breaking news
Bhadradri District News
-
ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి !
పాల్వంచరూరల్: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన ఆదివాసీ బాలికకు కూల్డ్రింక్లో మత్తు కలిపి తాగించి, అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన ట్రాలీ ఆటో డ్రైవర్ను చాతకొండ వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రే ఆర్టీఏ చెక్ పోస్టు, జగన్నాధపురం, పెద్దమ్మగుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. అతడి ద్వారా మరో వ్యక్తి ఆచూకీ కూడా కనుగొన్నారని సమాచారం. కాగా, ఈ విషయమై డీఎస్పీ సతీష్కుమార్ను వివరణ కోరగా.. ఆదివాసీ బాలికకు సంబంధించి కేసును ఇక్కడ నమోదు చేసి ఏపీలోని చింతూరు పోలీసులకు బదలాయించినట్లు తెలిపారు. నిందితులను ఆదుపులోకి తీసుకున్న విషయమై అడగగా అది చింతూరు పోలీసులుకు సంబంధించిందని, ఇక్కడ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్ పరిధి మణుగూరు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ ఎస్.కే.ఎస్.సాహెబ్ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవలే మణుగూరు డిపోకు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు టిమ్ డ్యూటీ వేయగా.. అనారోగ్యం కారణంగా తాను చేయలేనందున, కండక్టర్తో కూడిన డ్యూటీ వేయాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయమై సోమవారం సాహెబ్ ఖమ్మంలో ఆర్ఎం సరిరామ్ను కలిసి తన సమస్యలు విన్నవిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని వచ్చానని చెప్పడంతో అధికారులు నచ్చజెప్పారు. ఆపై బయటకు రాగానే ఆయన ఎలుకల నివారణకు వాడే మాత్రలు మింగడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎం సరిరామ్, ఉద్యోగులు సకాలంలో చికిత్స చేయించడంతో సాహెబ్కు ప్రాణాపాయం తప్పినట్లయింది. చెరువులో మునిగి యువకుడు మృతిదమ్మపేట: కలువ పూల కోసం చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని మందలపల్లి శివారు చింతలకుంట చెరువులోసోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన పచ్చి గోళ్ల ప్రవీణ్(29) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వినాయక చవితి పండుగకు హైదరాబాద్లో కలువ పూలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచి పూలు తీసుకెళ్లి విక్రయించాలని భావించాడు. ఈ క్రమంలో మొండితోక కృష్ణ అనే మిత్రుడితో కలిసి మండలంలోని ముష్టిబండలో ఉండే బంధువుల ఇంటికి ఆదివారం రాత్రి వచ్చాడు. సోమవారం ఉదయం వారిద్దరితో పాటు గ్రామానికి చెందిన చిలకా సత్తిబాబు కలిసి చింతలకుంట చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన ప్రవీణ్ కాళ్లకు పచ్చిరొట్ట చుట్టుకుపోగా నీటిలో పూర్తి గా మునిగి మృతిచెందాడు. కాగా, ప్రవీణ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ..ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి(50) మృతి చెందాడు. వెయిటింగ్ హాల్లో ఆయన మృతదేహాన్ని గుర్తించగా ఆర్కే ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మధిర ప్రభుత్వాస్పత్రికి మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మనసుకు ధ్యానం..
● ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర విద్యావిధానం ● విద్యార్థుల వికాసానికి కొత్త బాటలు ● నిత్యం యోగా, ధ్యానం, కథల పఠనం మేధస్సుకు కథలు!కరకగూడెం: పాఠశాల అంటే కేవలం పుస్తకాలు, పాఠాలు, పరీక్షలు మాత్రమేకాదు. అది మన శరీ రం, మనసు, ఆలోచనలను పెంపొందించే ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఐదు నిమిషాలు యోగా లేదా ధ్యానం, అరగంట సేపు కథలు, పత్రికల పఠనం చేయించాలని ఇటీవల సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఉపాధ్యాయు లు ఈ ఆదేశాలను అమలు చేస్తూ పాఠశాల జీవి తాన్ని మరింత ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా మా ర్చుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి సోపానం.. ప్రతిరోజూ ఐదునిమిషాల పాటు యోగా లేదా ధ్యానం ద్వారా విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యోగా సనాలు విద్యార్థుల శరీర సమతుల్యత, బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శారీరక దృఢత్వాన్ని పెంచి భంగిమ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ధ్యానం, శ్వాస, వ్యాయామాలు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. భావోద్వేగాల నియంత్రణ, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. నైతిక విలువలు, జ్ఞానం ప్రభుత్వం రూపొందించిన అకడమిక్ క్యాలెండర్లో విద్యార్థులు రోజూ అరగంట పాటు కథల పుస్తకాలు, పత్రికలు చదవాలని సూచించారు. కథల పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు నైతిక విలు వలు నేర్చుకుంటారు. ఇవి వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడమే కాక సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడానికి దోహదపడతాయి. పత్రికలు చదవడం వల్ల విద్యార్థులకు వర్తమాన విషయాలపై అవగాహన పెరిగి సాధారణ జ్ఞానాన్ని బలోపేతం చేస్తుంది. భాషా నైపుణ్యాలు, పదజాలం, సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి. విద్యార్థుల్లో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు, వినూత్న భావనలకు దారితీస్తాయి. కట్టుదిట్టమైన అనుసరణ.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన సమయంలో లేదా తరగతి గదుల్లో యోగా, ధ్యానం సెషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే కథల పుస్తకాలు, పత్రికలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి చదివేలా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. -
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
● లక్ష్మీప్రసన్న భర్త, బంధువులపై దాడి ● ఇల్లు, కారూ ధ్వంసం ● కూతురుతో దహనసంస్కారాలు చేయించిన కుల పెద్దలు అశ్వారావుపేట: రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు రింగ్ సెంటర్ నుంచి మృతురాలు నివాసమున్న ఆమె ఆడపడుచు ఇంటివరకు పోగైన సుమారు 200 మంది.. అంబులెన్స్ రాగానే మృతురాలి భర్త నరేష్, ఆయ న బావ దాసరి శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులుఅప్రమత్తమై నరేష్నుఅంబులెన్స్తో సహా స్టేషన్కు తరలించగా.. మరికొందరు ఇంటి వద్ద ఉన్న మృతురాలి ఆడపడుచుపై దాడి చేశారు. నరేష్బావ శ్రీనివాస్ పోలీస్వాహనంలో తలదాచుకు న్నా వాహనం డోర్ పెకిలించి మరీ దాడికి పాల్పడ్డారు. పీఎస్ పక్కనే ధర్నా, దాడి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు, అదే మండలంలోని ఖాన్ఖాన్ పేటకు చెందిన నరేష్బాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అశ్వారావుపేటలోని నరేష్ సోదరి ఇంట్లో ఉంటుండగా లక్ష్మీప్రసన్న రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందింది. అయితే, భర్త, ఆయన కుటుంబసభ్యుల వేధింపులతో పాటు సరిగా భోజనం కూడా పెట్టకపోవడంతో తమ కూతురు చిక్కి శల్యమై మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు మృతదేహాన్ని సోమవారం అశ్వారావుపేటకు తీసుకురాగా, లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ పక్క ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ పింగళి నాగరాజు, ఎస్ఐ యయాతిరాజు, దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. విచారణతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్య కేసుగా మారుస్తామే తప్ప ఫిర్యాదుతో చేయలేమని వివరించారు. దీంతో మృతురాలి తరఫు పెద్దమనుషులు ధర్నాను విరమింపజేయగా లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని ఇంటికి తరలించేసరికి అక్కడ ఇంట్లో వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కుటుంబీకులంతా పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందగా, ఇల్లు, కారుపై రాళ్లు రువ్వారు. తలకొరివి పెట్టిన కుమార్తె ‘అంత్యక్రియలు చేసేందుకు భర్త భయపడుతున్నాడు.. వారి బంధువులను మీరు కొడుతున్నారు.. మృతదేహాన్ని మీరే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారా’ అని సీఐ నాగరాజు ప్రశ్నించగా ‘మృతదేహాన్ని తీసుకెళ్లం.. అంత్యక్రియల్లోనూ పాల్గొనబోం’ అంటూ లక్ష్మీప్రసన్న బంధువులు స్పష్టం చేశారు. చివరకు మున్నూ రు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు, స్థానికులు కొల్లి రవికిరణ్, పమిడి లక్ష్మణరావు జోక్యం చేసుకుని మృతురాలి కూతురు ఇన్మితానాయుడుతో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నాపై అభాండాలు వేస్తున్నారు.. ‘నా భార్య చనిపోవడానికి నేనే కారణమని ఆరోపిస్తున్నారు. నా భార్య మాట్లాడితే నిజాలు చెప్పేది. గతంలో అసలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు వచ్చేవారు కాదు. ఈరోజు వారే లేనిపోని అభాండాలు వేస్తూ తిండి పెట్టకుండా చంపారని చెబుతున్నారు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి..’ అంటూ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అయితే, ఆమె బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్నకు అన్నం పెట్టకుండా మాడ్చారని, చుటుపక్కల వాళ్లు పడేసిన ఎంగిలి ఆకుల్లో ఏరుకుని తినేదంటూ చుట్టుపక్కల వారు చెప్పారని అంటున్నారు. ఆస్తి కోసం చంపేసి, జబ్బు అంటగట్టారని ఆరోపించారు. రెండేళ్లుగా తాము ఇంటికి వస్తే తలుపు తీయకపోగా, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి తాము వస్తే కుక్కలను వదిలేవారని వాపోయారు. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం
కొత్తగూడెంఅర్బన్: వామపక్ష భావాలు కలిగిన సామాజిక కార్యకర్త నామా వెంకటేశ్వరరావు మణుగూరులో ఆదివారం మృతి చెందగా ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు సోమవారం కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతకుముందే మణుగూరులో ఆయన కళ్లను కూడా దానం చేశారు. అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధంటేకులపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రేకుల ఇల్లు దగ్ధమై, సామగ్రి పూర్తిగా కాలిపోయిన ఘటన మండలంలోని పెట్రాంచెలక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం రఘుపతి – భద్రమ్మ దంపతులు, వారి కుమారుడు నవీన్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఇంటి ముందు రేకుల షెడ్డులో ఆదివారం రాత్రి నిద్రించారు. దోమలు అధికం కావడంతో వేరే గదిలోకి వెళ్లి పడుకున్నారు. ఆ తర్వాత రాత్రి సుమారు 2 గంటల సమయంలో రేకుల షెడ్డులో మంటలు చెలరేగగా రఘుపతి, కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పేసరికే పల్సర్ బైక్, మంచాలు, కూలర్, టార్పాలిన్ పట్టాలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారి సౌజన్య ఘటనా స్థలా నికి చేరుకుని పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారు. మొత్తంగా రూ.3లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని, ఏడాది క్రితం కూడా తమ పొలంలో నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇద్దరు ఆర్టిజన్ల కుటుంబాలకు పరిహారంభద్రాచలంఅర్బన్: విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ 2023 ఆగస్టు 25న ప్రమాదవశాత్తు మరణించిన పినపాక ఆర్జిటన్ కొత్తపల్లి రమేష్, దుమ్ముగూడెం ఆర్జిటన్ తాటి కోటేశ్వరరావు కుటుంబాలకు ఎన్పీడీసీఎల్ నుంచి పరిహారం మంజూరైంది. ఈ మేరకు రమేష్ కుటుంబానికి రూ.12,03,500, కోటేశ్వరరావు కుటుంబానికి రూ.14,46,050 పరిహారం చెక్కులను సోమవారం భద్రాచలం డివిజనల్ ఇంజనీర్ కె.జీవన్కుమార్ అందజేశారు. అలాగే, రమేష్ కుటుంబానికి భద్రాచలం డివిజన్ విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. విదు్య్త్ శాఖ ఉద్యోగులు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందానికి అభినందన
ఖమ్మంక్రైం: పాల్వంచ మీదుగా అక్రమంగా తరలిస్తున్న మారణాయుధాలు, ఎండు గంజా యిని ఇటీవల చాకచక్యంగా స్వాధీనం చేసుకు న్న ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు. హైదరాబాద్లో ఆబ్కారీ భవన్లో సోమవారం అభినందించిన ఆయన రూ. 50వేల క్యాష్ రివార్డ్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్ఫోర్స్మెంట్ బృందంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ.గణేష్, ఎకై ్సజ్ అధికారులు, ఉద్యోగులు ఎస్.రమేష్, సీహెచ్.శ్రీహరిరావు, ఎంఏ.కరీం, జి.బాలు, కె.సుధీర్, టి.వెంకట్, హరీష్, వి.హన్మంతరావు, పి.విజయ్, వీరబాబు, ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఇద్దరు మావోయిస్టుల అరెస్టుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కనిపించిన ఇద్దరు మావోయిస్టులను (దంపతులు) కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఎస్పీ రోహిత్రాజు వివరాలు వెల్లడించారు. మావోయిస్టులు ఓయం భూదు, పోడియం రామేలను అరెస్టు చేశామని తెలిపారు. ఓయం భూదు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీసు స్టేషన్ పరిధి తుమ్మినార్ గ్రామానికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించామని చెప్పారు. 2009లో మావోయిస్టు పార్టీలో చేరి 2014లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడని తెలిపారు. 2020లో పోలీసులపై కాల్పులు జరిపి ఎస్ఐ, పీసీలను హతమార్చిన ఘటనలో నిందితుడని వివరించారు. భూదు భార్య పొడియం రామే అలియాస్ శిల్ప 2018లో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా పని చేస్తోందని తెలిపారు. రామే పై దాదాపు 60 కేసులు ఉన్నాయని చెప్పారు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో నిర్బంధం పెరగడంతో వివిధ ప్రాంతాలకు పారిపోతున్నారని, ఈ క్రమంలో వీరిద్దరినీ కొత్తగూడెం బస్టాండ్లో అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కోళ్ల గూటిలోకి తాచుపాము కొత్తగూడెంఅర్బన్: తాచుపాము ఇంట్లోకి దూరడంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ దాన్ని బంధించారు. కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఓ ఇంట్లో కోళ్ల గూటిలోకి సోమవారం ఐదు అడుగులు తాచుపాము చేరింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంతోష్ వెళ్లి దాన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. -
ఏసీబీకి చిక్కిన ఏడీఏ
సూపర్బజార్(కొత్తగూడెం): ఎరువుల దుకాణం యజమాని నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక గ్రామంలో ఎరువుల షాపు యజమాని నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయిస్తున్నాడంటూ ఏడీఏ నరసింహారావు షోకాజ్ నోటీసు ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారమే అమ్ముతున్నానని, షోకాజ్ నోటీసును ఉపసంసరించుకోవాలని దుకాణం యజమాని ఏడీఏను కోరగా రూ.50వేలు లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ శాఖ అధికారుల సూచన మేరకు షాపు యజమాని ఏడీఏ వద్దకు వెళ్లి రూ.50 వేలు ఇవ్వలేనని, కొంత తగ్గించమని కోరగా.. చివరకు రూ.25వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో సోమవారం చుంచుపల్లి మండలం విద్యానగర్లోని తన కార్యాలయంలో ఏడీఏ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
13 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
కొత్తగూడెంటౌన్: సైబర్ మోసాలకు పాల్పడిన టేకులపల్లికి చెందిన 13 మంది యువకులు జైలు పాలయ్యారు. జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వీరిని టేకులపల్లి, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా.. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న బోడ శ్రీధర్కు టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీధర్ మరో 12 మందితో కలిసి సైబర్ మోసాలకు పాల్పడ్డారు. టేకులపల్లి మండలానికి చెందిన పలువురితో నకిలీ పత్రాలు సృష్టించి 60 కరెంట్ అకౌంట్లు తెరిచి ఇతరుల బ్యాంకు ఖాతాలోకి నగదును పంపిస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. టేకులపల్లి మండలానికి చెందిన బోడ శ్రీధర్, బోడ రాజేష్, బోడ రాజన్న, బానోతు జగదీష్, తేజావత్ నరేష్, పోలేపొంగు పవన్ కళ్యాణ్, భూక్యా వీరన్న, జాటోతు నరేష్, బోడ జంపన్న, బోడ రాజారాం, భూక్య ప్రవీణ్కుమార్, మాలోతు ప్రవీణ్, ఉరిమల్ల భరత్కృష్ణ కలిసి సైబర్ మోసాలకు పాల్పడుతూ.. గత ఆరు నెలలుగా మొత్తం రూ.8.5 కోట్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని, అందుకు కారణమైన ఈ 13 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 12 సెల్ఫోన్లు, బ్యాంకు పాస్బుక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఇల్లెందు కోర్టుకు తరలించామని తెలిపారు. సమావేశంలో టేకులపల్లి, సైబర్ క్రైం సీఐలు బి.సత్యనారాయణ, ఎస్ఐ ఎ. రాజేందర్ పాల్గొన్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గతంలో నిర్మించిన పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, పశు వైద్యానికి ఇబ్బందిగా ఉందని, నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు దరఖాస్తు చేయగా పశుసంవర్థక శాఖాధికారికి ఎండార్స్ చేశారు. ● బూర్గంపాడు మండలం చింతకుంటలో 37 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ప్రధాన రహదారి నుంచి గ్రామానికి సరైన రోడ్డు లేదని, తాగునీటి సమస్య ఉందని, చిన్నపిల్లలకు అంగన్వాడీ పాఠశాల లేదని, విద్యుత్ సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు చేసిన దరఖాస్తును తగిన చర్యల నిమిత్తం కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. ● స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ మోదుగు జోగారావు, బహుజన సంఘాల జిల్లా కన్వీనర్ వేల్పుల నరసింహారావు దరఖాస్తు చేశారు. ● రేషన్ డీలర్లకు ఐదు నెలల కమీషన్ అందించాలని, లేదంటే సెప్టెంబర్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్రావు వినతిపత్రం అందించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 30న జిల్లాలో సీఎం పర్యటన ?దామరచర్లలో సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే జారే చండ్రుగొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలోని దామరచర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభాస్ధలిని, చండ్రుగొండలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. సీఎం పర్యటన దాదాపు ఖరారైనట్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈనెల 21న బెండాలపాడులో సీఎం పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారని ముందు ప్రకటించగా ఆ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ కుంగ్ఫూ పోటీల్లో పతకాలుగుండాల/కొత్తగూడెంటౌన్ : హైదరాబాద్లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ కుంగ్ ఫు కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. గుండాలకు చెందిన మంకిడి చరణ్ తేజ్, గుగులోత్ గౌతమ్, సట్టు ఉదయ్కిరణ్ మూడు విభాగల్లో ప్రథమ స్థానం సాధించారు. అండర్–15 విభాగంలో జిల్లాకు చెందిన కె.లిఖిత్చరణ్ కటాస్లో బంగారు పతకం, అండర్–10లో బి. భానుకృష్ణ రజిత పతకం, అండర్–12 బాలికల విభాగంలో ఎ.ఆశ్రిత కటాస్లో బంగారు పతకం, అండర్–10 బాలికల విభాగం కటాస్లో ఎస్.షణ్ముఖశ్రీ కాంస్య పతకం సాధించారు. కాగా, విజేతలను అంతర్జాతీయ కరాటే మాజీ క్రీడాకారుడు పి.కాశీహుస్సేన్, కోచ్ నిహారిక, జిల్లా రెజ్లింగ్ అసోసియోషన్ గౌరవాధ్యక్షుడు నాగ సీతారాములు, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాబీర్పాషా, జిల్లా కుంగ్ఫు కరాటే మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.ఆదినారాయణ తదితరులు అభినందించారు. బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఈ విధులు నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. కాగా, విజయలక్ష్మి గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పని చేయగా, పదోన్నతి లభించింది. -
పోడు విస్తరణను అరికట్టాలి
పాల్వంచరూరల్ : జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొత్తగా పోడుసాగు విస్తరణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ బి.భీమానాయక్ అధికారులను ఆదేశించారు. డీఎఫ్ఓ కిష్టాగౌడ్తో కలిసి సోమవారం ఆయన పాల్వంచ వైల్డ్లైఫ్ డివిజన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ కార్యాలయంలో రూ.6లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేసిన మీటింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో బీట్ల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని, కొత్తగా పోడు సాగు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కొత్తగా పోడు సాగైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని టేకులచెరువు, అంజనాపురం బీట్లలోని ప్లాంటేషన్ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు తదితరులు పాల్గొన్నారు. సీసీఎఫ్ భీమానాయక్ -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధి కారులు కృషిచేయాలని సూచించారు. స్వయం ఉపాధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకుని అర్థికాభివృద్ధి సాధించాలని గిరిజనులను కోరారు. సోలార్ ద్వారా బోరు బావులు తవ్వించాలని, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలని, పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం తదితర సమస్యలపై దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏఓ రాంబాబు, డీడీ మణెమ్మ, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ హరీష్, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఎస్ఓ భాస్కరన్, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, ఏపీఓ వేణు, లింగానాయక్, రాజారావు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు అభినందన.. వివిధ అంశాల్లో రాణిస్తున్న గిరిజన విద్యార్థులను పీఓ రాహుల్ తన చాంబర్లో అభినందించారు. హనుమకొండలో 34వ సౌత్ జోన్ మీట్ రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలానికి చెందిన బట్ట పృథ్విక, జావలిన్త్రోలో ఎస్.కె అమ్రిన్, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చగా వారిని అభినందించారు. వారికి రెండు జతల ట్రాకింగ్ షూస్ అందించారు. అదేవిధంగా చిత్ర కళలో రాణిస్తున్న ఇర్పా స్వాతి పెయింటింగ్లను పరిశీలించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కూరగాయల సాగుతో అదనపు ఆదాయం
కలెక్టర్ జితేష్ వి పాటిల్సుజాతనగర్: కూరగాయల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సుజాతనగర్, కొత్త అంజనాపురం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తున్న కూరగాయల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కనీసం 10 గుంటల స్థలం కలిగిన ప్రతీ మహిళా రైతు కూరగాయల సాగుకు ముందుకు రావాలని అన్నారు. ఇందుకు అవసరమయ్యే జీఐ వైరు, వెదురుగడలు, పాలిథిన్ పేపర్, విత్తనాలు, ఫెన్సింగ్లకు తక్కువ ఖర్చుతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రెండు రోజుల్లో ఇవ్వాలని, ఆ రిపోర్ట్ ఆధారంగా జిల్లాలో 1000 మంది మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిని సందర్శించి ల్యాబ్, మందుల గదిని పరిశీలించారు. మందులు సరిపడా ఉన్నాయా అని వైద్యాధికారి రమేష్ను అడిగి తెలుసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు, వ్యాక్సిన్ల నిల్వలను తనిఖీ చేశారు. ఆ తర్వాత రాఘవాపురం రహదారి పక్కన ఏర్పాటు చేసిన కొర్రమేను చేపల పెంపకం యూనిట్ను పరిశీలించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. అక్కడే కూరగాయల సాగు, కౌజు పిట్టల పెంపకం చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ శౌరభ్శర్మ, ఫాం ఏపీఎం వెంకయ్య, తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, ఎంపీడీఓ బి.భారతి, ఏపీఎం రాంబాబు, ఏఓ జి.నర్మద, సీసీ శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలి..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి వచ్చిందని, నాలుగేళ్లు నిండిన చిన్నారులను బడిలో చేర్పించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పిల్లలకు కావాల్సిన యూనిఫాం, పుస్తకాలు, క్రీడా పరికరాలతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలు ఉండేలా చూడాలని, సెప్టెంబర్ 1 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, అదనపు కలెక్టర విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా పాల్గొన్నారు. -
సమయమే సమస్య!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నా మొన్నటి వరకు దక్షిణ భారతదేశ పారిశ్రామిక అవసరాలకు బొగ్గు సరఫరాలో సింగరేణి సంస్థకు తిరుగులేదు. కానీ ఇప్పుడు కోలిండియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ పోటీ నుంచి గట్టెక్కాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరోదారి లేని పరిస్థితి కనిపిస్తోంది. చేజారిపోతున్న వినియోగదారులు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 80 శాతానికి పైగా బొగ్గు దక్షిణ భారత దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే బొగ్గు లభిస్తుండడం సంస్థకు సంకట పరిస్థితిని తెస్తోంది. ఇప్పటికే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థ సింగరేణితో కోల్ లింకేజీపై పునరాలోచన చేస్తుండగా.. ఇప్పుడు అదే బాటలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏజీ జెన్కోలు నడుస్తున్నాయి. సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గు ధరతో పోల్చితే తక్కువ ధరకే అందిస్తామని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కోలిండియా ఆఫర్ ఇస్తోంది. రవాణా ఖర్చులన్నీ కలిపినా ఒక్కో టన్నుపై సగటున రూ.600 వరకు తక్కువ ధరకు కోలిండియా బొగ్గు అందుబాటులో ఉంటోంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరో మార్గం లేదు. కార్మికుల గైర్హాజరు, ఉద్యోగుల పని గంటల్లో సమానత్వం, భారీ యంత్రాల వినియోగ సమయంలో సమర్థత వంటి విషయాల్లో సంస్థ వెనుకబడిపోతోంది. వారికి ఏడు గంటల పనే.. సింగరేణి సంస్థ పరిధిలో 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో బొగ్గు ఉత్పత్తిలో నేరుగా సంబంధం ఉండే కార్మికులు, ఇతర మైనింగ్ సిబ్బంది, అధికారులకు ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉంది. కానీ కంపెనీ లావాదేవీలు, కార్మికుల సంక్షేమం తదితర కార్యాలయ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇప్పటికీ ఏడు గంటల పని విధానమే అమలవుతోంది. బ్రిటీషర్ల కాలంలో ప్రమాదకరమైన బొగ్గు ఉత్పత్తిలో ఉండే కార్మికులకు ఎక్కువ పని గంటలు ఉండగా, అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండే బ్రిటీష్ వారికి తక్కువ పని గంటలు ఉండేవి. అయితే ఇప్పటికీ ఇదే విధానం అమలు కావడం ఏంటని కార్మికుల నుంచి నిరసనలు వస్తున్నాయి. సంస్థలో అందరికీ ఒకే విధమైన పని గంటల విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఇప్పుడు భారీ యంత్రాలదే కీలక పాత్ర. ఓవర్ బర్డెన్ (మట్టి), బొగ్గు వెలికి తీయడం, భారీ యంత్రాల ద్వారా వెలుపలికి తీసుకురావడం.. ఇలా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే భారీ యంత్రాలు సంస్థ ఆధీనంలో 814 ఉన్నాయి. ఈ యంత్రాలను సగటున రోజుకు 18.20 గంటల పాటు నడిపించాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం ఈ భారీ యంత్రాల వినియోగ సమయం సగటున 7.90 గంటలుగానే ఉంది. అంటే భారీ యంత్రాల గరిష్ట వినియోగ సమయంలో సగం కూడా ఉత్పత్తి కోసం వాడడం లేదు. దీంతో ఈ యంత్రాలపై పెట్టిన పెట్టుబడి, రుణాలకు వడ్డీ, యంత్రాలు నడిపే ఆపరేటర్ల వేతనాలు ఇలా అన్ని రకాలుగా వృథా అవుతోంది. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. యంత్రాలు సంఖ్య పని చేయాల్సిన వినియోగించే గంటలు గంటలు షావెళ్లు 66 19.70 12.70 డంపర్లు 417 18.70 9.40 డోజర్లు 109 16.10 4.80 డెరిల్స్ 48 19.70 6.50 ఇతర యంత్రాలు 174 18.20 7.90 మొత్తం 814 18.20 7.90 సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ కోల్ లింకేజీ (సాలీనా) ఎన్టీపీసీ 38 మి. టన్నులు కర్ణాటక 10 మి. టన్నులు ఏపీ 7 మి. టన్నులు -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్ర కూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన పోట్ల వంశీకృష్ణ రూ.1,00,116 వితరణగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు, వేద పండితులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో వచ్చేనెల 2న వ్యాపార దుకాణాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈనెల 22న నిర్వహించిన వేలానికి పాటదారులు రాకపోవడంతో వాయిదా వేసిన విషయం విదితమే. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో లిఖిత పూర్వకంగా వినతులు అందజేయాలని సూచించారు. కిన్నెరసానికి పోటెత్తిన పర్యాటకులుఒకరోజు ఆదాయం రూ.40,500పాల్వంచరూరల్ : మండలంలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 520 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,350 ఆదాయం లభించగా, 220 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్కు రూ.12,150 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
● విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మార్పులు ● సకల సౌకర్యాలతో సిద్ధమైన ఖమ్మం ఏటీసీ ● ఈనెల 28వరకు ప్రవేశాలకు కౌన్సెలింగ్ఖమ్మం సహకారనగర్: ఐటీఐ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించేలా ప్రభుత్వం, అధికారులు, ఐటీఐ కళాశాల బాధ్యులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా... గత ఏడాది వీటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మార్పు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలోని మూడు కళాశాలలను మోడల్ ఏటీసీగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ జాబితాలో ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంది. ఇక నూతనంగా ప్రభుత్వం తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) విధానా న్ని ప్రవేశపెట్టింది. టీ–గేట్తో ఐటీఐ (ఏటీసీ)లో ప్రాంగణ నియామకాలు పెంచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కృషి చేయనున్నారు. టీ–గేట్తో ఉపాధి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–గేట్తో ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. తెలంగాణ గేట్ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) పథకం ద్వారా జిల్లాలోని పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రధాన పరి శ్రమ లేదా సంస్థ డైరెక్టర్, సీఎండీ స్థాయి అధికారి కమిటీ చైర్మన్గా, కార్మిక విభాగం అధికారి వైస్ చైర్మన్గా, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీ నర్గా ఉంటారు. ఈ కమిటీ జిల్లాలోని పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. ఐటీఐ విద్యార్థులతో భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది. దీనిద్వారా పరి శ్రమల్లో ఖాళీలు భర్తీ కావడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కుతాయి. అలాగే పరిశ్రమల్లో ఖాళీలు భర్తీ చేసినందుకు గాను ఆయా పరిశ్రమలు సీఎస్ఆర్ పథకం కింద ఐటీఐ కళాశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాయి. అలాగే పరిశ్రమల్లో అవసరమైన అర్హతలు కలిగిన ఉద్యోగి ఐటీఐల్లో లేకపోతే.. అలాంటి విభాగాల్లో ప్రత్యేకంగా ఐటీఐ లో శిక్షణ అందించి ఆయా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను ఐటీఐలు తీసుకుంటాయి. దీని ద్వారా ఐటీఐతో విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ టీ–గేట్ పనిచేస్తోంది. నగరంలోని ఏటీసీ కేంద్రంలో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులకు సంబంధించిన సామగ్రి అంతా చేరడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొనసాగుతున్న ప్రవేశాలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడు కోర్సులు ఉండగా... వీటిలో కోర్సు ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటున్నాయి. అన్ని కోర్సులకు సంబంధించి 172 సీట్లకు గాను 166 భర్తీ అయ్యాయి. ఇక ఏటీసీ లో గతఏడాది 172సీట్లకు గాను అన్నీ భర్తీ అయ్యా యి. ఈ విద్యా సంవత్సరంలో 172 సీట్లకు 165 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ రెండో దశ ముగిసింది. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ పేరుతో ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించారు. ఈమేరకు అర్హత కలిగిన అభ్యర్థులు 28వ తేదీ వరకు ప్రతిరోజు 11 గంటల్లోగా ఆన్లైన్లో నమోదు చేసుకొని కళాశాలల్లో దరఖాస్తు ఫారంతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పరిశీలించి ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాలకు ముమ్మర ప్రయత్నాలు ఇటీవల టీ–గేట్ బృందం ప్రవేశాల పెంపు, కావాల్సిన సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఇందులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ఆయా అంశాలను వివరించారు. ఇదిలా ఉండగా కలెక్టర్ అనుదీప్ ఇటీవల ఐటీఐని సందర్శించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్, కేఎంసీల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఐటీఐల్లో ప్రవేశాల పెంపునకు అధికారులతో చర్చించారు.ఐటీఐ విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చదువుతోపాటే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలు చూపించగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీ–గేట్ ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్య, ఉపాధితోపాటు కళాశాలలో అవసరమైన సదుపాయాలు సైతం సమకూరడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. – ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, టీ–గేట్ కన్వీనర్ -
ఈవీ.. రయ్ రయ్!
ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల ద్వారా విద్యుత్శక్తితో నడుస్తాయి. వీటికి ఇంజన్లు ఉండవు. దీంతో వాయుకాలుష్యం చాలా తక్కువ. పర్యావరణ హితంగా ఉంటాయి. వీటిలో ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయని మోటార్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించేందుకు వీలవుతుంది. ఇక వాహనాల నుంచి అతి తక్కువ శబ్దం రావడంతో పాటు ప్రయాణం చాలా మృదువుగా సాగుతుంది. ఈ వాహనాలను చార్జింగ్ చేసేందుకు స్టేషన్ల కొరత ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లోనే చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఈ చార్జింగ్ స్టేషన్లు అసలే లేవు. దీంతో వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇంటివద్దే చార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మధ్య మధ్య చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎక్కువ దూరం ఈ వాహనాలపై ప్రయాణించలేకపోతున్నారు. అయితే రానున్న కాలంలో పలు ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగితే చార్జింగ్ స్టేషన్లు కూడా అనివార్యంగా రానున్నాయి. స్టేషన్లు ఏర్పాటు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాహనాలకు చార్జింగ్ పెట్టాలంటే ఎక్కువ సమయం పడుతోందని యజమానులు చెబుతున్నారు. -
ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతిరామ్ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్కార్డులు, ఆర్టీసీ బస్పాస్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చాలామంది ఉద్యమకారులు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని, వారికి ఇప్పటికై నా సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వందనపు సూర్యప్రకాష్, గెర్షోము, గఫార్, సారయ్య, కనకయ్య, నరేంద్రుల ఉపేందర్రావు, నర్సింహారావు, శేషంరాజు, గౌతం, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో కొట్టుకొచ్చిన గేదె సురక్షితం ● రక్షించిన ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక పోలీసులు భద్రాచలంఅర్బన్: భద్రాచలం నదిలో ఎగువ నుంచి కొట్టుకొస్తున్న ఓ గేదెను ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలిలా.. ఆదివారం గోదావరిలో ఓ గేదె కొట్టుకొస్తుండగా.. గమనించిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అధికారులు వెంటనే లాంచీ ద్వారా వెళ్లి తాళసాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం లీడింగ్ ఫైర్ ఫైటర్ సాధిక్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యాదికారులు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణపై కార్మికుల ఆందోళనసింగరేణి(కొత్తగూడెం): మెడికల్ బోర్డు నిర్వహణపై కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే ఈ బోర్డును రద్దు చేసి మరో బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఏబీకేఎంఎస్ జాతీయ నాయకుడు పి.మాదవనాయక్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని మిలీనియం డీ కాలనీ కార్మిక వాడల్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత నెలాఖరులో నిర్వహించిన రిఫరల్ బోర్డులో 54 మంది హాజరు కాగా అందులో 5గురిని అన్ఫిట్ చేయడంతో సుమారు 9 నెలల పాటు వారు విధులకు వెళ్లలేదన్నారు. గుండె, కిడ్నీ, పెరాలసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎలాంటి ఆధారాలతో ఫిట్ చేశారో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలన్నారు. సర్వీస్ నిబంధనలు లేకుండా అందరినీ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఉపాధ్యక్షులు రాంసింగ్, జీవీ కృష్ణారెడ్డి, మొగిలిపాక రవి, కె.ప్రకాశ్, చంద్రశేఖర్, రేణుక, ఇనపనూరి నాగేశ్వరరరావు, శ్రవన్కుమార్, ధరావత్ నాగేశ్వరరావు, రాజేష్, వడ్డీకాసులు, గోపీకృష్ణ, సుధాకర్, ఎండీ కాలనీ వాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రోటవేటర్ కింద పడి బాలుడి దుర్మరణంకూసుమంచి: మండలంలోని లోక్యాతండా శివారు కొత్తతండాలో రోటవేటర్ కిందపడి ఓ బాలుడు దుర్మ రణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వడిత్యారాంబాబు తనట్రాక్టర్ రోటవేటర్తో దుక్కి దున్నేందుకు వెళ్లాడు. అతడి ఆరేళ్ల కుమారుడు భువనేశ్వర్ను ట్రాక్టర్పై ఎక్కించుకుని దుక్కిదున్నుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. కళ్లముందే కన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడు వద్ద గల ఓ వెంచర్లో గడ్డిమందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసు మంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన అంబాల భాస్కర్ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఖమ్మంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేశాడు. ఆ ఉద్యోగం మానేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న వెంచర్లో గడ్డిమందు తాగాడు. విషయం తెలు సుకున్న బంధువులు ఆయన్ను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. -
● పాల్వంచ పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు ● నిందితులను పట్టుకోవాలని ఎస్పీ ఆదేశం
ఐసీడీఎస్ సంరక్షణలో బాలికకొత్తగూడెంటౌన్: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన బాలిక(17).. రాత్రి 11 గంటల సమయంలో పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని డివైడర్పై బిక్కుబిక్కుమంటూ కూర్చోగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఆలయ వాచ్మెన్ బాలికకు ఆశ్రయం కల్పించాడు. శనివారం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా.. వారు బాలికను కొత్తగూడెంలోని శక్తి సదన్కు తరలించి సంరక్షించారు. ఈ మేరకు సీడీపీఓ లక్ష్మీప్రసన్న ఆదివారం పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. అనంతరం బాలికను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. చింతూరు మండలానికి చెందిన బాలిక ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం కుంటలో బస్సు లేకపోవడంతో ట్రాలీ ఆటో ఎక్కింది. అయితే ట్రాలీలో ఉన్న యువకులు మధ్యలో తనకు కూల్డ్రింక్లో మద్యం కలిపి తాగించారని, ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి పెద్దమ్మగుడి వద్ద ఉన్నానని చెప్పినట్లు ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించామని సీడీపీఓ లక్ష్మీప్రసన్న, బాలల సంక్షేమాధికారి హరికుమారి తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్యుల రిపోర్టు వస్తే కానీ వెల్లడి కాదని చెప్పారు. కాగా, బాధితురాలిపై అమానవీయంగా వ్యవహరించిన ఘటనను ఎస్పీ రోహిత్రాజు తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
జోరుగా వన మహోత్సవం
చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం జిల్లాలో 71.41 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్ నుంచి జిల్లాలో 481 హరిత, మరో 32 అటవీ శాఖ నర్సరీల్లో 20 రకాల మొక్కలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జూలైలో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈసారి కూడా జూలై రెండో వారం నుంచే గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో పలు శాఖలు ముందు వరుసలో నిలవగా, కొన్ని శాఖలు మాత్రమే లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డాయి. ఆగస్టు మొదటి వారం నుంచి వన మహోత్సవం జోరందుకోవడంతో పలు శాఖలు లక్ష్యాలను చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం సైతం తొందరగానే ముగియనుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 80.20 శాతం అంటే.. 57.27 లక్షల మొక్కలు నాటారు. ఇంకా 1,41,4031 మొక్కలు నాటాల్సి ఉంది. లక్ష్యానికి చేరువలో శాఖలు.. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట మున్సిపాలిటీలతో పాటు జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో జూలై నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు పంపిణీ చేసి నాటించే లక్ష్యాలను కేటాయించారు. ఈసారి వన మహోత్సవ లక్ష్యసాధనలో డీఆర్డీఏ, అటవీశాఖ, టీజీఎఫ్డీసీ, ముందువరసలో నిలిచాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 130.27 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. డీఆర్డీఏ శాఖకు 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, 106.86 శాతంతో ఇప్పటి వరకు 32.05 లక్షల మొక్కలు నాటారు. టీజీఎఫ్డీసీ ఆధ్వర్యంలో 12.90 లక్షల మొక్కలకు గాను 78.21 శాతంతో 10.08 లక్షల మొక్కలు నాటారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 37.72 శాతం, మణుగూరులో 22.95 శాతం మాత్రమే మొక్కలు నాటారు. ఇక సింగరేణి సంస్థ తమ పరిధిలోని ఏరియాల్లో 58.35 శాతంతో 1.92 లక్షల మొక్కలు నాటింది. వ్యవసాయ శాఖ సైతం 85.26 శాతంతో 4.26 లక్షల మొక్కలు నాటింది. పాఠశాల విద్యాశాఖ, సంక్షేమ, వైద్యారోగ్య, మార్కెటింగ్, సహకారశాఖ, విద్యుత్ శాఖలు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు నాటిన 57.27 లక్షల మొక్కలకు గానూ 20.44 లక్షల మొక్కలకు అధికారులు జియో టాగింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో ఒక్క డీఆర్డీఏకు చెందిన మొక్కలే అత్యధికంగా 14.32 లక్షల వరకు ఉన్నాయి. వన మహోత్సవంలో నాటుతున్న మొక్కలకు సంరక్షణ చర్యలను అటవీశాఖ చేపడుతోంది. వనమహోత్సవలో భాగంగా ఈ ఏడాది జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జిల్లాలో అన్ని శాఖలు ఉత్సాహంగా ఈసారి వన మహోత్సవంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది నిర్దేశించిన 71.41 లక్షల మొక్కల టార్గెట్లో ఇప్పటివరకు 57.27 లక్షల మొక్కలు నాటారు. భద్రాద్రిని హరిత జిల్లాగా తీర్చిదిద్దడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం. – కిష్టాగౌడ్, డీఎఫ్ఓ -
గోపాల కృష్ణుడి లీలలు అంతా ఇంత కాదయా..
● ఫేక్ అటెండెన్స్లో అందరికీ సుపరిచితుడు ● తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1గా అరెస్టు, రిమాండ్టేకులపల్లి: మండలానికి చెందిన ఓ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు ఫేక్ అటెండెన్స్లో సుపరిచితుడు. తాజాగా అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామానికి చెందిన ఒర్సు గోపాలకృష్ణ 2017లో టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రెండేళ్ల క్రితమే కోయగూడెం పంచాయతీకి బదిలీ అయి డిప్యూటేషన్పై తిరిగి తడికలపూడికి రావడంతో పాటు దాసుతండా పంచాయతీకి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈనెల 18న మండలంలో మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా తడికలపూడి పంచాయతీలో బీటీ రోడ్డు శంకుస్థాపన రోజు కనిపించిన సదరు కార్యదర్శి మరుసటి రోజు నుంచి విధులకు హాజరు కాలేదు. 20న తన పిల్లలకు డెంగీ జ్వరం వచ్చిందని విధులకు రాలేనని అధికారులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం. 22న తడికలపూడి, దాసుతండాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలకూ రాకపోవడంతో సమీప పంచాయతీ కార్యదర్శులతో ఎంకై ్వరీ చేయాల్సి వచ్చింది. కార్యదర్శి లీలలు.. ●జిల్లా వ్యాప్తంగా 42 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెండెన్స్లో దొరికితే.. అందులో సదరు కార్యదర్శి గోపాలకృష్ణ ఏకంగా 21 రోజుల పాటు తన నైపుణ్యం ప్రదర్శించాడు. ●మండలంలో మిషన్ భగీరథతో పాటు రోడ్లు, కాల్వల నిర్మాణాలకు కాంట్రాక్టర్గా చేసినట్లు చర్చ జరుగుతోంది. ●విధుల పట్ల నిర్లక్ష్యం, అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తాడనే ఆరోపణలు కోకొల్లలు. నకిలీ మద్యం దందా.. కార్యదర్శిగా, కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చిన ఆదా యం సరిపోవడం లేదని అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం దందాలో సదరు కార్యదర్శి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం. ఈనెల 21న మహబూబాబాద్జిల్లాలో అక్రమ నకిలీ మద్యం తయా రు చేస్తూ అరెస్టయిన కేసులో సదరు కార్యదర్శి ఏ1గా ఉండడంవిశేషం. ఇదిలా ఉండగా నకిలీ మద్యంకేసులో కార్యదర్శి అరెస్టు, రిమాండ్ ఘ టన పై మండల అధికారులు జిల్లా అధికారులకులేఖద్వారా విషయం తెలియజేసినట్లు సమాచారం. -
‘ఉపాధి’ కౌజులు..!
కొత్తగూడెంఅర్బన్: మహిళ లను ఆర్థికంగా బలో పేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను వివిధ వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహిస్తూ రుణాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ గ్రామపంచాయతీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి దుర్గాంబిక ఎస్హెచ్జీ, అరుణోదయ గ్రామ సమాఖ్య ఆధ్వర్యాన ప్రణజ కౌజు పిట్టల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కౌజుపిట్టల పెంపకం సజావుగా సాగి ఆశించిన విధంగా అమ్మకాలు జరిగితే జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసేలా అధికారులు నిర్ణయించారు. దీంతో అన్ని మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకాలు ప్రారంభించే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి డిమాండ్.. హోటళ్లు, రెస్టారెంట్లలో కౌజుపిట్టల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి పెంపకం, అమ్మకాలు చేయడంతో మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుందని డీఆర్డీఏ, మహిళా సంఘాల అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రయోజనాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండగా.. మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకం జరుగుతున్న నేపథ్యాన హోటళ్లు, రెస్టారెంట్ల వారు కూడా నమ్మకంతో వాటిని కొనుగోలు చేసి ఆహారప్రియులకు అందించే అవకాశం ఉంటుంది. పెంపకం, ఖర్చు ఇలా... పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న శేషగిరినగర్లో గత రెండు రోజుల క్రితం రూ.8వేలతో 600 పిల్లలు కొనుగోలు చేసి పెంపకాన్ని మొదలుపెట్టారు. 25 నుంచి 30 రోజుల్లో ఇవి పెరగనుండగా.. వాటిని అమ్మి వేయొచ్చని, అదే 40 రోజులు అయితే గుడ్లు పెట్టే అవకాశాలుంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా, పెంపకానికి కావాల్సిన షెడ్, అవి తినే ఆహారం, వాటి ఖర్చు మొత్తం కలిపి రూ.60 వేలకు పైన అయ్యిందని, ఇందులో రూ.30 వేల వరకు మహిళా సంఘం నుంచి రాగా, మరో రూ.30 వేలు నిర్వాహకులే భరించినట్లు చెబుతున్నారు. వీటిని ధర జత రూ.200 వరకు పలకనుంది. కౌజు పిట్ట మాంసంలో అధిక ప్రోటీన్లు, తేలికగా జీర్ణమవడం, రక్తహీనత, బలహీనత, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగవడం, కొవ్వు తక్కువ ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పెంచేందుకు అనువైన స్థలాలు ఉండగా.. గాలి, వెలుతురు ఉండే ప్రాంతాలు, డాబాపైన కూడా వీటిని పెంచవచ్చు. వీటికి 30 రోజుల పాటు గోధుమలు, బియ్యం, జొన్న, సజ్జ, మినుములతో కూడిన ఆహారాన్ని అందించి, ప్రతి రోజు అవి పెరిగే పరిసరాలను శుభ్రపరిస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. పిట్టలు చనిపోకుండా సరైన టీకాలు వేయించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. -
బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
కొణిజర్ల: బాలికలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్ది, వారి సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) అరుణకుమారి అన్నారు. మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఆదివారం డిగ్రీ ప్రథమ సంవత్సర బాలికలకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణకుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్లో పట్టు సాధించాలని సూచించారు. బాలికల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతోందని, గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని, భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కె. రజని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు కె.పి. ఐశ్వర్య, ఎ.దీప్తి, ఎన్సీసీ కోఆర్డినేటర్ కె.రజిత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి -
2 కే రన్కు అనూహ్య స్పందన
కొత్తగూడెంటౌన్: మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కొత్తగూడెంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు అనూహ్య స్పందన లభించింది. స్థానిక పోస్టాఫీస్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీవైఎస్ఓ పరంధామరెడ్డి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో క్రీడలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ధ్యాన్చంద్ ప్రతీ క్రీడాకారుడికి ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, కోచ్లు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వరదకు వాన తోడైతేనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణానికి రక్షణ కోసం 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించారు. ఈ క్రమాన పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలిసేలా ఆరు చోట్ల స్లూయీస్ గేట్లు బిగించారు. ఈ గేట్ల సగటు ఎత్తు 38 అడుగులుగా ఉంది. సాధారణ రోజుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలుస్తోంది. కానీ గోదావరి వరద నీటిమట్టం 38 అడుగులకు చేరగానే పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. మురుగు నీరు గోదావరిలో కలవడం మాటేమో కానీ.. వరద నీరే స్లూయీస్ల ద్వారా పట్టణంలోకి చేరుతోంది. దీంతో వరద నీటి మట్టం 35 అడుగులకు చేరగానే మురుగునీరు వెళ్లే స్లూయీస్ గేట్లు మూసేస్తారు. ఆపై మురుగు నీటిని మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తిపోస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇటు వరద, అటు పట్టణంలో వర్షం ఒకేసారి కురిస్తే నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాక మురుగు, వర్షపు నీరు కలిసిన వరద.. కరకట్ట నుంచి వెనక్కి తన్ని ఆలయ పరిసరాలను ముంచెత్తడం సర్వసాధారణంగా మారుతోంది. ఏ ఇబ్బందీ లేకుండా.. సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి స్లూయీస్ గేట్లు మూసేస్తారు. దీంతో సీతారామచంద్రస్వామి కొలువైన భద్రగిరులు, పోకల దమ్మక్క నిత్యాన్నదానసత్రం, విస్తా కాంప్లెక్స్ పరిసరాలు నీటిలో చిక్కుకుపోతాయి. కానీ ఈసారి ఇంచుమించు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరినా ఎక్కడా వరద తాలుకూ ఆనవాళ్లు కనిపించలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఆలయం చుట్టూ రాకపోకలు సాగించగా.. చిరువ్యాపారుల కార్యకలాపాలు సాఫీగా కొనసాగాయి. అయితే, గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద వచ్చినా పట్టణంలో భారీ వర్షం లేకపోవడంతో రోజువారీ డ్రెయినేజీ నీరు ఎత్తిపోతలతో సమస్య రాలేదు. కానీ గడిచిన వారంలో భద్రాచలంలో భారీ వర్షం కురిస్తే ఆలయ పరిసరాల్లో మురుగు ముంపు సమస్య ఎదురయ్యేది. కొత్త డ్రెయినేజీ వ్యవస్థతోనే.. ప్రతీసారి వరద వచ్చినప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదని భావించలేం. అందుకే మురుగు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భద్రాద్రి వాసులు, రాష్ట్ర వ్యాప్తంగా రామయ్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలంలో ఎంత వర్షం పడినా నీరు సాఫీగా పల్లపు ప్రాంతాలకు వెళ్లేలా కొత్త డ్రెయినేజీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటున్నారు. అలాగే, ప్రస్తుతం స్నాన ఘట్టాలకు ఎగువన వంద మీటర్ల లోపే స్లూయీస్ల ద్వారా మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. భద్రాద్రి క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత, ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త డ్రెయినేజీ వ్యవస్థతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. మురుగునీటి శుద్ధితో స్నాన ఘట్టాల వద్ద మురుగునీరు పారకుండా ఉంటుంది.ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలం దగ్గర గోదావరిలో వరద నీటి మట్టం 38.20 అడుగులకు చేరింది. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ 43 అడుగులకు చేరగానే మొదటి, 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక 21న సాయంత్రం 8 గంటలకు 51.90 అడుగుల మేర వరద చేరింది. ఆ సమయంలో 13.66 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వేగంగా దిగువకు ప్రవహిస్తూ వెళ్లింది. ఇంకో 60 వేల క్యూసెక్కుల వరద వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యేది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. కానీ 21వ తేదీ రాత్రి 9గంటల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాకపోగా.. రెండో హెచ్చరిక కూడా ఎత్తేశారు.భద్రాచలానికి ముంపు గోదావరితో కాదు -
కనకగిరి గుట్టలపై కలెక్టర్
చండ్రుగొండ : విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన తనయుడు రాఘవ్ వి పాటిల్తో కలిసి ఆదివారం కనకగిరి గుట్టలు ఎక్కారు. గుట్ట కింద నుంచి ఉదయమే కాలినడక వెళ్లి హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్నారు. అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ప్రవహించే వాగు, చెక్డ్యాం వద్ద తనయుడితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు, అహ్లాదపరిచే ప్రకృతిని కుమారుడికి వివరించారు. వారి వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్, నాయకులు భోజ్యానాయక్, నాగరాజు ఉన్నారు. -
కారు చోరీ కేసులో అరెస్ట్..
మణుగూరుటౌన్: మండలంలోని ఆదర్శ్నగర్లో ఓ వ్యాపారి కారును పార్క్ చేయగా చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తులను మణుగూరు పోలీసులు ఆదివా రం అరెస్ట్ చేశారు. సీఐ నాగబా బు కథనం ప్రకారం.. ఈ నెల 13న మహ్మద్ ఫిరోజ్ తన కారు ను ఆదర్శ్నగర్లో పార్క్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ మేరకు స్టేషన్లో కేసు నమోదు కాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణుగూరు సుందరయ్యనగర్కు చెందిన లారీ మెకానిక్ షేక్ కరంతుల్ల, చెరువు ముందు సింగారానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ నాజీర్లను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కారు చోరీ చేసినట్లు తెలిపి రిమాండ్కు తరలించారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ గుండాల: మండలంలోని మామకన్ను కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆళ్లపల్లి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై సోమేశ్వర్ కథనం ప్రకారం.. ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి పోలారం గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు ఇసుక లోడ్తో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు. -
సాహసోపేత టూరిజంగా ‘రథంగుట్ట’
మణుగూరురూరల్ : మండలంలోని రథంగుట్ట ప్రాంతం సాహసోపేత టూరిజం స్పాట్గా ప్రత్యేకత చాటుకుంటుందని జిప్లైన్ అడ్వెంచర్ ప్రతినిధులు అన్నారు. శనివారం వారు రథంగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని ఆధునిక, సాంకేతిక పరికరాలు, భద్రతా ప్రమాణాలు అమలు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా రథంగుట్ట ప్రాజెక్ట్ను ప్రత్యేక టూరిజం స్పాట్గా రూపకల్పన చేయొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హస్తకళ, చిన్న పరిశ్రమలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యాటకుల కోసం సమాచార, శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రథంగుట్ట పరిసరాలు ప్రకృతి అందాలతో ప్రత్యేక ఆకర్షణగా మారుతాయని, ప్రాంతీయ, రాష్ట్రీయ, దేశీయ పర్యాటకులకు పరిచయం చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మణుగూరు ఎఫ్ఆర్ఓ ఉపేందర్, ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. కిన్నెరసానిలో రోప్ వేకు కసరత్తు.. పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో అద్దాలమేడ నుంచి జలాశయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు రూ.25 లక్షల వ్యయంతో సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే(జిప్ లైన్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పుణె నుంచి నెయిల్ అడ్వెంచర్ పంకజ్ కుమేరియా బృందం శనివారం కిన్నెరసానిలో పర్యటించింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. కేరళ, మయన్మార్, డార్జిలింగ్లో ఎత్తయిన కొండల మధ్య పొడవైన జిప్లైన్లు ఉన్నాయని, కిన్నెరసానిలోనూ జిప్లైన్ రోప్వే ఏర్పాటు చేస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిప్లైన్ ఏర్పాటుకు సంబంధించిన నివేదికను కలెక్టర్ జితేష్ వి పాటిల్కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
●గోదావరి కలుషితం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు కూడలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం తరచూ భద్రాచలం వస్తుంటారు. ఈ క్రమంలో పట్టణంలో ఏర్పడే చెత్తను గత కొన్నేళ్లుగా భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉన్న అనధికారిక డంపింగ్ యార్డులోనే పడేస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం భద్రాచలం గోదావరి నదికి వరద పోటు కారణంగా ఆ చెత్త అంతా కరకట్ట చుట్టూ ఒడ్డుకు చేరుకుంది. పట్టణంలో గల అన్ని కాలనీల్లోని నివాస గృహాల నుంచి వచ్చే చెత్తతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే వేస్టేజీని ఇదే ప్రాంతంలో వేస్తుంటారు. ఇప్పుడు అదే చెత్త గోదావరి నదిలో కలిసి నీరు కలుషితం అవుతోంది. గోదావరి తీరం డంపింగ్ యార్డును తలపిస్తోంది. ఈ సమస్య ప్రతీ సంవత్సరం వచ్చే గోదావరి వరదల సమయంలో ఎదురవుతూనే ఉన్నా.. పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి ఆ ప్రాంతంలో చెత్తను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇటు స్థానికులు, అటు రామయ్య భక్తులు కోరుతున్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేటి నుంచి భాద్రపద మాసోత్సవాలు.. భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి సెప్టెంబర్ 21వరకు భాద్రపద మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ తలుపులు మూసి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుస్తామని, ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. 15వ తేదీన శ్రీ వైష్టవ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలిఐటీడీఏ పీఓ రాహుల్ చర్ల: మహిళలు శ్వశక్తితో ఎదగాలని, ఇందుకోసం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని ఆర్.కొత్తగూడెం పంచాయితీ పరిధి సున్నగుంపులో మహిళలు అటవీ ఉత్పత్తులతో తయారు చేసే తినుబండారాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తున్న మహిళా సంఘాలకు అన్ని విధాలా సహకరిస్తామని, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఐటీసీ మేనేజర్ చంగల్రావు, ప్యాకింగ్, డిజైనింగ్ కో ఆర్డినేటర్ బేగ్, మహిళా సభ్యులు సమ్మక్క, మునెమ్మ, శ్రీదేవి, రమాదేవి, శిరీష, ఈశ్వరి, స్వాతి పాల్గొన్నారు. జ్వరాలు వ్యాప్తి చెందకుండా చూడండి.. ఏజెన్సీలో జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పీఓ రాహుల్ సూచించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రికార్డులన్నీ సక్రమంగా నమోదు చేయాలని, రక్త పరీక్ష శాంపిళ్లను ఎప్పటికప్పుడు టీ హబ్లకు పంపించాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలే గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మణుగూరు టౌన్: మున్సి పాలిటీ పరిధి రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మహిళ విద్యుదాఘాతంతో శనివా రం మృతిచెందింది. మధ్యా హ్న భోజన ప్రైవేట్ వర్కర్గా పనిచేసే భూక్య గౌరీ (56) రోజు మాదిరిగానే మోటార్ స్విచ్ వేస్తుండగా.. విద్యుత్ ప్రసరించి షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో స్థానికులు ఆటోలో 100 పడకల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గౌరి కుటుంబానికి న్యా యం చేయాలనే డిమాండ్తో సీఐటీయూ నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేశ్, యూని యన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తదితరులు ఎంఈఓ, ఎంపీడీఓలతో చర్చించగా.. మృతురాలి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక హెచ్ఎం రూ.లక్ష పరిహారం ఇప్పించారు. నాయకులు బ్రహ్మచారి, గద్దల శ్రీను, ఉప్పుతల నర్సింహారావు, సత్రపల్లి సాంబశివరావు, కాంతారావు, శైలజ, సారిక, పద్మ, భేగం పాల్గొన్నారు. ఆటోలో నుంచి జారిపడి మహిళ.. పాల్వంచరూరల్: ప్రమాదవ శాత్తు ఆటోలో నుంచి జారి పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జగన్నాథపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యనగండ్ల హరీష్ భార్య సునీత(29) శుక్రవారం పాల్వంచ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఈక్రమంలో జగన్నాథపురం గ్రామంలో మూలములుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడగా.. తీవ్రగాయాలు కావడంతో అదే ఆటోలో కొత్తగూడెంకు తరలించారు. పరీక్షించిన వైద్యులు వరంగల్కు రిఫర్ చేయగా.. మార్గం మధ్యలో మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ శనివారం మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
నాటు సారా స్వాధీనం
టేకులపల్లి: అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న నాటు సారాను జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ బృందం స్వాధీనం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసింది. టాస్క్ఫోర్స్ ఎస్ఐ గౌతమ్ కథనం ప్రకారం.. జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం శనివారం మండలంలోని సుక్కాల బోడు, రేగుల తండ, టేకులపల్లి, బొమ్మనపల్లి, సూర్యతండా, చంద్రుతండా గ్రామాల్లో అనుమానిత స్థావరాలు, నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ధారావత్ నాగరాజు, గుగ్గిల రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని, ఎవరైనా విక్రయాలు జరిపితే ఎకై ్సజ్ కానీ పోలీసు శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దాడుల్లో సిబ్బంది రామక్రిష్ణ గౌడ్, వెంకట నారాయణ, సుమంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో గల ఏఎంసీ మార్కెట్లో గుర్తు తెలి య ని మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల రోడ్డులో గల కొత్త మార్కెట్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తుతెలి యని వ్యక్తి ఏఎంసీ మార్కెట్ పరిధిలో గల దుకాణాల వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యాన శనివారం మధ్యాహ్నం మా ర్కెట్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శవాన్ని పరిశీలించి మృతుడి ఒంటిపై నల్లని నిక్కర్, గల్లతో కూడిన తెల్ల ని షర్ట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశా రు. ఆచూకీ తెలిస్తే భద్రాచలం టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
బూర్గంపాడు: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమా అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సారపాకలో శనివారం జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్కార్డులు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. హామీలు అమలు కాకుంటే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుల పిల్లలకు ఉచితంగా ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని, తమపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. సమావేశంలో మలిదశ ఉద్యమకారులు తోడేటి సత్యనారాయణ, పొడియం నరేందర్, బాగి వెంకట్రావు, సోమయ్య, పేరాల శ్రీనివాసరావు, నల్లమోతు సురేష్, దాసరి సాంబయ్య, గుర్రాల సుదర్శన్, కొండగట్టు ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు. -
‘మూణ్నెల్ల’ ముచ్చటేనా?
● గ్యాస్ సబ్సిడీ అందక ‘మహాలక్ష్మి’ వినియోగదారుల ఇక్కట్లు ● రూ.500కు సిలిండర్ ఏమైందంటున్న లబ్ధిదారులు ● మొదటి మూడు నెలల వరకే జమైన రాయితీ పాల్వంచరూరల్: మహాలక్ష్మి లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని గతేడాది ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అంతకుముందే ప్రజాపాలన సభల్లో గ్యాస్ రాయితీ పథకానికి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, అందులో 1,54,633 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 10,276 మంది, అశ్వారావుపేటలో 8,312, ఇల్లెందు మండలంలో 8,662, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 8,164 మంది ఉండగా.. అత్యల్పంగా అళ్లపల్లి మండలంలో 1,344 మంది, గుండాలలో 2,205, కరకగూడెంలో 2,513, అన్నపురెడ్డిపల్లి మండలంలో 3,540 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది మొదటి మూడు నెలల వరకే సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమైందని, ఆ తర్వాత రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.892 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ.21 రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.371 సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. గత ఐదారు నెలలుగా రాష్ట్ర సబ్సిడీ అందడం లేదని, ఎందుకు జమ చేయడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్థిక స్వావలంబన సాధించాలి
దుమ్ముగూడెం/అశ్వాపురం: మహిళలందరూ ఐకమత్యంతో స్వశక్తిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని గిరిజన చిక్కి యూనిట్ను, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలోని సమ్మక్క–సారక్క మహిళా కందిపప్పు ఉత్పత్తి కేంద్రాన్ని ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లీపట్టి, కందిపప్పు తయారీ విధానాలను తెలుసుకుని సరసమైన ధరల కోసం అమ్మకాలు జరిగేలా ఆకర్షణీయమైన డిజైనింగ్, ప్యాకింగ్ చేయించేలా ఐటీసీ ఆధ్వర్యాన కృషి చేస్తామన్నారు. ఏడుగురు గిరిజన మహిళలు రూ.24 లక్షల సబ్సిడీతో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసుకున్న గిరిజన చిక్కి యూనిట్ను రూపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్రావు, ప్యాకింగ్ డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్, రామ్కుమార్, యూనిట్ మహిళలు పాల్గొన్నారు. -
నానో యూరియాతో మెరుగైన ఫలితాలు
ఇల్లెందురూరల్: నానో యూరియా వినియోగంతో రైతులకు మెరుగైన ఫలితాలు అందుతాయని ఏడీఏ లాల్చంద్ అన్నారు. మండలంలోని మాణిక్యారం, కొమరారం గ్రామపంచాయతీల్లో నానో యూరి యా వినియోగం, పిచికారీ పద్ధతిపై రైతులకు శని వారం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. నానో వినియోగం వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. గుళికల రూపంలో ఉండే యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానో యూరియా వినియోగంపై ఎంతో మేలని, దీనిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సతీష్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి..
బూర్గంపాడు: గోదావరి వరదలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంలో గోదావరి వరదల కు దెబ్బతిన్న పంటచేలను సీపీఎంప్రతినిధి బృం దం పరిశీలించి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పత్తి చేలు వరదకు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టంపై నివేదికలను ప్రభుత్వానికి పంపించాలని పంటనష్టపరి హారం అందేలా చేడాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బయ్యా రాము, గుంటక కృష్ణ, ఎస్కె.అబీదా, కనకం వెంకటేశ్వర్లు, కొమర్రాజు సత్యనారాయణ, కమటం మరి యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటి.. వైద్యం అందించి..
ములకలపల్లి: స్థానిక మంగపేట పీహెచ్సీ వైద్య బృందం వాగులు, వంకలు దాటి వలస గొత్తికోయలకు వైద్య సేవలు అందించారు. తిమ్మంపేట సబ్సెంటర్ పరిధిలోని మారుమూల వలస ఆదివాసీ గ్రామాలైన పాలవాగు, కొత్తగుండాలపాడు, పాత గుండాలపాడు, పాలవాగుల్లో స్థానిక వైద్యాధికారి కృష్ణదీపక్రెడ్డి ఆధ్వర్యాన శనివారం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రెండు కి.మీ కాలిబాటన వెళ్లి 90 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 12 మంది జ్వరపీడితులను గుర్తించి మందులు అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి తెలిపారు. సబ్యూనిట్ ఆఫీసర్ జేతూరామ్, ఎంటీఎస్ చైతన్య, హెచ్ఎస్లు శ్రీకృష్ణ, నాగమణి, ఎంఎల్హెచ్పీ స్పందన తదితరులు పాల్గొన్నారు. -
ఏ మలుపు తిరుగునో?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజకీయ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా పేరున్న వెంకట్రావు 2014 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో ఎన్నికలు జరగగా అంతకు కొన్ని నెలల ముందే (ఆగస్టులో) తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే గులాబీ పార్టీ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో ఆ పార్టీ బలపర్చిన సీపీఐ అభ్యర్థి గెలవగా.. అప్పటివరకు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న భద్రాచలం మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో పడింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై తెల్లం వెంకట్రావు విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆఖరి నిమిషంలో పార్టీ మారి ఫాయిదా దక్కించుకున్న రాజకీయ చాణక్యుడిగా పిలిపించుకున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన ఆరు నెలల్లోపే బీఆర్ఎస్ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్యాంప్లో చేరిపోయారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ముందుగా అసెంబ్లీ స్పీకర్ను, ఆ తర్వాత హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. అనేక మలుపుల తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో బీఆర్ఎస్ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణకు రావాల్సిందిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేస్తున్నారు.ఇంకా స్పీకర్ పంపిన లేఖ అందలేదు. లేఖ వచ్చిన తర్వాత అందులో ఉన్న విషయం ఆధారంగా కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ పెద్దలతో సంప్రదించి స్పందిస్తా. అప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా. – తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెబుతూ వచ్చారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే కొనసాగుతారని అంతా అనుకుంటుండగా 2024 ఏప్రిల్ 7న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
ఇల్లెందు: ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో గత ఐదు నెలలుగా పెండింగ్ ఉన్న అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. శనివారం కోర్టును ఆయన సందర్శించగా.. స్థానిక న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డి మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన శాలు వతో సత్కరించారు. అనంతరం న్యాయమూర్తి కోర్డులో రికార్డులను తనిఖీ చేశారు. కాగా, కోర్టులో శౌచాలయాలు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన వినతి పత్రం అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు దంతాల ఆనంద్, పెద్దూరి నర్సయ్య, గోపీనాథ్, నారాయణ, బా లకృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, ఎస్.సత్యనారాయణ, బన్సీలాల్ తదితరులు ఉన్నారు.ఫ్యాక్టరీకి ‘గెలల’ తాకిడి.. దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ట్రాక్టర్లు బారులుదీరాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒక్కసారిగా ఫ్యాక్టరీకి చేరుకోగా.. ప్లాట్ఫాం అంతా గెలలతో నిండిపోయింది. ఈ క్రమంలో గెలలను ప్లాట్ఫాం కింద ఉన్న మరో డంపింగ్ కన్వేయర్ బెల్ట్ వద్ద దిగుమతి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి గెలల తాకిడి పెరగడంతో దిగుమతికి గంటల సమయం పడుతుందని రైతులు చెబు న్నారు. దీనిపై ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ను వివరణ కోరగా.. ఇటీవల కురిసిన వర్షాలతో గెలల కోత ఆపిన రైతులు.. వర్షం తగ్గడంతో గెలల కోత ప్రారంభించడంతో ఫ్యాక్టరీకి తాకిడి పెరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా క్రమ పద్ధతిలో దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. నీటిని త్వరగా ఎత్తిపోయాలిమణుగూరు టౌన్: బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న వర్షపు నీటిని ఉపరితల గనుల నుంచి త్వరితగతిన ఎత్తిపోయాలని డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన తొలుత పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ాధ్యన్ని పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులతో సమాలోచన చేశారు. అనంతరం పీకేఓసీ–4ను సందర్శించి మాట్లాడారు. సమష్టి కృషితో ఉత్పత్తి సాధనకు పనిగంటలు పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎం(ఆర్అండ్డీ) కనకయ్య, జీఎం(ఎక్స్ప్లోరేషన్) శ్రీనివాస్, డీజీఎం(ఎక్స్ప్లోరేషన్) రాజ్కుమార్, డీజీఎం(ఆర్అండ్డీ) శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసచారి, దయాకర్, బైరెడ్డి వెంకటేశ్వర్లు, సేఫ్టీ అధికారి భాస్కర్, శ్రీనివాస్, ఎస్టేట్స్ బాబుల్ రాజ్, ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పత్తి ఎగుమతుల్లో నకిలీ దందా ఖమ్మంవ్యవసాయం/ఖమ్మం క్రైం: పత్తి ఎగుమతుల్లో ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్ పరిధిలోని ఓ వ్యాపారి చేసిన నకిలీ దందా బయటపడింది. దీంతో ఆయనపై మార్కెట్ బాధ్యులు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇత ర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులు మా ర్కెట్ నుంచి పర్మిట్లు పొందాలి. ఆ పర్మిట్ల ఆధారంగా ఎగుమతి చేస్తూ నిర్ణీత రుసుము మార్కెట్కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2023లో ఖమ్మంకు చెందిన మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ యజమాని మన్నెం కృష్ణయ్యకు మా ర్కెట్ నుంచి రశీదు పుస్తకం జారీ చేశారు. ఇందులోని ఓచర్ల ద్వారా పత్తిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేశా డు. ఆంధ్రప్రదేశ్లోని ఓ కంపెనీకి కూడా 1,100 క్వింటాళ్ల పత్తిని ఎగుమతి చేయగా, వారు అనుమానం వచ్చి ఆరా తీయడంతో నకిలీ పర్మిట్గా తేలింది. ఇదికాక పలు ఓచర్లతో నకిలీ పర్మిట్ సృష్టించినట్లు తేలడంతో కృష్ణయ్యపై మార్కెట్ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. ఈ పర్మిట్ల ఆధారంగా సదరు వ్యాపారి మార్కెట్కు రూ.1.50 లక్షల పన్ను చెల్లించాల్సి ఉన్నట్లు తేలగా.. మొత్తం ఎగుమతులను పరిశీలిస్తే ఇది పెరిగే అవకాశముందని సమాచారం. కాగా, చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యాన ఈ విషయం బయటపడడం గమనార్హం. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టరేట్లో శనివారం ఆయన పలు శాఖల సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీల వారు గణేష్ మండపాలను విధిగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. మండపాలకు ఏర్పాటుచేసే విద్యుత్ కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలపై విద్యుత్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, గుర్తించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసేలా చూడాలని, అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలకు ముందుగా రవాణాశాఖ అధికారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలని అన్నారు. ప్రతీ గణేష్ మండపం వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. వీలైనంత వరకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజ్, భద్రాచలం సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీపీఓ చంద్రమౌళి, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.కొత్తగూడెంఅర్బన్: గణపతి నవరాత్రి వేడుకలకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజు పోలీస్ అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు నియమ నిబంధనల గురించి వివరించాలని, శోభాయాత్ర సమయంలో డీజేలు, టపాసుల నిషేధంపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, మల్లయ్యస్వామి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
బురదే మిగిలింది..
