breaking news
Bhadradri District News
-
ఎఫెక్ట్!
రైల్వేకూ బ్యాక్ వాటర్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను గుర్తించి, తగిన చర్యలు తీసుకోకపోతే భద్రాచలం సబ్ డివిజన్ అభివృద్ధి సైతం ప్రమాదంలో పడనుంది. ఇప్పటికే మంజూ రైన భద్రాచలం–మల్కాన్గిరి రైల్వేలైన్లో భాగంగా గోదావరిపై చేపట్టాల్సిన రైల్వే వంతెన నిర్మాణం కూడా భారంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనతో భద్రాచలం సబ్ డివిజన్లో ఏడు మండలాలు ఏపీలో కలిసిపోయాయి. కేవలం భద్రాచలం పంచాయతీ మినహా టెంపుల్ టౌన్ చుట్టూ అసలు స్థలమే లభ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పుష్కర కాలంగా భద్రాచలం అభివృద్ధికి దూరమైంది. ఈ క్రమంలో కేంద్రం భద్రాచలం మీదుగా కొత్త రైల్వే మార్గాలను ప్రకటించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమైంది. స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కోటాలో 2024లో మల్కాన్గిరి–పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్ను మంజూరు చేసింది. తెలంగాణ, ఏపీ, ఒడిశాల గుండా లైన్ నిర్మించాల్సి ఉండగా, రెండున్నరేళ్లుగా భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. అది పూర్తయితే నిర్మాణ పనులు ప్రారంభించి, ఐదేళ్లలో లైను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరగా పాండురంగాపురం నుంచి సారపాక వరకు నిర్మిస్తే... 174 కి.మీలు నిర్మించా ల్సి న పాండురంగాపురం–మల్కాన్గిరి రైలు మార్గానికి రూ.3,592 కోట్ల ఖర్చవుతుందని కేంద్రం పేర్కొంది. పాండురంగాపురం నుంచి సారపాక వరకు 13 కి.మీ మేరకు త్వరగా కొత్త లైన్ నిర్మిస్తే, తక్కువ బడ్జెట్తోనే భద్రాచలానికి రైలు మార్గం అందుబాటులోకి తేవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే కోరుతోంది. ఆ తర్వాత దశలో గోదావరిపై వంతెన నిర్మాణం, ఏపీలో పలు స్టేషన్ల మీదుగా ఒడిశాలోని మల్కాన్గిరి కి వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ప్రాధాన్యతలు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కువ సమయం, నిధులు ప్రస్తుతం గోదావరిలో జూలై నుంచి సెప్టెంబరు/అక్టోబరు వరకే వరద నీరు ఎక్కువగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత అక్టోబరు నుంచి జూన్ వరకు తక్కువ స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో ఆరు నెలలు 48 అడుగుల మేర, మరో ఆరునెలలపాటు కనీసం 20 అడుగులకు పైన నీరు ఉంటుంది. ఆ స్థాయిలో నీరు నిలిచి ఉంటే గోదావరిపై రైల్వే వంతెన నిర్మాణానికి ఎక్కు వ సమయం, ఎక్కువ బడ్జెట్ అవసరమవుతుంది. అదే పరిస్థి తి ఎదురైతే భద్రాచలం మీదుగా ముందుగా మల్కాన్గిరి తర్వాత కిరండోల్ ప్రాంతాలకు రైలు మార్గాలు సకాలంలో అందుబాటులోకి రావడమనేది కష్టంగా మారుతుంది. వెరసి భద్రాచలం అభివృద్ధికి మరోసారి చుక్కెదురు అయ్యే ప్రమాదం ఉంది.పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం సబ్ డివిజన్లో ఏ మేరకు పంట పొలాలు ముంపునకు గురవుతాయి, భద్రాచలం పట్టణం ఏ మేరకు ప్రభావితం అవుతుందనే అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఇటు తెలంగాణ సర్కార్ సైతం ఇదే అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. భద్రాచలం భవిష్యత్కు ఆశాకిరణాల్లా మారిన కొత్త రైలు మార్గాల నిర్మాణ పనులపై బ్యాక్ వాటర్ ప్రభావం అంశానికి కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు మొదలు పార్లమెంటు సభ్యుల వరకు పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ను దృష్టిలో ఉంచుకుని పాండురంగాపురం నుంచి సారపాకకే పరిమితం కాకుండా భద్రాచలం వరకు త్వరిత గతిన రైలు మార్గం అందుబాటులోకి తేవాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. -
నిందితుడి అరెస్ట్
అశ్వారావుపేటరూరల్: పార్కింగ్ చేసి ఉన్న ఓ ఆటోను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ పి.నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని భద్రాచలం రోడ్లో ఉన్న శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వద్ద ఈ నెల 23న అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడేనికి చెందిన మహంకాళి వెంకటేష్ ఆటో పార్కింగ్ చేయగా, చోరీకి విచారణ చేపట్టారు. దీంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన ఎస్ఐ టీ యాయతీ రాజు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎస్కే రహీం అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు గుర్తించి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎస్కే రహీంను అరెస్ట్ చేశారు. -
ఆశీర్వాద సభకు వరుణుడి అడ్డు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం / చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభకు వర్షం అడ్డంకిగా మారింది. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనాల్సిన ఈ సభాప్రాంగణం రెండు రోజులుగా కురిసిన వర్షంతో చిత్తడిగా తయారైంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో సభ, రైతుమేళా, సీఎం కాన్వాయ్ కోసం కేటాయించగా.. వాహనాల పార్కింగ్తో కలిపి మొత్తంగా 150 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే కురిసిన వర్షంతో తొలుత రెండు రోజులు జరగాల్సిన రైతుమేళా రద్దు చేశారు. ఇక సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి సభ నిర్వహించడం సాధ్యం కాదని తేల్చడంతో మంగళవారం నాటి సభ కూడా రద్దయింది. అయితే మంగళవారం హైదరాబాద్లో రైతుభరోసా నిధులను సీఎం విడుదల చేయనుండగా, నిధుల పంపిణీ పూర్తయ్యాక ముగింపు సభ చింతకాని మండలంలో ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించాలని నిర్ణయించారు. భారీగా ఏర్పాట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ వేదిక పైనుంచి సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.9 వేల కోట్ల మేర రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని ప్రకటించారు. ఇందుకోసం 2 లక్షల మంది రైతులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. వారం రోజులుగా ఏర్పాట్లు చకచకా చేపట్టారు. తొలుత ఆది, సోమవారం రైతు మేళా జరుగుతుందని.. మంగళవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, వర్షంతో రైతుమేళాను ఒకే రోజుకు కుదించినా పరిస్థితి చక్కబడకపోవడంతో మొత్తంగా రద్దు చేశారు. ఇక సభా ప్రాంగణంలో బురద పేరుకుపోవడం, వర్ష సూచనలు ఉండడంతో సభ సైతం వాయిదా పడింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని అధికారులు, మంత్రులు భావించారు. కానీ ఆదివారం భారీ వర్షం కురవడంతో సభ నిర్వహణకు అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలాంచాక సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు మత్కేపల్లిలో జరగాల్సిన సభ వాయిదా పడిందని ప్రకటించారు. అయితే, రైతుభరోసా నిధుల విడుదల మాత్రం వాయిదా వేయకుండా, హైదరాబాద్ శిల్పకళావేదికలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలకు నిర్ణయించారు. జిల్లా నుంచి రైతుభరోసా నిధుల విడుదల కోసం బహిరంగ సభ నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో మత్కేపల్లిలో ఎంపిక చేసిన స్థలంలోనే మరో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. రైతుభరోసా నిధుల పంపిణీ పూర్తయ్యాక ముగింపు సభ ఇక్కడ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. రైతుభరోసా నిధులు మంగళవారం నుంచి విడుదల చేయనుండగా.. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తారు. ఆపై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో ఒకరోజు మత్కేపల్లిలోనే సభ నిర్వహించాలని నిర్ణయించారు.వర్షంతో చిత్తడిగా మారిన సభా ప్రాంగణం -
విద్యార్థులు నూరుశాతం హాజరుకావాలి
బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు నూరుశాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి డి.వాసంతి ఆదేశించారు. సోమవారం బూర్గంపాడు కేజీబీవీని సందర్శించారు. విద్యాబోధన, హాజరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నలుగురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలో కొత్త ప్రవేశాలను పరిశీలించి ఎన్రోల్మెంట్ మరింత పెంచాలని సూచించారు. అనంతరం వంటగది, ఆహార నిల్వలు, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులతో ముచ్చటించి అభ్యాస సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎన్.సతీష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెచ్ఎంలు, ఆర్పీలకు షోకాజ్ నోటీస్ కొత్తగూఅర్బన్: జిల్లాలోని పలు పాఠశాలలను డీఈఓ వాసంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న మిడిసిలేరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రాళ్లపురం, కిష్టారంపాడు పాఠశాలలు మూతబడి ఉండటం, కుదునూరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సరైన సమాచారం లేకుండా హాజరు కాకపోవడం, సమయానికంటే ముందే పాఠశాలను విడిచివెళ్లడంతో ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, రిసోర్స్పర్సన్లకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు డీఈఓ తెలిపారు. -
విద్యుత్ రంగాన్ని కాపాడాలి
పాల్వంచ: ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడాలని, వైటీపీఎస్లో ప్రైవేట్ టెండర్లను నిలిపివేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 5,6,7 దశల సెక్రటరీలు ప్రవీణ్ కుమార్, బట్టు హరీష్, బి.రవి అన్నారు. సోమవారం కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. రామకృష్ణజాదవ్, సమీర్ అహ్మద్, కృష్ణయ్య, వంశీ, సురేష్, రామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు నాయకులు డి.ఉమా మహేశ్వరరావు, యాస్మీన్, రఘువీర్,మహేష్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
సహకార సంఘాల బలోపేతానికి కృషి
కల్లూరురూరల్: సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తరఫున కృషి జరుగుతోందని, ఇందుకు రైతులు కూడా సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్లూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన బ్రాంచ్ను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకు అభివృద్ధి చెందడమే కాక మరిన్ని రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కల్లూరులో అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల సాగర్ నీరు రాకున్నా, పంటలకు గోదావరి జలాలు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి ఓటరు జాబితా సవరణ నేపథ్యాన అర్హుల ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాగమయి సూచించారు. కల్లూరులో ఏర్పాటుచేసిన బీఎల్ఏల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోట్రు అర్జున్రావు, మున్సిపల్ చైర్మన్ మోహన్నాయక్, వైస్చైర్మన్ శీలం కోటేశ్వరి, నాయకులు పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాల్లో రైతులకు ఇస్తున్న రుణాలపై వడ్డీ తగ్గించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంత్రి తుమ్మలను కోరారు. జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్ మాట్లాడుతూ రైతుల సహకారంతో డీసీసీబీ రూ.4500 కోట్ల టర్నోవర్ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ కల్లూరు మేనేజర్ అనిత, అధికారులు వెంకట్, చందర్, సర్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మోహన్నాయక్, కమిషనర్ సాయికృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో షాక్కు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన రెడ్డిపోగు వెంకటేశ్వరరావు(40) సోమవారం ట్రక్ లారీపై జేసీబీని తీసుకుని వస్తున్నాడు. ఈక్రమాన పైన కూర్చున్న ఆయనకు సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద నీలాద్రి రోడ్డులో నుంచి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకగా షాక్కు గురై స్పృహ కోల్పోయాడు. ఈమేరకు వెంకటేశ్వరరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న మహిళ ..ఇల్లెందురూరల్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన ధనసరి ప్రభాకర్, స్వప్న దంపతులు ఈ నెల 27న బైక్పై ఇల్లెందుకు వస్తుండగా రొంపేడు వద్ద ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, స్వప్న సోమవారం మృతిచెందింది. ప్రభాకర్కు చికిత్స అందిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు. -
గిరిజన సొసైటీల మధ్య లొల్లి
పినపాక: మండలంలోని టీ.కొత్తగూడెం గ్రామ పరిధిలోని వీరాపురం వద్ద గోదావరి తీరంలోని ఇసుక ర్యాంపు నిర్వహణ విషయంలో రెండు గిరిజన సొసైటీల మధ్య సోమవారం వివాదం నెలకొంది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గతంలో వీరాపురం ఇసుక ర్యాంపును గిరిలక్ష్మి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. అప్పట్లో దుగినేపల్లి పంచాయతీకి ప్రత్యేక సొసైటీ లేకపోవడంతో రెండు పంచాయతీల సభ్యులను కలుపుకుని ఇసుక తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం దుగినేపల్లి పంచాయతీకి చెందినవారు శ్రీరామ సొసైటీ పేరుతో కొత్తగా ఇసుక క్వారీ అనుమతులు పొంది పనులు ప్రారంభించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని గిరిలక్ష్మి సొసైటీ సభ్యులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై సురేష్ తెలిపారు. ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత -
వేతనాలు పెంచాలని..
● సింగరేణి అధికారుల ఆందోళన ● ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ● ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం రుద్రంపూర్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 2,400 మంది అధికారులు పది రోజులు గా పే అప్గ్రేడేషన్ కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు, ప్ల కార్డులతో నిరసన తెలిపా రు. సోమవారం సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం కార్యాలయాల ఎదుట నిరసన దీక్ష ప్రారంభించారు. సమస్యలు పరిష్కరించాలని 60సార్లు సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఆందోళనలు చేపడుతున్నట్లు కోల్మైన్స్ ఆఫీ సర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ బాధ్యులు తెలిపారు. నిర్లక్ష్యం వీడని యాజమాన్యం వేతనాల్లో అసమానతలు ఉండటంలో కోలిండియా అధికారులు కోర్టుకు వెళ్లారు. దీంతో వేతనాలు పెంచి, అసమానతలు తొలగించాలని న్యాయస్థానం తీర్పుఇచ్చింది. దీంతో ఈ–1 గ్రేడ్ అధికారులకు రూ. 60 వేలు, ఈ–2 నుంచి ఈ–6 అధికారులకు కూడా బేసిక్ వేతనం పెంచుతూ కోలిండియా నిర్ణయం తీసుకుంది. కోలిండియాలో జనవరి 2026 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రాగా, సింగరేణి సంస్థలో మాత్రం అమలు చేయడం లేదు. పలుమార్లు విన్నవించగా సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి వేతనాల పెంపుపై కమిటీ చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) నగదు రూ. 277 కోట్లు పెండింగ్లో ఉంది. నగదు కేటాయించినా చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని, కోలిండియాలో చెల్లించినా, సింగరేణిలో చెల్లించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. నాలుగో పీఆర్సీ అమలుకు ముందే పే అప్గ్రేడేషన్ చేయాలని కోరుతున్నారు. ప్రధాన కార్యాలయం ఎదుట దీక్షలు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు సోమవారం దీక్ష చేపట్టారు. సంస్థవ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రారంభించారు. కొత్తగూడెంలో దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వీడి, అధికారుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్షాపా, నాయకులు వంగా వెంకట్, జే.గట్టయ్య, క్రిష్టాఫర్ పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తున్నాం. యాజమాన్యం, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనలు నిర్వహిస్తున్నాం. సోమవారం నుంచి సింగరేణివ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నాం. అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే పెన్డౌన్ కూడా చేస్తాం. –లక్ష్మీపతి గౌడ్, సీఎంఓఏఐ సింగరేణి శాఖ అధ్యక్షుడు -
సర్వం.. వర్షార్పణం
చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద రైతుమేళా, రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు సిద్ధం చేసిన మైదానం వర్షంతో చిత్తడిగా మారింది. ఏర్పాట్లు చివరి దశకు చేరాక మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో తొలుత రైతుమేళాను రద్దు చేశారు. ఇక మంగళవారం సీఎం పాల్గొనాల్సిన రైతు ఆశీర్వాద సభ అయినా నిర్వహించాలని యంత్రాంగం భావించినా వరుణుడు కరుణ చూపలేదు. ఫలితంగా సభా వేదిక, ప్రాంగణం బురదమయం కాగా, పార్కింగ్ ఏరియాలో నీరు చేరి చెరువును తలపించింది. దీంతో సభను కూడా వాయిదా వేయక తప్పలేదు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
సమన్వయంతో పని చేయాలి
కొత్తగూడెంఅర్బన్: బాలల సంరక్షణకు అన్ని విభా గాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జూలై 1 నుంచి నెలరోజులపాటు ఆపరేషన్ ముస్కాన్–12వ విడత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం సోమవారం ఎస్పీ కార్యాలయంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్1098, కై లాష్ సత్యర్థి చిల్డన్ర్ ఫౌండేషన్ ఎన్జీవో, విద్యాశాఖ, వైద్యశాఖ, కార్మిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తప్పిపోయిన, భిక్షాటన చేస్తున్న, నిరాదరణ గురైన పిల్లలను, బాలకార్మికులను సంరక్షించాలన్నారు. ముస్కాన్ కోసం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలుత ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మల్లేష్ స్వామి, లెనినా స్వర్ణలత, హరి కుమారి, శ్రీనివాస్, రాము, నాగరాజు, యేసుపాదం, సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్ రాజు -
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స
పాల్వంచ: విరిగిన దవడకు పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని దాబానగర్కు చెందిన బానోతు కిరణ్ సింగ్ కుటుంబ కలహాల దాడిలో ఎడమ ముఖ భాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి రాగా, పరీక్షంచి దవడ, చెంప ఎముకలు విరిగినట్లు గుర్తించారు. సోమవారం ఓరోమాక్సిలరీ ఫెసియల్ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ కృష్ణ, మత్తు వైద్యుడు శంకర్ రావు శస్త్ర చికిత్స నిర్వహించారు. నర్సులు రేవతి, జ్యోతి, సిబ్బంది జగదీష్ సహకరించారు. దాదాపు రెండు గంటల పాటు క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి విరిగిన ఎముకలను యథాస్థానంలో అమర్చడంతోపాటు దవడలను స్థిరపరిచారు. ప్రస్తుతం కిరణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, శస్త్ర చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.70వేల వరకు ఖర్చయ్యేదని వైద్యులు తెలిపారు. వైద్యులను, సిబ్బందిని డీసీహెచ్ఎస్ రవిబాబు, సూపరింటెండెంట్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజు దొర అభినందించారు. -
జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ట మాస పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం జగదభి రాముడికి జ్యేష్ఠాభి షేకం కనుల పండుగా జరిపారు. తొలుత బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం, నదీజలాలతో జ్యే ష్ఠ్యాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి హారతి సమర్పించారు. కాగా జ్యేష్ఠ్యాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం రద్దు నిత్యకల్యాణం రద్దు చేయగా, మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నారు. ఆలయ ఈఓ దామోదర్రావు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, ఇతర అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా చండీహోమం పూజలుపాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం చండీ హోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారా ధన, గణపతిపూజ, చండీహోమం జరిపారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 25 మంది భక్త దంపతులకు అర్చకులు రమేష్, అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. డీఎఫ్ఓగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్చుంచుపల్లి: జిల్లా అటవీశాఖ అధికారిగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నియ మితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన బదిలీపై నిజామాబాద్ నుంచి ఇక్కడకు రానున్నారు. ఇప్పటివరకు పనిచేసిన డీఎఫ్ఓ కిష్టాగౌడ్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. కాగా, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ గతంలో ఖమ్మం డీఎఫ్ఓగా పనిచేశారు. పెద్దపులి సంచారందుక్కిటెద్దుపై దాడి అశ్వారావుపేటరూరల్: మండలంలోని కావడిగుండ్ల గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు తెల్లం భీమరాజు దుక్కిటెద్డుపై దాడి చేసి చంపింది. గ్రామాల సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు జీపీఎస్ సిగ్నల్ ద్వారా గుర్తించడంతోపాటు పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయందోళన చెందుతున్నారు. ఫారెస్టు రేంజర్ మురళి ఆధ్వర్యంలో సిబ్బంది అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి, కదలికలు పట్ల చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నా రు. పెద్దపులి తిరిగి వెళ్లే వరకు రైతులు, గ్రామస్తులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ సూచించారు. -
సత్వరమే పరిష్కరించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రజావాణిలో అందించిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిశీలించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా వినియోగించుకోవాలని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం ఉంటే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్ని ఇలా... ● డబుల్బెడ్ రూం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రుద్రంపూర్ గ్రామపంచాయతీ ప్రజ లు విన్నవించగా, కలెక్టర్ పరిశీలించి సంబంధిత ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు. ● ఉద్యోగ అవకాశం కల్పించాలని పాల్వంచ మండలం సీతారాంపట్నానికి చెందిన యానబోయి న మౌనిక అర్జీ అందించగా, తగిన చర్యల నిమి త్తం జిల్లా ఉపాధి కల్పనాధికారికి అప్పగించారు. ● అశ్వాపురం మండలం మొండికుంటలో రూ. 1.50 కోట్లతో 2023లో ప్రారంభించిన డ్రెయినేజీ పనులు పూర్తికాలేదని గ్రామ సర్పంచ్ విన్నవించగా, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ● తన తండ్రి జక్కం కృష్ణమూర్తి పేరుపై ఉన్న 4 ఎకరాల 27కుంటల భూమిని వారసత్వంగా తన పేరుపై మార్చి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని బూర్గంపాడుకు చెందిన జక్కం శ్యామ్ విన్నవించగా, బూర్గంపాడు తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ● మణుగూరు మున్సిపాలిటీ చట్టపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికు డు లింగాల సాయికుమార్ ఫిర్యాదు చేయగా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి ఎండార్స్ చేశారు. ఉద్యోగులకు సన్మానం కొత్తగూడెంఅర్బన్: ఉద్యోగ విరమణ పొందునున్మన కె. సంజీవరావు (సీపీఓ), డాక్టర్ వెంకటేశ్వర్లు (డీవీఏహెచ్ఓ), చి. రమేష్బాబు (అసిస్టెంట్ ఇంజనీర్, హౌసింగ్), అంజనేయులు (ఆఫీస్ సబార్డినేట్, హౌసింగ్ శాఖ)లను సోమవారం కలెక్టర్ అంకిత్ ఐడీఓసీలో సన్మానించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గడువులోగా పూర్తి చేయాలి కొత్తగూడెంఅర్బన్: ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2026పై సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడారు. కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు మాత్ర మే అందజేయాలని, అనధికార వ్యక్తుల ద్వారా పంపిణీ చేయొద్దని ఆదేశించారు. ఎన్నికల శాఖ సూపరింటెండెంట్ రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ములకలపల్లి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ములకలపల్లిలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు.వైద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ అదేశించారు. ములకలపల్లి పీహెచ్సీలో తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్లను పరిశీలించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తహసీల్దార్ స్వాతిబిదు, డీటీ భాగ్యలక్ష్మి, పీహెచ్సీ వైద్యాధికారి సాయికల్యాణ్, బీఎల్ఓలు ఉన్నారు. -
నిరంతరం విద్యుత్ సరఫరా..
దమ్మపేట: నాణ్యతతో కూడిన మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని గండుగులపల్లి, అంకంపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. గండుగులపల్లిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ నిర్వహణకు కావాల్సిన 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అంకంపాలెం సబ్స్టేషన్లో ఇంటర్లింకింగ్ పనులను పర్యవేక్షించారు. పామాయిల్ చెట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కవర్డ్ కండక్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేందర్, డీఈలు నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈ వెంకటరత్నం, ఏఈలు సాయికిరణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీతారామ పంప్హౌస్ పరిశీలన ములకలపల్లి: మండల పరిధిలోని కమలాపురం శివారులో సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ను టీజీఎన్పీడీసీల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సందర్శించారు. పంప్హౌస్–2లో విద్యుదీకరణను పరిశీలించారు. 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి, ములకలపల్లిలో ఏర్పాటు చేస్తున్న 33కేవీ విద్యుత్లైను నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లిలోని ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పెంట్లం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజాపురంలో నూతన సబ్స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
ఐదుగురు విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులు
ములకలపల్లి: మండల పరిధిలోని చాపరాలపల్లి జీపీ కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్)లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సోమవారం నలుగురు చిన్నారులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. వీరందరూ బాలికలే కావడం గమనార్హం. ఏడో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 13 మంది చిన్నారులుండగా, ముగ్గురు విద్యార్థులకు గురుకులంలో ఐదో తరగతిలో సీట్లు వచ్చాయి. మరో ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు రావడంలేదు. ఐదుగురు బాలికలే బడికి వస్తుండగా, ఇద్దరు ఉపాధ్యాయలు పాఠాలు బోధిస్తున్నారు. గాలి దుమారంతో విరిగిపడిన చెట్లుఅశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం, వినాయకపురం కాలనీ, తిరుమలకుంట, ఆసుపాక, నందిపాడు, పండువారిగూడెం గ్రామాల్లో సోమవారం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. భద్రాచలం–రాజమండ్రి మార్గం, వినాయకపురం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ‘పల్స్ పోలియో’ను పరిశీలించిన రాష్ట్ర బృందంచుంచుపల్లి: జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో ఇంటింటి సర్వేకార్యక్రమాన్ని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి బ్రహ్మానందరావు బృందం సోమవారం పరిశీలించింది. కొత్తగూడెం పట్టణంలోని సఫాయి బస్తీ, పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్, బొల్లొరిగూడెం, ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొత్తికోయ గిరిజన ఆవాస ప్రాంతాల్లో సర్వేను సభ్యులు పరిశీలించారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్న తీరు ను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జిల్లా శిశు ఆరోగ్య, రోగనిరోధక టీకాల అధికారి డాక్టర్ ప్రతాప్, సీహెచ్వో నాగభూషణం, సోమ్లానాయ క్, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సారా స్థావరాలపై పోలీసుల దాడికరకగూడెం: మండలంలోని కలవలనాగారం సమీప అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై కరకగూడెం పోలీసులు సోమవారం దాడి చేశారు. సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం/భద్రాచలంటౌన్: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరి శీలించి, సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజ నులు సమర్పించిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పీఓకు సత్కారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సన్మానించారు. సోమవారం ఐటీడీఏలో పీఓ రెండేళ్లపాలన సక్సెస్ మీట్ నిర్వహించా రు. ఈ సందర్భంగా పీఓను ఎమ్మెల్యే శాలువా సత్కరించి, పీఓ సాధించిన ప్రగతి పోస్టర్లు ఆవిష్కరించారు. విధుల్లో పీఓ తీరు అభినందనీ యమని అన్నారు. గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలిఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తిచేయాలని పీఓ బి.రాహుల్ అధి కారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన ఐటీడీఏ కార్యాలయం నుంచి హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి ఏజెన్సీలోని మారుమూల గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో మారుమూల పీహెచ్సీల వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద ముంపు గ్రామాల్లోని గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టా లని,నార్మల్ డెలివరీల శాతం పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. టీబీ పరీక్షలు జరపాలని, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులను భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని ఎన్ఆర్సీకి తరలించాలనిసూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్ రాజ్, డీఎంహెచ్వో తుకారం రాథోడ్,డీసీహెచ్ఎస్ రవిబాబు, ఇతర అధికారులు ఆనంద్కుమార్, అశోక్, మధుకర్, సైదులు, సమ్మయ్య, రాంబాబు, ఉదయ్ కుమార్ వేణు, గన్యా, మనిధర్, హేమంత్, నరేష్, రామకృష్ణ, సూర్య ప్రకాష్, అనూష, లీలావతి, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో విజయవంతం
98.8 శాతం పిల్లలకు చుక్కల మందుచుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో 98.8 శాతం మంది పిల్లలకు చుక్కల మందును పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 1001 పల్స్ పోలియో కేంద్రాలు, 925 బూత్ లెవల్ బృందాలు, 38 మొబైల్ బృందాలు, మరో 38 ట్రాన్స్పోర్ట్ బృందాలతో ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు. మిగిలిపోయినవారికి సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కల మందు చేయనున్నారు. ఈసారి జిల్లాలో 98,818 మంది పిల్లలకు చుక్కల మందు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. పోలియో నిర్మూలనలో భాగస్వాములు కావాలిపాల్వంచరూరల్: పోలియో నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండల పరిధిలోని జగన్నాథపురం పీహెచ్సీ పరిధి ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. చిన్నారికి పోలియో డ్రాప్స్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు. డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, అధికారులు ప్రతాప్, మోహారక్రాంతి పాల్గొన్నారు. -
ఏదీ ‘సంసిద్ధత’?
● 1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థుల కోసం విద్యా ప్రవేశ్ ● 12 వారాలపాటు ‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలల్లో అమలుకు ఆదేశాలు ● చాలా తక్కువ స్కూళ్లలో మాత్రమే అమలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇల్లెందు: ఇంటి వద్ద, అంగన్వాడీ, బాలవాటిక, ప్రీ స్కూల్లో ఉన్న చిన్నారులను ఒకటో తరగతిలో ప్రవేశించే విధంగా సంసిద్ధత చేసేందుకు ప్రభుత్వం విద్యా ప్రవేశ్(సంసిద్ధత) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ ఏడాది 118 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య ప్రవేశపెట్టగా, వీటిన్నంటిలో సంసిద్ధత కార్యక్రమం అమలు చేయాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 28 వరకు 12 వారాలపాటు 60 బోధనా దినాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రతీ 20 రోజులకోసారి విద్యార్థుల ప్రగతిపై మూల్యాంకనం చేయాలి. చిన్నారులు ఆనందంగా విద్యనభ్యసించేలా, సులభంగా పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా విద్యా ప్రవేశ్ను ప్రవేశపెట్టగా, పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా చాలా పాఠశాలల్లో విద్యా ప్రవేశ్పై అమలు చేయడంలేదు. ఇవీ ఉపయోగాలు ఆట పాటల ద్వారా అభ్యాసనం చేస్తూ, శారీరక, మానసిక, సామాజిక భావోద్వేగం నుంచి పిల్లల్లో సమగ్ర వికాసం పెంపొందించడం. ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత, పోషణ, సమర్థవంతమైన సంభాషణ, మౌఖిక భాషా నైపుణ్యాల అభివృద్ధి, మాతృభాషలో, ఇంగ్లిష్లో అక్షరాస్యతకు పునాది వేయడం, పరిసరాలతో అనుసంధానమైన అభ్యాసనం, సంఖ్యాజ్ఞానానికి పునాది, భౌతిక సామాజిక సహజ పరిసరాల అన్వేషణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం. పాఠ్యపుస్తక బోధన కంటే సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కథలు, పాటలు, పద్యాలు, చర్చలు, పరస్పర చర్యలు, ఇండోర్, అవుట్ డోర్ ఆటలు, కళల సమన్వయంతో అభ్యాసనం చేయాలి. పాఠ్య పుస్తక బోధన, బట్టీ పట్టించటం, కాపీ రాయించటం, డ్రిల్ పద్ధతి బోధనకు అవకాశం లేదు. జిల్లాలో 118 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య ఉండగా, ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో విద్యా ప్రవేశ్ ప్రారంభం కాలేదు. ఈ కార్యక్రమం అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదే. అయితే కొందరు హెచ్ఎంలే అమలు చేస్తుండగా, ఎక్కువ మంది ఈ కార్యక్రమం ఊసే ఎత్తడం లేదు. ముత్తారపు కట్ట పాఠశాలలో విద్యాప్రవేశ్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఆట పాటలు, కథలు, గేయాలు, టీవీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులను పాఠశాలకు 1వ తరగతిలో సంసిద్ధం చేస్తున్నాం. అయితే 12 వారాలపాటు సాగటం వల్ల సిలబస్ వెనుకబడి పోయే ప్రమాదం ఉంది. – కబ్బాకుల రవి, ముత్తారపు కట్ట, ఎంపీపీ స్కూల్, ఇల్లెందు -
రైతు మేళా రద్దు..
