో నీళ్లు పెట్టేందుకు పొలంలోని మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీఎన్ రావు తెలిపారు. కాగా, విద్యుత్ శాఖ అధికారులు డీఈ జీవన్ కుమార్, ఏడీఈ ఉమ మహేశ్వరరావు, ఏఈ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి భద్రతా లోపాలపై విచారణ చేపట్టారు. -
పొద్దుపోయినా బుకింగ్ కావట్లే!
● యాప్లో యూరియా బుకింగ్ కోసం రైతుల పాట్లు ● అవగాహన, అధునాతన స్మార్ట్ ఫోన్లు లేక ఆందోళన ● మీ సేవ కేంద్రాలకు వెళ్లి బుకింగ్ చేసుకుంటున్న వైనం బూర్గంపాడు: వానాకాలం సీజన్లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. రోజుల తరబడి క్యూలైన్లు కట్టారు. రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించి రైతులకు సక్రమంగా యూరియా అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఐదారు రోజులుగా జిల్లాలో రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుంటే, ఆ తర్వాత డీలర్ల వద్ద కొనుగోలు చేసే వీలుకల్పించారు. అయితే క్షేత్రస్థాయిలో యాప్ను వినియోగించుకోవటం చాలామంది రైతులకు తలనొప్పిగా మారింది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్, మరికొన్ని ప్రాంతాల్లో అవగాహన లేకపోవటంతో రైతులకు ఇబ్బంతులు తప్పడంలేదు. జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్లో రైతులు 23,125 బస్తాల యూరియాను ఇప్పటివరకు బుక్ చేసుకోగా, ఇందులో 15,775 బస్తాలు రైతులకు అందించారు. అవగాహన కల్పించని అధికారులు కొత్త డిజిటల్ విధానంపై కనీస అవగాహన కల్పించకపోవడం, చదువుకోని రైతులు, స్మార్ట్ఫోన్ అలవాటులేని సామాన్య రైతులు యాప్ను ఎలా ఉపయోగించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బుకింగ్ చేసుకోలేని రైతులు సమీపంలోని నెట్ సెంటర్లను, మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. బుకింగ్ చేసినందుకు మీ సేవ నిర్వాహకులు బస్తాకు రూ. 50 వరకు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. అరకొర ఆదాయంతో కాలం వెళ్లదీసే రైతుకు ప్రతీ బస్తా యూరియా కోసం ఇలా అదనపు ఖర్చు చేయడం భారంగా మారింది. అత్యాధునిక ఫోన్లలోనే.. యాప్ పనితీరుపై కూడా రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక 5ఏ మొబైల్స్లో మాత్రమే యాప్ వేగంగా స్పందిస్తోంది. గ్రామీణ రైతుల వద్ద అధికంగా ఉండే సాధారణ 4ఏ ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ పూర్తిగా మొరాయిస్తోంది. పేజీలు లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, తరచూ సర్వర్ సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో ఒక్కో బుకింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవటంతో అక్కడి రైతులు యూరియా బుకింగ్ కోసం సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. దీనివల్ల పొలం పనులు వదులుకుని, ఎరువుల కోసం స్మార్ట్ఫోన్లతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. మరికొందరు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలకు ఫోన్ నంబర్ లింక్ లేకపోవడం శాపంగా మారింది. ఇలాంటి రైతులకు యాప్లో బుకింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మళ్లీ ఏఈఓల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పొలం పనులు జోరుగా సాగే సమయంలో యూరియా కోసం సెల్ఫోన్ పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం. సర్కారు కొత్తగా తెచ్చిన యాప్ మాకేం అర్థం కావడం లేదు. మా దగ్గర ఉండేవి చిన్న ఫోన్లు. అందులో యాప్ అసలు ఓపెన్ కావడమే లేదు. ఎరువుల దుకాణం దగ్గరికి పోతే యాప్లో బుక్ చేసుకోవాలంటున్నారు. మాకు తెలీక నెట్ సెంటర్ల దగ్గరికి వెళ్లి నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా పొద్దున పోతే పొద్దుపోయేదాకా ఆ ఫోన్ల చుట్టే తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. – పోలెబోయిన ముసలయ్య, రైతు, కరకగూడెంగతంలో యూరియా పంపిణీ సమయంలో రైతులతో కిటకిటలాడిన సొసైటీ గోదాంలు, ఫెర్టిలైజర్ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. స్టాక్ అందుబాటులో ఉన్నా యాప్ బుకింగ్ నిబంధన అమల్లో ఉండటంతో రైతులు నేరుగా వెళ్లి తీసుకునే వీలు లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి యాప్ను సామాన్యులకు అర్థమయ్యేలా సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు. తక్కువ నెట్వర్క్ స్పీడ్ ఉన్నా పనిచేసేలా సాంకేతిక మార్పులు చేయాలని, ఫోన్ నంబర్ లింక్ లేని రైతులకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తెల్లంకు ‘హస్తం’ బాధ్యతలు
● భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు ● మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లెందు కోఆర్డినేటర్గా నియమించిన కాంగ్రెస్ ● ఇప్పటికే కొత్తగూడెంలో అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న తెల్లం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న విచిత్రాల్లో ఒకటి జిల్లాలో నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావుకు ఇల్లెందు మున్సిపల్ సమన్వయకర్త బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ గురువారం నియమించారు. అందులో భాగంగా ఇల్లెందు కోఆర్డినేటర్గా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2023లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కారు గుర్తుపై తెల్లం వెంకట్రావు గెలిచారు. ఆ తర్వాత కొంత కాలానికి అభివృద్ధి నినాదం పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ వచ్చారు. దీంతో తెల్లం కాంగ్రెస్లో చేరారంటూ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతోపాటు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తెల్లం కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవని, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ.. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కాగా, బుధవారం పాతకొత్తగూడెం, బూడిదగడ్డ బస్తీల్లో విస్తరించిన పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో తెల్లం పాల్గొనడం చర్చకు దారి తీసింది. అయితే, ఈ ప్రచారంలో తెల్లం కాంగ్రెస్, సీసీఎం కండువాలు కప్పుకోకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం ప్రచారం చేయడమేంటనే చర్చ సమసి పోకముందే, ఏకంగా ఇల్లెందు కోఆర్డినేటర్గా నియమిస్తూ పీసీపీ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు రావడం గమనార్హం. గురువారం పీసీసీ నియమించిన కోఆర్డినేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.ఇల్లెందు తెల్లం వెంకట్రావు అశ్వారావుపేట నాగండ్ల దీపక్ చౌదరి కొత్తగూడెం కార్పొరేషన్ తుళ్లూరి బ్రహ్మయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, జగదీశ్వర్రావు -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి సాధ్యమా ? ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికొత్తగూడెంఅర్బన్/సుజాతనగర్/అశ్వారావుపేట: ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారాపేట మున్సిపాలిటీల్లో రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభ, కార్నర్ మీటింగ్ల్లో మాట్లాడారు. ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను నమ్మొద్దని, మంత్రికి సన్నిహితుడినంటూ వచ్చే వారు ఎవరికీ దగ్గర కాదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సొంత మనుషులమని చెప్పుకునే వారి పట్ల కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారం చేతిలో లేని ప్రత్యర్థులు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలు తన వద్దే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం తనకే ఉందని అన్నారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఎం కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 52 నుంచి 55 డివిజన్లను గెలిచి కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు. అశ్వారావుపేటలో ఇళ్లు లేని నిరుపేదలకు 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరహాలో మున్సిపల్ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ మొదటి విజయం అశ్వారావుపేటలోనే ఉంటుందని అన్నారు. అశ్వారావుపేటకు మున్సిపల్ భవనం మంజూరు చేశామని, దొంతికుంట చెరువు ఆధునీకరణతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సర్వే నంబరు 911లో అర్హులకు పట్టాలిస్తామని, 1228 సర్వే నంబరులోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకుడు కొక్కెరపాటి పుల్లయ్య, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, జేబీ శౌరి, సుందర్రాజు, ఆయా డివిజన్, వార్డు అభ్యర్థులు లింగం పుష్పావతి, మాలోత్ అనిత, బానోత్ కోటేష్, చింతలపూడి శ్రావణి, బాలిశెట్టి సత్యభామ, జూపల్లి రమేష్ బాబు, జూపల్లి శశికళ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 8న వైజాగ్లో..భక్తుల కోరిక మేరకు ఈ నెల 8న వైజాగ్లో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణాన్ని జరపనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వైజాగ్లోని రాజప్పనాయుడు వీధి రామాలయ నిర్వహణ సేవా సంఘం సంప్రదించారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు 7న శోభాయాత్ర, 8న కల్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుస్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.మెరుగైన సేవలు అందించాలిఅశ్వారావుపేటరూరల్: బాధితులకు 108, 102 వాహనాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లాప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ అన్నా రు. గురువారం ఆయన అశ్వారావుపేట ప్రభు త్వ ఏరియా ఆస్పత్రితోపాటు 108, 102 వాహనాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వాహనాల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏ ఎంఈ మనోహర్, పైలెట్లు రామకృష్ణ, కొప్పు ల ధర్మరాజు, ఈఎంటీ సుహాసిని పాల్గొన్నారు. విద్యుత్ ఫెన్సింగ్ ప్రాణాంతకంఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్లకు నేరుగా లేదా అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తెలియక తాకితే ప్రాణాపాయం కలుగుతుందని అన్నారు. పంటల రక్షణకు సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. -
వృత్తి నైపుణ్యాలతో స్వయం ఉపాధి
భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత వృత్తి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని స్వయం ఉపాధి పెంపొందించుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ ప్యూరిఫైర్, డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్లలో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు పీఓను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వైటీసీలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిలో ఉపయోగించి రాణించాలని సూచించారు. ఏకలవ్య దరఖాస్తులకు ప్రత్యేక సెల్ తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తులను స్వీకరించేందుకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ తెలిపారు. గురువారం ప్రవేశ పరీక్షకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో రూ. 100 చెల్లించి ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు డేవిడ్ రాజ్, హరికృష్ణ, శ్రీనివాస్, అరుణ, సులోచన, అబ్దుల్, భవాని, అనూహ్య, వినీత, సమ్మయ్య పాల్గొన్నారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
తునికాకు సేకరణకు సిద్ధం
ఈ ఏడాది లక్ష్యం 36,100 స్టాండర్డ్ బ్యాగ్లు పాల్వంచరూరల్: ఈ ఏడాది జిల్లాలో 35,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఖమ్మం డివిజన్తో కలిపితే ఇది 35,900 స్టాండర్డ్ బ్యాగులుగా ఉంది. పాల్వంచ డివిజన్ పరిధిలో 2300 స్టాండర్డ్ బ్యాగులు, కిన్నెరసాని అభయారణ్యం డివిజన్లో 3,200 స్టాండర్డ్ బ్యాగులు, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 3,900, ఇల్లెందు డివిజన్ పరిధిలో 10,600, భద్రాచలం డివిజన్లో 9,700, మణుగూరు డివిజన్లో 5,400 స్టాండర్డ్ బ్యాగులు, ఖమ్మం డివిజన్లో 800 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించనున్నారు. ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి తునికాకు సేకరణ మొదలుకానుండటంతో అధికారులు టెండర్లు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
ఇదీ మా అజెండా..!
‘బొగ్గు గనుల విస్తరణతో సత్తుపల్లిలో రోజురోజుకు కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ముధూళితో పాటు వాయు, నీటి కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా పట్టణ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు...’ అని పలువురు వెల్లడించారు. ఈ మేరకు మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులు ప్రధానంగా ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యాన సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నీలాద్రి అర్బన్ పార్క్ల్లో ‘సాక్షి’ ఆధ్వర్యాన ప్రజల అజెండాపై బుధవారం డిబేట్ నిర్వహించగా వాకర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులే కాక విద్యార్థులు పాల్గొనగా.. ఎన్నికల సమయాన హామీలకే పరిమితం కాకుండా సింగరేణి కాలుష్య నివారణ చర్యలపై కార్యాచరణ చేపట్టాలని కోరారు. అంతేకాక గెలిచిన కౌన్సిలర్లు అందుబాటులోఉండాలని.. కోతుల, కుక్కల బెడద నుంచి కాపాడాలనే సూచనలు వచ్చాయి. – సత్తుపల్లిటౌన్ పట్టణంలో వీధి కుక్కలతో పాటు కోతుల బెడద తీవ్రంగా ఉంది. వీటి బారి నుంచి ప్రజలను కాపాడాలి. అలాగే, వార్డుల్లో సదుపాయాల కల్పనపై పాలకవర్గం దృష్టి పెట్టాలి. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. – ఎం.గాయత్రి ఎన్నికల్లో గెలిచే కౌన్సిలర్లు స్థానికులకు అందుబాటులో ఉండాలి. సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుంది. పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి, కాలుష్య రహిత వాతావరణం కోసం పాటుపడాలి. – సయ్యద్ సలీం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని నడికుడిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో తెల్లం విద్యాసాగర్(20) మృతి చెందగా మరో బాలుడు మడకం అక్షయ్ గాయపడ్డాడు. ఎస్సై గణేష్ కథనం ప్రకారం.. విద్యాసాగర్, అక్షయ్ నడికుడి నుంచి గంగోలు వస్తుండగా కాళికామాత దేవాలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, అక్షయ్ చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుక్కల బారి నుంచి నక్కకు రక్షణబూర్గంపాడు: మండలంలోని నకిరిపేట గ్రామ పరిధిలో బుధవారం ఓ నక్క పిల్లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నక్క పిల్లను కుక్కలు వెంబడించగా అటుగా వెళ్తున్న బానోత్ రామకృష్ణ గమనించి కుక్కలను తరిమి తీవ్రంగా గాయపడిన నక్క పిల్లను రక్షించాడు. ఆ తర్వాత మోరంపల్లి బంజర్ పశువైద్యశాలకు తరలించగా, నక్క పిల్ల కాలుకు తీవ్ర గాయం కావడంతో దాని పాదాన్ని తొలగించిన వైద్యులు చికిత్స చేసి అటవీ శాఖ బీట్ అధికారులు రాజగోపాల్, నాగరాజుకు అప్పగించారు. ట్రాలీ ఆటో బోల్తా : పది మందికి గాయాలుఎస్ఎస్ తాడ్వాయి: ఓ ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడగా పది మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా చర్లలోని గన్నవరం కాలనీకి చెందిన పలువురు సమ్మక్క – సారలమ్మ దర్శించుకునేందుకు ట్రాలీ ఆటోలో మేడారం బయలుదేరారు. తాడ్వాయి దాటాక మలుపు వద్ద ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని 30 మందిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తాడ్వాయి ఎస్సై జగదీశ్, సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను 108లో తాడ్వాయి పీహెచ్సీకి, అక్కడి నుంచి ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ములుగు ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఆళ్లపల్లిలో డ్రైవర్కు.. గుండాల: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఇచ్చినపల్లి గ్రామానికి చెందిన సూర్య ప్రకాష్ బుధవారం కంకర తోలెందుకు ట్రాక్టర్ తీసుకుని అడవిరామారం వెళ్లాడు. తిరిగి రామానుజగూడెం గ్రామానికి వెళుతుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సూర్యప్రకాష్ ఇంజన్ కింద పడ్డాడు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ట్రాక్టర్ ఇంజన్ను తొలగించి క్షతగాత్రుడిని 108 ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలతోనే..
భద్రాచలం: భద్రాచలం మండల రెవెన్యూ అధికా రుల కనుసన్నల్లోనే ఇసుక, గ్రావెల్, మైనింగ్ అక్ర మ రవాణా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్నే జీవనాధారంగా చేసుకున్న అక్రమార్కులు మండల అఽధికారులను మచ్చిక చేసుకొని ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారు. ఓ అధికారి రోజు, నెలవారీ మామూళ్లతో అక్రమార్కులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి నట్టు సమాచారం. ఈ అండదండలతోనే రాత్రి వేళల్లో ప్రధాన కాలనీల నుంచి ఇసుక రవాణా చేయడమే కాక అక్కడ నిల్వ చేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. రెండు రోజుల కిత్రం పట్టపగలే ఉదయ్ భాస్కర్ రోడ్డులో ప్రదాన రోడ్డుపై లారీ టిప్పర్తో ఇసుక తీసుకెళ్తుండగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీనిపై అధికారులకు ఫిర్యా దు చేసినా ఫలితం లేదు. అయితే ‘వెంకటేశుని’ కరుణా కటాక్షాలు మెండుగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులతోనే బేరసారాలు.. భద్రాచలం రెవెన్యూ కార్యాలయంలో అడుగుపెట్టాలంటేనే దరఖాస్తుదారులు బెంబేలెత్తుతున్నా రు. కల్యాణలక్ష్మి పథకం కోసం కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయామని కొందరు చెబుతున్నారు. అన్ని అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా అప్రూవల్ చేయలేదని బాధితులు వాపోతున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సదరు కార్యాలయ ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగులతోనే బేరసారాలు చేయిస్తున్నట్లు తెలు స్తోంది. అక్కడ పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో పాటు బయట ఓ మధ్యవర్తిని సంప్రదిస్తే ఈ కార్యాలయంలో ఏ పనైనా ఇట్టే పూర్తవుతుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓమరణ ధ్రువీకరణ పత్రం జారీకి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలకు అడ్డగోలు దందాలకు పాల్ప డుతున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే.. రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే భద్రాచలం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పేరుకుపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు కొలువై ఉన్న భద్రాచలం డివిజన్ కేంద్రంలో దరఖాస్తుదారులు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కనీసచర్యలు చేపట్టకపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అవినీ తిని సైతం సదరు మండలస్థాయి అధికారి సమర్ధించుకోవడం విశేషం. భద్రాచలం వచ్చే వీఐపీల ప్రొటోకాల్కు భారీగా ఖర్చవుతుందని, అందుకే కొద్ది మేర తీసుకుంటున్నామని అంతర్గతంగా కొందరితో చెప్పినట్లు తెలిసింది. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో జరగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘పైసలిస్తేనే పత్రాలు’ కథనం తీవ్ర చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో సైతం ఈ క్లిపింగ్ వైరల్ అయింది. మరి కొంతమంది బాధితులు ఫోన్లో తమ గోడు వెల్లబుచ్చారు. అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు..
● పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 57 స్కూళ్లు ఎంపిక ● ప్రాథమికస్థాయి నుంచే సాంకేతికతపై అవగాహన కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పాఠాలు చెబుతున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 57 పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్, ఏఐ పరిజ్ఞానాన్ని అలవాటు చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 963 ప్రాథమిక, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా సుమారు 15 వేల మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులు ఎవరిపై ఆధారపడకుండా.. ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) పథకానికి 28 రకాల సాంకేతిక అంశాలను జోడించారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థులను ప్రారంభ పరీక్ష ఆధారంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. విద్యార్థులు ఎవరిపై ఆధారపడకుండా తమ స్థాయికి తగ్గట్టుగా డిజిటల్ సాధనాల ద్వారా సొంతంగా నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి దశలో కంప్యూటర్లు, ట్యాబులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం కల్పించారు. ఇక చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ ఎంఎల్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వ విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్లు ప్రభుత్వం ఏఐ బోధన ప్రవేశ పెట్టింది. చదువులో వెనుకబడిన పిల్లలు సాధారణ తరగతుల్లో ప్రశ్నలు అడగడానికి ఇబ్బంది పడతారు. కానీ ఎక్స్ప్రెస్ ఎంఎల్ వంటి డిజిటల్ సాధనాలతో వారు భయం లేకుండా వారికి నచ్చిన వేగంతో నేర్చుకుంటున్నారు. –నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏఐ బోధన విద్యార్థులకు భారంగా కాకుండా ఆట పాటల మధ్య సాగుతోంది. గణితంలో ఆరోహణ, అవరోహణ క్రమాలు, పజిల్స్ పూర్తిచేయడం, వినూత్న డిజైన్ల రూపకల్పన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతోంది. ఆంగ్లంలో మిస్సింగ్ లెటర్స్ గుర్తించడం, తెలుగులో పదాల స్పష్టమైన ఉచ్ఛరణ వంటి కృత్యాలను డిజిటల్ పద్ధతిలో నేర్పిస్తున్నారు. -
సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
సూపర్బజార్(కొత్తగూడెం): మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు మార్గదర్శకాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబావ్ పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో కీలకమని, అధికారులు కూడా ఈ మేరకు పని చేయాలని అన్నారు. కులసర్వే నిర్వహణతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాలు వెనుకబడిన వర్గాల వారి ఆత్మగౌరవానికి దోహదం చేస్తాయన్నారు. అనంతరం.. వివక్ష లేకుండా ప్రతీ వ్యక్తిని గౌరవిస్తామని, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడతామని, ఏ రూపంలోనైనా అన్యాయాన్ని సమర్థించబోమని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షిస్తూ, న్యాయమైన, సామరస్యపూర్వకమైన సాధికారత కలిగిన తెలంగాణ రాష్ట్రం, భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అనంత రామకృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, డీసీఓ ఎ. శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత, పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఎస్.త్రినాథ్బాబు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసీ ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 288 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనుండగా ఇందులో 125 సున్నిత కేంద్రాలుగా, 15 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బరిలో ఉండేవారు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాతే ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపరిచేలా నగదు, మద్యం, ఇతర సామగ్రిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, వెంకన్నబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు ప్రతాప్, కరుణాకర్, ఇంద్రాసేనారెడ్డి, సతీష్, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ -
మేయర్, చైర్మన్ రిజర్వ్ స్థానాలపై పార్టీల నజర్
● ఆయా డివిజన్లు, వార్డుల్లో గెలుపునకు ప్రత్యేక వ్యూహం ● అన్ని పార్టీల నుంచి పోటాపోటీ ప్రచారం కొన్నిచోట్ల వ్యూహాత్మకం మేయర్, చైర్మన్ పదవులకు రిజర్వ్ అయిన డివిజన్లు, వార్డుల్లో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ తొమ్మిదో వార్డు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలోని 5వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయినా బీఆర్ఎస్ ఎస్టీ మహిళను బరిలో నిలిపింది. ● ఇల్లెందు : ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 24 వార్డులకు గాను 18 వార్డులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థి మడుగు సాయిసుధ, రెండో వార్డు అభ్యర్థి దొడ్డా కిరణ్మిత్ర, 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కొండపల్లి సరితతో పాటు ఎనిమిదో వార్డు అభ్యర్థి స్వరూప చైర్పర్సన్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్లో 19వ వార్డు నుంచి పింగళి అనూహ్య, 4వ వార్డు నుంచి ఎస్.రాజ వినోద చైర్పర్సన్ రేసులో ఉన్నారు. ● ఏదులాపురం : ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, ఈ కేటగిరీలో 9, 17, 23 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గొడ్డుగొర్ల కృష్ణవేణి, పోకబత్తిని అనిత, కందుకూరి శేషమ్మ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారు. ఇక డిప్యూటీ చైర్మన్ రేసులో 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంమోహన్రెడ్డి, 22 వార్డు అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్లోనూ 9వ వార్డు నుంచి కొట్టె రమాదేవి, 17 నుంచి కర్లపూడి ఇందిర, 23 నుంచి అడ్డాకుల శారద చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ● మధిర : మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ 1, 4, 6, 11, 12, 21వ వార్డులు జనరల్ మహిళకు, 5, 9, 20వ వార్డులు ఎస్సీ మహిళకు, 13, 15వ వార్డులు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యా యి. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ ముఖ్యనేతలు కూడా ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ● వైరా : ఈ మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, 2, 6, 12, 13, 15, 19వ వార్డులు జనరల్ మహిళకు, 17, 18వ వార్డులు బీసీ మహిళకు, 4, 20వ వార్డులు ఎస్సీ మహిళకు కేటాయించారు. చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్లో 3వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి, 6వ వార్డు అభ్యర్థి కాపా చంద్రకళతో పాటు 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంపూడి రాజ్యలక్ష్మి రేసులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఐదో వార్డు అభ్యర్థి కట్టా స్వరూపరాణి చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారు. ● కల్లూరు : ఈ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక్కడ 4, 6, 7వ వార్డులు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఏడో వార్డులో కాంగ్రెస్ నుంచి ధరావత్ మోహన్నాయక్, బీఆర్ఎస్ నుంచి బానోతు కృష్ణ, 4వ వార్డులో కాంగ్రెస్ నుంచి భూక్యా రాంబాయి, బీఆర్ఎస్ నుంచి బానోతు బాలు, 6వ వార్డులో కాంగ్రెస్ నుంచి బానోతు మారోని, బీఆర్ఎస్ నుంచి బానోతు మమత పోటీ పడుతుండగా వీరు చైర్పర్సన్ రేసులో ఉన్నారు. సత్తుపల్లి : ఇక్కడ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలో 2, 3, 22, 6, 11వ వార్డులు జనరల్ మహిళకు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఈ వార్డుల నుంచి ఎంపికై న అభ్యర్థుల్లో ఒకరికి చైర్పర్సన్ పదవి కట్టబెడతారు. దీంతో అభ్యర్థులు గెలిచేలా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఇప్పటివరకు చైర్పర్సన్ పదవిపై ఎవరికీ హామీ ఇవ్వలేదని సమాచారం. అశ్వారావుపేట : ఇక్కడ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ కేటగిరీలో 6, 8 వార్డులు ఉన్నాయి. ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి శశికళ, బీఆర్ఎస్ అభ్యర్థి చిక్కం మాధురిబాయి, 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ రెహానా, బీఆర్ఎస్ నుంచి కాసాని నాగశేష పద్మ బరిలో ఉన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా, ఇక్కడ 9, 23, 31, 34, 52 డివిజన్లు ఎస్టీ మహిళకు, 3, 19, 20, 32, 33, 48 డివిజన్లు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో అభ్యర్థులుగా నిలిచిన వారు గెలిచి మేయర్ రేసులో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ నుంచి మేయర్ పదవిని ఆరో వార్డు అభ్యర్థి బీ.ఎస్.రావు, 19వ వార్డు నుంచి బరిలో ఉన్న స్వప్న ఆశిస్తున్నారు. మరికొందరు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్లో పిచ్చిరెడ్డి, కొత్వాల విమల ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్వాల విమల డీసీఎంఎస్ చైర్మన్ సతీమణి. ఇక సీపీఐ, బీఆర్ఎస్లు మేయర్ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అధిక స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వ్డ్ డివిజన్లలో గెలుపొందిన వారి నుంచి ఒకరిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
●పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేయండి
వైరా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరాలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూటరీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించి ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ గురులింగంతో చర్చించారు. సామగ్రి పంపిణీ, ఆతర్వాత బ్యాలెట్ బాక్సుల భద్రత, లెక్కింపులో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు పాగించాలన్నారు. ఇందుకోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వ్యయ నియంత్రణపై సమీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వ్యయ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన బుధవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఆయా బృందాలు తమ పరిధిలో నిర్వహిస్తున్న తనిఖీలు, చెక్పోస్టుల పనితీరు, పట్టుబడిన కేసులు, నమోదు చేసిన నివేదికల వివరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం లావణ్య మాట్లాడుతూ.. ఎన్నికల వ్యయంపై నిరంతరం నిఘా కొనసాగించాలని, తనిఖీల్లో పట్టుబడిన వివరాలను తక్షణమే సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. బృందాలు సమన్వయంతో సమర్థంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద రవాణా, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. -