బూర్గంపాడు: నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పంటచేలు.. నేడు బురదతో నిండి నిలువునా మాడిపోతున్నాయి. రెండు నెలలు శ్రమించి పెంచుకున్న పంటలను గోదావరి వరదలు ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆగస్టు రెండో వారం వరకు ఓ మోస్తారు వర్షాలతో పడగా.. గోదావరి ప్రవాహం తక్కువగా ఉండడంతో పరీవాహక ప్రాంతాల రైతులు ముందుగానే పంటలు సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరదలు రావడంతో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న మెట్టపంటలు.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, కూరగాయల పంటలు వరదలకు దెబ్బతిన్నాయి. సుమారు 2వేల ఎకరాలలో పత్తి, 4 వేల ఎకరాలలో వరి నీటమునిగాయి. అయితే వరి పంటకు పెద్దగా నష్టం జరగకపోవచ్చని, మెట్ట పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతింటాయని రైతులు పేర్కొంటున్నారు. నీటమునిగిన పత్తి చేలల్లో వరద తగ్గిన తరువాత ఆకులపై బురద చేరి మొక్కల నిలువునా ఎండుతున్నాయి. ఎకరాకు రూ.25వేల ఖర్చు.. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు ఎకరాకు రూ.25వేల వరకు ఖర్చు చేశామని, మరో రూ.15వేలు ఖర్చు చేస్తే పెట్టుబడులు పూర్తవుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే పత్తిచేలు పూత, పిందెలతో పాటుగా కాయలతో ఏపుగా పెరుగుతున్నాయని, వరద పంటను పూర్తిగా తుడిచి పెట్టిందని వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే చేతికందుతున్న బెండ, దోస, బీర, సొర, గోరుచిక్కుడు వంటి కూరగాయల పంటలు వరదలో మునకేసి సుమారు 300 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 3వేల ఎకరాలలో వరిపంట నీటమునగగా.. వరద 24 గంటల్లోనే తగ్గుముఖం పట్టడంతో పెద్దగా నష్టం ఉండదని చర్చసాగుతోంది. మరీ లోతట్టు ప్రాంతాల్లోని వరి పంట మాత్రం వరదకు నేలకొరిగి దెబ్బతింది. మిగతా ప్రాంతాల్లో నీట మునిగిన వరిపైరు వరద తగ్గిన తరువాత తేరుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.. గోదావరి వరదలకు నీటమునిగిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టం అంచనా వేయాల్సి ఉంది. శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారులు నీటి ముంపు తొలగిన చేలను పరిశీలించారు. వరద పూర్తిస్థాయిలో తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంటనష్టం అంచనా వేసి నివేదికలను సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మాదిరిగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.గోదావరి వరదకు నీటమునిగిన పంటలు గోదావరి వరదలకు నాలుగెకరా ల వరి మాగాణి, రెండెకరాల పత్తిచేను నీటమునిగింది. పత్తి చేను పూర్తిగా దెబ్బతింది. వరి మాగాణి ఒకట్రెండు రోజులు గడిస్తేగాని అక్కరకు వస్తుందో రాదో తెలుస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్టులను ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం పరిహారమందించి రైతులను ఆదుకోవాలి. – పాపుకొల్లు సుధాకరరావు, రైతు, నాగినేనిప్రోలు గోదావరి వరద ముంపునకు గురైన పంటలను మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. వరద ముంపు తగ్గాక పొలాల్లో నీటిని తీసివేసి ఆకులపై చేరిన ఒండ్రుమట్టిని స్ప్రేయర్లతో శుభ్రం చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి. – బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు -
ఆదర్శంగా.. అద్భుతంగా..
పరిశీలించిన మంత్రి తుమ్మల మాస్టర్ ప్లాన్ పరిశీలన సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌలిక సదుపాయాలతో భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా అద్భుతంగా ప్లాన్ రూపొందించాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు అసౌకర్యం ఎదురుకాకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు నిర్మించాలని సూచించారు. డిజైన్లను సీఎం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించాక ఆమోదం తీసుకోవాలని తెలిపారు. కాగా, సీఎం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చాక ప్రారంభ వేడుక నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మూడేళ్లలో భవనాలు పూర్తి డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మాస్టర్ప్లాన్ను పరిశీలించడానికి ముందే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్తో మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లో తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రానున్న మూడేళ్లలో యూనివర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. కాగా, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిదని.. ఇది తెలంగాణకే కాక దేశానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లతో నిర్మించాలని సూచించారు. 300 ఎకరాల్లో ఏర్పాటయ్యే యూనివర్సిటీ అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల భవిష్యత్కు బాటలు వేసే అవకా శం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్కు సంబంఽధించిన 380 ఎకరాల స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్లాన్ను రూపొందించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల భవనం, మెడికల్ కాలేజీలను కలుపుతూనే భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా డిజైన్ చేశారు. భద్రాచలం – కొత్తగూడెం ప్రధాన రహదారి నుంచి యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్లగానే తొలుత వచ్చే క్వార్టర్లు, ఉమెన్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ భవనాలను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం శిథిలమైన ఆడిటోరియం, ఆ పరిసరాలను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేసేలా ప్లాన్లో పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న కొత్త బాయ్స్ హాస్టల్ అలాగే కొనసాగనుంది. అయితే 1980వ దశకంలో నిర్మించిన పాత హాస్టల్ వద్దే యూని వర్సిటీ నూతన నిర్మాణాలు చేపడుతారు. ఇక్కడ నాలుగు అకడమిక్ బ్లాక్లు, సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, క్యాంటిన్, లైబ్రరీ భవన నిర్మాణాలను ప్లాన్లో పొందుపరిచారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు పక్కన బాయ్స్ హాస్టళ్లు, డైనింగ్ హాల్, అకడమిక్ భవనాలకు సమీపాన గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. గర్ల్స్ హాస్టల్ భవనాల పక్కన మెడికల్ కాలేజీ ప్రాంగణం ఉంది. ఇక బాయ్స్ హాస్టల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం పార్కింగ్ కోసం కేటాయించి.. భవిష్యత్లో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఉపయోగించనున్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ -
కూనంనేని.. మరోసారి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక ● రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నేతలకు స్థానం సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండో సారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామవరంలో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా శుక్రవారం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈమేరకు కూనంనేని మరోమారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ఐదు దశాబ్ధాలుగా సీపీఐలో కీలపాత్ర పోషిస్తున్నారు. 2005 నుండి 2009 వరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 2023లో ఎన్నికల్లో బరిలోకి దిగిన కూనంనేని గెలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా గత మూడేళ్లలో రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మేడ్చల్, మహబూబాబాద్ తదితర జిల్లాలో భూపోరాటాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూముల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో వామపక్షాల నుంచి ఏకై క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని 2023లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా విజయానికి కృషి చేశారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మౌలానా ఖమ్మం మయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మహమ్మద్ మౌలానా రెండోసారి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మౌలానా ఎన్నికపై పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికవడమే కాక రాష్ట్ర కార్యవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు పలువురికి స్థానం దక్కింది. జిల్లా నుంచి ముగ్గురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పది మంది రాష్ట్ర సమితిలో చోటు దక్కించుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్పాషా, నాయకులు ముత్యాలు విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే, రాష్ట్ర సమితి సభ్యులుగా కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, వై.ఉదయ్భాస్కర్, ఎస్డీ.సలీం, రావులపల్లి రవికుమార్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్ ఎన్నిక కాగా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుంచి మిర్యాల రంగయ్య రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
పినపాక: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో నష్టాలు ఎదురవుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని.. ఇందులో మునగ సాగుతో లాభాలు ఉంటాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని సీతారాంపురంలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ కేంద్రం భవనానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ‘పనుల జాతర’లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, మహిళా సంఘాల సభ్యులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ కోళ్ల ఫారాలు, చేపలు, గేదెల పెంపకం చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తూనే పౌష్టికాహారం అందిస్తున్నందున చిన్నారులను చేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఏడీఏ తాతారావు, పినపాక, మణుగూరు తహసీల్దార్లు గోపాలకృష్ణ, అద్దంకి నరేష్, ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ వినీత తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య మణుగూరు రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మణుగూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతిగృహాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, సామగ్రిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోధించడమే కాక వారి ఆరోగ్యంపైనా ఉపాధ్యాయులు శ్రద్ధ కనబర్చాలన్నారు. వంట విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎంఈఓ స్వర్ణజ్యోతి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిలకడగా గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గురువారం సాయంత్రం వరకు పెరిగినా.. ఆతర్వాత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమాన శుక్రవారం ఉదయం 10గంటలకు వరద 47.50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అలాగే రాత్రి 9–30 గంటలకు 42.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, గోదావరికి బుధవారం రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, ఉపసంహరణ సైతం ఒకేరోజు జరగడం గమనార్హం. ఇక పలుచోట్ల రహదారులపైకి చేరిన గోదావరి వరద తొలగిపోవడంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే, మళ్లీ వరద పెరిగే అవకాశముందని సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ప్రమాద హెచ్చరికలన్నీ ఉపసంహరణ -
అమ్మకు ఆపద ఎదురుకావొద్దని..
● ముంపు ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అప్రమత్తత ● ఏరియా ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు ● ప్రసవం సమయాన ఇక్కట్లు రాకుండా జాగ్రత్తలుకరకగూడెం: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరికి వస్తున్న వరదతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పలు చోట్ల వరదలు, వాగులు పొంగి పొర్లగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యాన ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా ఏరియా ఆస్పత్రులకు తరలించారు. గ్రామగ్రామాన ఆరా భారీ వర్షాలు, వరదల నేపథ్యాన ఏజెన్సీలోని పలు గ్రామాలకు ఏటా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈనేపథ్యాన గర్భిణుల వివరాలను ఇప్పటికే నమోదు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు అందులో ప్రసవానికి సమీపాన ఉన్న వారిని గుర్తించారు. ఒకవేళ గ్రామాలను వరద ముంచెత్తినా, రాకపోకలు నిలిచిపోయినా ఇబ్బంది ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తగా గర్భిణులను సమీపంలోని ఏరియా ఆస్పత్రులకు తరలించారు. జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్సీల పరిధిలో 19 మంది గర్భిణులను భద్రాచలం, మణుగూరు ఏరియా ఆస్పత్రులతో పాటు చర్ల సీహెచ్సీకి తీసుకొచ్చారు. శాశ్వత పరిష్కారం లేదా? వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యులు, ఉద్యోగులు ఏజెన్సీ గ్రామాలపై దృష్టి సారిస్తున్నా చాలాచోట్లకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా నిలుస్తోంది. మట్టి రోడ్లు, బురదమయమైన దారులు, వాగులపై వంతెనలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగానే గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు ఆస్పత్రులకు సకాలంలో చేరుకోలేక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. వలస ఆదివాసీ గ్రామాల నుంచి ఆపదలో ఉన్నవారు, గర్భిణులను డోలీల్లో మోసుకొచ్చే ఘటనలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో గర్భిణులను ముందు జాగ్రత్తగా చర్యగా ఆస్పత్రులకు తీసుకొస్తున్నా శాశ్వత పరిష్కారంపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇకనైనా ఆదివాసీ, మారుమూల గ్రామాలకు రవాణా సాఫీగా జరిగేలా రహదారులు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. వరదలతో ముప్పు ఎదురుకాకుండాప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అత్యవసర పరిస్థితి ఉన్న గర్భిణులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. మిగతా గర్భిణులను సైతం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు నిత్యం పరిశీలిస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్ఓ -
నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి
మణుగూరు టౌన్: ఏరియాలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ లక్ష్యాలను ఏరియా ప్రగతిని వివరించారు. ప్రస్తుత కంపెనీ ముందున్న సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో పాటు సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మిపతిగౌడ్, శ్రీనివాసచారి, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజు తదితరులు ఉన్నారు. -
సరిపడా వైద్యులు లేక..
● ఎంసీహెచ్లో గర్భిణుల, బాలింతల అవస్థలు ● టెక్నీషియన్లు లేక ఎక్స్రే, ఓటీలోనూ ఇబ్బందులు ● బయట నుంచి పెరుగుతున్న రిఫరల్ కేసులతో భారం ● వైద్యులు, టెక్నీషియన్ల సంఖ్య పెరిగితేనే ఫలితంకొత్తగూడెంఅర్బన్: బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఏర్పడిన ఎంసీహెచ్(మతా, శిశు ఆరోగ్య కేంద్రం)లో వైద్యులు, టెక్నీషియన్ల కొరతతో ఆశించిన స్థాయిలో పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందడం లేదు. కొత్తగూడెం పరిధి రామవరంలో ఎంసీహెచ్ ప్రారంభమైన రోజుల్లో జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వచ్చి ప్రసవాలు చేయించుకునే వారు. గత ఏడాది వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం ఎంసీహెచ్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఉన్న కొందరు వైద్యులపై భారం పడుతోంది. ఇతర ఆస్పత్రులకు రిఫర్ ఎంసీహెచ్కు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వస్తుంటారు. వైద్యులు సరిపడా లేక కొంచెం రిస్క్ ఉన్న కేసులను ఇతర జిల్లాలకు రిఫర్ చేస్తుండటంతో పలువురు 108లోనే ప్రసవిస్తున్నారు. ఇంకొందరు సదరు ఆస్పత్రికి చేరుకకునేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఉన్నా వైద్యుల కొరత అనేది విమర్శలకు తావిస్తోంది. కాగా, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు గర్భధారణ సమయంలో పరీక్షలు, ఆరోగ్య సలహాలతో పాటుగా సాధారణ డెలివరీ చేయాలి. పుట్టిన శిశువుల ఆరోగ్య సంరక్షణ, పరీక్షలు, టీకాలు వేయాలి. తల్లి, శిశువులో పోషకాహార లోపాలు నివారించడానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం అందించాలి. డెలివరీ అనంతరం తల్లి, శిశువు ఆరోగ్యంపై పర్యవేక్షణ, తల్లిదండ్రులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి. మాతా, శిశు మరణాల లేకుండా చూడటమే లక్ష్యంగా ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది పనిచేయాలి. కానీ, సాయంత్రం నాలుగు గంటల తరువాత ఆస్పత్రికి వచ్చే పిల్లలకు కూడా సేవలందడం లేదని పలువురు చెబుతున్నారు. తగ్గుతున్న ప్రసవాలు ఎంసీహెచ్లో గైనకాలజీ వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు మొత్తం 18 మంది ఉండాల్సి ఉంది. కానీ, అంతా కలిపి 8 మంది పని చేస్తుండగా, వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు ఉండగా ఐదుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. పిల్లల వైద్యులు 13 మందికిగాను ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు పని చేస్తున్నారు. రేడియాలజిస్ట్లు 10 మందికిగాను ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో డెలివరీలు కేవలం పది మాత్రమే జరుగుతున్నాయి. గతంలో 50వరకు జరిగేవి. ఓపీకి గర్భిణులు 120మంది వస్తుండగా, పిల్లలు 150మంది వరకు వస్తున్నారు. ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది కూడా అరకొరగా ఉండడంతో గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో టెక్నీషియన్లు లేకపోవడంతో వెంటిలేటర్లను విని యోగించడం లేదు. వీటితో పాటుగా ఎక్స్రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు కూడా లేకపోవడంతో ఏదైనా సమస్య వచ్చినప్పడు ఆస్పత్రి లో పని చేస్తే వైద్యులు, సిబ్బంది అవస్థ పడుతున్నా రు. అత్యవసర సమయంలో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి ఉంటుందని, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆస్పత్రికి వచ్చిన వారు వారి అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెం రామవరం ఎంసీహెచ్లో గైనకాలజీ, పిల్లల వైద్యులు తక్కువగా ఉన్నారు. సరిపడా వైద్యుల నియామకం కోసం ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా అర్హత కలిగిన వారు ఎవరూ రావడం లేదు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులపై అధికభారం పడుతున్న విషయం నిజమే. గత జూన్ లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎవరూ రాలేదు. – రాధామోహన్, కొత్తగూడెం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ -
గిరిజన ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్
భద్రాచలం: ఆదివాసీ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ను మరింత మెరుగుపర్చుకోవాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలోశుక్రవారం ఆయన మహిళలు తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపూల లడ్డూలు, సబ్బులు షాంపూలను ఐటీసీ అధికారుల సమక్షాన పరిశీలించి మాట్లాడారు. మహిళలకు ఐటీసీ సహకరిస్తే చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. ఈమేరకు మార్కెటింగ్, స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం దమ్మక్క జాయింట్ లయబిలిటీ గిరిజన మహిళా గ్రూప్ సభ్యులు తయారు చేసిన మోవా సోప్, బ్యాంబో సోప్లను పీఓ ఆవిష్కరించారు. అనంతరం ఉద్దీపకం వర్క్ బుక్–2 ద్వారాబోధనపై అధికారులతో సమీక్షించిన పీఓ పలు సూచనలు చేశారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో డివిజన్ల వారీగా ఉద్దీపకం వర్క్ బుక్పై టీఎల్ఎం మేళా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రిషివర్మ, వెంకన్నబాబును పీఓ అభినందించారు. ఈకార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఐటీసీ మేనేజర్ చంగల్రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, బాలసుబ్రహ్మణ్యం, చందు, వెంకటేశ్వర్లు, అంజయ్య, వాసు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
బోల్తా పడిన బస్సు
దమ్మపేట: అదుపుతప్పిన మినీ బస్సు రోడ్డు పక్కన పొదల్లో బోల్తా పడిన ఘటన మండలంలోని గట్టుగూడెం శివారులో శుక్రవారం తెల్లవారుజాము న చోటుచేసుకుంది. ఏపీలోని వైజాగ్ నుంచి హన్మకొండకు ఓ శుభాకార్యానికి మినీ ప్రైవేట్ బస్సులో 20మంది వెళ్తున్నారు. ఆ బస్సు గట్టుగూడెం శివారుకు చేరుకోగా ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లో బోల్తాపడింది. కాగా బస్సులో ఉన్నవారికి స్వ ల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ సాయికిశోర్రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రు లను 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాఅశ్వారావుపేటరూరల్: జీడి మామిడి కలపతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడిన ఘటన శుక్రవారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. మండలంలోని ఊట్లపల్లి వైపు నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వెళ్తున్న ట్రాక్టర్ స్థానిక సంత మార్కెట్ సమీపంలో రహదారిపై గుంతల కారణంగా అదుపుతప్పి పడిపోయింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న జీడి మామిడి కలప రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత కలపను మరో ట్రాక్టర్లో లోడు చేసి తరలించారు. ఏడుగురు గిరిజన మహిళల అరెస్ట్చర్ల: మండలంలోని మామిడిగూడెం సమీపంలోని అటవీభూముల్లో అధికారులు నాటిన వెదురుమొక్కలను ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు గిరిజ న మహిళలను అరెస్టుచేశారు. దుమ్ముగూడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల కథనం ప్రకారం.. పెదమిడిసిలేరు రిజర్వ్ ఫారెస్ట్లో దేవరాపల్లి బీట్లోని మామిడిగూడెం క్యాంప్ నంబర్ 65 (సీ)లో జూలై నుంచి హరితవనాల పెంపకంలో భాగంగా 50 హెక్టార్లలో సుమారు రూ.10లక్షలు వెచ్చించి వెదురు, టేకు మొక్కలు నాటారు. అయితే వీటితో పాటు మరికొంత విస్తీర్ణంలో నాటేందుకు కూడా సుమారు 3 వేల మొక్కలను ఆ ప్రాంతానికి తరలించారు. కాగా, మామిడిగూడెంనకు చెందిన కొందరు మహిళలు ఈ మొక్కలను ధ్వంసం చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన అటవీశాఖాదికారులు ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
వ్యక్తి ఆత్మహత్య
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని జగదీశ్కాలనీకి చెందిన మణికంఠ శుక్రవారం ఆత్మహత్య చేసున్నాడు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉరివేసుకొని యువకుడు ..కొత్తగూడెంఅర్బన్: వేధింపు లు తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బంగారుచెలక గ్రామపంచాయతీ పరిధి పాత బంగారు చెలక గ్రామానికి చెందిన కోడిరెక్కల సుధీర్ (24)ను వివాహేతర సంబంధం విషయమైన అదే గ్రామానికి చెందిన కొందరు వేధింపులకు ప్పాలడుతున్నారు. మనస్తాపం చెందిన సుధీర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్ ఆధారంగా లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహోపకరణాలు దగ్ధంపాల్వంచరూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు దగ్ధమైన ఘటన పునుకుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పునుకుల గ్రామంలోని వల్లపు శ్యామెయిల్ ఇంట్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. టీవీ, దుస్తులు, వంటసామగ్రి, రూ.45వేల నగదు, ఫ్యాన్లు, వంట సరుకులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూరల్ ఆర్ఐ అనిల్కుమార్ అగ్నిప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. -
చిరు వ్యాపారులను ఆర్థిక బలోపేతం చేయాలి
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని చిరు, వీధి వ్యాపారులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ బి.నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్ సభ్యులు, చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్య పరిచి ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీధి వ్యాపారులను గుర్తించి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒకొక్క సభ్యుడికి రూ.10వేల రూపాయాలను అందించి వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. అదే విధంగా మున్సిపాలిటీను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో సమిష్టిగా కృషి చే ద్దామని కోరారు. కోతులు, కుక్కల సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ పింగళి నాగరాజు రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫీవర్ సర్వే నిర్వహించాలి..
బూర్గంపాడు: గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరపీడితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి సైదులు వైద్యసిబ్బందిని ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని, బూర్గంపాడు సీహెచ్సీని, నాగినేనిప్రోలు హెల్త్ సబ్సెంటర్ను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రజల్లో చైత న్యం తీసుకురావాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైద్యసిబ్బంది, వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, హెల్త్ ఆఫీసర్, లింగనాయక్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ సైదులు -
ఇండోర్లో కేఎంసీ బృందం పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారుల బృందం ఇండోర్లో తమ పర్యటన కొనసాగించారు. ఇండోర్లో గురువారం మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ఆధ్వర్యాన పర్యటించగా.. అక్కడ ఇంటింటా చెత్త సేకరణ, చెత్త వాహనాల ట్రాకింగ్, వ్యర్థాల రీసైక్లింగ్పై ఆరాతీశారు. స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇండోర్లో చెత్త సేకరణకు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను సేకరించే వాహనంలో ఆరు బ్లాక్లు ఉండగా.. మూడు బ్లాక్ల్లో ఎలక్ట్రికల్, మెడికల్ వ్యర్థాలు, శానిటరీ ప్యాడ్లు సేకరిస్తామని, మరో మూడింట్లో తడి, పొడి వేరుగా చేసి సేకరించడం, ఇతర వ్యర్థాలను తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు వివరించారు. అలాగే, వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తామని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు, బయోగ్యాస్ తయారీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ మూడు, నాలుగు డివిజన్లను జోనల్గా ఏర్పాటు చేసి 30 – 40 వాహనాల చెత్త సేకరిస్తూ డివిజన్కు 30 మంది కార్మికులను నియమించినట్లు వెల్లడించారు. చెత్త సేకరణ బాధ్యతను ఎన్జీవోలకు అప్పగించడంతో ప్రతీ ఇంట పక్కాగా చెత్త సేకరణ జరుగుతోందని, వాహనాలను ట్రాకింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇండోర్ అధికారులు తెలిపారు. అలాగే, చెరువులు, కాల్వల ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ పనులను కూడా మేయర్ బృందం పరిశీలించింది. అనంతరం ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్తో భేటీ అయిన ఖమ్మం బృందం పలు అంశాలపై చర్చించారు. ఆదాయ వనరులు, వ్యయాలు, పాలన, పౌర సేవల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను స్వచ్ఛత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ స్టడీ టూర్లో పరిశీలించిన అంశాలను ఇక్కడ అమలుకు అధికారులతో చర్చిస్తామని తెలిపారు.వ్యర్థాల నిర్వహణ, అభివృద్ధి, పౌర సేవలపై పరిశీలన -
కిన్నెరసాని నుంచి నీటి విడుదల
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. కిన్నెరసాని రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, ఎగువ నుంచి 600 క్యూసెక్కుల వరద వస్తుండడంతో శుక్రవారం నీటిమట్టం 404.90 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
మహాధర్నాను జయప్రదం చేయండి
దమ్మపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయు లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ కోరా రు. మండలంలోని నాగుపల్లి పాఠశాలలో శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పీఆర్టీ యూ పోరాడుతోందని తెలిపారు. సీపీఎస్ రద్దుతో పాటు పెండింగ్ బిల్లుల మంజూరు, డీఏ, పీఆర్సీ విడుదల ఇతర సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, జిల్లా, మండల అధ్యక్ష, కార్యదర్శులు టి.నరసయ్య, ప్రభాకర్, పీఎస్ఎస్.ప్రసాద్, ఎ.వెంకటేశ్వ ర్లు, నాయకులు బండి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బజ్జూరి సరళ, జనార్దన్, మస్తాన్అలీ, నాగాచారి తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ -
ఉత్తమ పరిశోధనకు రివార్డులు
కొత్తగూడెంటౌన్: కేసుల పరిశోధనలో ప్రతిభ కనబర్చిన పోలీసు ఉద్యోగులకు ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. క్లూస్ టీం, టాస్క్ఫోర్స్ బృందాలకు చెందిన సీఐలు అశోక్కుమార్, రమాకాంత్, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, రామారావుతో పాటు సిబ్బంది కె.భీష్మారావు, శోభన్బాబు, కరీముద్దీన్, రాజు, జంషీద్, సాయికిరణ్, రవి, విజయ్, రామకృష్ణ, వెంకటనారాయణ, రాంకోటి, బాసిత్ రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. -
హెచ్ఎంలుగా అక్కాచెల్లెళ్లు!
ఖమ్మం సహకారనగర్: ప్రభు త్వ ఉపాధ్యాయుల(ఎస్ఏ)కు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి అక్కాచెల్లెళ్లకు ఒకేసారి పదోన్నతి రావడం విశేషం. అయితే, వీరిద్దరూ ఒకేసారి ఉపాధ్యాయులుగా విధుల్లో చేరడం, ఆపై ఎస్ఏలుగా పదోన్నతి పొందగా ఇప్పుడు ఒకేరోజు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందడంపై పలువురు అభినందించారు. అక్క చావా ఉషారాణి, చెల్లె చావా దుర్గాభవాని 1993 జూన్ 14న ఎస్జీటీలుగా ఖమ్మం అర్బన్ యూపీఎస్, ఖమ్మం జీహెచ్ఎస్ మోమినాన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆతర్వాత స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది ప్రస్తుతం కూసుమంచి మండలం నేలపట్ల, చింతకాని మండలం నేరడ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు శుక్రవారం గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందగా, దుర్గాభవాని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో, నయాబజార్ పాఠశాలలో ఉషారాణిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని ఉపాధ్యాయులు, ఉద్యోగులు అభినందించారు.ఒకేసారి ఇద్దరికి పదోన్నతి -
వైద్యసేవలు మెరుగుపర్చాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మరింతగా మెరుగుపర్చాలని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని, లక్ష్మీపురం ఆరోగ్య ఉపకేంద్రాన్ని, దేవగుంపు గొత్తికోయ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. పీహెచ్సీలు, హెల్త్ సబ్సెంటర్లలో అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్యసేవలు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దేవగుంపులో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా వైద్యసేవలు అందించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యారోగ్యశాఖకు పటిష్టమైన వ్యవస్థ ఉందన్నారు. సీజనల్ వ్యాధులు గుర్తించడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు స్పందన, లక్ష్మీసాహితి, లలిత తదితరులు పాల్గొన్నారు.అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ -
మూడేళ్లయినా ముడిపడలే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరికి వచ్చే వరదలను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత అతిపెద్ద వరద 1986లో నమోదైంది. అప్పుడు 27 లక్షల క్యూసెక్కుల నీరు రాగా భద్రాచలం వద్ద 75.60 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించింది. ఆ తర్వాత అదే స్థాయి వరద 2022లోనూ వచ్చింది. గోదావరి ఎగువ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో 71.30 అడుగుల ఎత్తులో 24.43 లక్షల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం వచ్చింది. 2022 జూలై 10 నుంచి 16 వరకు దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జూలై 17న అప్పటి సీఎం కేసీఆర్ పర్యటించారు. భవిష్యత్లో మంపు సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు గత ప్రభుత్వ హామీలు కానీ, ప్రస్తుత సర్కారు చేసిన వాగ్దానాలు కానీ అమలుకు నోచుకోలేదు. కాంటూర్ లెక్కలేవి..? 1986 వరదలతో పోల్చితే 2022లో వచ్చిన వరద తీవ్రత తక్కువ. పైగా భద్రాచలం పట్టణానికి ఏడు కి.మీ. పొడవున కరకట్ట రక్షణ కూడా ఉంది. అయినప్పటికీ పట్టణంలో సగం ప్రాంతం ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోగా వాటి సమీప కాలనీల్లోని ఇళ్లలో వెంటిలేటర్ల వరకు వరద నీరు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి వరద ప్రవాహ తీరులో ఏమైనా మార్పులు వచ్చాయా అని తెలుసుకునేందుకు కాంటూర్ లెవెల్స్ను మరోసారి లెక్కించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో అది ఆచరణకు నోచుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరిలో కాంటూర్ లెవల్స్, పోలవరం ముంపు ప్రభావాన్ని అధ్యయనం చేసే బాధ్యతను సీఎం రేవంత్రెడ్డి ఐఐటీ – హైదరాబాద్కు అప్పగించారు. ఫిబ్రవరి నాటికి ఈ పని పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ నిపుణుల కమిటీ నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. గతంలో అల్ప పీడనాలు, తుపానుల కారణంగా గోదావరికి భారీ వరదలు వచ్చేవి. కానీ ఇటీవల క్లౌడ్ బరస్ట్లతో కూడా వరద ఉప్పొంగుతోంది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా కాంటూర్ లెవల్స్ను లెక్కించడం, అందుకు తగ్గట్టుగా కొత్త ఫ్లడ్ మాన్యువల్ను రూపొందించుకోవాల్సిన అవసరముంది. రాకపోకలకు ఇబ్బంది గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగుల నుంచి మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకునేలోపు బూర్గంపాడు – సారపాక, దుమ్ముగూడెం – భద్రాచలం, కూనవరం – భద్రాచలం మధ్య వరద నీరు ప్రధాన రహదారిపైకి వచ్చి రాకపోకలు నిలిచిపోతాయి. 53 అడుగుల నుంచి వరద పైకి పోయే కొద్దీ ఇతర ప్రాంతాల్లోనూ రాకపోకలు స్తంభించడం పెరుగుతుంది. దీంతో బూర్గంపాడు – సారపాక, చర్ల – భద్రాచలం మధ్య ఉన్న రహదారుల్లో హై లెవల్ వంతెనలు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. అది నెరవేరడం లేదు సరికదా కనీసం సాధారణ పనులు కూడా సకాలంలో జరగడం లేదు. దుమ్ముగూడెం – భద్రాచలం మార్గంలో తూరుబాక వద్ద కుంగిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ ఏడాది శ్రీరామనవమి నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అఽధికారులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. చివరకు 45 అడుగుల వరదకే ఈ వంతెన దగ్గర అప్రోచ్ రోడ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.ఆగుతూ.. సాగుతూ అన్నట్టుగా కరకట్ట పనులు -
గోడౌన్లో భారీగా మంటలు
భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలోని పాత మార్కెట్ గోడౌన్ (నెహ్రూ మార్కెట్)లో గురువారం తెల్ల వారుజామున 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో బ్లీచింగ్ పౌడర్ బస్తాలతో పాటు పలువురు వ్యాపారులకు చెందిన పండ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టింది. మంటలు చెలరేగిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య స్టాక్ గోడౌన్ ఏర్పాటు చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అగ్ని ప్రమాదంలో రూ.4 లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్, పండ్లు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గోడౌన్లో స్టాక్ ఉంచిన బ్లీచింగ్ పౌడర్ కారణంగానే కెమికల్ రియాక్షన్ జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ ఫైటర్ సాధిక్, ఫైర్ ఫైటర్లు కుమారస్వామి, రాజబాబు, కిరణ్, ప్రకాష్ పాల్గొన్నారు. బాధితులను ఆదుకోవాలి.. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పండ్ల వ్యాపారులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రెండు షాపుల్లో ఉన్న ఐదు నాలుగు చక్రాల బండ్లు పూర్తిగా కాలిపోయాయని, సుమారు రూ.లక్ష విలువైన పండ్లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.బి. నర్సారెడ్డి, బండారు శరత్బాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పండ్ల వర్తక సంఘం నాయకులు వి.రాము బాలాజీ, వాసు, శ్రీను, రాము, జానీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జ్వరంతో బాలుడు మృతి
అశ్వాపురం: మండలంలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన సవలం రవికుమార్(7) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రవిని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా పరిస్థితి మెరుగుపడక భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో పోస్టుమ్యాన్ మృతిటేకులపల్లి: మండలంలోని మాలపల్లికి చెందిన పోస్ట్మ్యాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండలంలోని కొత్తతండా(పీ) పంచాయతీ పరిధి మాలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి జానకీరామ్(58) ప్రెగళ్లపాడు పోస్టాఫీసు పరిధిలో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈమేరకు బుధవారం రాత్రి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జానకీరామ్ను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్విచక్ర వాహనదారుడిపై కేసు నమోదు పాల్వంచరూరల్ : వ్యక్తిని ఢీకొట్టి గాయపరిచిన ఘటనలో ద్విచక్రవాహనదారుడిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని నర్సమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సుజాతనగర్కు చెందిన బోడ సక్రును రాజీవ్నగర్ కాలనీకి చెందిన మడకం శ్రీను తన బైక్తో ఢీ కొట్టగా సక్రు గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
గోదా‘వర్రీ’..!