● భారీ వర్షంతో చిత్తడిగా మారిన వేదిక ● సభ నిర్వహణపై నేడు నిర్ణయం చింతకాని/ఖమ్మంసహకార నగర్: చింతకాని మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షంతో రైతు ఆశీర్వాద సభ, రైతు మేళా నిర్వహణ ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. తొలుత ఆది, సోమవారం రైతు మేళా నిర్వహించాలని నిర్ణయించి చింతకాని మండలం మత్కేపల్లి వద్ద స్టాళ్ల ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. అయితే, శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో శనివారం పనులు జరగకపోగా, ఆదివారం ఒక రోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తుండగా స్టాళ్లలో వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు కంపెనీల బాధ్యులు సిద్ధమయ్యారు. ఇంతలోనే సాయంత్రం గంట పాటు వర్షం దంచి కొట్టడంతో స్టాళ్ల పైకప్పులు కూలిపోవడమే కాక ఆవరణలోకి నీరు చేరింది. అక్కడకు వెళ్లే మార్గమంతా చిత్తడిగా మారింది. దీంతో రైతు మేళా సోమవారం కూడా నిర్వహించడం లేదని కలెక్టర్ దివాకర ఆదివారం రాత్రి ప్రకటించారు. సభాస్థలి పరిశీలించాక... మత్కేపల్లిలో బుధవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆతర్వాత సాయంత్రం కురిసిన వర్షంతో సభా ప్రాంగణంలోకి నీరు చేరడమే కాక హెలీప్యాడ్, అక్కడకు వెళ్లే దారులన్నీ బురదమయ్యాయి. దీంతో సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించాక సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్య సన్నిధిలో ప్రముఖులు స్వామివారిని ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడు, ఛత్తీస్గఢ్ అటవీశాఖ మంత్రి కేదార్ కశ్యప్, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. గోదావరి మాతకు హారతిభద్రాచలంటౌన్: భద్రాచలం పుణ్యక్షేత్రంలోని స్నానఘట్టాల వద్ద జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆదివారం సాయంత్రం వరుణుడి ముత్యాల జల్లుల మధ్య గోదావరి మాతకు వైభవంగా నదీహారతి నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన జరిపించారు. స్వామివారికి తీర్థబిందెజ్యేష్ఠాభిషేక మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామివారికి వైభవంగా తీర్థబిందె కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు నిర్వహించారు. ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో..భద్రాచలం: భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐటీడీఏలో గిరిజన దర్బార్..భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ రాహుల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై దరఖాస్తుల అందించాలని , అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని కోరారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. 651 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.42,170, సఫారీ వాహనాల ద్వారా రూ.16,200 వైల్డ్లైఫ్ శాఖకు ఆదాయం లభించింది. 360 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,290 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కుటుంబ సభ్యులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. -
సొసైటీల్లో నిల్
బూర్గంపాడు: యూరియాను రైతులకు సులభంగా, పారదర్శకంగా విక్రయించేందుకు, వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత వ్యవసాయ సీజన్ నుంచి ఫర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు యాప్లో లాగిన్ అయి ఆన్లైన్లో బుక్ చేసుకుని, పీఏసీఎస్ గోదాంలు, ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలి. గత వ్యవసాయ సీజన్లో ప్రభుత్వం పీఏసీఎస్ గోదాంలకు ఎక్కువగా, ప్రైవేటు డీలర్లకు చాలా తక్కువగా యూరియా సరఫరా చేసింది. ప్రస్తుతం మాత్రం యాప్లో పీఏసీఎస్ గోదాంలలో స్టాక్ తక్కువగా, ప్రైవేటు డీలర్ల వద్ద ఎక్కువగా చూపుతోంది. డీలర్ల వద్దే ఎక్కువ ధర.. ప్రభుత్వ రాయితీతో యూరియా బస్తాను(45కిలోలు) రూ 266.50కు రైతులకు విక్రయించాలి. పీఏసీఎస్ గోదాంలలో మాత్రమే ఈ ధరకు లభిస్తుండగా, ప్రైవేటు డీలర్లు మాత్రం రూ.350కు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా తీసుకోవటంతోపాటు రెండు, మూడు బస్తాల యూరియాకు ఇతర ఎరువులను కూడా అంటగడుతున్నారు. పీఏసీఎస్ గోదాంలలో నో స్టాక్ చూపిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. మార్క్ఫెడ్ నుంచి పీఏసీఎస్లకు వచ్చే యూరియాకు రవాణా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, తమకు వచ్చే యూరియాకు ట్రాన్స్ఫోర్ట్, దిగుమతుల ఖర్చులను తామే భరించాల్సి వస్తుందని ప్రైవేటు డీలర్లు పేర్కొంటున్నారు. అందువల్లే ఎక్కువ ధరకు అమ్మాల్సివస్తుందని చెబుతున్నారు. ఎకరాకు రెండున్నర బస్తాలే.. ప్రభుత్వం యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ఒక్కో సీజన్లో ఎకరాకు కేవలం రెండున్నర బస్తాలు మాత్రమే అందిస్తోంది. అందుకు అనుగుణంగా ఫర్టిలైజర్ యాప్లో వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా వివరాలు నమోదు చేశారు. రెండెకరాల భూమి ఉంటే వానాకాలం సీజన్లో ఐదు బస్తాలు మాత్రమే ఇస్తారు. అది కూడా రెండు, మూడు దశల్లో బుక్ చేసుకోవాలి. యాప్లో రైతు పేరు, పట్టాదారు పాస్బుక్ నంబర్ నమోదు చేయగానే, అతనికి ఎన్ని బస్తాల యూరియాకు అర్హత కలిగి ఉన్నాడో, ఎన్ని దశల్లో బుక్ చేసుకోవచ్చో చూపిస్తుంది. యాప్ను పక్కాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందరికీ ఒకే ధరకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ శాతం పీఏసీఎస్ల్లో విక్రయించాలని రైతులు కోరుతున్నారు. జూన్ నెల రెండోవారం నుంచి జిల్లావ్యాప్తంగా యాప్ ద్వారా యూరియా విక్రయాలు ఆరంభమయ్యాయి. ఒక్కో పీఏసీఎస్ గోదాంలో 600 బస్తాలు స్టాక్ ఉన్నట్లు చూపుతుండగా, మండలాలవారీగా ఆయా గ్రామాల రైతులు నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకుంటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా స్టాక్ అయిపోతుంది. అదే సమయంలో ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం వేల బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు యాప్లో కనిపిస్తోంది. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద కొనేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు.సహకార సంఘాలకు తక్కువగా యూరియా సరఫరా! ఇల్లెందురూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు వ్యసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి విత్తనాలు మొలకెత్తగా, మొక్కలకు యూరియా వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బుక్ చేసుకుందామంటే శనివారం రాత్రి నుంచి ఫర్టిలైజర్ యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా నిల్వలు తగ్గడం వల్లే యాప్ పనిచేయడం లేదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాప్ పనిచేయకపోవడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. యాప్ సేవలు స్తంభించడంపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావును వివరణ కోరగా.. తమకు ముందస్తు సమాచారం లేదని, పీఏసీఎస్ గోదాముల్లో యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. -
‘ఎన్యుమరేషన్’ తంటాలు!
● పత్రాలు ఎలా నింపాలో తెలియక ఓటర్ల ఆందోళన ● 2002లో ఓటుహక్కు ఎక్కడ ఉన్నది తెలియక అవస్థలు ● జిల్లాలో మందకొడిగా సాగుతున్న సర్ ప్రక్రియ చుంచుపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఈ నెల 25 నుంచి మొదలుకాగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు అందజేస్తున్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో అక్కడక్కడా జరిగిన లోపాలతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. బీఎల్ఓలు పూర్తిస్థాయిలో ఇంటింటికి తిరిగి సరిగ్గా మ్యాపింగ్ చేయకపోవడంతో ఓటర్లకు 2002లో తమ ఓటు హక్కు ఎక్కడున్నదో తెలియక అవస్థ పడుతున్నారు. బీఎల్ఓలు ఎన్యుమరేషన్ పత్రాలు ఇచ్చి వెళ్తున్నారే తప్ప అవగాహన కల్పించడం లేదు. దీంతో అవి ఎలా పూరించాలో కూడా ఓటర్లకు అర్థం కావడం లేదు. 2002 జాబితాలో ఓటు హక్కు వివరాలు తెలుసుకోవడం సమస్యగా మారింది. నిరక్షరాస్యులైన వృద్ధులు ఏమీ పాలుపోక పత్రాలు పట్టుకుని తెలిసినవారి వద్దకు పరుగులు తీస్తున్నారు. బీఎల్ఓలే దగ్గరుండి పూరించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. సర్ కార్యక్రమంపై అధికారులు రెండు నెలలపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల వివరాల నమోదు విషయం బీఎల్ఓలకు సైతం తెలియకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. బీఎల్ఓలకూ ఇబ్బందులు ఓటరుకు రెండు పత్రాలు చొప్పున ఇస్తున్న బీఎల్ఓలు అవి పూరించాక రెండోసారి వచ్చి వాటిని తీసుకుంటారు. బీఎల్ఓలకు లక్ష్యం నిర్దేశించగా, పత్రాలపై క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేసి ఓటరుకు ఇచ్చిన వెంటనే ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సమాచారం ఎన్నికల అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి బీఎల్ఓ తిరగాల్సి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటికి తాళం వేసి ఉండటం, వలస వెళ్లడం, అద్దె ఇళ్లు మారడం వంటి కారణాలతో బీఎల్ఓలు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో మరోసారి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఒక ఇంటికి మూడుసార్లు వెళ్లాలి. లేదంటే ఇంటి లోపల పడేయడం, పక్కింటి వారికి ఇవ్వడమో చేయాలి. జూలై 24 కల్లా కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో స్థానిక పార్టీల నాయకులు సైతం భాగస్వాములు అవుతున్నారు. వారి సహకారంతో బీఎల్ఓలు వివరాలు తెలుసుకుంటున్నారు. ముద్రణ సమస్య కారణంగా ఎన్యుమరేషన్ పత్రాలు చేరకపోవడంతో రెండు రోజులుగా పత్రాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 35 శాతం కూడా ఫారాల పంపిణీ చేయలేదని సమాచారం. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించే విషయంలో అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. చాలా మందికి ఎపిక్ నంబరు ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. మరింతగా అవగాహన కల్పించాలి. –వినోద్, చాతకొండ మొత్తం ఓటర్లు : 9,96,198 పోలింగ్ బూత్లు : 1104పురుషులు : 4,81,251 బీఎల్ఓలు : 1104మహిళలు : 5,14,877 సూపర్వైజర్లు : 123ఇతరులు : 70 ఏఈఆర్వోలు : 30 -
‘ఆశీర్వాద సభ’కు రూట్మ్యాప్
● ప్రాంతాల వారీగా చేరుకోవాల్సిన మార్గాల వెల్లడి ● ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటుఖమ్మంక్రైం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద బుధవారం రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల రైతులు, నాయకులు సభావేదిక వద్దకు చేరుకునేలా పోలీసు అధికారులు రూట్మ్యాప్ రూపొందించారు. ఆయా మార్గాల్లో చేరుకుని నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని వైరా ఏసీపీ సారంగపాణి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పార్కింగ్ మ్యాప్లను విడుదల చేయగా, అందులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినా నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవచ్చని తెలిపారు. ●పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలతో పాటు ముదిగొండ మండలం నుంచి వచ్చే వారు వెంకటగిరి ఎక్స్ వద్ద హైవే ఎక్కి ధంసలాపురం వద్ద దిగి పందిళ్లపల్లి మీదుగా 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలపాలి. ●కారేపల్లి, కామేపల్లి మండలాల నుంచి వచ్చేవారు ఖమ్మం టౌన్ – ముస్తఫానగర్ మీదుగా పందిళ్లపల్లికి చేరుకొని 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాల నుంచి వచ్చే వాహనాలు కల్లూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి చింతకాని మండలం కొదుమూరు వద్ద దిగి చింతకాని మీదుగా చేరుకున్నాక పార్కింగ్ స్థలాలు 7, 8తో పాటు 15లో వాహనాలు పార్క్ చేయాలి. ●వైరా, కొణిజర్ల మండలాల నుంచి వచ్చేవారు బస్వాపురం, పెద్ద గోపతి, నేరేడ, చింతకాని మీదుగా చేరుకుని 7, 8తో పాటు 15 నంబర్ పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●ఏన్కూరు, తల్లాడ మండలాల నుంచి వాహనాలు వి.వెంకటాయపాలెం – వందనం – చింతకాని మార్గం ద్వారా వెళ్లి 7, 8, 15నంబర్ పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపాలి. ●ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల నుంచి వచ్చే ప్రజలు బోనకల్ – నాగులవంచ మార్గం ద్వారా చేరుకుని 10, 11, 12, 13, 14 నంబర్ పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●చింతకాని మండలం మత్కేపల్లి నామవరం వైపు ఉన్న ముదిగొండ మండలానికి సంబంధించిన గ్రామాల వారు మత్కేపల్లి క్రాస్ నుంచి పందిళ్లపల్లి ద్వారా 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపి సభకు చేరుకోవాలి. -
సామాజిక బాధ్యత పెంపొందిస్తున్న ‘మన్ కీ బాత్’
ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం ప్రజ ల్లో సామాజిక బాధ్యతనే కాక పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంపొందిస్తోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయప్రతాప్ అన్నారు. ఖమ్మంలోని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ నివాసంలో ఆదివారం మన్ కీ బాత్ను నాయకులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉదయప్రతాప్ మాట్లాడుతూ.. సహజసిద్ధమైన బ్రిడ్జిల విశిష్టత, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను మోదీ వివరించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జ్వాలా నర్సింహారావు, మేకల నాగేందర్, దాసరి మధు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. -
●పరదా.. ప్రహరీగా!
మున్సిపాలిటీ పరిధిలోని బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు పరదానే దిక్కయింది. గత రెండేళ్లుగా కురుస్తున్న వానలకు క్రమక్రమంగా ప్రహరీ కూలింది. దీంతో విద్యార్థులు చదువుకునే సమయంలో పశువులు, ఆవులు ప్రవేశిస్తూ.. ఇబ్బందులకు గురి చేయడంతో పాటు రాత్రివేళ కుక్కలు పాఠశాల ఆవరణను ఆవాసంగా మార్చుకున్నాయి. చెట్టు వేర్లు పక్కనే ఉన్న సైడ్ కాల్వల్లోకి చొచ్చుకుపోయి ప్రహరీ నిర్మించే అవకాశం లేకపోవడంతో తడిక సాయంతో ఇలా పరదా కట్టి తాత్కాలికంగా అడ్డు ఏర్పాటు చేశారు. వానాకాలం గాలిదుమ్ముకు పాత స్థితికి వచ్చే అవకాశం ఉంటుందని, సైడ్ కాల్వ నుంచి పాఠశాలలోకి పాములు, పురుగులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్ -
పర్యాటకం.. ప్రశ్నార్థకం..!
మణుగూరుటౌన్: ఒక వైపు సింగరేణి, మరో వైపు బీటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్, చెంతనే గోదావరి, వానాకాలం గుట్టల పైనుంచి జాలువారే జలపాతాలు, ఏడాదిపొడుగునా నిండు కుండలా దర్శనమిచ్చే పేరంటాలచెరువు, రేగులగండి, వేడి నీటి ఆవిరితో విద్యుత్ తయారీ (జియో థర్మల్) వంటి పరిశ్రమలకు, ప్రకృతి సహజ సిద్ధమైన దృశ్యాలకు నెలవైన మణుగూరులో పర్యాటక అభివృద్ధి ప్రతి పాదనలు అటకెక్కాయి. 2024 నవంబర్లో అప్పటి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మణుగూరులో పర్యటించి, గోదావరి మీదుగా భద్రాచలం పడవ ప్రయాణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యా టక అభివృద్ధికి అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో మండల ప్రజ లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సహజ సంపదలకు నెలవు.. పినపాక నియోజకవర్గానికి మండల కేంద్రంగా ఉన్న మణుగూరు సహజ సంపదలకు పుట్టినిల్లు. భూ అంతర్భాగంలోని బొగ్గు వెలికితీస్తూ దేశానికే వెలుగులు పంచుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. చెంతనే ఉన్న గోదావరి నీటిని వినియోగిస్తూ భారజల కర్మాగారం ఏర్పాటు, స్థానికంగా లభించే బొగ్గును వినియోగించి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు ఏర్పాటు చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, వేడి నీటి ఆవిరి నుంచి ప్రయోగాత్మక విద్యుత్ ఉత్పత్తి (జియోథర్మల్) ప్లాంట్ మణుగూరులో ఉన్నాయి. అలాగే, రేగులగండి, పేరంటాల చెరువును అభివృద్ధి చేస్తే ప్రకృతి అందాలకు సైతం కేరాఫ్ అడ్రస్గా మారనుంది. విద్యార్థులకు టూరిస్ట్ స్పాట్గా మారుతుంది. ఎందరికో ఉపాధి కూడా కలుగుతుంది. ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకలు ఒక్క రోజు గడిపేందుకు వానాకాలం వెన్నెల జలపాతం వద్ద పగోడాల ఏర్పాటు, పేరంటాల చెరువు, రేగులగండి చెరువులపై సైకిల్ బోట్లు, రాయిగూడెం మీదుగా మణుగూరు – భద్రాచలం పడవపై ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. ఆ దిశగా అప్పటి కలెక్టర్ దృష్టి సారించినా.. అధికారులు మారడంతో పాటు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పర్యాటకంపై నిరాశే మిగిలింది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని పర్యాటకంపై దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. రాయిగూడెం మీదుగా భద్రాచలం పడవ ప్రయాణాన్ని అభివృద్ధి చేస్తే భద్రాచలం ప్రజలు మణుగూరు రావాలంటే దూరభారం తగ్గుతుంది. మణుగూరులో వర్తక, వాణిజ్య, వ్యాపారాలు మరింత మెరుగుపడతాయి. 11 ఎకరాలకు ఆయకట్టుగా పేరంటాల చెరువు మత్స్యశాఖ ఇచ్చే చేపలతో పాటు పంటపొలాలకు ఆదరవుగా మారింది. బోటింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం వల్ల సాంబాయిగూడెం గ్రామస్తులకు ఉపాధి లభిస్తుంది. పేరంటాల చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడినవారెందరో ఉన్నారు. అలాంటి ఘటనలకు చెక్ పెట్టడంతో పాటు ఆదివాసీ గ్రామాలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు మెరుగవుతాయి. వెన్నెల జలపాతం వానాకాలం కనువిందు చేస్తుండగా, పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపై బోరు ఏర్పాటు చేసి అన్ని కాలాల్లో జలపాతం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు. -
భరోసా సెంటర్ను నేరుగా సంప్రదించవచ్చు
లైంగిక దాడులు, లైంగిక యత్నాలకు గురైన మైనర్లు, యువతులు నేరుగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్స్టేషన్కు వెళ్లకుండానే భరోసా సెంటర్కు వెళ్లినా అక్కడి సిబ్బంది అండగా నిలుస్తారు. ఈ సెంటర్లో పోలీసు, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలు ఒకే గొడుగు కింద అందుతాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గోప్యంగా సాయం అందేలా చూస్తారు. అలాగే, వైద్యపరీక్షలు, చికిత్స అందించడంతో పాటు నిపుణులైన సైకాలిజిస్టుల ద్వారా కౌన్సెలింగ్తో మనోఽధైర్యాన్ని నింపుతారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు మొదలు కోర్టు విచారణ పూర్తయ్యేవరకు నిపుణుల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సాయం దక్కేలా చూస్తారు. -
మాజీ ఎమ్మెల్యేకు పలువురి నివాళి
పెనుబల్లి: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు మృతి బాధాకరమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. పెనుబల్లి మండలం ముత్యాలబంజరలోని స్వగ్రామంలో సుబ్బారావు శనివారం మృతి చెందగా, ఆయన మృతదేహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించాక ఆమె మాట్లాడుతూ సుబ్బారావు ఎమ్మెల్యేగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆమె వెంట వీఎం బంజర సర్పంచ్ భూక్యా ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు మిట్టపల్లి కిరణ్కుమార్, మేకతోటి కాంతయ్య, వంగా నిరంజన్గౌడ్, గోగినేని రమేశ్ తదితరులు ఉన్నారు. కొత్త బట్టలు కొనివ్వలేదని..క్షణికావేశంలో పురుగుమందు తాగి.. చికిత్స పొందుతూ మృతి కరకగూడెం: కొత్త బట్టలు కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ పీవీఎన్ రావు తెలిపిన వివరాలు.. వట్టంవారిగుంపు గ్రామానికి చెందిన చర్చ రఘునాథరావు, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు చర్చ చరణ్తేజ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడు. ఈ నెల 18న గ్రామంలో జరిగిన వనభోజనాలకు వెళ్లేందుకు కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులను కోరగా, తర్వాత కొనిస్తామని వారు చెప్పడంతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి స్వాధీనంభద్రాచలంటౌన్: ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న ఎండుగంజాయిని ఎకై ్సజ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో కూనవరం – భద్రాచలంరోడ్డులోని ఇసుక రీచ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా యమహా ఆర్15 బైక్పై వస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన బలరామ్ లామా, సుదీప్ కేసీని ఆపి తనిఖీ చేయగా 1.300 కిలోల గంజాయి దొరికింది. వారిని అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని, కేసు నమోదు చేసి నిందితులను ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించామని అధికారులు తెలిపారు. -
రాకేశ్కు ఎన్ఐఎస్ కోచ్గా గుర్తింపు
పాల్వంచ: పాల్వంచకు చెందిన బాస్కెట్బాల్ కోచ్ ఉప్పుశెట్టి రాకేశ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ఐఎస్ (నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) నుంచి కోచ్గా గుర్తింపు లభించింది. బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కొనసాగుతున్న నేతాజీ సుభాష్ సదరన్ సెంటర్లో ఆయన బాస్కెట్బాల్ కోర్సు పూర్తి చేయడంతో ఎన్ఐ ఎస్ సర్టిఫికెట్ జారీచేశారు. ఆధునిక శిక్షణ విధానాలు, క్రీడావిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వానికి సంబంధించిన అంశాల్లో కోర్సు పూర్తిచేసిన రాకేశ్ను పలువురు క్రీడాకారులు అభినందించారు. యువ వ్యాపారి ఐపీ?భద్రాచలంటౌన్: వ్యాపారంలో భారీగా నస్టా లు రావడంతో భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువ వ్యాపారి దివాలా (ఐపీ) పిటిషన్ దాఖలు చేసేందుకు యత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐటీసీ కాంట్రాక్టర్గా, ట్రావెల్స్ బస్సుల నిర్వహణలో ఉన్న ఆ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే,యీ అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ప్రకటన రాలేదు. ఈ విషయానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు, సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక, కోయ చలక గ్రామాల్లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రేగులచలక ఎస్సీకాలనీకి వచ్చిన కుక్క అక్కడ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆర్ఎంపీ నార పోగు రాంబాబు కుమారుడు శశీంద్ర ముఖంపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అలాగే, కలకోట కృష్ణ, మరో వ్యక్తిని సైతం కుక్క కరిచింది. అంతేకాక పశువులు, కోళ్లను కూడా కరిచిందని గ్రామస్తులు తెలిపారు. కాగా, శశీంద్రకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆలయ హుండీ తాళాలు ధ్వంసం కేశవాపురం గ్రామంలో ఉద్రిక్తత తల్లాడ: మండలంలోని కేశవాపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీ తాళాలను ఆదివారం ఓ వర్గం వారు పగలగొట్టారు. వచ్చేనెల మొదటి వారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించనుండగా, జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం ఆలయ నిర్వహణ, హుండీ విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల సమక్షాన హుండీకి రెండు తాళాలు వేశారు. భవిష్యత్లో అందరూ ఏకతాటిపైకి వచ్చాకే రెండు తాళాలను తెరవాలని నిర్ణయించారు. ఇంతలో ఆదివారం ఓ వర్గం వారు హుండీ తాళాలు తీస్తామని గ్రామంలో చాటింపు వేయించడమే కాక తాళాలను పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఎప్పుడేం జరుగుతోందనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానికులు పలువురు తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కను‘పాప’లు జాగ్రత్త...
ఖమ్మంక్రైం: కొందరు పైకి సూటుబూటు లేదా ఖద్దరు దుస్తులు ధరించి పెద్దమనుషుల్లా చెలామణి అవుతుంటారు. ఇందులో కొందరి మనసు మాత్రం స్వచ్ఛంగా ఉండదు. ఇలాంటి ఓ వ్యక్తే ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో బాలికపై లైంగిక దాడి చేయడమే కాక తన తప్పు బయటపడకుండా ఆమెను భవనం పైనుంచి తోసేయడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో అక్కడకక్కడా వెలుగు చూస్తుండడంతో చిన్నారుల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అప్రమత్తత తప్పనిసరి అల్లారు ముద్దుగా పెంచుకునే బాలికల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరితో ఆడుకుంటున్నారనే అంశాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా కొత్తవారి వద్దకు చిన్నారులను పంపించకపోవడమే ఉత్తమమని భావించాలి. మానవ మృగాలు అందరి మధ్యలోనే తిరుగుతున్నందున ముద్దు చేస్తున్నామని చెబుతూ చిన్నారులను దగ్గరకు తీసుకుని వెకిలిచేష్టలకు పాల్పడే ప్రమాదముంది. వెనుకడుగు వేయొద్దు ప్రేమ, ఆప్యాయతతో ఉన్నట్లు నటిస్తూనే చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా భరోసా సెంటర్లో ఫిర్యాదు చేయాలి. ఖమ్మంలోని అపార్ట్మెంట్లో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అంతకు 15 రోజుల ముందు కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆ సమయంలో నిలదీసి ఉంటే నిందితుడికి బుద్ధి చెప్పినట్లయ్యేది. అందుకే ఎవరిపై ఏ మాత్రం అనుమానం వచ్చినా తల్లిదండ్రులు అప్రమత్తమై హెచ్చరించాలి. అయినా తీరు మారకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఉత్తమం. కాగా, ఖమ్మంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గౌస్కు మొదటి నుంచి నేరచరిత్ర ఉందని తెలిసింది. కొన్నాళ్ల క్రితం మృతి చెందిన అధికార పార్టీ నేత వద్ద డ్రైవర్గా పనిచేసిన గౌస్ నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి డబ్బుల కోసం సదరు నేత కుమారుడినే కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. అంతేకాక ఇంకొన్ని కేసులు కావడంతో పోలీసులు రౌడీషీట్ తెరవగా... ప్రతిపక్ష పార్టీనేతల ద్వారా రౌడీషీట్ను తీయించుకున్నాడని తెలిసింది. ఈనెల 6వ తేదీ: ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో ఉండే తాత వద్దకు వచ్చిన బాలికపై కన్నేసిన పైరవీకారుడైన మహ్మద్ గౌస్ లైంగిక దాడికి ప్పాడ్డాడు. అంతేకాక ఎవరికీ తెలియవద్దని ఆమెను భవనం పైఅంతస్తు నుంచి తోసేయడంతో తీవ్రగాయాల పాలైంది. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈనెల 13వ తేదీ: అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి ఏపీ నుంచి చిన్నారి వచ్చింది. కూల్డ్రింక్ కొనుగోలు చేయాలని గ్రామంలోని షాప్ వద్దకు వెళ్లగా వృద్ధుడైన నిర్వాహకుడు లైంగిక దాడికి యత్నించాడు. మరో బాలిక చూసి కుటుంబీకులకు చెప్పడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈనెల 17వ తేదీ: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో యువకులు కొన్నాళ్ల నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. -
రాత్రి వరకు వేచి చూసి..
పాల్వంచ: జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పాల్వంచ పోలీస్ స్టేషన్లో మాత్రమే రాత్రి ఆలస్యంగా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో కేసులను రాత్రి వరకు పెండింగ్లో పెట్టి, చివరికి ఎఫ్ఐఆర్ చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో మరింత ఇబ్బంది కరంగా మారాయి. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది సైతం అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని వారిలో వారు కుమిలిపోతున్నారు. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో కొన్ని నెలలుగా పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు? పట్టణంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అనేక సమస్యలతో ప్రజలు పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తున్నా రు. గొడవలు, కొట్లాటలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, ప్రమాదాలు, అనుమానాస్పద మృతు లు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, ఆందోళనలు, ట్రాఫిక్, వాహన తనిఖీలు, ఇలా అనే క చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మో పడంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షించే క్రమంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వచ్చే ఫిర్యాదులపై కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు నేరాల కు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ముందస్తుగా కేసుల నమోదు ప్రక్రియ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కేసులను రాత్రి వరకు నాన్చుతూ ఆలస్యంగా నమోదు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి వరకు వేచిచూసి, చివరి నిమిషంలో కేసులు నమోదుచేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి కొంతకాలంగా కొనసాగుతుండగా సిబ్బంది అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించలేక, బయటకు చెప్పలేక లోలోన మదనపడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొన్ని కేసులు మీడియా దృష్టికి సైతం రావడం లేదు. కేసులు సకాలంలో నమోదు కాక పోవడంతో సరైన వివరణ ఉండటం లేదనే వాదనలు ఉన్నాయి. కేసుల ఆలస్యంపై దృష్టేది? ఘటన జరిగిన వెంటనే వాటికి సంబంధించిన వివరాలు సేకరించి, వెంటనే ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో అన్ని స్టేషన్లలో ముందస్తుగానే కేసులు అవుతుండగా, ఇక్కడ అందుకు భిన్నంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు లు రాత్రి 8 గంటల కల్లా నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదేమంటే ఫిర్యాదుదారులు చర్చించుకుని, చివరి నిమిషంలోనే ఫిర్యాదు ను అధికారులకు ఇస్తున్నారని సిబ్బంది వాపోతుండటం పరిపాటిగా మారింది. రాత్రి వేళ జరిగిన సందర్భాలు మినహా ముందస్తుగా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన వాటికి వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా ఫిర్యాదులను అన్ని కోణాల్లో పరిశీలించి, ముందస్తుగా వారి కి కౌన్సెలింగ్ చేయడం, అవసరమైన వాటికి వెంటనే కేసులు నమోదయ్యేలా చేస్తున్నామని, ఎలాంటి ఆలస్యం చేయడం లేదని తెలిపారు. అయితే, ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదుల సమయాన్ని బట్టి ఉంటుందని వివరించారు. కేసుల నమోదులో తాత్సారం! -
నేడు పల్స్ పోలియో
● చిన్నారులకు చుక్కల మందు పంపిణీ ● జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 98,818 మంది.. ● ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ చుంచుపల్లి: పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్య,ఆరోగ్యశాఖ ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాతాలు, మారుమూల గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాంరాథోడ్ సిబ్బందితో కలిసి ఆదివారం పల్స్ పోలియో పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామపంచాయతీ, విద్యాశాఖ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. 98,818 మంది పిల్లలు నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 98,818 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిందరికీ చుక్కల మందు వేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 1001 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 925 బూత్ లెవల్ బృందాలు, 38 మొబైల్ బృందాలు, మరో 38 ట్రాన్స్పోర్ట్ బృందాలను సద్ధం చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాలు, ఫ్యాక్టరీలు, క్వారీలు, భిక్షాటన కోసం వలస వచ్చిన వారి పిల్లలకు చుక్కలు వేసేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించని పిల్లలకు 29, 30 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు రోజువారీగా చుక్కల మందు పంపిణీ వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలి. చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించవచ్చు. నేటి పల్స్పోలియో కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –డాక్టర్ తుకారాం రాథోడ్, డీఎంహెచ్ఓ -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విధుల్లో చేరిన డీపీఓ అనూషచుంచుపల్లి: జిల్లాలో పనిచేస్తూ శాఖాపరమైన శిక్షణకు వెళ్లొచ్చిన డీపీఓ బొప్పన అనూష శని వారం తిరిగి విధుల్లో చేరారు. ఎనిమిది నెలల క్రితం ఆమెను జిల్లాకు కేటాయించగా ఇటీవల శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో ఇన్చార్జిలుగా మొద ట సుధీర్కుమార్, ఆ తర్వాత డీఆర్డీఓ విద్యాచందన వ్యవహరించారు. తిరిగి బాధ్యతల్లో చేరిన డీపీఓను పలువురు ఎంపీడీఓలు, అధికా రులు, కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలిఇల్లెందు: రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలని బీజేపీ అనుబంధ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం ఇల్లెందు ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించిన కిసాన్ మోర్చా రైతు కార్యశాల కార్యక్రమంలో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతం అవుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో విస్తరింపచేయాలని, ప్రతీ రైతు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భరత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, చిలు కూరి రమేష్, నాయకులు శ్రీనివాస్, బాలరాజు, భిక్షపతి, వెంకన్న, బాలగానీ గోపీకృష్ణ, నాళ్ల సోమసుందర్, మావునూరి మాధవ్, మురళీకృష్ణ, సుచిత్ర పాసీ, బట్టు రమేష్ పాల్గొన్నారు. యంత్రాలతో మక్కలు వేయాలిసూపర్బజార్(కొత్తగూడెం): మొక్కజొన్న విత్తనాలను సంప్రదాయ పద్ధతికి బదులు యంత్రాల ద్వారా వేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందని, కూలీల ఖర్చు తగ్గుతుందని మొ క్కజొన్న పరిశోధనా విభాగం హెడ్ డాక్టర్ సుశీ ల అన్నారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మొక్కజొన్న పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా విభాగం సాంకేతిక సహకారంతో మొక్కజొన్న సాగు–మెళకువలపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడా రు. మొక్కజొన్న పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భద్రు మాట్లాడుతూ మొక్కజొన్న విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు మొక్కజొన్న విత్తనా యంత్రాలు, టార్పాలిన్ పట్టాలు, కలు పు మందులు పంపిణీ చేశారు. శాస్త్రవేత్త డాక్టర్ అనూష, సహాయ సంచాలకులు డాక్టర్ ఎం. శ్రీధర్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ పాల్గొన్నారు. -
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు మృతి
పెనుబల్లి/ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు (90) శనివారం మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెనుబల్లి మండలం వీఎం.బంజర లోని స్వగృహంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జలగం వెంగళరావు ఉన్న సమయాన ఇల్లెందు ఎమ్మెల్యే(1972–78)గా కాంగ్రెస్ తరఫున సుబ్బారావు గెలిచారు. ఆ సమయంలో ఆయన సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుపై 11,826 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతేకాక పలు కార్పొరేషన్లకు చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) వ్యవస్థాపకుడైన సుబ్బారావు గౌడ కులస్తులను ఒక తాటిపైకి తీసుకురావడంలో కృషి చేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీర య్య తదితరులు సుబ్బారావు మృతదేహం వద్ద నివాళులర్పించగా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫోన్లో కుటుంబీకులను పరామర్శించారు. అంతేకాక సుబ్బారావు మృతిపై సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, బానోతు హరిప్రియ, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, ఆదివారం వీ.ఎం.బంజరలో సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
చెట్లను చంపేస్తున్నాయి!