సామాజిక న్యాయానికి కృషి
భద్రాచలం: సమ సమాజ స్థాపన, సామాజిక న్యా యం కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంద ని, అందుకు నిబద్ధతతో ఉద్యోగులంతా పనిచేయాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బుధవా రం మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ కులాల సర్వేతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. దేశాభివృద్దిలో పౌరులంతా భాగస్వామ్యం అయ్యే సమ్మిళిత భారతావని కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు. అధికారులు వేణు, మధుకర్, గన్యా, రమేష్, రాంబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. పంట వివరాలు సత్వరమే అందించాలి.. గిరిజన రైతులు సాగుచేసే పంటల వివరాలను సత్వరమే అందించాలని డేవిడ్రాజ్ అన్నారు. బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహావసరాలకు సేంద్రియ ఎరువులతో పండించే ఆహార పదార్థాల వివరాలను మండలాల వారీగా సేకరించాలని, గిరిజన రైతుల వద్ద దొరికే బియ్యం, మక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇతర ఆహార పదార్థాలు, మహిళలు తయా రు చేసే పచ్చళ్లు, ఇప్పపువ్వు లడ్డూలు, కరక్కాయ పౌడర్, కరక్కాయలు, తేనే, కారం, పసుపు, తృణ ధాన్యాలు, ఇతర వస్తువుల వివరాల నివేదిక అందజేయాలన్నారు. భద్రాచలంలో త్వరలో గిరిజన మార్ట్ ఏర్పాటు నేపథ్యంలో ఈ పంటలు దళారుల చెంతకు చేరకుండా నేరుగా మార్ట్కు సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్ -
●మూడు తరాల నేతలు
వైరా: వైరానియోజకవర్గ రాజకీయాల్లో బొర్రా కుటుంబం దశాబ్ద కాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1987లో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొర్రా భద్రయ్య ఎంపీపీగా ఎన్నికై 1993 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత భద్రయ్య కోడలు బొర్రా పద్మావతి 1995లో సోమవరం(వైరా) మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2001 వరకు ఆమె సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2006 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రయ్య కుమారుడు బొర్రా వెంకటేశ్వర్లు పోటీ చేసి విజయం సాధించి 2011 వరకు సర్పంచ్గా కొనసాగారు. ఇక 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బొర్రా వెంకటేశ్వర్లు కోడలు ఉమాదేవి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. ఇలా ఆ కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. అంతేకాక ఉమాదేవి ప్రస్తుతం వైరా మున్సిపాలిటీ మూడోవార్డు నుంచి పోటీ చేస్తూ చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక వెంకటేశ్వర్లు కుమారుడు బొర్రా రాజశేఖర్ 2019లో వైరా పీఏసీఎస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్గా రెండేళ్ల పాటు పనిచేశారు.‘బొర్రా’ కుటుంబంలో ఎంపీపీ, సర్పంచ్లు, జెడ్పీటీసీ -
●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్లకు వందేళ్ల చరిత్ర ఉంది. జిల్లా ప్రజలందరికీ సుపరిచితమైన సూపర్బజార్ సెంటర్ పక్కన చిన్నబజార్, పెద్దబజార్తో పాటుగా నేతాజీ మార్కె ట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లు ప్రస్తుతం 52వ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే ఇల్లెందు, కొత్తగూడెంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైన సమయంలో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసరాలు, ఇతర సరుకుల సరఫరాకు మార్వాడీలు, ఆర్యవైశ్యులు, వారి కుటుంబాలతో సహా కొత్తగూడెం వచ్చి వ్యాపారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత నేతాజీ మార్కెట్, ఆ తర్వాత చిన్నబజార్, పెద్దబజార్ ఏర్పడ్డాయి. కాలక్రమేనా కొత్తగూడెంలో కొంత అభివృద్ధి మొదలైన తర్వాత సూపర్బజార్ సెంటర్ ఏర్పాటైంది. నేతాజీ మార్కెట్, చిన్నబజార్, పెద్దబజార్లకు సమీపంలో ఉన్న మేదరబస్తీ, ప్రగతినగర్ వందేళ్ల క్రితం అటవీ ప్రాంతాలుగా ఉండేవి. అయితే సింగరేణి బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాక కార్మికులు, ఉద్యోగులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. -
రమణీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు దుకాణాల వేలంపాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలోని పలు వ్యాపారాలకు శుక్రవారం వేలం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కాంప్లెక్స్లోని 1, 2, 3, పాత కాంప్లెక్స్లోని 3, 4 నంబర్ల దుకాణాలతో పాటు చీరలు పొగుచేయడం, పూలదండల విక్రయానికి లైసెన్స్ హక్కులు పొందేందుకు టెండర్ కం వేలం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ‘పాలిటెక్నిక్’ ప్రతిభఓవరాల్ చాంపియన్షిప్ కై వసం సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్లో రాష్ట్రంలోని పాత 10 జిల్లాల స్థాయిలో ఈనెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో బాలుర విభాగంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. వివిధ క్రీడా పోటీల్లో గెలిచి విజయ ఢంకా మోగించింది. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్, టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్, డిస్కస్ త్రో విభాగాల్లో ప్రథమ స్థానం సాధించింది. బాలికల టేబుల్ టెన్నిస్తో పాటు, బాలుర 400 మీ.పరుగు పందెంలో తృతీయ స్థానం దక్కింది. బహుమతులు సాధించిన విద్యార్థులతో పాటు పీడీ కృష్ణారావు, ఎలక్ట్రికల్ హెచ్ఓడీ తారాసింగ్, లెక్చరర్లు స్వప్న, కృష్ణ, ధరణి, సిబ్బంది సందీప్, కౌసల్యను ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ బుధవారం అభినందించారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండిహౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ అశ్వాపురం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచాలని హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ అన్నారు. మండల పరిధిలోని అశ్వాపురం, గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామాల్లో బుధవారం ఆయన గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు సజావుగా సాగుతున్నాయా, బిల్లుల చెల్లింపులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. నిర్మాణాలు ఇంకా ప్రారంభించని వారు వెంటనే చేపట్టాలని, మార్చి 31 నాటికి పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈలు ఉదయ్కుమార్, ఉదయ్కిరణ్, సర్పంచ్లు బాణోత్ సదర్లాల్, ఎట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం పంచాల్సిన చోట అంత్యక్రియలా..?
బూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు పల్లె ప్రకృతి వనం స్మశానవాటికగా మారుతుండడం కలకలం రేపుతోంది. గతంలో ఒక వ్యక్తి తన భార్య అంత్యక్రియలు నిర్వహించి అక్కడే సమాధిని నిర్మించగా.. తాజాగా మరొకరు ప్రకృతి వనంలోనే అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. బుధవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మురళి తక్షణమే స్పందించి ప్రకృతి వనాన్ని శుభ్రం చేయించారు. ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన చోట అంత్యక్రియలు నిర్వహించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. -
సేంద్రియ సాగుపై దృష్టి పెట్టండి
చండ్రుగొండ : రసాయన ఎరువుల వాడకం తగ్గించి పంటల్లో సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మండలంలోని గానుగపాడులో బుధవారం ఆయన బయోచార్ తయారీ, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి కట్టెను కాల్చి పశువుల మూత్రంలో కలిపిన పేడను పంటల సేద్యంలో ఎరువుగా ఉపయోగించాలన్నారు. భూమిలో అడుగు లోతు – వెడల్పుతో గుంత తవ్వి పత్తి కట్టెను కాల్చి ఎరువుగా తయారు చేసుకోవాలని, బయోచార్ విధానం అమలులో అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించడంతో పాటు ఏడాదికి మూడు పంటలు సాగు చేయడంతో అధిక ఆదాయం పొందాలని చెప్పారు. పంటలతో పాటు మునగ సాగు, కౌజు పిట్టల పెంపకం ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏఓ వినయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయొద్దుపాల్వంచ: విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయట ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు ఆలోచించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్’ బూట్ క్యాంప్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్ట్లు రూపొందించాలని సూచించారు. అలాంటి ప్రాజెక్ట్లను ఉత్పత్తుల రూపంలోకి తీసుకువచ్చే దిశగా విద్యార్ధులను ప్రొత్సహించేలా ఈ బూట్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి సభ్యులు విభం వ్యాస్, వాద్వానీ ఫౌండేషన్ నిర్వాహకులు శ్యాం, డాక్టర్ హెచ్.శ్రీనివాస్ వరప్రసాద్, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ భరత్ కృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా
కరకగూడెం: గృహ నిర్మాణ అవసరాల కోసం సరసమైన ధరలకే ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా ‘మన ఇసుక వాహనం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పెద్దవాగు ఇసుక రీచ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు త్వరలోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో భాగంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేపడతామని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కాంతయ్య, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ -
ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ఇల్లెందు: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎన్నికల పరిశీలకులు అమయ్కుమార్ సూచించారు. ఇల్లెందు 24 ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంను, జేకే ఏరియా సింగరేణి స్కూల్ గ్రౌండ్ను బుధవారం వారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్, మేనేజర్ అంకుషావళి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, సీఐ టి.సురేష్ పాల్గొన్నారు. -
సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం నియోజకవర్గస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రకాశం స్టేడియంలో మంగళవారం జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ నాగలక్ష్మి, డీవైఎస్ఓ పరంధామరెడ్డి ప్రారంభించారు. మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు నియోజకవర్గస్థాయిలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ క్రీడలను నిర్వహించారు. పోటీల్లో విజేతలను జిల్లాస్థాయి పోటీలకు పంపించనున్నారు. కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం ఎంఈఓలు కృష్ణయ్య, బాలాజీ, లీల, మధురవాణితోపాటు నరేశ్, పులి లక్ష్మయ్య పాల్గొన్నారు. మంత్రి పేరుతో వసూళ్లు? ● విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు ఖమ్మంక్రైం: మంత్రితో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామని చెబుతూ ఓ వ్యక్తి డబ్బు డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమే రకు సీపీ సునీల్దత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా.. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తున్నాయి. మంత్రి పేరిట వసూళ్లకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తీర్థాల జాతరకు విస్తృత ఏర్పాట్లు ● అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంరూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 14నుంచి 18వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. లక్షల్లో భక్తులు హాజరుకానున్న నేపథ్యాన విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడారు. తీర్థాల జాతరకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. అవసరమైన మేర పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. అంతేకాక బస్సుల ఏర్పాటు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, కంట్రోల్ రూం ఏర్పాటుపై సూచనలు చేశారు. కాగా, జాతరలో వసతుల కల్పనకు కేటాయించిన రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈఓ కె.వేణుగోపాల్కు కలెక్టర్ అందజేశారు. ఈసమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, డీపీఓ రాంబాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో రజతం
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని సిటీ స్టైల్ జిమ్కు చెందిన మహంతి వెంకటకృష్ణాజి రజత పతకం సాధించిన్నట్లు జిమ్ కోచ్ జీవీ రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్లో ఈ సీనియర్ క్రీడాకారుడు తన అద్భుత ప్రదర్శనతో రెండోస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణాజిని తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు వి.మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు బోగాల శ్రీనివాస్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, జాయింట్ సెక్రెటరీ శోభన్నాయక్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ శంకర్రావుతోపాటు ‘గ్రీన్ భద్రాద్రి’సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు అభినందించారు. దొంగ సొత్తు కొన్న వ్యక్తికి ఆరు నెలల జైలు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన గురజాపు రవి దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన నేరానికి గాను మంగళవారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వైఎస్ఆర్నగర్కు చెందిన టీచర్ ముత్యాల కల్యాణ్బాబు ఫిర్యాదు మేరకు 2021లో భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రభుత్వం తరఫున ఏపీపీ కె.శ్రీనివాస్ వాదించారు. అక్రమ కలప పట్టివేత.. దుమ్ముగూడెం: మండలంలోని చినకమలాపురం గ్రామంలో భద్రాచలం ఎఫ్డీఓ సుజాత ఆధ్వర్యంలో దుమ్ముగూడెం రేంజర్ కమల సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. కార్పెంటర్ల వద్ద ఉన్న సుమారు రూ.3 లక్షల విలువ గల దుంగలతోపాటు మూడు కోత మిషన్లను స్వాధీనం చేసుకుని భద్రాచలం కార్యాలయానికి తరలించారు. ఎఫ్డీఓ ఆధ్వర్యంలో సుమారు 20 మందికి పైగా సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేపట్టగా భారీగా కలప దుంగలు దొరికాయి. దాడిలో చర్ల సెక్షన్ అధికారి రాజేశ్, దుమ్ముగూడెం, చర్ల బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశువుల రవాణాదారులపై కేసు అశ్వాపురం: మణుగూరు నుంచి వీఎం బంజర్కు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తున్న ఏడు పశువులను సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకొని పాల్వంచ గోశాలకు తరలించారు. మణుగూరుకు చెందిన మహమ్మద్ హైమద్, ఎండీ యాకూబ్పాషా, కల్లూరుకు చెందిన షేక్ అజ్మత్పై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. జాగిలాలతో గంజాయి హాట్స్పాట్ల తనిఖీ కొత్తగూడెంఅర్బన్: ఎస్పీ రోహిత్రాజు ఆదేశాలతో కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్స్టేషన్ పరిధిలోని గంజాయి హాట్స్పాట్లలో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల ఉనికిని కనిపెట్టే జాగిలాలను ఉపయోగించామని త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా, రవాణా చేసినా, సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో త్రీటౌన్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నాటుసారా స్వాధీనం టేకులపల్లి: మండలంలోని కొత్తతండా(జి), బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌతమ్ తెలిపారు. దాడుల్లో సిబ్బంది వెంకటనారాయణ, గురవయ్య, సుమంత్, పార్థసారథి పాల్గొన్నారు. అనారోగ్యంతో శునకం మృతి ● శోకతప్త హృదయంతో దహన సంస్కారాలు టేకులపల్లి: సాటి మనుషులు చనిపోతేనే పట్టించుకోని ఈ కాలంలో పెంపుడు శునకం మృతి చెందితే ఆ కుటుంబం కన్నీరు పెట్టిన ఘటన మండలంలోని ముత్యాలంపాడు క్రాస్రోడ్లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంతోటి నాగేశ్వరరావు – లీలాబాయి దంపతులు ఎనిమిదేళ్లుగా ఓ కుక్కను పెంచుతూ లక్కీ అని పేరు పెట్టారు. ఆ శునకంపై కుటుంబ సభ్యులు అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకున్నారు. ఇటీవల సంక్రాంతి రోజున లక్కీ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన లక్కీ మంగళవారం మృతిచెందింది. లక్కీ మరణం తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లక్కీ మృతదేహాన్ని దాని పిల్లలకు చూపిస్తూ శోకతప్త హృదయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. -
సతీమణి విత్డ్రా
● డీసీసీ మాజీ అధ్యక్షుడి వైరా: వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి చైర్పర్సన్ బరిలో ఉన్నట్లు మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమె 11వ వార్డు నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, మంగళవారం ఆమె నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కొల్లి రమేష్కు బీ ఫాం దక్కింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లకు పైగా పనిచేసిన దుర్గాప్రసాద్ తీసుకున్న నిర్ణయం వెనక ఆంతర్యం తేలాల్సి ఉంది. -
పవర్ సెంటర్గా ‘పేట’ !
అశ్వారావుపేట: అశ్వారావుపేట జమీన్దారీ పాలనలో ఉన్నప్పటి నుంచీ రాజకీయంగా పవర్ సెంటర్గా వెలిగింది. దొరల పాలనలో ఉన్నప్పుడు అశ్వారావుపేట దివాణం పరిధిలో ప్రస్తుత అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, దమ్మపేట మండలాలు ఉండేవి. పాల్వంచ సంస్థానంలో అశ్వారావుపేట జమీన్ ఓ భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం.. స్వపరిపాలలో భాగంగా వేంసూరు నియోజకవర్గంలో అశ్వారావుపేట జమీన్ను కలిపారు. ఆ తర్వాత అదే సత్తుపల్లి నియోజకవర్గంగా మారింది. పాలనా సౌలభ్యం కోసం నాటి ఏపీ ప్రభుత్వం 1959లో ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితులు మరియు జిల్లా పరిషత్’ చట్టం చేస్తూ సుమారు 80 వేల జనాభా, కనీసం 20 గ్రామపంచాయతీలతో ఒక సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారమే ఏర్పాటయ్యే సమితి విధివిధానాలు, పాలనా బాధ్యతలను బల్వంత్రాయ్ మెహతా సంఘం సిఫార్సుల ఆధారంగా 1959 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇలా ఏర్పాటైన అశ్వారావుపేట సమితిలో ప్రస్తుత అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు ఉండేవి. గ్రామపంచాయతీల సర్పంచ్లు సమితి సభ్యులను ఎన్నుకునే వారు. వీరిలో ఒకరిని అధ్యక్షడిగా ఎన్నుకునేవారు. అప్పట్లో గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, రహదారులు అన్నింటినీ సమితి నుంచే పర్యవేక్షించేవారు. పాలనా సౌలభ్యం కోసం అశోక్ మెహతా సంఘం సిఫార్సుల మేరకు 1987లో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను తీసుకురావడంతో సమితులు రద్దయ్యాయి. అశ్వారావుపేట సమితి చివరి అధ్యక్షుడిగా కందిమళ్ల వెంకట్రావు పనిచేశారు. నాడు సమితి.. నేడు మున్సిపాలిటీ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత పెద్ద పదవి మున్సిపల్ పాలకవర్గానిదే. దీంతో అశ్వారావుపేట జమీన్దార్, సమితి కాలంలో ఇక్కడి రాజకీయ నాయకులకు ఉన్న పెత్తనం, పవర్ తిరిగి రానుందని చెప్పొచ్చు. అశ్వారావుపేట దివాణం పాలకులు ఎవరిని సూచిస్తే వారే ఎమ్మెల్యేలుగా పదవులు పొందారంటే అశ్వారావుపేట పవర్ సెంటర్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో చైర్ పర్సన్గా ఎవరు ఎన్నికై నా ఎమ్మెల్యే తర్వాతి ప్రొటోకాల్ లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పీఠం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నిధుల ప్రవాహం పెరగడంతో సమితి తరహాలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంది. -
యాప్తో పారదర్శకంగా ఎరువుల పంపిణీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో యూరియా బుకింగ్ యాప్ను విజయవంతంగా అమలు చేస్తూ రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు యాప్లో నమోదైన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు 5,008 మందికి గాను 5,036 బుకింగ్ల ద్వారా 23,125 యూరియా బస్తాలు బుక్ చేశారని, వాటిలో 15,773 బస్తాలు ఇప్పటికే కొనుగోలు చేశారని తెలిపారు. 46 మంది కౌలు రైతులు 48 బుకింగ్ల ద్వారా 227 బస్తాలు బుక్ చేయగా 172 బస్తాలు కొనుగోలు చేశారని చెప్పారు. జిల్లా మొత్తంగా 5,826 మంది రైతులు 5,859 బుకింగ్లు చేశారని, 27,782 బస్తాల యూరియా బుక్ చేయగా 19,173 బస్తాలు కొనుగోలు చేశారని వివరించారు. ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, అవసరానికి అనుగుణంగా యూరియా పంపిణీ చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ బుకింగ్లు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు అధి కారిక యాప్ ద్వారానే బుక్ చేయాలని, తద్వారా అందరికీ సమాన పంపిణీ, సకాలంలో సరఫరా, పారదర్శకత సాధ్యమవుతాయని అన్నారు. -
పైసలిచ్చి పత్రం తీసుకో..?
భద్రాచలం: భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఇచ్చే ప్రతి సర్టిఫికెట్కు ధరలను నిర్ణయించి, వారి అవసరాల మేరకు పిండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో అత్యధికంగా కులం, కుటుంబం, ఆదాయం, కల్యాణలక్ష్మి, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాల నుంచి తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం దరఖాస్తుదారులు గడువు అనంతరం నేరుగా మీ సేవకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలను నేరుగా తీసుకోవాలి. ఇది ప్రభుత్వం రూపొందించిన నియమావళి. కానీ, క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా జరుగుతోంది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో ఆర్ఐ, తహసీల్దార్లు పరిశీలించి, ఆన్లైన్లో అప్రూవ్ చేయాలి. కానీ, రోజుల తరబడి ఈ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు నేరుగా కార్యాలయంలోనే సంప్రదించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని సర్టిఫికెట్కో రేటును నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘డిజిటల్ కీ’ ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద.. కాగా, తహసీల్దార్ అనుమతితో అప్రూవ్ చేసే డిజిటల్ కీ తహసీల్దార్ వద్దనే నిబంధనల ప్రకారం ఉండాలి. లేదా ఆయన అనుమతి, పర్యవేక్షణతో ప్రభుత్వ ఉద్యోగి ఈ డిజిటల్ కీని ఉపయోగించాలి. ఈ కార్యాలయంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ డిజిటల్ కీని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నత ఉద్యోగి బంధువు అని ప్రచారం సాగుతోంది. ఆయన ద్వారానే ఈ సర్టిఫికెట్లు, ఇతర పథకాల ధ్రువపత్రాలకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సదరు ఉన్నత ఉద్యోగి ఇక్కడ తన వసూళ్లకు అడ్డుగా ఉన్నారనే సాకుతో కొందరిని డిప్యూటేషన్పై పంపించి, తనకు అనుకూలమైన వారిని ఇక్కడికి డిప్యూటేషన్ఫై తీసుకొచ్చి దందాను నిరాటకంగా సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏసీబీని ఆశ్రయించేందుకు సన్నాహాలు కాగా, ఈ అధికారి వసూళ్ల దందాను తట్టుకోలేక దరఖాస్తుదారులు, పథకాల లబ్ధిదారులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేద వర్గాలకు అండగా ఉండి, విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను జారీ చేయాల్సి ఉండి, సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారే వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి ఆర్ఐని అదుపులోకి తీసుకున్న ఘటన సైతం చోటుచేసుకుంది. ఇటీవలికాలంలో ప్రజల్లో చైతన్యం వచ్చి అవినీతి అధికారుల లంచాలకు చెక్ పెట్టేందుకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం వాటి ధరలను నిర్ణయించారని తెలుస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్న మున్నూరుకాపునకు రూ.5 వేలు, లేకపోతే రూ.10 వేలు, కల్యాణలక్ష్మికి రూ.10 వేలు, ఫ్యామిలీ సర్టిఫికెట్కు రూ.5 వేలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు రూ.3 వేలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవికాకుండా అత్యవసరంగా ఉన్నత విద్యకో, ఉద్యోగానికో సర్టిఫికెట్ అవసరమైతే వారి పంట పండినట్లే. అందిన కాడికి దోచుకోవడమే. నా దృష్టికి వస్తే విచారణ చేయిస్తా భద్రాచలం మండల రెవెన్యూ కార్యాలయంలో సర్టి ఫికెట్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. కార్యాలయంలో పారదర్శకంగా ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్నాం. – ధనియాల వెంకటేశ్వర్లు, తహసీల్దార్ -
తల్లిదండ్రుల చెంతకు విద్యార్థి
ఖమ్మంక్రైం: ఓ విద్యార్థి వసతి గృహం నుంచి పారిపోతుండగా, విషయాన్ని గుర్తించిన కానిస్టేబుల్ దంపతులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లిదండ్రులకు అప్పగించారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదివారం వసతిగృహం నుంచి బయటకు వచ్చాడు. ఆపై ఖమ్మం వెళ్తున్న బస్ ఎక్కగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్.కృష్ణారావు భార్య లక్ష్మి బాలుడు ఆందోళనగా ఉండడాన్ని గమనించి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేయగా, ఆయన ఆర్ఐఓ రామోజీ రమేశ్ దృష్టికి, ఆపై గురుకుల ప్రిన్సిపాల్కు వివరించారు. దీంతో ఖమ్మం బస్టాండ్లో దిగాక విద్యార్థి తండ్రి వచ్చే వరకు ఆపి అప్పగించారు. ఈ మేరకు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన లక్ష్మి దంపతులను ఆర్ఐ ఓ రామోజీ రమేశ్ మంగళవారం సన్మానించారు.సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ భార్య -
లండన్ ట్రినిటీ పరీక్షల్లో ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని శ్రుతిలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ 16వ బ్యాచ్ విద్యార్థు లు అంతర్జాతీయ సంగీత పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ ట్రినిటీ కాలేజ్ నిర్వహించిన వెస్ట్రన్ మ్యూజిక్ గ్రేడ్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్రాజు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, డైరెక్టర్ కె.ఏలియా, గౌరవ సలహాదారుడు ఎం.సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి మేడారం జాతర!
ఖమ్మంమయూరిసెంటర్: భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న వనదేవతలు సమ్మక్క – సారలమ్మ తల్లులు ఆర్టీసీకి సైతం వరాలు కురిపించారు! ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క జాతర ఇటీవల ములుగు జిల్లా మేడారంలో జరగగా భక్తులను చేరవేసిన ఆర్టీసీకి గణనీయమైన ఆదాయం సమకూరింది. గత నెల 27 నుండి ఈ నెల 2వ తేదీ వరకు ఖమ్మం రీజియన్ నుంచి మేడారానికి అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. ముందస్తు ప్రణాళికలతో రీజియన్లో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటుచేయగా తల్లుల గద్దెల సమీపానికి బస్సులు వెళ్లడంతో భక్తులు అధికసంఖ్యలో ఆర్టీసీనే ఆశ్రయించారు. దీంతో రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు కాసుల వర్షం కురిసింది. రెండు లక్షల మంది ప్రయాణం మేడారం జాతర కోసం ఖమ్మం రీజియన్ నుంచి 214 బస్సులు కేటాయించారు. ఈ బస్సులు మొత్తం 2,039 ట్రిప్పులు తిరగగా 2,03,863 మంది భక్తులు రాకపోకలు సాగించారు. రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్ను ఏర్పాటుచేసి 24 గంటలు సర్వీసులు నడిపించడం ద్వారా రీజియన్కు ఏకంగా రూ.3,28,39,181 ఆదాయం సమకూరింది. కొత్తగూడెం డిపో రూ.1,07,02,941 ఆదాయంతో మొదటి స్థానాన నిలిచింది. కాగా, రీజియన్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 85 శాతంగా నమోదు కావడం విశేషం.మేడారం జాతరలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సర్వీసులు ఏర్పాటు చేశాం. పాయింట్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులు సమకూర్చాం. భక్తులతో పాటు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా బస్సులు నడపగలిగాం. – ఏ.సరిరామ్, ఖమ్మం రీజినల్ మేనేజర్ -
ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి
ములకలపల్లి/కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేట రూరల్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) వెంకటేశ్వరరావు అన్నారు. ములకలపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట మండలాల్లోని పలు జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ములకలపల్లి కళాశాలలో పరీక్షల నిర్వహణ, ప్రయోగశాలల ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేట మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేశారు. రెండో రోజు ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షకు సాధారణ విభాగానికి సంబంధించి 1,295 మందికి 1,263 మంది, ఒకేషనల్ విభాగంలో 1,386 మందికి 1,207 మంది హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో సాధారణ విభాగంలో 880 మందికి 861 మంది, వృత్తి విద్య కోర్సులో 1,365 మందికి 1,308 మంది హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అన్ని కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు.డీఐఈఓ వెంకటేశ్వరరావు -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామాల నుంచి వచ్చే ఆదివాసీలకు మెరుగైన సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ వైద్యులను ఆదేశించారు. బూర్గంపాడు సీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ గదులతో పాటు ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవన సముదాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మారుమూల ప్రాంతాల మహిళలకు డెలివరీ సమయంలో అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. రూ 2.70 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలను జూన్ వరకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ సైదులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, వైద్యులు అనిత, నిషార్ పాల్గొన్నారు. ఆ తర్వాత మండలంలోని ఉడ్యార్డు గిరిజన ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. తాను అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలను చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో వారిలో మార్పు కనిపించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రీడాకారులకు అభినందన.. భద్రాచలం: జనవరి 7, 8, 9వ తేదీల్లో ఏటూరు నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకున్నారు. దీంతో పీఓ రాహుల్ తన చాంబర్లో క్రీడాకారులు, కోచ్లు, ప్రిన్సిపాళ్లను అభినందించారు. ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించి ఐటీడీఏకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం జోన్ నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొనగా పది క్రీడాంశాలలో పతకాలు సాధించటం గర్వించదగిన విషయమని కొనియాడారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయొద్దు
అశ్వారావుపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన ఎలా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజును అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అప్రమత్తంగా ఉండాలని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని, సమస్యలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అమయ్కుమార్, తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, కళాశాల డీన్ డాక్టర్ హేమంత్కుమార్, ఎంపీడీఓ అప్పారావు, ఎంపీఓ కోటంరెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి. పాటిల్