బూర్గంపాడు: గోదారి కన్నెర్రజేసింది. ఈ ఏడాది వరదలు ఉండవని భావించి పంటలు సాగు చేసిన రైతులను కన్నీటి పాలు జేసింది. మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో కనిపించిన గోదావరి ఇటీవల కురిసిన వర్షాలకు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద చేరుతోంది. గురువారం సాయంత్రానికి 52 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువవుతున్న గోదావరి వరదకు భద్రాచలం రెవెన్యూ డివిజన్లో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడులో కొన్ని ఇళ్లలోకి వరదనీరు చేరగా.. నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నష్టం మరింత పెరిగేనా..? గోదావరి పరీవాహక ప్రాంత రైతులు వరదలతో వణికిపోతున్నారు. ఈ ఏడాది వరదలు ఉండవని భావించి పంటలు సాగు చేశారు. పత్తి, వరి, కూరగాయల పంటలు సాగు చేసి, పైపాట్లు చేసి ఎరువులు కూడా వేశారు. ఈ తరుణంలో వచ్చిన గోదావరి వరదలు బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో పంటలను నీటముంచాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న తరుణంలో పంట నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు ఇప్పటికే రైతులు రెండుసార్లు ఎరువులు వేసుకుని సస్యరక్షణ మందులు పిచికారీ చేశారు. ఈ తరుణంలో మొక్కలు నీటమునగటంతో రైతులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల వేసిన వరి నాట్లు కూడా వరద ముంపునకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలతో పంటలతో పాటు రైతులు వాగుల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, డీజిల్ ఇంజన్లు సైతం నీటమునిగాయి. పునరావాస కేంద్రాలకు తరలింపు.. గోదావరి వరదలతో బూర్గంపాడులోని మిల్లు సెంటర్, కొల్లుచెరువు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. బూర్గంపాడులోని కేజీబీవీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలంలో ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగభిక్షం వరద ముంపు ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టారు. బూర్గంపాడు తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. గోదావరి వరదలకు బూర్గంపాడు – భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు సమీపంలోని పులితేరు, సారపాక సమీపంలోని పెదవాగు బ్రిడ్జి, రెడ్డిపాలెంలోని చర్చి స్కూల్ వద్ద గోదావరి వరద ఆర్అండ్బీ రహదారిపైకి చేరడంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రోడ్లపైకీ వరదనీరు చేరడంతో అటు వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో కూడా కొన్నిచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరటంతో రాకపోకలను నిలిపివేశారు. గోదావరి వరద నీరు రోడ్లపైకి చేరడంతో అటుగా ఎవరూ ప్రయాణించకుండా పోలీస్, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. ముంపు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.వరద నీటిలో మునిగిన పంటచేలు -
నిలకడగా గోదావరి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రం నుంచి నిలకడగా ఉంది. బుధవారం ఒక్కసారిగా పెరగడంతో ఒక్కరోజే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. ఇక గురువారం తెల్ల వారుజామున 5 గంటలకు 50 అడుగులు, 7 గంటలకు 50.60 అడుగులు, 10 గంటలకు 51.10 అడుగులకు చేరుకుని, ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సాయంత్రం 4 గంటలకు 51.90 అడుగులుగా నమోదైంది. అప్పటి నుంచి రాత్రి 11 గంటలకు వరకు అదే ప్రవాహం కొనసాగింది. వీడిన భయాందోళనలు.. గోదావరి నీటిమట్టం బుధవారం భారీగా పెరగడంతో గురువారం కూడా ప్రభావం చూపుతుందని, మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందని అందరూ భావించారు. తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ సాయంత్రం నుంచి నీటిమట్టం నిలకడగా ఉండడంతో స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరద నెమ్మదిగా తగ్గుతుందని, 9 గంటల తర్వాత వేగంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు తగ్గినా మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడి నుంచి వరద ప్రవాహం వారం రోజుల తర్వాత భద్రాచలం చేరుకుంటుందని, అప్పుడే మళ్లీ వరద పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. వరద ఉధృతి పరిశీలన.. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. స్లూయీస్ల పనితీరు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల కారణంగా సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.వారం తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ! -
‘ఉపాధి’కి వేళాయె..
చుంచుపల్లి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెల్లో నివసించే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ ఆర్థిక భరోసా నింపుతుండగా.. పనులు సకాలంలో పూర్తి చేసే బాధ్యతను సంబంధిత అధికారులు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనుల జాతర పేరుతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు అన్ని గ్రామాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఏకకాలంలో పనులు ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ మిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు పనుల్లో భాగస్వాములు కానున్నాయి. చేపట్టనున్న పనులు, కూలీల పని దినాలు, బడ్జెట్ కేటాయింపు ప్రణాళికలను డీఆర్డీఏ అధికారులు సిద్ధం చేశారు. అందరికీ ఉపయోగపడేలా.. ప్రభుత్వం నిర్వహిస్తున్న పనుల జాతర కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ముఖ్యంగా పశువుల షెడ్లు, కోళ్ల ఫారాలు, వర్మీ కంపోస్టు తయారీ పనులు, నర్సరీలు, నాడెపు కంపోస్టు పిట్, అజోలా తయారీ, ఇంకుడు గుంతలు, జలనిధి ద్వారా చెక్ డ్యాంల నిర్మాణం, వ్యవసాయ బావులు, వర్షం నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు, బిందు సేద్యం, ఫామ్పాండ్స్, గతంలో నిర్మించిన రోడ్లు దెబ్బ తింటే మరమ్మతులు వంటివి చేపట్టనున్నారు. అంతేకాక పొలాల వద్దకు ఉన్న కాలిబాటలను అభివృద్ధి చేయడంతో రైతులకు మేలు జరగనుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పనులు గుర్తించిన అధికారులు.. ఉపాధి హామీ నిధుల ద్వారా త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తున్నారు. పనుల జాతరలో చేపట్టనున్న ఉపాధి పనులన్నీ 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక శుక్రవారం జరిగే పనుల జాతర కార్యక్రమంలో ఆర్థిక సంవత్సరంలో కొత్తగా చేపట్టబోయే నూతన భవన నిర్మాణాలు, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన పనులుంటే ప్రారంభోత్సవాలు చేస్తారు. జిల్లాలో మొత్తం 4,002 పనులకు రూ.3779.72 లక్షలు కేటాయించారు. దాంతో పాటు గతేడాది ఎక్కువ రోజులు పని దినాలు పూర్తి చేసిన దివ్యాంగులు, నిబద్ధతతో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను, పచ్చదనం పెంపునకు కృషి చేసిన వారిని సన్మానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలో పనుల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఆ రోజున స్థానిక ఎమ్మెల్యేలతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. పనుల జాతరలో గ్రామస్తులు, రైతులకు మేలు జరిగేలా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కూలీలకు చేతి నిండా పని కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి. – ఎం.విద్యాచందన, డీఆర్డీఓజిల్లా వ్యాప్తంగా 2.21 లక్షల జాబ్కార్డులు ఉండగా, వాటి పరిధిలో 4.53లక్షల మంది కూలీలు పేరు నమోదు చేసుకున్నారు. పనుల జాతరలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో 26.21 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 23.75 లక్షల పని దినాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు రూ.91.10 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగే పనులను ఉపాధి కూలీలు ఎక్కువ సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటారు. -
ఏటీసీలతో నైపుణ్యాలు మెరుగు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడిబూర్గంపాడు: యువతలో వృత్తి విద్యా నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ) ఉపయోగపడతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కృష్ణసాగర్ ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన ఏటీసీని గురువారం ఆయన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఏటీసీలో శిక్షణ పొంది నైపుణ్యాలు పెంచుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న స్మార్ట్బోర్డులను, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏటీసీల్లో పలు ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో చేరి వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించాలికొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్యాధికారులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డు, గర్భిణుల వార్డు, మందుల స్టోర్ రూమ్ను పరిశీలించారు. ఇన్ పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులు నిల్వ ఉంచాలని అన్నారు. పేషెంట్లకు శుచికరమైన, బలవర్ధకమైన ఆహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, మారణాయుధాల పట్టివేత
పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోగా, నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి పాల్వంచలో వాహనాల తనిఖీ చేపట్టామని, అనుమానాస్పదంగా కనిపించిన ఐచర్ వ్యాన్, వోక్స్ వ్యాగన్ పోలో కారును తనిఖీ చేయగా ఆయా వాహనాల్లో రూ.53లక్షల విలువ చేసే 105 కేజీల గంజాయితో పాటు ఒక పిస్టల్, ఐదు రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు లభ్యమయ్యాయని చెప్పారు. వ్యాన్, కారుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు తప్పించుకుని పరారయ్యాడని తెలిపారు. నిందితుల్లో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా అలువాకు చెందిన బీలాల్ వి.ఎస్, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా తిరియర్కు చెందిన శ్యాం సుందర్, విశ్వాంబల్ సముద్రమ్ గ్రామానికి చెందిన కాశీ నందన్ సంతోష్ ఉన్నారని గుర్తించామని, అంతేగాక తిరుచ్చికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని వివరించారు. ఒడిశా నుంచి భద్రాచలం, ఖమ్మం, చైన్నె మీదుగా తిరుచ్చికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని, తదుపరి విచారణ నిమిత్తం వారిని పాల్వంచ పోలీస్స్టేషన్లో అప్పగించామని చెప్పారు. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎన్స్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్, ఇన్స్పెక్టర్ ఎస్.రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీహరి రావు, సిబ్బంది ఖరీం, బాలు, సుధీర్, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, విజయ్, హరీష్, వీరబాబు, ఉపేందర్ను జనార్దన్రెడ్డి అభినందించారు. కాగా, ఈ నలుగురిపై భారత ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. నిందితులది మొదటి నుంచీ నేరచరితే.. గంజాయి, మారణాయుధాలతో పట్టుబడిన నిందితులు కేరళలో గ్యాంగ్స్టర్ టీంగా చెలామణి అవుతున్నారని, కొచ్చిలో గ్యాంగ్స్టర్ బిలాల్పై 100కు పైగా కేసులు ఉండగా 28 సార్లు శిక్ష అనుభవించాడని తెలిసింది. ఎనిమిదేళ్ల శిక్ష అనంతరం ఇటీవలే విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడేందుకు మధ్యప్రదేశ్లో మారణాయుధాలు కొనుగోలు చేశాడు. రెండో నిందితుడైన తమిళనాడుకు చెందిన శ్యాంసుందర్కు గంజాయి వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం అతడు డ్రైవర్గా వచ్చాడు. తమిళనాడుకు చెందిన జేమ్స్కు కూడా భారీ నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం. పిస్టల్, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు స్వాధీనం -
బియ్యంతో పాటు సంచులు..
పాల్వంచరూరల్ : బియ్యం కోసం రేషన్ షాపులకు వెళ్లేవారు ఇకపై బస్తాలు, సంచులు తీసుకెళ్లాల్సిన పని లేదు. వచ్చే నెల నుంచి ప్రభుత్వమే ఉచితంగా సంచులు సరఫరా చేస్తుంది. ఈ మేరకు సంచిపై ‘అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని రాయడంతో పాటు రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల ఫొటోలు ముద్రించి సిద్ధంగా ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా సంచులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం అందించే సంచి ఒక్కోటి రూ.50 విలువ చేస్తుందని చెబుతున్నారు. జిల్లాలోని వినియోగదారుల కోసం 2.93 లక్షల బ్యాగులు రాగా, గోదాముల్లో నిల్వ చేశారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా 2.93లక్షల బ్యాగులు -
గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలి
భద్రాచలంఅర్బన్ : గోదావరి తీర ప్రాంతాలకు చెందిన గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి సిబ్బందికి సూచించారు. వరద ఉధృతి నేపథ్యంలో హైరిస్క్ ఉండే గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే 20 మంది గర్భిణులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక వార్డులో వైద్యం అందిస్తున్నారు. వీరిలో భద్రాచలం నుంచి 15 మంది, మణుగూరు, చర్ల నుంచి ఐదుగురు ఉన్నారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ గురువారం వారిని పరామర్శించి, అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. చికిత్స సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి నుంచి ఎవరూ ఇళ్లకు వెళ్లొద్దని గర్భిణులకు, వారి కుటుంబసభ్యులకు సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, ఏరియా ఆస్పత్రి సిబ్బంది రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ జయలక్ష్మి -
ఆశలు.. అడియాసలేనా?
● అర్ధంతరంగా అగిన సీఎం పర్యటన ● వాయిదా పడిందా.. రద్దయిందా తెలియని అయోమయం చండ్రుగొండ : సీఎం సారొస్తారని.. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్న గిరిజనుల ఆశలు అడియాసలుగానే మిగిలాయి. తమ ఊరికి రేవంత్రెడ్డి వస్తున్నారని, గ్రామానికి వరాలు కురిపిస్తారని బెండాలపాడులోని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు. అంతేకాక జిల్లా అధికారులు సైతం ఇక్కడే అక్కడే మోహరించి సీఎం పర్యటన ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఆ కుగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు సీఎం రాక కోసం చండ్రుగొండలో హెలీప్యాడ్ కూడా సిద్ధం చేశారు. దామరచర్లలో సుమారు 25 ఎకరాల్లో సభాస్ధలి పనులు సగం వరకు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాటర్ ప్రూఫ్ టెంట్లు వచ్చాయి. అయితే సీఎం పర్యటన అర్ధంతరంగా ఆగిపోగా.. అందుకు కారణమేంటనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని, అందుకే ఇక్కడి పర్యటన వాయిదా పడిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పినా.. సీఎం ఢిల్లీ కూడా వెళ్లకపోవడంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనక్కు తీసుకెళ్తున్న సభ సామగ్రి.. బెండాలపాడు గ్రామంలో బీటీ రోడ్డు పనులు చేపట్టగా అవి మధ్యలోనే నిలిచిపోయాయి. హెలీప్యాడ్ వద్ద వినియోగించేందుకు తీసుకొచ్చిన కంకరను రాత్రికి రాత్రే తీసుకెళ్తున్నారు. దామరచర్లలోని సభాస్థలి వద్దకు తీసుకువచ్చిన టెంట్ సామగ్రి సైతం తీసుకెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జారె వర్గీయులు ఈనెల 30వ తేదీ లోపు సీఎం పర్యటన ఉంటుందని చెప్తున్నా.. ఆదినారాయణ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఏబీసీ.. తాళం వేసి ఏడాది..
● కొత్తగూడెం కార్పొరేషన్లో వీధి కుక్కల స్వైర విహారం ● పిల్లలు, వృద్ధులపై అధికమవుతున్న దాడులు ● భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు కొత్తగూడెంఅర్బన్: కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు రూ.లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలో నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ప్రస్తుతంనిరుపయోగంగా మారింది. అధికారు ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ఏడాది కాలంగా మూతబడి ఉంది. ప్రస్తుతం వర్షా కాలం కావడంతో కుక్కలు స్వైర విహారం చేస్తున్నా యి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కకాటుకు గురైన వ్యక్తివర్షంలో తడిస్తే ప్రాణాపాయ స్థితి కి చేరే ప్రమాదం ఉంది. కానీ, కుక్కల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువైన శునకాల సంచారం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ డివిజన్లలో కుక్కల సంచారం ఎక్కువ గా ఉంది. ఆయా డివిజన్ల నుంచి అధికారులకు నిత్యం ఫిర్యాదు చేస్తున్నారు. అయినా కూడా అధికారులలో చలనం రావడం లేదు. కుక్కలు కరిచిన వారు ఘటనా స్థలం నుంచి నేరుగా గతంలో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులను నిలదీసిన ఘటనలున్నాయి. వర్షాకాలం కావడంతో పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పిల్లలు పాఠశాలలు, ట్యూ షన్లకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు వారి వెంట రక్షకులుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. బిల్లులు చెల్లించకనే.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రైటర్బస్తీ గొల్లగూడెంలో 2021లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఏడాదికాలంగా కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో మూసివేశారు. కాంట్రాక్టర్కు సుమారు రూ.6 లక్షల బిల్లు రావాల్సి ఉందని తెలిసింది. ఈ సెంటర్లో గోప్యంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ వాక్సిన్లు వేసేవారు. కాగా, కుక్కలకు సెంటర్లో సరైన ఆహారం అందించడం లేదని గొడవలు కావడం, సెంటర్కు తెచ్చిన కుక్కలను ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలకుండా.. సెంటర్ పరిసరాల్లోనే వదిలడంతో స్థానికులు ఆందోళన చేసిన ఘటనలున్నాయి. బిల్లులకు తగ్గట్టుగా సెంటర్లో కుక్కల సంఖ్య లేకపోవడాన్ని పలువురు గమనించారు. కొత్తగా పాల్వంచలో.. ప్రస్తుతం పాల్వంచ ప్రాంతంలో మరో ఏబీసీని నూ తనంగా నిర్మించారు. అయితే అక్కడకు కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచ డివిజన్లలోని కుక్కలను పట్టి.. అక్కడే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్తగూడెం, సుజాతనగర్లోని కుక్కలను పాల్వంచకు తీసుకెళ్లి, వ్యాక్సిన్ వేసి, తిరిగి వాటిని ఆయా ప్రాంతాలకు తీసుకురావాలంటే శ్రమతో కూడిన అంశం. అలా కాకుండా రెండు సెంటర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కడి వాటిని అక్కడే పట్టించి, వ్యాక్సిన్ వేస్తే బాగుంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఆ రకంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. లేదంటే ఏబీసీ సెంటర్లకు వెళ్లిన కుక్కలు తిరిగి అదే ప్రాంతానికి రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కుక్కలు దాడులు చేయడం వల్ల గాయపడిన వారు, విషయం తెలుసుకున్న వారు భయాందోళన చెందుతున్నారు. కొత్తగూడెంలోని భజనమందిరం రోడ్డు, హనుమాన్బస్తీ, బూడిదగడ్డ, రామాటాకీస్ ఏరియా, రాజీవ్పార్కు ఏరియా, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో పగలు, రాత్రులు గుంపులు, గుంపులుగా కుక్కలు తిరుగుతున్నాయి. వాటి నుంచి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇప్పటికై నా కార్పొరేషన్లో కుక్కల బెడదను తగ్గించేందుకు గానూ వాటిని పట్టి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరముందని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికై నా దృష్టిసారించి, కుక్కల సంఖ్య ప్రకారం బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో కుక్కలను పట్టకున్నా.. పట్టినట్లు చూపి, లెక్కలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
పర్యావరణ అనుమతిపై ప్రజాభిప్రాయ సేకరణ
మణుగూరుటౌన్: మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా పర్యావరణ అనుమతులపై బుధవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రస్తుత మణుగూరు ఓసీలో బొగ్గు నిల్వలు మరో ఆరు నెలల్లో అడుగంటనుండగా, రాష్ట్ర విద్యుత్ అవసరాల నేపథ్యంలో ఓసీ విస్తరణ అనివార్యమైంది. దీంతో మండలంలోని తిర్లాపురం, రామానుజవరం, మున్సిపాలిటీలోని కొమ్ముగూడెంలో రైతుల నుంచి 813 ఎకరాలు సేకరించనుంది. పర్యావరణ అనుమతులకు సింగరేణి దరఖాస్తు చేయగా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ బి.రవీందర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. మణుగూరు ఓసీ విస్తరణతో కలిగే ప్రయోజనాలు, మణుగూరు అభివృద్ధికి సింగరేణి చేపట్టిన చర్యలను వివరించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో ఆర్ఓఆర్ ప్లాంట్, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన రామానుజవరం, తిర్లాపురం, కొమ్ముగూడెం నిర్వాసితులు, రాజుపేట గ్రామస్తులు మాట్లాడుతూ.. సింగరేణి పరిసర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని, నిత్యం దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న రాజుపేటను తరలించాలని వేడుకున్నారు. కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, పరిసర గ్రామాల్లో భారీ ఎత్తున మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వెల్లడించిన అభిప్రాయాలను వీడియో చిత్రీకరించి భద్రపరుస్తున్నట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కమిషనర్ ప్రసాద్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు త్యాగరాజన్, కృష్ణంరాజు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్, సీపీఐ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ఐదు నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బారులు 298 మంది చేరారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు రమాదేవి, రాణి, చైతన్య, మాధవీలత, శిరీష, మాధవి, వీరస్వామి, సురేశ్, శ్యాంకుమార్, హరికృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.యూరియా సరఫరాలో విఫలంఇల్లెందు: ప్రభుత్వం యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. బుధవారం ఇల్లెందులో దిండిగాల రాజేందర్తో కలిసి ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తు న్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 20 నెలల కాంగ్రెస్ పాలనను రైతులు పోల్చి చూసుకోవాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు దిండిగాల రాజేందర్, ఎస్.రంగనాథ్, భావ్సింగ్నాయక్, పోషం, వరప్రసాద్, చీమ ల సత్యనారాయణ, అబ్దుల్ నబీ, ఘాజీ, జబ్బార్ తదితరులు ఉన్నారు.కొబ్బరితోటల పెంపకంపై శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): కొబ్బరి తోటల పెంపకం,యాజమాన్య పద్ధతులపై కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యాన రైతులకు శిక్షణ ఇచ్చారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడు లోని ఉద్యాననర్సరీలో బుధవారం ఏర్పాటు చేసి న శిక్షణకు కోకోనట్ బోర్డు డీడీ మంజునాథ్రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఉద్యాన అధికారులు మధుసూదన్, జంగా కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అమలు చేస్తున్న పథకాలు, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను అధికారులకు అందజేయాలని సూచించారు.సైబర్ మోసానికి గురైన వ్యక్తి దశ లవారీగారూ.1,17,946 కోల్పోయిన బాధితుడుచండ్రుగొండ: మండల కేంద్రం శివారు ఇమ్మడి రామయ్యబంజర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో పడి ఆర్థికంగా నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇమ్మడి రామయ్యబంజర్కు చెందిన వీరబోయిన మురళీకి ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.లక్ష లోన్ మంజూరైందని, అందుకు గాను బ్యాంక్ పాస్బుక్, పాన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలు వాట్సప్ చేయాలని చెప్పడంతో అలాగే చేశాడు. రూ.2 వేలు మొదలుకుని దశలవారీగా రూ.1,17,946 నగదు ఫోన్పే చేశాడు. తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మురళి సైబర్ క్రైం అధికారులను ఆశ్రయించాడు. స్థానిక ఎస్ఐ శివరామకృష్ణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు
గోదావరి నదికి భారీగా వస్తున్న వరదతో పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. రహదారులపైకి నీరు చేరి ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాలిపేరు బ్యాక్వాటర్తో దండుపేట – కొత్తపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి – ఆమెర్ద గ్రామాల నడుమ కూడా రవాణా స్తంభించింది. ఆయా గ్రామాల్లో వరి, పత్తి పంటలు మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి తదితర గ్రామాల్లోనూ రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. – చర్ల/దుమ్ముగూడెం/అశ్వాపురం దుమ్ముగూడెం : పర్ణశాల వద్ధ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి దుమ్ముగూడెం : సున్నంబట్టి – బైరాగులపాడు రహదారిపైకి చేరిన వరద -
ఉప్పొంగిన గోదావరి
భ ద్రాచలం బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిభద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద దిశగా ప్రవహిస్తోంది. మంగళవారం నెమ్మదిగా పెరిగిన నీటిమట్టం.. అర్ధరాత్రి నుంచి శరవేగంగా పుంజుకుంది. బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా, రాత్రి 10.05 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు ముంపు ప్రజలను అప్రమత్తం చేసి, పలు సూచనలు చేశారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నది పరీవాహక గ్రామాల్లో నివసించే ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు అవసరవైన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్.. ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి భద్రాచలంతో పాటు దుమ్మగూడెం మండలంలో పర్యటించారు. తూరుబాక డైవర్షన్ రోడ్డును, భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్దకు వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని సూచించారు. వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే పాల్వంచలో 08744 –241950, వాట్సాప్ నంబర్ 93929 19743, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 79952 68352, సబ్ కలెక్టరేట్లో 08743 – 2324444, వాట్సాప్ నంబర్ 93479 10737 కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు తాలిపేరు ప్రాజెక్టు సైతం నిండడంతో ఆ గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదిలారు. దీంతో నది ప్రవాహం శరవేగంగా పెరిగింది. మంగళవారం నెమ్మదిగా పెరిగినా.. అర్ధరాత్రి నుంచి ఊపందుకుంది. బుధవారం ఉదయం 8.15 గంటలకు 43 అడుగులకు చేరడంతో సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10.05 గంటలకు 48 అడుగులు నమోదు కాగా, రెండో ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. కాగా, నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం -
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
అశ్వారావుపేటరూరల్: గుండెపోటు తో ఐటీడీఏ పాఠశాల ఉపాధ్యాయు డు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బండారిగుంపులోని గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్) లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దారబోయిన ప్రసాద్ (35) మంగళవారం విధులు ముగించుకుని స్వగ్రామమైన అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, యూటీఎఫ్ నాయ కులు మడివి కృష్ణారావు, కొర్రి వెంకటేశ్, కె.హరినాథ్, నాగరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒంటరితనం భరించలేక ఆత్మహత్య పాల్వంచ: ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం శ్రీనివాసనగర్కు చెందిన సుగ్గాల వెంకటసాయిరామ్ (36) శాసీ్త్రరోడ్లోని పద్మజ ఫ్యాన్సీలో వర్కర్గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గట్టాయిగూడెంలో అద్దెకు ఉంటున్నాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి అనారోగ్యంతో మూడేళ్ల కిందట చనిపోయాడు. ఒంటరితనంతో మానసికంగా కృంగిపోయాడు. గత 15వ తేదీన ఆరోగ్యం బాగోలేదని దుకాణానికి రానని చెప్పాడు. బుధవారం తాను ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు తీసి చూడగా, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఒంటరితనం భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని బంధువు మహిపతి లవరావు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యంభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియ ని వ్యక్తి మృతదేహం దొరకగా టౌ న్ సీఐ నాగరాజు బుధవారం వివరాలు వెల్లడించారు. బస్టాండ్లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భిక్షాటన చేసినట్లు స్థానికులు తెలిపారు. తెలుపు, ఎరుపు నిలువు గీతలు కలిగిన ఆకుపచ్చ రంగు చొక్కా, నీలం, ఆకుపచ్చ రంగు గల శాలువా ధరించాడని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మార్చురీలో ఉంచామని, సంబంధీకులెవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ లేదా 87126 82106 నంబర్లో సంప్రదించాలని టౌన్ సీఐ నాగరాజు కోరారు. వ్యక్తి ఆత్మహత్యపై కేసు చండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన మోడెం వెంకటేశ్వర్లు (55) పురుగులమందు తాగి ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా పోలీసులు బుధవా రం కేసు నమోదు చేశారు. రావికంపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈ నెల 11న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం పురుగులమందు తాగగా అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు కొత్తగూడెం, ఖమ్మం అనంతరం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతుడి సోద రుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కేటీపీఎస్ ఆధునికీకరణకు ప్రోత్సాహకం అందించాలి
ఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఆధునికీకరణ, పాత ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో 820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేటీపీఎస్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా రెండు 800 మెగావాట్ల యూనిట్లుగా ఆధునికీకరణ చేపట్టాలని, ఇందుకు అవసరమైన బొగ్గు నిల్వలు, గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈమేరకు పాత థర్మల్ స్టేషన్లకు ఆర్అండ్ఎం వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో సహకారం అందించాలని ఎంపీ కోరారు.పార్లమెంట్లో ఎంపీ రఘురాంరెడ్డి -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైభవంగా గిరి ప్రదక్షిణ..శ్రీ రామచంద్రస్వామి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా కొత్తగూడేనికి చెందిన భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం భద్రగిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయంలో స్వామి పాద ప్రదక్షిణకు వీలు లేనందున గిరిప్రదక్షిణే సులభ మార్గమని అన్నారు. అనంతరం స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబా, భక్తులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి గుడిలో నేడు రుద్రహోమంపాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా గురువారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే హోమంలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రేపు బహిరంగ వేలం.. శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ పరిధిలో పలు పనులు అప్పగించేందుకు 22వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. కొత్త, పాత కాంప్లెక్స్లోని పలు షాపులే కాక చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం తదితర పనులకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు రూ.200 చెల్లించి షెడ్యూల్ ఫాం తీసుకుని, ధరావత్తు డీడీ జతపరిచి వేలంలో పాల్గొనాలని సూచించారు. కిన్నెరసానిని సందర్శించిన ఎఫ్బీఓలుపాల్వంచరూరల్ : హైదరాబాద్ ధూల్పేట ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 40 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు(ఎఫ్బీఓ) శిక్షణలో భాగంగా బుధవారం పాల్వంచ మండలంలోని కిన్నెరసాని డీర్పార్కును సందర్శించారు. అనంతరం వన్యప్రాణులు, అటవీ సంపద సంరక్షణపై వారికి వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అకాడమీ కోర్సు డైరెక్టర్ అశోక్కుమార్, స్థానిక వైల్డ్లైఫ్ సిబ్బంది పాల్గొన్నారు. వైల్డ్లైఫ్ సిబ్బందికి కిట్లు..విధి నిర్వహణలో వైల్డ్లైఫ్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఇబ్బంది పడకుండా అత్యవసరంగా వినియోగించుకునే పలు రకాల వస్తువుల కిట్లను కిన్నెరసాని డీర్పార్కు వద్ద వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మంది సిబ్బందికి రూ.1.20 లక్షల విలువైన కిట్లను వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అందజేసిందని తెలిపారు. కార్యక్రమంలో రేంజర్ కవితామాధురి, సెక్షన్ అధికారి బి.కిషన్, ఎఫ్ఎస్ఓ బి.సునీత, కృష్ణయ్య, ఎఫ్బీఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే హామీలు
భద్రాచలంటౌన్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి రాజకీయ లబ్ధికోసమే విద్యారంగం అభివృద్ధి పేరుతో కొత్త హామీలు ఇస్తున్నారని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ పేర్కొన్నారు. పట్టణంలోని మాస్లైన్ కార్యాలయంలో పీడీఎస్యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ. లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తూ ఫీజుల దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాయని తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి 30 వరకు తెలంగాణ విద్యార్థి పోరు పేరుతో జీపు జాత నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్, రామ్చరణ్, పవన్కల్యాణ్ పాల్గొన్నారు. డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలుఖమ్మంఅర్బన్: జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యత లు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 మందికి అదనపు బాధ్యతలు కేటాయించగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉన్నారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా అదనపు బాధ్యత లు అప్పగించారు. అలాగే, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్రెడ్డికి కల్లూరు డీఎస్ఈగా, మధిర డీఈఈ రాంప్రసాద్కు మధిర ఈఈగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. అంతేకాక భదాద్రి జిల్లా కొత్తగూడెం ఈఈ బి.అర్జున్కు ఆ జిల్లా డీసీఈగా, ఇల్లెందు డీఈఈ బి.కృష్ణకు ఇల్లెందు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికపాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వై.రుషివర్మ, కె.వెంకన్నబాబు హైదరాబాద్లో జరిగిన వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపారు. ఈ నెల 26, 27 తేదీల్లో పుణేలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం చందు తెలిపారు. ఇందులో విజయం సాధిస్తే ఇండియా జట్టు నుంచి చైనాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతిభ చూపాలి గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో కూడా ప్రతిభ చూపాలని హెచ్ ఎం చందు ఆకాంక్షించారు. మండలంలోని గిరిజన క్రీ డా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లోబంగారు పతకాలు సాధించగా బుధ వా రం వారిని అభినంధించారు. కార్యక్రమంలో వార్డెన్ పోలేబోయిన వెంకటేశ్వర్లు, పీడీలు బాలసుబ్రహ్మణ్యం, పీఈటీ దొడ్డ అంజయ్య, కోచ్ వాసు, సపవాత్ బాలు, స్వరూపారాణి, బట్టు శంకర్, పద్మావతమ్మ, బాలు, భగవాన్దాస్, కోటేశ్వరరావు, రామ్ధన్, విజయమ్మ, సుక్యా, వెంకన్న, భాస్కర్ పాల్గొన్నారు. సీపీఎస్ ఈయూ ఆధ్వర్యాన నేడు ముఖాముఖి ఖమ్మంసహకారనగర్: వీఆర్వోలు, వీఆర్ఏలుగా విధులు నిర్వర్తించి ఇతర శాఖలకు కేటాయించిన వారితో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీజీ సీపీఎస్ ఈయూ) ఆధ్వర్యాన గురువారం ఇతర ముఖాముఖి నిర్వహించనున్నా రు. ఉదయం 9 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో, ఆ తర్వాత ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో ముఖా ముఖి ఉంటుందని జీపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశాల్లో టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శన్గౌడ్, నాగవెల్లి ఉపేందర్ పాల్గొంటారని వెల్లడించారు. -
ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు
జూలూరుపాడు: టీబీ అనుమానితులకు ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు స్థానిక పీహెచ్సీలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీటీసీఓ డాక్టర్ పుల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రధాన మంత్రి టీబీ(క్షయవ్యాధి) ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులను గుర్తించేందుకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంప్ ఈనెల 30వ తేదీవరకు పీహెచ్సీ పరిధి లోని అన్నారుపాడు, పాపకొల్లు, భేతాళపాడు, కొమ్ముగూడెం, పడమటనర్సాపురం, కాకర్ల, అనంతారం, గుండెపుడి హెల్త్ సబ్ సెంటర్లలో కొనసాగనుండగా.. టీబీ అనుమానితులకు ఎక్స్రే, రక్త పరీక్షలు చేస్తారు. కాగా, వైద్య పరీక్షలను పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు ప్రారంభించి, వివరాలు వెల్లడించారు. తొలి రోజు 50 మందికి ఎక్స్ రే తీయగా 16 మందిని టీబీ అనుమానితులుగా గుర్తించామని వివ రించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఎం.రామకృష్ణ, హెచ్ఎస్ రత్నకుమార్, టీబీ సూపర్వైజర్ రఫేల్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, ఎక్స్రే నిపుణులు సాయికృష్ణ, ఎంఎల్హెచ్పీ అమూల్య, ఐసీటీసీ ఎల్టీ బి.రాహుల్, సిబ్బంది శరత్ తదితరులు పాల్గొన్నారు. -
వరద ఉధృతి పరిశీలన
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ జితేష్.వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు. పట్టణ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నది వద్ద విధుల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలకు పలు సూచనలు చేశారు. అనంతరం దుమ్ముగూడెం మండలం తూరుబాక డైవర్షన్ రోడ్డును తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని, ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలాగే వరద నీటితో మునిగిన సున్నంబట్టి – బైరాగులపాడు రహదారిని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్కుమార్, సీఐ అశోక్, ఎంపీడీఓ వివేక్రామ్, ఆర్ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలికొత్తగూడెంటౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్దకు వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని పేర్కొన్నారు. -
సీఎం పర్యటన వాయిదా
చండ్రుగొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాల కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. అయితే అదే రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల కార్యక్రమం ఉండడంతో రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. దీంతో సీఎం జిల్లా పర్యటన వాయిదా పడినట్లు నీటి పారుదల అభివృద్ధి సంస్ధ చైర్మన్ మువ్వా విజయ్బాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, సీఎం పర్యటన వాయిదా పడినట్టు సాయంత్రం తెలియగా.. ఉదయం కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తదితరులు వర్షంలో తడుస్తూనే ఏర్పాట్లను పర్యవేక్షించారు. చండ్రుగొండలోని హెలీప్యాడ్, దామరచర్లలో బహిరంగసభా స్థలి వద్ద పనులను తనిఖీ చేసి సలహాలు, సూచనలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి నాగ సీతారాములు, నాయకులు కోనేరు సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.తాలిపేరుకు కొనసాగుతున్న వరద10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల నీరు విడుదలచర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తుండగా మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 21,387 క్యూసెక్కుల చొప్పున వరదనీరు రాగా, 10 గేట్లు ఎత్తి 20,759 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని నీటిమట్టాన్ని 71.84 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు.ఆధునిక విద్య అందించడమే లక్ష్యంపాల్వంచ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే సర్కారు లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగ రాజశేఖర్ అన్నారు. స్థానిక కేజీబీవీలో జిల్లాలోని గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఖాన్ అకాడమీ ద్వారా గణిత, సామాన్య శాస్త్రంలో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందిస్తోందని తెలిపారు. పిల్లలు ఇంటి వద్ద అభ్యసన మెరుగుపర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా పిల్లలు ఖాన్ అకాడమీ తరగతుల్లో రిజిస్టర్ చేసుకోవడం, తరగతులను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు నాగుల్మీరా, హరిప్రసాద్, సంపత్కుమార్, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.‘నవోదయ’లో ముగిసిన కళా ఉత్సవ్కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని వెలికితీసేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఎంఈఓ బీ.వీ. రామాచారి మాట్లాడగా విద్యాలయ ప్రిన్సిపా ల్ కె.శ్రీనివాసులు, వివిధ జిల్లాల నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే రెండోస్థానంలో డీసీసీబీ
● బంగారం రుణాల్లో నంబర్–1 ● బ్యాంకు చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) రూ.3,743 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన బ్యాంకు ప్రగతిని వివరించారు. లావాదేవీల్లో రూ.7 వేల కోట్లతో కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం ఖమ్మంకు దక్కిందన్నారు. ఇక బంగారం తాకట్టు రుణాల్లో రూ.850 కోట్లతో ఖమ్మం బ్యాంకు ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇటీవల కందుకూరు, అడసర్లపాడులో బ్రాంచ్లు ప్రారంభించగా, కరుణగిరి, చెరువుమాదారం బ్రాంచ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మంచుకొండ, సిరిపురంలోనూ ఏర్పాటుకు ప్రతిపాదించామని వెల్లడించారు. ఇదే సమయాన రైతుల సౌకర్యం కోసం సారపాక, అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్లను నారాయణపురం, మొండికుంట(అశ్వాపురం)కు మార్చేందుకు నిర్ణయించామని తెలిపారు. పెరిగిన డిపాజిట్లు బ్యాంకు డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే రూ.121 కోట్లు పెరిగి రూ.1,265 కోట్లకు చేరాయని చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక రుణాలు రూ.355 కోట్లు పెరిగి రూ.2,195 కోట్లకు చేరాయన్నారు. 2019–20లో రూ.7.23 కోట్ల నష్టాల్లో ఉన్న బ్యాంకు 2023–24లో లాభాల్లోకి రాగా.. 2024–25లో లాభాలు రూ. 5.30 కోట్లకు పెరిగాయని తెలిపారు. అలాగే, ఈ ఏడాది వానాకాలంలో రూ.923 కోట్ల పంట రుణాలు ఇచ్చామని, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున రూ. 30 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక బ్యాంకు ఉద్యోగులకు 26శాతం వేతనాలు(పీఆర్సీ) పెంచామని, సభ్యుల బీమా ప్రీమియంను రూ.19 నుంచి రూ.14కు తగ్గించామని తెలిపారు. కాగా, ఖమ్మం ఎన్ఎస్టీ, ఖమ్మం రూరల్ బ్రాంచ్ల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఇచ్చిన మార్ట్గేజ్ రుణాల నుంచి కొంత రికవరీ జరిగిందని చెప్పారు. పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం, బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య పాల్గొన్నారు. -
‘రైతు నేస్తం’ను సద్వినియోగం చేసుకోవాలి
మణుగూరు రూరల్ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అందిస్తున్న సలహాలు, సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు అన్నారు. మండలంలోని గుట్టమల్లారం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట సాగులో పాటించాల్సిన పద్ధతులను వివరిస్తారని, వారి సలహాలు, సూచనలతో పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఓలు రాహుల్రెడ్డి, చటర్జీ, హెచ్ఓ సాయికృష్ణ, ఏఈఓలు కొమరం లక్ష్మణ్రావు, హారిక తదితరులు పాల్గొన్నారు. పంటల పరిశీలన.. మండలంలోని తిర్లాపురం గ్రామపంచాయతీలో రైతులు సాగు చేస్తున్న వరి, పత్తి, కూరగాయ పంటలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, మణుగూరు ఏడీఏ బి.తాతారావు మంగళవారం పరిశీలించారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, సాగులో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ భరత్, హెచ్ఓ శివ, హరిశ్చంద్ర పాల్గొన్నారు. డీఏఓ బాబూరావు -
ఆవుపేడ పొడితో గణపతి విగ్రహాలు
ఖమ్మంఅర్బన్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా జలాశయాలు కలుషిమవుతున్నాయి. ఈ విషయమై అవగాహన పెరగడంతో కొన్నేళ్లుగా చాలామంది మట్టితో చేసిన ప్రతిమలను పూజిస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, ఆరుట్ల శ్రీరామ్ ఇంకో అడుగు ముందుకేశారు. గోశాలలో పెద్దసంఖ్యలో ఆవులను సంరక్షిస్తుండగా.. వీటి పేడను ఎండబెట్టి పొడిగా మార్చి వినాయక విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారుచేసే ఈ ప్రతిమలను పూజలు చేశాక నిమజ్జనం చేస్తే నేలలో కలిసి ఎరువులుగా మారతాయి. ఒక్కో విగ్రహాన్ని రూ.100తో విక్రయిస్తుండడంతో భక్తులు కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని గోశాలలోని పశువుల దాణా, సంరక్షనకు వినియోగిస్తున్నామని శ్రీనివాసాచార్యులు తెలిపారు. కాగా, గతంలో ఆవుపేడ పొడితో రాఖీలు, దీపాంతలు కూడా తయారుచేశారు. అంతేకాక గోమూత్రంతో ఫినాయిల్ తయారుచేసి విక్రయిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. -
వాలీబాల్ టోర్నీలో విజేతగా జిల్లా జట్టు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–15 బాల, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రథమస్థానంలో నిలవగా రంగారెడ్డి, మంచిర్యాల ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. ఈ మేరకు విజేతలకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఎంఈఓ హీర్యానాయక్, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్రావు, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఈటీలు, పీడీలు నాగరాజు, సుధాకర్, షబ్బీర్, చెన్నకృష్టారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్, రవికుమార్, బస్వరాజ్, మల్లేశ్, బాబయ్య, వెంకటేశ్, శ్రీలత, జోనల్ సెక్రటరీ పీడీ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
వానలతో వి‘పత్తే’నా..