గతేడాది ఆగస్టులో తొలగించినా.. ఫారెస్ట్శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గతేడాది జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లాలో ప్రవేశించింది మొదలు తిరిగి వెళ్లే వరకు ప్రతీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు మేకులతో కొట్టిన విత్తన, పురుగు మందుల కంపెనీల బోర్డులు కనిపించాయి. ఇలా చెట్లకు మేకులు కొట్టడం, వైర్లు గట్టిగా బిగించడం వల్ల ఐదు నుంచి పదిహనేళ్ల వయస్సు ఉండే చెట్లు బలహీనంగా మారిపోతాయని, చిన్న పాటి గాలిదుమారాలకే కూలిపోతాయంటూ అప్పటి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి చెట్లకు మేకులతో కొట్టిన అమర్చిన బోర్డులను తొలగించే పనిని మండల పరిషత్ సిబ్బందికి అప్పగించారు. గతేడాది ఆగస్టులో రెండు వారాల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా చెట్లకు ఉన్న బోర్డులను తొలగించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మళ్లీ అదే తీరు ఖరీఫ్ సీజన్ మొదలవడంతో విత్తన, పురుగు మందుల కంపెనీలు తిరిగి గ్రామీణ ప్రాంతాలపై కన్నేశాయి. తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు మళ్లీ పాత దారి పట్టాయి. అన్ని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న చెట్లకు మేకులను కొడుతూ తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. గత ఏడాది సామాజిక బాధ్యతగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగాలు మరోసారి చెట్లపై జరుగుతున్న దాడిని మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాయి. బెరడు దెబ్బతిని.. వృక్ష శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేర్ల నుంచి చెట్టు పైభాగాలకు వెళ్లే పోషకాల సరఫరాలో బెరడు భాగం ఎంతో కీలకం. చెట్టు ప్రధాన కాండానికి పదుల సంఖ్యలో మేకులు దించడం వల్ల చెట్టు చుట్టూ ఉండే బెర డు భాగంలో దారు భాగం దెబ్బ తింటుంది. దీని వల్ల భూమి నుంచి చెట్టుకు కావాల్సిన నీరు అందదు. దీనికి తోడు పొలాల్లో రైతులు జల్లే పురుగుల మందులు, గడ్డి మందులు గాలి ద్వారా ప్రవహించి మేకుల ద్వారా అయిన గాయాల ద్వారా చెట్టులోకి ప్రవేశిస్తాయి. దీని తాలు కూ దుష్పరిణామాలు చెట్లపై పడుతున్నాయి. ఐదు నుంచి పది హేనేళ్ల వయసులో ఉండే చెట్లపై మేకు ల వల్ల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇటీవల చిన్నపాటి వానాలు, గాలులకే రోడ్ల పక్కన చెట్లు కూలిపోవడం వెనుక ప్రధాన కారణాల్లో మేకుల ఎఫెక్ట్ కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.పూర్వ కాలంలో అశోకుడి నుంచి నేటి వరకు రోడ్ల పక్కన చెట్లను నాటడం, పెంచడమనేది ఓ సామాజిక బాధ్యతగా ఉంది. ఇప్పుడు సైతం వానాకాలం వచ్చిందంటే వన మహోత్స వం పేరుతో ఊరు వాడా, చేను చెలక, రోడ్ల వెంబడి లక్షలాది మొక్కలను వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా నాటుతున్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. బతికిన మొక్కకు మళ్లీ ఆపద రాకుండా చూసుకునే పనిని ఏ ఒక్క ప్రభుత్వ విభాగ మూ పట్టించుకోవడం లేదు. వాల్టా చట్టం వంటివి చెట్లను కొట్టివేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతున్నాయి. కానీ, చెట్లకు సైలెంట్ కిల్లర్స్గా మారిన మినీ సైన్ బోర్డుల విషయంలో ఏమీ చెప్పలేదు. దీంతో ఫ్రీ పబ్లిసిటీ కోసం ప్రైవేటు పెస్టిసైడ్స్, సీడ్స్ కంపెనీలు చెట్ల ఉసురు తీసేస్తున్నాయి అడిగే వారు లేకపోతే లాభాపేక్షకు ఏమైనా చేస్తామన్నట్టుగా విత్తన, క్రిమి సంహారక మందుల కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. రోడ్ల వెంబడి నాటిన చెట్లకు మేకులతో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తూ, చెట్ల ఉసురు తీసే పనిని మళ్లీ మొదలు పెట్టాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
కరకట్ట వేగవంతంగా పూర్తి చేయాలి
భద్రాచలం: గోదావరి వరదల నుంచి శివారు కాలనీ ప్రాంత ప్రజలను రక్షించేందుకు చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు ఇరిగేషన్, జాతీర రహదారుల శాఖలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జి, కరకట్టకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారిపై బ్రిడ్జి డిజైన్లో జాప్యం వల్ల కరకట్ట నిర్మాణం పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఆటంకాలు అన్ని తొలగిపోయినందున నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో, రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ పకడ్బందీగా నిర్వహించాలి
మణుగూరు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పినపాక నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్ఓ), భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. శనివారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బీఎల్వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్, డీటీ రామారావు, ఆర్ఐ అనూష, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో తప్పులుండొద్దుభద్రాచలం: బీఎల్ఓలు, సూపర్వైజర్లు ఎన్యుమరేషన్ ఫారాల్లో తప్పులు లేకుండా చూడాలని భద్రాచలం నియోజకవర్గ ఈఆర్ఓ, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. శనివారం భద్రాచలం మండలంలోని రాజుపేట, ఇండస్ట్రియల్ ఏరియా, తాతగుడి సెంటర్, లంబాడి కాలనీలలో పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు, జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు, మృతుల ఓట్లు తొలగించేందుకు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే తొలగించేందుకు సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫారాలు తీసుకున్న వెంటనే రశీదు అందించాలని బీఎల్ఓలకు సూచించారు. -
రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవు
భద్రాచలం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాటలు విని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోయేలా చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇదే జరిగితే రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించబోవని తెలిపారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం, చుట్టుపక్కల గ్రామాలు జలమయం అవుతాయని, అయినా సీఎం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు మాట్లాడుతూ సొసైటీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతూ గిరిజనులను మోసం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వాహనాలతో రహదారులను నాశనం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరి ఓట్లను కాపాడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందని సూచించారు. నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, గొడవర్తి నరసింహమూర్తి, బోదెబోయిన బుచ్చయ్య, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, గంప రాంబాబు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ -
భక్తులకు అసౌకర్యం కలగకుండా..
● రామాలయ అభివృద్ధి పనులు చేపట్టాలి ● ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ భద్రాచలం: భక్తులకు అసౌకర్యం కలగకుండా రామాలయ అభివృద్ధి పనులు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ అన్నారు. శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించి, ఆలయ పునరుద్ధరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రామాలయ అభివృద్ధి పనులు ప్రారంభించిందని తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు తెలిపా రు. పునరుద్ధరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర రావు, ఇరిగేషన్ ఈఈ జానీ, భద్రాచలం డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాస్, వేద పండితులు,అధికారులు పాల్గొన్నారు. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
● గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలం పట్టణంలో గోదావరి నీరు చేరకుండా, వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తాగునీరు, వైద్యం, పారి శుద్ధ్యం వంటి అత్యవసర సేవలపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం–కూనవరం రహదారిపై చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనులు మూడేళ్లుగా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై సారపాక ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో గోదావరి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి ఎత్తు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లా, మండలస్థాయిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించి, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, క్విక్ రెస్పాన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. భద్రాచలం, పినపాక, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ లాల్సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ అవార్డుకు శంకర్రావు నామినేట్..
భద్రాచలంటౌన్: జాతీయస్థాయి పవర్లిఫ్టింగ్లో రాణిస్తున్న భద్రాచలానికి చెందిన ఎస్ఐబీ విశ్రాంత ఉద్యోగి దేశరాజు వెంకట శంకర్రావును కేంద్ర ప్రభుత్వ వయోశ్రేష్ట సమ్మాన్ జాతీయ అవార్డుకు నామినేట్ చేయాలని ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ నిర్ణయించింది. హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన అసోసియేషన్ 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పవర్లిఫ్టింగ్లో శంకరరావు సాధించిన విజయాలకు గుర్తింపుగా అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ ఆయనను ఘనంగా సత్కరించారు. గుండె బైపాస్ శస్త్రచికిత్స జరిగినా అధైర్యపడకుండా కఠోర సాధన చేశారని అసోసియేషన్ ప్రతినిధులు ప్రశంసించారు. వృద్ధాప్యాన్ని జయించి జాతీయ స్థాయిలో రికార్డులు నెలకొల్పుతూ సీనియర్ సిటిజన్లకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. -
అభివృద్ధికి అంకురార్పణ..
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అభివృద్ధి పనులకు నేడు తొలి అడుగు పడనుంది. శనివారం ఉదయం 7.30 నిమిషాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించి పాత నిర్మాణాల తొలగింపు చేపట్టనున్నారు. రెండు నెలల క్రితం తొలిసారి టెండర్లను ఆహ్వానించినా బిడ్ కాలేదు. రెండోసారి టెండర్ పిలవగా ఒకే బిడ్ దాఖలు కాగా, ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి ఆ బిడ్నే ఖరారు చేశారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని హైదరాబాద్లో జరిగిన సమావేశంలో మంత్రులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో టెండర్ దక్కించుకున్న వైఆర్కే నిర్మాణ సంస్థ ప్రతినిధులు, హైదరాబాద్కు చెందిన కన్సల్టెంట్ బాధ్యులు శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన పనులను ఈఓ దామోదర్రావుతో కలిసి పరిశీలించారు. తొలుత దక్షిణ భాగం వైపు ఉన్న నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించగా, వంటశాల, చిత్రకూట మండపం ఇతర నిర్మాణాలు తొలగించే అవకాశం ఉంది. అంతకుముందు కుసుమ హరనాథ బాబా ఆలయం దిగువ భాగాన భూమికి శనివారం పూజలు నిర్వహించనున్నారు. 30 నెలల గడువుతో.. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా గోదావరి ఒడ్డున సుదర్శన చక్రం ప్లాన్కు రూ.75 కోట్లు, ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు రూ. 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి రూ.96 కోట్లతో మొత్తంగా రూ.351 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఆలయ కాంప్లెక్స్లో తొలి విడతగా చేపట్టిన పనులను రూ. 200 కోట్లకు పెంచి గోదావరి ఒడ్డున పనుల నిధులను కుదించారు. రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానించి ఖరారు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చి, శిథిలాలను తొలగించేందుకు రూ.4.97 కోట్లను టెండర్లో ప్రతిపాదించారు. ఇతర నిర్మాణాల్లో మొత్తం 1058 పనులకు రూ.200 కోట్ల 89 వేలుగా ప్రతిపాదన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నా నిబంధనల్లో మాత్రం 30 నెలల లోపు గడువు విధించింది.నేడు భద్రాచల రామాలయ అభివృద్ధి పనులకు ముహూర్తం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందస్తుగా ఆలయంలోని ఆళ్వార్లను, ఉపాలయాల్లోని మూలమూర్తులను తరలించారు. ఇందుకోసం ఏప్రిల్ 26న కళావాహన పూజలను జరిపారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి మూలమూర్తులను, పంచలోహ విగ్రహాలను అంతరాలయంలో ఉంచారు. ఇతర ఆళ్వార్లు, మూలమూర్తులను , చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణపూత స్వామివారి వాహనాలను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించారు. పాత నిర్మాణాల తొలగింపుతోనే ఆలయ అభివృద్ధిలో తొలి అడుగు పడనుంది. కాగా, శనివారం ఉదయం పూజాదికార్యక్రమాలను నిర్వహించాక నిర్మాణాల తొలగింపు చేపడతామని, భక్తుల దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఈఓ కొల్లు దామోదర్రావు తెలిపారు. -
డిగ్రీలో ఢీలా!
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు అంతంతే ● ప్రైవేటు కాలేజీలు, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్న విద్యార్థులు ● భద్రాద్రి జిల్లాలో సగం కూడా భర్తీకాని సీట్లు ● ఖమ్మం జిల్లాలో మాత్రం 69 శాతానికి చేరిన అడ్మిషన్లు ● దోస్త్ నాలుగో విడతపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల ఆశలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యవైపు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో రెండు, మూడేళ్లుగా డిగ్రీ సీట్లు భర్తీ కావడంలేదు. గతంలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. పైరవీలు కూడా జరిగేవి. సీట్ల జాబితాలో పేర్ల కోసం ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి, కళాశాలల ఉనికి కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది. –పాల్వంచరూరల్ప్రస్తుత విద్యాసంవత్సరంలో మూడు విడతలుగా ఆన్లైన్ (దోస్త్) ద్వారా ప్రవేశాలకు అవకాశం కల్పించారు. మూడో విడత గడువు ఈ నెల 21వ తేదీతో ముగియగా, గురువారం డిగ్రీ కళాశాలలకు విద్యార్థులను కేటాయించారు. వారిలో ఎంతమంది చేరతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దోస్త్ గడువు మళ్లీ పెంచుతారని, అప్పుడైనా మరికొన్ని సీట్లు భర్తీ అవుతాయనే భావనతో ప్రిన్సిపాల్స్ నిరీక్షిస్తున్నారు. కాగా, మూడు విడుతల్లో కూడా విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగానే ఉండగా, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఇంటింటికి తిరిగి కళాశాలల్లో చేర్పించుకుంటున్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా.. ఈ విద్యాసంవత్సరంలో పాల్వంచ, భద్రాచలంలోని అటాన్మస్ డిగ్రీ కళాశాల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టారు. అయినా విద్యార్థులు అనుకున్నంత సంఖ్యలో చేరలేదు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయితే, అక్కడ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరే అవకాశం ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. దోస్త్ నాలుగో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తే సీట్లు కొంతమేర భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సగం కంటే ఎక్కువ సీట్లు భర్తీ కాగా, భద్రాది జిల్లాలో సగం కూడా భర్తీ కాలేదు. భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సీట్లు 4,470 ఉండగా, ఈ ఏడాది 1,821 మంది విద్యార్థులు చేరారు. ఇంకా 2,653 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో సగం కూడా నిండలేదు. వీటిల్లో మూడు కళాశాలలు.. ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం కాలేజీలకు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మరో మూడు.. మణుగూరు, కొత్తగూడెం, అశ్వారావుపేట కళాశాలలను ఇన్చార్జి లతో నెట్టుకొస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాస్త మెరుగు ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, మొత్తం 4,140 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 2,883 సీట్లు భర్తీ కాగా, ఇంకా 1,257 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 69 శాతం సీట్లు భర్తీకాగా, ఖమ్మం ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, మహిళా కళాశాలల్లో గతేడాది కంటే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. దోస్త్ నాలుగు విడత నిర్వహిస్తే మిగిలిన సీట్లు కూడా నిండుతాయని అధ్యాపకులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. –పద్మ, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ఇంటర్ పూర్తయ్యాక విద్యార్థులు హైదరాబాద్ సిటీలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు కూడా ఆకర్షణీయమైన నజరానాలు ఇస్తామంటూ విద్యార్థులను చేర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పట్టణాలకు వెళ్తున్నారు. –డాక్టర్ వై.చిన్నప్పయ్య, ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్ కళాశాల సీట్ల సంఖ్య భర్తీ సీట్లు ఖాళీలు గతేడాది భర్తీ ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ 1680 1441 239 1369 ఉమెన్స్ కళాశాల, ఖమ్మం 660 453 207 290 మధిర 300 165 135 111 నేలకొండపల్లి 300 124 176 201 సత్తుపల్లి 540 328 212 361 ఖమ్మం గురుకుల కళాశాలలు సోషల్ వెల్ఫేర్ 280 190 90 220 ట్రైబల్ వెల్ఫేర్ 380 182 198 155 డిగ్రీ కళాశాల మొత్తం భర్తీ ఖాళీలు గతేడాది సీట్లు భర్తీ పాల్వంచ 840 308 532 563 కొత్తగూడెం 420 196 228 263 భద్రాచలం 900 314 586 597 మణుగూరు 400 90 310 180 ఇల్లెందు 360 56 304 109 అశ్వారావుపేట 540 320 220 360 మహిళా గురుకుల కళాశాలలు పాల్వంచ(గిరిజన) 280 200 80 200 దమ్మపేట(సాంఘిక సంక్షేమ) 730 337 393 587 -
సర్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
బూర్గంపాడు: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని బూర్గంపాడు, ఇరవెండి, మోతె గ్రామాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటర్లు తమ పూర్తి వివరాలను నమోదు చేసి తిరిగి అందించాలన్నారు. సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమేనని తెలిపారు. అపోహలు, భయాందోళన చెందకుండా ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, బీఎల్ఓలు పద్మ, దీపిక, శ్రీలక్ష్మి, మేరీ, చందు తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఎవరికీ పట్టని ‘పెదవాగు’!
● 2024 సెప్టెంబర్లో తెగిపోయిన ప్రాజెక్ట్ కట్ట ● రెండేళ్లవుతున్నా నిధులు విదల్చని ప్రభుత్వం ● ముగ్గురు కీలక మంత్రులున్నా ఫలితం శూన్యం అశ్వారావుపేట: ఏపీ, తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో 2024 సెప్టెంబర్ 18న జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా గుబ్బలమంగమ్మ వాగు పొంగి ప్రవహించడంతో అశ్వారావుపేట మండలంలోని పెదవాగుపై గుమ్మడవల్లి వద్ద నిర్మించిన ప్రాజెక్ట్ కట్ట కొట్టుకుపోయింది. కుడి కాలువ, లాకులు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో రూ.3.5కోట్లతో తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మించారు. అది కూడా నిర్మించిన ఆర్నెళ్లకే గతేడాది సెప్టెంబర్లో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రెండేళ్లలో నాలుగు పంటలు కోల్పోయిన రైతులు దిక్కుతోచక చూస్తున్నారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఫిర్యాదుతో.. పెదవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మించకపోవడంతో తెలంగాణలోని అశ్వారావుపేట, ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల ఎకరాల ఆయకట్టులో గిరిజన రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెగిన ప్రాజెక్టును సందర్శించారు. 15 రోజుల్లోగా పరిష్కారం చూపుతామని రైతులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. విషయాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కి అప్పగించారు. ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం తాత్కాలిక మరమ్మతులకు రూ.19 కోట్లు, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రూ.96 కోట్లతో మరమ్మతులు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వ 82 శాతం వాటా చెల్లించని కారణంగా ఈ రెండింటిలో ఏదీ మొదలు కాలేదు. కాగా ఆయకట్టు 16 వేల ఎకరాల్లో 13వేల ఎకరాలు ఏపీలో ఉండగా, మూడు వేల ఎకరాలు తెలంగాణలో ఉంది.ప్రాజెక్ట్ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కేంద్ర జలవనరుల శాఖ ప్యానల్ ఆఫ్ ఎక్సపర్ట్స్ నుంచి నిపుణుల బృందం గత మార్చిలో సందర్శించింది. రిజర్వాయర్ పరిధిని 40 వేల క్యూసెక్కుల నుంచి 1.2 లక్షల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గేట్ల సంఖ్యను పెంచాలని నివేదించినట్లు సమాచారం. 5 గేట్లతో మాగ్జిమం ఫ్లడ్ డిశ్చార్జ్(ఎంఎఫ్డీ) 1.2లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రతిపాదనను ఇరిగేషన్ అధికారులు సీడబ్ల్యూసీకి సమర్పించారు. 10 రకాల పరీక్షలు నిర్వహిస్తూ సర్వే నిర్వహించిన అనంతరం డిజైన్ , ఎస్టిమేట్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే నూతన ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. కానీ అక్కడి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సమస్యపై ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ప్రభుత్వం కోరిన ప్రతిపాదనలను పంపుతున్నామని, నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. -
గని ప్రమాద అమరులకు నివాళి
ఇల్లెందు: పట్టణంలోని 24 ఏరియాలో గతంలో మొహర్రం నాడు సింగరేణి కాలరీస్ ఇల్లెందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య నివాళులర్పించారు. శుక్రవారం వారి సమాధులపై పూలమాలలు వేసిన జీఎం మాట్లాడారు. 1938లో 37 మంది పురుషులు ఆరుగురు మహిళలు మొత్తం 42 మంది గని ప్రమాదంలో మృతి చెందారని, ఏటా మొహర్రం సందర్భంగా గని ప్రదేశంలో నివాళులర్పిస్తున్నామని తెలిపారు. జేకేఓసీ పీఓ జాకీర్ హుస్సేన్, డీజీఎం రవికుమార్, పూర్ణచందర్, దామోదర్, రాందాస్, అంజిరెడ్డి, సతీశ్, డేవిడ్, సుధాకర్, నజీర్ అహ్మద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, పాసీ ఉద్యోగులకు ఇల్లెందు ఏరియా పాసీ కులస్తులు ఘన నివాళులర్పించారు. రాంలాల్ పాసీ, ఆనంద్కుమార్ పాసీ, కిషన్ పాసీ, దుద్దు పాసీ, రోహిత్ పాసీ, సంజు పాసీ పాల్గొన్నారు. -
స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్ పాల్గొన్నారు.రామయ్య సేవలో ఎమ్మెల్సీభద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, పార్టీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, సత్యనారాయణ, చక్రవర్తి, రంగాచారి తదితరులు పాల్గొన్నారు. గోదావరి వరదలపై నేడు ముందస్తు సమీక్షసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో శనివారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమావేశానికి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు. సీఎం సభకు భద్రతా ఏర్పాట్లు పరిశీలన చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. ఈమేరకు భద్రతా ఏర్పాట్లను శుక్రవారం అడిషనల్ డీసీపీ రామానుజం పరిశీలించారు. సీఎం పర్యటించే మార్గాలు, సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలే కాక ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు వీఐపీలు, ఇతర వ్యక్తుల వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రైతుమేళాకు వచ్చే రైతులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. -
‘టెంపుల్ సిటీ’పై నీలినీడలు..
భద్రాచలానికి సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో స్థలాన్ని పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, అనుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి ఫీజుబులిటీ రిపోర్టును పది రోజుల్లోగా ఇవ్వాలంటూ ఏవియేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఎకై ్సజ్ శాఖలో బదిలీల పర్వం
● డిప్యూటీ కమిషనర్గా సోమిరెడ్డి ● ఏసీగా కిషన్ నియామకంఖమ్మంక్రైం: ఎకై ్సజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు అధికారులను బదిలీ చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధికారులకు సైతం స్థానచలనం కలిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా వి.సోమిరెడ్డిని నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నిజామాబాద్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుండగా, పదోన్నతిపై ఖమ్మంకు కేటాయించారు. అలాగే, ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్గా రంగారెడ్డి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న ఆర్.కిషన్ను నియమించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న జనార్దన్రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, అసిస్టెంట్ కమిషనర్ గణేష్ను హైదరాబాద్లోని డిస్టిలరీ అసిస్టెంట్ కమిషనర్గా, జిల్లా ఎకై ్సజ్ అధికారి జి.నాగేందర్రెడ్డిని పదోన్నతిపై ఎకై ్సజ్ ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, డిప్యూటీ కమిషనర్గా నియమితులైన సోమిరెడ్డి గతంలో జిల్లా ఎకై ్సజ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కమిషనర్గా కిషన్ గురువారం బాధ్యతలు స్వీకరించగా ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
టెంపుల్ సిటీపై నీలినీడలు..
వర్షాకాలం రానే వచ్చింది. మళ్లీ భద్రాచలం ప్రజల కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ చిన్న చినుకు పడినా రోడ్లపై వరద పారుతోంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు నేటికీ స్పందించడం లేదు. ఇలా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతుండడంతో భద్రాచలానికి అత్యాధునిక డ్రెయినేజీ సిస్టాన్ని తీసుకొచ్చేలా సిటీ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం చూపి టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. – భద్రాచలంఆక్రమణల చెరలో డ్రెయినేజీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సుమారు భద్రాచలంలో 40 వేల జనాభా ఉండేది. విభజన అనంతరం భద్రాచలం తెలంగాణ పరిధిలోకి రాగా.. నివాసుల సంఖ్య ఎక్కువై ప్రస్తుతం అనధికార లెక్కల ప్రకారం లక్ష మంది వరకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఇళ్లు ఇష్టారీతిన వెలిసి కొన్ని చోట్ల డ్రెయినేజీ స్థలాలను సైతం కబ్జా చేశారు. సరైన డ్రెయినేజీ సిస్టం లేకుండానే రోడ్లపైకి వచ్చారు. కమర్షియల్ భవనాలకు అనుమతి పత్రాలు లేకుండానే నిర్మాణాలను చేపట్టారు. వెరసి ప్రధాన రోడ్లపైన ఉన్న వ్యాపార సముదాయాల ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. దీంతో చిన్నపాటి చినుకు పడినా రోడ్లపైకి వరద నీరు చేరుతుంది. ముందుచూపేది..? నానాటికీ జనాభా పెరుగుతూ సమస్య పెరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కనీసం ముందు చూపు లేకపోవడంపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. వర్షాకాలం వస్తుందంటే వాహనదారులు, పాదచారులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా చర్ల రోడ్డు, ఉదయ్భాస్కర్ రోడ్డు, మిథిలా స్టేడియం చుట్టుపక్కల నీరు వరదలా పారుతుంటుంది. మరో వైపు శివారు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇళ్లల్లోకి వరద నీరు చేరి జాగారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈనేపథ్యాన ఈ సమస్య పరిష్కారానికి ముందస్తు ప్రణాళికతో స్థానికులతో పాటు భక్తులు, పర్యాటకులు, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చేలా అత్యాధునికమైన సిటీ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్లో మూడో ఫేజ్.. భద్రాచలం ఆలయ అభివృద్ధితో పాటు భద్రాచలం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మూడో ఫేజ్ కింద రూ.127 కోట్లను ప్రతిపాదించింది. అయితే రెండు ఫేజ్లు పూర్తయిన పిదపనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుండగా.. తొలిఫేజ్లో రూ.200 కోట్లతో చేసే రామాలయ అభివృద్ధి పనులే ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీనికి ఎన్నేళ్లు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పోలవరం ముంపుతో భద్రాచలం వద్ద 43 అడుగులు వద్ద గోదావరి నిరంతరం ప్రవహిస్తుందని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యాన మూడో ఫేజ్తో సంబంధం లేకుండానే పోలవరం ముంపును దృష్టిలో ఉంచుకుని పట్టణంలో వరద నీరు ముంపును తప్పించేలా అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు దృష్టి సారించేలా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఎంపీ పోరిక బలరాంనాయక్లు నివేదికలను సిద్ధం చేయించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థతో పాటు పోలవరం ముంపు నీరు ముంచెత్తినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సిటీ మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేయాలి. వాటికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి యుద్ధప్రాతిపదికన అమలయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలి. – ప్రసాద్రెడ్డి, స్థానికుడుభద్రాచలం మాస్టర్ ప్లాన్ ఏర్పాటుపై తీవ్ర జాప్యం -
సీలింగ్ భూముల్లో మళ్లీ ఉద్రిక్తత..
● మొక్కలు నాటే పనులను అడ్డుకున్న గిరిజనులు ● అనుమతి ఎవరిచ్చారని నిలదీత, వాగ్వాదం ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగుండాల సీలింగ్ భూముల్లో గురువారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓవైపు భూపరిరక్షణ కమిటీ పేరుతో ఉద్యమం కొనసాగుతుండగా.. స్వేచ్ఛగా ట్రెంచ్ పనులు పూర్తి చేసుకున్న వ్యక్తి గురువారం జామాయిల్ మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం స్థానిక గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. సీలింగ్ భూములపై భూస్వాములకు, సీలింగ్ పట్టాలు పొందిన గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుందని, మూడో వ్యక్తి ప్రవేశించి ట్రెంచ్ పనులు చేపట్టడం, మొక్కలు నాటడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత స్వేచ్ఛగా పనులు చేసుకునేందుకు ఎవరు అనమతి ఇచ్చారని పనులు చేయించేంరుకు వచ్చిన గుమస్తాలను నిలదీస్తూ వాగ్వాదానికి దిగారు. కూలీలు మొక్కలు నాటకుండా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు మారడంతో పనులు సాఫీగా సాగేలా రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీసులు స్థానిక గిరిజనులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కూలీలు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరిహద్దులు తేల్చకపోవడంతో.. భూగరిష్ట పరిమితి చట్టానికి లోబడి సీలింగ్ కింద తీసిన భూములను స్థానిక గిరిజనులకు గత నాలుగు దశాబ్ధాల క్రితమే పట్టాలు పంపిణీ చేశారు. ఆ సమయాన అధికారులు సరిహద్దులను పట్టాలో పేర్కొనకపోవడంతో నేటికీ సమస్యగా కొనసాగుతోందని స్థానికులు వాపోయారు. సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు సమగ్రంగా సర్వే చేసి సాగులో ఉన్న రైతులకు లేదా సీలింగ్ పట్టాలు కలిగి ఉన్న రైతులకు రెవెన్యూ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు భూముల వద్దకు ఎవరు వచ్చినా ఇలాగే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
సభకు సమీకరణ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. సభతో పాటు రైతుమేళా నిర్వహణకు సుమారు 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభావేదిక పైనుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సీఎం ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనుండడం, 2లక్షల మంది జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే 28, 29వ తేదీల్లో రైతుమేళా నిర్వహించనుండగా ఏర్పాట్లను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీ.ఎస్. పరిశీలించారు. రైతు మేళా.. ఆపై సభ మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న నిర్వహించే సభకు ‘రైతు ఆశీర్వాద సభ’గా నామకరణం చేశారు. తొలుత 28, 29వ తేదీల్లో సభా ప్రాంగణంలో రైతుమేళా నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 30 ఎకరాల స్థలంలో ఐదు ఎకరాలను స్టాళ్ల ఏర్పాటుకు కేటాయించారు. మరో ఐదు ఎకరాలు సీఎం కాన్వాయ్, ఫ్లయింగ్ జోన్కు కేటాయించారు. మిగిలిన 20 ఎకరాల్లో సభావేదిక ఇతర ఏర్పాట్లు చేస్తారు. కాగా, సభా వేదిక వద్దే కాక కలెక్టరేట్ వద్ద రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణకు ప్రణాళిక సీఎం హాజరయ్యే సభకు జనాన్ని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యాన సభ జరగనున్నా, జన సమీకరణ బాధ్యత మాత్రం కాంగ్రెస్, అనుబంధ సంఘాలు భుజాలపై వేసుకున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి లక్ష మంది, వైరా నుంచి 50 వేల మందితో పాటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి మరో 50 వేల మందిని సమీకరించేలా దృష్టి సారించారు. ఇందుకోసం 3,500 బస్సులు సమకూర్చాలని ఆర్టీసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇవి కాక ప్రైవేట్ వాహనాలు కూడా రానుండగా, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 150 ఎకరాలను కేటాయించారు. ప్రత్యేక దృష్టి రైతు ఆశీర్వాద సభ విజయవంతంపై మంత్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏర్పాట్లపై పలుమార్లు అధికారులకు సూచనలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్రెడ్డి మొదటిసారి మధిర నియోజకవర్గానికి వస్తుండడంతో భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. ఇక సభ ఏర్పాట్లను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించారు. వైరాలో రుణమాఫీ, మధిరలో రైతు భరోసా చింతకానిలో జరిగే సభావేదిక పైనుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ‘రైతుభరోసా’ నిధులను సీఎం విడుదల చేయనున్నారు. మొత్తం రూ.9వేల కోట్ల నిధులు విడుదల కానున్నాయి. గతంలో వైరా నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డి రూ.21వేల కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతుభరోసా నిధుల విడుదలకు జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఎంపిక చేసిన స్థలంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సభ నిర్వహించే 30 ఎకరాలతోపాటు మరో 150 ఎకరాల భూమిని కూడా డోజర్లు, రోలర్లతో చదును చేయిస్తున్నారు. రైతుమేళా ప్రారంభానికి రెండు రోజుల సమయమే ఉండడంతో వేదికలకు కావాల్సిన సామగ్రి తరలిస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసే స్టాళ్లలో వ్యవసాయ పనిముట్లు, వివిధ రకాల విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రదర్శిస్తారు. ఈనెల 28, 29వ తేదీల్లో చింతకాని మండలంలో రైతు మేళా -
ఎయిర్పోర్టుపై మళ్లీ ఆశలు!
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గతంలో ప్రతిపాదించిన స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించింది. అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలించే పనిని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరెండు ప్రతిపాదనలు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై పట్టువదలని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆర్నెళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. గతంలో సూచించిన రెండు స్థలాలను మినహాయించి మరో స్థలాన్ని ప్రతిపాదిస్తే ఫీజుబులిటీ, టెక్నికల్ సర్వే చేపడతామని కేంద్ర ఏవియేషన్ శాఖ సూచించింది. దీంతో పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిధిలో ఒకే బిట్టుగా ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నా చివరకు ఆ స్థలం సరికాదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో గతంలో సుజాతనగర్, చుంచుపల్లి మండలాల పరిధిలో ప్రతిపాదించిన స్థలానికి దగ్గర్లోనే కొండలు, వాగులకు దూరంగా మరో స్థలాన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం పరిశీలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఒక వేళ ఇక్కడ కూడా ఇంతకు మునుపులా సాంకేతిక ఇబ్బందులు వస్తే జిల్లా కేంద్రానికి దూరంగా నిర్మించాలనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. నాలుగు రాష్ట్రాలకు అనువుగా.. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎంతగా ప్రయత్నించినా సాంకేతిక చిక్కుల సమస్య తీరడం లేదు. దీంతో కొత్తగూడెం నుంచి దూరమైనా నాలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉండే దుమ్ముగూడెం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దుమ్ముగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే భద్రాచలానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఉపయుక్తంగా ఉంటుంది. సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణం పూర్తయితే అటు మణుగూరుకు దగ్గర అవుతుంది. ఖనిజ సంపదకు నెలవైన ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో త్వరలో జరగబోయే పారిశ్రామికీకరణకు ఎయిర్పోర్టు ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా ఎయిర్పోర్టు అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలనే ఉద్దేశంతో దుమ్ముగూడెం మండలాన్ని తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ఈ మేరకు చుంచుపల్లి సుజాతనగర్, దుమ్ముగూడెం మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఫారెస్టు, ప్రైవేటు భూ రికార్డులను పరిశీలించే పనిని రెవెన్యూ విభాగానికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఒకసారి పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకొత్తగూడెంఅర్బన్: ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం వెల్లడించారు. జిల్లాలో 1,313 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 1,214 మంది ఉత్తీర్ణులయ్యారు. 92.46 శాతం ఉత్తీర్ణత నమోదైందని డీఈఓ డి.వాసంతి తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం శుక్రవారం నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్ట్కు రీ కౌంటింగ్కు రూ.500 , రీ వెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాలని తెలిపారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా శ్రీనివాసరెడ్డికొత్తగూడెంఅర్బన్: జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ అంకిత్ను కలిసి మొక్క అందజేశారు. గతంలో ఇక్కడ పని చేసిన జానయ్య ఖమ్మం ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో శంషాబాద్ ఏఈఎస్గా పని చేస్తున్న శ్రీనివాస రెడ్డిని జిల్లాలో నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కోసం 20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా పాల్వంచ మండలంలో సర్వే నిర్వహించారు. ఇక్కడ కేటీపీఎస్ పరిశ్రమ విస్తరించి ఉండటం, ఆ పరిశ్రమ తాలుకూ ఎత్తైన టవర్లు, హై టెన్షన్ విద్యుత్ వైర్లు సాంకేతిక ఇబ్బందులుగా మారాయి. ఆ తర్వాత రెండేళ్ల క్రితం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం ఎంపిక చేశారు. టెక్నికల్, ఫీజుబులిటీ సర్వే కోసం రూ.25 లక్షలు వెచ్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన టెక్నికల్ కమిటీ ప్రతిపాదిత స్థలానికి సమీపంలో ఎత్తైన కొండలు, వాగులు, వంకలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండోసారి నిరాశే ఎదురైంది. దుమ్ముగూడెం మండలాన్ని తెరపైకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం! -
బోడు గ్రామంలో విషాదం..