● పత్తి చేలలో నిలుస్తున్న నీరు ● ఎర్రబారుతున్న మొక్కలు ● రాలిపోతున్న పూత, పిందెబూర్గంపాడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి చేలు ఎర్రబారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని చేలలో నీరు నిలిచి మొక్కలు క్రమేపీ దెబ్బతింటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశాజనంగా ఉన్న పత్తి చేలు.. పది రోజులుగా కురుస్తున్న వానలను తట్టుకోలేకపోతున్నాయి. వర్షాలకు పూత, పిందె రాలుతున్నాయి. పంటను బూజు తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తున్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో పత్తి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గణనీయంగా పెరిగిన సాగు.. జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరిగింది. వరుసగా రెండేళ్ల పాటు మిర్చి వేసిన రైతులకు నష్టాలే మిగలడంతో ఆ పంట సాగును తగ్గించి పత్తి వైపు దృష్టి సారించారు. దీంతో జిల్లాలో సుమారు 2.30 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగవుతోంది. పలు మండలాల్లో జూన్ ఆరంభంలోనే రైతులు పత్తి గింజలు వేయగా.. పంట సాగు చేసి 70 రోజులు కావొస్తోంది. ఇటీవలి వరకు పత్తి పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంది. అడపాదడపా వర్షాలతో మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు పైపాట్లు చేయడం, ఎరువులు వేసేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. ప్రస్తుతం చాలా చోట్ల పూత, పిందె దశకు చేరింది. ఈ తరుణంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటపై ప్రభావం చూపుతున్నాయి. మొన్నటి వరకు ఏపుగా, ఆరోగ్యంగా ఎదిగిన మొక్కలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. లోతట్టు ప్రాంత భూముల్లో నీరు చేరి పత్తి మొక్కలు ఎర్రబారుతున్నాయి. పూత, పిందెలు వానలకు నేలరాలుతుండగా.. పంటకు బూజు తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తున్నాయి. పెరుగుతున్న కలుపు.. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తిలో పైపాట్లు చేసేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో కలుపు పెరుగుతుండగా.. నివారణకు మందుల పిచికారీ చేద్దామన్నా వర్షపు జల్లులు ఆగడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి జల్లులు పత్తి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. నిత్యం వర్షం వస్తుండడంతో మొక్కలు ఎర్రబారి ఆకులు, పూత, పిందె రాలుతున్నాయి. భూమిలో తేమ తగ్గకపోవడంతో మొక్కలు ఆరోగ్యకరంగా ఎదగడం లేదు. ‘నానో’తో మేలంటున్న అధికారులు.. వర్షాలకు పత్తి చేలలో నీరు నిల్వకుండా రైతులు తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కాల్వలు తీసి నీటిని బయటకు పంపించాలని చెబుతున్నారు. వర్షాలతో పత్తి ఎర్రబారకుండా నానో యూరియాను పిచికారీ చేయాలని అంటున్నారు. ప్రస్తుతం మొక్కల వేరు వ్యవస్థ సరిగా పనిచేయదని, అందుకే నానో యూరియాను వినియోగించాలని సూచిస్తున్నారు. -
పంటను ధ్వంసం చేసిన అటవీ అధికారులు
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి కూనారం గ్రామ సమీపంలో కొందరు రైతులు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను అటవీ అధికారులు ధ్వంసం చేశారు. ఇవి అటవీ భూములని చెబుతున్న అధికారులు.. రెండు రోజులుగా పంటను నరికేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉండడంతో పాటు ఇక్కడి రైతులు, అటవీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా రైతులు, అటవీ అధికారులు ఆ భూముల్లోకి వెళ్లొద్దని, ఎలాంటి పనులు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు రైతులు ఎలా వ్యవసాయం చేస్తారని అంటూ అటవీ అధికారులు మొక్కజొన్న పంటను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును వివరణ కోరగా కోర్టు పరిధిలో ఉన్నందున ఆ భూముల్లో ఎవరూ ఎలాంటి పనులు చేపట్టవద్దని, ఆ భూములు పూర్తిగా అటవీ శాఖ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. -
భవిష్యత్ ‘పచ్చ’గా ఉండేలా..
కరకగూడెం: నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ అనేది అత్యంత కీలకమైన అంశం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన భూమి, గాలి, నీరును అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ బాధ్యతను విద్యార్థుల్లో, యువతలో పెంపొందించడానికి వారిని పర్యావరణ పరిరక్షణలో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్ఎస్పీసీ) నిర్వహిస్తోంది. ‘హరిత్ – ద వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్తో దేశవ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గత నెల 1వ తేదీ నుంచి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగుతూ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాగే, ఈ–సర్టిఫికెట్లు అందుకుంటున్నారు. జాతీయస్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన వారికీ నగదు పారితోషికంతో పాటు ‘జాతీయ హరిత విద్యార్థి’ అవార్డుకు అర్హత పొందవచ్చు. ఆగస్టు 30న ఫలితాలు వెల్లడిస్తారు. నేషనల్ స్టూడెంట్ పర్యావరన్ కాంపిటీషన్ దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన, బాధ్యతను పెంపొందించడానికి నిర్వహించే జాతీయస్థాయి పోటీ. పర్యావరణ సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారాల దిశగా ఆలోచన, ఆచరణాత్మక చర్యలు చేపట్టడానికి వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యార్థులే కాకుండా ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎన్ఎస్పీసీ లక్ష్యాలు.. ●విద్యార్థులు, యువతలో వాతావరణ మార్పు లు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం, వనరుల క్షీణత వంటి అంశాలపై అవగాహన కల్పించడం. ●పర్యావరణంపై వ్యక్తిగత బాధ్యతను గుర్తించి, సుస్థిర జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సాహం. ●పర్యావరణ సమస్యలకు వినూత్న, ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడానికి విద్యార్థులను ప్రేరేపించడం. ●పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించి, ఆచరణలో పెట్టేలా ప్రోత్సహించడం. ●పర్యావరణ రంగంలో నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య విజ్ఞానం, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను అందించడం. పోటీ విధానం, ప్రయోజనాలు.. సాధారణంగా క్విజ్, వ్యాసరచన, ప్రాజెక్ట్ ప్రదర్శ న లు, డిబేట్లు, కళలు, క్రాఫ్ట్ లాంటి విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో పాల్గొనడం వల్ల విద్యార్థులకు పర్యావరణంపై సమగ్ర అవగాహన పెరుగుతుంది. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్లో పర్యావరణ రంగంలో వృత్తిని ఎంచుకోవడానికి ప్రేరణ లభిస్తుంది.పర్యావరణ పరిరక్షణకు ముందడుగు నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్లో పాల్గొనడం నాకు ఒక మంచి అనుభవం. టీచర్లు మమ్మల్ని మొక్కలు నాటమని ప్రోత్సహించారు. మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోస్తూ పర్యావరణం విలువ తెలుసుకున్నాం. పర్యావరణ పరిరక్షణకు నేను కూడా పాటుపడుతా. –ఎర్ర స్వీటీ, 10వ తరగతి, కరకగూడెం విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపు కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయి. పుస్తకాల్లో చదివే పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారం కోసం యువత ఆచరణలోకి రావాలి. చిన్నప్పటి నుంచే బాధ్యత కలిగిన పౌరులుగా మారుతారు. –నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ -
మహిళ ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: మంత్రాలు వస్తాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి తనపై దాడి చేసి అవమాన పర్చాడనే మనస్తాపంతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వల్లపు కుమారిని ఈ నెల 16వ తేదీన ఇంటి పక్కన ఉండే ఆటోడ్రైవర్ రాపోలు రవి నీకు మంత్రాలు వస్తాయంట కదా అని ఆరాతీశాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. దంపతులిద్దరూ రవిని నిలదీశారు. గొడవపడ్డారు. మరుసటి రోజు గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అదే రోజున కుమారి పురుగుమందు తాగగా కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై పాల్వంచ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమారి భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కూలిన పూరిల్లుజూలూరుపాడు: మండలంలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండాకు చెందిన ధరావత్ జగ్గు పూరిల్లు మంగళవారం కూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూరిల్లు నాని కుప్పకూలింది. ఆ సమయంలో ధరావత్ జగ్గు, ధర్మి దంపతులు బయట ఉండటంతో ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడిపై కేసు పాల్వంచరూరల్: రోడ్డుపై నిల్చున్న వ్యక్తి ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ కేటీపీఎస్ ఏ–కాలనీలో నివాసం ఉంటూ ఆర్టిజన్గా పనిచేస్తున్న కురుపావత్తు శ్రీనివాస్ ఈ నెల 14వ తేదీన జగన్నాథపురం గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ.. కేశవాపురం వద్ద రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో శ్రీనివాస్ గాయపడ్డాడు. క్షతగాత్రుడి కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు బొల్లం నిఖిల్పై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు. ఆటో పల్టీ.. మహిళకు తీవ్ర గాయాలుఇల్లెందు: ఆటో పల్టీకొట్టి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక బస్టాండ్ నుంచి గుండా ల బస్ బయలు దేరింది. అదే గ్రామానికి చెందిన నూనావత్ స్వప్న బస్సును అందుకోలేకపోయింది. ఓ ఆటో మాట్లాడి బస్సును ఆందుకోవాలని చెప్పింది. డ్రైవ ర్ ఆటోను బస్ కోసం వేగంగా నడుపుకుంటూ వెళ్లడంతో చెరువు కట్ట సమీపంలో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న స్వప్న తీవ్రంగా గాయపడగా.. ఖమ్మం తరలించారు. -
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
● మనస్తాపంతో పురుగుమందు తాగిన యువతి ● చికిత్స పొందుతూ మృతి టేకులపల్లి: ప్రియుడు పెళ్లికి నిరాకరిండచంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించడంతో మృత్యువుతో పోరాడి మృతి చెందింది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తతండా (జీ) పంచాయతీ వెంకట్యాతండాకు చెందిన గుగులోత్ వీరమోహన్ కుమార్తె తుళ్లికశ్రీ (20)ని లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రూప్లాతండాకు చెందిన బానోతు బిచ్చా పెళ్లి చేసుకుంటానని మూడు నెలల కిందట ఒప్పుకున్నాడు. అనంతరం యువతిని బిచ్చా భద్రాచలం, కొత్తగూడెంతోపాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఒకరోజు తుల్లికశ్రీ వేరే అబ్బాయితో మాట్లాడుతోందని అవమానించి, పెళ్లి చేసుకోనని ఫోన్లో బిచ్చా మెసేజ్లు పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఈ నెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. యువతి బాబాయి రాజేందర్ ఈ నెల 15న పోలీస్ స్టేసన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మంగళవారం యువతి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
రోడ్డు గుంతలమయం..
● వాహనదారుల అష్టకష్టాలు ● నిద్రావస్థలో అధికారులు.. టేకులపల్లి: మండల కేంద్రం నుంచి బొమ్మనపల్లి వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లోని ఎన్హెచ్ 930పీ రహదారిలో పెద్ద గుంత ఏర్పడి మంగళవారం ఓ గంట వ్యవధిలోనే పదుల సంఖ్యలో వాహనాలు అదుపుతప్పాయి. అందులో పలువురు గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అంతేకుండా ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై ‘సాక్షి’తోపాటు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సోమవారం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్నాయక్ల పర్యటించారు. వారి వాహనాలు కూడా ఈ గుంతల్లో నుంచి ఇబ్బందికరంగా వెళ్లాయి. అయినప్పటికీ అధికారుల్లో చలనం రావడం లేదు. ఇదిలా ఉండగా.. గుంతలు లోతుగా ఉండటం, ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో నీరు నిండి లోతు అంచనా వేయలేక ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. ఆటోలు, మ్యాజిక్ లాంటి వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి. స్థానికులు స్పందించి గుంత ఉన్న ప్రాంతంలో ఎర్రజెండా పెట్టారు. ఇప్పటికై నా సంబంధిత శాఖాధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
కేటీఆర్ను కలిసిన రేగా కాంతారావు
మణుగూరురూరల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో బీఆర్ఎస్ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.ఎద్దు ప్రాణాలు కాపాడిన సేవా సంస్థ బాధ్యులుకొత్తగూడెంఅర్బన్: సెప్టిక్ ట్యాంక్లో పడి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఎద్దును మదర్ థెరిస్సా సేవా సంస్థ సభ్యులు మంగళవారం కాపాడారు. రుద్రంపూర్ ఏరియాలోని సెప్టిక్ ట్యాంకు లో ఎద్దు పడిన సమాచారం కార్పెంటర్ మంద నాగేశ్వరరావు, ఎండీ షబ్బీర్ తెలియడంతో వారు మదర్ థెరిస్సా సేవా సంస్థ సభ్యులు శ్రీనివాస్, సీహెచ్ రాములుకు తెలిపారు. వారు మరికొందరితో కలిసి ట్యాంక్లో పడిన ఎద్దును పైకి లాగి కాపాడారు.భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత?భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో రెండు వేర్వేరు ఘటనల్లో సీసీఎస్ పోలీసులు, ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం భారీగా గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లోని చెక్పోస్టు వద్ద మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో 7 బస్తాల్లోని 3 క్వింటాళ్ల గంజాయి దొరికిందని తెలిసింది. లారీ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్తో ఉండగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మరో ఘటనలో కూడా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇసుక ట్రాక్టర్ల పట్టివేతపాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మొర్రేడు వాగు నుంచి ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దమ్మపేట సెంటర్ వద్ద మాటు వేసి మూడు ట్రాక్టర్లను పట్టుకుని, పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ముందున్నది ముళ్లబాటే!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహిరంగ మార్కెట్లో తక్కువ ధరతో కోలిండియా, నాణ్యతతో విదేశీ బొగ్గు సింగరేణికి సవాల్ విసురుతున్నాయి. ఉత్పాదక వ్యయం తగ్గించుకోకుంటే సంస్థకు రాబోయే రోజుల్లో ముళ్లబాటేనని స్పష్టంగా తెలుస్తున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో సింగరేణి నుంచి సరైన స్పందన కనిపించడం లేదంటున్నాయి ఆ సంస్థకు సంబంధించిన గణాంకాలు. చేజారుతున్న మార్కెట్ దక్షిణ భారత దేశంతో పాటు మహారాష్ట్ర, ఒడిశా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న భారీ పరిశ్రమలకు నిన్నామొన్నటి వరకు సింగరేణి బొగ్గే ప్రధానం. ఈ బొగ్గును ఉపయోగిస్తున్న పరిశ్రమల్లో సింహభాగం థర్మల్ విద్యుత్ కేంద్రాలది కాగా, ఆ తర్వాత సిమెంట్, ఐరన్ వంటి ఇతర భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సింగరేణికి కోలిండియా, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ల నుంచి సవాల్ ఎదురవుతోంది. ప్రస్తుతం జీ 13 గ్రేడ్ టన్ను బొగ్గును సింగరేణి సంస్థ థర్మల్ పవర్ పరిశ్రమలకు రూ.4000కు విక్రయిస్తుండగా ఇతర పరిశ్రమలకు రూ. 5000కు అమ్ముతోంది. ఇదే గ్రేడ్ బొగ్గును వెస్ట్రన్ కోల్ఫీల్డ్ వారు థర్మల్కు రూ.2,200, ఇతర పరిశ్రమలకు రూ. 2,600కు మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు. కోలిండియా అయితే మరీ తక్కువగా థర్మల్కు రూ.1,600 , ఇతరులకు రూ.1,900కు అమ్మేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటికే సిమెంట్ తదితర భారీ పరిశ్రమలు కోలిండియా, వెస్ట్రన్ కోల్ఫీల్డ్ వైపు మొగ్గు చూపుతుండగా థర్మల్ పవర్లో దేశంలోనే నంబర్ వన్గా ఉన్న ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) సైతం అదే దారిలో వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. అధిక రేటు కారణంగా ఒక్కో సంస్థ సింగరేణికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పని అధిక వ్యయం.. సింగరేణి సంస్థ బొగ్గు వెలికి తీసే గోదావరి – ప్రాణహిత లోయ పరిధిలో నెలకొన్న పరిస్థితుల వల్ల సహజంగానే ఇక్కడ బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఓపెన్కాస్టు గనుల్లో టన్ను బొగ్గు వెలికి తీయాలంటే ఎనిమిది టన్నుల మట్టిని తీయాల్సి వస్తోంది. అదే కోలిండియా పరిధిలో అయితే టన్ను బొగ్గుకు గరిష్టంగా మూడు టన్నుల మట్టి తీస్తే సరిపోతుంది. దీంతో కోలిండియాలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. నిన్నా మొన్నటి వరకు రైలు మార్గంలో రవాణాకు అధిక చార్జీలు ఉండడంతో కోలిండియా నుంచి బొగ్గు తీసుకునేందుకు దక్షిణాది పరిశ్రమలు వెనకడుగు వేసేవి. కానీ రవాణా సౌకర్యాలు మెరుగుపడుతుండగా ఇప్పుడా ఇబ్బంది పోయింది. దీంతో సింగరేణి నుంచి అధిక ధరకు కొనడం కంటే తక్కువ ధరకు వచ్చే కోలిండియా బొగ్గు వైపు దక్షిణాది పరిశ్రమలు చూస్తున్నాయి. సింగరేణికి సవాల్ విసురుతున్న కోలిండియా మస్టర్లు 2022 2023 2024 0 221 183 263 0 - 100 791 960 1,127 101-140 436 448 377 140 -190 688 545 369 -
సరికొత్త హంగులతో..
ఇల్లెందురూరల్: నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నిర్మించిన వైటీసీ ఏడాదిన్నరగా నిరుపయోగంగా మారింది. ఇల్లెందు – కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భవనాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి.. నూతన హంగులతో శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఈ మేరకు వారు చర్యలు చేపట్టారు. ప్రారంభంలో విశేష ఆదరణ.. ఇల్లెందు సమీపంలోని సుదిమళ్ల వద్ద రూ.20 కోట్ల వ్యయంతో 2012లో కేంద్ర ప్రభుత్వం భారీ భవనం నిర్మించింది. ఆ భవనంలో ఐటీడీఏ అధికారులు యువజన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఏక కాలంలో మూడు, నాలుగు బ్యాచ్లకు పలు అంశాలపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా విశాలమైన డిజిటల్ తరగతి గదులు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్ ల్యాబ్, వసతి గదులు నిర్మించారు. ప్రారంభంలో కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, టైలరింగ్, బైక్ మెకానిజం తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ.. యువజన శిక్షణ కేంద్రం నిర్వహణను ఐటీడీఏ ఉన్నతాధికారులు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడంతో లక్ష్యం పక్కదారి పట్టిందనే విమర్శలు వస్తున్నాయి. యువతకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు, ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వానికి నివేదిస్తూ రాయితీ పొందారే తప్ప ఏ ఒక్కరికీ ఉపాధి అవకాశాలు లబించలేదనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అలా అరకొర శిక్షణ శిబిరాల నుంచి క్రమంగా మూతపడే స్థితికి చేరుకుంది. కలెక్టర్ సందర్శనతో.. వైటీసీ దుస్థితిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇల్లెందు మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. తలుపులు, కిటికీలు, విలువైన సామగ్రి చెదలు పట్టడం, గదుల్లో ఫ్లోర్ కుంగిపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగానికి వీలు లేకుండా ఉండటం.. ఇలా ప్రతి గదిలోనూ నెలకొన్న అసౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. భవనంలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, మంచాలను చూసి.. వైటీసీ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. శిక్షణ కేంద్రంలోని ప్రతీ గదిని పరిశీలించి పూర్తిస్థాయిలో సమకూర్చాల్సిన సౌకర్యాలపై అధ్యయనం చేశారు. రూ.30 లక్షల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపారు. శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక.. వైటీసీలో శిక్షణ శిబిరాల నిర్వహణకు ఐటీడీఏ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సెప్టెంబర్లో తొలుత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం మరమ్మతులు పూర్తయిన వెంటనే హాస్టల్ సౌకర్యంతో స్వయం ఉపాధి, పోటీ పరీక్షలకు సన్నద్ధత, ప్రైవేటు రంగంలో ఉపాధి శిక్షణ, జాబ్మేళా నిర్వహణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిలో నైపుణ్య శిక్షణ శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇల్లెందు వైటీసీ మరమ్మతుల కోసం రూ.30 లక్షల వ్యయంతో గిరిజన సంక్షేమ కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపించాం. సెప్టెంబర్లో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభిస్తాం. మరమ్మతులు పూర్తి కాగానే మరిన్ని శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం. – వి.హరికృష్ణ, ఐటీడీఏ జేడీఎం -
మణుగూరుపై సింగరేణి ముద్ర
● పట్టణాభివృద్ధికి సహకారం ఎంతో.. ● సీఎస్ఆర్లో భాగంగా రూ.కోట్ల నిధుల కేటాయింపు ● ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధిమణుగూరుటౌన్: మణుగూరు అభివృద్ధిలో సింగరేణి ముద్ర కనిపిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు సహకారం అందిస్తూ కీలకపాత్ర పోషి స్తోంది. బొగ్గు ఉత్పత్తిలో తన రికార్డులను తానే తిరగరాస్తూ మణుగూరు కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. సింగరేణి 1974 పీకే–1 గనిగా ప్రారంభమై అంచెలంచెలుగా విస్తరిస్తూ ఇప్పటికే 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ వసంతంలోకి అడుగులు పెడుతోంది. ఇటు స్థానికులకు ఉపాధికల్పించి చేయూతనందిస్తూనే మరోవైపు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి ఊతమిస్తుండగా.. నేడు ఓసీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. రూ.కోట్లు కేటాయింపు.. సింగరేణి తన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ఏటా పెంచుకుంటూనే సమీప గ్రామాల అభివృద్ధి, మణుగూరుకు 2014 నుంచి 2025 వరకు రూ.20కోట్లకు పైగా షేప్ నిధులు మంజూరు చేసింది. పంచాయతీల అభివృద్ధికి, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులతో పాటు సింగరేణి ప్రభావిత గ్రామాల్లో బోర్వెల్స్ తీయించడం, సైడ్డ్రెయిన్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఫర్నిచర్, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించింది. మణుగూరు మున్సిపాలిటీ ముంపునకు గురి కాకుండా కట్టువాగు, మొట్లవాగు, కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు ప్రత్యేక నిధులు కేటాయించింది. వేలాది మందికి ఉపాధి.. సింగరేణిలోని మణుగూరు ఏరియాపై వేలాది మంది ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గనుల్లో ఉండే కాంట్రాక్ట్ అవకాశాల్లో భూ నిర్వాసితులకు ప్రాధాన్యం ఇస్తూనే ఓసీల్లో ఔట్ సోర్సింగ్ పనుల్లో డ్రైవర్లు, బొగ్గు రవాణా, బెల్ట్ క్లీనింగ్, ఓబీ కంపెనీల్లో వర్కర్లు, సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీలు, సేల్ పికింగ్ వంటి కాంట్రాక్ట్ పనుల్లో ప్రస్తుతం సుమారు 3,400 మంది ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా మణుగూరులోని సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఉండటంతో అనుసంధానంగా ఏర్పడిన బీటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్లకు లారీల ద్వారా, బకెట్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తూనే స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పించి లారీల ద్వారా బొగ్గును కేటీపీఎస్, ఏపీ జెన్కో, తమిళనాడు, కర్ణాటక విద్యుత్ కర్మాగారాలకు లారీల ద్వారా బొగ్గును తరలిస్తున్నది. స్థానిక లారీ యజమానులకు జీవనోపాధిని కల్పిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధం మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా ఇప్పటికే భూ సేకరణపై పిసా గ్రామసభల్లో ప్రజామోదం లభించగా, ప్రస్తుతం సర్వే దశలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పర్యావరణ అనుమతుల కోసం బుధవారం ఏరియాలోని నేతాజీ గ్రౌండ్ వద్ద సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 1500 – 2000 మంది స్థానిక ప్రజలు సభకు రానున్నారు. సభ ఆమోదం ద్వారా పర్యావరణ అనుమతులతో మణుగూరు ఓసీ విస్తరణకు మార్గం సుగమం కానుంది. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శామియానాల ఏర్పాటుతో పాటు ప్రత్యేక పార్కింగ్ స్థలం, ప్రత్యేక భోజన ప్రదేశాలు ఏర్పాటు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ నాగబాబు సభాస్థలిని పరిశీలించారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఎస్ఓటూ జీఎం శ్రీనివాసాచారి, డీజీఎం (పర్సనల్) రమేశ్, ఎస్టేట్స్ అధికారి బాబుల్రాజు, పర్యావరణ అధికారి శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పనులు పర్యవేక్షించారు. మణుగూరు అభివృద్ధికి సింగరేణి సహకారం అందిస్తోంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఏటా నిధులు కేటాయిస్తోంది. స్థానిక ప్రజల విషయంలో సహృదయంతో ప్రవర్తిస్తూ ఉపాధి కల్పనతో పాటు సమీప గ్రామాల అభివృద్ధికి సింగరేణి సహకారం ఎల్లవేళలా ఉంటుంది. –దుర్గం రాంచందర్, ఏరియా జీఎం -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
బూర్గంపాడు: హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఇన్చార్జ్ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం బూర్గంపాడు పోలీస్స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ అపహరించాడనే కారణంతో అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన కడియం సర్వేశ్వరరావు(32)పై ఇద్దరు వ్యక్తులు సిమెంట్ డంబెల్స్తో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సర్వేశ్వరరావును వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. మృతుడి తల్లి కడియం రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొండల సంతోష్, అదే గ్రామానికి చెందిన చర్లపల్లి శివ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బొమ్మనపల్లిలోని చర్లపల్లి శివ ఇంటి నుంచి గ్యాస్ సిలిండర్ను చెప్పకుండా సర్వేశ్వరరావు తీసుకొచ్చాడనేకారణంతో నిందితులు సర్వేశ్వరరావుతో గొడవ పడి, దాడి చేశారని సీఐ చెప్పారు. విచారణ అనంతరం నిందిలిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో బూర్గంపాడు ఎస్ఐలు మేడ ప్రసాద్, దేవ్సింగ్ ఉన్నారు. -
నవంబర్లో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలో నవంబర్ మూడో వారంలో పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహించనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, అనిల్ సాయిబోలా అన్నారు. సోమవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. 1960 దశకం చివరిలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పీడీఎస్యూ పురుడు పోసుకుందని, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కొలా శంకర్, చేరాలు వంటి ఎంతోమంది.. విద్యార్థుల హక్కుల కోసం, శాసీ్త్రయ విద్య, సమానత్వ సమాజ స్థాపనను కాంక్షిస్తూ విద్యార్థి ఉద్యమంలో అమరులయ్యారన్నారు. ఎన్నో సామాజిక, ప్రజాతంత్ర, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ అయిన ఖమ్మం జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, వీటిని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరించేందుకు దుర్మార్గ సంస్కరణలకు పూనుకుంటోందన్నారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, నరేందర్, అఖిల్ కుమార్, సహాయ కార్యదర్శి వెంకటేశ్, ఎస్.సాయికుమార్, సురేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, అంగిడి కుమార్, అలవాల నరేశ్, మునిగల శివ, అజయ్, నాగరాజు, అషూర్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీ, అనిల్ -
డీఎంహెచ్ఓ కార్యాలయంలో ట్రెయినీ కలెక్టర్
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయాన్ని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ సోమవారం సందర్శించారు. డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఆయన వారం రోజుల వరకు డీఎంహెచ్ఓ కార్యాలయ పనులను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు మధువరన్, పి.స్పందన, సుకృత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫైజ్ మొహియునద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంత? ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర పన్నుల నికర ఆదాయంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎంత..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాలకు వాటాపై 15వ ఆర్థిక సంఘం సూచన, ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ స్థాయి, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల వివరాలను తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాల వాటా రూ. 12.86 లక్షల కోట్లు. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు, సుంకాల నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా మొత్తం రూ.12,86,885.44 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 41 శాతం తక్కువగా ఉందా..? అని ఎంపీ ప్రశ్నించగా 15వ ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫార్సుల ప్రకారం ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా ఎలాంటి పన్ను కేటాయించలేదని తెలిపారు. రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జిపై కదలిక.. ఖమ్మంవైరారోడ్: చింతకాని మండలం రామకృష్ణాపురం 107 రైలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు తెలిపారు. ఈ మేరకు ఎంపీ రవిచంద్ర ఆగస్టు 7వ తేదీన రైల్వే మంత్రికి రాసిన లేఖలో రామకృష్ణాపురం గ్రామ సమీపంలోని 107 లెవల్ క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. తరచూ గేటు మూసి ఉంచడం వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఎంపీ రవిచంద్రకు తిరిగి లేఖ రాశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం 107 లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణం కోరుతూ చేసిన వినతిపై సాధ్యాసాధ్యాలకు సంబంధించి సమగ్ర నివేదిక కోరుతూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. దాడి చేసినవారిపై కేసుములకలపల్లి: తన కొడుకుపై దాడి చేశారంటూ మంగపేట గ్రామానికి చెందిన సడియం వీరభద్రం ఫిర్యాదు చేయగా సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన సడియం శివ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా తండ్రి వీరభద్రం ప్రశ్నించాడు. తన స్నేహితులు వాడే శ్రీను, మడివి జంపన్న, వర్సా చరణ్ పిలిచారని, అందుకే వెళ్తున్నట్లు తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత శివ ఒంటిపై గాయాలతో ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందని అడుగగా.. శ్రీను సోదరికి ఫోన్లో మేసేజ్ చేస్తున్నానని ఆరోపిస్తూ దాడి చేశారని చెప్పాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీడ్రైవర్ను మోసగించిన సైబర్ దుండగులుఖమ్మంఅర్బన్: రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి లారీడ్రైవర్ నుంచి రూ.83,940ను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్స్టేషన్లో సోమవారం సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనంప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్కు చెం దిన షేక్జానీహుస్సేన్లారీడ్రైవర్గా పనిచేస్తున్నా డు.‘పెట్టుబడి పెడితే రెట్టింపులాభం వస్తుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనను నమ్మి, మిత్రుడి సూచన మేరకు గత జూలై 23, 24 తేదీల్లో రూ.83,940 వివిధ దపాలుగా చెల్లించాడు. తర్వాత సంబంధిత ఖాతా బ్లాక్ అవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశాడు. వెంటనే రూ.18 వేలు డ్రా కాకుండా నిలువరించారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ఇంత జరిగినా నిర్లక్ష్యమే..
● కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ● ఐటీడీఏ పీఓ హెచ్చరించినా తీరుమారని అధికారులు ● సాయంత్రం స్నాక్స్ను రాత్రి భోజనంలో పెట్టిన వైనం ● స్వాతంత్య్ర వేడుకల స్టాళ్ల ప్రదర్శనలోనూ బయటపడిన నిర్లక్ష్యం ఖ్మంమయూరిసెంటర్: సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. విద్యార్థులకు సురక్షితమైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. 14రోజుల వ్యవధిలోనే ఒకే ఆశ్రమ పాఠశాలలో రెండు సార్లు విద్యార్థి నులు ఫుడ్పాయిజన్కు గురికావడం తీవ్ర ఆందో ళన కలిగిస్తోంది. ఐటీడీఏ పీఓ హెచ్చరించినా.. జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం రాత్రి తిన్న భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారులు, సిబ్బంది అలసత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వరుస ఘటనలు.. కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 3న ఆదివారం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో మధ్యాహ్నం వండిన చికెన్ రాత్రి తినడం, ఆ మరునాడే ఉదయం ఉడికి ఉడకని కిచిడి తినడంతో 15 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే ఈ నెల 16న శనివారం సాయంత్రం విద్యార్థినులకు అందించాల్సిన స్నాక్స్ (క్యాబేజీ పకోడి) రాత్రి భోజనంతో పాటు అందించడంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే ఆశ్రమ పాఠశాలలో వరుసగా రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో నిర్వహణ, జిల్లా అధికారుల పర్యవేక్షణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమయపాలన లేదు.. గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల ల్లో విద్యార్థులకు అందించాల్సిన అల్పాహారం, భోజనం, స్నాక్స్ వంటి వాటికి సమయపాలన లేదనే విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్నం వండిన చికెన్ సాయంత్రం, సాయంత్రం 4 గంటల సమయంలో అందించాల్సిన స్నాక్స్ రాత్రి భోజనంతో పెడుతున్నారు. జిల్లాలోని అన్ని గిరిజన వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇలానే జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్లూరులో శనివారం సాయంత్రం తయారు చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో అందించడంపై అధికారులు ఆరా తీ యగా.. హెచ్ఎం సరుకులు ఆలస్యంగా ఇచ్చా రని వర్కర్లు, వర్కర్ ఆలస్యంగా వంట తయారు చేశా రని హెచ్ఎం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ పర్యటించి వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు నిర్ధారించి సస్పెండ్ చేశారు. ఆహారం తయారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అధికారులు, హెచ్ఎంలు, వసతిగృహ సంక్షేమ అధికారులను హెచ్చరించారు. అయినా వారు సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. అదే ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వంట చేసిన వారిని అధికారులు వేరే వసతిగృహానికి మార్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. గిరిజన అభివృద్ధి శాఖ అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందే బయటపడింది. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నోట్బుక్స్పై కేసీఆర్, సత్యవతిరాథోడ్ ఫొటోలు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కల్లూరు ఆశ్రమ పాఠశాల ఘటనపై జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మిని వివరణ కోరగా.. సాయంత్రం చేసిన స్నాక్స్ రాత్రి భోజనంతో పాటు తినడంతో విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చిందని, ఘటనలో వర్కర్ను అక్కడి నుంచి మార్చామని తెలిపారు. -
ఎన్నడూ ఎరగని కష్టం..
తల్లాడ/సుజాతనగర్/కరకగూడెం/బూర్గంపాడు: యూరియా కోసం కనివినీఎరుగని కష్టం రైతులకొచ్చింది. యూరియా కోసం ఎన్నడూ తిప్పలు పడని రైతులు.. ప్రస్తుతం నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. ఉదయం నాలుగు గంటలకే సొసైటీ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద క్యూకట్టారు. తల్లాడ సొసైటీకీ 911 కట్టల యూరియా వచ్చిందనే సమాచారం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతి పెద్ద సొసైటీ అయిన తల్లాడలో 15 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందిన వెయ్యి మంది రైతులు సొసైటీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన వారందరికీ యూరియా ఇవ్వాలనీ రైతులు పట్టుబట్టారు. బీజేపీ జిల్లా నాయుకులు ఆపతి వెంకటరామారావు ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తల్లాడ మండల వ్యవసాయాధికారి ఎండీ తాజుద్దీన్, ట్రెయినీ ఎస్ఐ వెంకటేశ్, సొసైటీ సీఈఓ నాగబాబు ఆధ్వర్యంలో రైతులకు కూపన్లు పంపిణీ చేశారు. వచ్చిన ప్రతి రైతుకు ఒక కూపన్ చొప్పున పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్లను పరిశీలించి అందించారు. ఈ కూపన్లు పొందిన రైతులకు మాత్రమే యూరియా కట్టలందజేశారు. కూపన్లు అందని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకే రోజు యూరియా కట్టలు పంపిణీ చేయడం వీలు పడక మంగళవారం నాడు కూపన్లు పొందిన రైతుల్లో సగంమందికి యూరి యా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఓ పక్క వర్షం పడుతున్నా రైతులు యూరియా కోసం తడుచుకుంటూనే నిల్చున్నారు. యూరియా కొరత కారణంగా వచ్చిన వారిలో చాలా మందికి యూరియా అందలేదు. యూరియా వేయాల్సిన తరుణంలో కొరత ఏర్పడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నా రు. ఇక సుజాతనగర్ సొసైటీ గోదాముకు యూరి యా వచ్చిన విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన పురుషులు, మహిళా రైతులు సోమవారం పెద్దఎత్తున తరలివచ్చారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. ఆధార్కార్డుకు ఒకే బస్తా చొప్పున ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా కొందరికే యూరియా బస్తాలు అందడంతో మరికొందరు బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరిగారు. అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవద్దని ఏఓ నర్మద తెలిపారు. మండలంలో రైతులందరికీ సరిపడా యూరియాను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లగోపు పుల్లయ్య ఆరోపించారు. అలాగే, కరకగూడెంలోని ప్రాథమిక సహకార సంఘం సేల్ పాయింట్ వద్ద రైతులు జోరు వానను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి యూరియా కోసం నిరీక్షించారు. గొడుగు లు పట్టుకుని, రెయిన్ కోట్లు వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా కొందరు రైతులకు మాత్రమే యూరియా అందింది. స్టాక్ అయిపోవడంతో పలువురు ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర పీఏసీఎస్ గోదాంకు వచ్చిన ఒక లారీ యూరియా కోసం సుమారు 500 మంది రైతులు రాగా.. పంపిణీ చేసేందుకు అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున విక్రయించారు. అయినప్పటికీ ఇంకా చాలామంది రైతులకు అందక నిరాశగా వెనుదిరిగారు. వారం రోజులుగా యూరియా కోసం తల్లాడ సొసైటీ కార్యాల యం వద్దకు వచ్చి పోతున్నా ను. యూరియాఒక్కకట్ట కూడా ఇవ్వ లేదు. యూరియా వేయాల్సిన తరుణంలో అందక పోవటంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇంత ఇబ్బంది పడలేదు. యూరియా లోడ్ వచ్చిన రోజు ముందు వచ్చిన రైతులకే కూపన్లు ఇస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు వచ్చే సరికి కూపన్లు అయిపోయాయని చెబుతున్నారు. – వి.వంశీకృష్ణారెడ్డి, రైతు, పినపాక పదెకరాలుంటే మూడు యూరి యా కట్టలు కూపన్ల పద్ధతిలో ఇచ్చారు. కూపన్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎకరానికి ఒక కట్ట తప్పనిసరిగా యూరియా వేయాలి. దీంతో ఇంకా ఏడు కట్ట లు అసవరం ఉన్నది. అధికారులను అడిగితే మళ్లీ లోడ్ వస్తే ఇస్తామంటున్నారు. యూరియా కొరత వేధిస్తోంది. –కొలిపాక శ్రీనివాసరావు, రైతు, బిల్లుపాడు -
గిరిజన మార్ట్ ఏర్పాటు చేయరూ..
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీ అటవీ వస్తువులు, ఉత్పత్తులు, గిరిజనుల ఆహార శైలితో విభిన్నత చాటుకుంటోంది. వాటి సంరక్షణకు, ప్రచారానికి ఐటీడీఏ కృషి చేస్తోంది. అవన్నీ ఒకేచోట లభించేలా గిరిజన మార్ట్ ఏర్పాటు చేస్తే మరింత ప్రాచుర్యం లభిస్తుంది. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు భక్తులు, పర్యాటకులు కొనుగోలు చేసుకునేందుకు సులభంగా ఉంటుందని ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రాభవం కోల్పోతున్న గిరిజన స్టోర్లు గిరిజనులు సేకరించే జిగురు, తేనె, కుంకుడు వంటి అటవీ ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో గిరి బజార్ పేరిట ఏర్పాటు చేసిన జీసీసీ స్టోర్లలోవిక్రయిస్తున్నారు. కొంతకాలంగా ఇవి ప్రాభవం కోల్పోతున్నాయి. గిరిజనులు సేకరించే ఉత్పత్తులూ తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో సమూల ప్రక్షాళన చేసి అన్ని ఉత్పత్తులు ఒకే చోట విక్రయించేలా గిరిజన మార్ట్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసినా.. భద్రగిరి మన్యం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ వారి జీవనవిధానం, వ్యవసాయానికి, గృహ అవసరాలకు వాడే పరికరాలు, వస్తువులు, ఆహారం విభిన్నంగా ఉంటాయి. వెదురుతో తయారుచేసే బొమ్మలు, అల్లికలు, ఆటవస్తువులు ఆకట్టుకుంటాయి. వీటన్నింటికీ ప్రాచుర్యం కల్పించేలా ఐటీడీఏ పీఓ రాహుల్ చొరవతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో వీటన్నింటిని ఒక్క చోటకు చేర్చి, నిర్వహణ బాధ్యతలను గిరిజన మహిళలు, నిరుద్యోగుల సమాఖ్యలకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.భద్రాచలంలో గిరిజన మహిళలు పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుకుంటున్నారు. వారు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు, సబ్బులు, షాంపులు ఆదరణ పొందుతున్నాయి. ప్రధాన మంత్రి మోదీ సైతం మన్కీబాత్లో ప్రస్తావించారు. దీంతో దేశస్థాయిలో ప్రచారం లభించింది. వస్తువుల విక్రయానికి ఐటీడీఏ మ్యూజి యంలో, దేవస్థానం, పట్టణంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీసీసీలో లభించే ఉత్పత్తులు, గిరిజన మహిళా పారిశ్రామిక వేత్తలు తయారు చేసే ప్రొడక్ట్స్, ఆదివాసీల సంప్రదాయ వస్తువులతో గిరిజన మార్ట్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్తో ఐటీడీఏ పీఓ రాహుల్, ఇతర అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. రద్దీగా ఉండే దేవస్థానం పరిసర ప్రాంతాల్లో, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. -
● కిన్నెరసాని నుంచి 8 వేల క్యూసెక్కులు..
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి పెరిగింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, 2,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సోమవారం నీటిమట్టం 404.90 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి ఉంచి 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుననట్లు డ్యామ్సైడ్ ఏఈ తెలిపారు. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుండగా, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు, ప్రజలు వాగుల సమీపంలోకి వెళ్లొద్దని, నిర్లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు సూచించారు. నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. -
సీలింగ్ భూములకు పట్టాలు..
● సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● దామరచర్లలో సీఎం సభాస్థలి పరిశీలన, ఏర్పాట్లపై సమీక్షటేకులపల్లి/ఇల్లెందురూరల్/ఇల్లెందు/చండ్రుగొండ: నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సీలింగ్ భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇల్లెందు, టేకులపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించారు. ఈ నెల 21న చండ్రుగొండ మండలం బెండాలపాడులో రాష్ట్రంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటించి చండ్రుగొండలోని హెలీప్యాడ్, దామరచర్లలోని సీఎం బహిరంగ సభాస్థలిని పరిశీలించారు. సీఎం కాన్వాయ్, ఇతర ప్రముఖుల వాహనాల పార్కింగ్, రూట్మ్యాప్, భద్రత ఏర్పాట్లపై ఎస్పీ రోహిత్రాజుతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. లక్ష మంది ప్రజలతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బెండాలపాడు పాఠశాల ఆవరణలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజుతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎలాంటి లోపాలు ఉండొద్దని అధికారులకు సూచించారు. ఇల్లెందు మండలం మేడికుంట శివారులో మసివాగుపై రూ.6 కోట్లతో చేపట్టే బ్రిడ్జి నిర్మాణ పనులకు, సుభాష్నగర్ గ్రామపంచాయతీ లలితాపురం గ్రామం వద్ద రూ.3.60 కోట్లతో చేపట్టే రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జేకు సింగరేణి సీఈఆర్ క్లబ్ గ్రౌండ్లో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం అభివృద్ధి పనులకు రూ. 1.50 కోట్లతో శంకుస్థాపన చేయగా, ప్రహరీ నిర్మాణం, గ్రౌండ్ చదును వంటి పనులు చేపట్టనున్నారు. టేకులపల్లిలో రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు టేకులపల్లి మండలంలో సుమారు రూ. 12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోక్యాతండా నుంచి పాత తడికలపూడి వరకు రూ. 1.25 కోట్లతో, తావుర్యాతండా నుంచి కోక్యాతండా వరకు రూ.1.45 కోట్లతో బీటీ రహదారులు, లక్ష్మీపురం నుంచి పాత తడికలపూడి మధ్య రూ. 83 లక్షలతో కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన నిర్వహించారు. రాంపురంలో రూ.2.5 కోట్లతో, పెట్రాంచెలక ేవద్ద రూ. 2 కోట్లతో వంతెన, కిష్టారంలో రూ. 3 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ వంతెనలకు శంకుస్థాపన చేశారు. సులానగర్ నుంచి ముత్యాలంపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. పాతతండాలో మొక్క నాటారు. కిష్టారంలో ఓ బాధితురాలి వైద్యం కోసం ఆర్థిక సాయం అందించారు. కోయగూడెంలోని ఎమ్మెల్యే నివాసంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మామిడిగుండాల ప్రాంతంలో సీలింగ్ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేస్తామని అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇల్లెందులో మంత్రి పర్యటన జోరువానలోనే సాగింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, అధికారులు రవికుమార్, ధన్సింగ్, శ్రీనివాస్ రావు, రాంప్రసాద్, శ్రీకాంత్, పీసీసీ కార్యదర్శి నాగా సీతారాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ముక్తి కృష్ణ, పులి సైదులు, మండల రాము, మహేష్, కోరం సురేందర్, దేవా, రెడ్యానాయక్, రాంబాబు, లక్కినేని సురేందర్, దళ్సింగ్, ధర్మయ్య పాల్గొన్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, సీఐలు బత్తుల సత్యనారాయణ, రవీందర్ బందోబస్తు నిర్వహించారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ప్రతీ సోమవారం స్వామివారిని ముత్తంగి రూపంలో అలంకరిస్తారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. 23న జాబ్మేళా భద్రాచలం: ఈ నెల 23న భద్రాచలంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని గిరిజన నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు హైదరాబాద్లోని బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్గా పనిచేయాలని సూచించారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్, బీటెక్ కెమికల్ చదివినవారు అర్హులని తెలిపారు. అప్రెంటిస్ శిక్షణలో నెలకు రూ. 10,000 స్టైఫండ్ ఇస్తారని పేర్కొనానరు. ఆసక్తి కలిగినవారు ఐటీడీఏలో యూత్ ట్రైనింగ్ సెంటర్లో హాజరు కావాలని కోరారు. పీహెచ్సీలో డీఎంఓ తనిఖీచర్ల: మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలను జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి(డీఎంఓ) డాక్టర్ స్పందన సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, ల్యాబ్ను పరిశీలించారు. బాధితులను అడిగి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యశాలలో నిర్వహించే ప్రతీ రక్త పరీక్షకు సంబంధించిన రక్త నమూనాను టీ హబ్కు కూడా పంపాలని ఆదేశించారు. ఆర్ఎంపీలతో సమావేశాలను నిర్వహించి పరిధికి మించి చికిత్స అందించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు తపాలా స్కాలర్షిప్లుఖమ్మంగాంధీచౌక్ : దీన్ దయాళ్ స్పర్శ యోజన పథకం కింద 2025 – 26 సంవత్సర పిలాటలీ స్కాలర్షిప్ పథకానికి 6 నుంచి 9వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్ర స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిలాటలీ క్విజ్, ప్రాజెక్టు కార్యక్రమాలను పోస్టల్ డివిజనల్, రీజనల్/సర్కిల్ స్థాయిలో నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అందిస్తామని తెలిపారు. దరఖాస్తులను ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం 507003’ అడ్రస్కు సెప్టెంబర్ 13 లోగా పంపించాలని తెలిపారు. మరిన్ని వివరాలు www.indiapost.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. -
సాగని అన్వేషణ
మణుగూరులో 20 కిలోవాట్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ ● జియో థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధిపై త్రైపాక్షిక ఒప్పందం ● ఏడాది గడిచినా అడుగు ముందుకు పడని వైనంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పగిడేరు దగ్గర భూతాప (జియో థర్మల్) క్షేత్రం అన్వేషణ, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ), తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (తెలంగాణ రెడ్కో) మధ్య గతేడాది ఆగస్టులో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఓఎన్జీసీ డైరెక్టర్ (ఎక్స్ప్లో రేషన్) సుష్మా రావత్, తెలంగాణ రెడ్కో జీఎం సత్య వరప్రసాద్లు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఏడాది పూర్తయినా అన్వేషణలో అడుగు ముందుకు పడలేదు. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ మణుగూరు మండలం పగిడేరు గ్రామం వద్ద భూగర్భం నుంచి వేడి నీరు ఊటలా బయటకు వస్తుంది. ఆ వేడిని ఉపయోగించి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కొన్నేళ్లుగా సింగరేణి సంస్థ ప్రయోగాలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేసి మూడేళ్లపాటు ఫలితాలను పరిశీలించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా పరిశీలించి మణుగూరులో తొలి దశలో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. దీంతో సింగరేణి, ఓఎన్జీసీ, రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 122 మెగావాట్ల ప్రాజెక్టు నుంచి సానుకూల ఫలితాలు వస్తే ఆ తర్వాత దశలవారీగా 3,200 మెగావాట్ల మేరకు జియో థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. త్రైపాక్షిక ఒప్పందాన్ని అనుసరించి మణుగూరు ప్రాంతంలో జియో థర్మల్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలను ఓఎన్జీసీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అనుమతులను పొందడానికి తెలంగాణ రెడ్కో సంస్థ సహకరించాలి. స్థానికంగా అవసరమైన ఏర్పాట్లను సింగరేణి సంస్థ చేయాల్సి ఉంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులపై అటవీశాఖతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏడాది గడిచినా త్రైపాక్షిక ఒప్పందం వల్ల సింగరేణికి ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జియో థర్మల్ విద్యుత్ ప్రయోగాలు సక్సెస్ అయితే మణుగూరు ప్రాంతంలో హీలియం వెలికితీసేందుకు అవకాశాలు ఉన్నాయంటూ త్రైపాక్షిక ఒప్పందం సందర్భంగా ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మారావత్ అన్నారు. దీంతో జియో ప్రాజెక్ట్లో ఎటువంటి పురోగతి ఉంటుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. ఇప్పటికై నా స్తబ్ధత వీడి సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం ఆకాశంలో మేఘాలు అలుముకుంటాయి. మధ్యాహ్నం జల్లులు కురిసే అవకాశం ఉంది. ● గోదావరిలో వరద ఉధృతిభద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు ఎగువన ఉన్న కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్ల నుంచి వరదనీరు వస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.50 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 37.70 అడుగులకు పెరిగింది. నది ఒడ్డున మెట్లప్రాంతంలోని తాత్కాలిక స్నానపు గదులు నీటమునిగాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాలలోని నారచీరల ప్రాంతంలో ఉన్న సీతమ్మవారి విగ్రహం పూర్తిగా నీట మునిగింది. సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. -
వర్సిటీలో అడ్మిషన్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో దోస్త్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందారు. వారికి సౌకర్యాలు కల్పించే పనిలో వర్సిటీ పాలనా విభాగం నిమగ్నమైంది. భవిష్యత్ అవసరాలకు తగినట్టు క్యాంపస్ను తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది. యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్లో నాలుగు కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండు కోర్సులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ విభాగంలో కోర్సుకు 60 సీట్ల చొప్పున 120 సీట్లతో రెండు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించారు. అన్ని రకాల అనుమతులు వచ్చే సరికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) మూడో ఫేస్ చివరి దశలో ఉంది. దీంతో మొదటి బ్యాచ్లో తక్కువ మంది విద్యార్థులకే అడ్మిషన్లు దక్కాయిు. బీఎస్సీ (జియాలజీ) 10, బీఎస్సీ (ఎన్విరాన్మెంట్) 22.. మొత్తంగా 32 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు ప్రత్యేక అనుమతులు సాధించే పనిలో యూనివర్సిటీ యాజమాన్యం ఉంది. సీపీగెట్ (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్) – 2025 ద్వారా త్వరలో రెండు కోర్సుల్లో పీజీ విద్యార్థులు ఇక్కడికి రానున్నారు. చకచకా ఏర్పాట్లు మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ భవనాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం క్యాంపస్లో మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. పాత క్యాంపస్లో గతంలో ఎంబీఏ, ఎంసీఏ తరగతులు నిర్వహించగా, గదులను ఇటీవల ఆధునికీకరించారు. వీటిలో బీఎస్సీ తరగతులు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్న టీచర్ల క్వార్టర్లను బాలికల హాస్టల్గా, ఎన్జీవోస్ క్వార్టర్లను బాలుర హాస్టల్గా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లకు మరమ్మతులు, పాత భవనాలకు వైట్వాష్, అవసరమైన ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నారు. స్పోర్ట్స్ ఎరేనాకు ప్రతిపాదనలు కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్గా, ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్గా కొనసాగిన ఈ కళాశాల.. ఇటీవల డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయింది. క్యాంపస్ ఒకప్పుడు 391 ఎకరాల్లో ఉండేది. మెడికల్ కాలేజీ, ఐడీఓసీ నిర్మాణాలకు కొంత స్థలం తీసుకోగా ప్రస్తుతం 310 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఉంది. క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో 800 సీట్లు ఉండగా, ప్రస్తుతం 650 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఎర్త్ సైన్సెస్ విభాగానికి సంబంధించి 960 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో క్యాంపస్లో 1,760 మంది విద్యార్థులు అభ్యసించే అవకాశం ఉంది. దీనికి తోడు ఇదే క్యాంపస్లో అంతర్భాగంగా ఉన్న మెడికల్ కాలేజీలో 600 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఎరేనాను నిర్మించాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో ఇండోర్, ఔట్డోర్ క్రీడా సౌకర్యాలు, వీక్షకుల కోసం గ్యాలరీలు నిర్మించాలని యోచిస్తున్నారు. అంతకంటే ముందు నిరుపయోగంగా మారిన ఆడిటోరియానికి మరమ్మతులు చేయాలని, పాత బాలుర హాస్టల్ను స్టోర్ రూమ్గా మార్చాలని భావిస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ పీజీ, యూజీ కోర్సుల్లో 360 మంది విద్యార్థులకు విద్యాబోధన జరగనుంది. ఆ తర్వాత పీహెచ్డీ విద్యార్థులు కూడా వస్తారు. వీరందరికీ అవసరమైన తరగతి గదులు, ల్యాబ్లు, వర్క్షాప్, మెస్, హాస్టళ్లకు సంబంధించి నూతన భవనాలు నిర్మించాలి. బోధన, బోధనేతర సిబ్బంది ఎంతమంది అవసరం, ఎప్పుడు నియామకాలు చేపట్టాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. ఈ రెండు అంశాలపై ఉన్నత విద్యాశాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చాక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి సంబంధించిన నూతన భవనాల నిర్మాణం, స్టాఫ్ విషయంలో కదలిక వచ్చే అవకాశం ఉంది.ఎర్త్ సైన్సెస్లో తొలిబ్యాచ్గా 32 మంది విద్యార్థుల ప్రవేశం -
పాఠశాలకు పక్కాగా రావాల్సిందే
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది హాజరును ఈ ఏడాది నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం)యాప్లో నమోదు చేస్తున్నారు. విద్యాశాఖతోపాటు వైద్యశాఖలో కూడా ఎఫ్ఆర్ఎస్ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలకు ఎఫ్ఆర్ఎస్ పరికరాలు చేరాయి. అన్ని కేంద్రాలకు పరికరాలు చేరాక హాజరును నమోదు ప్రారంభించనున్నారు. ఈ విధానం వల్ల అధికారులు, సిబ్బంది హాజరులో అవకతవకలకు తావు ఉండే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే, రిజిస్టర్లలో ఇతరులతో సంతకాలు చేయించడం, పాఠశాలకు వచ్చినా సంతకం పెట్టి వెళ్లిపోవడం వంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీంతో బోధన సక్రమంగా సాగక విద్యార్థులు నష్టపోయారు. ఎఫ్ఆర్ఎస్తో అవకతవకలకు అవకాశం లేకుండాపోయింది. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్ఆర్ఎస్లో చెక్ ఇన్, చెక్ అవుట్ నమోదు చేయాల్సివస్తోంది. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా హాజరవుతున్నారు. ప్రారంభ దశలో సాంకేతిక లోపాలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్లో హాజరు నమోదు చేసుకుంటున్నారు. కొత్తగూడెం నగరంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు వచ్చి హాజరు పడదామని సెల్ఫోన్లో ఎఫ్ఆర్ఎస్ను ప్రారంభిస్తే సాంకేతిక లోపాలతో ఓపెన్ కావడం లేదు. దీంతోపాటు 8.30 గంటలకు ఆన్ చేస్తే 9.30 తర్వాత ఆన్ అవుతుండటం వల్ల కూడా ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చినట్లు నమోదు అవుతోంది. ఇంకా కొన్నింటిలో చెక్ ఇన్, చెక్ అవుట్ రెండు కూడా ఒక్కసారే నమోదవుతున్నాయి. ఫలితంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు లోపాలను సరి చేసి ఎఫ్ఆర్ఎస్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా అధ్యాపకులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ నమోదుకు ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో కళాశాలల్లో కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు జరుగనుంది. వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరుకు సంబంధించిన పరికరాలు చేర్చుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గతేడాది నుంచే ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయుల హాజరు నమోదు చేస్తుండగా ఉదయం 9.45 గంటలలోగా పూర్తి కావాలి. హాజరు నమోదు చేశాక డిటెయిల్డ్ రిపోర్టులో హాజరు నమోదు అప్డేట్ అయ్యిందా, లేదా నిర్ధారించుకోవాలి. నమోదులో లోపాలు ఉంటే తక్షణమే సంబంధిత జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాజరు నమోదుపై సీఆర్పీలు, కాంప్లెక్స్ ఉపాధానోపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని జిల్లా విద్యాధికారులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడుబావుల జలపాతం వద్ద యువకుడు మృతి
ఇల్లెందు: మండలంలోని ఏడుబావుల జలపాతం సొరికలో ఇరుక్కుని ఏన్కూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ మృతి చెందాడు. ఆదివా రం ఆయన మృతదేహా న్ని వెలికితీశారు. ఐదారేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 9 మంది మృతి చెందారు. గతంలో ఏడుబావుల జలపాతం వద్దకు వెళ్లకుండా అధికారులు దారి మూసివేశారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు ఏడుబావులకు వెళ్లే రహదారికి అడ్డంగా కంచె కట్టి, ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయినా ఇల్లెందు మండలం నుంచి ఏడుబావుల సందర్శనకు చాలామంది అటవీ మార్గం నుంచి వెళ్తున్నారు. గుట్ట మీదుగా వెళ్లి ఏడుబావుల అందాలను తిలకించే ప్రయత్నంలో జారి పడి మృతి చెందుతున్నారు. ఓ బావిలో సొరికె ఉండటం, అటుగా వెళ్లిన వారు అందులో కూరుకుని, ఊపిరి ఆడక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ప్రేమ్కుమార్ మృతితోనైనా ఏడుబావుల సందర్శన నిలిపివేయాల్సిన అవసరం ఉంది. గోడ కూలి వృద్ధురాలికి గాయాలుఅశ్వాపురం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో వృద్ధురాలు యన్నం రాములమ్మ ఇంటికి సంబంధించిన మట్టి గోడలు ఆదివారం కూలాయి. ఇంట్లో ఉన్న రాములమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. -
‘పోలవరం’తో భద్రాచలానికి ముప్పు
● ఏపీ సీఎం చంద్రబాబు బ్రెయిన్, గుండె మోదీకి ఇచ్చేశాడు ● మీడియా సమావేశంలో రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ భద్రాచలం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ కారణంగా భద్రాచల పట్టణం, పరిసర గ్రామాలను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే బ్యాక్ వాటర్తో వరదల తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. ఆదివారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాపర్ డ్యాం వల్ల ప్రజలు ఇప్పటికే గృహనష్టాలు, జీవనోపాధితోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యను కేంద్రం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీరాముని ఆలయంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వీడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తెలంగాణలోకి తేవాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల వేదిక నుంచి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ను మాత్రమే ప్రస్తావించడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్వాదులు, కమ్యూనిస్టులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, అనేక మంది విప్లవకారులు ఉరిశిక్షలు ఎదుర్కొన్నారని, కానీ కేవలం ఆర్ఎస్ఎస్నే పొగడటం చరిత్రను వక్రీకరించడమేనని పేర్కొన్నారు. ట్రంప్తో స్నేహం పెంచుకున్నానని చెబుతున్న ప్రధాని మోదీ.. ఆ స్నేహం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడకపోతే అర్థమేమిటని ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రెయిన్, గుండె మోదీకి అప్పగించారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కారం పుల్లయ్య, ఎం.బి నర్సారెడ్డి, గడ్డం స్వామి, వంశీకృష్ణ, బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రావణమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. గోదావరిలో వరద ఉధృతి దుమ్ముగూడెం : గోదావరి వరదలతో ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో సీతమ్మవారి నారచీరల ప్రాంతం ఆదివారం నీట మునిగింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తోంది. దీంతో పర్ణశాలలోని నారచీరల ప్రాంతం చుట్టూ నీరు చేరింది. పర్ణశాల ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నారచీరల ప్రాంతం దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 33 అడుగులుగా నమోదైంది. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని సూచించారు. నేడు ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రానున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సీఎం టూర్ పనుల్లో నిమగ్నమై ఉన్న కారణంగా గ్రీవెన్స్ రద్దు చేసినట్లు వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. సింగరేణి క్రీడలకు నిధులేవి..?సింగరేణి(కొత్తగూడెం): ఏరియా, రీజియన్, కంపెనీ స్థాయి, కోలిండియాస్థాయిలో క్రీడల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా క్రీడా పోటీల నిర్వహణకు సంస్థ నిధులు మంజూరు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా జూన్లో బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపారు. కానీ యాజమాన్యం పెండింగ్లో పెట్టింది. 2024–25లో ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 కోట్లు కేటాయించగా, సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో వర్క్ పీపుల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీల ద్వారా క్రీడా పోటీలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది బడ్జెట్ కేటాయించలేదు. నిధుల్లేకుండా పోటీలు నిర్వహిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 19న డీఈఎల్ఈడీలో స్పాట్ అడ్మిషన్లు ఖమ్మం సహకారనగర్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) – 2025లో అర్హత సాధించి సీటు రాని అభ్యర్థులు ఈనెల 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు డైట్ కాలేజీలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ బాలమురళి ఒక ప్రకటనలో తెలిపారు. 19న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ల కేటాయింపు ఉంటుందని, డైట్లో ఇంగ్లిష్ మీడియంలో 5, తెలుగు మీడియంలో 8 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా మిగిలిన సీట్ల కోసం 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అభ్యర్థులు హాజరు కావాలని, ప్రవేశం పొందిన వారు 21న కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. -
కిన్నెరసానిలో ‘సఫారీ’..