● రెండ్రోజుల క్రితం కరెంట్ షాక్తో మహిళ మృతి ● అందుకు కారణమనే ప్రచారంతో వ్యక్తి ఆత్మహత్య టేకులపల్లి: టేకులపల్లి మండలం బోడులో ఓ మహిళ మృతి చెందగా, అందుకు కారణమనే ప్రచారం జరగడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక రోజు వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. బోడు గ్రామ సర్పంచ్ పోదెం స్వరూప అత్త పోదెం చుక్కమ్మ(55) బుధవారం మొక్కంపాడులోని ఓ రైతు చేనులో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. ఆ సమయాన మూత్ర విసర్జన కోసం మరో చేనులోకి వెళ్లేందుకు ఫెన్సింగ్ దాటుతుండగా దానికి విద్యుత్ సరఫరా కావడంతో ఆమె షాక్కు గురై ప్రాణాలు కోల్పోయింది. మృతికి కారణమనే భయంతో.. అయితే, చుక్కమ్మ మృతి చెందిన ఫెన్సింగ్ సమీపంలోనే బోడు గ్రామానికి చెందిన మాడే పాపయ్య(53) చేపలకుంట ఉంది. అందులోని బోర్లకు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన వైర్లు ఫెన్సింగ్ మీదుగా వెళ్తున్నాయి. వైరులో లీకేజీతో ఫెన్సింగ్కు సరఫరా కావడం వల్లే చుక్కమ్మ మృతి చెందిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే, చుక్కమ్మ కుటుంబీకులెవరూ పాపయ్యకు వ్యతిరేకంగా మాట్లాడకపోగా, ఆయనపై ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ చుక్కమ్మ మృతికి తానే కారణంగా అంటున్నారని భావించిన పాపయ్య గురువారం ఉదయం ఇంట్లో మిగిలిన అన్నం చేపలకు వేసి వస్తానని చెప్పి కుంట వద్దకు వెళ్లి మంచెకు ఉరి వేసుకున్నాడు. రెండు ఘటనలపై బోడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు గురువారం ఉదయం చుక్కమ్మ, సాయంత్రం పాపయ్య అంత్యక్రియలు జరిగాయి. సెల్ఫీ వీడియో? ఇదిలా ఉండగా చేపలకుంట వద్దకు వెళ్లిన పాపయ్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎవరి మాటలతో తాను మనస్తాపానికి గురయ్యానో అందులో రికార్డు చేసి వీడియో భార్యకు వీడియో తెలియగా, ఆ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, పాపయ్య నేత్రాలను దానం చేయాలన్న కుటుంబీకుల నిర్ణయంతో అగర్వాల్ కంటి ఆస్పత్రి సిబ్బంది సేకరించారు. -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్య సేవలో..శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు, పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. పల్స్పోలియోను విజయవంతం చేయాలిచుంచుపల్లి: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. జిల్లా కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో పనిచేస్తున్న వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీన పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదల అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గుర్తించిన కేసులను జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కు రిఫర్ చేయాలన్నారు. సిబ్బంది ప్రతాప్, నాగభూషణం పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసనమణుగూరు టౌన్: వేతన పెంపుదల అమలును, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లింపును డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంఓఏఐ) మణుగూరు విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. రెండేళ్ల పీఆర్పీ బకాయిలు చెల్లించాలని, 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పే అప్గ్రేడ్ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు. నాయకులు మదన్నాయక్, ఆర్.మధుబాబు, పి.రమేశ్, సురేష్ పాల్గొన్నారు. -
డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం
సూపర్బజార్(కొత్తగూడెం): డ్రగ్ వినియోగం సామాజిక రుగ్మత అని, దీనికి వ్యతిరేకంగా పోలీసులతోపాటు పౌరులందరూ యుద్ధం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మాదకద్రవ్యాల నిర్మూలనా ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో మాదక ద్రవ్యాల నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యాశకు పోయి సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. బెటాలియన్ కమాండెంట్ పీసీవీ రమణ, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్లు హెచ్ అబ్దుల్ రషీద్, బి మరియదాసు, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనీనా పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్ రాజు -
గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళిక..
కలెక్టర్ అంకిత్సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించి నాణ్యమైన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగలక్ష్మి, డీఆర్ఓ పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎం.సాయి, ఎంపీడీఓ సంకీర్త్, ఎంపీఓలు వీరారెడ్డి, సంధ్య శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
● కోదాడలో పూసపల్లి వాసి.. ఇల్లెందురూరల్: సూర్యపేట జిల్లా కోదాడలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపూసపల్లి గ్రామానికి చెందిన రమేష్(52) మృతి చెందాడు. లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న రమేష్ కోదాడ సమీపంలో లారీ ఆపి కిందకు దిగిన సమయంలో వెనకగా వచ్చిన కారు ఢీకొనడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ● ట్రాక్టర్ ఢీకొని ముత్తాపురం వాసి.. ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ బొంబాయితండా గ్రామ సమీపాన బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన మోకాళ్ల సురేందర్ (38) మృతి చెందాడు. బైక్పై ఇల్లెందు నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సురేందర్ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. పోలీసులు సురేందర్ భౌతికకాయానికి గురువారం ఇల్లెందు ఆస్పత్రిలో శవపరీక్ష చేయించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్సై నాగుల్మీరా తెలిపారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. ● ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి దుమ్ముగూడెం: పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడిని మృత్యువు కబళించింది. పొలం దున్నేందుకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమాన ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో మృత్యువాతపడ్డాడు. ఈ విచారక సంఘటన మండలంలోని బైరాగులపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... బైరాగులపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ అంగిరేకుల రుషికేష్ (28) గ్రామంలోని పొలంలో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. ఈనేపథ్యాన దుక్కి రాకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చే క్రమాన ట్రాక్టర్ను పొలం నుంచి రోడ్డు ఎక్కిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో దుమ్ముగూడెం ప్రాథమిక వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలంలోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే వివాహం.. మృతుడు రుషికేష్కు గత నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. చేతికందిన కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఘటన స్థలాన్ని ఎస్ఐ జగన్మోహణాచారి సందర్శించి వివరాలను సేకరించారు. ● కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చి అనంతలోకాలకు.. భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి విజయవాడకు చెందిన ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన పొట్టా సాయి జ్ఞానేష్ (25) అక్కడి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న జ్ఞానేష్ ఈ నెల 22న ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడు. అనంతరం భద్రాచలం చేరుకున్న అతడు గోదావరి నదిలోకి దూకినట్లు సమాచారం. కాగా, స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైందనే సమాచారం, ఫొటోలు వైరల్ కావడంతో వాటిని చూసిన మృతుడి తండ్రి పొట్టా భాస్కర్ వెంటనే భద్రాచలం చేరుకుని పరిశీలించగా తన కుమారుడు మృతదేహమేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం ఏఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడి అమ్మమ్మది పట్టణంలోని భగవాన్దాస్ కాలనీ కావడంతో పాటు ఆయన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చేతికందిన కొడుకు నదిలో దూకి శవమై తేలడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బైక్ అదుపు తప్పి ఇద్దరికి గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన పొనక బాబూరావు, యదళ్లపల్లి నరేష్ గురువారం బైక్పై ఇల్లెందుకు బయలుదేరారు. ఈక్రమాన మస్సివాగు గ్రామం వద్ద మూలమలుపులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆగస్టు కల్లా టన్నెల్ పూర్తి చేయండి
సత్తుపల్లిటౌన్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులను ఆగస్టు మొదటి వారం నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్ ఆదేశించారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టన్నెల్ పనులను గురువారం పరిశీలించారు. పనుల పురోగతి, లైనింగ్ నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలించాక వారు ఇరిగేషన్ శాఖ టన్నెల్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, సీఈ ఎస్.శ్రీనివాసరెడ్డి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ యాతాలకుంట టన్నెల్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే, సత్తుపల్లి ట్రంక్ కాలువకు గోదావరి జలాలు చేరి సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఈమేరకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ టన్నెల్ నిర్మాణ పనులు, నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించడమే కాక నిర్మాణం పూర్తయ్యాక నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బి.కృష్ణ, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర, అంకిత్ -
ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయరూ..
● భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అందని సూపర్ స్పెషాలిటీ సేవలు ● అప్గ్రేడ్ చేయాలని ఎంపీ బలరాం నాయక్, సీపీఎం నేత జాన్వెస్లీ లేఖలు భద్రాచలంఅర్బన్: తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్లకు కూడలిగా ఉన్న భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రి అప్గ్రేడేషన్కు నోచుకోవడం లేదు. ఏజెన్సీవాసులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడంలేదు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో వంటి సౌకర్యాలు లేవు. గుండె, న్యూరో, యూరాలజీ వైద్యులు కూడా లేరు. రోడ్డు ప్రమాదంలో గాయపడినా, తల, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చినా ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లలేక.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఎక్కువమంది గిరిజనులే వస్తుంటారు. నిత్యం 200 పడకలు కిటకిటలాడుతుండగా వసతుల్లో లోపాలు, వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో అత్యాధునిక వైద్యం అందడంలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేయాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తాజాగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో మరోసారి చర్చకు వచ్చింది. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్లో కీలక శాఖల చూస్తున్నారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలుమార్లు భద్రాచలం వచ్చినా ఏరియా ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు లేవు. మంత్రులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని, ఆస్పత్రి అప్గ్రేడ్ చేయాలని పలువురు కోరుతున్నారు. -
కౌలు రైతులపై కనికరమేది?
బూర్గంపాడు: కౌలు రైతుల కష్టాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ఎరువులు కొనుగోలు, పంట ఉత్పత్తులు అమ్మకాలకు పట్టాదారు పాస్ పుస్తకం, లింకై న్ ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఓటీపీలు కీలకంగా మారడంతో ఇబ్బందులు తప్పడంలేదు. రైతు భరోసా కూడా దక్కటం లేదు. బ్యాంకుల నుంచీ పంట రుణాలు రావు. వెరసి కౌలు రైతు పరిస్థితి దయనీయంగా మారుతుంది. 2.5లక్షల ఎకరాల్లో కౌలు సాగు జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల భూమిని 55 వేలమందికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఎరువుల విక్రయాలకు ఫర్టిలైజర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. యాప్లో పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలను, పట్టాదారు పేరు, ఫోన్ నంబర్ను అప్లోడ్ చేస్తేనే యూరియా బుకింగ్కు అవకాశముంటుంది. యూరియా బుక్ చేయాలంటే పట్టాదారు ఫోన్నంబర్ ముందు ధ్రువీకరించి, ఆ తర్వాత ఓటీపీని అప్లోడ్ చేయాలి. యూరియా బుకింగ్ తర్వాత పట్టాదారుడు మళ్లీ ఓటీపీ చెబితేనే యూరియా కొనుగోలుకు వీలుంటుంది. కౌలు రైతు యూరియా బుక్ చేసుకోవాలంటే ముందు పట్టాదారును బతిమాలుకోవాలి. అతనిని అందుబాటులో ఉంచుకుని రెండుసార్లు ఓటీపీ చెప్పించుకోవాలి. ఒక ఎకరాకు తొలివిడతగా ఒక్క యూరియా బస్తాను అందుతుంది. ఈ ప్రక్రియ కోసం కౌలురైతు పొలం పనులు మానుకుని వేచిచూడాల్సివస్తోంది. యాప్ ఓపెన్ చేసిన తరువాత 30 నిమిషాల్లోనే యూరియా బస్తాలు బుక్ అవుతున్నాయి. భూములు కౌలుకు ఇచ్చిన కొందరు పట్టాదారులు యూరియాను తామే బుకింగ్ చేసుకుని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పంటలు అమ్మకాలకూ అవస్థే పంటల అమ్మకాలకు కూడా అదేస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐలో పత్తి విక్రయించాలంటే ముందుగానే వ్యవసాయశాఖ వద్ద కౌలు రైతులుగా నమోదు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు కూడా పట్టాదారుడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే పట్టాదారుల పేరునే పత్తి అమ్ముకోవాలి. ధాన్యం అమ్మకాలకు కూడా కౌలు రైతులు పట్టాదారులనే ఆశ్రయించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే కౌలు రైతులు ముందుగా పట్టాదారు అనుమతితో వ్యవసాయశాఖ అధికారుల వద్ద ముందుగా నమోదు చేయించుకోవాలి. లేకుంటే పట్టాదారుడి పేరునే ధాన్యం విక్రయించుకోవాలి. ఆ ధాన్యం నగదు పట్టాదారుడి బ్యాంకు ఖాతాలోనే జమవుతుంది. పెట్టుబడి సాయం అందదు పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా పట్టాదారులకే దక్కుతోంది. పంటలు సాగు చేసిన కౌలు రైతుకు రూపాయి సాయం కూడా అందటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తానని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలను ఇవ్వటం లేదు. దీంతో ప్రైవేటు అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నా నష్టపరిహారం పట్టాదారులకే దక్కుతుంది. ప్రభుత్వం స్పందించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రూ. 20 కోట్లు మంజూరు చేయండి
మంత్రి దామోదర రాజనర్సింహకు పీఓ విన్నపం భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీ పరిధిలో డాక్టర్ల కొరత తీర్చడానికి, పీహెచ్సీల నిర్మా ణం, వైద్య పరికరాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహల్ వివరించారు. బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ భవనంలో వర్క్షాప్ నిర్వహించగా, పీఓ హాజరైన మాట్లాడారు. భద్రగిరి మార్ట్ పనితీరును వివరించగా మంత్రి ప్రశంసించారు. అనంతరం మంత్రికి గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సర్వేశ్వరరావు, ఏపీఓ డేవిడ్రాజ్, ఏడీఎంహెచ్ఓ సైదులు పాల్గొన్నారు. 28న చెస్ ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐటీఐలో కల్నన్ సంతోష్ బాబు మెమోరియల్ ఆల్ ఇండియా ఫైట్ రేటింగ్ చెస్ పోటీలకు జిల్లాస్థాయిలో అండర్–10,13,15, అండర్–19 చెస్ ఎంపిక పోటీలు ఈ నెల 28న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ గోపికృష్ణ, ప్రెసిడెంట్ చల్లా భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు బహమతులు కూడా ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలిఎస్పీ రోహిత్ రాజు అశ్వాపురం: ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో సమర్థ స్పందనే లక్ష్యంగా సిద్ధం కావా లని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలచెరువులో నిర్వహిస్తున్న జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీడీఆర్ఎఫ్) శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను రక్షించేందుకు డీడీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ ఎల్లయ్య, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు. గౌరవంగా వ్యవహరించాలిములకలపల్లి: పోలీసులను ఆశ్రయించే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్రాజు ఆదేశించారు. బుధవారం ములకలపల్లి పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్, ఆవరణ, సీజ్ చేసిన వాహనాలను పరి శీలించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తొలుత గౌరవ వందనంతో ఎస్పీకి స్థానిక పోలీసులు స్వాగతం పలికారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్, సీఐ సతీష్, ఎస్సై మధుప్రసాద్ ఉన్నారు. ఆలయ నిర్మాణంపై విచారణఅశ్వారావుపేటరూరల్: మండలంలోని తోగ్గూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఓ ఆలయ నిర్మాణంపై గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసూత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణాధికారిగా కొత్తగూడెం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్సెక్టర్ కావూరి ఆనంద్ను నియమించారు. గురువారం ఆయన గ్రామంలో ఆలయ నిర్మాణంపై విచారణ చేపట్టారు. కాగా, ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించామని, నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణాధికారి తెలిపారు. కడుపునొప్పితో చిన్నారి మృతిపాల్వంచరూరల్: కడుపునొప్పితో ఓ చిన్నారి బుధవారం మృతి చెందాడు. ఒడిశా నుంచి వల స వచ్చిన బాగు రాజేష్, సుమిత్ర దంపతులు మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామంలో క్వారీ ల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రుతిక్ కుమార్(6) తోగ్గూడెం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నా డు. రుతిక్ మంగళవారం ఉదయం నుంచి తీవ్రంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నయం కాకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
మైనర్ వివాహం అడ్డగింత
జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేట గ్రామ పంచాయతీ వాగొడ్డుతండాలో ఓ మైనర్ బాలికకు వివాహం నిశ్చయించగా, బుధవారం అధికారులు అడ్డుకున్నారు. వాగొడ్డుతండాకు చెందిన బాలికతో టేకులపల్లి మండలానికి చెందిన ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. బాలికకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేస్తున్నారని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులకు సమాచారం అందగా, పోలీసులతో వెళ్లి కుటుంబీకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేస్తామని బాలికల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. జిల్లా చైల్ ప్రొటెక్షన్ యూనిట్ సోషల్ వర్కర్ భారతి, జూలూరుపాడు ఎస్సై ఎన్.జీనత్ కుమార్, కొమ్ముగూడెం ఐసీడీఎస్ సెక్టారు సూపర్వైజర్ దీప, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ నిజాయితీఇల్లెందు: దొరికిన నగదు, ఏటీఎం కార్డును తిరిగి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. పట్టణంలోని కళాసీబస్తీకి చెందిన ఆటో డ్రైవర్ పిల్లి మల్లేష్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని వస్తుండగా సమీపంలో ఓ ఏటీఎం కార్డు, రూ. 15 వేల నగదు దొరికాయి. ఈ విషయం కార్మిక నాయకుడు యాకుబ్షావళికి తెలిపి ఇద్దరు కలిసి బంక్ వద్దకు వెళ్లారు. అప్పటికే పెట్రోల్ బంక్ మేనేజర్ ముత్యాల నరేష్ తన వేతనం డబ్బులు, ఏటీఎం కార్డు పోయిందని ఆవేదన చెందుతున్నాడు. దీంతో నగదును బాధితుడికి అప్పగించగా, ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు. నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్ తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం పరిధి పాలేరు ఏటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ చేశారు. అలాగే, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. -
పారదర్శకంగా పనిచేయాలి
చుంచుపల్లి: పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న పర్యవేక్షకులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు, కోర్టు కేసుల స్థితి, తనిఖీ నివేదికల అమలు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, ప్రత్యేక గ్రాంట్ల ప్రగతి, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం, గ్రామ స్వరాజ్ డే బుక్ అప్డేట్, ఎన్నికల ఓటర్ల మ్యాపింగ్, జీపీడీపీ, బీపీడీపీ కార్యాచరణ ప్రణాళికలు, ఇతర ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక నివేదికలు, వార్షిక పరిపాలనా నివేదికలపై సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఈఓ బి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లినప్పుడు అనుసరించాల్సిన విధానాలు, ఫారాల సమర్పణ ప్రక్రియ, ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు, ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ దశలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బీఎల్వోలు, బీఎల్ఏలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 24 నుంచి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. నోటీసులు, విచారణ అనంతరం తొలగింపు తప్పుడు సమాచారం సమర్పించిన సందర్భాల్లో వెంటనే తొలగింపు చేయకుండా, ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వలస వెళ్లినా, మరణించినా, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు ఫారం–8 ద్వారా వివరాల సవరణ చేసుకోవచ్చని అన్నారు. ప్రతిరోజు బీఎల్వోలు గరిష్ఠంగా 50 ఫారాల వరకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ సూపరిండెంట్ రంగ ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంకటేశ్వర నాయక్, అన్వర్, లక్ష్మణ్ అగర్వాల్, అన్నవరపు సత్యనారాయణ, రవి నాయక్, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్ పాల్గొన్నారు. -
పాఠశాలకు కొత్త విద్యార్థి!
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జాతీయ పక్షి నెమలి బుధవారం సందడి చేసింది. ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు వచ్చిన సమయంలో మైదానంలో నెమలి గంతులేయడం చూసి ఆనందపరవశులయ్యారు. కోతులు వెంట పడటంతో నెమలిని రక్షించి తరగతి గదిలో ఉంచారు. ఆ తర్వాత ఎంఈఓ ఉమాశంకర్తో కలిసి నెమలిని అటవీశాఖ డీఆర్ఓ రాంసింగ్, సెక్షన్ ఆఫీసర్ తారాసింగ్లకు అప్పగించారు. పక్కనే ఉన్న అర్బన్ పార్క్లో ఉన్న నెమలి ఎగిరి సమీపంలోని పాఠశాలలో వాలినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. -
విజయ డెయిరీపై నీలినీడలు
● ప్యాకింగ్ సెక్షన్ నిలిపివేతకు అడుగులు ● ఇకపై వరంగల్ నుంచి పాలు, పెరుగు ప్యాకెట్ల సరఫరా ● ప్రశ్నార్థకంగా మిషనరీ, 27మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యంఖమ్మం వ్యవసాయం: ఖమ్మంలోని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. డెయిరీ ఆవరణలోని పాలు, పెరుగు ప్యాకెట్ల తయారీ విభాగాన్ని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి జిల్లాకు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇక్కడ అన్ని వసతులు, మిషనరీ ఉన్నా ప్యాకింగ్ నిలిపివేసి, వరంగల్ నుంచి సరఫరాకు నిర్ణయించడంతో ఖమ్మం డెయిరీ నిర్వహణ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం ప్యాకింగ్, విద్యాసంస్థలకు సరఫరా ఖమ్మం విజయ డెయిరీలో నిత్యం 10 – 12 వేల పాలు, పెరుగు ప్యాకెట్లను తయారు చేసే మిషనరీ ఉంది. ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలతో ప్యాకెట్లు చేసి ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేయాలని ఖమ్మం అధికారులను ఆదేశించారు. అంతేకాక ఇక్కడి కాంట్రాక్టర్కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించగా, సదరు కాంట్రాక్టర్ సమ్మతించలేదు. దీంతో మరో కాంట్రాక్టర్ ఎంపికకు సైతం వెనకాడొద్దని చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే ఖమ్మం ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియరావడం లేదు. అభివృద్ధి చేస్తామంటూనే... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమ ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక పాల సేకరణ పెరిగేలా పాడి గేదెల కొనుగోలుకు రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని సూచించారు. దీంతో కలెక్టర్ పర్యవేక్షణలో రూ. 2.35 కోట్లతో అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశారు. ఇంతలోనే ప్యాకింగ్ సెక్షన్ను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యూనిట్ను మరో ప్రాంతానికి తరలించి అధునాతన సాంకేతికతతో నిర్మిస్తారా.. లేక సిక్ ఇండస్ట్రీగా పరిగణించి మూసేస్తారా అన్న చర్చ మొదలైంది. 50ఏళ్ల క్రితం పదెకరాల్లో ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో వనరులు ఉండటంతో 50 ఏళ్ల క్రితం ఇక్కడ పరిశ్రమ నెలకొల్పారు. పాల శీతలీకరణ, పాలు, పెరుగు ప్యాకెట్లను తయారీ, నిల్వ కోసం ఖమ్మం రోటరీనగర్లో ప్రధాన రహదారి వెంట పదెకరాల స్థలంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ స్థలం విలువే రూ. వందల కోట్లలో ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది రైతులు సీజన్లో 25వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయడమే కాక విక్రయించాక మిగిలిన పాలను హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి తరలిస్తారు. ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్ధి పథంలో నడిచేలా యూనిట్ను మరింతగా ఆధునీకరించాలి. అంతే తప్ప ప్యాకింగ్ సెక్షన్ను మూసివేయటం తిరోగమన చర్యే. ఇది జరిగితే ప్రైవేట్ డెయిరీలకు మేలు జరుగుతుంది. – రవికుమార్, పాడి రైతు, కోయచెలక వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను దిగుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కాంట్రాక్టర్తో సంప్రదిస్తున్నాం. వరంగల్ నుంచి సరఫరా మొదలైతే ఖమ్మం యూనిట్లో ప్యాకింగ్ నిలిపివేయాల్సి వస్తుంది. – కోడిరెక్క రవికుమార్, డీడీ, విజయ డెయిరీ -
ప్రమాదపుటంచున..
భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించిన కొత్త బ్రిడ్జి ప్రమాదపుటంచున ఉంది. జాతీయ రహదారుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అప్రోచ్ రోడ్డు రెండు నెలల క్రితం కుంగింది. ప్రయాణికులు గమనించి హెచ్చరించటంతో రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి అప్రోచ్రోడ్డు, బ్రిడ్జి నడుమ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు వర్షాకాలం వచ్చింది. గోదావరి వరదలు ముంచెత్తితే బ్రిడ్జి, పిల్లర్లు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. –భద్రాచలంతప్పిన పెను ప్రమాదం ఆగుతూ.. సాగిన రెండో బ్రిడ్జి పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షించారు. ఎట్టకేలకు 2024 శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసి, అనధికారికంగా రాకపోకలు సాగించారు. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించినా లైటింగ్తోపాటు రెండు వైపులా అప్రోచ్ రోడ్డుకు రెయిలింగ్ ఏర్పాటు చేయలేదు. దీంతో రోడ్డు ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. దీంతో పత్రికల్లో కథనాలు రాగా ఒక వైపు మాత్రం లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక సారపాక గ్రామం వైపు నూతన బ్రిడ్జికి, అప్రోచ్ రోడ్డుకు మధ్య కోతకు గురై పెద్ద అగాథం ఏర్పడింది. గమనించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. వరదల కాలం వస్తున్నా.. పనులు హడావుడిగా చేసిన ఫలితమే ఈ అగాథం అనే అభిప్రాయం వక్తమవుతోంది. వేసవి కాలంలో భారీ గొయ్యి ఏర్పడగా, ప్రత్యామ్నాయ పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం రెండో బ్రిడ్జి పిల్లరుకు, అప్రోచ్రోడ్డుకు నిలువుగా గోడ కడుతున్నారు. రెండు నెలలు నుంచి పనులు చేస్తున్నా సగం కూడా పూర్తికాలేదు. వర్షాకాలం రావడంతో గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. వరదలు సంభవిస్తే మట్టి కోతకు గురై బ్రిడ్జికి, సారపాక వైపు రహదారికి మధ్య అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంది. బ్రిడ్జి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక సారపాక వైపు రెండో బ్రిడ్జికి వచ్చే దారిని పూర్తిగా మూసివేయకపోవడంతో తెలియక ప్రయాణం చేసే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. జాతీయ రహదారుల శాఖ అధికారులు సత్వరమే పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెండో బ్రిడ్జిపై అనధికారికంగా రాకపోకలు సాగుతున్నా అధికారికంగా ప్రారంభించలేదు. 11 ఏళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ నాటి తెలంగాణ రోడ్లు, భవనాల, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2015, ఏప్రిల్ 1న శంకుస్థాపన చేశారు. 36 పిల్లర్లతో, సారపాక వైపు 600 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం, 12 మీటర్ల వెడల్పుతోపాటు ఇరువైపులా 4 అడుగుల ఫుట్పాత్లతో బ్రిడ్జి రూపకల్పన చేశారు. రూ.65 కోట్లతో పనులను ప్రారంభించిన రాజ్దీప్ కంపెనీ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. తొలుత 2016, అనంతరం 2019, 2021 వరకు గడువు పొడిగించారు. అప్పటికీ పూర్తి చేయలేకపోవడంతో నేరుగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టారు. రెండు వైపులా అప్రోచ్ రోడ్డుకు రెయిలింగ్, బ్రిడ్జిపై లైటింగ్ పనులు పూర్తిచేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా ప్రారంభానికి నోచుకోలేదు. భద్రాచలం వద్ద గోదావరిపై నూతన బ్రిడ్జి -
ప్రాణాలతో చెలగాటం..
వారం దాటినా అంతే.. పాఠశాలలు పున:ప్రారంభం అయ్యే నెల ముందుగానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి బస్సులను రవాణాశాఖ అధికారుల చేత తనిఖీలు చేయించి, ఫిట్నెస్ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే బస్సులను నడిపించాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావొస్తున్నా జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఇంకా ఫిట్నెస్ ధ్రువపత్రం పొందకుండానే విద్యార్థులను చేరవేస్తున్నాయి. అలాగే, వారు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇక అధికారులు తనిఖీల మాటెత్తడం లేదు. ఇంకా 31 బస్సులు.. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఊర్ల నుంచి వచ్చి చదివే విద్యార్థులను చేరవేసేందుకు కాలంచెల్లిన బస్సులను వాడుతున్నట్లు తెలిసింది. అటువంటి వాటిని రవాణాశాఖ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి. జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన మొత్తం 231 బస్సులు ఉండగా, వాటిల్లో ఇప్పటివరకు 200 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగతా 31 బస్సులు ఇంకా సర్టిఫికెట్ పొందలేదని జిల్లా రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేయడం.. ఒక్క బస్సుకు జరిమానా విధించడం, సీజ్ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇవీ నిబంధనలు.. ● ఐదేళ్లకుపైగా అనుభవం ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారిని తీసుకోవద్దు. ● డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకోమారు మధుమేహం, రక్త పరీక్షలు, కంటిచూపు పరీక్షలు చేయించాలి. ● కాలం చెల్లిన బస్సులను ఉపయోగించొద్దు. ● బస్సుల్లో అత్యవసర చికిత్స బాక్సు ఏర్పాటు చేయాలి. ● ప్రతి బస్సుకు కూడా డ్రైవర్తో పాటు అటెండర్ను నియమించాలి. ● బస్సు బయట ఎడమ వైపు పాఠశాల పేరు, డ్రైవర్ పేరు, సెల్ నెంబర్ వివరాలు రాయాలి. ● బస్సులో అగ్నిమాపక యంత్రం, సరైన అద్దం ఏర్పాటు చేయాలి. ● పుట్బోర్డు మొదటి మెట్టు భూమికి 325 ఎంఎం ఎత్తు మించకుండా ఏర్పాటు చేసుకోవాలి. ● అత్యవసర కిటికీని ఏర్పాటు చేసి, దాని వినియోగం ఎలానో రాసి పెట్టాలి.పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలనే కోరికతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. వారి ఆశ ప్రైవేట్ పాఠశాలలకు క్యాష్గా మారుతోంది. అడ్మిషన్లు చేయించుకున్న తర్వాత వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్కూల్ బస్సుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. కాలంచెల్లిన బస్సులకు అరకొరగా మరమ్మతులు చేయించి నడిపిస్తున్నట్లు సమాచారం. వాటిల్లో ఏదైనా సమస్య తలెత్తిందంటే అంతే సంగతులు. – కొత్తగూడెంఅర్బన్ -
ఆశలు మొలకెత్తగా..
బూర్గంపాడు: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. జిల్లావ్యాప్తంగా గత మంగళవారం తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఇన్నాళ్లు అటూ ఇటు కాని వర్షాలతో పత్తి గింజలు మొలకెత్తక ఆందోళనకు గురైన రైతులు ఊపిరిపీల్చుకున్నారు. పత్తి గింజలు మొలకలు వస్తుండడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. వరి నార్లు ఆలస్యమయ్యాయని భావిస్తున్న రైతులు తాజా వర్షంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పొడి దుక్కుల్లోనే విత్తనాలు ఈ ఏడాది జిల్లాలో రైతులు పొడిదుక్కులలో పత్తి గింజలు నాటారు. ఈ నెల మొదటివారంలో వేసిన గింజలు మొలక వచ్చినా వర్షాలు లేక ఎండిపోయాయి. ఇంకొన్ని గింజలు భూమిలోనే మురిగిపోయాయి. దీంతో పలువురు రైతులు రెండో విడత గింజలు వేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నా తేలికపాటి జల్లులే తప్ప పదునుకు సరిపడా వాన కురవలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కురిసిన వర్షానికి పత్తి గింజలు మొలకలు రావడంతో ఇన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించిన రైతులు కూడా గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా రూపొందించారు. ఈ మేరకు పత్తితో పాటు ఇతర పంటల సాగుకు అవసరమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొనుగోళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. యూరియా ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకోవాల్సి ఉండడం, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతుండటంతో ముందస్తుగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏడు రకాలకే.. ఈ వానాకాలం ఏడు రకాల సన్న వరి విత్తనాలను ప్రకటించిన ప్రభుత్వం, అవి సాగు చేసిన వారికే బోనస్ ఇస్తామని వెల్లడించింది. అందులో ఈ ఏడాది ఎక్కువగా బీపీటీ–5204 (సాంబ మసూరి), ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ రకాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడి ఇచ్చే ఇతర సన్నరకాలు ఉన్నా క్వింటాకు రూ.500 బోనస్ కోసం రైతులు ప్రభుత్వం సూచించిన రకాలనే ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముంది. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న అధికారుల సూచనలు పాటిస్తే మాత్రం సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావిస్తున్నారు. అయినప్పటికీ సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు తగ్గకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక పత్తి, వరి తర్వాత రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసే అవకాశముంది. ఇంకొందరు ఆయిల్పామ్, జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇవన్నీ కాక 5 వేల ఎకరాల్లోపే కంది, పెసర, మినుము సాగు చేస్తారని చెబుతుండగా, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు సరైన వర్షాల కోసం రైతులు వేచిచూస్తున్నారు. -
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
గుండాల: ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని మామకన్ను గ్రామానికి చెందిన తాటి చిరంజీవి కుమారుడు ప్రభాస్(22) మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై పెళ్లికి బయల్దేరాడు. ఈ క్రమంలో బాటన్ననగర్ గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారు జామున గుండాల పైపు వెళ్తున్న వాహనదారులు గమనించి సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లిచూడగా ప్రభాస్ గాయాలై మృతి చెంది ఉన్నాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మహిళ..టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామ పంచాయతీకి చెందిన పొదెం చుక్కమ్మ (55) బుధవారం సమీపంలోని మొక్కంపాడు గ్రామంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చేనుకు ఉన్న ఫెన్సింగ్ దాటుతుండగా, ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై పడిపోయింది. చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బోడు ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఫెన్సింగ్కు విద్యుత్ ఎలా సరఫరా అయిందనే విషయం దర్యాప్తులో తేలుతుందని ఎస్ఐ తెలిపారు. బైక్ చోరీజూలూరుపాడు: మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు జి.ప్రేమ్ కుమార్ ఈ నెల 22న రాత్రి జూలూరుపాడులోని ఓ వ్యాపారి ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసి కొత్తగూడెం వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా బైక్ చోరీకి గురైంది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు బుధవారం తెలిపాడు. -
‘ఆశ్రమ’ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం
అశ్వాపురం: మండల పరిధిలోని గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాల నిర్వహణపై కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణను పరిశీలించారు. ల్యాబ్లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృవ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం పాఠశాల సందర్శన సందర్భంగా సూచనలు చేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సీటీఓతో ఫోన్లో మాట్లాడి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం వంటశాలను పరిశీలించిన మెనూ అమలు చేయడంలేదని గుర్తించారు. హాస్టల్ వార్డెన్ను వివరణ కోరారు. వసతి గృహాలను తనిఖీ చేసి, పరిశుభ్రత లోపాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్ వార్డెన్కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం అశ్వాపురం మండలం ఎలకలగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎంపీడీఓ ముత్యాలరావు, హౌసింగ్ ఏఈ ఉదయ్కుమార్, ఆర్ఐ లీలావతి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, హెచ్ఎం రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, వార్డెన్కు గతంలో షోకాజ్ నోటీస్ జారీ చేసినా తీరు మారకపోవడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అశ్వాపురం ముందంజ అశ్వాపురం: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది. సర్వేలో అశ్వాపురం మండలం ముందంజలో ఉంది. మండలంలో 3,440 ఇళ్లు ఎల్–1 లో ఉండగా, ఇప్పటివరకు 2076 ఇళ్ల సర్వే పూర్తయింది. ఇంకా 1,368 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంది. 409 పూరి గుడిసెలను సర్వేలో గుర్తించారు. ఎంపీడీఓ ముత్యాలరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది వేగవంతంగా సర్వే చేస్తుండగా, కలెక్టర్ అంకిత్ అభినందించారు. పాలిటెక్నిక్ కళాశాలకు రూ.1.45 లక్షల నిధులు మణుగూరు రూరల్: మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సీఎస్సార్ నిధుల నుంచి రూ.1.45లక్షల చెక్కును భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ బి.బిచ్చన్న బుధవారం కలెక్టర్ అంకిత్కు కలెక్టరేట్లో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్డెన్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశం -
నేటి నుంచి సర్
పాల్వంచరూరల్: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో కీలకమైన ఇంటింట ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గురువారం మొదలుకానుంది. బుధవారం మండల కేంద్రాల్లో సిబ్బందికు ఎన్యుమరేషన్ ఫారాలు అప్పగించారు. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతారు. ఇప్పటికే 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను సరిపోల్చి మ్యాపింగ్ చేశారు. అధికభాగం ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, వీరు తమ ఇంటికి వచ్చే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. మ్యాప్ కాని వారు ఎన్యుమరేషన్ ఫామ్తోపాటు 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. బీఎల్ఓల నియామకం జిల్లావ్యాప్తంగా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధమయ్యారు. ఏఈఆర్ఓలు, జిల్లా /అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు, సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరి సమన్వయంతో బూత్ స్థాయి అధికారులు సర్వే చేపడుతారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇంటింటి సర్వే సాగనుంది. పార్టీలకూ భాగస్వామ్యం ఓటర్ల నమోదు, సవరణలో తప్పులు జరగకుండా, పారదర్శకత పెంచేందుకు రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం భాగస్వామ్యం కల్పించింది. ‘సర్’ పర్యవేక్షణకు రాజకీయ పార్టీలు బీఎల్ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు)లను నియమించే వెసులుబాటు కల్పించారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో వివిధ పార్టీల తరఫున బీఎల్ఏలను నియమించారు. ఈ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు చేపట్టే ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ, ఓటర్లకు కావాల్సిన సలహాలు ఇస్తారు. జూలై 31న ముసాయిదా జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకున్నా, ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30వరకు దరఖాస్తులు స్వీకరించి, వీటిని సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరిస్తారు. ఆపై అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. అయితే, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని అధికారులు వెల్లడించారు. ఓటర్లకు ఇచ్చేందుకు గాను బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఈ ఫారాలు పంపిణీ చేస్తా రు. బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఓటరుకు ఎన్యుమరేషన్ పత్రాలు రెండు ప్రతులు అందజేస్తారు. ఓట రు అందులో వివరాలను నింపాక సంతకం చేస్తే, బీఎల్ఓ ఒకటి తీసుకుని, రెండో ప్రతిని రశీదు సహా ఓటరుకు అందజేస్తారు. ఇక ఆన్లైన్ ద్వారా voters. eci. gov. in పోర్టల్లో ఓటీపీ ధ్రువీకరణ పక్రియ కూడా పూర్తి చేసే వెసులుబాటు ఉంది. -
కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడామండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపారు.ముగ్గురు ఎఫ్డీఓల నియామకంచుంచుపల్లి: ఇటీవల అటవీశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో ఖాళీ అయిన కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ అటవీ డివిజన్లకు బుధవారం ముగ్గురు ఎఫ్డీఓలను తాత్కాలికంగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలానికి యూ.కోటేశ్వరరావు, కొత్తగూడేనికి మంజుల, పాల్వంచకు కృష్ణ ప్రసాద్లను నియమించారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్ త్వరలోనే పదోన్నతిపై బదిలీకానున్నారు. ఆయన స్థానంలో ఐఎఫ్ ఎస్ అధికారి రానున్నట్లు తెలిసింది. గుణాత్మక విద్యనందించాలిడీఈఓ వాసంతి పాల్వంచ: విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆదేశించారు. బుధవారం కేటీపీఎస్ ఎ కాలనీ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయపాలన పాటించాలన్నారు. డ్రాప్ అవుట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదులు పరిశీలించారు. ఎంఈఓ ఎ.శ్రీరాంమూర్తి, హెచ్ఎం రమాదేవి పాల్గొన్నారు. వైటీపీఎస్లో టెండర్లు రద్దు చేయాలిపాల్వంచ: యాదాద్రి పవర్ స్టేషన్లో ఇటీవల ప్రభుత్వం పిలిచిన ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్పవర్ ఎంప్లాయీస్ జేఎసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఎసీ నాయకులు కోరారు. బుధవారం కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వేర్వేరుగా ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన గేట్ల వద్ద ధర్నా చేశారు. జేఏసీ నాయకులు ఉమా మహేశ్వరరావు, యాస్మిన్, హారీష్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదలకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్–మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా 5,260మంది(41.33శాతం), ఆరో సెమిస్టర్ పరీక్షలకు హాజరైన 33,205 మందిలో 16,119 మంది(48.54శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. డిగ్రీ పరీక్ష ఫలితాలను కేయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని వివరించారు. కాగా, విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం 15రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించకపోవడం, ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. దీంతో వెబ్సైట్లో చూసుకున్న విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ అంశంపై యాజమాన్యాలు సంప్రదించగా, ఫీజు బకాయిల వివరాలు వెల్లడించడంతో సాయంత్రం వరకు 10 కళాశాలల బాధ్యులు చెల్లించారు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి సన్నిధిలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సీతారామచంద్రస్వామిని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ.శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి అర్చకులు, అధికారులు సంప్రదాయరీతిలో స్వాగతం పలకగా, పూజల అనంతరం పండితులు వేదాశీర్వచనం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ ఏఈఓ శ్రవణ్కుమార్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన డీఈఓ వాసంతి కొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తిరిగి మంగళవారం విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందు డీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆమె మరుసటి రోజే సెలవులో వెళ్లిన విషయం విదితమే. ఈనేపథ్యాన తిరిగి విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం ఇటీవల ప్రారంభమైన దృష్ట్యా ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నియామకాలు, ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్తో పాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలని పలువురు కోరుతున్నారు. గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ భద్రాచలంటౌన్: గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు భద్రాచలంలోని వైటీసీలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. 18 – 33 ఏళ్ల వయస్సు కలిగిన ఎస్టీ అభ్యర్థులకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి కల్పించడమే కాక అనంతరం సర్టిఫికెట్లు జారీ చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు జూలై 6వ తేదీలోగా కావాల్సిన సామగ్రితో నేరుగా వైటీసీ కేంద్రానికి రావాలని, వివరాలకు 79931 02529 నంబర్లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో సూచించారు. దేశ సమైక్యతకు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ కృషి చుంచుపల్లి/పాల్వంచరూరల్: దేశ సమైక్యత, సమగ్రత కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ప్రసాద్ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంతో పాటు పాల్వంచలో మంగళవారం నిర్వహించారు. ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించాక ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారని తెలిపారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, నాయకులు రాపాక రమేశ్, డాక్టర్ జాటోత్ వెంకన్ననాయక్, సముద్రాల గాయత్రి, సలీం, పైడిపాటి రవీందర్, నవీన్, బలగం శ్రీధర్, రేపాక రమేశ్, రామారావు, భీమల్ జైన్కుమార్, జె.మోహన్కృష్ణ పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది..
● ఖజానాలో నిధులు ఉన్నా సీఎం రేవంత్కు మనసు లేదు ● కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు మోసపోయారు ● అశ్వారావుపేటలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అశ్వారావుపేట: రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో మంగళవారం ఎస్ఐఆర్పై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల సదస్సులో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని వారు అంటున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే అచ్చంపేట నుంచి అశ్వారావుపేట వరకు ప్రజలు బీఆర్ఎస్నే కోరుకుంటున్నందన వచ్చేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. గత ఎన్నికల్లో కృతజ్ఞత – ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలవగా, కేసీఆర్ ఎంత చేసినా కాంగ్రెస్ నాయకుల మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. చింతకానిలో నిర్వహించే సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టినట్లు భట్టి విక్రమార్క ప్రకటించారని తెలిపారు. కానీ రైతులకు విద్యుత్ సరఫరా చేయక, ధాన్యం కొనుగోలు చేయక, సకాలంలో ఎరువులు, రైతుబంధు చెల్లించక చేసిన తప్పిదానికి రైతు క్షమాపణ సభగా మార్చాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేసి, అనుమతులన్నీ తీసుకున్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతు డిస్కం పేరుతో సోలార్ విద్యుత్ అందిస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని.. రోజుకు 7 గంటలే అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ రైతాంగ అవసరాలకు ఎలా సరిపోతుందో చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండీ పనులు జరగకపోగా.. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ, ఆర్థిక మంత్రికి ఆదాయం పెరిగితే వ్యవసాయ మంత్రిది మరోదారి అని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు చిన్నమెదడు చితికి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన రైతుబంధు కంటే మూడు రెట్ల బోనస్ చెల్లించినట్లు చెబుతున్నారని.. వారు రూ.3 వేల కోట్లు ఇచ్చి రైతులకు రూ.29,350 కోట్లు ఎగనామం పెట్టిన విషయం దాస్తున్నారని తెలిపారు. -
దుర్వ్యసనాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్ : ఎస్పీ
పాల్వంచరూరల్: తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలను మదిలో పెట్టుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరొచ్చని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో డ్రగ్స్ వినియోగంతో దుష్పరిణామాలపై మంగళవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. యుక్త వయస్సులోనే ఎక్కువ మంది చెడు వ్యసనాల బారిన పడే ప్రమాదముందన్నారు. ఈ సమయంలో భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని చదువుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ఇక వాహనాలు నడిపే సమయాన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్, సీఐ సతీష్, ఎస్ఐ బి.సురేశ్, ప్రిన్సిపాళ్లు పి.పద్మ, అన్వేష్ పాల్గొన్నారు. -
పత్తి విత్తనాలపై అనుమానం
క్యూఆర్, బార్ కోడ్లు లేకపోవడంతో శాంపిళ్ల సేకరణ ఇల్లెందు: ఇల్లెందు జగదాంబసెంటర్లోని ఓ దుకాణంలో క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లేని రెండు కంపెనీల పత్తి విత్తనాలు అమ్ముతుండగా అనుమానంతో రైతులు మంగళవారం అధికారులకు సమా చారం ఇచ్చారు. దీంతో సీఐ తాటిపాముల సురేశ్ ఆధ్వర్యాన తనిఖీ చేపట్టారు. ఈ మేరకు పత్తి విత్తనాల ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడంతో ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీశ్ ద్వారా కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేయించారు. అంతేకాక విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్లో పరీక్షల కోసం పంపించారు. -
‘పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం’
కొత్తగూడెంఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలోనే కాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ విఫలమైందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ తదితర అంశాలపై మంగళవారం కొత్తగూడెంలో నిరసన తెలిపారు. తొలుత విద్యానగర్కాలనీ నుంచి సూపర్బజార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా, అక్కడ మానవ హారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా దేవీప్రసన్న మాట్లాడుతూ.. విద్యార్థుల ఆశలను వమ్ము చేయకుండా, పేపర్ లీకేజీల బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాక కేంద్రం విద్యార్థులకు క్షమాపణ చెప్పి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురం లలితకుమారి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు ప్రసన్న, ఆళ్ల మురళి, గద్దల రమేశ్, వై.శ్రీనివాస్రెడ్డి, హనుమంతు, జానీపాషా, ఎం.ప్రసాద్బాబు, పైడా రాజేంద్రప్రసాద్, లోశెట్టి నాగార్జున, నూకల రంగారావు, అంతోటి పౌల్, పరమేశ్ యాదవ్, భువనసుందర్ రెడ్డి, అజయ్కుమార్, సునీల్, దేవరగట్ల ప్రసాద్, సత్తిరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’
కొత్తగూడెంఅర్బన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో మంచి ఫలితాలు వచ్చాయని జిల్లా ప్రత్యేక అధికారి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. ప్రజాపాలన అమలుపై మంగళవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని శాఖలు ప్రణాళికాయుతంగా పనిచేయడంతో విజయవంతమైందని యంత్రాంగాన్ని అభినందించారు. అయితే, దీన్ని ఆపేయకుండా నిరంతరం కొనసాగించాలని, ప్రజావాణి, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే, సమస్యల పరిష్కారంలో ఎదురైన సవాళ్లను అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. 11,309 దరఖాస్తుల పరిష్కారం ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ శాఖల వారీగా కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా అందిన 16,549 దరఖాస్తుల్లో 11,309 పరిష్కరించామని తెలిపారు. అలాగే, శాఖల వారీగా పథకాల మంజూరు, నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో పురోగతిని వివరించారు. అంతేకాక గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సౌరశక్తి గ్రామంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అనంతరం డీఎఫ్ఓ కృష్ణగౌడ్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దశాబ్దకాలంగా డంపింగ్కు నిలయమైన భద్రాచలంలోని గోదావరి నది తీర పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా వ్యర్థాలు తొలగించి 10 వేల యూకలిప్టస్ మొక్కలు నాటామని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో జిల్లా ప్రత్యేక అధికారి శ్రీధర్ -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
పాల్వంచరూరల్: అనుమతి లేని, నకిలీ విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. మండలంలోని జగన్నాథపురం రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన విత్తనమేళాను మంగళవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఏడు రకాల వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే కాక రైతులకు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. రైతులు యూరియా యాప్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాప్ వినియోగంపై అవగాహన లేకపోతే రైతువేదికల్లో ఏఈఓలు, వలంటీర్లను సంప్రదించాలని తెలిపారు. రైతు వేదికల్లోనే బోనస్ వచ్చే ఏడు రకాల వరి విత్తనాలతోపాటు మినుము, కంది, పెసర, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి వి.బాబూరావు, ఏడీఏ సుధాకర్రావు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ రాజారావు, ఏఓ బి,శంకర్, సొసైటీ చైర్మన్, సీఈఓలు కొత్వాల శ్రీనివాసరావు, జి.లక్ష్మీనారాయణతో పాటు యర్రంశెట్టి ముత్తయ్య, కాంపెల్లి కనకేష్, పాపారావు, కిషన్, కొండం వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.జగన్నాధపురంలో విత్తన మేళాను ప్రారంభించిన కలెక్టర్ అంకిత్ -
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
బూర్గంపాడు: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సపావత్ శంకర్ (45) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. అంజనాపురం ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంకర్ తన వ్యవసా య భూమిలో వరినారు పోసేందుకు వెళ్లి కుప్పకూలగా.. గ్రామస్తులు సీపీఆర్ చేసి, భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శరణ్య, బాబు, పాప ఉన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతిజూలూరుపాడు: మండలంలోని సూరారంలో సోమవారం విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన సిద్దెబోయిన చిన్నపుల్లారావుకు చెందిన దుక్కిటెద్దు మేత కోసం పొలాల వైపు వెళ్లింది. ఓ రైతు పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు పిచ్చి దొండ తీగ చుట్టుకొని పచ్చగా ఉండటంతో దాన్ని తినడానికి వెళ్లిన ఎద్దుకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభంలో దుక్కిటెద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీటి పర్యంతమైంది. రూ.80వేలు నష్టం వాటిల్లిందని, పరిహారం అందించి ఆదుకోవాలని చిన్నపుల్లారావు కోరాడు. -
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా సలీం పాషా
ఖమ్మంలీగల్: మధిర స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్గా సయ్యద్ సలీం పాషా నియమితులయ్యారు. ఆయన గతంలో ఖమ్మం జిల్లా స్పెషల్ జ్యుడీడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్గా పనిచేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఖమ్మం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఎకై ్సజ్గా కె.విజయలక్ష్మి నియమితులయ్యారు. రేపు జాబ్ మేళా ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఖ మ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. శేషసాయి ఎంటర్ప్రైజెస్ లో 35 ఖాళీల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంట ర్వ్యూ నిర్వహిస్తారని వెల్లడించారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న వారు బు ధవారం ఖమ్మం టీటీడీసీ భవన్లో జరిగే జాబ్మేళాకు హాజరుకావాలని, వివరాలకు 90308 02174 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.24న బీఏఎస్ లక్కీ డ్రా ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న బీఏఎస్ పథకానికి సంబంధించి విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 24న లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఖమ్మం ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒకటో తరగతి ప్రవేశానికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపికకు లాటరీ తీస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు. గ్రామాల్లో పశువుల అపహరణ ఏజెంట్లను నియమించుకుంటున్న నిందితులు? ఖమ్మంరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పశువుల చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోళ్లపాడు, పోలేపల్లి, తీర్థాల తదితర ప్రాంతాల రైతులకు చెందిన సుమారు 50 పశువులు ఇటీవల చోరీ అయినట్లు తెలిసింది. వేసవి కావడంతో పశువులను రైతులు మేత కోసం అడవిలో, చేల వద్దకు వదులుతుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగల ముఠా పశువులను చోరీ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి ఒకరిద్దరు ఏజెంట్లను నియమించుకుని పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాక అపహరించి వాహనాల్లో హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ పశువుల మాంసం అమ్మే వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిసింది. వారం క్రితం దొంగలు నాలుగు పశువులను అపహరించి తీసుకెళ్తుండగా తీర్థాల వద్ద రైతులు అడ్డగించడంతో వారిని బుకాయించి జారుకున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు రైతు మద్ది గంగిరెడ్డికి చెందిన చెందిన రూ.1.20 లక్షల విలువైన ఆవు గత నెలలో తప్పిపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే మరికొందరు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది. గాలివాన బీభత్సం ఏన్కూరు: మండలంలో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తూతూకలింగన్నపేట, ఏన్కూ రు, భగవాన్నాయక్తండా, అక్కినపురంతండా, హిమామ్నగర్, రేపల్లెవాడలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. భగవాన్నాయక్ తండా, అక్కినపురం తండాల్లో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడగా, ఓ చెట్టు లారీపై పడింది. తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఏన్కూరు నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్ వరకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీ సాయంతో చెట్లను తొలగించి పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, 30 స్తంభాలు, ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగడంతో విద్యుత్శాఖకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఇక భగవాన్నాయక్ తండాలో జర్పుల సూర్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆరు బయట నిద్ర.. ఇంట్లో చోరీ కారేపల్లి: ఓ కుటుంబం ఉక్కపోత తట్టుకోలేక ఆరుబయట నిద్రిస్తుండగా, వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్, డీసీసీ బ్యాంకు వెనకబజార్లో నివాసం ఉండే కేతిమాల సురేశ్ కుటుంబీకులు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమాన దుండగులు అర్ధరాత్రి సమయాన డీసీసీ బ్యాంకు వెనక గోడ దూకి, ఆపై సురేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాపై ఉన్న తాళాలతో తెరిచి ఐదు తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలు, పూజ గదిలోని కొంత నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.8 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ బి.గోపి క్లూస్టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. -
కలెక్టరేట్లో టాస్క్ఫోర్స్ సమావేశం
సూపర్బజార్(కొత్తగూడెం): రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అమలుపై సమీక్షించేందుకు కలెక్టరేట్లో సోమవారం జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాంరాథోడ్తోపాటు సంబంధిత శాఖల అధికారులు, టాస్క్ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్పోలియో బూత్ డే కార్యక్రమం, అనంతరం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే కార్యక్రమం, జూన్ 1 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్, అలాగే జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన కల్పించడం, లబ్ధిదారులకు సేవలు అందించడం వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రతాప్, వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
అడ్డూ అదుపు లేదు
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా ● లారీల రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ జామ్ ● ఆస్పత్రికి ఆలస్యమై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పినపాక: ఇసుక మాఫి యాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ గడ్డిగూడేనికి చెందిన, బీటీపీఎస్ చెరువు వద్ద పనిచేసే కార్మికుడు కొమరం వంశీ సోమవారం ఉదయం గడ్డిమందు తాగాడు. బంధువులు అతన్ని మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా సాంబాయిగూడెం గ్రామం వద్ద రామానుజవరం ర్యాంప్ లారీలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. డొంకదారిలో వెళ్లినా అప్పటికే సమయం మించిపోవడంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఇసుక లారీలు, ర్యాంపు నిర్వాహకులపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇసుక రీచ్లకు అనుమతిపై విమర్శలు గోదావరిపై అసలు నిర్మాణమే జరగని సీతమ్మసాగర్ బరాజ్లో పూడిక తీత పేరుతో ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వడంపై అనేక విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇసుక రీచ్లో అడ్డూ్అదుపు లేకుండా దోపిడీ జరుగుతోంది. టన్నుల కొద్దీ ఇసుకను తోడి తీసుకుపోవడమే తప్ప స్థానిక సమస్యలపై పట్టింపే లేదు. సోమవారం ఉదయం మణుగూరు, పినపాక మండలాల పరిధి లో వర్షపు చినుకులు పడ్డాయి. దీంతో ప్రధాన రహదారి నుంచి గోదావరి ఇసుక రీచ్ల వరకు ఉండే మట్టి రోడ్లలో ఇసుక లారీలు దిగబడిపోయే ప్రమా దం ఉంది. అయినా ఇసుక లోడింగ్, అన్లోడింగ్ వాహనాలు ఒక్కసారిగా రావడంతో మణుగూరు–ఏటూరునాగారం రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ మార్గంలో రామానుజవరం ఇసుక క్వారీకి చెందిన లారీలు నిలపడం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయినా టీజీఎండీసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చివరకు అంబులెన్స్లకు దారి ఇవ్వని పరిస్థితి నెలకొందని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మిగిలిన రేషన్
● వేసవి దృష్ట్యా మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ ● చౌక దుకాణాల్లో ఇంకా 19,084 క్వింటాళ్ల నిల్వలు ● బియ్యం తీసుకెళ్లని పలువురు లబ్ధిదారులుపాల్వంచరూరల్: వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కోటా రేషన్ బియ్యాన్ని రెండు నెలల క్రితం ఒకేసారి పంపిణీ చేసింది. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 3,26,606 ఉండగా, 443 దుకాణాల ద్వారా ప్రతి నెలా లబ్ధిదారులకు బియ్యాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ కోటా పంపిణీ కోసం మార్చిలోనే 17 వేల 200 మెట్రిక్ టన్నులను రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రేషన్ పంపిణీ చేశారు. ఇంకా కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోవడంతో 19 వేల 84 క్వింటాళ్ల 45 కేజీలు రేషన్ దుకాణాల్లో మిగిలిపోయి ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం అందిస్తోంది. మూడు నెలల కోటా ముందే దుకాణాలకు పంపించినా లబ్ధిదారులు తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా మరోవైపు జూలై కోటా 5,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం త్రినాథ్బాబు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. ముక్కిపోతున్న దొడ్డురకం బియ్యం ప్రభుత్వం గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు రకం బియ్యం పంపిణీ చేసింది. ఏడాది కాలంగా సన్న బియ్యం అందిస్తోంది. అయితే మిగిలిపోయిన దొడ్డు రకం బియ్యం నిల్వలు ఇంకా రేషన్ షాపుల్లోనే మూలుగుతున్నాయి. తిరిగి గోదాంలకు తరలించకపోవడంతో దొడ్డు బియ్యం ముక్కి వాసన వస్తున్నాయని, పురుగు పట్టాయని డీలర్లు చెబుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల అధికారి ప్రేమ్కుమార్ను వివరణ కోరగా.. మిగిలిన దొడ్డురకం బియ్యం విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజల సమస్యల పరి ష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనలతో కలిసి దరఖాస్తులను స్వీకరించా రు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో 21 ఫిర్యాదులు వైద్యాధికారులతో ఆన్లైన్ సమావేశం జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధి నిర్వహణ, ప్రధాన కార్యాలయ హాజ రు, సేవలపై సోమవారం కలెక్టర్ అంకిత్ ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది విధిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన మాతృ మరణ ఘటనల నేపథ్యంలో ప్రతీ వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలని, గర్భిణు ల పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు, రెఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ తుకారాం పాల్గొన్నారు. జీవనోపాధి కల్పిస్తున్నాంతెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమంలో పలువురికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. సెర్ప్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సీఈఓ దివ్య దేవరాజన్ సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ అంకిత్ హాజరై మాట్లాడారు. గుండాల మండలంలో 800, దుమ్ముగూడెం మండలంలో 800, పినపాక మండలంలో 865, చర్ల మండలంలో 865 కుటుంబాలను గుర్తించామని, ఉపాధి, సంక్షేమం అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ విద్యాచందన, ఏపీఎం వెంకయ్య పాల్గొన్నారు. మెనూ అమలు చేయాలి బూర్గంపాడు: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకా రం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బూర్గంపాడులోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు. మెనూ అమలు చేయకపోతే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల చేరికలపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మోరంపల్లిబంజరలోని విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల్లో విక్ర య వివరాలను పారదర్శకంగా స్టాక్ బోర్డ్ల్లో తెలపాలన్నారు. తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, డీటీ సమ్మయ్య, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఓ శంకర్, ప్రిన్సిపాల్ నాగజ్యోతి పాల్గొన్నారు.ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్సర్పై పూర్తి అవగాహన ఉండాలి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియపై పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఎల్ఎంటీలు, మండల ఆపరేటర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలన్నారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. మాస్టర్ ట్రైనర్ సాయి కృష్ణ, అధికారులు రంగా ప్రసాద్, రవీంద్రనాథ్, ఆర్డీఓ మధు పాల్గొన్నారు. -
యంత్రాల పని గంటలు వినియోగించుకోవాలి
ఇల్లెందు/మణుగూరు టౌన్/టేకులపల్లి: యంత్రా ల పనిగంటలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవా లని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమల రావు అన్నారు. సోమవారం డైరెక్టర్ సూర్యనారా యణ మణుగూరు కేసీహెచ్పీ, ఓసీ–2 గనులను సందర్శించారు. క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవా ణా ప్రక్రియను ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ తిరుమల రావు కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (కేఓసీ)ని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు తదితర పనులను పరిశీలించారు. టీసీ పాయింట్లు, వే బ్రిడ్జిలు, చెక్పోస్టులు, బొగ్గు నిల్వ ప్రదేశాలను తనిఖీ చేశారు. యంత్రాల పని తీరుపై జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్యతో సమీక్ష నిర్వహించారు. ఇల్లెందులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషిచేయాలన్నారు. వానాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బొగ్గురవాణా వాహనాలను వాహ న ట్రాకింగ్ వ్యవస్థలు, జియో ఫెన్సింగ్ సాంకేతికత ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నట్లు డైరెక్టర్లు తెలిపా రు. భద్రత, పర్యవేక్షణ, డిజిటల్ నియంత్రణ వ్యవస్థలతో పారదర్శకంగా రవాణా చేస్తున్నట్లు తెలిపా రు. సింగరేణిలో బొగ్గు మాయమైందని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు శ్రీనివాసరావు, ఎం.చిన్నయ్య, చైతన్య, రాజేష్ జాకీర్ హుస్సేన్, ప్రభాకర్రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం కనుల పండువగా స్వామివారి నిత్యకల్యాణం జరిగింది. తొలుత తెల్లవారుజాము న గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి : పీఓభద్రాచలం: గిరిజనుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహు ల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్లో అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందేలా పారదర్శకంగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు శాఖలు సమన్వయంతో పని చేయాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. కాగా వీలై చైర్పై వచ్చిన దివ్యాంగ చిన్నారిని గమనించిన పీఓ అక్కడే దరఖాస్తును స్వీకరించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, ఆనంద్ కుమార్, అశోక్, మధుకర్, సైదులు, సమ్మ య్య, రాంబాబు, ఉదయ్కుమార్, వేణు, గన్యా, మనిధర్, హేమంత్ పాల్గొన్నారు. ‘యాంటీ డ్రగ్’ పోస్టర్లు ఆవిష్కరణసూపర్బజార్(కొత్తగూడెం): యాంటీడ్రగ్ అవేర్నెస్ పోస్టర్లను ఎస్పీ రోహిత్ రాజు సోమవా రం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పోస్టర్లు, బ్యానర్లు, యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ పాయింట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 26 వరకు పాఠశాలలు, కళాశాలలు, పట్టణాలు, గ్రామాల్లో మా దక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, వినియోగించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడ్మిన్ ఆర్ఐ లాల్బాబుపాల్గొన్నారు. భూ చట్టాలపై అవగాహన ఉండాలిభద్రాచలంఅర్బన్: ఏజెన్సీ భూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రైతు, వ్య వసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ సూచించారు. ఏజెన్సీ చట్టాలు, భూ సమస్యలు, భూ భారతి చట్టంపై సోమవారం భద్రాచలంలోనిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. ఏజెన్సీలో మొబైల్ కోర్టు నడవకపోవడం వల్ల కేసులు పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంలో అనేక సమస్యలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని అన్నారు. భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ, భద్రాచలం ఆదివాసీ సమితి, ఆది వాసీ అడ్వకేట్స్ అసోసియేషన్ బాధ్యులు పాయం రవి వర్మ, చీమల నరసింహారావు, పాపారావు, వాసం ఆనంద్ కుమార్, పూనెం వీరభద్రం, కుంజా ధర్మ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్పీ బకాయి చెల్లించాలి
కొత్తగూడెంఅర్బన్: పెండింగ్లో ఉన్న రెండేళ్ల పీఆర్పీ(పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయి చెల్లించాలని కోరుతూ సింగరేణి అధికారులు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం(సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోలిండియాలో అమలు చేస్తున్న పే అప్గ్రేడ్ను సింగరేణిలో కూడా అమలు చేయాలని కోరారు. పదోన్నతులు, బదిలీలు, పోస్టింగుల పాలసీని పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి భవిష్యత్ దృష్ట్యా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, నాయకులు వెంకటాచారి, రాజ్గోపాల్, కేశవరావు పాల్గొన్నారు. -
‘మిషన్ భగీరథ’కు బ్రేక్
పాల్వంచరూరల్: మరమ్మతులు, మెయింటెనెన్స్ దృష్ట్యా మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ తోగ్గూడెం గ్రిడ్ ఈఈ నళిని తెలిపారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం, రథంగుట్ట వద్దనున్న ఇంటేక్ వెల్ రా వాటర్ పంపింగ్ మెయిన్ పైపులైన్ మరమ్మతులు, మొయింటనెన్స్ పనుల కారణంగా మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం అశ్వాపురంలోని రథంగుట్ట ఇంటేక్వెల్ నుంచి పాల్వంచ మండలం తోగ్గూడెం వద్దగల గ్రిడ్కు నిత్యం 17 కోట్ల లీటర్ల రా వాటర్ సరఫరా చేస్తారు. ఇక్కడ శుద్ధి చేశాక 13 కోట్ల లీటర్ల తాగునీటిని వివిధ గ్రామాలకు సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచి సరఫరా ఆగిపోతే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీలతోపాటు పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు తాగునీరు అందదు. 23 నుంచి 25 వరకు పైపులైన్ మరమ్మతులు పూర్తిచేశాక 26న తాగునీటి సరఫరాను పునరుద్ధరించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు తాగునీటి సరఫరా నిలిపివేత -
టీ–హబ్ సిద్ధం..
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలోని టీ–హబ్ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభానికి వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. వైద్యాధికారుల రెండేళ్ల ప్రయత్నాలు సఫలమవగా త్వరలోనే సెంటర్ షురూకానుంది. అయితే, భద్రాచలంలో టీ–హబ్ ఏర్పాటు చేయాలని 2024 జన వరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏల (భద్రాచలం, ఉట్నూర్, ఏటూరునాగారం, మన్ననూర్) పరిధిలో నూతనంగా టీ–హబ్ డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీచేసింది. ఏటూ రునాగారం, ఉట్నూర్లో భవనాలు నిర్మించి, ప్రా రంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ, భద్రాచలంలో ఆ పరిస్థితి లేదు. 2024 జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోనే అదే ఏడాది జనవరి 17న రాష్ట్ర వైద్య బృందం భద్రాచ లం ఏరియా ఆస్పత్రిని సందర్శించి, కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు, ఇతర అంశాలను పరిశీలించాలని పేర్కొంది. కానీ, వైద్యబృందం పర్యటన రద్దయింది. ఇదే వైద్య బృందం తిరిగి అదేనెల 22వ తేదీ లేదా 23న వస్తుందని అధికారులు చెప్పనప్పటికీ రాలేదు. నూతన పరికరాల కొనుగోలు ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న టీ–హబ్లో వినియోగించే పరికరాలు, టీఫా స్కానింగ్ యంత్రంతోపాటు సుమారు రూ.కోటి లేదా కోటిన్నర ఖర్చుతో సీటీ స్కాన్ యంత్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. అవకాశం ఉంటే ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం కూడా అందుబాటులోకి తేనున్నారు. సకాలంలో చికిత్స ఏరియా ఆస్పత్రిలో 200 పడకలు ఉన్నాయి. టీ–హబ్ ఏర్పాటుతో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కాలేయం, మూత్ర పిండాల పనితీరు, షుగర్, థైరాయిడ్, మూత్రం పరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే లాంటివి వైద్యుల సూచనల ప్రకారం చేయాలి. వీటిల్లో కొన్ని ఇక్కడ చేసి, మిగ తావి కొత్తగూడెం హబ్కు పంపుతున్నారు. టీ–హబ్ ఇక్కడే ఉంటే అన్నిరకాల పరీక్షలు నిర్వహించవచ్చు. సకాలంలో చికిత్స అందించవచ్చు. సిబ్బందిని నియమించాలి.. నూతనంగా ఏర్పాటు చేయాల్సిన టీ–హబ్ కేంద్రానికి మేనేజర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు–6, డేటా ఎంట్రీ ఆపరేటర్–1, ల్యాబ్ సిబ్బంది ఇద్దరిని కొత్తగా నియమించాల్సి ఉంది. ఇప్పటికే 10 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్య బృందం త్వరగా సందర్శించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరలో ఏజెన్సీ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. టీ–హబ్ ఏర్పాటుకు విశాలంగా ఉండే భవనం కావాల్సి ఉంది. ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఉన్న భవనాలు అన్నీ ఉపయోగంలోనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీ–హబ్ కోసం రూ.90 లక్షలు కేటాయించారు. ఆ నిధులు కేవలం పరికరాలకే సరిపోతాయి. భవన నిర్మాణం సాధ్యంకాకపోవడంతో నిధుల ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలో పాత క్యాంటీన్ భవనంలో టీ–హబ్ ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించి, రూ.90 లక్షలతో మరమ్మతులు చేయించి, ప్రారంభానికి సిద్ధం చేశారు.భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయ నున్న టీ–హబ్ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ముందస్తుగా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏజెన్సీ ప్రజల సౌకర్యార్థం భద్రాచలంలో టీ–హబ్ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా దీనిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ సైదులు, అడిషనల్ డీఎంహెచ్ఓ, భద్రాచలం -
వేలంతో ప్రైవేట్ పరం చేసే కుట్ర
మణుగూరుటౌన్: ఎంఎండీఆర్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బొగ్గు గనులన్నీ వేలం ద్వారా ప్రైవేట్ వారికి అప్పజెప్పే కుట్ర జరుగుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సేవ్ మణుగూరు పోరాటానికి పిలుపునిస్తూ ఓసీ–2 డిప్సైడ్ బ్లాక్ని సింగరేణికే కేటాయించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కూనంనేని, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కొరిమి రాజ్కుమార్, మిర్యాల రంగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండీఆర్ చట్టానికి మద్దతు తెలిపిందని ఆ పర్యవసానమే తెలంగాణ బొగ్గు బ్లాకులు వేలానికి వచ్చాయన్నారు. మణుగూరు భవిష్యత్తుకై పీకేఓసీ–2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని, మణుగూరు ఓసీ మూసివేయకముందే ఎక్స్టెన్షన్ అనుమతులు తేవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంత కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సింగరేణిని రాజకీయానికి వాడుకోవడం సరికాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సింగరేణి సంస్థపై చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. 140 ఏళ్ల చరిత్ర గల సింగరేణి నేడు ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కేవలం రాజకీయ జోక్యం వల్ల రూ.56 వేల కోట్లు చెల్లించకపోవడంతో సింగరేణికి ఈ దుస్థితి వచ్చిందని గుర్తుచేశారు. సింగరేణికి గనులు కేటాయించకపోతే మణుగూరు ఏరియా భవిష్యత్తుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. తొలి రోజు దీక్షలో ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్, సీపీఐ పినపాక ఇన్చార్జ్ సరెడ్డి పుల్లారెడ్డి, నాయకులు మున్నా లక్ష్మీకుమారి, దుర్ాగ్యల సుధాకర్, మల్లెల రామనర్సయ్య, మేకల ఈశ్వర్రావు, పుల్లారావు, ఆవుల నాగరాజు, సురేందర్రావు, ఆదర్ల సురేందర్ తదితరులు పాల్గొనగా, శిబిరాన్ని మణుగూరుమెడికల్ షాప్ అసోసియేషన్, టీడీపీ, టీయూసీఐ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. -
ఎద్దు దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
మణుగూరురూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీవీకాలనీలో ఎద్దు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏరియాలోని పీకేఓసీ–2లో పంప్ సెక్షన్లో పనిచేస్తున్న వినోద్కుమార్ భార్య సంధ్యపై ఇంటి సమీపంలో ఎద్దు దాడి చేయడంతో గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకట్ ఆమెను పరామర్శించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. సీతారాంపురంలో నివాసం ఉండే వజ్జా దుర్గారావు (36) ఇంట్లో ముఖం కడుక్కొని దండెంపైన ఉన్న కండువా తీయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చెట్టు విరిగి పడగా వ్యక్తికి గాయాలు టేకులపల్లి: మండలంలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇమ్రాన్ సోమ వారం ప్రమాదానికి గురయ్యారు. విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా బలంగా వీచిన ఈదురుగాలులకు చెట్టు విరిగి అతడి బైక్పై పడింది. ఇమ్రాన్కు స్వల్ప గాయాలుగా కాగా, సింగరేణి అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై కేసు భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్నగర్కాలనీకి చెందిన వేముల రామకృష్ణపై గొట్టాల రామకృష్ణ అకారణంగా దాడి చేసి గాయపరిచాడు. బాధితు డు సోమ వారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఐటీ డీఏ రోడ్డులో నివాసముంటున్న గొట్టాల రామకృష్ణ, వేముల రామకృష్ణ ఫొటో స్టూడియోలు నిర్వహిస్తున్నారు. నగదు లావాదేవీల విషయంలో ఇటీవల ఏర్పడిన మనస్పర్దలతో గొట్టాల రామకృష్ణ.. వేముల రామకృష్ణపై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
వివాహిత మహిళలు
ప్రస్తుత అనుసంధానం 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే సాగుతోంది. అందువల్ల ఆ ఏడాది తర్వాత వివాహమైన మహిళల పేర్లు అత్తగారి ఊరిలో అప్పటి జాబితాలో ఉండే అవకాశం లేదు. ●మొదట మీ పుట్టింటికి సంబంధించిన నాటి ఓటర్ల జాబితా పరిశీలించాలి. ప్రతీ బీఎల్ఓ, అంగన్వాడీ టీచర్ల వద్ద జాబితాలు ఉన్నందున వారిని సంప్రదిస్తే వివరాలు సేకరించవచ్చు. అందులో మీ తల్లి లేదా తండ్రి పేరు పక్కన ఉన్న క్రమసంఖ్య రాసుకోవాలి. ఆ సంఖ్య తీసుకొచ్చి మీ అత్తింటి ఊరి బూత్ స్థాయి అధికారికి సమర్పించాలి. తద్వారా మిమ్మల్ని ప్రస్తుత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేస్తారు. -
పంట మార్పిడి దిశగా ఆలోచించాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుదమ్మపేట : ఎల్నినో కారణంగా వర్షాభావం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని, రైతులు నష్టపోకుండా ఉండాలంటే పంట మార్పిడి చేసే దిశగా ఆలోచన చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం మండలంలోని మల్కారం గ్రామపంచాయతీ గుత్తావారిగూడెంలో నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరుకాగా, గిరిజన సంప్రదాయ నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే పనిచేశానని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో నాలుగు దశాబ్దాల నుంచి అనేక ఒడిదుడుకుల మధ్య రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాలోనూ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. మల్కారం గ్రామంలో పామాయిల్ తోటలను చూస్తే మలేషియాను చూసినట్టుగా ఉందన్నారు. పామాయిల్ తోటలో వక్క, జాజి వంటి అంతర పంటలను వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ చిన్న, సన్న కారు రైతులు పామాయిల్ సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. ఆయిల్ పామ్ రైతులు కాసాని వెంకటేశ్వరరావు, మహిపాల్, అలపాటి ప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, సర్పంచులు, గుత్తా రాజా, అంకత మహేశ్వరరావు, శ్రీరాముల ప్రసాద్, బుద్ధ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనం
భద్రాచలంఅర్బన్: రెండు వేర్వేరు ఘటనల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 9.7 కేజీల గంజాయిని పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీహరిరావు కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న స్కూటీ నీ ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 5.2 కేజీల గంజా యి దొరికింది. తరలిస్తున్న వారు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఖాన్, షేక్ షోయబ్గా తేలింది. మరో ఘటనలో స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 4.5 కేజీల గంజాయి లభించింది. తరలిస్తున్న వారు మోహిత్కుమార్, ఆనంద్ మిశ్రాగా తేలింది. ఆనంద్ మిశ్రా పరారీలో ఉన్నాడని, పట్టుబడిన వారంతా హైదరాబాద్కు చెందిన వారు కాగా, గంజాయిని ఒడిశా రాష్ట్రం కలిమెల, మోటు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా దొరికారని, మొత్తం 9.7 కేజీల గంజాయి, రెండు స్కూటీలు, రెండు మొబైళ్లను సీజ్ చేశామని, గంజాయి విలువ రూ.6.60 లక్షలు ఉంటుందని సీఐ శ్రీహరిరావు తెలిపారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్ శివకుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆటో, ద్విచక్రవాహనం ఢీ..ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు అశ్వారావుపేటరూరల్: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన భోగి నాగేశ్వరరావు (38), ఆయన భార్య వెంకటలక్ష్మి, బావమరిది మనుగొండ శ్రీను, ఆయన ఆరేళ్ల కూతురు పూరి కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం దమ్మపేట మండలం రంగువారిగూడెంలోని శ్రీముత్యాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో మండలంలోని నారంవారిగూడెంకాలనీ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను కాలు, చేయి విరిగగా చిన్నారి పూరి కాలు విరిగింది. వెంకటలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట ఆస్పత్రికి అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ యయాతిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జాతీయ రహదారిగా ప్రకటించండి..
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం నుంచి తల్లాడ మీదుగా జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయడం అవసరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో రోడ్డు రవాణా, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ జైరాం గడ్కరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖలు అందజేసినట్లు ఆదివారం తెలిపారు. సుమారు వంద కిలోమీటర్ల పొడవు కలిగి, కొత్తగూడెం (ఎన్హెచ్–30) – వైరా – జగ్గయ్యపేట (ఎన్హెచ్–65)లను అనుసంధానం చేసే ఈ రహదారి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, గిరిజన ప్రాంతాలను కలిపే రాష్ట్ర రహదారి అని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉండటం వల్ల ఇది ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉందని, ఈ రోడ్డు పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలను కలపడమే కాకుండా, పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకోవడానికి భక్తుల మార్గాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. జగ్గయ్యపేట వద్ద ఎన్హెచ్–65కి అనుసంధానం కావడం ద్వారా ప్రధాన మార్కెట్లకు లింక్ ఏర్పడుతుందని లేఖలో వివరించారు. హత్యకు దారితీసిన అనుమానం కోడి కత్తితో యువకుడి హతం సూపర్బజార్(కొత్తగూడెం): టూటౌన్ పరిధిలోని చుంచుపల్లి మండలం అంబేడ్కర్నగర్లో శనివా రం అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాదం శివాజీ.. తన భార్యతో ఎనగంటి నాగరాజు(30)కు అక్రమ సంబంధం ఉందని అనుమానించి అంబేడ్కర్నగర్లో కోడికత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. టూటౌన్ ఎస్ఐ కె.రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకటనలకే ఉచిత ప్రయాణం ఖమ్మంమయూరిసెంటర్: జిలాల్లో ఆదివారం జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే, సమన్వయ లోపమో, సమాచారం లేదో తెలియదు కానీ కొందరుడ్రైవర్ల తీరుతో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. నీట్ రాసిన విద్యార్థులు కొందరు ఖమ్మం కొత్త బస్టాండ్లో సత్తుపల్లి వెళ్లే డీలక్స్ బస్సు ఎక్కారు. అయితే విద్యార్థుల వద్ద హాల్టికెట్లను చూసిన డ్రైవర్ అవి జిరాక్స్ కాపీలని చెబుతూ దిగాలని సూచించాడు. అవి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నవని చెప్పినా వినకుండా విద్యార్థులను బలవంతంగా దింపినట్లు తెలిసింది. కంట్రోలర్లను కలిసినా డ్రైవర్ వినకపోవడంతో విద్యార్థులు మరో బస్సులో చార్జీ చెల్లించి ప్రయాణించినట్లు సమాచారం. సత్తుపల్లి డీఎం లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. విద్యార్థులు త నకు ఫోన్ చేయగా, కంట్రోలర్ను కలవమని చెప్పానని.. తర్వాత ఎవరు ఫోన్ చేయలేదని తెలిపారు. -
ప్రశాంతంగా నీట్
పాల్వంచరూరల్/సూపర్బజార్(కొత్తగూడెం): నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 959 మంది హాజరయ్యారు. 169 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 85 శాతం హాజరు నమోదైందని జిల్లా నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ చింతా శారద తెలిపారు. కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాల, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల.. మొత్తం నాలుగు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, తనిఖీ చేసిన అనంతరం లోపలకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు కాళ్లకు బూట్లు, చేతులకు గాజులు, రిస్ట్ వాచీలు, చెవుల కమ్మలు, దిద్దులు, ఉంగరాలు వంటి వస్తువులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, కొత్తగూడెంలో ఇద్దరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా కేంద్రాలకు చేరుకోవడంతో నిర్వాహకులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు. సింగరేణి మహిళా కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఎస్పీ రోహిత్ రాజు తనిఖీ చేశారు. మహిళా కళాశాలలో తనిఖీకి వెళ్లిన ఎస్పీ రోహిత్రాజును సైతం అక్కడి సిబ్బంది మెటల్ డిటెక్టర్ల సహాయంతో తనిఖీ చేశారు. పాల్వంచలోని రెండు పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు తనిఖీ నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం
● కారు చెట్టును ఢీకొని దంపతులు, కుమారుడు మరణం ● ఆరు నెలల కిందట కుటుంబ పెద్ద మృతిభద్రాచలంఅర్బన్: భద్రాచలం వెంకటేశ్వరకాలనీ మొదటి లైన్కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమారుడు ములకలపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో కన్నుమూశారు. కాలనీకి చెందిన దూడల సాయిప్రకాష్(28), సంధ్య(25) దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు మోక్షిత్(3), సాయిప్రకాష్ తల్లి జ్యోతి ములకలపల్లిలో నివసించే బాబాయి ఇంటికి భోజనానికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమాన వీరి కారు చెట్టును ఢీకొట్టగా సాయిప్రకాష్, సంధ్య, మోక్షిత్లు అక్కడికక్కడే మృతి చెందగా, జ్యోతి తీవ్రగాయాలతో పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయిప్రకాష్ భద్రాచలం సరిహద్దున ఉన్న తోటపల్లి వాసి కాగా, సంధ్యది పురుషోత్తపట్నం. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. కాగా, సాయిప్రకాష్ తండ్రి శ్రీనివాసరావు దుమ్ముగూడెం విద్యుత్ శాఖ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది జనవరి 1వ తేదీని గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన డిపెండెంట్గా ఉద్యోగం కోసం సాయిప్రకాష్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్ని పత్రాలను భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయంలో సమర్పించగా, పేరుకు సంబంధించి సమస్య ఉందని చెప్పడంతో అది కూడా ఇటీవల సరిచేయించాడు. ఈ క్రమాన బాబాయ్ ఇంటికి వెళ్లి వస్తూ భార్య, కుమారుడితో సహా ఆయన మృత్యువాత పడడం విషాదం నింపింది. కాగా, వీరి పెద్దకుమారుడు రిత్విక్ను పురుషోత్తపట్నంలోని బంధువుల ఇంట్లో వదిలి ములకలపల్లికి వెళ్లడంతో అతను ప్రమాదం బారి నుంచి బయటపడ్డాడు. ఒకే ఇంట్లో తండ్రి, కుమారుడు, కోడలు, మనవడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతులు అద్దెకుంటున్న ఇంటి యజమానులు తాళం వేసుకుని వెళ్లినట్లు తెలిసింది. మృతదేహాలను ఇంటికి తీసుకురావొద్దని భావించి వారు ఇలా చేసినట్లు సమాచారం. -
సందేహాలా?!
ఖమ్మం మయూరిసెంటర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఎస్ఐఆర్’(సర్ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జిల్లాలో కొనసాగుతోంది. 2002, ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేపడుతున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వే మొదలుకానుంది. ఓటు హక్కు భద్రంగా ఉండాలంటే మ్యాపింగ్ తప్పనిసరి కావడంతో వివాహిత మహిళలు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతను సందేహాలు వెంటాడుతున్నాయి. ఈమేరకు అనుసంధానానికి సంబంధించిన వివరాలు... -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్పై నుంచి జలాశయాన్ని వీక్షించారు. జంగల్ సఫారీ టూర్ వాహనంలో ప్రయాణించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. 546 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్కు రూ.23,515 ఆదాయం లభించింది. సఫారీ వాహనంలో 104 మంది ప్రయాణించగా రూ.9,200 ఆదాయం, 250 మంది బోటింగ్ చేయగా రూ.14,280 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
తల్లిదండ్రుల ఆశలే యజమానుల క్యాష్!
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: సాధారణంగా ఎండలు, వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులతో ప్రజలు భయపడుతుంటారు. కానీ జూన్, జూలై వచ్చిందంటే ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు ఎంత పెంచుతాయోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే తల్లిదండ్రులను ఆశలను పాఠశాలలు, కళాశాలల యజమానులు క్యాష్గా మార్చుకుంటున్నారు. నిబంధనలు పాటించకుండా, ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల కొనుగోళ్లలో అదనంగా మరికొంత బాదుతున్నారు. ఆర్థికభారమైనా విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇక నిబంధనలు అమలు చేయకపోయినా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించరు. వారితో పనిచేయించాల్సినా మంత్రులు, ఎమ్మెల్యేలు, కూడా నోరుమెదపరు. వెరసి చదువులు కొనలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలు పాటించని పాఠశాలలు, కళాశాలలపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారీ ఎత్తున పెంచిన ఫీజులను నియంత్రించాలి. చదువు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. –సోమిశెట్టి భార్గవ్ సాయి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు అధికఫీజులు వసూళ్లు చేయ డం తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించడం లేదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలి. –బుర్రా వీరభద్రం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకాగా, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అరకొర వసతులతో పాఠశాలలను నడుపుతూ ఫీజులను మాత్రం అమాంతం పెంచేశారు. పాఠశాలలు, కళాశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన చేపట్టడంలేదు. ఆటస్థలం, మరుగుదొడ్లు బెంచీలు తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. సుమారు 30 మంది విద్యార్థులకే పరిమితం చేయాల్సిన తరగతి గదిలో 50 మంది వరకు కూర్చొబెడుతున్నారు. అది కూడా ఇరుకు గదుల్లో. పాఠశాలల అనుమతులకు, రెన్యూవల్కు నిబంధనలు పాటించడంలేదు. విద్యాశాఖ అధికారులు పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించకుండానే అనుమతులు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో సుమారు 200 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో ఎన్ని రెన్యూవల్ చేశారు, ఎన్నింటికి ఈ ఏడాది కొత్తగా అనుమతులు ఇచ్చారనే విషయం విద్యాశాఖ వెల్లడించడంలేదు. తరగతుల వారీగా ఫీజు వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శించడంలేదు. అయినా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఒకటో తరగతి విద్యార్థులకే రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు ఫీజు వసూలు చేస్తూ భారం మోపుతున్నారు. యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ముందస్తుగా పుస్తకాల కోసం రూ.10 వేల వరకు, యూనిఫాం కోసం మరో రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. బయటి మార్కెట్లో రూ.రెండు వేలకు మించి ఉండని పుస్తకాలను ఆయా పాఠశాలల ముద్రణలు వేయించుకుని నాలుగైదు రెట్లు ధర పెంచి అమ్ముతున్నారు. యూనిఫాం, పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల్లో అమ్మకాలు జరపకూడదనే నిబంధనలు ఉన్న కూడా ఎవరూ పాటించడం లేదు. ఐఐటీ, జేఈఈ, నీట్ ఫౌండేషన్, ఏసీ క్యాంపస్లు, యోగా, కరాటే, క్రీడలు, చెస్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటూ తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల ముందు ఆకట్టుకునే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో మాత్రం సరైన సౌకర్యాలు ఉండవు. ఫీజు తీసుకున్నా క్రీడల్లో శిక్షణలు ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే ఏవో సాకులు చెబుతున్నారు. బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని, యాజమాన్యం అందుబాటులో ఉండకుండా భారీ ఎత్తున దోపిడికీ పాల్పడుతున్నారు. 1 నుంచి 8 తరగతి వరకు పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు 25శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని నిబంధనలు ఉన్నా అమలు చేయడంలేదు. -
అన్నింటికీ రైతు ‘వేదిక’ !
ఖమ్మంవ్యవసాయం: క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలు వ్యవసాయ సమాచారం, సేవలకు కేంద్ర బిందువులుగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ విస్తరాణధికారి(ఏఈఓ)ని నియమించడమే కాక రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు, నాలుగు గ్రామాలకు రైతు వేదికలు ఉన్నాయి. ఇన్నాళ్లు వీటిలో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణం, మార్కెట్ ధరల సమాచారం కూడా లభిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సలహాలు ఇక్కడి నుంచే.. ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ తదితర పథకాల అమలును ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ఇక పంటల సాగులో మెళకువలపై సలహాలు, వాతావరణ సూచనలను కూడా ఇదే వేదికల్లో సదస్సుల ద్వారా అందిస్తారు. మార్కెటింగ్ సౌకర్యం.. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో విక్రయించుకునేందుకు కూడా ఈ వేదికల ద్వారా అవకాశం కల్పిస్తారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి, మార్క్ఫెడ్ ద్వారా అపరాలు, మొక్కజొన్న వంటి పంటల కొనుగోళ్లు ఇక్కడి నుంచే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు రైతు వేదికల్లో పంటలను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. దీంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడే అవకాశముంది. రెవెన్యూ, పోలీసు సేవలు వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరిగే గ్రామాల్లో కేంద్ర బిందువులుగా రైతు వేదికలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యాన రెవెన్యూ, పోలీసు శాఖల సేవలు కూడా ఇక్కడే లభించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆయా శాఖల సిబ్బందిని వేదికల వద్ద అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 196.. ఉమ్మడి జిల్లాలో 196 రైతు వేదికలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 వేదికలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏఈఓలను నియమించి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.50 లక్షల మంది రైతులు సుమారు 11 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యాన రైతు వేదికల ద్వారా సేవలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు అక్రమార్కుల బారిన పడకుండా అవసరమైన, సిఫారసు చేసిన విత్తనాలు, ఎరువులను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు వరి రకాల విత్తన మినీ కిట్లను ఇక్కడి నుంచే అందిస్తున్నారు. అలాగే, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించే విత్తనాలను సహకార సంఘాల ద్వారా సబ్సిడీపై విక్రయిస్తుండగా, ఆయా సంఘాలు రైతు వేదికల ద్వారా అమ్మేలా శ్రీకారం చుట్టనున్నారు. ఇవికాక ఎరువుల విక్రయానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్లో అమలుచేసిన ఈ విధానంతో సత్ఫలితాలు రాగా కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతు వేదికల ద్వారా వ్యవసాయంపై సలహాలు ఇవ్వడమే కాక ఇతర సేవలను కూడా ఇక్కడి నుంచే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీజన్లకు అనుగుణంగా వేదికల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. అంతేకాక పంట కొనుగోళ్లకు కూడా ఇవి వేదికలుగా నిలవనున్నాయి. –ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి, ఖమ్మం -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
భద్రాచలం: యోగా సాధనతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ, అధికారులు డేవిడ్ రాజ్, మధుకర్, చందన, ఆనంద కుమార్, శ్రీధర్, ఉదయ్ కుమార్, వేణు, సున్నం రాంబాబు, అశోక్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలవాటుగా మార్చుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం): యోగాను అలవాటుగా మార్చుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. డీఎస్పీలు ఆదినారాయణ, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో..చుంచుపల్లి: కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఆది వారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ యోగా సాధానతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, సిబ్బంది ప్రతాప్, సుందర్, ఝాన్సీ రామ్, మోహన్,రామ్ ప్రసాద్, అజయ్ పాల్గొన్నారు.ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
బీఎల్ఏలు అలసత్వం వహించొద్దు
ఇల్లెందు: ఓటరు ప్రత్యేక సవరణ(సర్) కార్యక్రమంలో బీఎల్ఏలే కీలకమని, అలసత్వం వహిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఆదివారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్హాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ఏకచత్రాధిపత్యం కోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి లబ్ధిపొందుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓట్లు తొలగించి అక్రమాలకు పాల్పడ్డారని, అదే తరహా కుట్రలకు తెలంగాణాలో కూడా పాల్పడి గెలుపొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉంటే వెంటనే బీఎల్ఓకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇల్లెందు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ చాడ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొందరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి, అధికారంలో ఉన్న కాలంలో పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 30 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు -
కవి లింగారెడ్డికి ‘కవిశ్రీ’ బిరుదు
అశ్వాపురం: హైదరాబాద్లోని రవీంద్రభారతి లో మహతి సాహితీ కవి సంగమం 6వ వార్షికోత్సవం, కవి సమ్మేళనం–2026లో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన కవి శ్యామల లింగారెడ్డికి కవిశ్రీ బిరుదును ప్రదానం చేశారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. కాగా, లింగారెడ్డి రచించిన ఓ విద్యార్థి, నా కలం, ఓ మేఘమా, అన్నదాత, అమ్మ గోమాత, మంచిగా మసులుకో, పిల్లలం మేము బడి పిల్లలం, రైతన్న, సమాజమా.. లాంటివి ప్రచురితమయ్యాయి. బిరుదు అందుకున్నందుకు గాను లింగారెడ్డిని పలువురు అభినందించారు. అశ్వారావుపేటలో పీఆర్ డిప్యూటీ కమిషనర్అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ ఆదివారం అశ్వారావుపేట మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మండలంలోని అనంతారం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీల్లో నర్సరీలు, డంపింగ్ షెడ్లను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చులు, పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీడీ రమణ, డీఐపీఓ ప్రభాకర్, ఎంపీడీఓ రామకోటారెడ్డి, ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. కామన్ స్కూల్ విద్యావిధానమే మేలు ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో రకరకాల పాఠశాలలు స్థాపించడం కాకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27వేల పాఠశాలలు కాకుండా 4వేల పాఠశాలలే చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇకనైనా 15 వేలమంది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయడమే కాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం పి.నాగిరెడ్డి, టీపీటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు మాట్లాడగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న గంధసిరి మల్లయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ తీర్మానించారు. ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన జగదీశ్వర్ మృతికి సంతాపం తెలిపారు. ఐదు పోస్టాఫీసులు విలీనం ఖమ్మంగాంధీచౌక్: ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం జరుగుతున్న పోస్టాఫీసుల విలీనానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలో ఐదు పోస్టాఫీసులను విలీనం చేశారు. ఈ జాబితాలో ఖమ్మం నగరంలో నాలుగు, కొత్తగూడెం టౌన్లో ఒక సబ్ పోస్టాఫీస్ ఉంది. ఖమ్మంలోని ట్రంక్ రోడ్, డాబాలబజార్ పోస్టాఫీసులను గాంధీచౌక్ పోస్టాఫీసులో, చర్చి రోడ్ పోస్టాఫీస్ను రిక్కాబజార్ (పాత బస్టాండ్ ఎదురుగా), ఎన్నెస్పీ క్యాంపు పోస్టాఫీస్ను ఖమ్మం హెడ్ పోస్టాఫీస్లలో విలీనం చేశారు. ఇక కొత్తగూడెం భజనమందిర్ ఏరియా పోస్టాఫీస్ను హెడ్ పోస్టాఫీస్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టిప్పర్ సీజ్ కల్లూరురూరల్: అనుమతి లేకుండా ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. ఏపీలో టన్ను రూ.600 చొప్పున ఇసుక కొను గోలు చేసి తెలంగాణలో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు అమ్మొచ్చనే భావనతో పలువురు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి ఇసుక తీసుకొచ్చిన టిప్పర్కు అనుమతి లేదని తేలడంతో టిప్పర్ సహా 25 టన్నుల ఇసుక సీజ్ చేయడమే కాక డ్రైవర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ హరిత తెలిపారు. -
రామయ్యకు పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం గావించి నిత్యకల్యాణం జరిపారు. గోదారమ్మకు నదీ హారతిగోదావరికి ఆదివారం ఘనంగా నదీ హారతి సమర్పించారు. అర్చకులు గణపతి పూజ, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అర్చకులు రామవజ్జుల రవికుమార్, రామాచార్యులు, తేజశర్మ, సత్య ప్రసాద్ శర్మ, సుబ్రహ్మణ్యాచార్యులు, వీరభద్ర శర్మ, అశోక్ కుమార్ శర్మ, శివ తదితరులు పాల్గొన్నారు.పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈఓ విజయ్కుమార్, పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు సింగరేణి అధికారుల ప్రదర్శనరుద్రంపూర్: సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న కొత్తగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. ఆదివారం కేసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్పీ నగదు చెల్లించాలని, వేతన సవరణ అమలు చేయాలని కోరారు. పీఆర్పీ చెల్లించకుండా ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు ఎస్. వెంకటాచారి, సీహెచ్ రాజ్గోపాల్, ఆర్. కేశవరావు, కమలాకర్, ఎ.హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం మిథ్యే!
● వైద్యసేవల్లో లోపాలను సరిదిద్దుకోని అధికారులు ● మారుమూల ఏజెన్సీగా గుండాల మండలం ● సకాలంలో, సరైన వైద్యం అందక ఇటీవల గర్భిణి మృతి ● ఇల్లెందు, మణుగూరుల్లో ఐసీయూ సేవలు నిల్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మెరుగైన వైద్య సేవలు అందకపోవడంతో గుండాల మండలంలో గర్భిణి మృతి చెందడం రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల్లోని లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతోంది. సకాలంలో ఆస్పత్రికి చేర్చే సౌకర్యం లేక... గతేడాది నవంబర్లో చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలలు నిండకుండానే ఇద్దరు కవలలకు తల్లి జన్మనిచ్చింది. పిల్లలిద్దరు 600 గ్రాముల బరువే ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. అప్రమత్తమైన వైద్యులు తల్లి, బిడ్డలను ప్రసవం జరిగిన తక్షణమే అంబులెన్స్లో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ, పెద్దలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల తక్షణమే వైద్య సాయం అందింది. రెండు నెలల చికిత్స అనంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇద్దరు వైద్యుల్లో ఒక్కరే అందుబాటులో ఉన్నారు. సకాలంలో అంబులెన్స్, 108 లేకపోవడంతో గోల్డెన్ అవర్లో ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి తరలించలేదు. ఎట్టకేలకు ఇల్లెందుకు చేరుకున్నా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందుబాటులో లేకపోవడం బాధితురాలి పాలిట శాపంగా మారింది. చివరకు అన్ని సౌకర్యాలు ఉన్న ఖమ్మం పెద్దాస్పత్రికి బాధితురాలిని చేర్చేసరికి పరిస్థితి చేయిదాటి పోయింది. ఏజెన్సీలో అదనపు అంబులెన్సులు అవసరం ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మండలం యూనిట్గా 108 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏజెన్సీలో ఉండే దూరాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు 108 వాహనాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. గుండాల మండలాన్నే పరిశీలిస్తే కొత్తగూడెం, మణుగూరులు 80 నుంచి 100 కి.మీ దూరంలో, ఇల్లెందు, నర్సంపేటలు 60 కి.మీ దూరంలో ఉన్నాయి. ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటంతో గోల్డెన్ అవర్లో అందాల్సిన వైద్యసాయం దక్కడం లేదు. ఇల్లెందు–గుండాల మధ్య కొమురారం, పోలారం, కాచనపల్లి గ్రామాల్లోని పీహెచ్సీ/సబ్సెంటర్లలో ఒకదాన్ని అప్గ్రేడ్ చేసి, అంబులెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గుండాల ఆస్పత్రిని సీహెచ్సీగా మార్చాలి జిల్లాకు చిట్టచివరన గుండాల మండలం ఉంది. మండల కేంద్రం నుంచి నలువైపులా కనీసం 60 కి.మీ దూరం ప్రయాణిస్తేనే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. గతంలో ఇదే తరహా పరిస్థితులు చర్ల, అశ్వారావుపేట మండలాల్లోనూ ఉండేవి. అక్కడ ఆస్పత్రులను అప్గ్రేడ్ చేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. ఫలితంగా ఆ ప్రాంత ఏజెన్సీ ప్రజల కష్టాలు తీరాయి. తాజా ఘటనను దృష్టిలో ఉంచుకునైనా గుండాల ఆస్పత్రిని సీహెచ్సీ స్థాయికి అప్గ్రేడ్ చేయడం, తక్షణ అవసరంగా కనీసం సీమాంక్ సెంటర్ను మంజూరు చేయించడంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుండాల తరహా పరిస్థితులు ఉన్న ఇతర మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలంలోనే ఐసీయూ సేవలు ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందివ్వడంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లది కీలక పాత్ర. కానీ జిల్లాలో కేవలం భద్రాచలంలోనే 10 పడకల సామర్థ్యంతో ఐసీయూ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏజెన్సీ కేంద్రాలుగా ఉన్న ఇల్లెందు, మణుగూరు ఏరియా ఆస్పత్రుల్లో ఐసీయూ సేవలు అందుబాటులో లేవు. ఇక్కడికి అత్యవసర వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులను ఆగమేఘాల మీద భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం రిఫర్ చేయాల్సి వస్తోంది. జిల్లా నుంచి ఐసీయూ ప్రతిపాదనలు వెళ్లిన ప్రతీసారి కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ట్రామా కేర్ సెంటర్ను రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లు దాటినా ట్రామా కేర్ సెంటర్ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా మొత్తానికి భద్రాచలం ఒక్కటే ఎస్టాబ్లిష్డ్ ఐసీయూ సెంటర్గా ఉంది. లేదంటే అత్యవసర వైద్య సేవలకు ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం -
సింగరేణిలో యోగా దినోత్సవం
కొత్తగూడెంఅర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సింగరేణి ప్రధా న కార్యాలయంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. తొలుత కళాకారిణి సీతాప్రసాద్ నృత్య బృందం యోగాపై అవగాహన కల్పించింది. అనంతరం యోగా ప్రతిజ్ఞ చేశారు. జీఎంలు జీవీ కిరణ్కుమార్, వెంకట రమణ, పి.ఎలిషా, ఏజేఎంమురళీదరరావు, నాయకులు ఎస్వి.రమణ మూర్తి, పీతాంబర రావు, ఎస్.వెంకటాచారి, డీజీఎం(పర్సనల్) కేసా నారా యణరావు, బి.శివ కేశవరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లలో, ఆర్సీఓఏ క్లబ్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. జీఎం ఎం.శాలేంరాజు, ఎం.గోవిందరావు, యూనియన్ నాయకులు కత్తెర్ల రాములు, ఎండీ. రజాక్, ఇతర అధికారులు ఉపేందర్రావు, ఎల్. తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా..
గుండాల: సరదాగా స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు తిరిగిరాని లోకానికి వెళ్లాడు. గుండాల మండలంలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన గుగులోత్ దేవా–కల్పన కుమారుడు సీమాన్(11) ఇల్లెందు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆయన శనివారం సాయంత్రం స్నేహితులు వేణు, సంజుతో కలిసి గ్రామ సమీపాన మల్లన్న వాగులో ఈతకు వెళ్లాడు. తొలుత సీమాన్, వేణు దిగగా, ఇద్దరూ మునిగిపోతుండడంతో ఒడ్డుపై ఉన్న సంజు గుడి వద్ద ఉన్న గ్రామస్తులు సమాచారం ఇచ్చాడు. స్థానికులు వచ్చే సరికి సీమాన్ పూర్తిగా మునిగిపోగా వేణు ౖపైపెనే ఉండడంతో ఆయనను కాపాడారు. ఆతర్వాత గుండాల సీఐ తిరుపతి, ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యాన రెండు గంటల పాటు గాలించగా సీమాన్ మృతదేహం బయటపడింది. తరచుగా పిల్లలు వాగులో ఈతకు వెళ్తున్నా ఇన్నాళ్లు నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో ఏమీ జరగలేదని చెబుతున్నారు. కానీ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వరద చేరిన విషయం అంచనా వేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు వెల్లడించారు. ఓ పక్క తండాలో దుర్గమ్మ ప్రతిష్ట వేడుకలు జరుగుతుండగా మరోపక్క బాలుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. వాగులో మునిగి బాలుడు మృతి -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. జగన్ మళ్లీ సీఎం కావాలని..దుమ్ముగూడెం: వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావా లని ఆకాంక్షిస్తూ జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ శనివారం పర్ణశాల రామయ్యను దర్శించుకున్నారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ తెలంగాణలోని 100 దేవాలయాలను సందర్శించి 10,101 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తానని ప్రవీణ్ తెలిపాడు. వార్షిక లక్ష్యాలను అధిగమించాలిసింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు టేకులపల్లి: బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే. వెంకటేశ్వర్లు అన్నారు. ఇల్లెందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఉపరితల గనిని శనివారం ఆయన సందర్శించారు. గని వ్యూ పాయింట్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవా ణా ప్రక్రియతోపాటు ఓవర్ బర్డెన్ తొలగింపు, లోడింగ్ పనుల పురోగతిని ఏరియా జీఎం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు ఆటంకాలు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు బి.మాధవరావు, జాకీర్ హుస్సేన్, శ్రీనివాస రావు, రామదాసు, బ్రహ్మం, ఎస్.రాజేష్ పాల్గొన్నారు. బీజేపీని బలోపేతం చేయాలిచుంచుపల్లి: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రాష్ట్ర కార్యదర్శి కర ణం సాయి పరిణితి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమైందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. నాయకులు కేవీ రంగా కిరణ్, కుంజా ధర్మా, పొడియం బాలరాజు, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, పుణ్యం భిక్షపతి, వెంకన్న, భోగి కృష్ణయ్య, భూక్య దివ్యశ్రీ, మోహన్ కృష్ణ, కుమార్ పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన లారీ
అశ్వాపురం: మండలంలోని మొండికుంట శివారులో అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్కు తీవ్ర గాయాలయ్యా యి. ఇసుక లోడ్తో లారీ కొత్తగూడెం వైపు వెళ్తుండగా మొండికుంట శివారులో పాలవాగు సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. లారీడ్రైవర్ శంకర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా అవస్థ పడ్డాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో అశ్వాపురం వైపు వస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగి వివరాలు తెలుసుకొని ఐటీసీ అధికారులతో మాట్లాడి రెస్క్యూ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి డ్రైవర్ను బయటకు తీసి, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్కు తీవ్రగాయాలు -
పారిశుద్ధ్యం మెరుగుపడాలి
ఇల్లెందురూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చుకునేలా కార్యదర్శులు పనితీరు మార్చుకోవాలని జెడ్పీ సీఈఓ బొగ్గుల నాగలక్ష్మి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహిచారు. సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు గ్రామాల్లో చెత్త సేకరణలో రెండు బుట్టల విధానం బదులుగా నాలుగు బుట్టల విధానం అమలు చేయాలని, దీనిపై వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చాలని, కంపోస్టు యార్డు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేస్తే నోటీసులిచ్చి జరిమానా విధించాలని, గ్రామాల్లోని వ్యాపార సముదాయాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రత్యామ్నాయ వస్తువులను పరిచయం చేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా వినియోగించే నీటి వనరులలో నీటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏఈ రాజు, ఏఓ సతీశ్, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం ఉండాలి
విద్యార్థుల హాజరు భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో సోమవారం నుంచి విద్యార్థుల హాజరు వంద శాతం నమోదు కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రధానోపాధ్యాయులు, వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ హెచ్చరించారు. శనివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల కల్పనపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలలో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. భద్రగిరి మార్ట్లో వినియోగదారుల డిమాండ్కు తగినట్లుగా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని పీఓ రాహుల్ సూచించారు. శనివారం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉత్తమ ఐటీడీఏ పీఓగా ఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డును అందుకున్నందుకు టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాహుల్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు చందన, విజయలక్ష్మి, మధుకర్, సమ్మయ్య, రమేష్, అశోక్ , అసోసియేషన్ బాధ్యులు యుగంధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్, అన్నం వెంకటేశ్వర్లు, వాసు, కబీర్, వీర నాయక్, జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. క్రీడలపై ఆసక్తి ఉండాలి దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలపైనా మక్కువ కలిగి ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శని వారం మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, లైబ్రరీ, డైనింగ్ హాల్, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. బడిబాట కార్యక్రమంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. వంటగది రోజూ శుభ్రం చేయాలని, మెనూ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం చిన్న ఆర్లగూడెం కొంగవాగు గుంపు జీపీఎస్ పాఠశాలలను పరిశీలించి పిల్లలతో ఉద్దీపకం వరకు బుక్లోని అంశాలను చదివించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సోమశేఖర్, వార్డెన్ లక్ష్మణరావు, ఎస్సీఆర్ పి విఠల్, జీపీఎస్ పాఠశాల హెచ్ఎంలు పాపారావు, కన్నారావు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
గంజాయి, నాటుసారా స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఎండు గంజాయి, నాటుసారా పట్టుబడ్డాయి. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు బృందం కూనవరం – భద్రాచలం రహదారిలోని ఇసుక రీచ్ వద్ద శనివా రం తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై తరలిస్తున్న 21.100 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని, మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే అంబేడ్కర్ సెంటర్ వద్ద హీరో గ్లామర్ బైక్పై మూడు క్యాన్లలో తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, సారాతో పాటు రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసును భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్కు బదిలీ చేశారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, శివకుమార్, వీరబాబు, తిరుపతి, ఉపేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతిచండ్రుగొండ: మండలంలోని బెండాలపాడులో విద్యుదాఘాతంతో మూడు పాడి గేదెలు మృతిచెందాయి. శుక్రవారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురుగాలుల కారణంగా గ్రామ శివారులోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గోదా వెంకటేశ్వర్లుకు చెందిన మూడు పాడి గేదెలు శనివారం ఉదయం మేతకు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాయి. ఆర్థికంగా నష్టపోయానని, పరిహారం అందించాలని రైతు వెంకటేశ్వర్లు కోరాడు. పిడుగుపాటుతో పశువులు.. జూలూరుపాడు/టేకులపల్లి: జూలూరుపాడు కాకర్లలో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా.. కాకర్లకు చెందిన చావా కృష్ణయ్య రైతుకు చెందిన గేదైపె పిడుగుపడటంతో మృతి చెందినది. సుమారు రూ.70 వేలు నష్టం వాటిల్లిందని, పరిహారం అందించాలని రైతు కృష్ణయ్య విజ్ఞప్తి చేశాడు. అలాగే, టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన పూనెం నర్సయ్య ఎద్దుపై పిడుగుపడటంతో మృతిచెందింది. సర్పంచ్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సునీత, వెటర్నరీ డాక్టర్ పూర్ణచందర్, జీపీఓ కన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులు భూసార పరీక్ష చేయించుకొని, దాని ఆధారంగా పంటలకు సరిపడే మోతాదులోనే ఎరువుల వినియోగాన్ని చేపట్టాలని కొత్తగూడెం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ సూచించారు. శనివారం కేవీకేలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులను విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వ్యవసాయ పను ల కోసం వినియోగించుకోవాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే భూసారం తగ్గుతుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలు వేసుకోవాలని, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలు డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి), కేఎన్ఎం1638 రకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. రైతుల కోసం కేవీకే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించి, ఆయిల్పామ్, మునగ, తీగజాతి కూరగాయల సాగు చేపట్టడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో కోరామాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆగ్రోనమిస్ట్ వెంకటేశ్, మార్కెటింగ్ ఆఫీసర్ రాజేశ్, 80 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, రైతులకు కేఎన్ఎం–1638 విత్తనాలు పంపిణీ చేశారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్ -
మొక్కల సంరక్షణపై శద్ధ చూపాలి
పాల్వంచరూరల్: గ్రామ పంచాయతీలోని నర్సరీల్లోని మొక్కలు చనిపోకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఆర్డీఓ విద్యాచందన సిబ్బందికి సూచించారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి, బస్వతారకకాలనీ, కేశవాపురం, జగన్నాథపురం, సోములగూడెం, బిక్కుతండా గ్రామపంచాయతీలోని నర్సరీలను ఆమె సందర్శించి పరిశీలించారు. మొక్కల పెంపకం, నిర్వహణ, నీటి సరఫరాపై ఆరా తీశారు. నర్సరీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, మొక్కలు నాటిన తర్వాత ప్రతి మొక్క సజీవంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారిణి షాబ్నా, ఏపీఓ రఘుపతి, ఈసీ పుల్లయ్య పాల్గొన్నారు. ఘనంగా వీకెండ్ సాంస్కృతిక వేడుకలుభద్రాచలంటౌన్: భద్రాచలం హరిత హోటల్ లో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వీకెండ్ కల్చరల్ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం హైదరాబాద్ కళాకారులు నిర్వహించిన సంగీత కచేరి ప్రేక్షకులను అలరించింది. పర్యాటకులకు వినోదం పంచేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఇలాంటి సాంస్కృతిక వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలిచుంచుపల్లి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆదేశించారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, మాతా,శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పనితీరు, సికిల్ సెల్ అనీమియా నియంత్రణ కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలుచేయాలని సూచించారు. సిబ్బంది ప్రతాప్, ప్రసాద్, దినేష్, మోహన్, రామ్ ప్రసాద్, విప్లవ్ కుమార్, సలిత, శ్రీధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ‘రెట్రో రిఫ్లెక్టివ్ టేప్’ను రద్దు చేయాలికొత్తగూడెంఅర్బన్: రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ రిఫ్లెక్టివ్ టేపుల కంటే రెట్టింపు ధరలతో ఈ టేపులను విక్రయిస్తుడటంతో ఆటో డ్రైవర్లపై ఆర్థికభారం పడుతోందన్నారు. వాహనం చుట్టూ 22 మీటర్ల నుంచి 26 మీటర్ల వరకు టేపులను అతికించాలనే కొత్త నిబంధనతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, లారీలు, బస్సుల యజమానులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేకపోయినా రవాణా శాఖ తీరు ప్రైవేట్ కంపెనీల దోపిడీకి ఊతమిచ్చేలా ఉందని అన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చడం కోసమే ఈ విధానం అమలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, చింటూ, సురేష్, మోహన్, శీను, సోను, స్వామి పాల్గొన్నారు. -
గడువులోగా లక్ష్యాల సాధన
టేకులపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే కాక, లక్ష్యాలను గడువులోగా చేరేలా అధికారులు పర్యవేక్షించాని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేసిన ఆమె రికార్డుల పరిశీలన అనంతరం జీపీల కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చెల్లింపులు, వనమహోత్సవం, ఉపాధి హామీ పథకం పనులు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీఓ విక్రమ్, ఉపాధి హామీ పథకం ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తిరుపతి పాల్గొన్నారు. -
పాస్ పుస్తకాలు మంజూరు చేస్తాం
దమ్మపేట: సర్వే అనంతరం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం మండలంలోని రంగువారి గూడెం, దమ్మపేట, లింగాలపల్లి గ్రామాల్లో పర్యటించారు. అఖినేపల్లి రెవెన్యూ పరిధిలోని రంగువారిగూడెంలో జరుగుతున్న నాన్ కడాస్ట్రాల్(సమగ్ర) సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగుభూమి ఉన్నా కొత్త పాస్ పుస్తకాలు రాలేదని రైతులు విన్నవించగా, సర్వేపూర్తయిన అనంతరం మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. తమకు పరిహారం పెంచాలని హైకోర్టుకు వెళ్లిన ట్లు దమ్మపేట, నాగుపల్లి రెవెన్యూ పరిధిలోని 114 ఎకరాలకు సంబంధించిన నిర్వాసిత రైతులు తెలి పారు. ప్రస్తుతం పామాయిల్ సాగులో ఉన్న తమ భూముల విలువ ఎకరానికి రూ.50లక్షల నుంచి 60లక్షల వరకు ఉందని వివరించారు. తమకు ఆ స్థాయిలో పరిహారం లేదా ప్రత్యామ్నాయంగా అదే విస్తీర్ణంలో సాగు భూమి ఇప్పించాలని కోరగా.. కలెక్టర్ పరిశీలిస్తానని తెలిపారు. అనంతరం లింగాలపల్లి గ్రామంలో సర్వేను పరిశీలించారు. ఆర్డీఓ మధు, ఇతర అధికారులు రవీంద్రారెడ్డి, రామనరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు మరింత పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రూ.8,914 కోట్ల లక్ష్యంతో రూపొందించిన ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.4,593 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.889 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.221 కోట్లు, ఇతర రంగాలకు రూ.3,211 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అనంతరం రుణ ప్రణాళిక పోస్టర్లు ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఇతర అధికారులు రామిరెడ్డి, బాబూరావు, ఇంతియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
ఉపాధ్యాయుడిపై వైద్యుడి దాడి
చర్ల: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వ వైద్యశాల)లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు ఉపాధ్యాయుడిపై దాడిచేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వివరాలి లా ఉన్నాయి. చర్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పలకా నాగేశ్వరరావు వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి, బైక్ను దారికి అడ్డంగా పెట్టాడు. దానిని తీయమని వైద్యశాలలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్ సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో నాగేశ్వరరావుకు, సెక్యూరిటీ గార్డుకు మధ్య గొడవ జరుగుతండడంతో కృష్ణ ప్రసాద్ అక్కడికి వెళ్లగా వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో కృష్ణప్రసాద్ నాగేశ్వరరావుపై చేయి చేసుకోగా ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రంగంలోకి దిగిన ఉద్యోగ, గిరిజన సంఘాల నాయకులు ఇరువురికి సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గర్భిణి మృతిచంద్రుగొండ: పిండాన్ని తొలగించాలని వైద్యులు చేసిన సూచనను పాటించని గర్భిణి అనారోగ్యానికి గురై మృత్యువాత పడిన ఘటన మండలంలో బెండాలపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారం భవాని (30) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె గర్భం దాల్చగా.. వైద్యులు పిండాన్ని తొలగించాలని సూచించారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో 6 నెలల గర్భవతిగా ఉన్న భవాని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి ఇప్పటికే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ -
ఒకే విద్యార్థి.. ఒకే టీచర్
పాల్వంచరూరల్: ఆరేళ్ల కిందట మూసివేసిన బడిని గతేడాది తెరిచారు. ఆనాడు ఐదుగురు విద్యార్థులు వచ్చారు. ఈ ఏడాది ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు వస్తున్నాడు. ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయినితో పాఠశాల నడుస్తోంది. పాల్వంచ మండ లం నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని బోజ్యా తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇందులో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్నాయి. 20మంది వరకు విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లతో కొనసాగింది. క్రమంగా విద్యార్థులు తగ్గడంతో పాఠశాల 2019లో మూతబడింది. ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్పై ఇతర స్కూళ్లకు బదిలీచేశారు. స్థానికుల ఆందోళనలతో ఆరేళ్ల తర్వా త స్థానికులు ఆందోళన చేయడంతో 2025లో పాఠ శాలను తెరిచారు. గతేడాది ఐదుగురు విద్యార్థులుండగా.. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఒక విద్యార్థి హాజరవుతున్నా డు. మిగిలినవారిలో గ్రామానికి కిలోమీటర్ దూరంలోని నాగా రం హైస్కూల్కు ముగ్గురు, పాల్వంచలోని ప్రైవేట్ స్కూల్కు మరో ఇద్దరు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులతో ఎంఈఓ శ్రీరాంమూర్తి మాట్లాడినా వారు రావ డం లేదు. ఐదేళ్ల విద్యార్థి వస్తుండగా.. టీచర్ గీత ఆ విద్యార్థికే బోధిస్తోంది. అతడిని కూడా సమీపంలోని నాగారం పాఠశాలలో చేర్చాలని యత్నించినా స్థానికులు అభ్యంతరం తెలపడంతో ఉపాధ్యాయిని విధు లు నిర్వర్తించక తప్పడం లేదు. మూసిన బడిని తెరిచినా ఫలితం శూన్యం -
లోక్ అదాలత్తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలతసూపర్బజార్(కొత్తగూడెం): జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజ లు తమ వివాదాలను సత్వరంగా, సులభంగానే కాకుండా తక్కువ ఖర్చుతో పరి ష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం మోటారు వాహన ప్రమాద కేసుల్లో రాజీకుదిరిన బాధితులకు అవార్డు కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కిరణ్కుమార్, న్యాయవా దులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో 1720 కేసులు పరిష్కారం కొత్తగూడెంలో నిర్వహించిన లోక్ అదాలత్లో 23 సివిల్ కేసులు, 7 మోటార్ వాహన ప్రమాద కేసులు, 1105 క్రిమినల్ కేసులు, 169 పీఎల్సీ కేసులు, 169 సైబర్ క్రైమ్ కేసులు, 360 ట్రాఫిక్ చలాన్లు.. మొత్తం 1720 కేసులు పరిష్కారమయ్యాయి. ఇల్లెందులో 807, భద్రాచలంలో 1243, మణుగూరులో 801, దమ్మపేటలో 750 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. -
అవగాహనతోనే వ్యాధుల నుంచి రక్షణ
టేకులపల్లి: అవగాహనతో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ కోసం జన్యు పరీక్షల శిబిరం నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,80,700 మందికి పీఓసీ పరీక్షలు నిర్వహించి, 3,450 మంది క్యారియర్లు, 687 మంది బాధితులను గుర్తించామని తెలిపారు. 6,341 మందికి హెచ్పీఎల్సీ పరీక్షలు నిర్వహించగా 1,900 మంది క్యారియర్లు , 135 మంది సికిల్ సెల్ బాధితులు ఉన్నట్లు నిర్ధారించామని స్పష్టం చేశారు. సికిల్ సెల్ అనీమియాను ప్రాథమిక దశలో గుర్తిస్తే బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కందుల దినేష్, వైద్యులు కంచర్ల వెంకటేష్, మనిషా, పుణ్యశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారులు రాంప్రసాద్, హరి కిషన్, దేవా, పున్నమయ్య, రంజిత్ పాల్గొన్నారు. ముందస్తుగా గుర్తిస్తే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చుపాల్వంచరూరల్: జన్యు పరమైన వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే వాటి ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ అన్నారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అధ్యాపకులు మాధవి, శ్రీదేవి, రాజ్కుమార్ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ తుకారాం -
ఎవరిని ఎంపిక చేయాలో..?
● ప్రీప్రైమరీ స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికపై రాజకీయ జోక్యం ● తలలు పట్టుకుంటున్న హెచ్ఎంలు.. ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 ప్రీప్రైమరీ పాఠశాలలుఇల్లెందు: ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఎంపిక బాధ్యత తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం 236 మంది ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేయాలని పాఠశాలలకు జాబితా పంపారు. అయితే, ఒక్కో పాఠశాలలో ఒక్కో పోస్టుకు కనీసం 10 మందికిపైగా ఉన్నత చదువులు చదువుకున్న వారు దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా జోరుగా పైరవీలు మొదలు పెట్టారు. దీంతో పాఠశాలలు పునప్రారంభమైనా చాలాచోట్ల ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఎంపికలు జరగలేదు. రాజకీయాలను అధిగమించి ప్రక్రియను పూర్తి చేయాలంటే తలకు మించిన భారంగా మారిందని హెచ్ఎంలు లబోదిబోమంటున్నారు. ఈ బాధ్యతను తమకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోచోట ఒక్కోరకంగా ఒత్తిడి వస్తోందని హెచ్ఎంలు మదన పడుతున్నారు. ఇక ఇల్లెందు మండలంలో 14 ప్రీ ప్రైమ రీ పాఠశాలలను మంజూరు చేశారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ప్రీ ప్రైమరీ టీచింగ్ ట్రైనింగ్ ఉత్తీర్ణులైన వారికి, ఆయాలకు 7వ తరగతి చదివిన వారికి అవకావం కల్పించాలని సూచించారు. అయితే అక్కడి హెచ్ఎంలు మాత్రం ఎంపిక కోసం ఎలా ముందుకు వెళ్లాలని సమాలోచనలు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఛేదించుకుని ఎంపిక చేయలేమని చేతులు ఎత్తేశారు. ఈ బాధ్యత తమకు ఎంతమాత్రం సహేతుకం కాదని డీఈఓ, ఎంఈఓ స్థాయిలో చేసినట్లయితే బాగుండేదంటున్నారు. మండలంలోని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో 32 దరఖాస్తులు ఇన్స్ట్రక్టర్ పోస్టుకు.. ఆరు దరఖాస్తులు ఆయా పోస్టుకు వచ్చాయి. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, పాఠశాల కమిటీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాలలో అంతర్భాగం ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లు నిండిన చిన్నారు లను చేర్చుకుంటారు. కానీ, నాలుగేళ్లు నిండిన వారిని ఈ ప్రీ ప్రైమరీలో చేర్చి వారికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి, 5వ ఏట అక్కడి ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు అక్కడి ప్రా థమిక పాఠశాలలో అంతర్భాగంగా ఉంటాయి. ఆ ప్రాథమిక పాఠశాలలోనే ఒక గదిని వీటికోసం కేటాయించాల్సి ఉంది. ఇన్స్ట్రక్టర్, ఆయాతో పాటు ప్రతీ ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఏడాది బోధనకు ఉపయోగపడే మెటీరియల్ అందజేయనున్నారు. అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే వీరికి మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఏడాది తర్వాత వారు సంసిద్ధులుగా మారినందున అక్కడి ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతితో చేర్పిస్తారు. పాఠశాలకు సంసిద్ధులను చేసేందుకే ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉపయోగపడనున్నాయి. అయితే, అందులో ఇన్స్ట్రక్టర్ల ఎంపిక మాత్రం హెచ్ఎంలకు కత్తిమీద సాములా తయారైంది. -
‘చేయూత’కు ఈ–కేవైసీ!
● ఖమ్మం జిల్లాలో 1.45 లక్షల మంది లబ్ధిదారుల ఎఫ్ఆర్ఎస్ పూర్తి ● ఇంకా పెండింగ్లో 28,867 మంది పెన్షనర్లు ● ఐరిష్ నమోదు కాకపోతే వేలిముద్రల సేకరణ ● వారంలోగా పూర్తిచేసేలా కార్యాచరణఖమ్మంమయూరిసెంటర్: ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫేషియల్ రిక గ్నైజేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) అమలు కొనసాగుతోంది. అర్హులైన వారికి పింఛన్ అందిస్తూ, అనర్హులు, మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెల 15 నాటికే ప్రక్రియను ముగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలు, ఎఫ్ఆర్ఎస్లో లబ్ధిదారుల ఐరిస్ నమోదు కాకపోవడంతో వంటి కారణాలతో జాప్యం జరిగింది. ఈ నేపథ్యాన వారం రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. 82శాతం పూర్తి ఖమ్మం జిల్లాలో 1,76,477 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో ఇప్పటివరకు 1,45,195 మంది(సుమారు 82 శాతానికి పైగా) లబ్ధిదారుల ఎఫ్ఆర్ఎస్ గుర్తింపు పూర్తయింది. మిగిలిన 28,867 మంది గుర్తింపు చేపట్టాల్సి ఉంది. అధికారులు, పంచాయతీ కార్యాలయాల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో వీరి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పలువురి విషయంలో సాంకేతిక కారణాలు, ఇతర అంశాల ఆధారంగా అధికారులు రిమార్క్ నమోదు చేశారు. త్వరలోనే నూరు శాతం మొత్తం ప్రక్రియలో ఇంకా 571 ఆధార్ సంబంధిత అంశాలు పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా మిగిలిన 28,867 మందికి కూడా వీలైనంత త్వరగా ఈ–కేవైసీ లేదా ఎఫ్ఆర్ఎస్ పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తోంది. అర్హులైన లబ్ధిదారులెవరూ నష్టపోవద్దనే ఉద్దేశంతో మంచానికే పరిమితమైన వారి వద్దకు సిబ్బందే స్వయంగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అనర్హుల తొలగింపు, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఆర్అండ్ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ శివకుమార్అశ్వాపురం: జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దుమ్ముగూడెం ఆనకట్టను, సీతమ్మసాగర్ బ్యారేజీని, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ను ఆయన పరిశీలించారు. అనంతరం బీజీ కొత్తూరులోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అంకిత్తో కలిసి సాగునీటి ప్రాజెక్ట్ల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం తదితర ప్రాజెక్ట్లకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అటవీ అనుమతులు, సర్వే పనులు, కోర్టు కేసుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ఫేస్–1లో 1,522 ఎకరాలు, ఫేస్–2లో 2,365 ఎకరాలకు అవార్డులు జారీ చేసి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. ఫేస్–3లో 1,621 ఎకరాలకు గాను 1,350 ఎకరాలకు అవార్డులు జారీ చేశామని, 903 ఎకరాలకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు–1, 2, 6లకు సంబంధించిన భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్డీఎల్సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు, మండల తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు రమేష్, యాసిన్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బూర్గంపాడు: ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం ఉదయం బూర్గంపాడులో పోలీసులు పట్టుకున్నా రు. ఎస్ఐ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఏపీ లోని జగ్గయ్యపేట నుంచి ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని బూర్గంపాడు మార్కెట్యార్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. లారీలో 28 టన్నుల రేషన్ బియ్యం ఉండటంతో సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తరలిస్తున్న మల్కన్గిరికి చెందిన లారీ ఓనర్ నవీన్కుమార్ బాత్ర, లారీడ్రైవర్ బికాస్ ఆచార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బియ్యం సరఫరా చేసిన శ్రీరంగం సత్యనారాయణపై కూడా కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్ఐ ప్రసాద్ వివరించారు. మహిళ అదృశ్యంపై కేసుఇల్లెందు: పట్టణంలోని ఎల్బీఎస్నగర్కు చెందిన తన భార్య ఏప్రిల్ 24 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త గుండంపల్లి సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అరుణ కథనం ప్రకారం.. 19వ వార్డు ఎల్బీఎస్నగర్కు చెందిన గుండంపల్లి అరుణతోపాటు బంగారు ఆభరణాలు రూ.50వేల నగదు, 30తులాల వెండి పట్టీలు కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏటూరునాగారానికి చెందిన వడ్రంగి పనిచేసే బట్టు సుమన్పై తనకు అనుమానం ఉందని, గతంలో కూడా పంచాయితీలో తనను హతమారుస్తానని బెదిరించాడని, ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని ఫిర్యాదులో సతీశ్ వివరించాడు. కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు. అతి వేగంగా డీసీఎం వ్యాన్ నడిపిన డ్రైవర్? పాల్వంచ: భద్రాచలం రహదారిపై ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ శుక్రవారం రాత్రి అతి వేగంతో నడుపుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో కొంత మంది వాహనదారులు ఆందోళనలకు గురయ్యారు. పాల్వంచ నుంచి కొత్తగూడెం వరకు సదరు డ్రైవర్ అతి వేగంతో వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లగా మార్గమధ్యలో అక్కడక్కడా పలు వాహనాలకు తగిలించినట్లు తెలిసింది. దీంతో కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పోలీసులు సదరు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాల్వంచ సమీపంలో ఒకరిద్దరికీ గాయాలు చేసినట్లు అనుమానంతో పాల్వంచ పోలీసులకు వ్యాన్ను అప్పగించారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా వ్యాన్తో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, అయితే ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని, ఎలాంటి ప్రమాదాలు చేసినట్లు కూడా ప్రస్తుతానికి తేలలేదని, పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. నర్సుపై దాడి చేసిన పేషెంట్?భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి విధుల్లో ఉన్న నర్సుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధిత నర్సు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టగా, వైద్యపరమైన సమస్యల కారణంగా ఆందోళనకు గురై తాను అలా ప్రవర్తించినట్లు రోగి తెలిపినట్లు తెలిసింది. అలాగే రోగి కుటుంబ సభ్యులు కూడా నర్సును కలిసి క్షమాపణలు కోరినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసింది. ఆస్పత్రి వర్గాలు సైతం ఘటనను సామరస్యపూర్వకంగా పరిష్కరించినట్లు పేర్కొన్నాయి. -
కిష్కింధకాండలో వైవిధ్యమెలా..?
వ్యవసాయంలో వైవిధ్యం పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. రైతాంగం మాత్రం పత్తి, వరి వంటి ఒకేరకమైన పంటల సాగుకు మొగ్గు చూపుతోంది. కోతుల దాడుల వల్లే పెసర, కంది, కూరగాయల వంటి పంటల జోలికి వెళ్లడం లేదని పేర్కొంటోంది. అయితే వ్యవసాయ రంగంపై కోతుల దాడుల ప్రభావాన్ని సర్కార్ గుర్తించడం లేదు. కోతులను అరికట్టే బాధ్యత పంచాయతీలు/ మున్సిపాలిటీలదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంసమస్యను గుర్తించరేం ? జిల్లాలో పంటల సాగులో వైవిధ్యం తగ్గడానికి ప్రధాన కారణం కోతుల దాడులేనని ఏళ్ల తరబడి రైతులు వాపోతున్నారు. ఆహార ధాన్య పంటలకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర ఉంది. అయితే, పెసర, మినుములు, కంది సాగు కంటే కోతులు దాడులు చేయని వరి, పత్తి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వేరుశనగ, కూరగాయల సాగుకు ఇవే భయాలు ఉన్నాయి. గతంలో జిల్లాలో జీడి మామిడి భారీగా సాగయ్యేది. ఇప్పుడా స్థానాన్ని పామాయిల్, జామాయిల్లు ఆక్రమించాయి. పదిహేనేళ్లుగా క్రమంగా మార్పులు వస్తున్నాయి. అయినా రైతులకు మద్దతుగా నిలిచే వ్యవసాయశాఖ, కృషి విజ్ఞానకేంద్రాలు, వ్యవసాయ కళాశాల/వర్సిటీలు కోతుల సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం చూపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవని రైతులు అంటున్నారు. వైవిధ్యానికి చోటెక్కడ? గత ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 2 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆ తర్వాత స్థానంలో వరి, మొక్కజొన్న సాగు చేపట్టారు. ఈ మూడు పంటలను కలిసి జిల్లా సాగు విస్తీర్ణంలో 75 శాతంగా ఉన్నాయి. ఇక ఉద్యాన పంటలైన పామాయిల్, జీడి, పండ్ల తోటల వాటా 16 శాతంగా ఉంది. ఆ తర్వాత అగ్రోఫారెస్ట్రీ విభాగంలో జామాయిల్, సుబాబుల్, టేకు సాగు సుమారు 29 వేల ఎకరాల్లో ఉండగా, వీటి వాటా దాదాపు 5 శాతంగా ఉంది. ఇక వాణిజ్య పంటల్లో మిర్చి 11 వేల ఎకరాల్లో సాగవుతూ సుమారు రెండు శాతం వాటాను కలిగి ఉంది. పత్తి, వరి, మొక్కజొన్న, పామాయిల్, పండ్ల తోటలు, జామాయిల్, మిర్చిలే జిల్లాలో 98 శాతం వ్యవసాయ భూముల్లో సాగవుతున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుమతే జిల్లా వ్యవసాయంలో వైవిధ్యం పూర్తిగా కరువైంది. ఫలితంగా రోజు ఉపయోగించే కూరగాయలు సైతం పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇల్లెందు, టేకులపల్లి, సుజాతనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో కేవలం 500 ఎకరాలకే కూరగాయల సాగు పరిమితమైంది. గతంలో మునగ సాగుపై ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు కంది, పెసర, వేరుశనగ వంటి ఆపరాల పంటలకు ప్రభుత్వం నుంచి మెరుగైన మద్దతు ధర లభిస్తోంది. పైగా వరి, పత్తితో పోల్చితే ఈ పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు వచ్చే రాబడి ఎక్కువ. అయినా పప్పు దినుసులు అన్ని కలిపి కూడా 2,200 ఎకరాలకే పరిమితమయ్యాయి. ఒక్క వరిని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆహార పంటలపైన కోతుల దాడులు ఉధృతం అవడం వల్ల ఈ మార్పు చోటుచేసుకుంది.కోతుల దాడులతో తగ్గిన వైవిధ్య పంటల సాగు ఆహారధాన్యాలు సాగు విస్తీర్ణం మద్దతు ధర (ఎకరాల్లో) వరి 1,65,965 రూ. 2,461 మొక్కజొన్న 86,544 రూ. 2,400 వేరు శనగ 2,791 రూ.7,517 మినుములు 857 రూ.8,200 కంది 1,159 రూ.8,450 పెసర 131 రూ.8,760 -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి శుక్రవారం అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్న 9, 10వ తరగతి బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్, బ్యాంకు పాస్బుక్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి, హార్డ్ కాపీలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పర్యాటకుల ‘సఫారీ’పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో శుక్రవారం పలువురు పర్యాటకులు సఫారీలో విహరించారు. అటవీశాఖ వైల్డ్లైఫ్ విభాగం జంగల్ సఫారీ వాహనాల టూర్ను గురువారం ప్రారంభించిన విషయం విదితమే. తొలిరోజు 14 మంది పర్యాటకులు సఫారీ వాహనంలో ప్రయాణించగా రూ.2,800 ఆదాయం లభించినట్లు వైల్డ్లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్ తెలిపారు. ఒక వాహనం రెండు ట్రిప్లు మాత్రమే తిరిగిందని, ఒక్కో టూరిస్టు నుంచి రూ.200 చొప్పున టికెట్ వసూళ్లు చేశామని పేర్కొన్నారు. -
ఈసారి లక్ష్యం 55.40 లక్షలు
● వన మహోత్సవానికి సిద్ధమైన అధికారులు ● శాఖలవారీగా మొక్కల లక్ష్యాల కేటాయింపు ● అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లుచుంచుపల్లి: వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపడుతోంది. గత గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో జిల్లాలోని కిన్నెరసాని వద్ద వన మహోతవ కార్యక్రమాన్ని ఆరంభించారు. కలెక్టర్ అంకిత్ తదితరులు అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హరిత నర్సరీలు, అటవీ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో మరో 32 నర్సరీల్లో మొక్కలు పెంచారు. పెద్ద పంచాయతీల్లో 15 వేలు, చిన్న గ్రామపంచాయతీల్లో 10 వేల చొప్పున 15 రకాల జాతుల మొక్కల పెంపకం చేపట్టారు. ఇందులో కానుగ, వేప, చింత, నేరేడు, గుల్ మొహర్, జామ, వెలగ, శిశు, మునగ, సీమ తంగేడు, తులసి, గులాబీ, మందార, గన్నేరు, దిరిశన, అల్ల నేరేడు, ఉసిరి, దానిమ్మ, ఈత, బొప్పాయి, మందార, సిసో, టికోమ, బహునియా, సెలోఫాం తదితర మొక్కలు ఉన్నాయి. వీటిని గ్రామాల్లో అంతర్గత, అనుసంధాన రోడ్లకు ఇరువైపులా, చెరువు, కాలువ కట్టలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో నాటనున్నారు. మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలు గుంతలు తవ్వుతున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నారు. అడిగిన ప్రతీ సన్నకారు, చిన్నకారు రైతుకు ఎకరానికి 100 వరకు టేకు మొక్కలను ఇవ్వనున్నారు. 55.40 లక్షల మొక్కలు లక్ష్యం వనమహోత్సవంలో ఈ ఏడాది జిల్లాలో 55.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు అత్యధికంగా 25.60 లక్షలు, విద్యుత్శాఖకు 9 లక్షలు, అటవీశాఖకు 9.40 లక్షలు, మున్సిపల్ శాఖకు 5.20 లక్షలు, వ్యవసాయశాఖకు 4.70 లక్షలు, రెవెన్యూకు 1.30 లక్షలు, ఇండస్ట్రియల్కు 20 వేల మొక్కల చొప్పున లక్ష్యాలను అప్పగించారు. మొక్కలు నాటడం, సంరక్షణకు రూ.25 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. నాటే మొక్కల్లో కచ్చితంగా 85 శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. వన మహోత్సవానికి కావా ల్సిన మొక్కలను సిద్ధంగా ఉంచాం. గ్రామ పంచాయతీలు, అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను ఇప్పటికే కేటాయించాం. వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. –ఎం.విద్యాచందన, డీఆర్డీఓ 2015-16 111.49 2016-17 161.33 2017-18 163.09 2018-19 96.17 2019-20 146.27 2020-21 160.29 2021-22 135.41 2022-23 105.08 2023-24 55.13 2024-25 70.61 2025-26 71.41 2026-27 55.40 -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
టేకులపల్లి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని కోయగూడెం నుంచి శుక్రవారం గంగారం వైపు వెళ్తున్న ఖాళీ ట్రాక్టర్ దంతలతండా దాటిన తర్వాత అదుపుతప్పి రోడ్డుపక్కు దూసుకెళ్లి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన గంగారం గ్రామానికి చెందిన డ్రైవర్ కుంజా రాజాబాబు (32), ఊకే నాగేశ్వరరావుకు 108 ఈఎంటీ రాధ, పైలట్ వెంకట రామారావు ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రాజాబాబు మృతిచెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీపలువురికి గాయాలు భద్రాచలంటౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పల్లెవెలుగు బస్సు, లారీ ఢీకొన్నాయి. లారీడ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమా దంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోడి పందేల స్థావరంపై దాడిదమ్మపేట: మండలంలోని రాచూరుపల్లి శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నవారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుపల్లి శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి ఒక కోడిపుంజు, ఆరు బైక్లు, రూ.600 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలస్వామి తెలిపారు. -
బొగ్గు రవాణాపై సమీక్ష
రుద్రంపూర్: ఆర్సీహెచ్పీలోని రైల్వే సైడింగ్లలో బొగ్గు రవాణాపై సింగరేణి కోల్మూవ్మెంట్ ఈడి బి.వెంకన్న సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఆయన ఆర్సీహెచ్ని సందర్శించారు. బొగ్గు రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచలు చేశారు. అనంతరం ఏరియా జీఎం నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం. శాలేంరాజు, ఇతర అధికారులు గోవిందరావు, తిరుపతి, బీభత్స, రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
పచ్చని చెట్టు నరికేశారు!
అశ్వారావుపేటరూరల్: ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న పచ్చని చెట్టును నరికివేసిన ఘటన ఇది. మండలంలోని ఊసిర్లగూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నేరేడు వృక్షం ఉంది. కాయలు కాస్తున్న ఈ భారీ వృక్షాన్ని ప్రహరీ గోడకు అడ్డుగా ఉందనే సాకుతో నరికివేశారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో చెట్లు నాటాలని, వాటి సంరక్షించాలని పాఠాలు బోధించే గురువులే చిన్న చిన్న సాకులు చెప్పి భారీ వృక్షాన్ని నరికించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై పాఠశాల ఉపాధ్యాయుడు మల్లేశ్ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల అనుమతితోనే వృక్షాన్ని నరికించినట్లు చెప్పడం గమనార్హం. సకాలంలో రైతులకు యూరియాకొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన యూరియా బుకింగ్ విధానం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా వ్యవసాయ అధికా రి బాబూరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచడంతో పాటు, బుక్ చేసి న రైతులకు వేగవంతంగా సరఫరా చేస్తున్నా మని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 10,014 మంది రైతులు 39,944 బస్తాల యూరియా బుక్ చేసుకున్నారని, అందులో 28,980 (72.66 శాతం)బస్తాలు రైతులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం జిల్లాలో 1,304.10 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాలని, అధికంగా కొను గోలు చేయాల్సిన అవసరం లేదని సూచించా రు. వివరాలకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), వ్యవసాయ అధికారి (ఏఓ), మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)లను సంప్రదించాలని ఆయన సూచించారు. బ్రిడ్జి మరమ్మతుల పరిశీలనచుంచుపల్లి: ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి బొమ్మనపల్లి క్రాస్ రోడ్ మధ్య లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారిపై రైల్లే ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులను శుక్రవారం ఎస్పీ రోహిత్ రాజు అధికారులతో పరిశీలించారు. ఇల్లెందు క్రాస్రోడ్, బొమ్మనపల్లి క్రాస్రోడ్, లోతువాగు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ట్రాఫిక్ మల్లింపు వల్ల ప్రజలు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన సూచిక బోర్డులతో పాటు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో రిఫ్లెక్టివ్ జాకె ట్లు ధరించి ట్రాఫిక్ మళ్లింపు చేయాలని చెప్పా రు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినా రాయణ, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫి క్ ఎస్ఐ ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ అఖిల, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఆశ’ సభ్యులుగా రామ్మూర్తి, షాజహాన్కొత్తగూడెంఅర్బన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆశ’స్కీమ్ లో ప్యానెల్ న్యాయవాదులుగా సీనియర్ న్యా యవాదులు గాజుల రామ్మూర్తి, షాహజాన్ పర్వీన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత శుక్రవారం నియమించారు. వీరు బాల్య వివాహాలను అరికట్టడం, బాధిత బాలి కలకు సహాయం అందించడం, అవసరమైన న్యాయ పరిరక్షణ కల్పించడం, అలాగే ప్రజలలో చట్టపరమైన అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన సందర్భంలో తక్షణ చర్యలకు సమన్వయం చేసి, సేవలను అందిస్తారని వివరించారు. మధ్యాహ్న భోజన సిబ్బందికి శిక్షణకొత్తగూడెంఅర్బన్: ఆనందఖని పాఠశాల మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి స్థానిక విద్యాశాఖ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.శంభుప్రసాద్ మాట్లాడారు. నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలను ఉపయోగించాలని, పరిశుభ్రమైన నీటితో కడగాలని, వంట పాత్రలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారమే వంట తయారు చేయాలని చెప్పా రు. కలుషితమైన ఆహార పదార్థాలను వాడొద్దని, నాణ్యమైన తాజా కోడిగుడ్లను అందించాలని సూచించారు. విజయబాబు, తోట మాధవరావు, ప్రకాష్ పాల్గొన్నారు. -
ఓటరు నమోదుపై దృష్టి సారించాలి
అశ్వాపురం: బీఎల్ఓలు, బీఎల్ఏలు ఓటరు నమోదుపై దృష్టి సారించాలిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి.రాహుల్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించాలని, తప్పులు లేకుండా, ఆధారాలతో పూరించిన తర్వాత తిరిగి తీసుకోవాలని అన్నారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేవించారు. ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు పారదర్శకంగా నమోదు చేసి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. వనమహోత్సవంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలిభద్రాచలం: వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏలో అటవీ, ఐటీసీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ అధికారులతో సారపాక గ్రామపంచాయతీలో మొక్కలు నాటే ప్రణాళికల కోసం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం వచ్చే భక్తులకు పచ్చదనంతో ఆహ్లాదంగా స్వాగతం పలకటంతోపాటు, సారపాక, భద్రాచలం పరిసర ప్రాంతాలలో ప్రజలు చక్కటి పర్యావరణ వాతావరణంలో జీవించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సారపాకలో ఏడాదికి 25 వేల మొక్కలు చొప్పున నాలుగేళ్లలో లక్ష మొక్కలు నాటాలన్నారు. సారపాక సర్పంచ్ కిషోర్ శివరామ నాయక్, అధికారులు సున్నం రాంబాబు, ధరావత్ కృష్ణ, విశ్వనాథం, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
విద్యాశాఖను వదిలేశారా..?
● విద్యాసంవత్సర ప్రారంభం కావడంతో హడావిడి ● సెలవుపై వెళ్లిన ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీఈఓ ● నలుగురు కోఆర్డినేటర్లలో ముగ్గురు మాతృస్థానాల్లోకి.. ● ప్రస్తుతం ఒక కోఆర్డినేటర్, ఏడీతో నెట్టుకొస్తున్న వైనం కొత్తగూడెంఅర్బన్: కొత్త విద్యాసంవత్సరంలో కూడా జిల్లా విద్యాశాఖలో మార్పులు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 2న డీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాసంతి మరుసటి రోజే సెలవుపై వెళ్లారు. ఈ నెల 25వ తేదీ వరకు చైల్డ్ కేర్ సెలవులో ఉండనున్నారు. ఇన్చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు. 2026–27 విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభంకాగా, నెలరోజుల పాటు హడావిడి వాతావరణం ఉండనుంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, కొత్త అడ్మిషన్లు, రాగి జావ, మధ్యాహ్నభోజన పథకం, మెనూ ప్రకారం వంటలు తదితర విషయాలను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా జరగకపోతే తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి కీలక సమయంలో జిల్లా విద్యాశాఖలో అధికారుల కొరత ఏర్పడింది. డీఈఓ సెలవులో ఉండగా, పదవీ కాలం ముగియడంతో గతంలో ఉన్న నలుగురు కో ఆర్డినేటర్లలో ముగ్గురు తమ మాతృస్థానాలకు వెళ్లారు. మిగిలింది ఒక్కరే. మరో అధికారి ఏడీ శంభూప్రసాద్ ఉన్నారు. అన్ని బాధ్యతలు వీరిద్దరే చూడాల్సి రావడంతో పనిభారం పెరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల యూనిఫాం, భవిత కేంద్రాల పని తీరు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాలు.. ఇలా అన్నింటిలోనూ విద్యాశాఖలో వెనుకబాటు కనిపిస్తోంది. వెరసి గత విద్యా సంవత్సరం మాదిరిగానే పాలన కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో వెనుకబాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కోఆర్డినేటర్లు కీలకంగా వ్యవహరిస్తారు. పదవీ కాలం ముగిసినా కొత్త వారు వచ్చే వరకు వారిని తాత్కాలికంగా కొనసాగించవచ్చని డీఎస్ఈ నుంచి ఆదేశాలున్నాయి. అయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదు. గతంలో ఏఎంఓ, సీఎంఓ, జీఈసీఓ ఉండేవారు. ప్రస్తుతం ప్లానింగ్ కోఆర్డినేటర్ ఒక్కరే ఉన్నారు. జిల్లా విద్యాశాఖకు విడుదల అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, పథకాలు, అమలు చేయాల్సిన విధివిధానాలను అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా డీఈఓతోపాటు కోఆర్డినేటర్ల బాధ్యతలు నిర్వర్తించేవారు. జిల్లాలో ఉన్న 23 మంది ఎంఈఓలతో పాటు 90 మంది కాంప్లెక్స్ హెచ్ఎంలకు డీఎస్ఈ నుంచి వచ్చే ఆదేశాలను చేరవేసి, అమలు చేసేలా చర్యలు తీసుకునే వారు. జూన్ నెల అంతా తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ప్రస్తుతం కోఆర్డినేటర్ ఒక్కరే కావడంతో సమాచారం అందించేందుకు కూడా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని ఎంఈఓలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే పాలన గాడితప్పి ఫలితాలు గతేడాది కంటే తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సొరంగం పనులు మళ్లీ మొదలు..
‘సీతారామ’ కాల్వకు మోక్షం ● నెలల తర్వాత సొరంగం తవ్వకం ప్రారంభం ● ఏకకాలంలో నీటి తొలగింపు, సొరంగం తవ్వకంతిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం నుండి పోచారం వరకు ఎనిమిది కి.మీ. మేర చేపట్టాల్సిన సొరంగ మార్గం పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 4.1 కి.మీ. సొరంగ మార్గం తవ్వాక గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, భూగర్భ జలాలు ఉబికిరావడంతో దమ్మాయిగూడెంలో వద్ద టన్నెల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గత ఏడాది అక్టోబర్లో దమ్మాయిగూడెం వద్ద టన్నెల్ను పరిశీలించారు. అయితే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టు నిర్మాణ సంస్థ కొద్దినెలలుగా పనులను నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు రూ.32కోట్ల నిధులు విడుదల చేయడంతో కూసుమంచి మండలం పోచారం వైపు నుంచి సొరంగం తొలిచే పనులు మొదలుపెట్టారు. టన్నెల్లోని బండరాళ్లను బ్లాస్ట్ చేసేందుకు భారీ యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఇదే సమయాన టన్నెల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లు కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే 4.1 కి.మీ. మేర సొరంగ మార్గం పూర్తి కాగా ఇంకా 3.9 కి.మీ. మేర నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు జల వనరుల శాఖ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు. -
సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్
చుంచుపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన 54 మంది ఏఎన్ఎంలకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యఅధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లలో పనిచేసే సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, శ్రీధర్, కళ్యాణి, మోహన్, శ్రీనివాస్, జానకి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువు దీరిన స్వామి వారికి విశ్వక్సేన పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. భద్రాచలం ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేస్తాండీసీహెచ్ఎస్ రవిబాబు నాయక్ భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రవిబాబు నాయక్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆస్పత్రిలో నెలకొన్న లోటుపాట్లను సరిదిద్దుతున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎంఓలతో కలిసివెళ్లి ఐటీడీఏ పీఓ రాహుల్కు ఆస్పత్రి సమస్యలు విన్నవించి, పరిష్కరించాలని కోరారు. ‘ఉద్దీపనం’తో గుణాత్మక విద్యఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించేందుకు ఉద్దీపనం మెటీరియల్ ఉపయోగపడుతోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏలో ఉద్దీపనం మెటీరియల్ ప్రణాళికా అంశాలను పరిశీలించి మాట్లాడారు. ఉద్దీపనం పుస్తకాలతో 3,4,5వ తరగతి విద్యార్థుల్లో బేసిక్ లెవల్ నైపుణ్యాలు మెరుగుపడ్డాయని వెల్లడించారు.1, 2 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం కలిపి ఉద్దీపనం పుస్తకం రూపొందిస్తున్నట్లు తెలిపారు. 7,8, 9వ తరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొనేలా పుస్తకాన్ని రూపొందిస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు 60 రోజులుగా పుస్తకాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. అధికారులు చందన, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
40 రకాల పూల మొక్కలతో బటర్ఫ్లై పార్క్
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా బటర్ఫ్లై పార్కు ఏర్పాటు చేయగా, గురువారం కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. వైల్డ్లైఫ్ చెక్ పోస్టు ఎదుట సుమారు రూ.5 లక్షలతో 40 రకాల పూల మొక్కలతో పార్కు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ వైల్డ్లైఫ్ విభాగం ఎఫ్డీఓ బాబు తెలిపారు. సీతాకోకచిలుకలను ఎక్కువగా ఆకర్షించే జటోపా, లేగిసోమియా, నందివర్ధనం, ఎగ్జరా, క్యాసిమ్, మందార, వింకరోజ్, పిటోనియా, లాంటినా, వర్జీనా, నైట్క్వీన్, అమలందా, గల్ఫెమియా, విష్ణుకాంత తదితర రకాల మొక్కలు తెప్పించామని పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు
● భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ● తెల్లవారుజామున ఇసుక ర్యాంపుల పరిశీలన బూర్గంపాడు: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హెచ్చరించారు. గురువారం తెల్లవారు జామున సారపాక, పాత గొమ్మూరు వద్ద గోదావరి నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారిక ఇసుక ర్యాంపుల నుంచే మాత్రమే సరఫరా జరపాలన్నారు. సోంపల్లిలోని అధికారిక ఇసుక ర్యాంపులను కూడా తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, వే బిల్లులు లేకుండా జీరో దందా చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రాంతాల్లో కందకాలు తవ్వించాలని, వాహనాలు గోదావరిలోకి దిగకుండా కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంతంలో 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిల్వచేసిన ఇసుకను సీజ్చేయాలని సూచించారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
రామయ్య సేవలో ఆర్అండ్ఆర్ కమిషనర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గురువారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి అధికారులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు, డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.750 కోట్లతో గోదాంల నిర్మాణం
నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.750 కోట్ల నిధులతో నూతనంగా గోదాంల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో గోదాంలను తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్ను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 25 కేంద్రాల్లో 2.50.లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలకు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హైదరాబాద్లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీల కోసం రూ.70 కోట్లతో 23 ఎకరాల్లో గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెంకటాయపాలెంలో మిర్చి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. గోదాంలు అందుబాటులోకి వస్తే రైతులు పండించిన పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని చెప్పారు. అయితే, రైతులు సంప్రదాయ పంటలకు బదులు పంట మార్పిడితో ప్రయోజనాలు పొందాలని సూచించారు. సదస్సులో డీఏఓ డి.పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, ఏడీఏ సతీష్ ప్రతినిధులు పాల్గొన్నారు. ●బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రులు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, అలా రాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, నల్లాని మల్లికార్జున్రావు, బొందయ్య, భద్రయ్య, కడియాల నరేష్ పాల్గొన్నారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు -
80 కిలోల గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీంద్రా రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్రకుమార్, కపిల్ దేవ్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. కపిల్దేవ్ రూ.50 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన ఇద్దరు ఒడిశా నుంచి కారులో సుమారు రూ.40 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరు తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ గుడి వద్ద మణుగూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు గుర్తించి వాహనంతోసహా స్వాధీనం చేసుకున్నారు. సురేంద్రసింగ్, ధర్మేంద్రకుమార్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అన్నపురెడ్డిపల్లిలో 88 కేజీలు..ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో రూ. 44 లక్షల విలువైన 88 కిలోల గంజాయిని స్థాని క, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులు, కేరళకు చెందిన మహమ్మద్ రిషాద్, డ్రైవర్ సిరాజ్ కుంజా విఠల్ను అరెస్ట్ చేశారు. చింతూరు నుంచి భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి మీదుగా కేరళకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రిషాద్, మరో గంజాయి స్మగ్లర్ హర్షద్ కలిసి బెంగళూరు జైలులో ఉన్నారు. ఇటీవల విడుదలైన రిషాద్... హర్షద్ ఆర్థిక సహకారంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని డీఎస్పీ తెలిపారు. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై విజయసింహా రెడ్డి పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సర్ కారణంగానే గత ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇంటికి పోయారని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం క్లబ్లో గురువారం జరిగిన నియోజకవర్గస్థాయి బీఎల్ఏల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడుతోందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించి అక్కడ ప్రభుత్వాలను చేతిలోకి తీసుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. ప్రతీ కార్యకర్త అవగాహన పెంచుకుని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీగా మారిందని, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటర్ల జాబితాను పరిశీలించి ఎవరి ఓటూ తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, దిండిగల రాజేందర్ వనమా రాఘవేంద్రరావు, కాపు సీతామహాలక్ష్మి, కార్పొరేటర్లు సింధూ తపస్వి, మధు చంద్, గుణచరిత్, రాంబాబు, సాగర్, వేల్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కండువా గులాబీ.. మద్దతు హస్తానికి బీఆర్ఎస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావులు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. ఓ మంత్రి నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయితే, కొందరు బీఆర్ఎస్ నేతలు వేడుకలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మరికొందరు నేతలు గులాబీ పార్టీలో ఉంటూ మంత్రి పొంగులేటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని ఇకపై ఉపేక్షించబోమన్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ పెట్టిన రోజు పార్టీలో పెద్ద నాయకులెవరు లేరని, మళ్లీ ఒంటరిగానైనా నిఖార్సైన కార్యకర్తలతో కలిసి నడక సాగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్తో కొట్లాడటం బీఆర్ఎస్కు పెద్ద విషయం కాదని, కానీ ప్రస్తుతం ఉన్నది కూటమి కాంగ్రెస్ అని, టీడీపీ వాళ్లు కాంగ్రెస్ ముసుగులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ను సమర్థంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. టీ కప్పులో తుపాను సర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మాజీ మంత్రి కుమారుడు వనమా రాఘవ కృషి చేయాలని, అయితే ఆయన తన పనితీరును మార్చుకోవాలని రవీందర్రావు పలుమార్లు సూచించారు. దీంతో రాఘవ నొచ్చుకోవడంతో ఆయన అభిమానులు రవీందర్రావు వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపగా, సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమని గులాబీ నాయకులు, కేడర్ ప్రతినబూనడంతో ‘సూచన’ వివాదం టీ కప్పులో తుపానులా ముగిసిపోయింది.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి -
రెక్కీ నిర్వహించి.. రూ.లక్ష కొట్టేశారు
నేలకొండపల్లి: వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ఓ రైతును వెంబడించిన దుండగులు ఆయన నుంచి రూ.లక్ష నగదు తస్కరించారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కాసాని తిరపయ్య వ్యవసాయం పెట్టుబడుల కోసం ఓ బ్యాంక్లో బంగారం తాకట్టు పెట్టి ఇటీవల రూ.లక్ష రుణం తీసుకున్నారు. విత్తనాల కొనుగోలుకు గురువారం రూ.లక్ష డ్రా చేయగా, ఆయనను వెన్నంటి గమనిస్తున్న దుండగులు కిరాణం షాప్ వద్ద రైతు నగదు ఉన్న సంచిని మోపెడ్కు తగిలించి వెళ్లడంతో కొట్టేశారు. తిరిగి వచ్చే సరికి రైతు బ్యాగ్ లేదని గుర్తించి బోరున విలపిస్తూ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిరాణం షాప్ వద్ద రైతు నుంచి బ్యాగ్ చోరీ -
డీ ఫిల్లరింగ్ చేపడితే 2 వేల టన్నుల ఉత్పత్తి
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గనిలో రానున్న ఆరు నెలల్లో డీ ఫిల్లరింగ్ పనులు చేపడితే రోజుకు 2 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్ రాసకట్ల రవికిరణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గనిలో అనుభవం ఉన్న అధికారుల సంఖ్య కంటే యువ అధికారుల సంఖ్య అధికంగా ఉందని, పనులపై పూర్తిగా అవగాహన లేని కారణంగా ఆశించిన ఉత్పత్తి రావటం లేదన్నారు. గనికి మరో 9 సంవత్సరాల జీవిత కాలం ఉందని తెలిపారు. గైర్హాజరు కార్మికులకు కుటుంబాలతో సహా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. భద్రాచలంవాసికి ప్రశంసా పత్రంభద్రాచలంటౌన్: కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో పట్టణానికి చెందిన పీఎస్వీ ప్రసాద్ బాబుకు ప్రశంస పత్రం లభించింది. యూజీసీ సహకారంతో జరిగిన సదస్సులో ‘ఎన్ఈపీ–2020 డిజిటల్ అసమానతల నివారణ –సాహిత్య బోధన’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. డిజిటల్ యుగంలో విద్యార్థులందరికీ సమాన విద్యావకాశాలు, సాంకేతిక వనరులు అందాలంటూ ఆయన చేసిన ప్రసంగం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సదస్సు డైరెక్టర్ డాక్టర్ ఆర్. మేఘన రావు, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలుజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవే టు విద్యాసంస్థలకు దీటుగా మారుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి విద్యార్థులతో పాలాభిషేకం చేయించి మాట్లాడారు. ప్రభుత్వం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉపాధ్యాయులు సురేష్, గోపాలకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తిరుమలాయపాలెం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని జూపెడకు గొల్ల పూడి చంటి(41) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భార్య శ్రీలతతో గొడవ పడిన ఆయన బుధవారం బచ్చోడు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కల్లూరురూరల్: కల్లూరులోని కప్పలబంధం రోడ్డు సట్టేరు కుంటకు ప్రాంతంలో సెంట్రింగ్ మేసీ్త్రగా పని చేస్తున్న షేక్ హబీబ్(55) మృతదేహాన్ని గురువారం గుర్తించారు. ఆయన రెండు రోజులుగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈమేరకు సట్టేరుకుంటలోని కల్వర్టు పక్కన మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఆయన కల్వర్టు పైనుంచి పడడంతో మృతి చెందాడా, ఇతర కారణాలు ఉన్నయా అన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. -
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా..
పాల్వంచరూరల్: విదేశీ పర్యాటకులు వచ్చేలా కిన్నెరసానిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధి కిన్నెరసానిలో వైల్డ్లైఫ్ శాఖ బయోసాట్ నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన జంగల్ సఫారీ టూర్ మూడు వాహనాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లోని గుర్రంగూడ వనమహోత్సం నుంచి వర్చవల్గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అంకిత్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్లతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డీర్ పార్కు వద్ద మొక్కలను నాటి బటర్ ఫ్లై పార్కు, ఫీడ్ స్టోరేజీ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫారీ రైడ్, బటర్ ఫ్లై పార్కు, ట్రెక్కింగ్ అందుబాటులోకి రావడంతో కిన్నెరసానికి వచ్చే పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కొత్తగూడెం క్రాస్ రోడ్డులోని హరిత హోటల్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లక్నవరం తరహాలో కిన్నెరసానిలో కూడా తీగల వంతెన ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించాలి మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కిన్నెరసాని డీర్ పార్కులో ఆయన మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమత్యులతను కాపాడాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అనంతరం కలెక్టర్ పర్యావరణ కేంద్ర భవనాన్ని, బటర్ఫ్లై పార్కును కలెక్టర్ అంకిత్ సందర్శించారు. జంతువులను బొమ్మలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణాగౌడ్, విద్యాచందన, దారా ప్రసాద్, బి.బాబు, కిషన్, కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, కిన్నెరసాని సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, డి. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.మణుగూరు టౌన్: వరదల ప్రభావం అధికంగా ఉండే లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మణుగూరులో పర్యటించిన ఆయన తొలుత భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు కోసం మణుగూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్ట్ ద్వారా భూ రికార్డుల సమగ్రత, పారదర్శకత పెరుగుతుందన్నారు. అనంతరం గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే అన్నారం, కమలాపురం గ్రామాలతో పాటు కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పీకేఓసీ ఓపెన్కాస్ట్ గనుల నుంచి విడుదలయ్యే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే గాంధీనగర్, సుందరయ్యనగర్, కాళీమాత ఏరియాలను సందర్శించారు. వినాయక నగర్ తదితర ప్రాంతాల డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ పల్నాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
అందరి దృష్టీ సర్ పైనే
అసలేం జరుగుతోంది..? శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026రాజకీయ పార్టీల్లో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రకంపనలు రేపుతోంది. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదనే భావన ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. నిన్నా మొన్నటి వరకు సర్ విషయంలో చూసీచూడనట్టుగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంజాగ్రత్త పడుతున్న పార్టీలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతోంది. అయితే, సదుద్దేశంతో చేపట్టిన ‘సర్’ ప్రక్రియను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తనకు అనుకూలంగా మార్చుకుని, సంప్రదాయంగా తమకు ఓటు బ్యాంకు లేని వర్గాల ఓట్లను తొలగిస్తోందనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల వెలువడిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పక్షాలను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేశాయి. తమిళనాడులో మళ్లీ అధికారం తమదే అనుకున్న డీఎంకేకు షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్, సీఎం హోదాలో పోటీ చేసిన స్టాలిన్ సైతం ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయత్వంలోని టీఎంసీ మట్టి కరిచింది. ఈ ఫలితాల తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లు అప్రమత్తమయ్యాయి. సర్ను తేలిగ్గా తీసుకునేందుకు వీలు లేదని, తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని రంగంలోకి దిగాయి. రూటు మార్చిన కాంగ్రెస్ సర్ కార్యక్రమంపై క్షేత్రస్థాయి నుంచి నియోజకర్గస్థాయి వరకు పార్టీ కేడర్కు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ ఏప్రిల్ మొదటి వారంలో నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఇన్చార్జీలను కూడా నియమించింది. ఇటీవల వరకు వీరు మొక్కుబడి సమావేశాలకే పరిమితమైనా.. ప్రస్తుతం హస్తం పార్టీ యాక్షన్ ప్లాన్లో మార్పు వచ్చింది. దీంతో జూన్ 10న ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని కొత్తగూడెంలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి నిపుణులను తీసుకువచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ గురించి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఆఫీసర్లకు వివరించే ప్రయత్నం చేశారు. గేరు మార్చిన ‘కారు’ అధికారం కోల్పోయిన తర్వాత నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో సర్ కొత్త ఊపును తీసుకొచ్చి నట్టయ్యింది. జిల్లా ఇన్చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు సర్ విషయంలో కేడర్ను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. సర్లో కీలకమైన బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం పట్ల రవీందర్రావు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో మండలాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను స్వయంగా పరిచయం చేసుకున్నారు. అలసత్వం వహించొద్దని సూచించారు. ఈ క్రమంలో రవీందర్రావు స్థానిక నాయకులు, కేడర్ను ఉద్దేశించి కఠినంగా మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. అయినా పార్టీని బలోపేతం చేయాలంటే ముక్కుసూటిగా వ్యవహరించకతప్పదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పడం.. ‘సర్’ పట్ల బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎంత అలెర్ట్గా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆది నుంచి కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ–ఎంఎల్లకు జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా, బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు మిగిలిన రాజకీయ పార్టీల కంటే ముందువరుసలో ఉంటారు. కానీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి ‘సర్’ కార్యాచరణపై ప్రకటన రాకపోవడం గమనార్హం. సర్ మ్యాపింగ్ ప్రక్రియ 25 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ కేడర్ను అప్రమత్తం చేసే పనిని మొదలు పెట్టాయి. సర్ మీద ప్రజల్లో చైతన్యం పెరిగేలా చేయడంపై కమ్యూనిస్టులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