పాల్వంచరూరల్: రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ అటవీ ప్రాంతాల తరహాలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో కూడా సఫారీ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం కలిగిన కిన్నెరసాని ప్రకృతి అందాలు అడుగుడుగునా ఆహ్లాదం పంచుతాయి. ఆ సోయగాలను ఆస్వాదించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజంపై దృష్టి సారించింది. సఫారీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీపావళిలోపు ప్రారంభం ఎత్తైన కొండల మధ్య జలాశయం, అందులో నాలుగు ద్వీపాలు ఉన్నాయి. జలాశయాన్ని ఆనుకుని గుట్టపై 9 కాటేజీలు, అద్దాలమేడల నిర్మాణం చేపట్టారు. రెండు బోట్లు ఉండటంతో రిజర్వాయర్లో పర్యాటకులు జలవిహారం చేస్తారు. రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండగా అటవీశాఖ అధికారులు సఫారీని అందుబాటులోకి తేనున్నారు. డీర్ పార్కు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంపు వరకు అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.45 లక్షలతో పదిమంది కూర్చునే మూడు సఫారీ వాహనాలను వైల్డ్లైఫ్శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీపావళి లోపు సఫారీ ప్రారంభించాలని నిర్ణయించారు. అభయారణ్యంలో మరో రెండు నెలల్లో కో టూరిజం అభివృద్ధి పనులు చేపడతాం. ఈ క్రమంలో సర్వే కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నాం. డీర్ పార్కు నుంచి చింతోనిచెలక మీదుగా రంగాపురం, సిద్దారం వరకు సఫారీ ఏర్పాటు చేస్తాం. –కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారిరూ.45 లక్షలతో మూడు వాహనాలు కొనుగోలు -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళందేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన సువాణం మారుతి శ్రీకాంత్ శర్మ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను దాతకు అందజేశారు. ఏఈఓ శ్రవణ్ కుమార్, వేదపండితులు పాల్గొన్నారు. -
పత్తి సాగులో జాగ్రత్తలు పాటించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంటలో రైతులు జాగ్రత్తలు పాటించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ ఆదివారం తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ●ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని పత్తి చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలి ●అధిక వర్షాలు వచ్చినప్పుడు పత్తి మొక్క పెరుగుదలకు 19:19:19 పాలిఫిడ్ లేదా 13:0:45 మాల్టి–కే పోషకాలను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ●వర్షాలు తగ్గిన తరువాత ఎకరానికి 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులను భూమిలో మొక్కకు 4 అంగుళాల దూరంలో మొదళ్ల దగ్గర వేసుకోవాలి. ●పత్తి చేనులో గుంపులుగుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వడలిపోవడం గమనిస్తే వేరుకుళ్లు (విల్ట్) లేదా పారావిల్ట్గా భావించి మొక్కల మొదళ్ల చుట్టూ వేరు బాగా తడిచే విధంగా లీటరు నీటికి 2.5 గ్రాముల కార్బండిజమ్+మ్యాంకోజెబ్ కలిపిన మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ఆక్సిక్లోరైడ్ మందులను పోసుకోవాలి. ●చేనులో అధిక తేమ ఉన్నపుడు ఎకరానికి 10 కిలోల యూరియాతో పాటుగా 400 నుంచి 500 గ్రాముల కార్బండిజమ్+మ్యాంకోజెబ్ను కలుపుకుని మొక్క మొదళ్ల దగ్గర వేసుకుంటే పారావిల్ట్ను తగ్గించుకోవచ్చు. ●ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, ఆస్ కోకై టా బైట్ వచ్చే అవకాశం ఉంది. మల్టీ–కే లాంటి పోషకాలతో పాటుగా కాప్టాన్+హెక్సాకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రాపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ -
‘మట్టి’ మేలు తలపెట్టవోయ్ !
ఖమ్మంగాంధీచౌక్ : వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో అనర్థాలు చోటుచేసుకుంటుండగా.. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యలో గణపతి ఉత్సవ మండళ్లు ఉండగా, ఒక ఖమ్మం నగరంలోనే 1000కి పైగా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27న జరిగే వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఇప్పటికే పలు చోట్ల పీఓపీ విగ్రహాలను విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మరో వైపున నగరంలోని బైపాస్ రోడ్ రాపర్తినగర్. ఇల్లెందు రోడ్ తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు తయారవుతున్నాయి. విగ్రహం మోడల్ ఫొటో చూపిస్తే సిద్ధం చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. కొందరు పశ్చిమ బెంగాల్ నుంచి మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా, మరి కొందరు ఇక్కడే తయారు చేస్తున్నారు. పీఓపీతో నీటి కాలుష్యం.. గణేష్ ఉత్సవాల సమయంలో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విక్రయిస్తుంటారు. నవరాత్రి వేడుకల తర్వాత ఆ విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తుండగా నీరు కాలుష్యమై జలరాశులు మనుగడ దెబ్బతింటోంది. తాగునీటి జలాశయాలు కలుషితం అవుతున్నాయి. నీటిలో ప్రయోజనం కలిగించే సూక్ష్మ జీవులు మొదలు.. పెద్ద జీవుల వరకు నశించిపోతున్నాయి. మట్టి విగ్రహాలే మేలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో అనర్థాలు చోటు చేసుకుంటుండడంతో ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలను పర్యావరణవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. పీఓపీ విగ్రహాలతో కలిగే నష్టాలు, మట్టి విగ్రహాలతో ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో కొందరు బంకమట్టి, వరిపొట్టు, వరిగడ్డి, కలకత్తా నుంచి గంగామట్టిని తీసుకొచ్చి వెదురు బొంగులు, సర్వే కర్రల సాయంతో విగ్రహాలు తయారు చేసి వాటర్ కలర్స్ దిద్దుతున్నారు. ఈ మట్టి విగ్రహాలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఖమ్మంలో తయారుచేసే మట్టి విగ్రహాలకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, సత్తెనపెల్లి, గుంటూరు, కడప నుంచి కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం. ఇక్కడ 5 నుంచి 16 అడుగుల ఎత్తు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. సైజు, రూపాన్ని బట్టి రూ.10 వేల నుంచి ఆపైన ధరలతో విక్రయిస్తున్నారు. మట్టి గణపతులకు పెరుగుతున్న ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం పెరిగింది. మండప నిర్వాహకులు ఈ విగ్రహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పీఓపీతో కలిగే అనర్థాలపై పర్యావరణవేత్తల ప్రచారం కూడా దీనికి దోహదపడుతోంది. ప్రతి ఏటా మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. – గూడూరు దయాకర్, మట్టి విగ్రహాల కేంద్రం నిర్వాహకుడుపీఓపీ విగ్రహాల నిమజ్జనం తర్వాత చెరువులు, నదుల్లోని నీరు కలుషితమై జీవకోటిని అనారోగ్యం పాలు చేస్తున్నాయి. నీటిలో ఉన్న జీవులు చనిపోతున్నాయి. ఆ నీటిని తాగిన మనుషులు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. మట్టి విగ్రహాలు వినియోగిస్తేనే పర్యావరణానికి మేలు కలుగుతుంది. – డాక్టర్ కడవెండి వేణు గోపాల్, పర్యావరణ వేత్త, ఖమ్మం మండప నిర్వాహకులు మోడల్ ఫొటో చూపిస్తే మట్టి విగ్రహాలు తయారుచేస్తాం. పర్యావరణానికి హాని చేయని సామగ్రిని ఉపయోగిస్తున్నాం. విగ్రహాల తయారీ, విక్రయాలతో ఆరు నెలల పాటు ఉపాధి పొందుతాం. విగ్రహం తడవకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. – మిలాన్, విగ్రహ తయారీ నిపుణుడు, పశ్చిమబెంగాల్మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాం. నిమజ్జనం తర్వాత పీఓపీతో అనర్థాలు, మట్టి విగ్రహాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాం. మండప నిర్వాహకుల్లో కూడా ఈ విగ్రహాలపై అవగాహన పెరుగుతోంది. నగరంలో మట్టి విగ్రహాల వినియోగం గణనీయంగా పెరిగింది. – వినోద్ లాహోటీ, స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం -
రైల్వేస్టేషన్లో టికెట్ కౌంటర్ ప్రారంభం
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్లో మూడు నెలలుగా నిలిచిపోయిన టికెట్ కౌంటర్ సేవలను ఖమ్మం రైల్వేస్టేషన్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ గంగిశెట్టి శ్రీనివాసులు ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గిందనే కారణంతో నాగులవంచ రైల్వేస్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత సర్క్యులర్ను జారీ చేశారు. దీంతో స్టేషన్ను కొనసాగించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టగా తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఈనెల 14న మళ్లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టికెట్ కౌంటర్ను ప్రారంభించడంతో నాగులవంచ, నాగులవంచ రైల్వేస్టేషన్, పాతర్లపాడు, రామాపురం తదితర గ్రామాల వారు టికెట్లు కొనుగోలు చేసి ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు రైలులోనే ప్రయాణించాలని, తప్పనిసరిగా టికెట్లు కొనుగోలు చేసి స్టేషన్ ఆదాయం పెంచాలని కోరారు. కాగా, కాంట్రాక్ట్ పద్ధతిన కాకుండా రెగ్యులర్ టికెట్ బుకింగ్ క్లర్క్ను నియమించాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళ విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును నాగులవంచ రైల్వేస్టేషన్లో నిలపాలని ఆయా గ్రామాల వారు శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం రైల్వేస్టేషన్ కమర్షియల్ సూపర్వైజర్ సూరపల్లి శేషుకుమారి, వివిధ పార్టీల నాయకులు బొర్రా ప్రసాద్రావు, ఆలస్యం బస్వయ్య, నాగమణి, వెచ్ఛా మంగపతిరావు, మద్దినేని నాగేశ్వరరావు, తేలుకుంట్ల శ్రీనివాసరావు, తాళ్లూరి రాము, కొండా గోపి, మద్దినేని వెంకటేశ్వరరావు, వంకాయలపాటి సత్యం, కొల్లి బాబు, కోపూరి నవీన్, పరిటాల యలమంద, తొండపు వేణు తదితరులు పాల్గొన్నారు.హర్షం వ్యక్తం చేసిన నాగులవంచ, పరిసర గ్రామాల ప్రజలు -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
ఖమ్మంవైద్యవిభాగం: గత వారం కోదాడకు చెందిన ఓ మహిళకు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి సీరియన్గా ఉండటంతో యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్లు వేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఉండగా, కుటుంబ సభ్యులు వినియోగించుకోవా లని ప్రయత్నించారు. కానీ పేషంట్కు సీరియస్గా ఉందని, వెంటనే మూడు స్టంట్లు వేయాలని యా జమాన్యం తెలపడంతో ఆరోగ్యశ్రీ ద్వారా చేయా లని కోరారు. కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా రెండు స్టంట్లకే అవకాశం ఉంటుందని చెప్పటంతో చేసేది లేక హుటాహుటిన రూ.2లక్షలు చెల్లించి స్టంట్లు వేయించారు. కనీసం హైదరాబాద్ రిఫర్ చేసినా వారికి ఉచితంగా సేవలు లభించేవి. దీంతో వారు ఆరోగ్య శ్రీ ట్రస్ట్కు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ●ఇటీవల తల్లాడ మండలానికి చెందిన ఓ వ్యక్తికి రాత్రిపూట గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని వైరారోడ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నా అర్ధరాత్రి కావటంతో రిజిస్ట్రేషన్ చేయటానికి ఆరోగ్యమిత్ర అందుబాటులో లేడు. దీంతో పేషంట్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో చేసేదిలేక డబ్బులు పెట్టి యాంజియోగ్రామ్ చేయించి, స్టంట్లు వేయించారు. ●ఇలా రోజూ ఎందరో నిరుపేద, మద్యతరగతి రోగులు ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైనప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల డబ్బుల దాహానికి బలవుతున్నా రు. అంతే కాకుండా సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు వరంలా మారిపోయింది. మిత్రల కొరతతో ఆయా ఆస్పత్రు ల్లో మూడుషిఫ్టుల్లో పనిచేయాల్సిన వారు కరువయ్యారు. దీంతో ఉన్న వారితోనే నెట్టుకొస్తుండటంతో రోగులు తీవ్రఇబ్బందులు పాలవుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకం 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రిరాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. పాద యాత్ర సమయంలో రోగులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయి ఆయన ఆలోచనలో వచ్చిందే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అప్పట్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా లక్షల మందికి ఉచితంగా వైద్యసేవలు అందించగా, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 68 మంది మాత్రమే పథకం ప్రారంభ సమయంలో ఉమ్మడి జిల్లాలో 125 మంది ఆరోగ్యమిత్రలతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవటంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 68 మంది ఆరోగ్య మిత్రలు మిగిలిపోయారు. అందులో ఖమ్మం జిల్లాలో 38 మంది మిత్రలు పనిచేస్తుండగా, భద్రాద్రికొత్తగూడెంలో 30మంది సేవలు అందిస్తున్నారు. జిల్లా రెండుగా విడిపోయినా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు కలిపి ఖమ్మం కేంద్రంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అవసరమైనస్థాయిలో ఆరోగ్యమిత్రలు లేకపోవటం వల్ల రోగులకు ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ సేవలు అశించినస్థాయిలో అందట్లేదు. ఆరోగ్యశ్రీట్రస్ట్ ఏర్పడిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 10 ఆస్పత్రులకే అనుమతు లు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు 55 వరకు ఉన్నా యి. అందులో ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేట్, 8 ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నా యి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 ప్రైవేట్, 7 ప్రభుత్వ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. 7 లక్షలకు పైగా అర్హులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం లభించింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవ లకు ప్రాముఖ్యత పెరిగింది. కానీ, రోగులకు అనుకున్నస్థాయిలో వైద్య సేవలు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ పలురకాల కొర్రీలు పెట్టి రోగులకు ఉచితసేవలు అందకుండా చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని ఆస్పత్రుల్లో ఇక్కడ ఆరోగ్యశ్రీసేవలు లేవని బుకాయిస్తూ డబ్బులు చెల్లించేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో 7,12,461 రేషన్కార్డులు ఉండగా వారంతా ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్కు అర్హులే. రోగి ఆయా ఆస్పత్రులకు వచ్చి సేవలు పొందే సంమయంలో ఆరోగ్యమిత్రలదే కీలక పాత్ర. అర్హులైన రోగులకు రిజిస్ట్రేషన్, ట్రస్ట్ నుంచి అనుమతులు పొందడంతోపాటు డిశ్చార్జ్ అయ్యే వరకు వారి సేవలు కీలకం. సరిపోను ఆరోగ్యమిత్రలు లేకపోవటం ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గాను సుమారు మరో 100మంది ఆరోగ్యమిత్రలు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నా రు. సాధారణంగా ఆరోగ్యమిత్రలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిషిఫ్ట్లు చేయాల్సి ఉంటుంది. కానీ, సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా రాత్రిసమయాల్లో అత్యవసర సేవలు పొందేందుకు వచ్చేవారు ఆరోగ్యమిత్రలు అందుబాటులో లేక డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. కొందరు ఆర్ఎంపీల మూలంగా కూడా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైన రోగులు దూరమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడి గ్రామాల్లో రోగులను ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు తీసుకొచ్చి చేర్పించి, వారితో డబ్బులు కట్టిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ ఉందనే విషయం తెలుసుకొని రోగులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆరోగ్యమిత్రల కొరత ఉన్నా సర్దుకుంటూ పో తున్నాం. ఏ ఆస్పత్రి నుంచైనా ఫిర్యాదు అందితే విచారణ చేసి సంబంధిత రోగికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవే ట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్షం చేస్తే ఫిర్యా దు చేయాలి. –పి.శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ -
పాల్వంచవాసికి రెండు ఉద్యోగాలు
పాల్వంచరూరల్: మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బోడ భావ్సింగ్, పద్మ దంపతుల కుమార్తె బోడ మౌనిక ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ, సూపర్వైజర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసి, పరీక్ష రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించగా సీడీపీఓ పోస్టుకు 26వ ర్యాంక్, సూపర్వైజర్ పోస్టుకు 36వ ర్యాంక్ సాధించినట్లు మౌనిక తెలిపారు. గత నెల 25వ తేదీన పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది. పేదల పక్షాన నిలిచిన నేత అయోధ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరురూరల్: తుదిశ్వాస వరకు పేదల పక్షాన నిలిచిన మహోన్నత నేత బొల్లోజు అయోధ్య అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్యచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విదితమే. మంత్రి పొంగులేటి ఆదివారం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి అయోధ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అయోధ్యచారి రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరని, తుదిశ్వాస వరకు ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేఽశ్వర్లు, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్రెడ్డి, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, నాయకులు పీరినాకి నవీన్, శివసైదులు, కూచిపూడి బాబు, సురేశ్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉప్పొంగుతున్న బుగ్గచెరువు.. కరకగూడెం: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరకగూడెం మండలంలోని పద్మాపురం బుగ్గచెరువు పూర్తిగా నిండి అలుగు పారింది. దీంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బుగ్గ చెరువు సాగునీటి వనరుగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులోకి భారీగా నీరు చేరి అలుగుపారుతోంది. -
మున్నేరు తగ్గుముఖం
ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజులుగా మున్నేరు వరద ఉధృతి పెరగడంతో భయాందోళనకు గురైన ఖమ్మం ప్రజల్లో ప్రస్తుతం ఊరట నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు కాల్వొడ్డు వద్ద నీటి మట్టం 15 అడుగుల వరకు పెరిగి భయాందోళన కలిగించింది. అయితే ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి వరద క్రమంగా తగ్గుతూ సాయంత్రం 4 గంటలకు 11 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. శనివారం ఉదయం 9.5 అడుగుల మేర వరద ఉండగా.. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ఉధృతి పెరగడంతో రాత్రి 8 గంటల వరకు 15 అడుగులకు చేరింది. 15.10 అడుగుల వద్ద సుమారు ఐదు గంటల పాటు నిలకడగా కొనసాగడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. దాదాపు 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు విభాగాల సమన్వయంతో ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ నీటి మట్టం తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు పర్యవేక్షణలోనే.. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం మళ్లీ పెరగకుండా ఉంటే పెద్దగా ముప్పు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా నిర్లక్ష్యం చేయరాదని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బొక్కలగడ్డ, పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలను అధికారులు నిరంతరం సందర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన నష్టం పునరావృతం కాకుండా శనివారం రాత్రి అంతా మున్నేరు పరీవాహక ప్రాంతంలోనే గస్తీ కాశారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచనలతో అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్, ఎస్ఈ రంజిత్కుమార్, ఈఈ కృష్ణాలాల్, డీఈ ధరణికుమార్, టీపీఎస్ సంతోష్ మున్నేరు వరదను నిరంతరం పరిశీలిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వరద 13.5 అడుగులకు, రాత్రి 8 గంటలకు 10.5 అడుగులకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సందర్శకులు రాకుండా కట్టుదిట్టం మున్నేరుకు వరద పోటెత్తడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కాల్వొడ్డుతో పాటు ప్రకాశ్నగర్ వద్ద ప్రజలు మున్నేటి వరదను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిని బ్రిడ్జిపైకి రాకుండా అడ్డుకున్నారు. వరదల సమయంలో మున్నేరు వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
ఉప్పొంగిన వాగులు..
● రహదారులపైకి వరద ప్రవాహం ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఇల్లెందు/ఇల్లెందురూరల్/గుండాల/జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. కొన్ని చోట్ల వరద నీరు రహదారులపైకి పోటెత్తింది. ఈ క్రమంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు పట్ట ణానికి తాగునీరు అందించే ఇల్లెందులపాడు చెరువు అలు గుపోసి ప్రవహిస్తుండగా సత్యనారాయణపురం గ్రా మానికి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. బుగ్గవాగు లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. పట్టణంలోని బర్లపెంట ఏరియాలోని రెండులో లెవల్ కాజ్వేలు పొంగి కల్వర్టు మీదుగా నీరు ప్రవహించగా నంబర్ – 2 బస్తీ, ఎల్బీఎస్ నగర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్ష సూ చనల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్గా ఉండాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. ఇల్లెందు మండలంలోని మస్సివాగు, బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. ఇల్లెందు –మహబూబాబాద్ ప్రధాన రహదారిపై జెండాల వాగు వద్ద వరదనీరు రోడ్డు మీదుగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోచారంతండా, రాఘబోయినగూడెం, కొమ్ముగూడెం తదితర గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని కిన్నెరసాని, మల్ల న్న వాగు, ఏడుమెళికల వాగు, జల్లేరు, దున్నపోతుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నాగారం, దొంగతోగు, పాలగూడెం, కొడవటంచ, అడవిరామారం, సీతానగరం, రాయిగూడెం గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జూ లూరుపాడుమండలంలో ప్రధానమైన పెద్దవాగు, తుమ్మలవాగు, ఎదళ్లవాగులు ఉప్పొంగడంతో 21 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భేతాళపాడు – పడమటనర్సాపురం గ్రామాల మధ్య గల పెద్దవాగు, తుమ్మలవాగు ఉధృతితో బ్రిడ్జిలపై నుంచి వరదనీరు పొంగి ప్రవహించింది. గుండ్లరేవు – అన్నారుపాడు అనంతారం – కాకర్ల, కాకర్ల – దుబ్బతండా, మాచినేనిపేట – వాగొడ్డుతండా మధ్య గల వాగులు పోటెత్తాయి. దీంతో అధికారులు వాగుల వద్ద ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ప్రజలు దాటకుండా చర్యలు చేపట్టారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రరెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆతర్వాత సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.జిల్లా జట్టుకు 20 మంది ఎంపికపాల్వంచరూరల్: ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్–15 వాలీ బాల్ పోటీలకు జిల్లా నుంచి హాజరయ్యేందు కు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తెలిపారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో శనివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు పుణెలో జరిగే జాతీయ పోటీలకు, అక్కడ ప్రతిభ చాటిన వారు చైనాలో జరిగే అంతర్జాతీయస్థాయి పోటీల్లో భారత్ జట్టు తరఫున పాల్గొంటారని వివరించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిలో బాలికల విభాగంలో నందమ్మ, వర్షిత, మస్రే క, ప్రసన్న, శ్రీలక్ష్మి, లాస్యభారతి, మేఘహర్ష, నందు, స్టాండ్బైగా వైశాలి, జనన్యశ్రీ ఉన్నారని, బాలుర విభాగంలో బుర్ర లోకేష్, విష్ణువర్దన్, రిషివర్మ, రాజు, వెంకన్నబాబు, వినయ్ కుమార్, లోకేష్, సందీప్, స్టాండ్బైగా సంతో ష్, హర్షవర్దన్ను ఎంపిక చేశామని వివరించా రు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, వెంకటనారాయణ, కవిత, కృష్ణ, సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, సుజాత, సీత పాల్గొన్నారు. ఆస్పత్రికి ముందస్తుగా గర్భిణి తరలింపుఅటవీ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేనందునే.. చర్ల: మండలంలోని ఆదివాసీ గ్రామమైన వీరాపురం గ్రామానికి చెందిన ఓ గర్భిణిని వైద్యాదికారులు శనివారం ముందస్తుగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాలకు చెందిన గర్భిణులను.. వర్షాల నేపథ్యంలో ముందుగానే గుర్తించి డెలివరీ కోసం తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సత్యనారాయణపురం పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది వీరాపురం వెళ్లి గర్భిణి లక్కీని 108 అంబులెన్స్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ద్విచక్రవాహనాల చోరీ కేసులో అరెస్ట్కొత్తగూడెంఅర్బన్: ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి.. లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక వద్ద రోడ్డుపై ఎస్ఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచ క్రవాహనాలపై బొమ్మనపల్లి వైపు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న ఇద్దరు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టారు. దీంతో కొత్తగూడెంలోని న్యూ గొల్లగూడేనికి చెందిన సైకిల్ మెకానిక్ భీమవరపు యువరాజ్, ఏపీ రాష్ట్రంలోని హేమచంద్రాపురానికి చెందిన కంచర్ల అరవింద్రెడ్డి ఇద్దరూ కలిసి సూర్యాపేట జిల్లా కోదాడలో పల్సర్ మోటార్ సైకిల్, లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామారంలో టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ట్రక్కు చోరీచింతకాని: మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన రైతు ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్ ట్రక్కు చోరీకి గురైంది. రైతు ఏడాది క్రితం ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు కొనుగోలు చేయగా, ప్రొద్దుటూరులో స్నేహితుడైన పాసంగులపాటి విష్ణువర్ధన్ అవసరాలకు శుక్రవారం పంపించాడు. ఆయన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ట్రక్కు చోరీ కావడంతో శనివారం పుల్లారావుకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
మత ఫాసిజాన్ని ప్రతిఘటిస్తేనే వ్యవస్థల పరిరక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో పెరుగుతున్న మత ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడి లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులపై ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరి గిన నాస్తిక సమాజ, అధ్యయన తరగతుల్లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు దేశ పరిస్థితినే కాక ప్రపంచ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పోరాట పంథా రూపొందించుకోవాలని సూచించారు. భావ మే ప్రధానంగా భావించిన వారు భావవాదులుగా, పదార్థమే ప్రధానంగా భావించిన వారు భౌతిక వాదులుగా విభజించబడ్డారని చెప్పారు. అయితే, భౌతికవాదమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించనుండగా, భావవాదం సమస్యల్ని ఇంకా పెంచుతుందని తెలిపారు. దీన్ని గుర్తించిన పాలకవర్గం ప్రజలను మత్తులో ఉంచడానికి మతం, దేవుళ్లను వాడుకుంటోందని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరికివారు తమను తాము ప్రశ్నించుకుంటే విజ్ఞానం వెల్లివిరుస్తుందని విజయ్కుమార్ తెలిపారు. అనంతరం ‘శాసీ్త్రయ దృక్పథం’ అంశంపై సీహెచ్.రమేష్, ‘వాస్తవాల ఆధారంగా జీవించడం ఎలా?’ అన్న అంశంపై బీ.వీ.రాఘవులు మాట్లాడారు. సామాజిక సంబంధమైన విషయాల్లో సత్యాలను బోధించే ఏకై క శాస్త్రం మార్క్సిజం అని పేర్కొన్నారు. ఈ తరగతులకు ఆవుల అశోక్, ప్రీతం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా కన్నెబోయిన అంజయ్య, కోటేశ్వరరావు, చార్వాక, సుధాకర్, క్రాంతి, స్టాలిన్, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు. నాస్తిక సమాజ అధ్యయన తరగతుల్లో వక్తలు -
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
సుజాతనగర్: ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొత్త అంజనాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలు తండా పంచాయతీ పరిధిలోని కోటల్ల గ్రామానికి చెందిన ఈసాల ప్రభాకర్ (39) అప్పుడప్పుడూ ఆటోనడుపుతూ ఖాళీసమయంలో తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన అతడి బావ జబ్బా బాలకృష్ణ ఇంట్లో తాపీ పని చేసేందుకు శనివారం వచ్చాడు. పాత ఇంటి స్లాబ్ను కూలగొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనుంచి కిందపడిపోయాడు. ఆ వెంటనే స్లాబు లోని కొంతభాగం కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై మృతుడి బందువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.రమాదేవి తెలిపారు. ఏడుబావుల వద్ద యువకుడి గల్లంతుబయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద శనివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్కుమార్ తన బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైన ఉన్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమాన ప్రేమ్ ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోది. ఆయన సహచరులు ఎంత గాలించినా ప్రేమ్కుమార్ ఆచూకీ లభించలేదు. ఇంతలోనే చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. -
108 వాహనంలో ప్రసవం
బూర్గంపాడు: మండల పరిధిలోని రాంపురం కేసీ ఆర్ కాలనీకి చెందిన సీహెచ్ స్వప్నకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉద యం 7 గంటలకు మోరంపల్లి బంజర పీహెచ్సీకి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే నొప్పులు ఎక్కువ కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశా రు. దీంతో ఆమెను 108 వాహనంలో భద్రాచలం తరలిస్తుండగా మధ్యలోనే నొప్పులు తీవ్రమయ్యాయి. 108 పైలట్ విజయభాస్కర్ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపగా ఈఎంటీ సుభద్ర స్వప్నకు పురుడుపోసింది. స్వప్న మూడో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అయిన తక్షణమే తల్లీ బిడ్డను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సుభ్రద, విజయభాస్కర్ను ఏరియా ఆస్పత్రి వైద్యులు అభినందించారు.తల్లీ, బిడ్డ క్షేమం -
అధిక వర్షం.. పంటలు ఆగం
టేకులపల్లి: అధికవర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. మండల పరిధిలో ప్రస్తుత సీజన్కు గాను వరి 5,600 ఎకరాలు, పత్తి 33వేల ఎకరాలు, మొక్కజొన్న 12,500, మిర్చి 1,500 ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల అధిక వర్షాలు కురుస్తుండగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీటిలో మునిగిపోయాయి. రోళ్లపాడు, రుక్మాతండా, బేతంపూడి తదితర గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న పంట ల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
ఆర్అండ్బీ రహదారిపై రోడ్లు వేసి నిరసన
బూర్గంపాడు: మండలంలోని సారపాక నుంచి ఇరవెండి వెళ్లే ఆర్అండ్బీ రహదారి దెబ్బతిని గుంతలు తేలగా.. వర్షానికి నీరు నిలిచి స్థానికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం రహదారిపై గుంతల్లో నిలిచిన నీటిలో నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతు రహదారి సమస్యను ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇకనైనా కనీస మరమ్మతులు చేయించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాపినేని సరోజని, ఎస్కే అబీదా, కౌలురి నాగమణి, స్వరూప, ఐశ్వర్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. పత్తికి అంతుపట్టని తెగులుపాల్వంచరూరల్: ఇప్పుడిప్పుడే ఏపుగా ఎదుగుతున్న పత్తి పంటకు గుర్తుతెలియని తెగులు వ్యాపించడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. మండలంలోని కోడిపుంజులవాగుకు చెందిన భూక్యా రవి ఐదెకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. ప్రస్తుతం చెట్లు ఏపుగా పెరుగుతున్నా ఇగురు, చిగురు రావడంలేదు. వచ్చిన ఆకులు సైతం ముడుచుకుపోగా నాలుగు సార్లు మందులు వాడినా ఫలితం లేదని రవి వెల్లడించాడు. పాల్వంచలోని డీలర్ వద్ద పత్తి విత్తనాలు కొనుగోలు చేయగా.. విత్తన లోపంతోనే ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, వైరస్ మాదిరి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తెగులు వ్యాపించగా ఐదు ఎకరాల్లో పత్తి మొక్కలన్నీ ఇలాగే మారాయని వాపోయాడు. -
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలి
కోల్ మూమెంట్ ఈడీ వెంకన్నమణుగూరు టౌన్: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి పటిష్ట చర్యలు చేపట్టాలని కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న అన్నారు. శనివారం ఆయన మణుగూరు ఏరియాలో జీఎం దుర్గం రాంచందర్తో కలిసి ఓసీ–2, ఓసీ–4 వద్ద జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. కేసీహెచ్పీ బంకర్లో రవాణా అవుతున్న బొగ్గు నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 115 లక్షల టన్నుల బొగ్గు లక్ష్యాన్ని సాధించేందుకు కార్మికులు, సూపర్వైజర్లు సమష్టిగా కృషి చేయాలని, రక్షణతో పనిచేస్తూ అధికోత్పత్తికి పాటుపడాలని అన్నారు. సింగరేణి కంటే కోల్ ఇండియాలో తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నందున సింగరేణి బొగ్గును తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసి వినియోగదారులకు తక్కువ ధరకు రవాణా చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగులంతా 8 గంటల సమయాన్ని పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేపీయూజీ మైన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో క్వాలిటీ జీఎం వెంకటరమణ, ఎస్ఓటు జీఎం శ్రీనివాసాచారి, అధికారులు వీరభద్రరావు, చంద్రశేఖర్, రాంబాబు, వీరభద్రుడు, రమేశ్, సురేందర్రాజు, శివ ప్రసాద్, మదన్నాయక్, అనురాధ, సౌరభ్ సుమన్, బైరడ్డి వెంకటేశ్వర్లు, నాగ రమేశ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి హెచ్చరిక దిశగా..
● మున్నేటికి కాల్వొడ్డు వద్ద 15అడుగుల నీటిమట్టం ● ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద మున్నేటికి పోటెత్తింది. ఈ ఏడాది తొలిసారి కాల్వొడ్డు వద్ద 15అడుగులకు పైగా వరద ప్రవహించింది. శనివా రం ఉదయం 9.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ సాయంత్రం 6గంటలకు 15 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ నీటిమట్టం 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అధికారుల పరిశీలన మున్నేటికి వరద ఉధృతి పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12గంటల సమయాన కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య కాల్వొడ్డు వద్ద పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికా రులు, వార్డు ఆఫీసర్లు స్థానికంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 4.30గంటలకు నీటిమట్టం 14.5 అడుగులకు చేరగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన వస్తువులు భద్రపరుచుకోవాలని ప్రచారం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సి పల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి మున్నేటికి ఇరువైపులా పరిశీలించి కార్పొరేటర్లు, ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు రాగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరద పెరుగుతున్న నేపథ్యాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు చేశారు. అలాగే, అలాగే, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో అన్ని శాఖల అధికా రులు మున్నేటి పరీవాహకంలో పర్యవేక్షించారు. కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్, ఎస్ఈ, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లే కాక అర్బన్, రూరల్ తహసీల్దార్లు, త్రీటౌన్ సీఐ, ఇరిగేషన్ అధికారులు ముంపు ప్రాంతాల్లో కలియదిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. కార్పొరేటర్లు తోట గోవిందమ్మ రామారావు తదితరులు కూడా అధికారుల సూచనలు పాటించాలని, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందుగానే అప్రమత్తం కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం.. శనివారం రాత్రి మున్నేటి వరద 17అడుగుల వరకు చేరే అవకాశముందన్న సమాచారంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే సమయాన పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ప్రజలను తరలించాల్సి వస్తే అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తొలిదఫా నయాబజార్ జూనియర్ కళాశాల, రామన్నపేట స్కూళ్లలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు. -
‘ప్రజాయోధుడు’ పుస్తకావిష్కరణ
ఇల్లెందు : గత పదేళ్ల కేసీఆర్ పాలనపై ఇల్లెందు సంజయ్నగర్కు చెందిన తోటకూర మహేందర్ ‘ప్రజాయోధుడు’ శీర్షికన 220 పేజీల పుస్తకాన్ని రచించగా.. హైదరాబాద్లో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. మహేందర్ ఉన్నత చదువు పూర్తి చేసి హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటూ గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎలా ఉండేది, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎలా అభివృద్ధి సాధించిందనే వివరాలను సోదాహరణంగా పుస్తకంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఎలా వక్రీకరిస్తున్నారనే అంశాలను వివరంగా వెల్లడించారు. ఈ పుస్తకంలో కేసీఆర్ జననం, బాల్యం, రాజకీయ రంగప్రవేశం, రెండో దశ తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావం, సీఎంగా కేసీఆర్ పాలన, తెలంగాణ అభివృద్ధి తదితర విషయాలు పొందుపరిచారు. కాగా, మహేందర్ను దిండిగాల రాజేందర్ తదితరులు అభినందించారు. రచయిత ఇల్లెందుకు చెందిన మహేందర్ -
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలి
● సింగరేణి సీఎండీ బలరామ్ ఆదేశం ● సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు, నేతలతో సమావేశంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో పని చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్లు అందించాలని సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. సీఎంపీఎఫ్ రీజియన్ కమిషనర్గా ఇటీవల నియమితులైన వంశీధర్ కుసుంభ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు గతంలో ఏమైనా రుణాలు తీసుకుని ఉంటే నెల రోజుల ముందుగానే వాటిని క్లియర్ చేసుకోవాలని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ పుస్తకాలు అప్డేట్ చేయాలని, వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. అంతకుముందు సంస్థ ప్రధాన కార్యాలయంలో బలరామ్ అధ్యక్షతన సీపీఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డ్ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన నాలుగు ట్రస్టీలకు సంబంధించిన పోస్ట్ రిటైర్మెంట్ కాంట్రిబ్యుటరీ మెడికల్ స్కీమ్ –నాన్ ఎగ్జిక్యూటివ్ ( సీపీఆర్ఎంఎస్– ఎన్ఈ )లకు సంభందించిన అంశాలపై చర్చించారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మారిన ట్రస్ట్ సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణరావు, డైరెక్టర్ (పీపీ) కె.వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. నిత్య కల్యాణ వేడుకలో జంటలు అధిక పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వరుస సెలవులు రావడంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిలాడాయి. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులతో పాటు పెరుగుతున్న గోదావరిని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గోదావరి తీరంలో సందడి వాతావరణం నెలకొంది. -
జోరువానలో మూడుగంటలు శ్రమించి..
బూర్గంపాడు: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి 63 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలై సరఫ రా నిలిచిపోయింది. దీంతో హాస్టల్, తరగతి గదుల్లో అంధకారం అలుముకుంది. ఓ పక్క జోరువాన.. మరోవైపు చిమ్మచీకటిలో దోమల దండయాత్ర సాగించాయి. సుమారు 400 మందికి పైగా బాలికలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తమ పరిస్థితిని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జోరువానను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కాంట్రాక్టర్లు సతీష్, కేదారేశ్వరరెడ్డి సహకారంతో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్లో తెప్పించారు. అయితే పాఠశాల ఆవరణ మొత్తం వర్షానికి బురదమయంగా మారడంతో ట్రాక్టర్ దిగబడిపోయింది. మరో ట్రాక్టర్ను తెప్పించి మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో బూర్గంపాడు విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ కనుకు సత్యనారాయణ, రామకృష్ణ, లైన్మెన్లు జిలాని, భాస్కర్, ప్రదీప్, వెంకన్న, ప్రసాద్ ఎంతగానో శ్రమించారు.బాలికల గురుకులానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ -
ఆస్వాదిద్దాం
అందాలు చూద్దాం.. సత్తుపల్లి: కనుచూపు మేర పచ్చని చెట్లు.. చల్లనిగాలులు.. పక్షుల కిలకిలారావాలు.. జాలువారే జలపాతాలు.. ఘాట్రోడ్పై వెళ్తుంటే మార్గమధ్యలో ఆలయాలు.. దూరంగా ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా కనిపించే కనిగిరి గుట్టలు.. అక్కడక్కడా అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు, ఔషధ మొక్కలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతం కావాలంటే ఒక రోజు సమయం కేటాయించండి చాలు! ఎంతో దూరం వెళ్లాల్సిన పనికూడా లేదు. కుటుంబ సమేతంగా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు! ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో భాగంగా రూ.4.20కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండు జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి.పాటిల్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్, అటవీ శాఖ భద్రాద్రి జోన్ సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్ఓ సిద్ధార్ధ్ విక్రమ్సింగ్. ఎఫ్డీఓ మంజుల తరచూ పర్యవేక్షిస్తుండడంతో పర్యాటకులకు ఒక్కటొక్కటిగా సౌకర్యాలు సమకూరుతూ ఉమ్మడి జిల్లా వాసులకు కొత్త పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయింది. మనస్సును ఆహ్లాదపరిచేలా.. పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్తే అన్ని బాధలు, కష్టాలు మరిచిపోవడమే కాక మనస్సు ఆహ్లాదంగా మారుతుంది. మార్గమధ్యలో ఎలుగుబంటి. దుప్పులు, కణుజులు, అడవిపిల్లులు, జంగుపిల్లులు, పూనుగు పిల్లులు, మూషిక జింక, నెమళ్లను చూడొచ్చు. సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో నిర్మించిన లియోపార్డ్ టవర్ నుంచి చూస్తే అటవీ అందాలతో పాటు చిరుతపులి కదలికలూ అప్పుడప్పుడు కనిపిస్తాయి. ప్రత్యేక బస్సు.. అడ్వాన్స్ బుకింగ్ పులిగుండాల ప్రాజెక్టు సందర్శన కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రతీ శని, ఆదివారం వి.ఎం.బంజరు బస్టాండ్ నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 9, 9.30 గంటలకు, కల్లూరు బస్టాండ్ నుంచి 11, 11.30 గంటల సమయాన బయలుదేరి రామకృష్ణాపురం వరకు వెళ్తాయి. బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణిస్తూ అటవీ అందాలను తిలకించవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా నిర్ణయించారు. అలాగే, 94412 18466 నంబర్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యమూ కల్పించారు. సొంత వాహనంలో వచ్చే పర్యాటకులు సఫారీ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. 27 కిలోమీటర్ల ప్రయాణం పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట ముఖద్వారం నుంచి 27 కిలోమీటర్లు ఘాట్రోడ్డులో అటవీశాఖ ఏర్పాటు చేసిన సఫారి వాహనంలో ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. అటవీశాఖ అభివృద్ధి చేసిన హ ట్లతో విశ్రాంతి తీసుకునే అవకాశముంది. ఎవరూ ఇబ్బంది పడకుండా టాయిలెట్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. మూడు వాచ్టవర్లు, సెల్ఫీపాయింట్, రాత్రి బసకు నైట్ క్యాంపింగ్ సైట్, సోలార్ బోరు ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన రిసెప్షన్హట్(భోజనశాల), అటవీ ఉత్పత్తుల విక్రయ స్టాల్ కూడా ఉంది. కాగా, చండ్రుగొండ మండలం బెండాలపాడు సమీపాన కనిగిరి గుట్టలపై 11వ శతాబ్ధంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం.. అక్కడ మోటబావిని కూడా చూడొచ్చు. అలాగే, పులిగుండాల ప్రాజెక్టు సమీపాన శివాలయంలో పూజలు చేసే అవకాశముంది.కొత్తదనం సంతరించుకున్న పులిగుండాల -
బాధ్యతాయుతంగా పనిచేయండి
● సీఎం పర్యటన ఏర్పాట్లలో లోపాలుంటే సహించం ● అధికారులకు కలెక్టర్ పాటిల్ హెచ్చరికచండ్రుగొండ : ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపాలున్నా సహించబోమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో శనివారం ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు ఇక్కడే పని చేయాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు పరిమిత సంఖ్యలోనే ఇతరులను గ్రామంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల గృహప్రవేశాల అనంతరం సీఎం రేవంత్రెడ్డి వారికి దుస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం సీఎం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభాస్థలి సందర్శన.. చండ్రుగొండలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ స్థలాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్ పరిశీలించారు. వర్షం వస్తే ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సీఎం కాన్వాయ్, ఇతర వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, డీఎస్పీ అబ్దుల్ రహెమాన్, సీఐ విజయలక్ష్మి, ప్రత్యేకాధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. రేపటి ప్రజావాణి రద్దు.. సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి వినతులు ఇచ్చేందుకు రావొద్దని కోరారు. జిల్లాకు రెడ్ అలర్ట్... కొత్తగూడెం అర్బన్ : జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. సాయంత్రం వేళలో వాగులు, పొలాల వద్దకు వెళ్లొద్దని కోరారు. ప్రమాదాల సమయంలో సాయం అవసరమైతే ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08744 – 241950, వాట్సాప్ నంబర్ 93929 19743, భద్రాచలం సబ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08743 – 232444, వాటాప్ నంబర్ 93479 10737, ఐటీడీఏ కార్యాలయంలోని 79952 68352 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
వైభవంగా బాలాజీ కల్యాణం
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ వేడుకను శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ వేడుక అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. హైదరాబాద్కు చెందిన వెలది భాస్కర్రావు – రమాకుమారి దంపతులు స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ఇన్చార్జ్ మేనేజర్ పి.వి.రమణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రెండు గేట్లు ఎత్తివేత కిన్నెరసాని నుంచి 10వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి.. పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 14వేల క్యూసెక్కుల వరద రావడంతో శనివారం నీటిమట్టం 404.60 అడుగులకు పెరిగింది. దీంతో రెండు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. పర్యాటకులకు బ్రేక్.. కాగా, శనివారం సెలవురోజు కావడంతో కిన్నెరసాని జలాశయాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. అయితే లోపలికి అనుమతించకుండా ప్రధాన ద్వారం గేటు మూసివేయడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంపాల్వంచ: టీజీ జెన్కో పరిధిలోని తెలంగాణా స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం కోలాహలంగా ప్రారంభమైంది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ఎన్నికలు రాష్ట్రంలోని సుమారు 25 ప్రాంతాల్లో ఈనెల 30న నిర్వహించనుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు మాత్రం అసోసియేషన్ హెడ్ క్వార్టర్ అయిన కేటీపీఎస్లో సెప్టెంబర్ 2న చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఏఈలు సుమారు 2వేల మంది ఓటు వేసే అవకాశం ఉంది. అయితే తొలిరోజు కేటీపీఎస్ ఐదో దశకు చెందిన ఏఈ జి.కీర్తి ఫైనాన్స్ సెక్రటరీ పదవికి, 7వ దశకు చెందిన ఏఈ పి.నవీన్ జాయింట్ సెక్రటరీ(థర్మల్) పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. 18, 19 తేదీల్లో మిగితా పోస్టులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. తొలిరోజు నామినేషన్ల కార్యక్రమంలో ఎన్నికల అధికారి రవి, మహేష్, లింగ నాయక్, ప్రకాష్, ప్రశాంత్, అఖిలేష్, వాహిని, రమేష్, మంజూషా, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అథారిటీతోనే అభివృద్ధి
● ఆశించినస్థాయిలో పురోగతి లేని భద్రాచలం ● శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులకు నిత్యం తిప్పలే ● మౌలిక సదుపాయాల కొరతతో స్థానికులకూ తప్పని పాట్లు భద్రాచలం అభివృద్ధిలో నానాటికీ వెనుకబడిపోతోంది. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థతో వర్షాకాలంలో అందరం ఇబ్బంది పడుతున్నాం. పట్టణాన్ని ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి. –కందుల రాము, స్థానికుడుభద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో భద్రాచలంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, పట్టణం కలిపి లేదా విడివిడిగా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. భద్రాచలం పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్, నైజాంల కాలంలో నదీ రవాణాకు అనుకూలంగా ఉండడం, రామయ్య కొలువై ఉండడంతో క్రమంగా పట్టణం విస్తరించగా.. జనాభా ప్రస్తుతం లక్ష వరకు చేరింది. అయితే అభివృద్ధిలో మాత్రం జీరోగానే ఉంది. మేజర్ గ్రామపంచాయతీగా వార్షికాదాయం ఎక్కువగానే ఉంది. అయినా వర్షాకాలంలో చినుకుపడితే రోడ్లన్నీ జలమయంగా మారుతాయి. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ, భవన, రోడ్ల నిర్మాణానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇష్టానురీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణాభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో భద్రాచలం విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రభుత్వ స్థలాలకు కొరత ఏర్పడింది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట సమీకృత భవనం నిర్మించాలని, తద్వారా ఖాళీ స్థలాలను భక్తుల వసతి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. సత్వర అభివృద్ధి కావాలంటే.. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి సైతం ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. అది మాఢ వీధుల విస్తరణ వద్దే ఆగిపోయింది. కొద్ది నెలల క్రితం బడ్జెట్లో యాద్రాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి రూ.100 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. కానీ భద్రాచలానికి డెవలప్మెంట్ అఽథారిటీ ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర అభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారి టీ ఏర్పాటు చేసిన తరహాలో భద్రాచల పట్టణం, దేవస్థాన అభివృద్ధికి టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అథారిటీ ఏర్పాటు పర్యాటకా భిృద్ధికి కూడా దోహదం చేస్తుందని చెబుతున్నారు. తగిన సదుపాయాలు కల్పిస్తే ఏజెన్సీలో జలపాతాలు, పాపికొండలకు సందర్శకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
వాతావరణ ం
జిల్లాలో శనివారం ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.కలెక్టరేట్లో పతాకావిష్కరణసూపర్బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్, క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యాచందన, అధికారులు పాల్గొన్నారు.సీఎం చేతుల మీదుగా జిల్లావాసికి అవార్డుదమ్మపేట: మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన, ఏసీపీ మోహన్కుమార్ హైదరాబాద్లోని గోల్కొండలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. మోహన్కుమార్ హైదరాబాద్లోని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో విశిష్ట సేవలకు గత రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం అందించిన అభినందించారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడులో ఈ నెల 21న సీఎం రేవంత్రెడ్డి పర్యటన దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం లబ్ధిదారులను కలిసి సూచించారు. 40 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాట్లపై పోలీస్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ అధికారులు సైతం బెండాలపాడు గ్రామాన్ని సందర్శించి సీఎం భద్రతపై సమీక్షించారు. అనంతరం దామరచర్లలో పది ఎకరాల్లో నిర్వహించతలపెట్టిన సభ ప్రాంగణాన్ని, చండ్రుగొండలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్, రూట్మ్యాప్ను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఓఎస్డీ నరేందర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ వెంకన్నబాబు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, గృహనిర్మాణశాఖ పీడీ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ గిరిజనుడికి సంక్షేమం
భధ్రాచలం: ఏజెన్సీ ప్రాంతంలో ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఐటీడీఏలో ఘనంగా జరిపారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. దేశ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యా, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ ప్రగతి నివేదికను సమర్పించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి గీతాల నృత్యాలు అలరించాయి. ఐటీడీఏ పీఓ రాహుల్ -
సరికొత్త నమూనా..
● శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రణాళిక● ఇటీవల రామాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఆర్కిటెక్ట్ ● బడ్జెట్కు తగినట్లుగా అభివృద్ధి పనుల ప్రతిపాదన ● మాస్టర్ప్లాన్లో ‘సాక్షి’ సూచనలకు చోటు ఆలయ కొత్త నమూనాభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి సరికొత్త నమూనా రూపుదిద్దుకుంటోంది. తాజా ప్రణాళికలో ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులూ చేయకుండా ఇతర అభివృద్ధి పనులనే ప్రతిపాదించారు. దీంతో పదకొండేళ్లుగా రామాలయ మాస్టర్ ప్లాన్పై కమ్ముకున్న మబ్బులు వీడినట్లయింది. వైదిక కమిటీ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాక చేర్పులు మార్పులతో ప్రణాళిక తుదిరూపు దాల్చ నుంది. కాగా మూడు రోజుల క్రితం ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రామాలయాన్ని సందర్శించి, మాస్టర్ ప్లాన్పై చర్చించిన విషయం విదితమే. ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శ్రీరామ నవమికి వచ్చిన నాటి సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రధాన ఆలయంతో సహా సమూల మార్పులను సూచిస్తూ ప్రణాళిక రూపొందించారు. అనంతర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మాస్టర్ప్లాన్ నమూనాలకే పరిమితమైంది. దీంతో అప్పటి ప్రభుత్వం విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి మాఢ వీధుల విస్తరణకు రూ.60 కోట్లు ప్రకటించారు. ఇప్పటికే రూ.36 కోట్లను నిర్వాసితులకు అందించి భూ సేకరణ చేపట్టారు. ఇక ఆలయ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను మరో ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తికి అప్పగించింది. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆయన మాస్టర్ప్లాన్ రూపొందించారు. ప్రధాన ఆలయానికి ఎటువంటి మార్పులూ లేకుండా కేవలం పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులతోనే నూతన నమూనా తయారుచేశారు. ఆలయ వైదిక కమిటీ, కలెక్టర్, ఇతరుల సలహాలు, సూచనల అనంతరం డిజైన్ను ఫైనల్ చేయనున్నారు. కాగా నేల విడిచి సాము చేయకుండా ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్కు అనుగుణంగా ఆ ప్లాన్ సిద్ధం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్టర్ ప్లాన్లో ‘సాక్షి’ సూచనలు రామాలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ ఆవశ్యకత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేస్తూ ‘సాక్షి’ పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాదాపుగా ఆ సూచనలన్నింటినీ కొత్త ప్లాన్లో పొందుపరిచారు. వాగ్గేయకారులకు సముచిత స్థానం కల్పించాలని, హనుమాన్ జయంతి, ఇతర ఉత్సవాలలో భక్తులకు, మాలధారులకు భజన మందిరం ఉండాలని కథనాల్లో పేర్కొనగా, పరిగణనలోకి తీసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించేందుకు తూము రామదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజాను పేర్లతో వేదిక నిర్మించాలని ప్లాన్లో పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు భద్రాచలంలో భక్తులకు వసతి కల్పించాలని సూచనలు చేయగా, బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంలో రూ. 82 కోట్లతో హోటళ్లు, వసతి నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. దీంతో భక్తులు, స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ● ఆధ్యాత్మికత, టూరిజం హబ్గా మారుతున్న భద్రాచలంలో రామాయణ థీమ్ పార్కును దేవస్థానం పరిసర ప్రాంతాల్లోనే నిర్మించాలి. ● ఆలయ ఎగువ భాగాన ఉన్న కుసుమ హరినాధ ఆలయం వైపుగా అభివృద్ధి చేస్తే ఆలయ వీక్షణంతో పాటు ఉపాలయాలు అభివృద్ధి అవుతాయి. ● దేవస్థానం నుంచి గోదావరి ఒడ్డు వరకు ఊయల వంతెన నిర్మించాలి. ప్లాన్లో వంతెన ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆర్కిటెక్ట్కు సూచించారు. ● కాశీ మాదిరిగా నదీ హారతికి గోదావరి ఒడ్డున శాశ్వత వేదికను నిర్మించాలి. గోదావరి ఒడ్డు నుంచి దేవస్థానం ప్రధాన గోపురం కనపడేలా ఏర్పాట్లు చేయాలి. ● వాగ్గేయకారులకు సముచిత స్థానం కల్పించాలి. హనుమాన్ జయంతి, ఇతర ఉత్సవాల కోసం భజన మందిరం నిర్మించాలి. ● గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలి. వీటన్నింటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. ● పార్కింగ్ సమస్యను తీర్చేందుకు పార్కింగ్ కేంద్రం, గోశాల అభివృద్ధి ఇతర పనులను డిజైన్లో పొందుపర్చారు. -
ఆదివాసీ జాతికి అండగా ఉంటా
కుమురం భీం విగ్రహ ఆవిష్కరణలో మంత్రి ధనసరి సీతక్కమణుగూరు టౌన్: ఆదివాసీ జాతికి అండగా ఉంటానని, అలాగని తాము ఎవరికీ వ్యతిరేకం కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మణుగూరు బీటీపీఎస్ వద్ద బీటీపీఎస్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మల దయతోనే తనకు మంత్రిగా పని చేసే అవకాశం లభించిందన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందే విషయంలో లోపాలుంటే తెలపాలని, వాటిని సరిచేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కుమురం భీం విగ్రహాలను ఆవిష్కరిస్తామని చెప్పారు. పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం, ఇరిగేషన్ మంత్రిని కలుస్తానని తెలిపారు. మేడారం జాతరకు ఈసారి రూ.150 కోట్లు నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు రూ.12.50 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యకు నివాళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు అయోధ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. రామానుజవరంలోని వారి నివాసంలో అయోధ్య చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్ రమణ, లక్ష్మయ్య, వట్టం ఉపేందర్, చందా సంతోష్, వట్టం నారాయణ, వాసం రామకృష్ణ, బట్టా విజయ్ గాంధీ, పి.నవీన్, శివసైదులు, సయ్యద్ ఇక్బాల్ హు స్సేన్, గొడిశాల రామనాధం, ఆవుల సర్వేశ్వరరావు, సౌజన్య, కేశవరావు, రహీంపాషా పాల్గొన్నారు. -
అన్నింటా ప్రగతి
సూపర్బజార్(కొత్తగూడెం): అన్ని రంగాల్లో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తోందని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామి దిశగా దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మొదట జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. పతాకవందనం అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఓపెన్ టాప్ జీపులో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజులతో కలిసి ప్రగతి మైదానంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లని వ్యాఖ్యానించారు. జిల్లా పారిశ్రామికంగా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా, ఎకో టూరిజానికి కేరాఫ్గా నిలుస్తుందని పేర్కొన్నారు. గోదావరి నదిపై ప్రయాణాలు జరిగేలా వాటర్వేస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సింగరేణి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. భద్రాచలంలో గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయని తెలిపారు. పాండురంగాపురం నుంచి మల్కాన్గిరి వరకు, కొత్తగూడెం నుంచి కీరండోల్ రైల్వే కనెక్టివిటీ భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి రూ.93 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ 318.69 కోట్ల రైతు భరోసా, మృతి చెందిన 698 మంది రైతు కుటుంబాలకు రూ.34.90 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. ఆయిల్పామ్, కోకో సాగులో తెలంగాణకు జిల్లా హబ్గా మారిందన్నారు. సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తున్నామని, ఆరు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 34 వేల 650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 19 గోదాములు నిర్మించామని తెలిపారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 21 ఉన్నాయని, 9వేల 181 మెట్రిక్ టన్నుల ఎరువులు, 3,168 కిలోల విత్తనాలను పంపిణీ చేసినట్లు వివరించారు. జిల్లాలో 2 లక్షల 76 వేల 57 ఆహార భద్రత కార్డులు, 21 వేల 129 అంత్యోదయ కార్డుల ద్వారా 9లక్షల 3వేల 66 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్లు, 33 కేవీ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం కింద 78,278 దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఇప్పటివరకు 23 లక్షల 25వేల పనిదినాలు కల్పించామని, రూ. 63.17 కోట్లు కూలీలకు చెల్లించామని వివరించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. టీజీ ఐపాస్ ద్వారా 23 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, టీ ఐడియా రాయితీ పథకంలో 38 యూనిట్లకు రూ 1.47 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాలో 1,15,204 మందికి ప్రతినెలా రూ.25.97 కోట్ల ఆసరా పెన్షన్ చెల్లిస్తున్నామని తెలిపారు. సీ్త్రనిధి రుణాలు రూ. 25.22 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు సూక్ష్మ రుణ వ్యాపారాల కింద 448 యూనిట్లకు రూ 9.43 ట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని అన్నారు. అర్హులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 199 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను రూ.39.80 కోట్లతో ప్రారంభించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 7.97 కోట్ల వైద్య సేవలు 3,241 మందికి అందజేసినట్లు వివరించారు. రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్యశాలల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పౌష్టికాహార పథకంలో 30 వేల మంది చిన్నారులకు బాలామృతం కింద నెలలో 16 రోజులు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొబ్బరి పరిశోధనా కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు ప్రతిపాదనలు -
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. బంగారు ఆభరణం వితరణశ్రీ సీతారామ చంద్రస్వామివారికి భద్రాచలానికి చెందిన ముదునూరు బలరామకృష్ణంరాజు స్మార్థకార్థం ఆయన సతీమణ పద్మావతి రూ.1,90,000 విలువైన 21 గ్రాముల బంగారు ఆభరణం ఆలయానికి అందజేశారు. ఆలయ సిబ్బంది కత్తి శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారి జన్మస్థలం వద్ద అర్చకులు పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు చేశారు. కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు గౌతంపూర్ కార్యదర్శిచుంచుపల్లి: ఢిల్లీలోని ఎరక్రోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కంపూడి షర్మిల హాజరయ్యారు. 2023లో ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆమెను వేడుకలకు ఆహ్వానించి ప్రత్యేక మెమెంటోను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని: ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్ టన్నుల యూరియాకు బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. -
అన్ని రంగాల్లో ముందుండాలి..
● త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళిక ● స్వాతంత్య్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్సింగరేణి(కొత్తగూడెం): భారతదేశం అన్ని రంగాల్లో ముందుండేందుకు భారతీయులుగా తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జెండా ఆవిష్కరించి, సింగరేణివ్యాప్త 11 ఏరియాల ఉత్తమ కార్మికులను తోటి డైరెక్టర్లతో కలిసి సన్మానించారు. తొలుత సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు జెండా ఆవిష్కరించారు. సీఎండీ మాట్లాడుతూ.. ఒకనాడు ప్రతీ విషయంలోనూ ఇతర దేశాలపై అధారపడ్డామని, ఇప్పడు పూర్తిస్థాయిలో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచామని చెప్పారు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు. త్వరలోనే బొగ్గు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు పెంచాలని, థర్మల్ విద్యుత్ను 3000 మెగావాట్లకు, సోలార్ విద్యుత్ను 5000 మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆధునిక కాలంలో కీలక ఖనిజాల రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గతంలో దక్షిణ భారతదేశంలో కేవలం సింగరేణి సంస్థ మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసేదని, కానీ, ఇప్పడు అనేక ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఓపెన్కాస్ట్లలో టన్నుకు సగటున 8 క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి రావటం, భూగర్భ గనుల్లో కూడా ఉత్పత్తి వ్యయం పెరగటంతో సింగరేణి బొగ్గు ధరను పెంచాల్సి వస్తోందని, కానీ, పోటీ మార్కెట్లో నిలబడేందుకు బొగ్గు ధరను తగ్గించాల్సిన అవసరం ఉందని, కార్మికులు, అధికారులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జీఎం పర్సనల్ (వెల్ఫేర్) జీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణరావు, వెంకటేశ్వరరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నేతలు రాజ్కుమార్, త్యాగరాజన్తోపాటు లక్ష్మీపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉట్ల సందడికి వేళాయె..
అశ్వారావుపేటరూరల్: శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఎంతో ఉల్లాసంగా జరుపుకునే ఉట్ల పండుగ రానే వచ్చింది. శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని పురణాలు చెబుతుండగా, ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. భక్తులు శనివారం పండగను జరుపుకునేందుకు సన్నద్ధమయ్యారు. బాల కృష్ణుడిని పూజిస్తే సకల శుభాలతోపాటు సంతానప్రాప్తి కలుగుతుందని పలువురు విశ్వసిస్తారు. ఇందుకు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయలలో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ స్మరిస్తారు. వీధుల్లో, కూడళ్లలో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరిస్తారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కాగా, ప్లిలలను కృష్ణుని, గోపికల రూపాలలో అలకరించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తుండడంతో మార్కెట్లలో ఆయా డ్రస్సులు, పిల్లన గ్రోవులు, నెమలి పింఛాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేటి శ్రీకృష్ణాష్టమి పండుగకు సన్నద్ధం -
అంతర్రాష్ట్ర ముఠా సంచారం..!
కరకగూడెం/పినపాక: రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా లో ఉన్న తునికి చెట్లను అక్రమంగా నరికి ఇతర రాష్ట్రాలకు తరలించే అంతర్రాష్ట్ర ముఠా పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం అందిందని ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్విని తెలిపారు. శుక్రవారం పలు గ్రా మాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. తునికి చెట్లు అటవీ సంపదలో భాగమని, వీటిని నరికితే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అంతరాష్ట్ర దొంగలు కొందరు కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో పాగా వేసి చెట్లను నరికేందుకు సిద్ధమయ్యారని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలపాలని ఆమె సూచించారు. విద్యార్థులకు అటెండర్ చేయూతఅశ్వాపురం: మండలంలోని నెల్లిపాక బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థుల రవాణా ఖర్చులకు పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న జ్యోతికిరణ్ తన జీతం నుంచి ప్రతి నెల రూ.6 వేలు ఇస్తానని శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రకటించారు. దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు రెండేళ్లుగా గ్రామస్తులు తలా కొంత డబ్బు సాయం చేస్తున్నారు. ఈ ఏడాది దాతలు ముందుకు రాకపోవడంతో అటెండర్ జ్యోతికిరణ్ విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రాగా.. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతికిరణ్ను పాఠశాల హెచ్ఎం శంకర్ ఆధ్వర్యంలో సన్మానించారు. కాగా, హిందీ ఉపాధ్యాయుడు రాంబాబు ఒక నెలకు విద్యార్థుల రవాణా ఖర్చుకు రూ.10 వేలు, నెల్లిపాక పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ అక్కిన అచ్చుతరామారావు రూ.10 వేలు అందించారు. సూర్యతండాలో చిన్నారులకు అస్వస్థతరఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సూర్యతండాలో పది రోజులుగా పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉన్నట్టుండి వరుసగా వాంతులు, విరోచనాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు జాటోత్ జయంత్, పవన్శ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. కాగా, గ్రామంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవడానికి తాగునీరు కలుషితమా లేక వాతావరణ మార్పులు కారణమా అన్నది తెలియడం లేదు. వైద్యాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అవసరం తీరాక అంతే..
● నాడు ఆశ్రయం కల్పించి.. పనిచేయించారు.. ● నేడు లీజ్ భూముల పేరుతో ఖాళీకి ప్రణాళిక ● కార్మిక కుటుంబాలపై సింగరేణి శీతకన్ను ఇల్లెందురూరల్: బొగ్గు గనుల్లో పనులు చేసేందుకు ఆవిర్భావ సమయంలో స్థానిక కూలీలు ముందుకు రాలేదు. నాటి అధికారులు సుదూర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించి ఆశ్రయం కల్పించి పూసపల్లి భూగర్భగనిలో పనులు చేయించారు. నాడు వలస కార్మికుల సమూహంతో గూడుకట్టుకున్న ఆవాసం నేడు 21పిట్ ఏరియాగా ఉంది. ఆవిర్భావం నాటి కార్మికుల వారసులే ప్రస్తుతం ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ, 138 ఏళ్ల తర్వాత ఓసీ విస్తరణ పనుల పేరుతో నిర్వాసితులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు సింగరేణి అధికారులు సిద్ధమవుతుండడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. అంకితభావంతో పనులు బొగ్గు తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించి పనిలో వినియోగించారు. ఆ రోజుల్లో బొగ్గు తవ్వే పని చాలా ప్రమాదకరంగా ఉండేది. కార్మికుడు బావిలో పనికి వెళ్తే తిరిగి వచ్చే వరకు ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. తగినంత గాలి, వెలుతురు లేకపోవడంతో కూడా వారి ఆరోగ్యానికి హాని కలిగేది. రోజుకు 10 – 12 గంటలు పని చేసినా వారికి దినసరి కూలీ చెల్లించేవారు. అయినా వారు కష్టపడి పనిచేశారు. గని సమీపంలోనే గుడిసెలు బొగ్గు గనుల ఆవిర్భావ సమయంలో నాటి అధికారుల ఆదేశం మేరకు కార్మికులు గనికి సమీపంలోనే గుడిసెలు వేసుకొని నివసించేవారు. గుడిసె నిర్మాణం కోసం సంస్థ అధికారులే సామగ్రి సమకూర్చేవారు. చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో క్రూరమృగాల భయంతో పని ముగిసిన తరువాత కార్మికులు సమూహంగా ఏర్పడి దివిటీ వెలుగులో గూటికి చేరుకునేవారు. సింగరేణి నామకరణంతో పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా గుర్తింపు పొందిన తరువాత కార్మికుల నివాసాలకు సమీపంలోనే అధికారుల నివాసం కోసం రేకులతో క్వార్టర్లను నిర్మించారు. అప్పటి నుంచి 21పిట్ ఏరియాగా పిలుస్తుంటారు. స్పష్టమైన హామీలతో చకచకా.. వందేళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అడుగంటడంతో ప్రస్తుతం జేకేఓసీ విస్తరణ పేరుతో సింగరేణి యాజమాన్యం బొగ్గు వెలికితీతకు సన్నద్దమైంది. దీనికోసం అన్ని అనుమతులు పొందే సమయంలోనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సభ నిర్వహించింది. నిర్వాసితులయ్యే వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని, ప్రజలందరికీ న్యాయం చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. నిర్వాసితుల గుర్తింపులోనూ అలాగే ప్రకటనలు గుప్పించి, ముందుకెళ్లారు. బూడిద చేతిలో పెట్టి.. 21పిట్ ప్రాంతం మొత్తం సింగరేణి లీజు పరిధిలో ఉందని, ఇక్కడ నివసిస్తున్న వారికి పరిహారం ఇవ్వడం కుదరదని, ఇల్లు కట్టుకునేందుకు 90 గజాలు స్థలం మాత్రమే ఇస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం మాటెత్తొద్దని హుకుం జారీ చేస్తున్నారు. కానీ, బ్రిటీష్ హయాంలో 21పిట్ ఏరియాకు వలసవచ్చిన కార్మికులు అంకితభావంతో పనులు చేసి సంస్థను నిలబెట్టారు. మానవతా దృక్పథంతో సాయం చేయాల్సిన అధికారులు చట్టాలను చూపించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఓ అధికారి.. ‘మీరు నివసిస్తున్న ఇంటి స్థలం ఎవరిదో మీ అయ్యలు మీకు చెప్పలేదా’అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం ఆగ్రహానికి కారణమవుతోంది. మా నాన్న ఇబ్రహీం బేగ్ వందేళ్ల కిందట సింగరేణిలో పని చేశాడు. నాటి నుంచి మా కుటుంబం ఇక్కడే ఉంటోది. నేడు ఇంటి స్థలం ఇస్తాం.. ఖాళీ చేయండి అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. వందేళ్ల సేవను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు. –ఎండీ బేగ్, 21పిట్ ఏరియా సింగరేణి సంస్థకు పురుడు పోసిన కార్మికుల శ్రమను సంస్థ గౌరవించాలి. వారి వారసులకు అందించే సహకారాన్ని, ఇచ్చే పరిహారాన్ని మానవీయ కోణంలో చూడాలి. నాడు అవసరం కోసం ఇంటి నిర్మాణానికి సహకరించి ఇప్పుడు ఖాళీ చేయమనడం అన్యాయం. –దండు బాలయ్య, మాజీ కార్మికుడు -
450 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
జూలూరుపాడు: స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జూలూరుపాడులో 450 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆరోగ్య జీవనయాత్ర–వాకర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి శ్రీ సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, జీవనయాత్ర సభ్యులు వేల్పుల బోసు, బాపట్ల వెంకటేశ్వర్లు, సాయిన్ని సత్యనారాయణ, తాళ్లూరి నవీన్, కిరణ్ చౌదరి, రామకృష్ణ, ఉసికల భాస్కర్, వందనపు కమలాకర్, ఉల్లి పూర్ణచందర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు.