Bhadradri District News
-
కల్లింగ్ ఆయిల్పామ్ మొక్కల గుర్తింపు
అశ్వారావుపేటరూరల్: ఆయిల్ఫెడ్ నర్సరీలో దాదాపు ఐదు వేల కల్లింగ్(నాసిరకం, జన్యులోపం) ఆయిల్పామ్ మొక్కలను స్థానిక ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ గుర్తించారు. మండలంలోని నారంవారిగూడెం వద్దనున్న నర్సరీని ఆయన శుక్రవారం సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న ఆయిల్పాం మొక్కలను ఆయిల్ఫెడ్ డీఓ సభావత్ శంకర్తో కలిసి తనిఖీ చేశారు. సుమారు 5 వేల కల్లింగ్ మొక్కల్ని గుర్తించగా, తక్షణమే వాటిని ఆయిల్ఫెడ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ నర్సరీ దశలోనే కల్లింగ్ మొక్కలను గుర్తించి తొలగిస్తే, పంట సాగు చేసే సాగుదారులకు పూర్తి నాణ్యమైన మొక్కలు అందుతాయని, తద్వారా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. -
తెలిసిన నిజం..
సత్తుపల్లిటౌన్: రామాపురం అనే గ్రామంలో స్నేహితులు రాజు, రాము ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ బహుమతులు గెలిచేవారు. ఓసారి రాజు రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలు ఎంపికయ్యాడని తెలిసి రాము సంతోషించాడు. కానీ అదే పాఠశాలలో చదువుతున్న సోముకు ఇది నచ్చలేదు. రాజుతో స్నేహం పెంచుకుని పిజ్జా, బర్గర్ వంటివి కొనిచ్చేవాడు. ఇది గమనించిన రాము.. రాజును కలిసి జంక్ఫుడ్ ఎక్కువగా తినడం మంచిది కాదని హెచ్చరించాడు. కానీ సోము మాత్రం తనతో స్నేహాన్ని రాము తట్టుకోవడం లేదని చెబుతూ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాడు. ఒకరోజు వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, మరికొందరితో ఖో–ఖో సాధన చేయిస్తున్నాడు. సోము కూడా అందులో పాల్గొన్నాడు. కొన్నాళ్లుగా జంక్ ఫుడ్ తింటున్న రాజు బరువు పెరిగి వేగంగా పరిగెత్తలేక కడుపునొప్పితో కిందపడిపోయాడు. అప్పుడు సోము.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే పరిగెత్త లేకపోతున్నావు, ఇలా జరగాలనే తాను జంక్ఫుడ్ అలవాటు చేయించానని చెప్పాడు. దీంతో రాము తన స్నేహితుడు రాజు పరిస్థితి చూసి బాధతో కుంగిపోయాడు. ఆ వెంటనే రాజును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కొన్నాళ్లకు రాజు కోలుకోగా.. తన తప్పు తెలుసుకోవడమేకాక జంక్ఫుడ్ మానేసి వ్యాయామ ఉపాధ్యాయుడు, రాము సాయంతో ఖో–ఖో మరింత సాధన చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. అంతేకాక జంక్ఫుడ్తో ఎదురయ్యే నష్టాలను మరికొందరికి వివరించి దానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు.నీతి: స్నేహితులు, శతృవులు ఎవరో గుర్తించి అందుకు అనుగుణంగా మెదిలితే కష్టాలు దరిచేరవు. -
సైకిల్పై స్కూల్కు వెళ్తా..
మమ్మీ, డాడీ ఈ సెలవుల్లో సైకిల్ కొనిచ్చారు. దీంతో తొలుత డాడీ సాయంతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగానే సైకిల్ తొక్కగలుగుతున్నా. అయినా రోడ్లపైకి వెళ్లకుండా ఉదయం, సాయంత్రం వీధిలోనే ప్రాక్టీస్ చేస్తున్నా. సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం సైకిల్ తొక్కుతుండగా.. స్కూల్కు కూడా ఈసారి సైకిల్పైనే వెళ్తాను. –అంజన్కుమార్, బెస్తకాలనీ, శ్రీనివాసనగర్, ఖమ్మం సైకిళ్లపై క్రేజీ ఎన్నటికీ తగ్గదు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సైకిల్పై మోజు చూపుతున్నారు. నడక నేర్చుకునే పిల్లల నుంచి అన్ని వయసుల వారికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు మోడళ్లు లభిస్తాయి. వేసవి సెలవులు మొదలు స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. –అబ్దుల్ హమీద్, సైకిల్ స్టోర్స్, కస్బాబజార్, ఖమ్మం -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా రుద్రహోమంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా రుద్రహోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు.అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణ పతి హోమం నిర్వహించారు. యాగశాలలో జరిగిన రుద్రహోమ పూజల్లో మూడు భక్త జంటలు పాల్గొన్నాయి. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో గణిత శాస్త్రం పేపర్–1ఏ, బోటనీ పేపర్–1, రాజకీయ శాస్త్రం పేపర్–1 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 2,971 మంది, ఒకేషనల్ విభాగంలో 217 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 3,188 మంది హాజరుకావాల్సి ఉండగా, 3,037 మంది హాజరయ్యారని వివరించారు. జనరల్ విభాగంలో 132 మంది, ఒకేషనల్ విభాగంలో 19 మంది కలిపి మొత్తం 151 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలిమణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి మణుగూరు రూరల్: అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధి వాగుమల్లారం ప్రాంతంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్(కార్డెన్ సెర్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో మణుగూరు, అశ్వాపురం, ఏడూళ్లబయ్యారం సీఐలు పి.నాగబాబు, అశోక్రెడ్డి, వెంకటేశ్వరరావులు, ఎస్సైలు, సిబ్బంది ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 80ద్విచక్రవాహనాలను, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మూడు బెల్ట్ షాపుల్లో మద్యం స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని అన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇళ్లను అద్దెలకు ఇవ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితిసింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఎస్సైలు సీహెచ్ నగేష్, సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల కళాశాలప్రవేశ పరీక్షకు స్పందన
పాల్వంచరూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన టీజీఎస్డబ్లూఆర్జేసీ సెట్–2026 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 1,014 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. పాల్వంచ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 408 మంది విద్యార్థులకు గాను 358 మంది విద్యార్థులు హాజరుకాగా, 50 మంది గైర్హాజరయ్యారు. అన్నపురెడ్డిపల్లి గురుకుల కళాశాల సెంటర్లో 377మంది గాను 312 మంది విద్యార్థులు హాజరు కాగా, 65 మంది హాజరుకాలేదు. దమ్మపేట గురుకుల కళాశాల సెంటర్లో 432 మంది గాను 344 మంది హాజరుకాగా 88 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు
● ఎస్పీ రోహిత్ రాజు ● సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన సుజాతనగర్: కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రోహిత్రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం గ్రేడింగ్ విధానాన్ని, కొనుగోళ్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం పాటించాలని చెప్పారు. గన్నీ బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, టార్పాలిన్ పట్టాలు తదితర విషయాల్లో సమస్యలు తలెత్తకుండా, రైతులకు అండగా నిలవాలని సూచించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రమాదేవి, రవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
19 మంది ఎస్ఐల బదిలీ
జి.విజయ కొత్తగూడెం వన్టౌన్ ఇల్లెందు టౌన్ ఎం.మనీషా కొత్తగూడెం టూటౌన్ జూలూరుపాడు కె.కళ్యాణి పాల్వంచ టౌన్ చుంచుపల్లి కె.అఖిల అశ్వారావుపేట లక్ష్మీదేవిపల్లి కె.ఉమ చుంచుపల్లి పాల్వంచ టౌన్ పి.శ్యామ్ప్రసాద్ భద్రాచలం టౌన్ పాల్వంచ టౌన్ జె.దేవ్సింగ్ బూర్గంపాడు అశ్వారావుపేట ఎస్కె సైదా రవూఫ్ గుండాల మణుగూరు ఎం.శ్రావణ్కుమార్ మణుగూరు గుండాల కె.జగన్మోహన్ చారి వీఆర్ దుమ్ముగూడెం చారి రాంబాబు వీఆర్ దుమ్ముగూడెం కె.రాజశేఖర్ దుమ్ముగూడెం కొత్తగూడెం టూటౌన్ పి.గణేష్ దుమ్ముగూడెం ఐటీ కోర్ టీం బి.కిషోర్ కొత్తగూడెం టూటౌన్ కొత్తగూడెం వన్టౌన్ ఇరుగు జీవన్రాజు పాల్వంచ కొత్తగూడెం త్రీటౌన్ కె.సుమన్ వీఆర్ సీసీఎస్ పీఎస్ జి.శ్రీనివాసులు డీఎస్బీ కొత్తగూడెం వన్టౌన్ వి.రామమూర్తి వీఆర్ బూర్గంపాడు షేక్.ఇమామ్ లక్ష్మీదేవిపల్లి పీసీఆర్ సూపర్బజార్ (కొత్తగూడెం): జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 19 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక
పాల్వంచ: ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీల్లో కేటీపీఎస్ ఉద్యోగి మల్లూరి నవీన కుమార్తె మానసశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అంతేగాక హైదరాబాద్లో నిర్వహించిన కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ప్రతిభ కనబర్చి 2 బంగారు, ఒక కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా సీఈ జె.సూర్యనారాయణ శుక్రవారం విద్యార్థినిని అభినందించారు. అగ్నికి ఆహుతైన షావెల్మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2లో ప్రమాదవశాత్తు ఓ షావెల్ దగ్ధమైంది. శుక్రవారం రెండో షిఫ్ట్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అధికారులను, కార్మికులను భయాందోళనకు గురిచేసింది. ప్రకాశంగని ఓపెన్కాస్ట్–2లో 700 ఆర్ఎల్ పని ప్రదేశంలో పనులు నిర్వహిస్తున్న బ్రహ్మపుత్ర 5 క్యూబిక్ మీటర్ షావెల్కు సాయంత్రం ఐదు గంటల సమయంలో సాంకేతిక లోపంతో నిప్పు అంటుకుంది. ఆ సమయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న అశోక్ సమస్యను గుర్తించి మిషన్ దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. పెద్దఎత్తున పొగ, మంటలు చెలరేగడంతో అధికారులు వెంటనే వాటర్ స్ప్రింకర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. షావెల్ పూర్తిగా దగ్ధం అయిపోగా.. మరమ్మతులు చేసినా పనికిరాని స్థితికి చేరింది. ఇది కాలం చెల్లినదని కార్మికులు, అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరణాలు ఉండొద్దు..చుంచుపల్లి: మాతృ, శిశు మరణాలను నివారించేందుకు ఆరోగ్య సిబ్బంది సమష్టిగా పనిచేయాలని డీఎంహెచ్ఓ తుకారామ్రాథోడ్ సూ చించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవం అనంతరం పిల్లలు రెండేళ్ల వయస్సు వచ్చేవరకు ఆరోగ్యం, పోషకా హారం, వైద్య సేవలపై బాలింతలకు అవగా హన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి ప్రతాప్, మెడికల్ ఆఫీసర్లు, నాగభూషణం పాల్గొన్నారు. -
గ్రంథాలయం.. జ్ఞానానికి నిలయం
డీఈఓ నాగలక్ష్మి కొత్తగూడెంఅర్బన్: గ్రంథాలయం జ్ఞానానికి నిలయమని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారో త్సవాల్లో భాగంగా శుక్రవారం లైబ్రరీ డే నిర్వహించారు. కొత్తగూడెంలోని పీఎంశ్రీ జీహెచ్ఎస్ కూలీ లైన్ పాఠశాలను డీఈఓ సందర్శించి గ్రంథాలయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మనిషి జీవితాన్ని మార్చగల శక్తి పుస్తకాల్లో ఉంటుందన్నారు. పుస్తక పఠనం వల్ల చరిత్ర, విజ్ఞానం, సాహిత్యం, సంస్కృతి, నైతిక విలువలు వంటి అనేక అంశాలను తెలుసుకోవచ్చ ని అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవా టు చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఎంఈఓ బి.మధురవాణి, పాధ్యాయులు పాల్గొన్నారు. -
హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని పలు హోట ళ్లు, బిర్యానీ పాయింట్లలో ఆహార భద్రత శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్ర త, వంటశాలల నిర్వహణ, నిల్వ విధానాలు, లైసెన్సుల అంశాలను ఆహార భద్రత అధికారి శరత్ పరిశీలించారు. పలువురు లైసెన్సులు లేకుండా హోటళ్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారంలోగా లైసెన్సులు పొందాలని సూచించారు. ప్రాంగణాలు, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచుతూ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత లోపాలు గుర్తించిన హోటళ్లకు వారం గడువు ఇచ్చి.. మరోమారు తనిఖీలు చేపడతామని శరత్ వెల్లడించారు. కాగా, 3 యాక్ట్ నమూనాలు, 9 సర్వైలెన్స్ నమూనాలు సేకరించి ప్రయోగశాలకు విశ్లేషణ నిమిత్తం పంపించినట్లు ఆయన వివరించారు. -
విభేదాలు వీడాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి శస్త్ర చికిత్స అవసరమని, శ్రేణులు విభేదాలు విడనాడి ఐక్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్చార్జ్ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మనల్ని మనమే పొడుచుకునే పద్ధ్దతికి స్వస్తి పలికి అందరూ ఏకతాటిపైకి వచ్చి పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలకు సమష్టి కృషి చేయాలని సూచించారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైనందున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావా లని కోరుకుంటున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ నాయకత్వంలో విభేదాలు ఉండవద్దని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు. సభ్యత్వ నమో దు డిజిటల్ పద్ధతిలో ఉంటుందని నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమిస్తామని, బూత్లెవెల్లో ఇద్దరిని నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన మోదీ సభలో బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్రెడ్డి ఐక్యత కనిపించిందని ఎద్దేవా చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిగే వరకు పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబా ద్ బహిరంగ సభలో ప్రజలు వణికిపోయే విధంగా మోదీ మాట్లాడారని విమర్శించారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ రావాలి..రేవంత్రెడ్డి పోవాలి నినాదంతో బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వ ర్లు బానోత్ హరిప్రియ, పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, వనమా రాఘవేంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు దామోదర్, రాంప్రసాద్, బాదావత్ శాంతి, సింధు తపస్వి, గుణచరిత్, అనుదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణకు దారితీసిన భూవివాదం
ఎనిమిది మందికి గాయాలు.. కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: ఇరువర్గాల మధ్య నెలకొన్న భూవివాదం తాజాగా ఘర్షణకు దారితీయగా ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. అందు లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని తోగ్గూడెం శివారలోని సాగు భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన కుర్సం రాజులు, పొట్టా పాపారావు మధ్య కొంతకాలంగా వివాదం ఉంది. కాగా, కుర్సం రాజులు ఆధీనంలో ఉన్న ఐదెకరాల భూమి తమదేనని పాపారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విషయంపై ఇరు వర్గాలు న్యా యస్థానాన్ని ఆశ్రయించగా, పరిష్కారం కాలేదు. శుక్రవారం ఉదయం రాజులు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాదంలో ఉన్న పొలంలో జామాయిల్ చెట్లను నరికి విక్రయించేందుకు వెళ్లగా, విషయం తెలుసుకున్న పాపారావు కుటుంబీకులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించడంతో తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో కుర్సం రాజులుకు తీవ్రగాయాలు కాగా, వీర్రాజు, గోపాల్రావు, దినేశ్, సునీల్, జగదీశ్లు స్వల్పంగా గాయపడ్డారు. రాజులు పరి స్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తర లించారు. పాపారావు, రాజశేఖర్ కూడా గాయపడటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతిమణుగూరుటౌన్: మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయతీ బోడేపూడినగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి మామిడి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బోడేపూడినగర్కు చెందిన సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ నాయకుడు మల్లెల రామయ్య (42) మామిడి చెట్టు ఎక్కి కొమ్మ లు నరుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, రామయ్య మృతదేహంవద్ద ప్రజా పంథా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నాయకులు నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, మాజీ సర్పంచ్ కారం ముత్తయ్య, సీపీఐ నాయకుడు సరెడ్డి పుల్లారెడ్డి సైతం సంతాపం తెలిపారు. వడదెబ్బతో వృద్ధుడు.. దమ్మపేట: వడదెబ్బ కారణంగా వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని అర్బన్కాలనీ లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. దమ్మపేటలోని అర్బన్కాలనీకి చెందిన సోయం రామ్మూర్తి (66) తన ఇంట్లోనే కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. -
ముందస్తు ప్రణాళిక అవసరం
ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు ప్రణా ళిక అవసరమని ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితికేష్ ఠాగూర్, జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, డీఎఫ్ఓ, పోలీస్, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, సాగునీటి శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధి కారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లా వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఈ నెల 18న బూర్గంపాడు మండలంలో మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కన్సల్టెంట్ అన్నారు. మాక్ డ్రిల్కుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఆలయ నిర్మాణం కోసం విరాళం..
దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన కాటిబోయిన ఆనంద్కుమార్ రూ. 1,00,001లను చిన్న అరుణాచల ఆలయ వ్య వస్థాపకుడు శివనాగస్వామికి విరాళంగా శుక్రవారం అందజేశారు. గ్రామంలోని పురాతన కోదండరామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల కూల్చివేశారు. అనంతరం అక్కడ నూతన ఆల యం నిర్మిస్తుండటంతో ఆనంద్కుమార్ విరా ళం అందించగా గ్రామస్తులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమినగర్కాలనీ గేటు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉమాశంకర్ బైక్పై వెళ్తుండగా గౌతమీనగర్కాలనీ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. గాయపడిన ఉమాశంకర్ను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మట్టి కుప్పను ఢీకొట్టిన వాహనదారుడికి..పాల్వంచ: మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తీసి ఉంచిన మట్టి కుప్పలను ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం రాత్రి పాల్వంచ నుంచి నవభారత్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషా.. స్పాంజ్ ఐరన్ కంపెనీ ఎదురుగా మూలమలుపు వద్ద మట్టి కుప్పను గమనించక ఢీకొట్టాడు. స్థానికులు గమనించి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. పామాయిల్ తోటలో గుప్తనిధుల తవ్వకాలు? ములకలపల్లి: మండలంలోని పొగళ్లపల్లి శివారులోని ఓ పామాయిల్ తోటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. భారీగా బంగారం తదితరాలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. భారీ వాహనాలతో తవ్వకాలు చేపడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. భారీగా డంప్ బయట పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాటాల పంపిణీ విషయంలో నెలకొన్న వివాదంతో విషయం బయటకు పొక్కినట్లు సమాచారం. నిమ్మకాయలు, అరటిపళ్లు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నాయి. పోలీసులు విచారణ చేపట్టి ఓ వ్యాపారి, మరో ఏడుగురిని అదుపు లోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయంపై ఎస్ఐ మధుప్రసాద్ను వివరణ కోరగా.. గుప్తనిధులు తవ్వినట్లు సమాచారం లేదని, పోటీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అయినా సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
గనులు పాతవే..
పేర్లే కొత్తవి!టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో లేని రోజుల్లో గనుల నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును వెలికి తీయడం సాధ్యం అయ్యేది కాదు. దీంతో మూసివేసిన చాలా గనుల్లో ఇప్పటికీ బొగ్గు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు అలా పేరుకుపోయిన నిల్వలను వెలికి తీయడాన్నే కొత్త గనుల ప్రారంభంగా సింగరేణి పేర్కొంటోంది. కొత్తగూడెం ఏరియాలో మూతపడిన భూగర్భ (యూజీ), ఓపెన్కాస్ట్ (ఓసీ) గనులు నాలుగింటిని కలిపి వెంకటేశ్ఖని మెగా ఓసీ పేరుతో గతేడాది నవంబర్లో పనులు ప్రారంభించింది. ఇల్లెందులో జవహర్ఖని ఓసీ ఎక్స్టెన్షన్స్, మణుగూరులో కొండాపూర్ ఓసీది ఇదే పరిప్థితి. ఈ రెండు ఏరియాల్లో కొత్త గనుల మాటే లేదు. తాజాగా రామగుండం–1, 2 ఏరియాల పరిధిలో మూసి వేసిన రెండు యూజీ లు, మూడు ఓసీలను ఒక్కటిగా చేసి రామగుండం మెగా కోల్మైన్ పేరుతో కొత్త గనికి అనుమతులు తెచ్చుకుంది. ఇలా పాత గనులకే కొత్త పేరు పెట్టుకుని ఘన విజయం సాధించినట్టుగా సంస్థ ప్రచా రం చేసుకోవడం విస్మయం కలిగిస్తోందని కార్మికులు అంటున్నారు. కేవలం కార్మికులు, యంత్రాల వినియోగం కోసమే ఇలా పాత గనులను కొత్తవిగా ప్రారంభిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2015 అక్టోబర్ నుంచి కేంద్రం బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం దేశంలో బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాలను బ్లాకులుగా గుర్తించి, బహిరంగ వేలం పద్ధతిలో మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. అప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులపై సింగరేణిది గుత్తాధిపత్యమే అని చెప్పుకోవచ్చు. దీంతో కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు తగ్గట్టుగానే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు దూరంగా ఉంది. ఫలితంగా 2014 నుంచి 2014 వరకు సింగరేణి సంస్థకు కొత్తగా ఒక్క బొగ్గు బ్లాకు కూడా దక్కలేదు. కేంద్రం తీసుకున్న చర్యల పర్యావసానంగా తాడిచర్ల (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) ఓసీ గని నుంచి 2017లో ప్రైవేట్ సెక్టార్లో బొగ్గు ఉత్పత్తి మొదలైంది. ఆ తర్వాత కోయగూడెం బ్లాక్–3, శ్రావణ్పల్లి, సత్తుపల్లి బ్లాక్–3 ప్రైవేటు పరమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్లపాటు పట్టు విడుపులు లేకుండా వ్యవహరించడం సింగరేణి పాలిట శాపంగా మారింది. ఎట్టకేలకు 2025లో బొగ్గు బ్లాక్ల వేలానికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే, అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెలంగాణ రావడానికి ముందే దక్కించుకున్న సత్తుపల్లి ఏరియాలో కిష్టారం ఓసీ, శ్రీరాంపూర్ ఏరియాలో ఇందారం ఓసీ, మందమర్రి ఏరియాలో కల్యాణిఖని ఓసీ, ఒడిశాలో నైనీ ఓసీ గనులే గడిచిన పదేళ్ల కాలంలో ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తూ సంస్థ మనుగడకు ఆయువుపట్టుగా మారాయి. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి రూటు మార్చింది. థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాల్లో అడుగు పెట్టి సానుకూల ఫలితాలు సాధించింది. ఇదే క్రమంలో బహుముఖంగా విస్తరించే లక్ష్యంతో మరింతగా థర్మల్, సోలార్ రంగాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్, కాపర్ బ్లాకులను దక్కించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొత్త బొగ్గు బ్లాకులు దక్కించుకోకుంటే సంస్థ మనుగడ ఏంటనే అంశం చర్చలోకి రాకుండా పోయింది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుని కేవలం 58 మిలియన్ టన్నుల దగ్గరే ఆగిపోయి చేదు ఫలితాలను చవిచూసింది. బొగ్గు ఉత్పత్తి రంగంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్త గనులను ప్రారంభించే అవకాశం లేక పాత గనుల్లో మిగిలినపోయిన బొగ్గును ఇప్పుడు వెలికితీస్తోంది. ఇలా వెలికి తీసే గనులకే మెగా గనులంటూ కొత్త పేరు పెడుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
యథేచ్ఛగా వన్యప్రాణుల వేట
● విద్యుత్ కంచె ఏర్పాటుతో వేటగాళ్ల హల్చల్ ● పంట పొలాలు, అటవీ ప్రాంతాలే టార్గెట్ ● మూగజీవాలతో పాటు మనుషుల ప్రాణాలకూ ముప్పు ● వాగులు, వంకలకు వెళ్లాలంటేనే భయపడుతున్న జనంమృత్యు‘తీగలు’..బూర్గంపాడు: మండు వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు వాగులు, వంకలు, పంట పొలాల్లోని బోర్ల వద్దకు వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు విద్యుత్ తీగలతో హతమార్చుతున్నారు. అడవి పందులే లక్ష్యంగా వేటగాళ్లు ప్రస్తుతం విద్యుత్ తీగలను అమర్చి వేటను కొనసాగిస్తుండగా.. ఆ తీగలు తాకి మేతకు వెళ్లిన పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, ముల్కలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, పాల్వంచ, కరకగూడెం మండలాల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతుంది. రేయింబవళ్లు వేట.. గతంలో రాత్రిళ్లు మాత్రమే కొనసాగే వేట ఇప్పుడు పగటిపూట కూడా జరుగుతోంది. గతంలో అడవి జంతువుల వేటకు ఉచ్చులు పెట్టిన వేటగాళ్లు అడవి జంతువులతో పాటు చేపలను పట్టేందుకూ విద్యుత్ తీగలను వినియోగిస్తున్నారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు గమనించని పశువులు, జీవాలు, ఇతర జంతువులు కూడా షాక్ గురై మృతిచెందుతున్నాయి. గతంలో విద్యుత్ తీగలు అమర్చిన వేట గాళ్లే ఆ విద్యుత్ తీగలు తాకి మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. అటవీ ప్రాంతాలకు, వాగులు, వంకలకు వెళ్లాలంటేనే ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితులున్నాయి. అటవీశాఖ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వన్యప్రాణుల వేటకోసం వేటగాళ్లు అమర్చిన విద్యు త్ తీగలతో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ తీగలు తాకి పశువులు మృత్యువాత పడడంతో విద్యుత్ లైన్లు ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఏ ప్రాంతంలో లైన్ ట్రిప్ అయిందో తెలుసుకుని దాన్ని పునరుద్ధరించేందుకు విద్యుత్శాఖ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. లైన్లు తరచూ ట్రిప్ అవడంతో వ్యవసాయ విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న అడవి జంతువుల వేటపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇటీవల కాలంలో అశ్వారావుపేట, ముల్కలపల్లి మండల్లాలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు అడవి పందులు, కుందేళ్లు మృత్యువాత పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు చింతా నాగిరెడ్డి పాడి గేదెలు మృతిచెందాయి. వేటగాళ్లు మృతిచెందిన గేదెలను గమనించి వాటిని రాత్రికి రాత్రే ట్రాక్టర్లో ఎక్కించి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలోని ఓ చెరువులో పడేశారు. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలోని పెదవాగులో విద్యుత్ తీగలు అమర్చి చేపలు వేటాడుతున్న క్రమంలో సోమవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. కృష్ణసాగర్ గ్రామ సమీపంలో వేటగాళ్లు అడవిపందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి నాలుగు ఊరకుక్కలు, రెండు జంగు పిల్లులు మృతిచెందాయి. వాటిని వేటగాళ్లు తెల్లారేసరికి అక్కడ్నుంచి లేకుండా మాయం చేశారు. సందెళ్లరామాపురం సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్ తీగలకు ఆవులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వేటగాళ్లు కేసుల్లో ఇరుక్కోకుండా పశువుల యజమానికి డబ్బులు ఇచ్చి పంచాయతీని ముగించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ముల్కలపల్లి, దమ్మపేట మండలాల్లో ఇటీవల వేటగాళ్లు అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తూ పట్టుబడ్డారు. -
క్రేజీ.. కరాటే
● ఆత్మరక్షణలో కీలకం ● శిక్షణ ఇప్పించడంపై తల్లిదండ్రుల ఆసక్తి ● కిటకిటలాడుతున్న ఉచిత శిక్షణ శిబిరంకరాటే శిక్షణలో మెళకువలతో నేర్పిస్తున్నారు. శరీరాన్ని, మనస్సును ఉత్సాహపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. చదువులోనూ ఏకాగ్రత కన్పిస్తుంది. కరాటే వల్ల శారీరక ధృడత్వం లభిస్తుంది. – హేమచంద్ర, సత్తుపల్లి శారీరకంగా, బలంగా మారేందుకు కరాటే దోహదపడుతుంది. మానసికంగా, ధైర్యంగా ఉండడంతో పాటు ఆపదను దాటగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరాటే శిక్షణకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు. – వి.పిచ్చయ్య, కరాటే మాస్టర్, సత్తుపల్లిసత్తుపల్లిటౌన్: ప్రస్తుత సమాజ పోకడలను పరిశీలిస్తే ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. ఎవరో వస్తారని చూడకుండా ఆత్మరక్షణకు సిద్ధమయ్యేలా కరాటే ఉపకరిస్తుంది. దీంతో వేసవి సెలవులను కరాటేలో ప్రావీణ్యం సంపాదించుకునేలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈక్రమాన సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిసరాలు అలర్ట్.. బో అరుపులతో మార్మోగుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాస్టర్ వి.పిచ్చయ్య ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటేతో ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని గుర్తించడంతో ఆసక్తి నెలకొనగా.. నిత్యం 50 – 60 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఏబీ స్విచ్లతో మెరుగైన విద్యుత్ సరఫరాఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): ఏబీ స్విచ్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని టీజీ విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. సింగిల్ ఫేస్ లైన్లలో 561 ఏబీ స్విచ్లు, త్రీఫేస్ లైన్లలో 480 ఏబీ స్విచ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీని ద్వారా ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే లైన్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా, కేవలం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మాత్రమే సరఫరా నిలిపివేస్తామని వివరించారు. మిగతా ప్రాంతాలకు సరఫరా ఉంటుందన్నారు. గతంలో చిన్న లైన్ ఫాల్ట్ వచ్చినా మొత్తం గ్రామం లేదా ఫీడర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేదని అన్నారు. ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. అత్యవసర విద్యుత్ సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు. అబాస్ హాజరు నమోదు చేయాలిచుంచుపల్లి: అబాస్ (ఆధార్ ఆధారిత బయోమెట్రిక్) హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. నార్మల్ డెలివరీ మోటివేషన్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, గర్భిణులకు సాధారణ ప్రసవాలు ఎక్కువ శాతం అయ్యేలాగా యోగాసనాలు నేర్పించాలని ఆదేశించారు. గర్భిణులకు ఏఎన్సీ క్లినిక్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రక్తహీనత నివారణకు కృషి చేయాలని చెప్పారు. వైద్యాధికారుల అనుమతి లేకుండా సెలవులు తీసుకోవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రతాప్, రాకేష్, హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, సిబ్బంది రాంప్రసాద్, లీల, జానకి పాల్గొన్నారు. నేడు గ్రంథాలయ దినోత్సవంకొత్తగూడెంఅర్బన్: విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మారుతున్న సమాజంలో గ్రంథాలయాల అభివృద్ధి–వాటి ప్రయోజనాలు’అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏడో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులెవరైనా పోటీల్లో పాల్గొనచ్చని, ఉదయం 10:30 గంటలకు గ్రంథాలయానికి రావాలని సూచించారు. పుస్తక ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు కూసుమంచి: రైతులు పండించిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టడమే కాకుండా గోదాంలకు తరలిస్తామని వెల్లడించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్కల కాంటా పూర్తయి రోజులు గడుస్తున్నా గోదాములకు తరలించడం లేదని, ఫలితంగా వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వివరించారు. దీంతో హమాలీల సంఖ్య పెంచడంతో పాటు రవాణాకు సరిపడా వాహనాలు సమకూర్చాలని డైరెక్టర్ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ సతీష్, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై దేశవ్యాప్త ఆందోళన
ఇల్లెందు: దేశ వ్యాప్తంగా రైతుల పాత రుణాలు రద్దు చేయాలని, వడ్డీ లేని రుణాలు అందజేయాలని, సాగుకు సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయించి గ్యారంటీ చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విమల్ త్రివేది, కిచ్చెల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని చండ్ర కిష్ణమూర్తి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల తీర్మానాలను వెల్లడించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 2026–27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, రబీలో తడిచిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించాలని, ఆదివాసీలపై అక్రమ కేసులను రద్దు చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్, వెనిజుల, క్యూబా ఇతర దేశాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలన్నీ మళ్లిస్తాం..
ఖమ్మం సహకారనగర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ చివరి గింజ వరకు సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఏటా సీజన్లో బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి హమాలీలు వస్తారని, ప్రస్తుతం అక్కడి పరిస్థితుల కారణంగా వారు రాకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఎండల కారణంగా హమాలీలు పగటి వేళ పనిచేయలేక పోతున్నారన్నారు. ఈమేరకు సమస్యను పరిష్కరించేందుకు గాను ఉమ్మడి జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు వేగంగా జరిగేలా రానున్న 15 రోజుల పాటు ఇసుక, సిమెంట్ తదితరాల రవాణాపై నియంత్రణ విధించి లారీలు, డీసీఎంలను ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొందరు మిల్లర్లు క్వింటాకు ఐదు, ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారనే సమాచారం ఉందని, ఇకనైనా వారు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.22 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతులకు రూ.4,800 కోట్లు జమ చేశామని తెలిపారు. మిల్లులు సీజ్ చేస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరించేందుకై నా సిద్ధంగా ఉందని వెల్లడించారు. రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేయడంతో దిగుబడి కూడా అలాగే వచ్చిందన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు అక్రమంగా తరుగు తీసినట్లు తెలిస్తే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఎవరేం అన్నారంటే.... ● భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పంట కోత ఆలస్యంగా ప్రారంభమైనందున కొనుగోళ్లు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. ● కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయంలో ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ● వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్లు మ్రిణాల్ శ్రేష్ఠ, అజయ్యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణాపై నిఘా..
జూలూరుపాడు: పశువుల అక్రమ రవాణా కట్టడిపై నిఘా పెట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారం జిల్లా సరిహద్దు గ్రామమైన వినోభానగర్ పోలీస్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించి వాహనాల తనిఖీలు, పోలీస్ సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ఆవులు, దూడలు అక్రమంగా రవాణా చేసి వధించడం నిషేధమని, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కార్యాకలాపాలు గమనిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో అంతర్రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై బాదావత్ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘చేయూత’లో అనర్హులకు చెక్
● నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న అధికారులు ● ఫేషియల్ రికగ్నైషన్ యాప్లో వివరాలు నమోదు చుంచుపల్లి: చేయూత పథకంలో పింఛన్ పొందుతున్న అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం నేటి నుంచి సర్వే చేపట్టనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు, హెచ్ఐవీ, పైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు ఇలా 10 రకాలుగా సర్కారు పింఛన్లు అందిస్తోంది. ఇందుకు ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా పాటిస్తోంది. ఈ క్రమంలోనే 2018 వరకు రేషన్ కార్డు అర్హత ఉండగా, తర్వాత దశల వారీగా ఆధార్ లింక్ చేయడంతో జిల్లాలో పింఛన్లలో అక్రమాలు బయటపడ్డాయి. మృతుల జాబితా కూడా తొలగించకపోవడంతో వారి పేరిట కూడా పింఛన్లను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించేందుకు ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు,మున్సిపల్ వార్డుల్లో అధికారులు బిల్ కలెక్టర్లు ఇతర సిబ్బంది జాబితాలతో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. పింఛన్ పొందే లబ్ధిదారుడి ముఖ గుర్తింపు(ఫేషియల్ రికగ్నైషన్) యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం జీవించి ఉంటే లైవ్నెస్ అథెంటికేషన్ కింద నమోదు చేస్తారు. ఒకవేళ వ్యక్తి చనిపోతే వివరాలు నమోదు చేసుకుంటారు. గ్రామసభను నిర్వహించి ఆమోదం పొందిన తర్వాత మృతుల పేర్లు తొలగించనున్నారు. సర్వేపై కలెక్టరేట్లో గురువారం పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 1.13 లక్షల మందికి పింఛన్లు జిల్లా వ్యాప్తంగా 1,13,840 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య ఫించన్లు 42,820 మంది, దివ్యాంగులు 13,101 మంది, వితంతువులు 49,369 మంది, చేనేత కార్మికులు 16 మంది, గీత కార్మికులు 141 మంది, ఒంటరి మహిళలు 6,150 మంది, బీడీ కార్మికులు 4 మంది, పైలేరియా బాధితులు 159 మంది, ఏఆర్టీ బాధితులు 1791 మంది, డయాలసిస్ బాధితులు 249 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో వృద్ధులకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తోంది. కాగా సర్వే పారదర్శకంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని, చనిపోయిన వారు, అనర్హులను గుర్తించి మేరకు తొలగిస్తామని డీఆర్డీఓ విద్యాచందన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
బూర్గంపాడు: ఈ నెల 12వ తేదీన లక్ష్మీపురం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మంగళవారం లక్ష్మీపురం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ(62)ను వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. వెంటనే అతడిని భద్రాచలం అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించగా.. అక్కడ చికిత్సలు పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మేడ ప్రసాద్ తెలిపారు. ములకలపల్లి: రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కల్యాణ్ (35) బుధవారం బైక్పై సత్తుపల్లి వెళ్లి గురువారం తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో పాలవాగు శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కల్యాణ్ను పాల్పంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. -
●సంస్కృతికి ప్రతిబింబం.. సంగీతం
ఖమ్మంగాంధీచౌక్: భారతీయ సంస్కృతికి సంగీతం ప్రతిబింబంలా నిలుస్తుంది. అనేక రకాల వాయిద్యాలు శబ్దాన్ని సృష్టించి సంగీతాన్ని పలకిస్తాయి. ఈ నేపథ్యాన చిన్నతనంపై సంగీతంపై ఆసక్తి పెంచుకుంటున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో వాయిద్యాలు నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా ఖమ్మంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హార్మోనియం, తబలా, కంజర తదితర పరికరాలతో పాటు సంగీతంలో రేణుక శిక్షణ ఇస్తున్నారు. సంగీతం భారతీయ సంస్కృతిని నేర్పడమే కాక విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తుందని రేణుక చెబుతున్నారు. సెలవుల్లో రద్దీ దృష్ట్యా ఉదయం వేళ మూడు బ్యాచ్లుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. -
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి 621 దరఖాస్తులు అందగా, తల్లిదండ్రుల సమక్షాన పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఎవరైనా విద్యార్థులు చేరకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగులు రమేష్, రాములు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 18నుంచి కేంద్ర పథకాలపై అవగాహన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్త్కర్ష అభియాన్ తదితర కేంద్ర పథకాల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఈనెల 18నుంచి 25వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సమిదా సింగ్ సూచించారు. న్యూఢిల్లీ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం నుంచి పీఓ రాహుల్ మాట్లాడుతూ గొత్తికోయలు, గిరిజన కుటుంబాలకు పథకాలపై అవగాహన కల్పించడమే కాక ఆధార్ నమోదు, జీవనోపాధి పథకాల మంజూరుకు క్యాంపులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏపీఓ డేవిడ్రాజ్, అధికారులు గన్యానాయక్, పాయం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నాణ్యత లోపిస్తే ఏజెన్సీ రద్దు
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని భద్రగిరి మార్ట్కు సరఫరా అవుతున్న ‘మిల్లెట్ మ్యాజిక్’బిస్కెట్ల తయారీలో నాణ్యత లోపిస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ హెచ్చరించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మహిళలు బిస్కెట్లు తయారు చేస్తున్న విధానాన్ని, ముడి సరుకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో ఈ బిస్కెట్లకు మంచి డిమాండ్ ఉన్నందున నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం, కల్తీ లేని ముడి సరుకులు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యా, మహిళా సభ్యులు వెంకటలక్ష్మి, లలిత, సమ్మక్క, మంగవేణి పాల్గొన్నారు. ‘అన్నం’ చెంతకు మతిస్థిమితం లేని మహిళసుజాతనగర్: గత 10 రోజులుగా సుజాతనగర్లో తిరుగుతున్న మతి స్థిమితం లేని మహిళకు సీ్త్రశిశు సంక్షేమ శాఖ, సఖీ ఆధ్వర్యాన గురువారం చేయూత కల్పించారు. ఓ మహిళ గత కొన్ని రోజులుగా సుజాతనగర్లో దిగంబరిగా సంచరిస్తుండగా.. సుజాతనగర్కు చెందిన ఓ వ్యక్తి విషయాన్ని సఖీ కేంద్రానికి తెలియజేశాడు. దీంతో జిల్లా సంక్షేమాధికారిణి సహకారంతో సదరు మహిళకు దుస్తులు, భోజనం అందజేశాక ఖమ్మం అన్నం ఫౌండేషన్ వారిని పిలిపించి ఆమెను అప్పగించారు. రేపు జాబ్ మేళాపాల్వంచరూరల్/రుద్రంపూర్: మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో 100, శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో 20 పోస్టుల భర్తీకీ ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అన్నదాతకు కన్నీటి సుడులు
పాల్వంచరూరల్: అన్నదాత ధాన్యం పండించటం కంటే అమ్ముకునేందుకే ఎక్కువ అవస్థ పడాల్సి వస్తోంది. యాసంగి వడ్లలో తాలు అధికంగా ఉందని, పీఆర్–126 రకం దొడ్డుగా ఉన్నాయని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటికే క్వింటాల్కు ఐదు కేజీలు తరుగు తీస్తుండగా, మరో ఐదు కేజీలు తీస్తామంటున్నారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఇటీవల కురిసిన వానలతో జిల్లాలోని పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. పాల్వంచ మండలం సోములగూడెం కొనుగోలు కేంద్రంలోనే సుమారు 12 వందల క్వింటాలకుపైగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. మిగతా కేంద్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. కాంటాపెట్టి మూడు రోజులైనా... కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టేందుకు కూడా జాప్యం చేస్తున్నారు. ఆ తర్వాత కాంటా వేసినా మూడు, నాలుగు రోజులపాటు బస్తాలు కేంద్రంలోనే ఉంటున్నాయని, ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు రావడంలేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తూకం వేసినా మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్నారని, పది కేజీలు తరుగు తీయాలంటున్నారని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ధాన్యాన్ని తిరస్కరిస్తూ లోడ్ను దిగుమతి చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు పడలేక రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు, దళారులు తక్కుకు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కూడా కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ.2,389, గ్రేడ్ బి రకానికి రూ.2,369 చొప్పున చెల్లిస్తోంది. వ్యాపారులు మాత్రం క్వింటాల్కు రూ.1400 నుంచి రూ. 1700 వరకే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు సుమారు రూ. 600 నుంచి రూ. 1000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. కొనుగోలు లక్ష్యం 87,209 మెట్రిక్ టన్నులు జిల్లాలో యాసంగిలో రైతులు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 22 క్వింటాళ్ల చొప్పున 87,209 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. యార్డులో 3 వేల బస్తాల కాంటా పెట్టిన ధాన్యం.. డీఏఓ ఎదుట రైతులు, నిర్వాహకుల ఆవేదన దమ్మపేట: కేంద్రంలో కాంటా పెట్టిన 3 వేల బస్తాల ధాన్యం ఉందని రైతులు, కేంద్రం నిర్వాహకులు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.బాబూరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజులుగా లారీలు రావడంలేదని తెలపగా, ఆయన జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్లో మాట్లాడి తక్షణమే మూడు లారీలను పంపాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బాధ్యులను ఆదేశించారు. ఏడీఏ రవికుమార్, ఏఓ చంద్రశేఖర రెడ్డి, ఏఈఓ సతీష్, పోలారావు తదితరులు పాల్గొన్నారు.మొక్కజొన్న బస్తాలతో నిండిన పీఏసీఎస్ ప్రాంగణం గుండాల: పీఏసీఎస్లో కొనుగోలు కేంద్రం మొక్కజొన్న బస్తాలతో నిండిపోయింది. లారీలు రాకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, 6 వేల క్వింటాల మక్కలు కొన్నారు. కొన్నవి తరలించకపోవడంతో మిగతా రైతులకు కేంద్రంలో స్థలం లేకుండాపోయింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఈ ఏడాది యాసంగిలో సుమారు 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇప్పటి వరకు 10,500 బస్తాలు కొనుగోలు చేయగా లారీలు రాకపోడంతో ప్రాంగణం నిండిపోయింది. దీంతో ఇంకా కొందరు రైతులు మక్కలు తెస్తున్నా, బస్తాలు దింపే స్థలం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గోదాంల వద్ద హమాలీల కొరతతో మొక్కజొన్న దిగుమతి కావడంలేదని, దీంతో లారీల కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అకాల వరాల్షతో మొక్కజొన్నలు తడిసిపోతున్నాయి. గత శనివారం వరకు 1000 మంది రైతుల నుంచి 8,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. లారీల కొరత లేదు. ఇటీవల వర్షాలు కురియడంతో కేంద్రాలకు లారీలు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. అయినా వెంటనే కేంద్రాలకు లారీలను పంపి నిర్దేశించిన మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాం. తడిసిన ధాన్యం కూడా కొని మిల్లులకు పంపిస్తాం. –త్రినాథ్బాబు, పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ డీఎం నేను యాసంగిలో 150 క్వింటాళ్ల ధాన్యం పండించాను. కేంద్రానికి 20 రోజుల క్రితం వడ్లు తెచ్చి ఆరబోసి ఉంచాను. మొన్న రాత్రి వర్షం వస్తే కంటిమీద కునుకులేదు. ధాన్యంపై కప్పిన పట్టాలు గాలికి ఎగిరిపోయాయి. సగం ధాన్యం తడిసింది. –బానోతు శంకర్, రైతు, బిక్కుతండా -
హార్టికల్చర్ హబ్గా పేట
అశ్వారావుపేట: రానున్న కాలంలో అశ్వారావుపేట హార్టికల్చర్ హబ్గా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా కేంద్రం(హెచ్ఆర్ఎస్)లో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో ప్రభుత్వ ఉద్యాన కళాశాలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించి కళాశాలకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానల వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా మాట్లాడారు. ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గోపి, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, వ్యవసాయ విశ్వవిద్యాల వైస్ చాన్స్లర్ ఏ.జానయ్య, వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.భద్రాచలం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి దివ్యక్షేత్రాన్ని భక్తుల ఆకాంక్షలకు తగినట్లుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరిగేషన్, ఆర్అండ్బీ, దేవస్థానం ఈఓ దామోదర్రావులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాడ దుర్గా ప్రసాద్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, చల్లగుళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
ఆలయాల్లో చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
కల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు ఖమ్మం జిల్లా కల్లూరులో గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై డి.హరిత సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం ఓబులపాలెంకు చెందిన బోలుసు ఏసుబాబు అలియాస్ మానికల ఏసుబాబు, ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన చేవూరి ఆదినారాయణ, వేంసూరు మండలం ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళితో పాటు మరో వ్యక్తి రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నాక వేలిముద్రల ఆధారంగా పరిశీలించాక ఇద్దరి వేలిముద్రలు డేటాబేస్లో పాత నేరుస్తులతో మ్యాచ్ అయ్యాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కల్లూరు మండలం చెన్నూరు, చిన్నకోరుకొండి, తల్లాడ మండలం వెంకటగిరి, మధిర మండలంలోని మల్లారం, ఏపీలో విసన్నపేట ఆంజనేయస్వామి దేవాలయం, పెనుబల్లి పోస్టాఫీసులో చోరీ చేసినట్లు తేలడంతో రిమాండ్కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ హరిత, సిబ్బందిని నాగేంద్రబాబు, సత్యనారాయణ, నరసింహారావును ఏసీపీ వసుంధర అభినందించారు. -
కరాటేతో స్వీయరక్షణ
స్వీయ రక్షణకు బాలికలు తప్పకుండా కరాటే శిక్షణ తీసుకోవాలి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన కరాటే శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. రెండేళ్లుగా కరాటే నేర్చుకుంటున్నా.. బ్లాక్బెల్ట్కు ఎంపికయ్యాను. – వర్షి, సత్తుపల్లికరాటే నేర్చుకోవటం వల్ల ఫిట్నెస్తో పాటు చదువులోనూ ఏకాగ్రత పెరుగుతుంది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతారు. బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకొని ప్రావీణ్యం సాధించాలి. – కె.ప్రణీత్య, సత్తుపల్లివేసవి సెలవుల్లో కరాటే శిక్షణకు వస్తూ సద్వినియోగం చేసుకుంటున్నా. ఇది నాకు క్రమశిక్షణ నేర్పింది. ఏదైనా ఆపద వస్తే ఎదిరించగలననే ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. – ఆఫ్రిన్, సత్తుపల్లి -
ముహూర్తాలకు బ్రేక్..
● 17 నుంచి జూన్ 15 వరకు బంద్ ● అధిక జ్యేష్ఠమాసం కావడంతో నెల పాటు వెలవెల ● పలువురి ఆదాయానికి గండి పాల్వంచరూరల్: అధిక జ్యేష్ఠమాసం రావడంతో నెల పాటు శుభముహూర్తాలు లేవని పెద్దమ్మతల్లి ఆలయ వేదపండితులు పద్మనాభ శర్మ తెలిపారు. స్వస్తిశ్రీ చాంజ్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో వివాహలు, గృహప్రవేశాలు, ఇతర శుభ ముహూర్తాలు వచ్చే నెల 15వ తేదీ వరకు ఉండవని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠమాసం కావడంతో వివాహది, శుభముహూర్తాలు ఉంటాయన్నారు. నెల పాటు వెలవెల.. సాధారణంగా వేసవి కాలంలో శుభకార్యాలు ఉంటే అందులో ముఖ్యంగా వివాహలు జరిగితే బ్యాండ్ మేళం దగ్గర నుంచి పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, వంట చేసేవారు, డెకరేషన్ వరకు అందరికీ ఎంతోకొంత ఆదాయం లభిస్తుంటుంది. కానీ అధిక జ్యేష్ఠమాసం పుణ్యమాని నెల పాటు ఎలాంటి శుభముహూర్తాలు లేకపోవడంతో వెలవెలబోనున్నాయి. వర్షాకాలం మొదలైతే ముఖ్యంగా వివాహలు చేయడం కష్టం ఉంటుందని, ఎక్కువ శాతం మేలోనే అధికంగా వివాహ ముమూర్తాలు పెట్టుకుంటారు. కాని అధిక మాసం అందరి ఆదాయానికి గండికొట్టినట్లయింది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. నేడు రుద్రహోమంపెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం రుద్రహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ.ఎన్.రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు. ఇత్తడి హుండీలు వితరణఅమ్మవారి ఆలయానికి అడపాల వెంగళరావు, నాగమణి, తోట నాగేశ్వరరావు, లీలావతి దంపతులు రూ.70 వేల విలువైన రెండు ఇత్తడి హుండీలను వితరణ చేశారు. గురువారం ఆలయంలో ఈఓ రజనీకుమారికి వితరణచేశారు. ఈ సందర్భంగా దాతలకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోని శివాలయంలో గురువారం అర్చకులు నందీశ్వర స్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. -
హెచ్సీఏ టుడే లీగ్కు భద్రాచలం క్రికెటర్లు
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీకి చెందిన నలుగురు క్రికెటర్లు హెచ్సీఏ టుడే లీగ్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యా రు. అకాడమీలో శిక్షణ పొందుతున్న రత్న ఆర్యన్, ప్రసన్న కుమార్, హర్షవర్ధన్నాయుడు, సుహాస్కు ఉమ్మడి జిల్లా జట్టులో చోటు దక్కగా, టోర్నీలో పాల్గొననున్నారు. క్రికెటర్లను అకాడమీ కోచ్లు చరణ్ తేజ, రవితేజ తదితరులు అభినందించారు. గిన్నిస్ రికార్డ్లో పాల్వంచ యువతి పాల్వంచ: హైదరాబాద్లో ఫిబ్రవరి 2న జరిగిన సామూహిక కీబోర్డ్ ప్లే ప్రదర్శనలో 22 దేశాల నుంచి 2 వేల మంది పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన పలువురిని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేయగా పాల్వంచకు చెందిన కండేల్ నతానియేల్ కుమార్తె అనూషకు స్థానం దక్కింది. ఈ మేరకు ఆమె హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టీన్ నుంచి బుధవారం ధ్రువపత్రం అందుకున్నారు. ఆర్టీసీలో పదోన్నతులు, బదిలీలు ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీలో) ఖమ్మం రీజియన్ పరిధిలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లకు పదోన్నతులు లభించాయి. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ సిఫారసుల మేరకు డ్రైవర్ గ్రేడ్–1/2, కండక్టర్ గ్రేడ్–1/2 కేడర్కు చెందిన తొమ్మిది మందికి ఏడీసీ/కంట్రోలర్లుగా పదోన్నతి కల్పి స్తూ ఆర్ఎం ఎ.సరిరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను పలు డిపోలకు బదిలీ చేశారు. సత్తుపల్లి డిపో నుంచి కేఎస్ ప్రసాద్, ఎన్ఆర్ కృష్ణను సత్తుపల్లికే కేటాయించగా, కె.సాయిరామ్ను మధిరకు కేటా యించారు. మణుగూరులో విధులు నిర్వర్తి స్తు న్న ఎల్.వాసుదేవరెడ్డి, పీఎస్ రాములును భద్రాచలానికి, ఖమ్మం నుంచి జీవీరావును ఇల్లెందు కు, భద్రాచలంలో పనిచేస్తున్న కె.ప్రతాప్ను భ ద్రాచలానికే, కొత్తగూడెంలో పనిచేస్తున్న సీహెచ్.శ్రీనివాసులును భద్రాచలానికి, మణుగూరులో పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును మధిరకు కేటాయించారు. ఇక ఏడీసీలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కల్పించగా.. ఇల్లెందులో పనిచేస్తున కె.వెంకటేశ్వర్లు, మధిరలో పనిచేస్తున్న ఎం.రాయప్ప, కె.వెంకన్న, సత్తుపల్లిలో పనిచేస్తు న్న పి.అప్పారావు, బీఆర్ రెడ్డిని ఖమ్మం బదిలీ చేశారు. ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లును సత్తుపల్లికి, భద్రాచలంలో పనిచేస్తున్న ఎన్.ఠాకూర్ను ఇల్లెందుకు, కోదాడ విజిలెన్స్ నుంచి కె.శామ్యూల్ను కొత్తగూడెంకు, భద్రాచలం నుంచి ఎస్కేఎం సాహెదాను విజిలెన్స్ కోదాడకు బదిలీ చేశారు. -
కేటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి రికార్డ్
పాల్వంచ: పాల్వంచ కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలోని 9వ యూనిట్లో నిరంతరాయంగా వంద రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తితో రికార్డు సాధించింది. 250 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్లో జనవరి 31 నుంచి ఈనెల 12వ తేదీ వరకు నిరవధికంగా ఉత్పత్తి కొనసాగింది. ఈ సందర్భంగా బుధవారం కర్మాగారంలో సీఈ ఎం.ప్రభాకర్రావు, ఎస్ఈ సత్యనారాయణ కేక్ కట్ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. యూనిట్ నిరంతరాయంగా, ఏ ఆటంకాలు లేకుండా నడవడానికి చేసిన కృషిని అభినందించారు. ఎస్ఈలు బి.శివరామిరెడ్డి, జీ.వీ. ధర్మారావు, పి.కృష్ణ, డీవైసీసీఏ రామారావు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
గీతాసారం
జీవిత పాఠం..అష్టాదశ శ్లోకాలపై శిక్షణ ఖమ్మంగాంధీచౌక్: భగద్గీతలో అష్టాదశ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహాభారత యుద్ధం సమయాన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఖమ్మం గుట్టలబజార్లోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఉపాధ్యాయురాలు అపర్ణ విద్యార్థులకు భగవద్గీతతో పాటు రామాయణం, మహాభారతంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భగవద్గీతలోని అష్టాదశ శ్లోకాలపై ఇస్తున్న శిక్షణకు మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఈ శ్లోకాల సారం జీవిత పాఠాలను నేర్పుతుందని, సమాజంలో బాధ్యతలను గుర్తుచేస్తాయని నమ్ముతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక శ్లోకాల పఠనం ద్వారా విద్యార్థుల్లో భాష ఉచ్ఛారణ, స్పష్టత వస్తుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమాన వేసవిలో ఉదయం నామమాత్రపు ఫీజుతో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని రేణుక తెలిపారు. -
పసికందు తలభాగం పీక్కుతిన్న కుక్కలు
దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాల్వంచ: పాల్వంచలో బుధవా రం అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. పాల్వంచలోని బొల్లేరుగూడెం ప్రాంతంలో ఓ పసికందు తలభాగం లభ్యమవడం కలకలం రేపింది. వీధి కుక్కలు గుంపుగా చేరి అరుస్తుండడంతో స్థానికులు పరిశీలించగా పసికందు తలభాగాన్ని తింటున్నట్లు తేలింది. దీంతో కుక్కలను తరిమివేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పసికందు తలభాగాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఎవరైనా శిశువును చంపి ఇక్కడ పడేశారా, లేక మృతదేహాన్ని కుక్కలు శ్మశానం నుంచి తీసుకొచ్చాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. స్థానికంగా ప్రసవించిన మహిళల వివరాలతో పాటు ఆస్పత్రుల్లో బాలింతల వివరాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, పసికందు మృతదేహం కుక్కల బారిన పడడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా పసికందు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలుచర్ల: ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన కేసులో మండలంలోని కొత్తపల్లికి చెందిన లంజిపల్లి వెంకటేశ్వర్లుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ భద్రాచలం అడిషినల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.దుర్గాభవాని బుధవారం తీర్పు వెలువరించారు. 2015లో చర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్రీనివాస్ వాదనలు వినిపించగా, అప్పటి చర్ల ఎస్ఐ, ప్రస్తుత ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్ విచారణాధికారిగా కొనసాగారు. కోర్టు కానిస్టేబుల్గా వి.అయ్యప్ప వ్యవహరించారు. పశువుల స్వాధీనంచండ్రుగొండ: ఒడిశా రాష్ట్రం నవరంగ్పూర్ నుంచి హైదరాబాద్ కబేళాకు తరలించేందుకు 122 పశువులను చండ్రుగొండ మండలంలోని మహ్మద్నగర్లో ఉంచగా.. సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని, లారీని సీజ్ చేశామని, పలువురిని ఆదుపులో తీసుకుని విచారిస్తున్న ఎస్ఐ శివరామకృష్ణ వెల్లడించారు. -
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం
కరకగూడెం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చేనెల 3న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. కరకగూడెం మండలం వీరాపురం క్రాస్ వద్ద బుధవారం తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇతర వర్గాలకు మళ్లుతుండడంతో యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రిజర్వేషన్లతో పాటు పోడు భూములు, భూమి హక్కుల సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయా లని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు సుతారి నాగేశ్వరరావు, కలం సంపత్కుమార్, సాంబమూర్తి, చందా రామకృష్ణ పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ -
బక్రీద్ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షణ
కొత్తగూడెంఅర్బన్: బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, పరస్పర సహకారంతో జరుపుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపుపై సూచనలు చేశారు. అలాగే, సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై నిఘా వేయాలని తెలిపారు. ఈ వీసీలో జిల్లా నుంచి ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ జిల్లాలో బందోబస్తు, కంట్రోల్ రూంల ఏర్పాటు, తనిఖీలతో పాటు ముందస్తుగా నిర్వహించిన సమావేశాల వివరాలను వెల్లడించారు.ఎస్పీతో పాటు డీఎస్పీలు ఆదినారాయణ, రవీందర్రెడ్డి, అరుణ్కుమార్, సీఐలు శ్రీనివాస్, సీఐ సతీష్ పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు
ఇల్లెందురూరల్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాంరాథోడ్ హెచ్చరించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు విధిగా సబ్సెంటర్లలో ఉండాలని స్పష్టం చేశారు. ఇల్లెందు మండలం రొంపేడు పీహెచ్సీ, పలు గ్రామాల్లోని సబ్సెంటర్లను బుధవారం ఆయ న తనిఖీ చేశారు. ఒడ్డుగూడెం సబ్సెంటర్ను తని ఖీ చేసిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మెమో జారీ చేశారు. అనంతరం రొంపేడు పీహెచ్సీని సందర్శించి వైద్యసేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అలాగే, స్వయంగా బీపీ చెక్ చేయించుకొని పరికరం పనితీరును పరిశీలించారు. పీహెచ్సీ నర్సింగ్ ఆఫీసర్ వైద్యకారణాలతో సెలవు పెట్టడంపై వాకబు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రొంపేడు వైద్యాధికారి రుషిత, ఉద్యోగులు భద్రమ్మ, రాజు, శ్రీనివాస్, గన్య, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ -
కనులపండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్య కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపారు. అలాగే, బేడా మండపంలో స్వామికి స్నపన తిరుమంజనం గావించారు. ప్రశాంతంగా పాలిసెట్ రుద్రంపూర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు బుధవారం నిర్వహించిన పాలిసెట్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఐదు, సుజాతనగర్, పాల్వంచలో రెండు కలిపి ఐదు సెంటర్లు ఏర్పాటుచేశారు. ఈమేరకు ఏడు సెంటర్లలో 2,069 మంది విద్యార్థులకు గాను 153 గైర్హాజరు కాగా 1,916 మంది పరీక్ష రాశారు. అలాగే, మణుగూరు సెంటర్లో 675 మందికి 633, భద్రాచలం సెంటర్లో 746 మందికి 698 హాజరయ్యారు. పలు కేంద్రాల్లో ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. ఉదయం పరీక్ష(జనరల్)కు 1,540 మంది విద్యార్థుల్లో 1,462 మంది, ఒకేషనల్ గ్రూప్నకు సంబంధించి 181 మందిలో 160 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు జనరల్ గ్రూప్ నుంచి 391 మందిలో 369 మంది, ఒకేషనల్ విద్యార్థులు 40 మందికి 32 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. -
తెలంగాణ టు ఏపీ...
● యథేచ్ఛగా సిలిండర్ల సరఫరా ● ఫలితంగా స్థానిక అవసరాలకు కొరతభద్రాచలం: సామాన్య ప్రజలకు గ్యాస్ కష్టాలు తీరడం లేదు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. డీలర్లతో మిలాఖత్ అయినట్లు తెలుస్తుండగా.. బ్లాక్ మార్కెట్ దందా అటు డీలర్లు, ఇటు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా డీలర్లు సిలిండర్లను స్థానికంగా బ్లాక్లో అమ్మడమే కాక సరిహద్దు దాటిస్తున్నారు. పరిధి దాటి... నిబంధనల ప్రకారం డీలర్లు నిర్దేశిత పరిధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి. కానీ కృత్రిమ కొరతలో భాగంగా అడ్డదారిన దండుకోవడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. భద్రాచలానికి సరిహద్దుగా రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ ఉండడం వీరికి కలిసొస్తోంది. అక్కడ కొన్ని గ్రామాల ఏజెన్సీలకు భద్రాచలం నుంచే సిలిండర్లు తరలిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా భద్రాచలం వాసులకు సరైన సమయంలో గ్యాస్ అందటం లేదు. బుక్ చేసుకుని చాలా రోజులకు కూడా సిలిండర్లు సరఫరా కాక కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ వ్యవధిలో బ్లాక్ మార్కెట్ ద్వారా రెట్టింపు ధరతో అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అంతేకాక గృహావసరాల సిలిండర్లను కమర్షియల్ సిలిండర్లలోకి మార్చి మరింత ఎక్కువ ధరతో అమ్ముకుంటున్నట్లు తెలిసింది. అధికారులకు కనిపించడం లేదా? బ్లాక్ మార్కెట్ కారణంగా సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులు ఇబ్బంది పడుతుండగా.. పరిస్థితులను చక్కదిద్దాల్సిన పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత రెండు నెలలుగా సమస్య కొనసాగుతున్నా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. డీలర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వారి బ్లాక్ మార్కెట్ దందా నానాటికీ పెరుగుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై హోటల్ల అసోసియేషన్ ద్వారా విన్నవించినా తమ దృష్టికి రాలేదని ఉద్యోగులు చెబుతుండడంపై వారి తీరుకు అద్దం పడుతోంది. ఇటీవల మణుగూరులో డీలర్పై అవినీతి ఆరోపణలు రావడంతో అక్కడి బాధ్యతలు మరో ఏజెన్సీకి మార్చి సమస్యను పరిష్కరించారు. కానీ భద్రాచలం ఏరియాలో తనిఖీ కూడా చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నందున కలెక్టర్ అంకిత్ ఈ సమస్యపై దృష్టి సారించాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు. కలెక్టర్గా విధుల్లో చేరినప్పటి నుంచి అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ పాలనను చక్కదిద్దుతున్నారు. ఈమేరకు టెంపుల్ సిటీగా పేరున్న భద్రాచలంలో గ్యాస్ సమస్యపై దృష్టి సారించి స్థానికులు, భక్తుల ఇక్కట్లు తీర్చాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం
కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఖమ్మం కలెక్టర్ దివాకరతో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
అందిపుచ్చుకుంటే మేలు..
కొత్త పథకం ఇరాన్ – అమెరికా యుద్ధంతో ప్రపంచ వాణిజ్య రంగంలో పరిస్థితులు మారిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల దిగుమతి కష్టంగా మారింది. ప్రజలు పొదుపు చర్యలు పాటించాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంధన కొరతతో భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా విస్తారంగా ఉన్న బొగ్గు నిక్షేపాల నుంచి గ్యాస్ను వెలికితీయాలని నిర్ణయించారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రూ.37వేల కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉన్న కోలిండియా, సింగరేణి వంటి సంస్థలకు కొత్త అవకాశం లభించినట్లయింది. 20 శాతం సాయం ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పథకం ద్వారా కోల్ గ్యాసిఫికేషన్లో పాల్గొనే ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం పెట్టుబడిలో 20 శాతాన్ని సమకూరుస్తుంది. అలాగే, ఈ రంగంలో అనుభవం కలిగిన ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సాంకేతిక సహకారం కూడా అందేలా తోడ్పాటునిస్తుంది. ఇప్పటికే కోలిండియా కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో ప్రాథమిక పనుల్లో పురోగతి సాధించింది. ఇప్పటికై నా సింగరేణి మీనమేషాలు లెక్కించడం ఆపేసి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మూతపడిన రెండు అంతకంటే ఎక్కువ గనులను ఒక్కటిగా చూసి, మిగిలిన బొగ్గును వెలికి తీసే పనిలోనే నిమగ్నమైంది. దీనికి అదనంగా కోల్ గ్యాసిఫికేషన్ను కూడా జత పరిస్తే మేలు జరగడం ఖాయమని చెబుతున్నారు.భూమి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గును ఉపరితల, భూగర్భ గనుల ద్వారా వెలికి తీస్తున్నారు. ఈ బొగ్గును ప్రధానంగా థర్మల్ విద్యుత్, సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అయితే, బొగ్గును నేల నుంచి బయటకు తీసి, తర్వాత పరిశ్రమల్లో మండించడం కంటే భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడే బయటి నుంచి ఆక్సిజన్ ఇతర వాయువులను పంపడం ద్వారా మండించి సింథటిక్ గ్యాస్ను తయారు చేసే ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. ఈ సింథటిక్ గ్యాస్ను బయటకు తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే నేచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా తదితర ఉత్పత్తులను పొందవచ్చు. ఇందులో నేచురల్ గ్యాస్ పారిశ్రామిక అవసరాలకు, అమ్మోనియా ఎరువుల తయారీలో దిగుమతులు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. పైగా సంప్రదాయ మైనింగ్తో పోలిస్తే కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కాలుష్యం కూడా తక్కువగా వెలువడుతుంది. కోల్ గ్యాసిఫికేషన్కు రూ.37వేల కోట్లు కేటాయించిన కేంద్రం సంస్థలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, మరో విడత గోల్డెన్షేక్ హ్యాండ్ పథకం అమలు చేస్తారనే ప్రచారం సింగరేణిలో జరగుతోంది. దీనికి విరుగుడుగా కొత్త రంగాల్లోకి విస్తరిస్తే కార్మికుల సర్దుబాటుకు అవకాశముంది. అంతేకాక సంస్థ భవిష్యత్కు భరోసా లభిస్తుందని కార్మికులు అంటున్నారు. ఈనేపథ్యాన తగిన వేదికను కేంద్రం సిద్ధం చేస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంబొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అంతంతగా ఉన్న సమయాన అనేక గనుల్లో బొగ్గు వెలికితీయలేక వదిలేశారు. ఇలా వదిలేసిన బొగ్గును ‘కోల్ గ్యాసిఫికేషన్’ ద్వారా వినియోగంలోకి తేవాలని సింగరేణి సంస్థ 2006లో ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు సాంకేతిక సహకారం కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)తో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు సింగరేణి సీఎండీ హోదాలో ఖ్వాజా, ఓఎన్జీసీ నుంచి డైరెక్టర్(ఆపరేషన్స్) హోదాలో పి.వాసుదేవరావులు సంతకాలు చేశారు. కానీ ఇప్పటివరకు అడపాదడపా కోల్ గ్యాసిఫికేషన్ అంటూ హడావుడి తప్పితే ఎలాంటి పురోగతి సాధించలేదు. -
డెంగీ కేసులు, చికిత్సపై ఆరా
మణుగూరు రూరల్: బెంగళూరులోని పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆదేశాల మేరకు జిల్లా ఎపిడమాలజిస్ట్ యమన్యుల్, జిల్లా సహాయ మలేరియా అధికారి(ఏఎంఓ) కుమారస్వామి బుధవారం మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో నమోదైన డెంగీ కేసులు, పరీక్షలు, చికిత్స వివరాలపై పీహెచ్సీ వైద్యాధికారి సునీల్తో చర్చించారు. అలాగే, పీహెచ్సీలో పరీక్షలకు ఉన్న వసతులపై ఆరా తీశారు. ఆతర్వాత డెంగీ తదితర సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా అరికట్టేలా అనుసరించాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశారు. ఉద్యోగులు వీరస్వామి, సత్యనారాయణ, సత్యమ్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ఉద్యాన కళాశాల ప్రారంభం
ఎమ్మెల్యే జారె ఆదినారాయణఅశ్వారావుపేట: అశ్వారావుపేటకు ప్రభుత్వం తాజాగా మంజూరుచేసిన ఉద్యాన కళాశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. స్థానిక ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అశ్వారావుపేటకు ఉద్యాన కళాశాలను సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే 30 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానుండగా, శాశ్వత భవనం, హాస్టల్, తదితర అవసరాలకు భూమిని గుర్తించామని చెప్పారు. కళాశాల ప్రారంభం అనంతరం ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది రైతులు హాజరవుతారని తెలిపారు. ఆయిల్ఫెడ్ సీనియర్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండి భాస్కర్, జూపల్లి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. విద్యపై ఇంత నిర్లక్ష్యమా? ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లకు విద్యారంగంపై పట్టనట్టు వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. విద్యా వారోత్సవాల్లో సర్పంచ్లను భాగస్వాములను చేస్తూ బుధవారం రైతు వేదికలో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణకు ఎమ్మెల్యే హాజరుకాగా.. నియోజకవర్గంలోని 105 మంది సర్పంచ్లకు కేవలం ఐదుగురే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు తానూ ఉపాధ్యాయుడిగా పనిచేశానని, అప్పట్లో లేని కొత్త విధానాలు ప్రస్తుతం అమలవుతున్నందున సర్పంచ్లు వారి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. -
సెల్ఫోన్ చూడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య
ములకలపల్లి: సెల్ఫోన్ చూడడం తగ్గించి ఇంట్లో పనులు చేయాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కోండ్రు ప్రసాద్ – నాగమణి దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు అశ్విని (19) గత ఏడాది ఇంటర్ పూర్తిచేయగా హైదరాబాద్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటూ వారం క్రితం ఇంటికి వచ్చింది. కాగా, నాగమణి తల్లి అనారోగ్యానికి గురవడంతో మంగళవారం స్వగ్రామమైన జగన్నాథపురం వెళ్తూ సెల్ఫోన్ వాడకం తగ్గించి, ఇంటి పనులు చేయాలని అశ్వినిని మందలించి బయలుదేరింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్విని పురుగులమందు తాగగా కొద్దిసేపటికి గుర్తించిన స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు. -
ఇంటికే పౌష్టికాహారం
● లబ్ధిదారుల గృహం వద్దకే సరుకులు ● వేసవి సెలవుల్లో కూడా పోషకాహారం పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం భద్రాచలంఅర్బన్: ప్రాథమిక, జిల్లా ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, సరుకులు ఇంటికే సరఫరా చేస్తున్నారు. బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, పల్లీపట్టీలు, మురుకులు, మిల్లెట్స్, బాలామృతం అందిస్తారు. అలాగే నెల రోజులపాటు వారి ఆరోగ్యంపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. వేసవి కారణంగా పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదు. దీంతో ఆహార సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పరిస్థితులను బట్టి నేరుగా పౌష్టికాహారం అందించే విధానం అమల్లోకి తెచ్చింది. లబ్ధిదారులకు ఊరట.. మే నెలలో ఎండల తీవ్రత కారణంగా గర్భిణులు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో పౌష్టికాహారం అందడం ఆగిపోయేది. లబ్ధిదారులు, పిల్లలకు సెలవులు వర్తిస్తాయి. ఈ సమయంలో టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్) అమలు చేసింది. ఆరేళ్లలోపు చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు బియ్యం, పప్పు, నూనె, పాలు బాలామృతం, కోడిగుడ్లు వంటి సరుకులు అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయి. విధుల్లో ఉన్న సిబ్బంది టీహెచ్ఆర్ పంపిణీ అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి పూర్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులను చేర్చించడం, పిల్లల ఎత్తు, బరువు చూడటం, బడి పిల్లలను గుర్తించడం వంటి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో అంగన్వాడీ నిర్వాహకులతోపాటు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పౌష్టికాహారం సరఫరా ఇలా.. జిల్లాలో ఉన్న ఐసీడీఎస్ పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల నుంచి 9,070 మంది గర్భిణులు, 3,543 మంది బాలింతలు, 3 ఏళ్ల లోపు 35,036 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు 32,667 మంది చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారు. రోజూ భోజనం, గుడ్డు, పాలు, స్నాక్స్ అందించాల్సి ఉంటుంది. సవాళ్లు, పర్యవేక్షణ అవసరం.. కొందరు లబ్ధిదారులు కేంద్రాలకు రాకపోవడం, టీచర్లు/ఆయాలు పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే ప్రభు త్వ లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఈ నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారులు కఠిన పర్యవేక్షణతో పౌష్టికాహా రం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గృహాల సందర్శన.. వేసవి సెలవులైనా బాలింతలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది గృహ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగా లేకుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తారు. చిన్నారుల బరువు, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పోషణపై అవగాహన కల్పిస్తారు. సెలవుల అనంతరం ‘అంగన్వాడీ బాట’ వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు చేపడతారు. కేంద్రాల్లో ఐదేళ్ల వారు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. అలాగే చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోవడానికి ‘అమ్మమాట – అంగన్వాడీ బడిబాట’కార్యక్రమం ద్వారా గుర్తిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సెంటర్లలో చేర్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవు లు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు అవసరమైన సేవలు నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించనున్నాం. లబ్ధిదారులకు సరుకులు ఇంటికే అందించడానికి చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే పౌష్టికాహారం నేరు గా వారి ఇళ్ల వద్ద అందిస్తాం. గృహ సందర్శన కార్యక్రమం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తాం. –ఉండేటి జ్యోతి, ఐసీడీఎస్ సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ -
వేగంగా మొక్కజొన్న కొనుగోళ్లు
● బస్తాలు, హమాలీల కొరత లేకుండా చూడాలి ● కొనుగోలు కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ అంకిత్ ఇల్లెందురూరల్/టేకులపల్లి: రైతులు ఇబ్బంది పడకుండా మొక్కజొన్న కొనుగోళ్ల వేగవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఇల్లెందు మండలంలోని మార్కెట్యార్డు, రేపల్లెవాడతో పాటు టేకులపల్లి, బోడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లు, ఎగుమతి వివరాలతో పాటు కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట వివరాలు ఆరా తీశారు. కాగా, ఇల్లెందులో మొక్కజొన్న నిల్వకు గోదాములు గుర్తించారా అని తహసీల్దార్ సూర్యనారాయణను ప్రశ్నించగా సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సూచన మేరకు మండలంలోని సుభాష్నగర్లో గిరిజన భవన్ను ఉపయోగించుకోవాలని, అవసరమైతే కారేపల్లికి తరలించాలని సూచించారు. అంతేకాక అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని ఆర్డీఓ మధును, ఇల్లెందుకు లారీల సంఖ్య పెంచాలని రవాణా కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇక టేకులపల్లి నుంచి మక్కలను సూర్యాపేట జిల్లా కోదాడ మార్కెట్ యార్డుకు తరలిస్తున్నట్లు చెప్పిన అధికారులు, ప్రత్యామ్నాయంగా టేకులపల్లి ఉన్నత పాఠశాలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. అయితే, పెట్రాంచెలకలోని గోదాంలో నిల్వకు అనుమతి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఇల్లెందు మార్కెట్, పీఏసీఎస్ల చైర్మన్లు బానోత్ రాంబాబు, మెట్టెల కృష్ణ, లక్కినేని సురేందర్రావు, డీఏఓ బాబూరావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ జేఎల్.గణేష్ గాంధీ, సర్పంచ్ బానోత్ శారద, ఏడీఏ లాల్చంద్, ఏఓలు సతీష్, అన్నపూర్ణ, సీఈఓలు హీరాలాల్, ప్రేమాచారి పాల్గొన్నారు. -
నీట్ నిస్తేజం..
● పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన ● కష్టపడి సిద్ధమయ్యామంటూ వెల్లడి ● మరోమారు పరీక్షకు సన్నద్ధతపై భిన్నాభిప్రాయాలు నీట్ రద్దుతో పేద విద్యార్థులకు ఇబ్బందే కాక మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. పలువురు రూ.లక్షలు వెచ్చించి లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నారు. నిరుపేద విద్యార్థులకు గురుకులంలో ఉచిత శిక్షణ ఇచ్చాం. మళ్లీ శిక్షణ తీసుకోవాలంటే ఆర్థికంగా కష్టమే. –అన్వేశ్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, పాల్వంచ ఇల్లెందురూరల్/పాల్వంచరూరల్: మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ‘నీట్’ను రద్దు చేశారు. రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీకై నట్లు నిర్ధారణకు వచ్చిన జాతీయ పరీక్ష వ్యవస్థ (ఎన్టీ) దర్యాప్తు సంస్థల విచారణతో ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం మార్పు లేకుండా, మరోమారు ఫీజు చెల్లించే అవసరం లేకుండా త్వరలో ఇంకోసారి పరీక్ష నిర్వహిస్తామని చెబు తున్నా.. కష్టనష్టాలకోర్చి సిద్ధమైన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పరీక్ష కీ చూసుకుని మంచి మార్కులు సాధిస్తామని, తప్పక సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న విద్యార్థులు రద్దయిందనే సమాచారంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక శిక్షణతో.. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పలువురు రూ.లక్షలు ధారపోసి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీపట్టారు. అంతేకాక తాజాగా ఇంటర్ చదివిన వారు షార్ట్టర్మ్ శిక్షణతో నీట్ లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని వెచ్చించారు. కానీ పరీక్ష రద్దు కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. ఎంతో శ్రమించి సన్నద్ధమై ఒకసారి పరీక్ష రాశాక.. మళ్లీ రాయడమంటే ఆ స్థాయిలో ఏకాగ్రత సులువు కాదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పేపర్ లీక్ పరిణామం తెలివైన విద్యార్థులకు తీరని నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయాన దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మోకాళ్లపై మెట్లెక్కి.. మొక్కు తీర్చుకుని..
భద్రాచలంటౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ జనగామ జిల్లాకు చెందిన బొడ్డు ప్రవీణ్ మంగళవారం భద్రాద్రి రామయ్యకు వినూత్నంగా మొక్కు చెల్లించుకున్నారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఆయన.. భద్రాచలం ఆలయ మెట్లను మోకాళ్లపై ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. జగన్ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు 99 ఆలయాలను సందర్శించానని, 100వ క్షేత్రంగా భద్రాద్రికి చేరుకున్నానని ఆయన తెలిపారు. రాములోరి ఆశీస్సులతో జగనన్న మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ తన యాత్రను విజయవాడ వరకు కొనసాగిస్తానని పేర్కొన్నారు. -
మొబైల్ మాయ.. నష్టాల తోవ
కరకగూడెం: ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లలో ఒకరు ఎప్పుడూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. మరొకరు ప్రతిరోజూ కొంత సమయం చదువు, కొంత సమయం ఆటలకు, ఇంకొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించేవాడు. కాలం గడిచింది. మొబైల్తో సమయం వృథా చేసిన బాలుడు చదువులో వెనుకబడిపోయాడు. కానీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న బాలుడు చదువులోనే కాదు ఆటల్లోనూ, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒకరోజు మొబైల్కు బానిసైన బాలుడు తన స్నేహితుడిని అడిగాడు. ‘నువ్వు ఎలా విజయవంతమయ్యావు?’అని. అప్పుడు ఆ విద్యార్థి ‘మొబైల్ మనకు ఉపయోగపడాలి. మనమే మొబైల్కు బానిసలు కాకూడదు’అని చెప్పాడు. ఆ మాటలు విని మొదటి విద్యార్థి ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు నుంచి మొబైల్ వినియోగాన్ని తగ్గించి, స్నేహితులతో కలిసి బయట ఆటలు ఆడడమే కాక పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
‘ఉద్దీపనం’లో మార్పులు చేయాలి
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ జీపీఎస్ పాఠశాలల్లో చదివే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ అందించేలా ఉద్దీపనం వర్క్ బుక్లో మార్పులు, చేర్పులతో ప్రణాళిక రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. మంగళవారం ఐటీడీఏలో ఎస్సార్పీలు, ఉపాధ్యాయులతో ఉద్దీపకం వర్క్ బుక్ తయా రీ ప్రణాళికలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి వర్క్ బుక్లో మార్పులు చేయాలన్నారు. మూడో తరగతి పిల్లలకు వర్క్ బుక్ నిర్వహణ నిరంతరంగా ఉండాలని, ఇంగ్లిష్ వర్క్బుక్లో స్టాండర్డ్ పెంచాలని, శాస్త్రవేత్తలు, మహనీయులు, సైన్స్, జాగ్రఫీ తది తర అంశాలను పొందుపర్చాలని సూచించా రు. జూన్ 20న విద్యార్థులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించాలని చెప్పారు. 7,8 తరగతులు చదివే విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా గణితం, ఆంగ్లంలో వర్క్ బుక్ తయారుచేసి వారానికి రెండుసార్లు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూ చించారు. అధికారులు అశోక్, రమేష్, ఎస్సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు
ఐదుగురు భక్తులకు గాయాలు బూర్గంపాడు: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం రామాలయంలో మొక్కులు తీర్చుకుని తిరుగుపయనమైన భక్తులు సారపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న జామాయిల్ కర్రలోడు ట్రాక్టర్ను భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న సిద్దిపేట పట్టణానికి చెందిన హనుమాన్ భక్తులు ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని హైదరాబాద్కు రిఫర్ చేశారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అక్రమ కలప పట్టివేత.. సిబ్బంది మధ్య వాగ్వాదం దుమ్ముగూడెం: మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 6 టేకు దిమ్మెలను అటవీశాఖ సిబ్బంది పట్టుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గోదావరి ఒడ్డున అక్రమంగా 6 టేకు దిమ్మెలను స్మగ్లర్లు తరలించడానికి సిద్ధంగా ఉంచగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, అటవీశాఖ సిబ్బంది ఒకరు పట్టుకున్న టేకు దిమ్మెలలో రెండు పెద్ద వాటిని మార్చి చిన్న దిమ్మెలను పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.70 వేల వరకు ఉండవచ్చని తెలిసింది. అలాగే అటవీశాఖ సిబ్బంది మధ్య జరిగిన వివాదంపై రేంజర్ కమల విచారణ చేపట్టినట్లు సమాచారం. -
గిన్నిస్ రికార్డు ధ్రువపత్రం ప్రదానం
మణుగూరురూరల్: గత ఫిబ్రవరి 2న విజయవాడలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్య కళాకారులు ఏకకాలంలో ప్రదర్శన ఇచ్చారు. ఇది గిన్నిస్ రికార్డు సాధించగా పాల్గొన్న కళాకారులకు ధ్రువపత్రాలు అందజేశారు. వీరిలో మణుగూరు మండలానికి చెందిన, మాంటిస్సోరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని శ్రుతిప్రియ కూడా మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకుంది. ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరంటేకులపల్లి: యువతను క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టేకులపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 11వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. కల్నల్ సంజయ్కుమార్భద్ర పర్యవేక్షణలో జరిగిన 10 రోజుల శిబిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 700 మంది కేడెట్లు పలు అంశాల్లో నిష్ణాతులైన అధికారుల నుంచి శిక్షణ పొందారు. ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి కల్నల్ సంజయ్కుమార్భద్ర మాట్లాడుతూ.. ఎస్సీసీ శిక్షణ వ్యక్తిత్వ వికాసానికి పునాది అని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ, ఉపేందర్నాయక్, శ్రీలత, బాల్బహదూర్ పున్, నారాయన్, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిరవధిక వాయిదా కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబా ద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలను నిరవధికంగా వాయి దా వేసినట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఈ నెల 11న కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యాన మంగళవారం సాయంత్రం విద్యార్థులతో సమావేశం కాగా, పోటీ పరీక్షలు ఉండడమే కాక ఎండల కారణంగా పరీక్షలు వాయి దా వేయాలని పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించామని, ఈ నెల 13న మధ్యాహ్న భోజనం తర్వాత యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్లను మూసివేస్తారని వెల్లడించారు. జూన్ 8న వేసవి సెలవులు ముగిశాక సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. -
అంజన్న భ క్తుల సందడి
భద్రాచలం: రామబంటు మాలధారులతో భద్రగిరిలో మంగళవారం సందడి నెలకొంది. దీక్షాపరులు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమించేందుకు భద్రాచలం తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు స్వర దర్శన వేళలను పొడిగించారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయమైన ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు మాలధారులకు దీక్షా విరమణ గా వించారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, తమలపాకులతో అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అదనపు లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. కమనీయంగా నిత్యకల్యాణం దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ఈఓ దామోదర్రావు పూజాది కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. భద్రగిరిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు -
కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, కొనుగోళ్లలో జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా ఇకముందు ప్రతీ కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలనిఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ హాజరై మాట్లాడారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతున్నామని, తాత్కాలిక నిల్వ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న 15 రోజులు అత్యంత కీలకం రానున్న 15 రోజులు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లకు అత్యంత కీలకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో సుమారు 9,300 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలు పేరుకుపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బయ్యారం, ములకలపల్లి, కృష్ణసాగర్, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, కొత్తగూడెం, బంగారుచెలక ప్రాంతాల్లో నిల్వ సదుపాయాలు ఉన్నాయని, మూడు రోజుల్లో మొక్కజొన్నలను గోదాంలకు తరలించాలని ఆదేశించారు. మార్క్ఫెడ్, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రవాణాలో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోదాం సమస్య తలెత్తితే తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లు, పాఠశాల భవనాలు ఇతర అనుకూల భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, ఇతర అధికారులు ప్రేమ్ కుమార్, బాబూరావు, త్రినాథ్ బాబు, నరేందర్ తదిరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
జూలూరుపాడు/చండ్రుగొండ : ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. చండ్రుగొండ, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల్లో అలసత్వం చూపొద్దని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం పోకలగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న స్నేహ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యాధికారులు రాము, బి.వెంకటేశ్వర్లు, బి. వెంకటేష్, సిబ్బంది శోభశ్రీ, రమాదేవి, సునీత, రమ్యశ్రీ, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాసరావు జి.శశి కళ, రత్నకుమార్, రాధిక, ప్రియదర్శని పాల్గొన్నారు. -
ఉద్యాన కళాశాలకు భూమి పూజ..
రానున్న విద్యాసంవత్సరం నుంచే తరగతులు అశ్వారావుపేట: అశ్వారావుపేటలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఉద్యాన కళాశాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈనెల 14న భూమి పూజ చేయనున్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఉద్యాన యూనివర్సిటీ అధికారులు కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (హెచ్ఆర్ఎస్)లో కళాశాల భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఎస్ భవనం మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందే 30 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమం వివరాలు అధికారంగా ప్రకటించాల్సి ఉంది. -
● లౌకిక ప్రజాస్వామికవాదులు ఏకం కావాలి ● మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
రైతు ఉద్యమాలు నిర్మించాలిఇల్లెందు: ప్రభుత్వ నిరంకుశ విధానాలతో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి చేజారిపోయిందని, రైతులను ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిర్మించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మంగళవారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్ హాల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం(మాస్లైన్ అనుబంధ) జాతీయ మహాసభల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. కనీస మద్దతు ధర, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు పోరాటాలు చేయాలన్నారు. అప్పుల బాధతో రోజుకు సగటున 48 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతు సమస్యలను విస్మరించిన మోదీ సర్కార్ కార్పొరేట్లకు మాత్రం రూ. 16 లక్షల కోట్ల రుణం మాఫీ చేసిందని విమర్శించారు. బ్యాంకులకు రూ. 80 వేల కోట్లు ఎగవేసినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. మద్దతు ధరలు అడిగిన రైతును అణిచి వేస్తోందని, మతం పేరుతో విభజించు పాలించు పద్ధతి అవలంబిస్తోందని ఆరోపించారు. 2029లో అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచక తప్పదని అన్నారు. దేశంలో మోదీ ఫాసిస్టు పాలన సాగుతోందని, రానున్న కాలంలో లౌకిక, ప్రజాస్వామికవాదులు ఏకమై మోదీ ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. మహాసభల ప్రారంభానికి ముందు మాస్లైన్ కార్యాలయం ఎల్లన్న విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐయూకేఎస్ జెండాను ఆ సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఆవిష్కరించారు. మహాసభలకు జాతీయ కన్వీనర్ కిచ్చెల రంగయ్య అధ్యక్షత వహించగా, రాయల చంద్రశేఖర్, కర్నాటి యాదగిరి నగర్లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. బెంగాల్, కర్నాటక, అసోం కళాకారులు ఆటా –పాట, నాటికలను ప్రదర్శించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి ప్రసాద్ తొలిపలుకులు వినిపించారు. నాయకులు విమల్ త్రివేదీ, కృష్ణగగోయ్, ఉమాకాంత్, డీజే పూజార్, పరితోష్, దేవ్రావు, గౌస్, శివ చరణ్ సింగ్, వివేక్, నిర్వాణప్ప, రాంచంద్రన్, కేజీ రాంచందర్, శశికాంత్, హర్నీక్ మహిమ్, రామకృష్ణ, మనోహర్రాజు, శిరోమణి, కాంపాటి పృథ్వీ, అజ్మీరా భిచ్ఛా, పి రామకృష్ణ, గుమ్మడి నర్సయ్య, రమ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం పాల్వంచరూరల్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కసరత్తు మొదలైంది. ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగుల జాబితాను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. జలవనరుల శాఖలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఈఈ అర్జున్తో సహా 8 మంది డీఈలు, 22 మంది ఏఈలు బదిలీ కానున్నట్లు సమాచారం. మొత్తం 31 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. పాల్వంచ టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రెండు, మూడు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తున్న పాల్వంచ ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డితోపాటు ములకలపల్లి రేంజర్ రవి కిరణ్, 39 మంది బీట్ ఆఫీసర్లు, ఇద్దరు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్లు రమాదేవి, రాము, 11 మంది సెక్షన్ ఆఫీసర్లు.. మొత్తం 52 మంది బదిలీపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జలనవరుల శాఖలో 31, అటవీశాఖలో 52 మంది -
కూచిపూడి.. ఇష్టపడి!
నృత్యంపై చిన్నారుల ఆసక్తి ఖమ్మంగాంధీచౌక్: ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పాఠశాలల్లో జరిగే వేడుకలు, కుటుంబాల్లో పెళ్లిళ్లు.. ఇలా ఏ వేదికపై అయినా చిన్నారులు నృత్యం చేసేందుకు అవకాశం దక్కుతోంది. దీనికి కొందరు చిన్నారుల్లో నృత్యంపై సహజంగానే ఆసక్తి ఉంటోంది. ఈ మేరకు వేసవి సెలవుల్లో పలువురు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆవిర్భంవించిన ఈ కళానృత్యం వైపు చిన్నారులు దృష్టి సారిస్తున్నారు. కళారూపం, హస్తముద్రలు, ముఖ, కంటి కదలికలతో పాటు వేగవంతమైన పాద విన్యాసంతో పురాణ గాథలు, భక్తిని ఈ నృత్యం ప్రదర్శిస్తుంది. భరత నాట్యానికి దగ్గరగా ఉండే ఈ నృత్యం ప్రత్యేక శైలిని కలిగి ఉండడంతో చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్లోని ఏలూరి మీనా కొందరు చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. చిన్నారుల ఆసక్తికి అనుగుణంగా నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మీనా వద్ద 50 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల్లో కూచిపూడిపై ఆసక్తి పెరగుతోందని.. అందుకు అనుగుణంగా వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నృత్య ప్రదర్శనలు అంటే ఇష్టం. చాలా రకాల నృత్యాలు ఉన్నా కూచిపూడిపై ఆసక్తితో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో శిక్షణ పొందుతున్నా. –జ్ఞాన సహస్ర, గట్టయ్యసెంటర్, ఖమ్మం -
బిహార్ వాసి దారుణ హత్య
మద్యం మత్తులో ఘర్షణ బూర్గంపాడు: మద్యం మత్తులో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో బిహార్ వాసిని అతని గదిలో ఉండేవారే దారుణంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాకు చెందిన కుందన్సింగ్(45) కొంతకాలంగా లక్ష్మీపురంలో లారీల కమాన్ కట్టల మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. తనతో పాటు మరో ముగ్గురితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అందరూ కలిసి బాగా మద్యం తాగారు. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి బండరాయితో కుందన్సింగ్ తలపై రెండు, మూడుసార్లు మోదాడు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న ఎస్ఐ ప్రసాద్ ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. పాల్వంచ సీఐ సతీశ్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు..‘కమ్యూనిటీ కనెక్ట్’లో డీఎస్పీ సతీశ్కుమార్ పాల్వంచ: చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ పేర్కొన్నారు. సోమ వారం పట్టణ పరిధిలోని వనమాకాలనీ, తెలంగాణనగర్, వికాంగులకాలనీ, జయమ్మకాలనీల్లో ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమం నిర్వహించా రు. మూడు గంటల పాటు కాలనీల్లో తిరిగి 300 ఇళ్లల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లులేని 72 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం స్థానికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మట్కా, జూదం, కోడి పందేలు, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, కాలనీల్లో కొత్త వ్యక్తులు అద్దెకు వస్తే ఇంటి యజమానులు ఆధార్కార్డు, చిరునామాను సేకరించాలని, ఎలాంటి సమాచారం అందించినా వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ సతీశ్, ఎస్ఐలు నాగరాజు, జీవన్, కల్యాణి, సురేశ్, మధుప్రసాద్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాలి దుమారం.. ఆగమాగం అశ్వారావుపేటరూరల్: గాలి దుమారంతోపాటు కొద్దిసేపు వర్షం కురవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. సో మవారం మధ్యాహ్నం వరకు అధిక ఎండతో ఇబ్బందులు పడగా, కొద్ది సేపట్లోనే వాతావరణం చల్లబడి గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట, నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం రాశులపై అన్నదాతలు పట్టాలు కప్పారు. కాగా, అప్పటికే వర్షానికి స్వల్పంగా ధాన్యం రాశులు తడిచినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే గాలి దుమారంతో మండలంలోని మల్లాయిగూడెం – దుబ్బతోగు, మల్లాయిగూడెం – పండువారిగూడెం మార్గాల్లో పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న మల్లాయిగూడెం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్లపై పడిన వృక్షాలను తొలగించారు. -
నా బాల్యం
వేసవి సెలవులన్నీ అమ్మమ్మ ఇంట్లోనే.. సత్తుపల్లిటౌన్: వేసవి సెలవులు వచ్చాయంటే అందరం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి మేనమామలు, వారి పిల్లలతో సందడిగా గడిపేవాళ్లం. రోజూ సద్ది కట్టుకొని పొలాలకు వెళ్లేవాళ్లం. అంతేకాక వరి కోత పనులు, నాట్లు వేయడం, వేరుశనగ తీయడంలో పాలుపంచుకునేవాళ్లం. రాత్రి వేళ పిల్లలందరం కలిసి అష్టాచెమ్మా, దొంగా పోలీస్, కుంటాట, ఉప్పాట ఆడుకునేది. ఇంకా భక్షాలు (బొబ్బట్లు) చేసేవాళ్లం. మజ్జిగ చిలకడం ఇష్టంగా చేసేదానిని. ఆరో తరగతి చదివేటప్పుడు కడపలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లాను. ఏడు నుంచి పదో తరగతి వరకు నందికొట్కూరులో ఎన్సీసీ కేడెట్గా స్కూల్ ఫస్ట్ వచ్చా. ఇలా నా బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడిచిపోయింది. –ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
● కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగింపు ● మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఇల్లెందు: మిలిటెంట్ పోరాటాలతోనే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. సోమవారం నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. చీలికలు పేలికలుగా మారిన సీపీఐ(ఎంఎల్)లోని కొన్ని గ్రూపులు కలిసి మాస్లైన్గా ఆవిర్భవించాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో 16 రాష్ట్రాల్లోని రైతు సంఘాలతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం సభలను ఇల్లెందులో నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైతుల నడ్డి విరిచేలా ఇతర దేశాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తుల దిగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గంభీర ఉపన్యాసాలు దంచే మోదీ ట్రంప్ షరతులకు తలొగ్గాడని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగించిందని విమర్శించారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఎన్డీ పార్టీ ప్రతిఘటన పోరాటం అంటూ కేడర్ను మోసం చేస్తోందని ఆరోపించారు. జీవితాలను ధారబోసిన మావోయిస్టు పార్టీ కూడా ఆచరణ సాధ్యం కానీ విధానంలో పని చేశామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పీడిత ప్రజలరాజ్యం రావాలంటే అన్నిపార్టీలు ఏకం కావా లని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీ లు అమలు చేయడంలేదన్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నా మక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీతా రామ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, ఇల్లెందుకు నీరు ఇవ్వాలని అన్నారు. నాయకులు విమల్ త్రివేది, తుమ్మలపల్లి ప్రసాద్, రంగయ్య, గుమ్మడి నర్సయ్య, కె.రమ, డీహెచ్ పూజార్, కృష్ణ గగోయ్, చండ్ర అరుణ, ఎం.కృష్ణ, రాము, భిక్షం, రాజు, వెంకన్న పాల్గొన్నారు. -
వర్సిటీకి నిధులేవి?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా ఎర్త్ సైన్సెస్ విభాగంలో కోర్సులను ఆఫర్ చేస్తోంది తెలంగాణకే కాకుండా, దేశానికే తలమానికంగా ఉండేలా అన్ని విధాలుగా వర్సిటీని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరడం లేదు. వర్సి టీ భవనాల మాస్టర్ప్లాన్ గతేడాది ఆగస్టులోనే సిద్ధం చేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉష ప్లాన్ రూపొందించారు. ఇందులో పాత ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన క్వార్టర్లు, ఉమెన్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ భవనాలను అలాగే ఉంచారు. కొత్త డిజైన్లో పాడుబడిన ఆడిటోరియాన్ని పునరుద్ధరించాలని, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొత్తగా నాలుగు అకాడమిక్ బ్లాకులు, సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, క్యాంటీన్, లైబ్రరీల భవనాలకు డిజైన్లు సిద్ధమయ్యాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు పక్కన బాయ్స్ హాస్టల్స్, డైనింగ్ హాల్, అకాడమిక్ భవనాలకు సమీపంలో గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బడ్జెట్ నిధులు ఇంకా రాలేదు దేశంలోనే ఏకై క ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2026–27లో రూ.45 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అంచనా వ్యయంలో దాదాపు పది శాతం నిధులు కేటాయించగా, వర్సిటీ తక్షణ అవసరాలకు పనికి వస్తాయనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపుపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు వర్సిటీ మేనేజ్మెంట్తో జరగలేదు. కలెక్టర్ కోటానే దిక్కు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సి టీ గ్రాంట్స్ కమిషన్ నుంచి పైసా విడుదల కాలేదు. కనీ సం సీఎస్ఆర్ కోటా లో కూడా ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ వర్సిటీ ఆధునికీకరణకు ముందుకు రాలేదు. ఇంజనీరింగ్ కాలేజీ నుంచి యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు వివిధ పనుల కోసం మొత్తంగా రూ.3.20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా కలెక్టర్ కోటా నుంచే వెచ్చించారు. తాజాగా గతంలో మెయింటెనెన్స్ లేక బూత్బంగ్లాగా మారి న ఆడిటోరియాన్ని రూ.26 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. త్వరలోనే రెండో ఏడాదికి సంబంధించి డిగ్రీలో నాలుగు కోర్సుల్లో, పీజీలో రెండు కోర్సుల్లో అడ్మిషన్లు జరగుతాయి. మరో మూడు వందల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉంది. దీంతో క్యాంపస్పై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు దేశంలోనే ఏకై క వర్సిటీ అనే గొప్పలకు తగ్గట్టుగా ఇక్కడ ల్యాబ్లను సిద్ధం చేయడం, ఫ్యాకల్టీని నియమించడం వంటి పనులపైనా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్ ప్రారంభం కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కేఎస్ఎంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవరణలో ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్ను హెచ్ఓడీ జగన్మోహన్రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న కాంప్లెక్స్కు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. మంత్రి తుమ్మలతోపాటు వర్సిటీ వైస్ చాన్స్లర్ యోగితారాణా ప్లాన్ను పరిశీలించి, డిజైన్కు ఆమోదం తెలపాల్సిందిగా సీఎం కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని, నిర్మాణ పనులుపూర్తి చేస్తా మని మంత్రి తుమ్మల పలుమార్లు హామీలు ఇచ్చారు. భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచే కాకుండా సింగరేణి, ఎన్ఎండీసీ వంటి సంస్థలు, పూర్వ విద్యార్థుల నుంచి కూడా నిధు ల సమీకరణ చేస్తామన్నారు. అయితే, తొమ్మిది నెలలు గడిచినా యూనివర్సిటీ డిజైన్కు ఆమోదం రాలేదు. -
సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్తో కలిసి స్వీకరించిన కలెక్టర్.. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కీలకమని, తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే సమస్యలను పరిష్కరించాలని, మిగిలినవాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కొన్ని దరఖాస్తుల వివరాలు.. ● లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన రైతులు ఆర్ఎఫ్ఆర్ వ్యవసాయ భూముల్లో ఆయిల్పామ్ మొక్కలకు నీరు అందించేందుకు విద్యుత్ సదుపాయం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. అటవీశాఖ అనుమతులు మంజూరు చేయకపోవడంతో కరెంట్ లైన్ వేయలేకపోతున్నామని, ఆయిల్పామ్ మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. దరఖాస్తును ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు. ● చుంచుపల్లి మండలం వెంకటేశ్వరకాలనీ జీపీకి చెందిన షేక్ పర్వీన్ నివసిస్తున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో పేరు లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా దరఖాస్తును చుంచుపల్లి ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు. ● ఇల్లెందుకు చెందిన శేషుకుమారి ప్రమాదంలో చేయి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిందని, తనకు, తన తల్లికి ఇల్లు, పెన్షన్ లేవని, ఉపాధి అవకాశాలు కల్పించాలని దరఖాస్తు అందించగా.. దానిని ఇల్లెందు తహసీల్దార్కు బదిలీ చేశారు. ● కుటుంబ రేషన్ కార్డు నుంచి తన పేరు తొలగించారని, కొత్త రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెండింగ్లో చూపిస్తున్నారని ఇల్లెందు ఆరో వార్డుకు చెందిన మహేశ్ తెలిపారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరగా దరఖాస్తును పౌరసరఫరాల శాఖ అధికారికి బదిలీ చేశారు. ● కొత్తగూడెం గణేశ్బస్తీ 54వ డివిజన్కు చెందిన ఎండీ గౌస్య ఇంటి ఎదుట ఉన్న వేప చెట్టు కూలిపోవడంతో విద్యుత్ స్తంభం పడిపోయిందని, సమస్య పరిష్కరించాలని కోరగా, దరఖాస్తును విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జూలూరుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లాలో విద్యా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా జూలూరుపాడు మండలంలో కలెక్టర్ పర్యటించి, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పడమటనర్సాపురం జీపీ దండుమిట్టతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు, పాపకొల్లు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకుడుగుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పదో తరగతిలో మండలస్థాయిలో మొదటిస్థానం దక్కించుకున్న విద్యార్థిని పూజితను అభినందించారు. జూలూరుపాడు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాలలో వేసవి శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. డీఈఓ బి.నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ అజయ్, ఎంఈఓ జుంకీలాల్, ఎంపీఓ తులసీరామ్ పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నీలో 11 పతకాలుసూపర్బజార్(కొత్తగూడెం): హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో జిల్లా అథ్లెట్లు 12 మంది పాల్గొని 11 పతకాలను కై వసం చేసుకున్నారు. రామవరానికి చెందిన ఎస్.కే.రియాజ్ పాషా, కొత్తగూడేనికి చెందిన బి.పల్లవి, భద్రాచలానికి చెందిన సీహెచ్.నిఖిత బంగారు పతకాలు, పాల్వంచకు చెందిన ఎం.సుభాష్, రామవరానికి చెందిన ఎస్.కే.రియాజ్ పాషా, కొత్తగూడేనికి చెందిన సీహెచ్.వేదశ్రీ, భద్రాచలానికి సీహెచ్.నిఖిత రజత పతకాలు, అశ్వారావుపేటకు చెందిన తాటి సందీప్, పాల్వంచకు చెందిన ఎం. సుభాష్, కొత్తగూడేనికి ఐ.జయసాయి, మధుప్రియ కాంస్య పతకాలు దక్కించుకున్నారని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహీధర్ వెల్లడించారు. క్రీడాకారులతో పాటు కోచ్లు డి.మల్లికార్జున్, పి.నాగేందర్లను డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి, అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, గొట్టపు రాధాకృష్ణ తదితరులు అభినందించారు. గిరిజనులందరికీ లబ్ధి చేకూరాలి ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేవిధంగా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మంది రంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత యూనిట్ అధికారులకు అందజేసి, సత్వరమే పరి ష్కరించాలని సూచించారు. అధికారులు డేవిడ్రాజ్, అశోక్, అరుణకుమారి, సైదులు, రాంబాబు, లక్ష్మీనారాయణ, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తెలంగాణ ట్రైకార్, భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధి లోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. గెస్ట్ సర్వీస్ అసోసియేట్, హోటల్ కుకింగ్, ఫుడ్ బేవరేజ్ అసోసియేట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్, వేర్ హౌస్ అసోసియేట్లకు 3 నుంచి 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. పదోతరగతి, ఐటీ ఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగినవారు అర్హులని వివరించారు. అభ్యర్థులు ఈ నెల 14న ఇల్లెందులోని వైటీటీ భవనంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. గానుగ నూనె ఆరోగ్యానికి శ్రేయస్కరంసుజాతనగర్: గానుగ నుంచి సేకరించిన వంట నూనె ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఐటీడీఐ పీఓ రాహుల్ అన్నారు. సుజాతనగర్లోని ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. భద్రగిరి మార్ట్లో గానుగ నూనె విక్రయిస్తున్నట్లు, ఏజెన్సీ ప్రాంతంలో గానుగ నూనె కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 74.45 శాతం పూర్తయిందని, రానున్న 15 రోజుల్లో 90 శాతం లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేస్తున్నామని వివరించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, నవీన్ పాల్గొన్నారు. బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు చిలకల నరేష్కు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అంకిత్ బ్యాటరీ వీల్ చైర్ అందజేశారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు కోసం టీజీఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా చేసుకోగా, వీల్చైర్ మంజూరు చేశారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
భగవద్గీతను రాబోయే తరాలకు అందించాలి
దమ్మపేట: భగవద్గీతను రాబోయే తరాలకు అందించేలా ప్రతి దేవాలయంలో గీత శ్లోకాలను భక్తులకు వినిపించాలని అభయ్ హిందూ సేవ వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ అన్నారు. సోమవారం దమ్మపేటలో ర్యాలీ నిర్వహించారు. జీప్ను మాజీ ఎమ్మెలే తాటి వెంకటేశ్వర్లు స్వయంగా నడిపారు. అనంతరం దమ్మపేట శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హిందూ ధర్మ సమ్మేళనంలో రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు సంఘటితం కావాలని అన్నారు. భగవద్గీతలోని శ్లోకాలను చదివి, అర్థాలను వివరించారు. స్వామిజీలు, సర్పంచ్ రమాదేవి, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక నిల్వలపై దాడులు
45 ఇసుక డంపులు సీజ్ అశ్వాపురం: మండలంలో అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై అధికారులు దాడు లు చేశారు. సోమ వారం పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారు లు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీ ల్లో చింత్రియాల క్రాస్ రోడ్డు, చింతిర్యాలకాలనీ, సండ్రలబోడు గ్రామాల్లో సుమారు 45 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్రెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరిచిపోయిన బ్యాగ్ అప్పగించిన ఆటోడ్రైవర్ఖమ్మంక్రైం: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన హ్యాండ్బ్యాగ్ను డ్రైవర్ తిరిగి అప్పగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం వచ్చింది. పాత బస్టాండ్లో దిగాక ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. హడావుడిలో రూ. 20 వేల నగదు ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మర్చి పోయింది. కాసేపయ్యాక గుర్తించిన ఆమె ట్రాఫి క్ పోలీసులకు ఫిర్యాదుచేయగా, అంతలోనే డ్రైవ ర్ కూడా బ్యాగ్ యాజమాని గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్కు సమాచా రం ఇవ్వడంతో ఆయన బ్యాగ్ను మంజులకు అందజేశాడు. ఈ సందర్భంగా డ్రైవర్తో పాటు ట్రాఫిక్ సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు. -
నీ బంటునయ్యా..
రామయ్యా.. నేడు హనుమాన్ జయంతి వేడుకలు ● భద్రాచలానికి భారీగా తరలివస్తున్న మాలధారులు ● ఏటా అరకొర వసతులతో భక్తులకు తప్పనిపాట్లు ● ఈసారైనా సదుపాయాలు మెరుగుపర్చాలని విన్నపం భద్రాచలం: హనుమాన్ జయంతి మంగళవారం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హనుమాన్ మాలధారులు భద్రాచలం దివ్యక్షేత్రానికి వేలాదిగా తరలిరానున్నారు. 45 రోజులపాటు నియమనిష్టలతో దీక్ష పాటించి శ్రీరామ చంద్రస్వామి పాదాల చెంత ఇరుముడి విరమించనున్నారు. ఏటా అంజన్న మాలధారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు దేవస్థానం వసతులు కల్పించలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారం జయంతి రాగా, ఈసారైనా ఏర్పాట్లు మెరుగపర్చాలని భక్తులు కోరుతున్నారు. ఏటేటా పెరుగుతున్న మాలధారులు ఇటీవల కాలంలో మాలధారులు ఇరుముడి విరమణకు భారీ సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. రెండు, మూడు రోజులపాటు స్వామివారిని సుమారు 40 వేల మంది వరకు దర్శించుకుంటారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల అనంతరం క్రమేణా హనుమాన్ జయంతి కూడా పెద్ద ఉత్సవంగా మారుతోంది. కొండగట్టు అంజన్న ఆలయం తర్వాత భద్రాచలంలోనే హనుమాన్ మాలధారులు ఇరుముడిని సమర్పిస్తారు. భక్తులకు వసతులు కల్పించాలి మాలధారులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయంలో ఇరుముడి విరమణ చేస్తారు. రద్దీ ఉండటంతో ఆలయం కిక్కిరిసిపోతుంది. ఈ క్రమంలో సామూహిక విరమణ, పూజలు నిర్వహిస్తే భక్తులకు కొంతమేర ఇక్కట్లు తగ్గుతాయి. నిర్ణీత రుసుంపై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆలయానికి ఆదాయం, భక్తులకు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వస్తున్న మాలధారులకు దారి పొడవునా నీడ, వసతి, అన్నదానం కల్పించాలని కోరుతున్నారు. ముక్కోటి, శ్రీరామనవమి తరహాలో భద్రాచలంలో ఉచితంగా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర, అన్న ప్రసాదాలను స్వచ్ఛంద సంస్థలు అందించేలా రెవెన్యూ, దేవస్థాన, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తద్వారా భక్తులకు ఆర్థిక భారం తగ్గుతుంది. పార్కు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, ఇతర కొన్ని చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నా భక్తులందరికీ సరిపోవడంలేదు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయంలోని మూలమూర్తులను తొలగించి అంతరాలయ ప్రాంగణంలో ఉంచారు. దీంతో ప్రస్తుతం అంతరాలయంలో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. కేవలం వెండి వాకిలి వద్దనే భక్తులను నియంత్రించి పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగానే ఉండే అవకాశం మాలధారులకు సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. మాలధారుల సందడి నేడు హనుమాన్ జయంతి కాగా, సోమవారం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాలధారులతో రామాలయంలో సందడి నెలకొంది. -
గృహ జాబితా సేకరణ షురూ
చుంచుపల్లి: జనగణనలో కీలకమైన గృహ జాబితా వివరాల సేకరణ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 1,780 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. ఇందులో 1,615 మంది ఎన్యుమరేటర్లు, 40 మంది నోడల్ అధికారులు,125 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ఎన్యుమరేటర్లు జిల్లా వ్యాప్తంగా గృహ జాబితా (హౌస్ లిస్టింగ్) సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. సర్వేకు స్థానికంగా ఉండే గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు ఇతర సిబ్బంది సహకరిస్తున్నారు. రెండు, మూడు రోజులు ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టడంతోపాటు నంబర్లను కేటాయించనున్నారు. ఇక గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు స్వీయగణనకు అవకాశం కల్పించగా, పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో స్పందన అంతంత మాత్రమే లభించింది. మొదటి విడత జనగణన జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డిజిటల్ విధానంలో జనాభాను లెక్కించనున్నారు. జనగణనలో జిల్లాలో సుమారు 3,36,407 కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. జనగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జనగణన సర్వేను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజూ సర్వే పూర్తయిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదుచేయాలని చెప్పారు. ఇంటినంబర్, గదుల సంఖ్య, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు, ద్విచక్ర వాహనాలు లేదా కార్ల వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని సేకరి స్తారని తెలిపారు.జిల్లాలో జనగణనకు శ్రీకారం -
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
దుమ్ముగూడెం: మండలంలోని పైడిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన మడకం దస్రు, మండలంలోని కొత్తూరుకు చెందిన గొంది నాగలక్ష్మి ద్విచక్రవాహనంపై పైడిగూడెం వెళ్లి వస్తూ.. ఓ ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడినవారిని ములకపాడు వైద్యశాలకు అక్కడి నుంచి భద్రాచలం వైద్యశాలకు తరలించగా.. చికిత్సపొందుతూ దస్రు మృతిచెందాడు.దస్రు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారంఇవ్వకుండా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ తరలించారు. కామేపల్లిలో ఒకరు.. కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లికి చెందిన సత్తి గోపి ఇల్లెందులో పాత ఇనుప సామగ్రి లోడ్ చేసేందుకు అదేగ్రామానికి చెందిన పోతురాజు వెంకన్న (58), జక్కుల లింగయ్య, బయ్య వీరస్వామిని డీసీఎం వ్యాన్లో తీసుకొస్తున్నాడు. ఈ క్రమాన వ్యాన్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన గోపి కొత్తలింగాల శివారులో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో క్యాబిన్లో ఉన్న వెంకన్న, లింగయ్య, వీరస్వామి ఎగిరిపడి రోడ్డుపై పడగా గాయలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ పోతురాజు వెంకన్న మృతి చెందాడు.ఘటనపై ఆయన భార్య లక్ష్మికాంత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. హైవేపై ప్రమాదంలో.. వేంసూరు: వేంసూరు సమీపాన గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవేపై ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనుమతి లేకున్నా బులుపూరి అచ్యుతరావు(26), అరవింద్, ప్రణీత్ వెళ్తున్నారు. ఇందులో అరవింద్ బైక్ నడిపిస్తుండగా అచ్యుతరావు మధ్యలో, ప్రణీత్ వెనుక కూర్చున్నారు. వీరు శనివారం అర్ధరాత్రి వైరా వద్ద టోల్ప్లాజాను తప్పించుకుని హైవేపైకి చేరారు. ఈమేరకు కాకినాడకు వెళ్తుండగా వేంసూరు వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో అచ్యుతరావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వేంసూరు పోలీసులు తెలిపారు. తొమ్మిది మందికి గాయాలు అశ్వాపురం: మండలంలోని జగ్గారం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆదివా రం జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది. ముందు ఓ ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. జగ్గారం వద్ద ట్రావెల్స్ బస్సుడ్రైవర్.. మరో బస్సును తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలవగా వారిని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో బస్సు కండక్టర్ నిర్మల, మరో మహిళ వసంతకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.ఇద్దరిపై కేసుఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్ సమీపాన రీల్చేసేందుకు గాను వాహనాలను స్తంభింపచేసిన ఇద్దరిపై కేసు నమోదైంది. ఖమ్మానికి చెందిన చెంచు ఉత్తమ్, గోపి సతీశ్ ఈ నెల 2వ తేదీన వాహనాలను నిలిపివేసి రీల్స్ చేశారు. ఈ రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సీపీ కార్యాలయ ఉద్యోగి మురారి శ్రీకాంత్ ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తమ్, గోపి సతీశ్పై ఆదివారం న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ వెల్లడించారు. ఇసుక నిల్వలు సీజ్ బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని మైనార్టీ పాఠశాల పక్కన అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఆదివారం రెవెన్యూ, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 25 ట్రక్కుల ఇసుకను నిల్వచేశారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుకను వేలంపాట నిర్వహించి విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఈత సరదా.. కావొద్దు బాధ
● వేసవి సెలవుల్లో నేర్చుకునేందుకు పిల్లల ఆసక్తి ● తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం ● తల్లిదండ్రులు, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి ఇల్లెందురూరల్: వేసవి వచ్చిందంటే ఉక్కబోత కారణంగా పిల్లలు ఈత కొట్టాలని ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందులో పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్లు అందుబాటులో ఉన్నా.. గ్రామాలకు వచ్చేసరికి బావు లు, చెరువులను ఆశ్రయిస్తారు. అయితే, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు దరి చేరడమే కాక ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ఈ నేథ్యాన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈత నేర్పించడం సులువవుతుంది. అవగాహన లేక ఇల్లెందు మండలం హనుమంతులపాడుకు చెందిన ఊకం సాగర్ (14) నాలుగు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకున్నా రక్షణ పరికరాలు లేకుండా బావిలోకి దూకగా మునిగిపోయాడు. రెండేళ్ల క్రితం మామిడిగుండాల గ్రామానికి చెందిన ఎర్రిపోతు భిక్షపతి ఈత రాకున్నా డబ్బా నడుముకు కట్టుకొని బావి లోకి దిగాడు. డబ్బా మధ్యలోనే జారిపోవడంతో మృత్యువాత పడ్డాడు. గతేడాది ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం రాంబాబు చెరువులో చేపలు పడుతుండగా గడ్డిజాతి తీగలు కాళ్లకు చుట్టుకొని నీట మునిగిపోయి మృతిచెందాడు. తల్లిదండ్రుల్లో మార్పు తల్లిదండ్రుల దృక్పథం గతంతో పోలిస్తే మారింది. ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాం చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మాత్రమే భావిస్తున్నారు. మిగతా క్రీడలతో పాటు ఈత వంటి సంప్రదాయ, అభిరుచి ఉన్న ఆటల వైపు ప్రోత్సహించడం లేదు. పాఠశాలలు, శిక్షణలు, ప్రత్యేక తరగతుల పేరుతో యవ్వన దశ దాటేస్తుండగా.. నడి వయస్సులో ఈత నేర్చుకునే అవకాశం ఉన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. అప్రమత్తత తప్పనిసరి తల్లిదండ్రులు తమ సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. లేదంటే అనుభవం ఉన్న వారితో తర్ఫీదు ఇప్పించాలి. ఆడా, మగ తేడా లేకుండా పిల్లలకు తప్పనిసరిగా ఈత నేర్పితే భవిష్యత్లో నీటి ప్రమాదాలకు ఆస్కారముండదు. ఈతరాని వారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడుగంటిన బావులు, చెరువులలో నీరు కలుషితంగా మారి అందులో ఈత కొడితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మంచినీరు ఉన్న బావులు, చెరువులనే ఎంచుకోవాలి. అంతేకాక బుర్రలను కట్టుకొని దిగితే నీటిలో తడిసి, బుర్రకాయకు రంధ్రాలు ఉంటే చిన్నారులు మునిగే అవకాశముంది. అందుకే సొరకాయ బుర్రలు, డబ్బాలకు బదులు నాణ్యమైన, సరిపడా సైజ్ కలిగిన ట్యూబ్లను వాడాలి.వేసవిలో పిల్లలకు ఈత సరదాగా ఉంటుంది. ఈత మంచిదే అయినా ఆరోగ్యకరమైన చికాకులు కూడా ఉంటాయని పెద్దలు గుర్తించాలి. కలుషిత నీటి వల్ల కంటి సంబంధ, చర్మ, అతిసారా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మంచినీరు ఉన్న వనరులను ఎంచుకోవడమే కాక నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటే ప్రమాదాలను అధిగమించవచ్చు. –డాక్టర్ మోతీలాల్, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వర్ణ పూత తులసీ దళాల వితరణశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన కండ్లకుంట శ్రీకాంత్, నీలిమ దంపతులు స్వర్ణపూత తులసీదళాలను వితరణ చేశారు. రాగిపై బంగారు పూతతో 108 దళాలను సుమారు రూ.3 లక్షల వ్యయంతో తయారు చేయించారు. వీటిని ఆదివారం అంతరాలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి పూజలు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కత్తి శ్రీనివాస్, లింగాల సాయిబాబా, దాతల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లి గుడి వద్ద కూలిన వృక్షం
పాల్వంచరూరల్: పెద్దమ్మగుడి సమీపంలో సంతానం లేని మహిళ భక్తులు ఊయ్యాలతొట్టి కట్టే 63 ఏళ్ల నాటి వృక్షం (రావిచెట్టు) గాలివానకు నేలకూలింది. దీంతో ఆలయ ప్రాంగణంలో రేకులషెడ్ పైన చెట్టుకొమ్మలు పడి దెబ్బతిన్నాయి. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయం వద్ద 1963లో నాటిన వేప, రావిచెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. ఈ రెండు కలిసి ఉన్న చెట్టును అశ్వాత్థామ వృక్షంగా భావించి ఏటా అశ్వత్థామ కల్యాణం నిర్వహిస్తారు. ఈ వృక్షం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక గద్దెను నిర్మించి, దాని చుట్టూ స్టీల్ రెయిలింగ్ను నిర్మించారు. శనివారం రాత్రి భారీగా గాలివానకు వృక్షం నేలకూలింది. వేపచెట్టు అలాగే ఉంది. చెట్టు కొమ్మలు పడటంతో షెడ్ కొంతభాగం దెబ్బతిన్నది. స్టీల్ రెయిలింగ్ ఒకవైపు విరిగిపోయింది. రాత్రి కూలిపోడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అదే పగలు అయితే, పెనుప్రమాదం సంభవించి ఉండేది. ఆదివారం ఉదయం చెట్టుకొమ్మలను సిబ్బంది తొలగించారు. గాలివాన బీభత్సం పాల్వంచ/పాల్వంచరూరల్: శనివారం రాత్రి పట్టణంలోని కాంట్రాక్టర్స్కాలనీ, హమాలీకాలనీ, రాంనగర్, పేటచెరువు, శేఖరం బంజరతోపాటు మండలంలోని జగన్నాథపురం, తోగ్గూడెం, నాగారం, పాండురంగాపురం, రంగాపురం, నాగారం, సూరారం, గ్రామాల పరిధిలో భారీ చెట్లు నేలకూలాయి. 23 విద్యుత్ స్తంభాలు కూలి పోగా విద్యుత్వైర్లు తెగిపోవడంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రూరల్ ఏఈ రవీందర్ సిబ్బంది సహకారంతో కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తోగ్గూడెంలో పలు నివాసాలపై చెట్లు కూలగా ఇండ్లు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షానికి స్వల్పంగా తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి. -
జీవాలే నేస్తాలు
బాహ్య ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో పెరిగే కొండరెడ్డి చిన్నారుల జీవనశైలికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకోవడానికి అనేక సౌకర్యాలు, సామగ్రి అందుబాటులో ఉంటాయి. కానీ కొండరెడ్ల చిన్నారులు మాత్రం అవేమీ లేక మేకపిల్లలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదే సమయాన పెద్దలంతా పనికి వెళ్తే వీళ్లే మేకల పిల్లలను సంరక్షిస్తున్నట్లవుతుంది. అశ్వారావుపేట మండలంలోని కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిలో ఈ దృశ్యం కనిపించింది. – అశ్వారావుపేటరూరల్ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పాల్వంచ: మూడు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని నవభారత్ గాంధీనగర్కు చెందిన జట్పట్ ఎల్లయ్య (55)కు, తన భార్య లక్ష్మికి 25 ఏళ్ల కిందట విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం అతను ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గుర్తించి శ్రీనివాసబంజారా కాలనీలో ఉంటున్న చెల్లెలు మహాలక్ష్మికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని నిర్ధారించుకున్నారు. అతను గుండెపోటుతో మరణించాడా, లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నాగరాజు కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్యఇల్లెందురూరల్: పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన రమణారెడ్డి (50) ఆదివారం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. దివ్యాంగుడైన రమణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడం, భార్య, పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్ తెలిపారు. అశ్వారావుపేటలో.. అశ్వారావుపేటరూరల్: ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఎస్ఐ అఖిల కథనం ప్రకారం.. అశ్వారావు పేట మున్సిపాలిటీ పరిధిలోని ఫైర్కాలనీకి చెందిన భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి (రెడ్డిబాబు) (52) కొన్నేళ్లుగా హైదారాబాద్లో సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసవడంతో కుటుంబీకులు మందలించారు. వారంరోజుల క్రితం ఫైర్కాలనీలో స్వగృహానికి వచ్చాడు. శనివా రం రాత్రి తన కుమారుడు సతీశ్రెడ్డికి ఫోన్ చేసి తాను చనిపోతానని చెప్పడంతో వారు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంట్లో టీవీ చూస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. మృతుడి కి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు సతీశ్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలిక అదృశ్యం చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు శివారు ఎర్రబోడుకు చెందిన బాలిక (17) కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాకు చెందిన బాలిక బెండాలపాడు శివారులోని ఎర్రబోడులో ఉండే మేనమామ వద్దకు ఆరు నెలల కిందట వచ్చింది. ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లింది. కానీ, ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరకపోగా తిరిగి ఇక్కడకు రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వివరించారు. -
పసిబిడ్డకు ప్రాణం పోయండి..
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న నెల చిన్నారి ● దాతల సాయం కోసం తల్లిదండ్రుల వినతిఅశ్వారావుపేటరూరల్: అరుదైన వ్యాధితో ఓ పసిబిడ్డ నిత్యం మృత్యువుతో పోరాడుతోంది. ఆ వ్యాధి నుంచి పసిప్రాణాన్ని కాపాడుకునేందుకు నిరుపేద కుటుంబం పెద్దస్థాయిలో ఖర్చు పెట్టలేక మనోవేదనకు గురవుతున్నారు. వైద్యానికి రోజుకు లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆర్థిక స్థోమత లేక దాతల సాయం కోసం చూస్తున్నారు. అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన హేమలత – వినోద్ దంపతులకు నెలరోజుల క్రితం కుమార్తె జన్మించింది. కాగా, పుట్టిన నవజాత శిశువు అనారోగ్యానికి గురి కావడంతో హైదారాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు పరీక్షించి చిన్నారికి మొదడువాపుతోపాటు రక్తంలో ఇన్ఫెక్షన్, గుండె సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. ఖరీదైన వైద్యం అందించడంతో ఇప్పటిదాకా రూ.6లక్షలు ఖర్చు కావడంతో పాటు రోజుకు లక్షల్లో ఖర్చు అవుతున్నట్లు పసిబిడ్డ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన వినోద్ మిషన్ భగీరథలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో ఖరీదైన వైద్యాన్ని భరించలేక, పసిబిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దాతల సాయం కోసం తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్యంకోసం ఇప్పటికే రూ.ఆరు లక్షలు ఖర్చు చేశామని, రోజుకు రూ.లక్ష దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. పసి ప్రాణాలను కాపాడుకునేందుకు సా యం చేసే చేతులు, మానవతా వాదుల కోసం ఎదురుచూస్తున్నారు. పసిబిడ్డ వైద్యానికి సాయం అందించే దాతలు 80963 19456 (ఫోన్ పే) నంబర్లో సంప్రదించవచ్చు. -
సెంట్రల్ లైటింగ్కు మోక్షమేది?
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా గుర్తింపు, నాలుగు రాష్ట్రాల ప్రజలకు కూడలి, సుమారు లక్ష మంది జనాభా కలిగిన భద్రాచలం సెంట్రల్ లైటింగ్కు నోచుకోవడంలేదు. ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. పట్టణంలో బ్రిడ్జి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సుమారు అర కిలోమీటర్ మేర సెంటల్ర్ లైటింగ్ ఉంది. అక్కడి నుంచి చర్ల రోడ్డులో తెలంగాణ శివారు ప్రాంతమైన రాజుపేట వరకు, కూనవరం రోడ్డులో ప్రస్తుతం కరకట్ట నిర్మాణం వరకు సెంట్రల్ లైటింగ్ నిర్మించాల్సి ఉంది. చర్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. రెండు కోట్లు ప్రకటించారు. పనులకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే రోజు 2023, సెప్టెంబర్ 9న ఉదయం నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాగా, పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అదే సెంట్రల్ లైటింగ్ పనులకు 2025, జూలై 7న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇలా ఇద్దరు మంత్రులు రెండు ప్రభుత్వాల్లో శంకుస్థాపనలు చేసినా పనులు మాత్రం చేపట్టలేదు. అంబేద్కర్ సెంటర్లో పక్కపక్కనే ఉన్న రెండు శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. మరింతగా పొడిగిస్తే.. గతంలో అంబేద్కర్ సెంటర్ నుంచి చర్ల రోడ్డు వైపు 800 మీటర్ల మేర టెండర్ ఖరారు చేశారు. సెంట్రల్ లైటింగ్ను, డివైడర్లను మరింత దూరం పొడిగించాలని, కూనవరం రోడ్డులో ప్రస్తుతం నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతం వరకు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. డివైడర్ పొడిగిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఐటీడీఏ రోడ్డులో పురుషోత్తపట్నం శివారు ప్రాంతం వరకు రోడ్డును విస్తరించి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణమెప్పుడో..? ఎన్నికల హామీ మేరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. భద్రాచలం నియోజకవర్గంలో 169 పనులకు గాను రూ.14.50 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ ఫండ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు అభివృద్ధి పనుల వేగవంతానికి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని నాటి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇందులో భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 2 కోట్లు, చర్ల మండలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.50 లక్షలు, వెంకటాపురం మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ.50 లక్షలను ప్రకటించారు. వీటిపై అడపాదడపా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పనులు మాత్రం ప్రారంభమే కాలేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని భద్రాచలంవాసులు కోరుతున్నారు. -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.25,370 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,632 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రజావాణికి అధికారులు హాజరు కావాలిభద్రాచలంటౌన్: భద్రాచలం డివిజన్స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భూ సమస్యలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులతో రావచ్చునని పేర్కొన్నారు. -
నాడు కొత్తగూడెమే టాప్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నడుస్తోంది. 2021లో జరగాల్సిన గణన ఐదేళ్లు ఆలస్యంగా మొదలైంది. నేటి నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. అయితే, తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జనగణన 1961లో జరిగింది. అప్పటి విశేషాలు, ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఏడు తాలూకాలతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ (కొత్తగూడెం) తాలుకాలు ఉన్నాయి. ఆ తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం, నుగూరు తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో చేర్చారు. భద్రాచలం, నుగూరు (వాజేడు, వెంకటాపురం మండలాలతో కూడిన ఉప తాలూకా)లు పూర్తిగా ఏజెన్సీ తాలూకాలుగా ఉండేవి. పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జన గణన 1961లో జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాభా 10,57,542గా తేలింది. 1990 వరకు అప్రతిహతంగా గూడెం అభివృద్ధి 1960 నుంచి 1990 వరకు కొత్తగూడెం పట్టణం అప్రతిహతంగా అభివృద్ధి పథంలో నడిచింది. కిన్నెరసాని ప్రాజెక్ట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ల రాకతో పాల్వంచ సరికొత్త పట్టణంగా రూపాంతరం చెందింది. స్పాంజ్ ఐరన్, ఏపీ స్టీల్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కిన్నెర స్టీల్స్, బేరియం ఫ్యాక్టరీ, మైలారం రాగి గనులు, నవభారత్ వంటి ప్రైవేటు రంగ సంస్థలతో 90వ దశకం నాటికి ఖమ్మంపై కొత్తగూడెం అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. మరోవైపు సింగరేణి గనుల కారణంగా కొత్తగూడెం, ఇల్లెందుకు తోడుగా మణుగూరు కూడా పట్టణ ప్రాంతంగా వృద్ధికి వచ్చింది. పేపర్ బోర్డు కారణంగా సారపాక–భద్రాచలం, ఉద్యాన పంటల కారణంగా అశ్వారావుపేట పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదిగాయి. 90వ దశకం నుంచి దూసుకెళ్తున్న ఖమ్మం ఆర్థిక సంస్కరణలు 1990లో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అప్పటికే ఉన్న గ్రానైట్, ఆగ్రో ఇండస్ట్రీస్, మార్కెట్లు ఖమ్మం అభివృద్ధికి తోడ్పడ్డాయి. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు ఏరియాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడం, 1/70 చట్టం కారణంగా ఇక్కడున్న ఉద్యోగులు, కార్మికులు సొంతిళ్లు కట్టుకునేందుకు ఖమ్మమే అనువైన ప్రాంతంగా కనిపించింది. వెరసి ప్రస్తుతం ఖమ్మం నగర జనాభా (మున్నేరు ఆవల కలుపుకుని) దాదాపు నాలుగు లక్షలకు మించింది. తెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. నిజామాబాద్, కరీంనగర్లకు గట్టిపోటీ ఇస్తోంది.1953లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆవిర్భావం జనగణన–1961 జరిగే సమయానికి కొత్తగూడెం పట్టణం ఇటు జనాభా, అటు విస్తీర్ణం పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీ 69,728 మంది జనాభాతో క్లాస్–2 మున్సిపాలిటీ ఉండగా, ఖమ్మం 35,888 జనాభాతో క్లాస్–3 మున్సిపాలిటీగా ఉంది. ఖమ్మానికి పాలక మండలి ఉండగా, కొత్తగూడేనికి లేదు. ఆ తర్వాత ఇల్లెందు 10,955 మంది జనాభాతో క్లాస్–4 మున్సిపాలిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక మున్సిపాలిటీ కేటగిరిలోకి రాకుండా 6,059 జనాభాతో మధిర, 5,740 జనాభాతో భద్రాచలం పట్టణ ప్రాంతాలుగా నిలిచాయి. -
ఇక మొదలుపెడదామా..!
● జనగణన సర్వేకు వేళాయె.. ● మొదటి మూడు రోజులు బ్లాక్ల్లో కుటుంబాల గుర్తింపు ● జిల్లాలో విధులు నిర్వర్తించనున్న 1,780 మంది సిబ్బంది ● పర్యవేక్షణకు సూపర్వైజర్లు, నోడల్ ఆఫీసర్లుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో జనగణనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రెండు దశల్లో గణన చేపట్టనుండగా. తొలిదశ సోమవారం మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో 200 నుంచి 250 ఇళ్లను కలుపుతూ బ్లాక్లుగా గుర్తించి మ్యాపింగ్ పూర్తిచేశారు. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనున్నారు. గతంలో మాదిరి మాన్యువల్గా కాకుండా ఈసారి వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు తొలి మూడు రోజులు హౌస్ లిస్టింగ్ బ్లాక్లను పరిశీలించనున్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్లో ఉన్న కుటుంబాల సంఖ్య, వివరాలను నమోదు చేసుకుంటారు. స్వీయగణన జనగణనలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈమేరకు వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురాగా.. ఆదివారం రాత్రి 11–59 గంటలకు గడువు ముగిసింది. ఇప్పటికే పలు కుటుంబాలు స్వీయ గణన చేసుకున్నాయి. ప్రత్యేక యాప్ జనగణన వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ సెన్సెస్–2027 పేరుతో యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో ఎన్యుమరేటర్లు తాము సర్వే చేసిన కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆదివారం అర్ధరాత్రి 11–59 గంటల తర్వాత ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చే ఈ యాప్ను సోమవారం ఉదయం ఎన్యుమరేటర్లు ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆతర్వాత ఎన్యుమరేటర్కు కేటాయించిన ఐడీతో పాస్వర్డ్ రూపొందించుకుని వివరాల నమోదు ఆరంభించాల్సి ఉంటుంది. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీవ్రమైన ఎండల నేపథ్యాన సర్వే ఉదయాన్నే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సిబ్బంది అస్వస్థతకు గురైనా, ఎవరైనా గైర్హాజరైనా ఆ ప్రాంతంలో సర్వే నిలిచిపోకుండా రిజర్వ్గా ఉన్న ఎన్యుమరేటర్లను కేటాయించేలా మానిటరింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.జిల్లాలో జనగణనకు సంబంధించి ఇప్పటికే బ్లాక్లను ఏర్పాటు చేయగా, సర్వే కోసం 1,780 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 40 మంది నోడల్ అధికారులు కాగా, 1,615 మంది వరకు ఎన్యుమరేట్లర్లు, మరో 125 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ నియమించారు. తొలి దశలో 31 ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరు ఉన్నా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే వచ్చే నెల 9వ తేదీ వరకు జరగనుండగా, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
ఘనంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రగిరి క్షేత్రంలో గోదావరి నదీ తీరం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమికి ఆదివారం నిర్వహించిన నదీహారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత గణపతి పూజ నిర్వహించి, అనంతరం దీపోత్సవం చేపట్టారు. భక్తులు వెలిగించిన దీపాలతో గోదావరి మాతకు, శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిన్నారుల భరత నాట్య ప్రదర్శన అలరించింది. కుంచాల రాజశేఖర్ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ సభ్యులు పూజా సామగ్రిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజ్జుల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, తేజశర్మ, కృష్ణశర్మ పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆదివారం మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి విద్యా వారోత్సవాలుకొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి విద్యావారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రోజు పీఎం శ్రీ, కేజీబీవీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణ, ఇంటర్మీడియట్ రెమిడియల్ క్యాంపులు, పాఠశాల విద్యపై సర్పంచ్లకు వర్క్షాపు, జయశంకర్ బడిబాట, లైబ్రెరీ డే, ఆర్ట్, క్రాఫ్ట్ సాంస్కృతిక దినోత్సవం, చివరి రోజు విద్యా దినోత్సవం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమాల విజయవంతానికి నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమించినట్లు తెలిపారు. నేటి నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలుఇల్లెందు: ఏఐయూకేఎస్ జాతీయ ప్రథమ మహాసభలు 11, 12, 13 తేదీలలో ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ రంగయ్య తెలిపారు. ఆదివారం ఇల్లెందులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. మొదటి రోజు సాయంత్రం ఇల్లెందు జేకే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరు వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలులో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. జాతీయ మహాసభలను జయప్రదం చేయాలిరుద్రంపూర్: ఈ నెల 11 నుంచి ఇల్లెందులో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ కోరారు. ఆదివారం చుంచుపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. నాయకులు పి.సతీష్, ఎం.రాజశేఖర్, చుక్కయ్య, అడమా, సందీప్, చంటి, మంగయ్య తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు అంజన్నకు రామయ్య పట్టు వస్త్రాలు..భద్రాచలంటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ఈఓ కే. దామోదర్ రావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాలు రెడీ..
● 50శాతం సబ్సిడీతో నేటి నుంచి పంపిణీ ● సహకార సంఘాలు, ఆగ్రోస్ సంస్థల ద్వారా సరఫరా ● ఉమ్మడి జిల్లాలో 18,440 క్వింటాళ్లకు ఇండెంట్ఖమ్మంవ్యవసాయం: పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. సేంద్రియ విధానంలో భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట సాగు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలుగా వినియోగించే వరి, అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నుతారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. ఈమేరకు ఏటా మాదిరిగానే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అటు సబ్సిడీ.. ఇటు ధర భారం పచ్చిరొట్ట విత్తనాలకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఈ విధానంలో జీలుగు, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అయితే, పచ్చిరొట్ట విత్తనాల ధరలు మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ధరలు పెరగడంతో రైతులకు అంతగా ప్రయోజనం కలగటం లేదు. విత్తన ధర క్వింటాకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా, సబ్సిడీ పోగా రైతులు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు రైతులు రసాయన ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువగా జీలుగు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 18,340 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ఇండెంట్ పెట్టారు. అధికంగా 16వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరమని అందులో పేర్కొన్నారు. అలాగే, జనుము 1,760 క్వింటాళ్లు, పిల్లి పెసర 680 క్వింటాళ్లకు అవసరమని తెలిపారు. ప్రస్తుతం విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 500 క్వింటాళ్ల జీలుగు, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉండగా, పంపిణీ చేస్తుంటే దశల వారీగా చేరనున్నాయి. ఈ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా సోమవారం నుంచి పంపిణీకి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 75 సహకార సంఘాలు, ఏడు ఆగ్రోస్ రైతు సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లాలో 20 సహకార సంఘాలు, రెండు ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఈ విత్తనాలను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంది.వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ మేరకు పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే విత్తనాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాం. ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు సిద్ధంగా ఉంటాయి. – ఎన్.భిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్ -
●అమ్మ చేసే పప్పుచారు.. చాలా ఇష్టం
● మట్టా హరికుమారి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్సూపర్బజార్(కొత్తగూడెం): అమ్మ చేసే పప్పుచారు అంటే చాలా ఇష్టం. నేను ఎంత ప్రయత్నించినా అంత రుచిగా చేయలేకపోతున్నాను. ఆడపిల్ల పుట్టిందని అమ్మ ఎప్పుడూ చింతించలేదు. నేను ఏ పని చేసినా అమ్మ ఇచ్చిన ధైర్యంతో చేశాను. నాలో పట్టుదల, దృఢ సంకల్పానికి, చదువులో రాణించడానికి, జీవితంలో స్థిరపడటానికి కారణం మా అమ్మే. అందుకే అమ్మను మించి దైవం లేదంటారు. అమ్మ త్యాగాన్ని, గొప్పతనాన్ని వర్ణించలేం. అమ్మ రుణాన్ని తీర్చుకోలేను. -
●అందరి సహకారం ఉంది..
● తాళ్లపల్లి శిరీష, కొత్తగూడెం కార్పొరేషన్ ఉద్యోగి కొత్తగూడెం అర్బన్: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెబుతున్నారు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి శిరీష. పిల్లల పోషణ, కుటుంబ నిర్వహణతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం ఎవరికై నా భారంగానే ఉంటుందని తెలిపారు. అయితే, ఇంట్లో భర్తతో పాటు కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల సహకారంతో భారం తగ్గి పనులు సులువుగా చేసుకోగలుగుతున్నానని వెల్లడించారు. పది నెలల పాపను, ఎల్కేజీ చదివే అబ్బాయిని చూసుకుంటూనే ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి తన భర్త కూడా సమయం కేటాయించి పనుల్లో సాయం చేయడం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో వీఆర్ఓగా సుజాతనగర్ మండలంలో పనిచేసినప్పుడు ఆరు నెలల కుమారుడిని తనతో పాటే తహసీల్కు తీసుకెళ్లి పనిచేసినా అధికారులు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అందరి నుంచి సహకారం ఉన్నప్పటికీ సమాజంలో ఇంకొంత మార్పు రావాలని, కష్టపడుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను గుర్తించాలని తెలిపారు.అమ్మ అంటే ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు.. బాధ్యత, ఓర్పు, త్యాగానికి మరో పేరు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఉద్యోగ రంగంలోనూ రాణిస్తున్నారు. కచ్చితమైన పనివేళలు కాకుండా ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉండే ఉద్యోగాలను సైతం మహిళలు ఎంచుకుంటున్నారు. ఈక్రమాన ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఉద్యోగం – కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కొందరు మహిళా ఉద్యోగుల పరిచయం. -
●అమ్మ కష్టం చూసే ఉన్నతస్థాయికి..
● డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ సూపర్బజార్(కొత్తగూడెం): అమ్మ కష్టం చూశాకే ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో అదనపు కలెక్టర్ స్థాయికి ఎదిగాను. మాది పేద కుటుంబం. మా తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. నాన్న రైల్వేలో టెంపరరీగా పని చేసేవారు. చాలీచాలని జీతం కావడంతో నాన్నకు తోడుగా అమ్మ అశోక బిస్కెట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేసింది. అమ్మకు కూలీ రోజుకు 8 రూపాయలు. ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లల్ని స్కూల్కు తయారు చేసి రోజూ ఉదయం 8 గంటలకు కంపెనీకి వెళ్లి రాత్రి 8 గంటలకు వచ్చేది. ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా కష్టపడి మమ్మల్ని చదివించింది. అమ్మ బాధను చూసి మేమందరం బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాం. దేవుళ్లంటే అమ్మకు భక్తిభావం ఎక్కువ. భద్రాచలం రాముడంటే మిక్కిలి ఇష్టం. రామకోటి కూడా రాసి సమర్పించింది. నడవడానికి ఇబ్బందిగా ఉన్నా అన్ని దేవాలయాలు తిరగాలన్నది అమ్మ కోరిక. అందుకే వీలున్న సమయంలో నేనే దగ్గర ఉండి దేవాలయాలను చూపిస్తున్నాను. -
●అమ్మ స్ఫూర్తితోనే ఐపీఎస్
● బి.రోహిత్రాజు, ఎస్పీసూపర్బజార్(కొత్తగూడెం): అమ్మ తొలి గురువని అంటారు. నా విషయంలో అది అక్షర సత్యం. సహజంగానే పోలీస్ కుటుంబం నుంచి రావడంతో నాలో మొదటి నుంచి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలనే తపన ఉండేది. ఈ సంకల్పానికి ఊతమిచ్చింది అమ్మ. నాన్న కానిస్టేబుల్గా పని చేస్తూ ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. అమ్మ నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కలలు కనేది. నాలో కూడా ఇదే కోరిక బలంగా నాటుకుంది. నా చదువులో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. అనుక్షణం నాకు మనోధైర్యాన్ని ఇస్తూ నేను ఐపీఎస్ కావడానికి ఇచ్చిన సహకారం ఎంతో ఉంది. అందుకే అమ్మమాటను ఎప్పుడు జవదాటే వాడిని కాదు. జన్మనివ్వడమే కాకుండా నాకు మంచిమార్గం చూపుతూ ఈస్థాయికి ఎదగడానికి కారణమైన అమ్మ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. -
●వెన్నుతట్టి ప్రోత్సహించి.. ఉన్నతస్థానంలో నిలిపి..
ఇల్లెందురూరల్:పిల్లలు పాఠశాల దశలో ఉండగానే భర్త మృతి చెందినా ధైర్యం కూడగట్టుకుని పిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ చక్కగా చదివించి ఉన్నత స్థానంలో నిలిపింది ఆవుల ఉమారాణి. ఇల్లెందు మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త చనిపోయే నాటికి వారిద్దరు పాఠశాల చదువులోనే ఉన్నారు. ఉమారాణికి తాను చేస్తున్న ఉద్యోగం తప్ప మరే ఆలంబన లేకపోవడంతో పిల్లలు దిగులు చెందారు. వారికి ధైర్యం చెప్పి తండ్రి ఆశయాలు నెరవేర్చాలని నూరిపోసింది. తల్లిమా ట జవదాటకుండా పెద్దకుమార్తె బిందు కౌటిల్య జర్మనీలో ఎంఎస్, చిన్నకుమార్తె హిమకర్షిత హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఎంతో ఆదర్శప్రాయమని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉమారాణి పేర్కొంది. -
●కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు
ఇల్లెందురూరల్: అటవీ శాఖ ఇల్లెందు రేంజ్లో ఇస్లావత్ సత్యవతి బీట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అడవిలో విధులు నిర్వర్తించడం, వన్యప్రాణుల నుంచి కాపాడుకోవడం, అటవీ సంపదను రక్షించడం ఒక మహిళకు కత్తిమీద సామే. అయినా అలాంటి విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న సత్యవతి కుటుంబాన్ని సైతం చక్కగా తీర్చిదిద్దుకుంటోంది. ఉదయమే విధులకు హాజరయ్యేందుకు తాను సిద్ధమవుతూనే పాఠశాలకు వెళ్లే పిల్లలను సిద్ధం చేస్తుంది. ఇలా ఒకే సమయంలో పిల్లలు, వ్యవసాయ పనులకు వెళ్లే భర్త మనోజ్ను సిద్ధం చేసి తాను విధులకు హాజరవుతోంది. రోజంతా విధుల్లో శ్రమించినా సాయంత్రం ఆ అలసట తనలోనే దాచుకొని పిల్లలను చదివిస్తూ నిర్ధేశించుకున్న లక్ష్యం దిశగా భర్త సహకారంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టం ఎదురైనా కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లలా భావిస్తానని సత్యవతి చెబుతోంది. -
●సమన్వయంతో సంతోషం
● తడికెళ నవ్యజ్యోతి, కేఎంసీ డీఈ ఖమ్మంమయూరిసెంటర్: ఇంట్లో గృహిణిగా, అమ్మగా, ఉద్యోగినిగా పలువురు మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డీఈ తడికెళ నవ్యజ్యోతి వెల్లడించారు. కుటుంబంపై ప్రేమ, సమాజంపై బాధ్యతే మహిళా ఉద్యోగులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే తాను కుటుంబంతో, బాధ్యతల పరంగా కార్యాలయంలో సజావుగా పని చేయగలుగుతున్నానని చెప్పారు. విధుల నిర్వహణ సమయాన అక్కడి సమస్యలే తన దృష్టిలో ముఖ్యమని, ఇంటికి వెళ్లాక మాత్రం పిల్లలు, భర్త, కుటుంబమే సర్వస్వమని తెలిపారు. ఇలా ప్రతీఒక్కరూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చని వెల్లడించారు. ‘అమ్మ’ అనే పదంలో అపారమైన ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత దాగి ఉన్నాయని.. ప్రతీ కుటుంబానికి అమ్మ ఒక బలమైన ఆధారమని చెప్పారు. తాను సైతం ఆమె స్ఫూర్తితోనే ఉద్యోగం, కుటుంబ జీవనంలోనూ రాణిస్తున్నట్లు తెలిపారు. -
‘లాడ్జీలు’ నిబంధనలు ఉల్లంఘించొద్దు..
ఎస్పీ రోహిత్రాజు హెచ్చరికసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో లాడ్జీల యజమానులు నేరాలు నియంత్రించడంలో సహకరించాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొత్తగూడెం ఐఎంఏ ఫంక్షన్ హాలులో శనివారం లాడ్జీల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాటించాల్సిన సూచనలు.. ప్రతి అతిథి నుంచి ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) తీసుకోవాలి. లాడ్జీలో చేరే వారి పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, వచ్చిన సమయం, వెళ్లే సమయాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలి. గదుల్లో ఉన్న వారిని కలవడానికి వచ్చే విజిటర్లను నేరుగా లోపలికి పంపకూడదు. రిసెప్షన్ వద్ద వారి వివరాలు, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలి. విదేశియులు ఎవరైనా లాడ్జిలోకి వస్తే వారి వివరాలు 24 గంటలలోపు ఆన్లైన్ ద్వారా (ఫామ్–సీ) పోలీసులకు అందించాలి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రిజిస్టర్లోని సమాచారం, గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలను సంబంధిత పోలీస్స్టేషన్లో అందించాలి. ఎంట్రన్స్,రిసెప్షన్, కారిడార్, బయటవైపు రోడ్డు కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని కనీసం 30 రోజుల వరకు భద్రపరచాలి. అనుమానాస్పదంగా అనిపించే లగేజీని తనిఖీ చేయాలి. అధిక మొత్తంలో బ్యాగులు లేదా అనుమానిత వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా లేదా తప్పుడు వివరాలు ఇస్తున్నారని అనిపించినా, లాడ్జి గదుల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా. అపరిచిత వ్యక్తులు గ్రూపులుగా వచ్చి బస చేసినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. స్థానిక పోలీస్ స్టేషన్, ఎహెచ్ఓ నంబర్లను రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచాలి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నపుడు వారికి సహకరించాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. రిసెప్షన్ డెస్క్ కింద అత్యవసర అలారం ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదం లేదా గొడవ జరిగినప్పుడు దాన్ని నొక్కితే పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్లేలా ఉండాలి. సిబ్బంది వివరాలు, పూర్వాపరాలను పోలీస్ వెరిఫికేషన్ చేయించాలి. సెక్యూరిటీ గార్డులను గుర్తింపు పొందిన ఏజెన్సీకి చెందిన వారిని నియమించాలి. -
●త్యాగానికి ప్రతిరూపం
సూపర్బజార్(కొత్తగూడెం): అన్నదమ్ములను ఉమ్మడి కుటుంబంగా చూశాం. కానీ ఇక్కడ అక్కచెల్లెళ్లను ఉమ్మడి కుటుంబంగా ఆదరించిన మాతృమూర్తి గాజునబోయిన బుచ్చమ్మ. ఒంటి పూట భోజనం చేస్తూ ఇప్పటికీ 95 సంవత్సరాల వయసులో కూడా ఇంకా అమ్మ ప్రేమను పంచుతున్నారు. తన చెల్లి 1979లో అనారోగ్యంతో మృతి చెందగా, భర్త కనకయ్య సహకారంతో తన కుమారుడితోపాటు చెల్లికి ఉన్న ముగ్గురు కుమారుల బాధ్యతను భుజాన వేసుకుంది. వారి చదువులు, ఆరోగ్యం విషయంలో ఆస్తులు కోల్పోయింది. తన కుమారుడితోపాటు చెల్లి పిల్లలకు ఎలాంటి తనపర భేదం లేకుండా చదువులు చెప్పించి ప్రయోజకులను చేసింది. అక్ష్యరాస్యత లేకపోయినా అమ్మతనానికి, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచింది. -
ఆలన.. పాలన
● కుటుంబ – ఉద్యోగ బాధ్యతల్లో మహిళామణులు ● రెండింటిని సమన్వయం చేస్తూ ముందడుగు ● సహోద్యోగులు, కుటుంబం అండగా నిలిస్తే మేలని భావన నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం●ఖాకీ చొక్కా చాటున మాతృత్వం ● సంకీర్తన, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కరకగూడెం: కరకగూడేనికి చెందిన సంకీర్తన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తూనే, తన మూడేళ్ల కుమారుడు రుద్రాన్ష్ గౌడ్ పెంపకంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. యూనిఫామ్ ధరిస్తే విధినిర్వహణలో.. ఇంటికి వెళ్లగానే ఆప్యాయత పంచే తల్లిగా ఆమె పాత్ర పోషిస్తారు. రైల్వే రక్షణ రంగం అంటే నిర్ణీత వేళలు ఉండకపోగా అర్ధరాత్రి అయినా, పండుగ రోజైనా అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ‘కొన్ని సందర్భాల్లో కుమారుడిని వెంట తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు సమాజం సరైన ప్రోత్సాహం.. భర్త, అత్తమామల సహకారం ఉంటే వృత్తిపరంగా మరింత ఎత్తుకు ఎదుగుతారు. అంతేకాక ప్రజాసేవలో భాగస్వాములవుతున్న మహిళల కష్టాన్ని గుర్తించి గౌరవించే సమాజం కావాలి’ అని సంకీర్తన ఆకాంక్షించారు. -
ముగిసిన సమ్మర్ క్యాంప్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలోని మోడల్స్పోర్ట్స్ స్కూ ల్లో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి క్రీడాశిక్షణ శిబిరం శనివారం ముగిసింది. గత నెల 25న క్యాంప్ ప్రారంభించారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్లో శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఏసీఎంఓ కీసర రమేష్ మాట్లాడుతూ శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం.చందు, ఏఎస్ఓ ఎస్.కొమరం వెంకటనారాయణ, ఎస్.నాగేశ్వరరావు, ఎన్.బాబూరావు, పీఈటీ అంజి, కోచ్లు వాసు, ప్రసా ద్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.11న కొత్తగూడెంలో జాబ్మేళారుద్రంపూర్: నిరుద్యోగులకు ఈ నెల 11న కొత్తగూడెంలోని సీఎస్ఐ చర్చి కాంప్లెక్స్ (పోస్టాఫీస్ ఏరియా) వద్ద జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. కొత్తగూడెంలోని ఫ్యూచర్ ఎమర్జింగ్ టెక్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 43 ఉద్యోగా లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 21 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగిన ఐటీఐ, డిగ్రీ, ఇంటర్, డిప్లొ మా, ఎంబీఏ చదివిన నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. నిజాయితీ చూపిన భక్తుడుభద్రాచలం: మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణం దొరికినా దేవస్థానం అధికారులకు అప్పగించి నిజాయితీ చూపాడు ఓ భక్తు డు. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దర్శనానికి రాజమండ్రి నుంచి వీర బ్రహ్మానంద స్వామి వచ్చి, దర్శనం సమయంలో బ్రాస్లెట్ను పోగొట్టుకున్నాడు. అది కొత్తగూడేనికి చెందిన వెంకటేశ్వర్లుకు దొరికింది. దీనిని భద్రాచలానికి చెందిన జి.వెంకటేశ్వరరావు సహకారంతో దేవస్థానం అధికారులకు అందించగా, వారు బాధితుడికి అందజేశారు. దొరికిన ఆభరణం అప్పగించినందుకు వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా అభినందించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలికలెక్టర్ అంకిత్ కొత్తగూడెంఅర్బన్: ఽదాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. అనంతరం అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దన్నారు. ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సెన్సస్ కార్యక్రమంపై సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ప్రేమ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ పాల్గొన్నారు. -
కోతకు గురైన నూతన వారధి
● సారపాక వైపు దెబ్బతిన్న గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు ● నిలిచిన రాకపోకలు.. పాత వంతెనపైకి ట్రాఫిక్ మళ్లింపుభద్రాచలంటౌన్/బూర్గంపాడు: సారపాక–భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జి అప్రోచ్ సారపాక వైపు కోతకు గురైంది. అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి జారిపోవడంతో వంతెనకు, రోడ్డుకు మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. గురువారం రాత్రి గమనించిన నేషనల్ హైవేస్ అధికారులు కొత్త బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలను పాత బ్రిడ్డి పైకి మళ్లించారు. ఒకే బ్రిడ్జిపై రాకపోకలతో వాహనాల రద్దీ పెరిగింది. నిన్నటి వరకు భద్రాచలం వెళ్లే వాహనాలు కొత్త బ్రిడ్జిపై నుంచి, భద్రాచలం నుంచి బయటకు వచ్చే వాహనాలు పాత బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త బ్రిడ్జి అప్రోచ్కు పోసిన మట్టి కోతకు గురికావటంతో మళ్లీ పాత బ్రిడ్జియే రాకపోకలకు దికై ్కంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి ఇప్పటి కూడా ఎక్కడ పెద్దగా దెబ్బతినలేదు. ఏడాది క్రితం నిర్మించిన కొత్త బ్రిడ్జి అప్రోచ్ కోతకు గురికావటంతో పనుల నాణ్యతపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆది నుంచీ విమర్శలే.. కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టగా, పనుల దశ నుంచే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే ఓ పిల్లరు కుంగిపోవడంతో అధికా రులు దానిని తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. తాజాగా అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి పక్కకు జారి పోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పద్ధతిలో రాతి అప్రోచ్ను బలోపే తం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో కుంగిన అప్రోచ్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మట్టి మరింతగా జారిపోయింది. భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద తీవ్రతను గమనించి వంతెన రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
ప్రమాదపుటంచున..
శతాబ్దాల నాటి సింగభూపాలెం చెరువు ● ఆయకట్టు పెంచబోతే అసలుకే ఎసరు వచ్చిన వైనం ● బలహీనపడిన కరకట్ట, తాత్కాలిక రిపేర్లతోనే సరి ● ఇంకా అనుమతుల దశలో మరమ్మతుల ప్రతిపాదనలుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏ చెరువుకు, ఏ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు లేని చరిత్ర సింగభూపాలెం చెరువుకు ఉంది. కాకతీయలు దగ్గర సేనానిగా పని చేసిన సింగభూపాలుడు ఈ చెరువును తవ్వించాడు. జూలురుపాడు పాపకొల్లు అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న కొండలపైనుంచి వర్షపు నీరు చెరువులో చేరేలా నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత నిజాం కాలంలో 1920 తర్వాతనే వైరా, పాలేరు రిజర్వాయర్లు నిర్మించారు. వాటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానం చేయడంతో క్రమంగా ఆ రెండు ప్రాజెక్టులను ఆధునీకరించారు. ఆయకట్టు కూడా పెరిగింది. కానీ సింగభూపాలెం చెరువు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. మిషన్ కాకతీయలో పనులు సింగభూపాలెం చెరువు నీటి నిల్వ సామర్థ్యం 0.45 టీఎంసీలు ఉండగా ఆయకట్టు 2,500 ఎకరాలుగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయకట్టు రెట్టింపు చేసేందుకు మిషన్ కాకతీయ ద్వారా ప్రణాళికలు రూపొందించారు. మిషన్ కాకతీయ ఫేస్–1లో రూ.9.26 కోట్లు కేటాయించారు. ఫేస్–2 వచ్చే సరికి రూ.24 కోట్లకు పెంచారు. చెరువుకు మరమ్మతులు చేపట్టడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. తోగు వాగు ద్వారా వచ్చే నీటిని చెరువులోకి మళ్లించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మత్తడి, కరకట్ట ఎత్తు పెంచారు. ఈ సీజన్లోనూ అంతే సింగభూపాలెం చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్య ధోరణి ఈ సీజన్లోనూ కొనసాగుతోంది. బలహీనపడిన కట్టను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆ మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఇక్కడ పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. చెరువు మరమ్మతుల కోసం రూ.9 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అనుమతులు కూడా వచ్చి నట్టే అని ఇరిగేషన్ విభాగం చెబుతోంది. అయితే, పనులు జనవరి, ఫిబ్రవరిలో మొదలు పెడితే ఈ పాటికి చివరి దశకు వచ్చేవి. కానీ ఇప్పటి వరకు పనులు మొదలే కాలేదు. సింగభూపాలెం చెరువులో మత్స్యకార సొసైటీలు చేపలు పట్టడం పూర్తయిన తర్వాత పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ, టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక తదితర తతంగమంతా పూర్తయ్యే సరికి వానాకాలం వచ్చేస్తుంది. దీంతో ఈ సీజన్లోనూ చెరువు కట్ట పరిస్థితి ప్రమాదభరితంగానే ఉండనుంది.ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ తరహాలో తక్కువ సమయంలో అత్యంత భారీవర్షాలు కురవడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి వాన ల వల్లే అశ్వారావుపేట దగ్గర పెద్దవాగు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు సింగభూపాలెం క్యాచ్మెంట్ ఏరియాలో గడిచిన నాలుగైదేళ్లుగా అతి భారీ వర్షాలు కురవలేదు. దీంతో కట్ట బలహీనంగా ఉన్నా పెద్దగా సమస్యలు రాలేదు. కానీ, బలహీనపడిన కట్ట విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సింగభూపాలెం చెరువు ఎగువ ప్రాంతంలో ఉండగా, దాని దిగువన సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం ఉన్నా యి. దురదృష్టవశాత్తు చెరువుకు గండి పడితే దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలు, నివాస స్థలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు
జూలూరుపాడు: వరి ధాన్యం, మక్కలు కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని (డీసీఓ) ఎ.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జూలూరుపాడు పీఏసీఎస్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, మౌలిక సదుపాయాలు, రవాణా ఏర్పాట్లపై సొసైటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంటా వేసిన మక్కల బస్తాల నిల్వలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో రెండు లారీలను పంపిస్తామని కాంట్రాక్టర్ తెలిపాడు. కాగా, కలెక్టర్ అంకిత్ పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు సుధాకర్, దీపక్ ఆనంద్, తులసీరామ్, అశోక్ యాదవ్, ఆదినారాయణ, ఎన్.వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇద్దరు నిందితులకు జైలు శిక్షభద్రాచలం అర్బన్: సెల్ఫోన్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ శుక్రవారం తీర్పు వెలువరించారు. భద్రాచలం పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన సెల్ఫోన్ చోరీ కేసులో ముద్దాయి బండారు సాయితేజను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం నిందితుడిపై చార్జిషీటు దాఖలు చేయగా, విచారించిన న్యాయస్థానం అతడికి ఏడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. అలాగే బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనకు సంబంధించి 2018లో భద్రాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కొత్తపేట కాలనీకి చెందిన దయామూర్తిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన కారుముగ్గురికి గాయాలు జూలూరుపాడు: ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టిన ఘటన మండలంలోని మాచినేనిపేటతండాలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మండలంలోని వెంగన్నపాలేనికి చెందిన దుద్దుకూరి వెంకటేశ్వర్లు తన ఆటోను మాచినేనిపేటతండా పంచాయతీ కార్యాలయం ఎదుట రహదారి పక్కన నిలిపి ఉంచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. యువతి అదృశ్యంములకలపల్లి: యువతి అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని భగత్సింగ్నగర్ గ్రామానికి చెందిన తాళ్ల తేజస్విని పాల్వంచలోని డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. కాలేజీలో పని ఉందంటూ గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. యువతి తండ్రి కన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. -
స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. సింగరేణిలో ఈ–ఆఫీస్పై శిక్షణకొత్తగూడెంఅర్బన్: ఎస్ఏపీ ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎల్ఎం) అప్లికేషన్ (ఈ–ఆఫీస్)పై సింగరేణి అధికారులకు అవగాహన కల్పించారు. సింగరేణి కార్పొరేట్ పరిధిలోని అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులకు సింగరేణి ప్రధాన కార్యాలయ హెచ్ఆర్డీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం శిక్షణా తరగతులను ప్రారంభించారు. నోట్ ఫైల్స్, సర్క్యులర్స్, డాక్యుమెంట్స్, ఇతర ఆఫీస్ కరస్పాండెన్స్ లెటర్స్ వంటి వాటిని నూతన డిజిటల్ విధానంలో రూపొందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎంలు ఆర్ .విజయప్రసాద్, కవితా నాయు డు, పి.ఎలిషా, మురళీధర్ రావు, ఎం.శ్రీహరి పాల్గొన్నారు. ‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలిఅదనపు కలెక్టర్ విద్యాచందన పాల్వంచరూరల్: ఉపాధి హామీ పథకం పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన ఆదేశించారు. మండల పరిధిలోని జగన్నాథపురం, నాగారం కాలనీల్లో జరుగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరిశీలించి తనిఖీలు చేశారు. పని ప్రదేశంలో స్వయంగా సెల్ఫోన్లో ఫొటో తీసి ఎన్ఎంఎంఎస్ ఫొటోలు అప్లోడ్ చేశారు. కూలీలు రోజూ రూ.307 వరకు వేతనం పొందేలా పనులు చేయాలని సూచించారు. ఏపీడీ రమణారావు, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, ఎంపీఓ చెన్నకేశవులు, జగన్నాథపురం సర్పంచ్ బి.అనిత, ఈసీ కె.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
వీకేసీఎంలో వాటర్ స్ప్రింక్లర్ వాహనం బోల్తా
డ్రైవర్కు తీవ్రగాయాలు రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకేసీఎంలో శుక్రవారం వాటర్ స్ప్రింక్లర్ (క్వారీలో నీరు చల్లే) వాహనం బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో డ్రైవర్ అర్జున్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే డీడీఎంఎస్స్థాయి అధికారి వచ్చేవరకు బోల్తాపడిన వాహనాన్ని అక్కడే ఉంచాల్సి ఉండగా, అతి జాగ్రత్తగా గ్యారేజీకి పంపించినట్లు తెలిసింది. బ్రేకులు ఫెయిలై ప్రమాదం జరిగిందని క్వారీ నిర్వాహకులు చెబుతుండగా, వాహనం ఫిట్నెస్ లేదని, డోర్ లాక్లు పనిచేయడం లేదని, సీటు బెల్ట్ వ్యవస్థ లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఆఫ్లోడింగ్ పనులు చేపడుతున్న ప్రైవేట్ కంపెనీ ప్రారంభం నుంచి కాలంచెల్లిన వాహనాలను వినియోగిస్తోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత బంధువు సంస్థ కావడంతో అఽధికారులు నోరుమెదపడం లేదని పేర్కొంటున్నాయి. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొండగొర్రె మాంసం స్వాధీనంములకలపల్లి: వన్యప్రాణి కొండగొర్రె మాంసాన్ని అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) రవికిరణ్ కథనం ప్రకారం.. తిమ్మంపేట జీపీలోని పుట్టతోగులో కొండగొర్రె మాంసం విక్రయిస్తుండగా అధికారులు దాడి చేశారు. గ్రామానికి చెందిన కోండ్రు కిరణ్ ఇంట్లో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కిరణ్తోపాటు, కట్టం శంకర్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. -
సైకిల్ సవారీ.. గోళీల ఆట!
కరకగూడెం: వేసవి తీవ్రతతో పిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ సెలవుల్లో పిల్లలను ఆపడం వారి వల్ల కావడం లేదు. ఈనేపథ్యాన నీడ పట్టున ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇళ్ల ఆవరణ, చెట్ల నీడలో.. ఉదయం, సాయంత్రం ఆరుబయట ఆటలతో పిల్లలు సందడిగా గడుపతున్నారు. స్నేహితుల సాయంతో.. కొందరు చిన్నారులు సైకిల్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. స్నేహితులు వెనక నుంచి సైకిల్ పట్టుకుంటే భయం భయంగానే పెడల్ తొక్కుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు కింద పడినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సైకిల్ నేర్చుకుంటున్నారు. లక్ష్యసాధన.. పాతకాలపు ఆటలను సైతం పిల్లలు మరువడం లేదు. కొందరు చిన్నారులు నేలపై గీసిన వలయంలో రంగురంగుల గోళీలను పెట్టి లకా్ష్య్న్ని గురి పెట్టి కొడుతూ ఆటలో మునిగిపోతున్నారు. గెలుపోటములను ఆస్వాదిస్తున్న చిన్నారులు కేరింతల మార్మోగుతున్నాయి. ఈ ఆట ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, స్నేహభావం పెరుగుతోందని పెద్దలు చెబుతున్నారు.స్నేహితుల సాయంతో సైకిల్ నేర్చుకుంటున్న బాలుడు గోళీలు ఆడుతున్న చిన్నారులు -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
సుజాతనగర్: వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. వార్డులను పరిశీలించారు. వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు ఇబ్బందుల తలెత్తకుండా చూడాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కలెక్టర్ అంకిత్ అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో సుజాతనగర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఉంటున్నామని, ఇప్పటివరకు ఒక్క గింజ కూడా తరలించలేదని, తూర్పారబట్టే విషయంలో సమస్యలున్నాయని, నల్లపట్టాలు లేవ ని రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణత సాధించాలి పాల్వంచ: సప్లిమెంటరీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా తరగతులను సద్విని యోగం చేసుకుని ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఫెయిల్ అయ్యామని నిరుత్సా హ పడొద్దని, ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో సెన్సస్–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ అంకిత్ హాజరై మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
పుస్తకాలు వచ్చేశాయ్
కొత్తగూడెంఅర్బన్: రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. పాఠశాలలు జూన్ 12వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుండటంతో అదే రోజు విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు. వచ్చిన పుస్తకాలన్నీంటిని పాతకొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్లో భద్రపరిచారు. మరోవైపు సమీపంలో ఉన్న పాఠశాలలకు కూడా చేరవేస్తున్నారు. గతంలో మాదిరి ఈ సారి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైలింగ్వల్ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు వచ్చాయి. తెలుగు, ఆంగ్ల మీడియం రెండింటికి కూడా ఒకే పుస్తకాలు ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు తెలుగు, ఆంగ్లంలో సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్లో ఫెయిల్ కావడం గమనార్హం. మాతృభాషపై మక్కువ పెంచేలా కార్యాచరణ చేపట్టి తెలుగు సబ్జెక్ట్లో వచ్చే ఏడాది అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉందని, నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్, డీఈఓ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఎంత మేరకు ఆచరణలో పెడతారో వేచి చూడాలి. జిల్లాకు చేరిన 88.64 శాతం పాఠ్యపుస్తకాలు 2026–27 విద్యా సంవత్సరానికి 5,05,294 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉండగా, 4,47,916 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 57,378 పుస్తకాలు రావాల్సి ఉంది. మిగిలిన పుస్తకాలు పాఠశాలల పునఃప్రారంభం లోగా చేరుతాయని విద్యాధికా రులు చెబుతున్నారు. వీటితోపాటు గతంలో నోట్ పుస్తకాలను కూడా అందజేసి పేద విద్యార్థులకు తోడ్పాటుగా ప్రభుత్వం నిలిచేది. గతంలో పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలను కూడా జిల్లా గోదాంకు పంపించేవారు. ప్రస్తుతం నోట్ పుస్తకాలను నేరుగా పాఠశాలలకు చేర్చుతున్నారు. కేజీ బీవీలలో ఇంటర్ వరకు కూడా పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు నోట్ పుస్తకాలను సైతం అందజేస్తున్నారు. జిల్లాకు అన్ని తరగతులకు సంబంధించి మొత్తం 72 టైటిల్స్ ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా 8 రకాల టైటిల్స్ పుస్తకాలు రావాల్సి ఉంది. రెండో తరగతికి సంబంధించిన పుస్తకాలు 7,389, నాలుగో తరగతికి సంబంధించిన 7,445, ఆరో తరగతికి సంబంధించి 11,311, ఏడో తరగతికి సంబంధించి 9,326, ఎనిమిదో తరగతికి సంబంధించి 10,625 పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి చేరిన పుస్తకాలను పాఠశాలలకు పంపించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రం చుట్టు పక్కల పాఠశాలలకు ఇప్పటికే చేరాయి. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయనున్నాం. నోటు పుస్తకాలు నేరుగా పాఠశాలలకు చేరుతున్నాయి. –నాగలక్ష్మి, డీఈఓరావాల్సిన మొత్తం పుస్తకాలు : 5,05,294వచ్చినవి : 4,47,916ఇంకా రావాల్సినవి : 57,378 -
‘ఓటరు మ్యాపింగ్’లో తంటాలు!
● 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ప్రక్రియ ● ఓటరు జాబితాలో వివాహితల తల్లిదండ్రుల సీరియల్ నంబర్లు అడుగుతున్న అధికారులు ● వివరాలు పూర్తిగా చెప్పలేకపోతున్న మహిళలు పాల్వంచరూరల్: ఓటరు జాబితా పారదర్శకంగా మార్చేందుకు ఎన్నికల సంఘం ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. జాబి తా కచ్చితత్వం కోసం 2002 ఓటరు జాబి తా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రి య కొత్తగూడెం నియోజకవర్గంలో నెల రోజులు గా కొనసాగుతోంది. ఈ నెల 16 నాటికి పూర్తిచేయాలని గడువు నిర్దేశించారు. దీంతో బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఇటు అధికారులకు, అటు ఓటర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. 2002లో ఎక్కడ ఓటు వేశారో గుర్తురాక ఓటర్లు, ఆ వివరాలు పూర్తిగా సేకరించలేక అధికారులకు తలనొప్పిగా మారింది. 2002 నాటి ఓటరు జాబితా కొందరికి అందుబాటులో లేక నాటి వివరాలు ఓటర్లు చెప్పలేక పోతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టిన ఊరు ఓటరు జాబితాలో పేరు లేకపోతే.. పాల్వంచ మండలంలో ఇప్పటివరకు 60శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తిచేశారు. 2002 తర్వాత పెళ్లి చేసుకుని ఇతర ప్రాంతాల్లో అత్తవారి ఇళ్లకు వెళ్లిన వారి వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలని సూచించా రు. అయితే కొందరు మహిళల పేర్లు అప్ప టి వరకు ఓటర్ల జాబితాలో ఉండకపోవడంతో మ్యాపింగ్లో సమస్యలు తలెత్తున్నాయి. తన పుట్టిన ఊరులోని 2002 ఓటర్ల జాబితా లో తల్లిదండ్రుల పేర్లు, సీరియల్ నంబర్లు తెలుసుకుని ప్రస్తుత నివాసం ఉంటున్న ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫీసర్ల అప్పగించాల్సి ఉంటుంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ మండలం, పట్టణ పరిధిలో మొత్తం 90 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 90మంది బూత్ లెవల్ ఆఫీసర్లు, 9మంది సూపర్వైజర్లు 40 రోజులుగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వివరాలను సేకరిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పుట్టిన ఊరి బీఎల్ఓలను సంప్రదించాలి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేయడానికి అవసరమైన 2002 నాటి ఓటరు జాబితాలు తహసీల్దార్ కార్యాలయం ద్వారా గ్రామ, పట్టణాల్లోని బూత్ లెవల్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ఓటర్లు తమ పుట్టిన ఊరి బీఎల్ఓలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మ్యాపింగ్ ప్రక్రియను తహసీల్దార్, డీటీలు, ఆర్ఐలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా జరుగుతు న్న మ్యాపింగ్ ప్రక్రియలో నిర్దేశించిన సమాచా రాన్ని సేకరించాలి. ప్రధానంగా పెళ్లి అయిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు తప్పనిసరిగా తమ పుట్టిన ఊరి వివరాలు సమర్పించాలి. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే బూత్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఓటర్లు బీఎల్ఓలకు సహకరిస్తే ఓటరు జాబితా మరింత పాదర్శకంగా ఉంటుంది. ప్రజలు సందేహాలు ఉంటే బీఎల్ఓలకు సంప్రదించాలి. –దారా ప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ -
మక్కలు, ధాన్యం వర్షార్పణం
● అకాల వర్షంతో తడిసిన కల్లాలు, కేంద్రాల్లోని పంట ఉత్పత్తులు ● ప్రకృతి ప్రకోపం, కొనుగోళ్ల జాప్యంతో రైతుల మనోవేదన టేకులపల్లి/దమ్మపేట/ఇల్లెందురూరల్: అకాల వర్షంతో రైతులను మనోవేదనకు గురిచేస్తోంది. చేతికివచ్చిన పంట వర్షార్పణం అవుతుంటే రైతు గుండె బరువెక్కుతోంది. గురువారం కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. ఇల్లెందు, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. టేకులపల్లి మండలంలో సుమారు 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, పంట కోతలు పూర్తయ్యాయి. గింజలను ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేశారు. వర్షం రావడంతో మొక్కజొన్న రాశులు నీటిలో తడిసి ముద్దయ్యాయి. టేకులపల్లి కొనుగోలు కేంద్రంలో స్థలం సరిపోక మొక్కజొన్న ట్రక్కులను ప్రభుత్వ పాఠశాలలో నిలిపిఉంచారు. వర్షం నేపథ్యంలో ఆ రైతులంతా ఆందోళన చెందతున్నారు. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని చూస్తూ రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లెందు మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిలో కొమ్ముగూడెం గ్రామం వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆర్టీసీ బస్సు ఇతర వాహనాలు మాణిక్యారం, మస్సివాగు మీదుగా రాకపోకలు సాగించాయి. రైతులు రోడ్డుపై ఆరబెట్టుకున్న మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. మామిడిగూడెం గ్రామపంచాయతీలో ఐదు ఇళ్ల పైకప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దమ్మపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కురి సిన అకాల వర్షానికి, రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది. మండలంలోని పలుచోట్ల అకస్మాత్తుగా వర్షం కురవడంతో రోడ్డుపై, మార్కెట్ యారుల్డో ధాన్యం ఆరబోసిన రైతులు భయాందోళనలతో ధాన్యపు రాశులపై హడావిడిగా పట్టాలను కప్పా రు. మార్కెట్ యార్డులో సరిపడా టార్పాలిన్ పట్టాలను ఇవ్వని కారణంగా ధాన్యపు రాశులు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఆరబోసి రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదని వాపోయారు. తహసీల్దార్ రామనరేష్ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు సరిపడా టార్పాలిన్ పట్టా లను అందజేయాలని బాధ్యులను ఆదేశించారు. ధాన్యపు కాంటాలు సకాలంలో జరిగేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు. -
ఆరోగ్యం.. యోగానందం
వేసవి సెలవుల్లో యోగా శిక్షణ పొందుతున్న సత్తుపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ విద్యార్థినులు పలు పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. మూడేళ్లుగా వేసవి సెలవుల్లో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యాన యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన శిక్షణ తరగతులకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అయితే, సెలవుల్లో కాకుండా తర్వాత కూడా పలువురు విద్యార్థినులు శిక్షణ కొనసాగిస్తుండడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం గంట పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతుండడంతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతోందని శిక్షకురాలు శ్రీలత చెబుతున్నారు. అంతేకాక శారీరక ఆరోగ్యం పెరిగి.. ఒత్తిడి దూరమవుతుందని పేర్కొన్నారు. – సత్తుపల్లిటౌన్ మూడేళ్లుగా యోగా శిక్షణ తీసుకుంటున్నా. ఈ శిక్షణతో ఉత్సాహంగా ఉండడమే కాక చదువు సైతం ఆసక్తిగా సాగుతోంది. నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించా. – కిన్నెర ఫ్రూటీ జస్విత, సత్తుపల్లియోగా శిక్షణకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన 13 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – చీకటి శ్రీదేవి, పీడీ, బాలికోన్నత పాఠశాల, సత్తుపల్లియోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. కరీంనగర్, హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. – కె.ధనవర్ష, సత్తుపల్లి -
ఆకాశవాణిలో 90 వసంతాల వేడుక
చుంచుపల్లి: ఆకాశవాణి 90 వసతంతాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి 3కే వాకథాన్ నిర్వహించగా, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకరరావు మాట్లాడుతూ 1936 ముందు దక్కన్ రేడియోగా ఉన్న రేడి యో కాలక్రమంలో ఆకాశవాణిగా రూపాంత రం చెందిందన్నారు. రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు తదితరులు పాల్గొన్నారు. కో ఆప్షన్ సభ్యుడిపై కౌన్సిలర్ ఫిర్యాదుఇల్లెందు: తనకు సమాచారం లేకుండా, ప్రోట్కాల్ పాటించకుండా కో ఆప్షన్ సభ్యుడు వ్యవహరిస్తున్నారని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య(సారిక) శుక్రవారం ఇల్లెందు మున్సి పల్ కమిషనర్ శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కౌన్సిలర్ పాత్ర పోషి స్తున్నారని, అక్కడి వార్డు అధికారి కో ఆప్షన్ సభ్యుడి సతీమణి ద్వారా కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదపు ప్రయాణంఅశ్వారావుపేటరూరల్: తాటి చెట్టు మొద్దుల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్పై ఓ కూలీ కుర్చొని ఉండగా, మరో కూలీ ఆదమరిచి నిద్రిస్తున్నా డు. ఇదేమి పట్టని ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని శరవేగంగా నడుపుతూ దూసుకెళ్తున్నాడు. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న కూలీలు ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణా పాయం తప్పదు. ట్రాక్టర్లో లోడు చేసిన తాటి మొద్దులను మోకులతో కట్టాల్సి ఉండగా, కర్రల సాయంతో మొద్దులను తరలిస్తున్నారు. శుక్రవారం మండలంలోని జాతీయ రహదారిపై ఈ దృశ్యం కనిపించింది. -
అనుమతిలేని ఆస్పత్రులను సీజ్ చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అనుమతిలేని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సీజ్ చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల నిర్వహణ, అనుమతులు, నిబంధనల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ సంస్థలో రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు, అర్హత కలిగిన సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అర్హతలు లేకుండా వైద్యం నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, రెన్యూవల్ కోసం వచ్చిన 46 దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ఈవీఎం గోదాం తనిఖీకొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ గురువారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నియంత్రణ గదిని, రికార్డింగ్ వ్యవస్థలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇతర అధికారులు డాక్టర్ తుకారాం రాథోడ్, మధు, సంజీవరావు, తిరుమలేష్, త్రినాథ్ బాబు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, రంగా ప్రసాద్, శ్రీనివాసరావు, రాందాస్, హరీష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. జిల్లాలో వరదలు, అటవీ ప్రాంతాలలో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం వరదలు, అటవీ ప్రమాదాల నియంత్రణపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈనెల 18న సమగ్ర మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ -
మళ్లీ మొండిచేయే!
● తాజాగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ ● కొందరు ఉమ్మడి జిల్లా వాసులకు అవకాశం ● ఏళ్లుగా ఎదురుచూసినా పలువురికి మాత్రం నిరాశ ● ఇప్పట్లో మళ్లీ భర్తీ ఉండదనే ప్రచారంతో నిరుత్సాహంసాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారని ఉత్సాహంతో ఎదురుచూసిన అధికార పార్టీలోని కొందరు ఆశావహులకు భంగపాటు తప్పలేదు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించగా జిల్లాలో కొందరికి అవకాశం దక్కినప్పటికీ.. చివరి వరకు ప్రయత్నించినా పలువురు నేతలకు మాత్రం భంగపాటు ఎదురైంది. పార్టీలో ముఖ్యనేతలుగా చెలామణి అయిన వారిని పదవులు వరించకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తుండడం, ఇప్పట్లో మరోమారు పదవుల భర్తీ చేపట్టకపోవచ్చనే ప్రచారంతో వారిలో ఆవేదన అలుముకుంది. ముమ్మర ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్ల తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పలువురు తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించింది. కొందరు నేతలకు తొలి దఫా భర్తీలోనే చోటు లభించింది. ఇంకొందరు ముఖ్యనేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లతోపాటు జిల్లాస్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతులు అందజేశారు. పండుగలు, వివిధ ఎన్నికల సమయాల్లో పదవులు భర్తీ అంశంపై తెరపైకి వచ్చినా ఆ తర్వాత మరుగున పడడం సాధారణమైపోయింది. అయినా పదవులను ఆశించిన నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగించారు. జిల్లాకు ప్రాధాన్యత దక్కినా... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రతీసారి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. గత ఎన్నికల్లో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో 2024లో జరిగిన పదవుల భర్తీ సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆతర్వాత ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలను ఏర్పాటు చేశారు. ఇక బుధవారం ప్రకటించిన పదవుల్లోనూ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు చెందిన నేతలకు చైర్మన్లు, వైస్చైర్మన్లుగా అవకాశం దక్కింది. ఇదేసమయాన జిల్లాస్థాయిలో సుడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లను సైతం నియమించారు. ఇదే ఆఖరా ? ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను దక్కించుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అలాకాని పక్షంలో జిల్లా స్థాయి చైర్మన్ పదవులైనా వస్తే సర్దుకోవాలని భావించారు. కానీ చాలామందికి అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు రెండుసార్లు పదవులు భర్తీ చేయగా.. ఇంకోసారి పదవులు భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుందనే చర్చ నేపథ్యాన స్థానాలు దక్కని నేతలు తమ పరిస్థితి ఏమిటనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశతో పోటీకి దిగలేదు. వీరు కూడా తాము నమ్ముకుని నేతలను కలిసి పదవులపై ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరినీ సంతృప్తి పర్చలేకపోయినట్లు ముఖ్యనేతలు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.నామినేటెడ్ పదవుల భర్తీలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కినా.. పదవులు ఆశించిన కొందరు ప్రధాన నేతలకు చుక్కెదురైంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వారు, ఎన్నికల ముందు, తర్వాత పార్టీలో చేరిన నాయకులు నామినేటెడ్ పదవులను ఆశించారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఆశలు ఫలించలేదు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఎన్నికల్లో శ్రమించిన నేతలు గుర్తింపు కలిగిన నామినేటెడ్ పదవులను ఆశించి మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదనే నైరాశ్యం నెలకొంది. -
ఫుడ్ సేప్టీ అధికారి ఆకస్మిక తనిఖీలు..
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డాబాల్లో గురువారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఓ హాటల్లో కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన ఆహారంలో కోడి ఈక రాగా, దీనిపై బాధిత వినియోగదారుడు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారి పలు హోటళ్లు, డాబాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, డాబాలలో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట గదులు, ఫుడ్ సేప్టీ లైసెన్సులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం 5 నమూనాలు, 12 సర్వేలైన్స్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. అలాగే నిబంధనలు పాటించని నిర్వాహకులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేప్టీ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఒక వారం రోజుల గడువు ఇచ్చి లైసెన్సులు పొందాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దినేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి గురువారం మృతి చెందాడు. కుటుంబీలకు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన మిరియాల కోటేశ్వరరావు(45) వాచ్మెన్గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అశ్వారావుపేట మూడో కిలోమీటర్ సమీపాన ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానిక ఆస్పత్రిలో ఆపై ఏపీలోని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ టి.యయాతీ రాజు తెలిపారు. -
హెచ్చరిస్తే మేలు
సాక్షి ప్రతినిఽధి భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా రైతులు నష్టాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా రైతులు ఆకాశం వైపు చూసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. వరదలు, అగ్నిప్రమాదాల తరహాలోనే ఆకస్మిక వానల నుంచి పంట ఉత్పత్తులను కాపాడటాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా చేయాలని కోరుతున్నారు. తడిసిపోతున్న ధాన్యం జిల్లా వ్యాప్తంగా సుమారు 6.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న, సన్నకారు, మోతుబరి అంతా కలుపుకుని 1.75 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. ఇందులో రెండు పంటలు పండే వరి పొలాలు 1.80 లక్షల ఎకరాలు వరకు ఉండగా, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, మరో లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం యాసంగి సీజన్ వరి, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చాయి. పంట ఉత్పత్తుల్లో సింహభాగం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టి ఉంచారు. మండిపోతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా పడిగాపులు కాస్తున్నారు. అయితే అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, అకస్మాత్తుగా వడగండ్లు, భారీ వానలు కురుస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. జాగ్రత్త పడతారు.. రైతు వేదికలు, వాట్సాప్లు, మొబైల్ ఫోన్లు అన్ని అందుబాటులో ఉన్నా రైతులు ఇప్పటికీ ఆకాశం వైపు చూసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. తక్కువ సమయంలో కాపాడులేకపోతుండటంతో ఆరబోసిన ధాన్యం, మక్కలు వర్షార్పణమవుతున్నాయి. ఇక రోడ్ల వెంబడి, పొలంలో నిల్వ చేసిన ధాన్యం విషయంలో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ తరహా ఘటనలు ఇటీవల బూర్గంపాడు, ఇల్లెందు మండలాల్లో చోటు చేసుకున్నాయి. ఆకస్మిక వర్షాలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల రైతులను అప్రమత్తం చేస్తే.. పంట ఉత్పత్తులను జాగ్రత్త చేసుకునేందుకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. కొన్ని సమయాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోతే వాటిని సమకూర్చుకునేందుకు అవకాశం కూడా కలుగుతుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు.జాతీయ స్థాయిలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి భూకంపాలు, వరదలతోపాటు ఆకస్మిక వానలకు సంబంధించిన అలర్ట్లు ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించారు. క్లస్టర్లోని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ)లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు రైతులతో టచ్లో ఉంటున్నారు. వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతోపాటు నిబద్ధత, నమ్మకం కలిగిన ప్రైవేటు వాతావరణ సంస్థలు సైతం 24 గంటల ముందే ఏ ప్రాంతాల్లో ఆకస్మిక వానలు, వడగళ్ల వర్షాలు పడతాయనే అంశంపై సమాచారం అందిస్తున్నారు. ఇలా వచ్చిన సమాచారాన్ని ఆకస్మిక వానాలు వచ్చేందుకు అవకాశం ఉన్న జిల్లాలు, అందులోని మండలాలు ఏవనేవి గుర్తించి, ఆ మేరకు రైతులను అప్రమత్తం చేసే విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. వర్షసూచనల సమాచారంలేక నష్టపోతున్న రైతులు వాతావరణంలో మార్పులను గమనిస్తూ వ్యవసాయం చేస్తుంటాం. పంట విక్రయ సమయంలోనూ అదే పరిస్థితి. కానీ వర్షం ఒక్కోసారి అకస్మాత్తుగా కురవడంతో భారీగా నష్టపోతున్నాం. స్థానిక అధికారుల నుంచి వర్షం హెచ్చరికలు ఎన్నడూ రాలేదు. – వాంకుడోత్ శంకర్, రైతు, కొమరారం, ఇల్లెందు మండలం నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న బస్తాలు పూర్తిగా తడిశాయి. నేను, నా కుటుంబ సభ్యులందరం శ్రమించి 200 క్వింటాళ్లు పండించాం. అందులో సగం తడిసిపోయింది. వాన విషయం ముందుగా తెలిస్తే జాగ్రత్త పడేవాడిని. – కమటం సూరయ్య, రైతు, మామిడిగుండాల, ఇల్లెందు మండలం -
● అచ్చతెలుగులో అందిస్తున్న వెబ్సైట్లు ● వేసవి సెలవుల్లో చిన్నారులకు ఉపయోగం
ఇల్లెందు రూరల్: వేసవి సెలవులు రాగానే చిన్నారుల్లో ఎక్కడ లేని ఆనందం. అయితే ఈ సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఒకప్పుడు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవారు. ప్రస్తుతం అలాంటివి చెప్పేవారు ఉన్నా.. వినే ఓపిక పిల్లలకు లేకుండా పోయింది. సెలవులనగానే సెల్ఫోన్ చేతపట్టి ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తున్నారు. వీడియో గేమ్లు, కార్టూన్ చానళ్లతోనే కాలం గడుపుతున్నారు. అలాకాకుండా తల్లిదండ్రులు కాస్త మనసు పెడితే పిల్లలు ఆసక్తిగా చూసేలా నీతి కథలు, విలువలను బోధించే కార్టూన్లను పరిచయం చేసే అవకాశం ఉంది. సెలవుల్లో విజ్ఞానం పాలు తాగే పసిపాప మొదలు బుడిబుడి అడుగులు వేసే పిల్లలు, ఆపై వయస్సు పిల్లలు కూడా సెల్ఫోన్లలో ఆటలకు పరిమితమయ్యారు. చిన్నవయస్సులో ఏడస్తున్న పసిహృదయాలకు సెల్ఫోన్ చేతిలో పెట్టి ఊరుకోబెడుతూ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే చిన్నారులను సెల్ఫోన్కు అతుక్కుపోయేలా చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడేలా కథలను అందించే కొన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్లోనే కాక అచ్చతెలుగులో విజ్ఞానాన్ని పెంచే కథలు, సామెతలు, పొడుపు కథలు, అక్బర్, బీర్బల్, చందమామ కథలు వంటివి చదవొచ్చు.. వినొచ్చు. మరికొన్ని సైట్లు పిల్లల పత్రికలు, మ్యాగజైన్లను అందిస్తున్నాయి. సెల్ఫోన్తో మారాం చేసే చిన్నారులకు వెబ్సైట్లలో నీతి కథలు వినిపిస్తూ వినోదం, విజ్ఞానం కూడా అందించేలా తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వెబ్సైట్లలో ఏముందంటే.. వెబ్సైట్లలో చిన్నారుల మేథోవికాసాన్ని పెంపొందించే పిట్టకథలు, బుర్రకథలు, తెనాలి రామకృష్ణ, సరదా కథలు, పాటలు, చందమామ కథలు, తెగులు పద్యాలు, పిల్లల వీడియోలు, పొడుపు కథలు, వేమ, సుమతి, భాస్కర శతక పద్యాలు లభిస్తాయి. అలాగే, పంచతంత్ర కథలు, గొప్ప రాజులు, పురాతన ఆలయాలు, శ్లోకాలు తదితరాలను పరిచయం చేస్తున్నారు. సాహిత్యంలో భాగంగా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. -
కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. ప్రతిభావంతులకు ఎస్పీ అభినందనసూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలను ఎస్పీ రోహిత్రాజు అభినందించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మ స్థైర్యం ఉంటే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని సూచించారు. జీవితంలో ఎప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని చెప్పారు. తాను కూడా పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగానంటూ బాల్యం నుంచి ఐపీఎస్ సాధించే వరకు తన అనుభవాలను వారితో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, ఇంద్రసేనారెడ్డి, ఎంటీఓ సుధాకర్, ఆర్లు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి వైద్యుల నియామకంలో జాప్యం రుద్రంపూర్: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల నియామకంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తీర్చేందుకు సంస్థ వ్యాప్తంగా 32 ఖాళీలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్లో యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8,9 తేదీల్లో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ ఉన్నతాధికారులు, సీనియర్ వైద్యాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా 32 పోస్టులకు 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, పీడియాట్రీషియన్–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్టీ సర్జన్–2, అనష్థీసియన్– 7, పెథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3, సైక్రియాట్రిస్ట్–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
సింగరేణిలో సమ్మె సైరన్ !
రుద్రంపూర్: సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలల క్రితం కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రఽభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంపై దృష్టి సారించలేదని నాయకులు చెబుతున్నారు. ఈనేపథ్యాన కార్మిక సంఘాలతో కలిసి ఈనెల 15వ తేదీ తర్వాత సమ్మె నోటీసు అందజేసి, జూన్లో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఒప్పుకున్నవి అమలుకాక.. సింగరేణిలో 2023 డిసెంబర్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇద్దరు సీఎండీ, డైరెక్టర్లు, ఇతర అధికారులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని ఆరోపిస్తున్నారు. వీటికి తోడు స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన వాటిని కూడా అమలుచేయకపోవడంతో కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నారని చెబుతున్నారు. ఈనేపథ్యాన సమ్మె చేయడం తప్ప మరోమార్గం కానరావడం లేదని కార్మికుల సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇవీ ప్రధాన సమస్యలు.. ● గత 14 మాసాలుగా పెండింగ్లో మెడికల్ బోర్డ్ నిర్వహించాలని మారుపేర్లు, విజిలెన్స్లో ఉన్న సుమారు 3వేల డిపెండెంట్ కేసులను వన్టైమ్ సెటిల్మెంట్ కింద సెటిల్ చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. (వీటి సమస్యల పరిష్కారం కోసం అడ్వకేట్ జనరల్కు లీగల్ ఒపీనియం కోసం పంపి సంవత్సరం దాటినా ఇంత వరకు పరిష్కారం చూపడంలేదు) ● డిస్మిస్ అయిన కార్మికులను 100 మస్టర్లు అనే నిబంధన లేకుండా వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి. ● మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్మెన్లకు సొంతింటి కల నెరవేర్చాలి. ● సింగరేణి కార్మికులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్లను పలు టాక్స్ల రూపేణా చెల్లిస్తున్నారు. వాటిలో కార్మికులు చెల్లిస్తున్న ఇన్కమ్ టాక్స్ను యాజమాన్యమే చెల్లించాలి, ● కొత్తగనులు ప్రారంభించి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ● సింగరేణికి రావాల్సిన రూ.54 వేల కోట్లను వెంటనే చెల్లించాలి. ● వీకే–7 ఓసీతో పాటు త్వరలో రాబోయే కొత్త గనుల్లో సింగరేణి పర్మనెంట్ కార్మికులతోనే చేయించాలి. ● యాజమాన్యం కార్మికులు సర్ప్లస్ ఉన్నారని చెబుతూ మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేసిన వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలి. ● సింగరేణి హెడ్డాఫీస్లో డైరెక్టర్ పా వారంలో నాలుగు రోజులు ఉండాలి. (డైరెక్టర్ పా అందుబాటులో లేని కారణంగా సంస్థలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి) ● సంస్థలో గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ గత సంవత్సర కాలంగా నిర్వహించకపోవడంతో వేలాది సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇకనైనా గ్రీవెన్స్ను యథావిధిగా నిర్వహించాలి. ● గతంలో డైరెక్టర్ పా సింగరేణి వ్యాప్త కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేవారు, గత పన్నెండేళ్లుగా ఈ పక్రియ నిలిచిపోయింది. ● సంస్థలో గతంలో 1.16 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు 2,400 మంది అధికారు లు ఉన్నారు. 40 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు 2,400 మంది ఉన్నారు. వీరిలో సుమారు 100 మంది అధికారులు అధికంగా ఉన్నారని ఐఈడీ లెక్కలు చెబుతున్నాయి కానీ అధికారుల సంఖ్య తగ్గించకుండా కేవలం కార్మికులను టార్గెట్ చేయడం సరికాదని, అధికంగా ఉన్న అధికారులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 15 తర్వాత నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు -
వంట గ్యాస్ బ్లాక్?
● పక్కదారి పడుతున్న గృహ వినియోగ సిలిండర్లు ● యథేచ్ఛగా, అధిక ధరలతో వాణిజ్య అవసరాలకు.. ● భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులపై అదనపు భారం ● నిద్రమత్తులో పౌరసరఫరాల శాఖ అధికారులుచిన్న, పెద్ద హోటళ్ల అసోసియేషన్లు గ్యాస్ డీలర్లను సంప్రదిస్తే కమర్షియల్ గ్యాస్ కొరత ఉందనే సమాధానం చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా 5 కేజీల సిలిండర్లు తీసుకెళ్లండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. పోనీ అవి తీసుకెళ్దామంటే ఖాళీ సిలిండర్లు కావాలంటున్నారు. డిపాజిట్ చెల్లిస్తామని చెప్పినా 5 కేజీల సిలిండర్లు ఇవ్వడం లేదని హోటల్ యజమానులు వాపోతున్నారు. ఇప్పటివరకు తాము వినియోగించకుండా ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం: పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్ కొరత చూపించి జిల్లాలో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ చేస్తున్నా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో సాధారణ ప్రజల వంట కష్టాలు రెట్టింపయ్యాయి. భద్రాచలం దివ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపై అదనపు భారం పడుతోంది. దొడ్డిదారిన లెక్కకు మించి.. మార్చిలో శ్రీరామనవమి నాటికే గ్యాస్ కొరత నెలకొంది. భక్తులు, పర్యాటకులు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ముందస్తుగా సాక్షి కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన జిల్లా పౌరసరఫరా శాఖాధికారులు కలెక్టర్తో చర్చించి ఉత్సవాల సమయంలో తాత్కాలికంగా కమర్షియల్ గ్యాస్ అందించారు. ఉత్సవాలు ముగిశాక మళ్లీ పరిస్థితి యథాస్థితికి వచ్చింది. ఏప్రిల్ నుంచి కమర్షియల్ గ్యాస్ సరఫరా లేదంటూ ఆపి వేశారు. దీంతో గృహవినియోగ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇందులో డెలివరీ బాయ్స్ నుంచి డీలర్ల వరకు వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.5 కేజీలు) ధర సుమారు రూ. వెయ్యి లోపుఉండగా, అక్రమ మార్గంలో కేజీకి రూ.230 చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే 14.2 కేజీలకు సుమారు రూ.3వేలు దోచుకుంటున్నారు. దొడ్డిదారిన లెక్కకు మించి సిలిండర్లు విక్రయిస్తున్నారు. ఇక ప్రైవేట్ కంపెనీకి చెందిన 19.2 కేజీల సిలిండర్ గతంలో రూ.1600 ఉండగా, ప్రస్తుతం రూ.4,200 వసూలు చేస్తున్నారు. భక్తులపై భారం కొరత, బ్లాక్ దందాతో గ్యాస్ ధర రెండింతలు కావడంతో కొందరు హోటళ్ల యజమానులు టిఫిన్ ధర కూడా పెంచారు. 10 నుంచి 20 శాతం వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. దీంతో భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు భారంగా మారింది. ఇక చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలను పెంచకుండా టిఫిన్ సైజ్ తగ్గించి అమ్ముతున్నారు. కొందరు గ్యాస్ అధికంగా వినియోగించే మెనూ ఐటెమ్స్ తగ్గిస్తున్నారు. పలుకుబడిలేని, పైరవీలు చేయించలేని, బ్లాక్ మార్కెట్లో గ్యాస్ కొనలేని మరికొందరు తమ వ్యాపారాలను నిలిపివేశారు. ప్రస్తుతం పాఠశాలలకు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఉంటోంది. ఈ సమయంలోనైనా కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో నిరంతరాయంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. హెచ్పీ గ్యాస్ అవసరాలకు తగినట్లు సరఫరా చేయటం లేదు. దీంతో ప్రైవేట్ గ్యాస్ను వినియోగించాల్సివస్తోంది. గ్యాస్ ధర రెండింతలు కావడంతో టిఫిన్ రేటు పెంచాల్సి వచ్చింది. కమర్షియల్ గ్యాస్ ఇస్తే మేమూ ధరలు తగ్గిస్తాం. – జిల్లా శ్రీనివాస్, హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ, భద్రాచలం బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయిస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. కమర్షియల్ గ్యాస్ కొరతపై వివరాలు తెలుసుకుని, నిరంతర సరఫరాకు గ్యాస్ ఏజెన్సీలతో చర్చిస్తాం. – ప్రేమ్కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
కోడిపుంజుల బడాయి
సత్తుపల్లిటౌన్: ఒక ఊరిలో రెండు కోడి పుంజులు ఉండేవి. రెండింటికి బడాయి ఎక్కువే కావడంతో ఒక దాన్ని మించి మరొకటి బడాయి పోయేవి. ఓ రోజు గింజలు ఏరుకుని తింటున్న రెండు పుంజుల మధ్య మాటామాట పెరిగింది. ఆ మాటలు పెరిగి పందేనికి దారి తీశాయి. ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలరనే అంశంపై పందెం వేసుకున్నాయి. నేను ఎక్కువ ఎత్తు ఎగరగలనని మొదటి పుంజు అంటే.. నీ కంటే నేనే ఎక్కువ ఎత్తు ఎగురుతాను అన్నది రెండో పుంజు. పెద్దమనిషిగా వ్యవహరించమని వీటి కంటే పెద్ద వయస్సు ఉన్న పుంజును అడిగాయి. ఆ పెద్దమనిషి పుంజు మాత్రం ఇలాంటి పందేలు వద్దని వారించింది. వీటితో నష్టం కలుగుతుందని హితవు చెప్పింది. అయినా పందెం మోజులో ఉన్న పుంజులకు మంచి మాటలు తలకెక్కలేదు. పెద్దమనిషి లేకపోతేనేం.. మనమే న్యాయంగా పోటీ పడదామని అంగీకారానికి వచ్చాయి. వద్దు.. వద్దు అని ఇంకొన్ని పుంజులు చెప్పినా వినలేదు. పందెం మొదలైంది. మొదటి పుంజు ప్రహరీ మీదకు ఎగిరింది. రెండో పుంజు ఇంటి కప్పు మీదకు ఎగిరింది. చూశావా నేనే ఎత్తు ఎగిరిరాను అన్నట్టు రెండో పుంజు చూస్తుండగానే మొదటి పుంజు చెట్టుకొమ్మపై వాలింది. మొదటి పుంజు గాలిలోకి అంత ఎత్తున రివ్వున ఎగిరింది. ఇంతలో సుడిగాలిలా వచ్చిన గద్ద మొదటి పుంజును తన కాళ్లతో ఒడిసి పట్టుకుని ఎగరేసుకుపోయింది. చిటారు కొమ్మన కూర్చున్న రెండో పుంజు ఇది చూసి చిగురుటాకులా వణికి పోయింది. గద్దకు కనబడకుండా ఒదిగి కూర్చుంది. గద్ద కనుమరుగయ్యాక కిందకి దిగింది. ఇందంతా చూస్తున్న మిగతా పుంజులు బడాయికి పోతే ప్రాణమే పోయింది కదా అని అనుకుంటూ గూటికి పయనమయ్యాయి. నీతి : ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా శక్తి ఉంటుంది. కానీ దాన్ని అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. అలాకాకుండా బడాయికి వెళ్తే శతృవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.అమ్మమ్మ చెప్పిన కథ -
పంపిణీపై పర్యవేక్షణ
ఎరువులు, విత్తనాలసూపర్బజార్(కొత్తగూడెం): వచ్చే వ్యవసాయ సీజన్లో ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఇదేవిషయమై రైతు వారోత్సవాల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరగగా కలెక్టర్తో పాటు ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నందున విత్తనాల పంపిణీ, ఎరువుల నిల్వలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇదే సమయాన డీలర్లు కూడా రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు అమ్మడం వంటివి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ.. డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు రానున్నందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి చండ్రుగొండ: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చండ్రుగొండలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన అందుతున్న వైద్యసేవలు, రక్త పరీక్షలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసరమైన మందులు నిల్వ ఉంచుకోవడమేకాక వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, డాక్టర్ రాము, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్పొరేషన్ కార్యవర్గాల్లో స్థానం
ఖమ్మంమామిళ్లగూడెం/ఖమ్మం గాంధీచౌక్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్, వైస్చైర్మన్లుగా ఉమ్మడి జిల్లా నేతలకు స్థానం దక్కింది. ఈమేరకు మున్నూరుకాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యాయవాది బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియమితులయ్యారు. ఆయన నియామకంపై మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శ్రీరామ్ తండ్రి, దివంగత ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మున్నూరుకాపులతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ● ఖమ్మంగాంధీచౌక్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన ఆయన నియామకంతో జిల్లాకు ప్రాధాన్యత ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ నియామకంపై నియోగి బ్రాహ్మణ స్వతంత్ర సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోసూరి ప్రసాద్, గెంటేల శ్రీనివాసరావుతో పాటు చకిలం జనార్దన్రావు, వనం వెంకటప్పారావు, గోళ్లమూడి సత్యనారాయణ శర్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ● బోనకల్: కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా పరుచూరి మురళి నియమితులయ్యారు. బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆయనను వైస్ చైర్మన్గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన నియామకంపై పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు గాలి దుర్గారావు, మోదుగు సుధీర్బాబు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, భద్రునాయక్, తుళ్లూరి లక్ష్మీనర్సయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ● భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన పీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ స్పందిస్తూ పెరిక సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
నయనానందకరం .. మహా కుంభాభిషేకం
● త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ ● హాజరైన మంత్రి పొంగులేటి దంపతులు, కలెక్టర్ అంకిత్ ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీదేవీ, భూదేవీ సమేత బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం నయనానందకరంగా సాగింది. ఆరు రోజులుగా వేడుకలు జరుగుతుండగా చివరి రోజైన బుధవారం చినజీయర్ స్వామి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో జరిగిన పూజల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – మాధురి దంపతులు, కలెక్టర్ అంకిత్తో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రధానార్చకులు ప్రసాదాచార్యుల పర్యవేక్షణలో గర్భాలయంలో ప్రథమారాధన, శాంతికల్యాణం, మంగళనీరాజనం నిర్వహించారు. ఆ తర్వాత జీయర్స్వామి చేతుల మీదుగా ప్రధాన ఆలయ శిఖర గోపుర కలశానికి మహాకుంభప్రోక్షణ చేశారు. మంత్రి పొంగులేటి, కలెక్టర్ అకింత్ సైతం పాలుపంచుకున్నారు. తదుపరి భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల ఆలయాల గోపుర కలశాలకు సంప్రోక్షణ చేయగా భక్తులు చేసిన జైశ్రీమన్నారాయణ, గోవిందా గోవిందా నామస్మరణతో గ్రామం మార్మోగింది. టీఎస్ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, సర్పంచ్ లకావత్ లక్ష్మి, ఈఓ రజనీకుమారి, మేనేజర్ పాకాల వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు పర్సా వెంకటేశ్వర్లు, బొంకూరి సురేశ్, వనమా శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, బోడా పద్మ, శ్రీను, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లేల నర్పింహారావు, వనమా గాంధీ, బోయినపల్లి సుధాకర్రావు, వేముల నరేశ్, భారీగా భక్తులు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యం
టేకులపల్లి: ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ తెలిపారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సబ్ స్టేషన్ ఆవరణలో విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేశారు. సబ్స్టేషన్ల అనుసంధానం పూర్తి మండలంలో వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇంటర్ లింకింగ్(అనుసంధానం) పనులు పూర్తయ్యాయి. కోయగూడెం – బోడు సబ్స్టేషన్ల మధ్య 19 కి.మీ. మేర 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ పూర్తికావడంతో ఎస్ఈ మహేందర్ ప్రారంభించారు. ఇన్నాళ్లు కోయగూడెం సబ్స్టేషన్కు కొత్తగూడెం(ఆర్టీఎస్ఎస్ నుంచి, బోడు సబ్స్టేషన్కు ఇల్లెందు విద్యుత్ సరఫరా జరుగుతుండగా, సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఇబ్బంది రాకుండా ఈ ప్రత్యామ్నాయ లైన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈలు రంగస్వామి, నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈ రఘురామయ్య, ఏఈలు హెచ్.దేవా, శ్రీకాంత్, సబ్ ఇంజనీర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.భద్రతా వారోత్సవాల్లో ఎస్ఈ మహేందర్ -
పోటెత్తిన మొక్కజొన్న వాహనాలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వెళ్లే రహదారుల్లో మొక్కజొన్న తీసుకొచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న యాసంగి మొక్కజొన్నలను మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు. మిర్యాలగూడ, ఏపీలోని జగ్గయ్యపేట గోదాములు నిండిపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి రెండు రోజులుగా వాహనాలు వస్తుండడంతో బుధవారం మరింత రద్దీ నెలకొంది. మార్కెట్ ఆవరణలోనే కాక సమీప రహదారుల వెంట వాహనదారలు బారులుదీరాయి. అయితే, చాలినంత మంది హమాలీలు లేకపోవటంతో దిగుమతిలో జాప్యం జరుగుతుండగా.. పోలీసులు కలగజేసుకోవాల్సి వచ్చింది. -
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు. అలాగే, స్వామికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మానికి చెందిన భక్తులు బుధవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బుడిగం వీరయ్య – రేణుక దంపతులు అన్నదానం నిమిత్తం రూ.లక్షను ఆలయ అధికారులకు అందజేయగా, వారు రశీదు అందజేసి స్వామి దర్శనం చేయించారు. బీటీపీఎస్ కాలుష్యంపై ఆరా గ్రామస్తుల ఫిర్యాదుతో పీసీబీ అధికారుల పరిశీలన పినపాక: పినపాక – మణుగూరు మండలాల సరిహద్దులోని బీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యం, బూడిదతో ఇబ్బంది పడుతున్నామని బయ్యారం గ్రామానికి చెందిన పలువురు ఇటీవల హైదరాబాద్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో బుధవారం గ్రామానికి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. బయ్యారం గ్రామంలోని పలు ఇళ్లపై ప్రత్యేక పరికరాల ద్వారా గాలిలో బూడిక కణాలు, కాలుష్య స్థాయిని నమోదు చేశారు. బీటీపీఎస్ నుంచి వస్తున్న బూడిద ఇళ్లపై పేరుకుపోవడమే కాక గాలిలో కలుస్తుండడంతో శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యాన పరిశీలన అనంతరం సేకరించిన నమూనాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మైనార్టీలకు సివిల్స్లో ఉచిత శిక్షణ సూపర్బజార్(కొత్తగూడెం): యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థుల కోసం తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సంజీవరావు తెలిపారు. హైదరాబాద్లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడమేకాక మహిళా అభ్యర్థులకు 33.33 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా https:// cet. cgg. gov. in/ tmreis వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం జూన్ 14న నిర్వహించే ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటిన 100 మందిని ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు కలిగి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని చెప్పారు. ఈమేరకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ మతాలకు చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు పనిదినాల్లో 040–23236112 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. అటవీ రక్షణే మా ప్రాధాన్యత కలవలనాగారం భూములపై రేంజర్ తేజస్వి కరకగూడెం: అటవీ సంపదను పరిరక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి తెలిపారు. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న కరకగూడెం మండలం కలవలనాగారంలో 600 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యాన ఆమె స్పందించారు. ఆ భూమి రక్షిత అటవీ ప్రాంతమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయగా.. ప్రభుత్వం వద్ద ఉన్న నిజాం నాటి నోటిఫికేషన్ పత్రాలే అసలైనవని తేలిందన్నారు. అంతేకాక ఫోర్జరీ లేదా రెవెన్యూ రికార్డులతో అటవీ భూములను సొంతం చేసుకోవాలని యత్నించినా అది సాధ్యం కాదని తేలిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 600 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనే ఉందని ఆమె వెల్లడించారు. -
రైతు వ్యతిరేక విధానాలపై సమరభేరి
టేకులపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారని మాజీ ఎమ్మెల్యే, ఏఐయూకేఎస్ గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. రైతు హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టేకులపల్లిలో బుధవారం ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేలా ఈ నెల 11, 12, 13వ తేదీల్లో ఇల్లెందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభల వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నందున విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు ఫారెస్ట్ మైదానం నుంచి సింగరేణి మైదానం వరకు భారీ ప్రదర్శన, ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో జాతీయ నాయకులు ప్రదీప్సింగ్ఠాగూర్, విమల్ త్రివేది, కృష్ణ గొగోయ్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇక 12, 13వ తేదీల్లో ప్రతినిధుల సభలు జరుగుతాయని నర్సయ్య వివరించారు. అనంతరం జాతీయ మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, నాయకులు నాయిని రాజు, ధర్మపురి వీరబ్రహ్మచారి, జరుపుల సుందర్, పాయం వెంకన్న, బానోతు లింగా, బుర్ర వెంకన్న పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు : గుమ్మడి నర్సయ్య -
పట్టాలు ఎక్కిన ప్రతిపాదన!
డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు వినతిపత్రం ఇస్తున్న ఎంపీ రవిచంద్ర, పక్కన సురేశ్రెడ్డి (ఫైల్) భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ డివిజన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై రైల్వేబోర్డు దృష్టి పెట్టింది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రకటనతో ఈ అంశం మరుగున పడలేదని తేలిపోయింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెంమార్పులు.. చేర్పులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో దక్షిణ మధ్య రైల్వే జోన్ విస్తరించి ఉంది. సికింద్రాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ జోన్ పరిధిలో 6,424 కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ జోన్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో, మిగిలిన డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ 2026 జూన్ 1న ఏర్పాటు కానుంది. అయితే, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న డివిజన్ల సరిహద్దుల్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. సికింద్రాబాద్ మరింత పెద్దగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతి పెద్దదైన సికింద్రాబాద్ జోన్ పరిధిలో 1,556 కి.మీ ట్రాక్ విస్తరించి ఉంది. తాజా విభజనలో ఇందులో మధిర నుంచి కొండపల్లి వరకు ఉన్న 46 కి.మీ. ట్రాక్ విశాఖ పట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణా కోస్తాలోకి వెళ్తోంది. ఇదే సమయంలో గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని కొన్ని సెక్షన్లు హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోకి వస్తున్నాయి. అంతేకాక విష్ణుపురం – పగిడిపల్లి సెక్షన్లో ఉన్న 142 కి.మీ.లు సికింద్రాబాద్ జోన్లోకి వస్తోంది. దీంతో ఈ జోన్ పరిధి 1,556 కి.మీ నుంచి ఏకంగా 1,652 కి.మీలకు పెరగనుంది. మరోవైపు గుంతకల్లు డివిజన్లోని వాడి – రాయచూరు సెక్షన్లో ఉన్న 102 కి.మీ.లు హైదరాబాద్ డివిజన్లోకి వస్తున్నాయి. దీనికి తోడు పెద్దపల్లి – కరీంనర్ – నిజామాబాద్ సెక్షన్లోని 160 కి.మీ కూడా సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు బదలాయిస్తున్నారు. ఈ మార్పులతో ఓ వైపు సికింద్రాబాద్ డివిజన్ పరిధి పెరుగుతుండగా.. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ ఏర్పాటుకు అవకాశాలు క్లిష్టంగా మారాయి. భద్రాచలంరోడ్ సానుకూల అంశాలు ప్రస్తుతం మంజూరైన మణుగూరు – రామగుం డం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, భద్రాచలం – మల్కన్గిరి, కొత్తగూడెం – కిరండోల్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డోర్నకల్ – విజయవాడకు ప్రత్యామ్నాయంగా కొత్తగూడెం – కొండపల్లి (పెనుబల్లి – కొండపల్లి) మార్గానికి ఇప్పటికే సర్వే కూడా జరిగింది. ఈ లైన్లలో ఏ ఒక్కటి అందుబాటులోకి వచ్చినా దానికి కేంద్ర స్థానం కొత్తగూడెమే అవుతుంది. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే 740 కి.మీ కొత్త రైల్వేలైన్ అందుబాటులోకి వస్తుంది. మరోవైపు భద్రాచలంరోడ్ రైల్వేస్టేషన్ ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశాలతో దగ్గరి సరిహద్దులో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ కూడా అవుతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే డివిజన్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ సానుకూల అంశాలకు తోడు రాష్ట్ర ఎంపీల ఒత్తిడి కూడా తోడైతే డివిజన్ ఏర్పాటు కల సాకారం అయ్యేందుకు ఆస్కారం ఉంది. దక్షిణ మధ్య రైల్వేను విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ జోన్లతో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటవుతోంది. జోన్ల విభజనతో మొదలవడంతో కొత్త డివిజన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఉన్న కాజీపేట డివిజన్ డిమాండ్కు తోడుగా భద్రాచలంరోడ్ను కూడా పరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మార్చి 18న రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్కు వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత ఇదే అంశాన్ని పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. దీంతో కొత్తగూడెం కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు పరిశీలన చేస్తోందని తెలుపుతూ మంత్రి అశ్వినీవైష్ణవ్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. దీంతో భద్రాచలంరోడ్ డివిజన్ అంశం ప్రతిపాదనల దశ నుంచి పరిశీలన దశలోకి వెళ్లినట్టయింది. కొత్తగూడెం డివిజన్ కోసం విన్నపాలు -
ఇంగ్లిష్ చదువు.. చేతిరాత
ఖమ్మంగాంధీచౌక్: వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు ఏదో అంశంలో తర్ఫీదు ఇప్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన విద్యార్థులకు భవిష్యత్లో ఉపయోగపడే ఇంగ్లిష్ నేర్పించేలా మాజీ సైనికుడు ముందుకొచ్చారు. ఇంగ్లిష్ ప్రాధాన్యత, పిల్లల సెలవుల దృష్ట్యా నేవీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సత్యమూర్తి అరుణ్ ఖమ్మం మమత ఆస్పత్రి రోడ్డులో నామమాత్రపు ఫీజుతో ‘అరుణ్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లిష్’ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు హాజరయ్యే అవకాశం ఉండగా ఉదయం 8–10, 10–12, సాయంత్రం 5–8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ చదివే విధానం, మాట్లాడే విధానం, అక్షరాలను పలకడం, సంభాషణ తదితర అంశాలపై అరుణ్ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాక కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా శిక్షణ ఇస్తుండడంతో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ విద్యార్థులే కాక కొందరు ఉద్యోగులు కూడా వస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ ప్రత్యేకం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో సమాధానాలు రాయడమే కాక చేతిరాతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యాన సత్యమూర్తి తన కేంద్రంలో చేతి రాత శిక్షణ కూడా ఇస్తున్నారు. అక్షరాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ పూర్తి చేయాలనే తదితర అంశాలపై శిక్షణ ఇస్తుండడంతో పిల్లలు ఆసక్తిగా హాజరవుతున్నారు. పిల్లల కోసం మాజీ సైనికుడి అక్షర సేద్యం -
పంచాయతీ కార్యాలయంలో రికార్డుల చోరీ
దమ్మపేట: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాత్రి రికార్డులు చోరీ జరిగిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అనంత్కుమార్ బుధవారం ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి వెళ్లగా, తన గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. లోపల ఉన్న మూడు ఇనుప బీరువాలు తెరిచి, నాలుగేళ్ల స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్, క్యాష్ బుక్స్, హౌజ్ ట్యాక్స్ బుక్స్, ఎంబీ బుక్, గ్రామసభ తీర్మానాల రిజిస్టర్లు చోరీకి గురైనట్లు గుర్తించాడు. కార్యదర్శి ఫిర్యాదుతో కార్యాలయంలో క్లూస్ టీం వేలిముద్రలు, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. ఇంటి దొంగల పనేనా..? కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేట గ్రామ పంచాయతీలో నకిలీ ఇంటి పన్ను రశీదులతో పాటు పంచాయతీకి సంబంధంలేని ఇద్దరు వ్యక్తులకు వేతనాల చెల్లించడం లాంటి అవకతవకలపై డాక్యుమెంట్ రూపంలో వివరణ కావాలని రెండు వారాలుగా వార్డు సభ్యులు కోరుతున్నప్పటికీ కార్యదర్శి ఇవ్వలేదు. ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సమయంలోనే రికార్డులు చోరీ కావడం, ఈ చోరీ ఇంటి దొంగల పనేనని గ్రామస్తులు, వార్డు సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ చోరీపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, నిందితులను కనిపెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి అశ్వాపురం: మండల కేంద్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండల కేంద్రంలోని ఎస్సీకాలనికి చెందిన రిక్షా కార్మికుడు మురికిపుడి పెంటయ్య (58) ఏప్రిల్ 24న రిక్షాతో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. -
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాలు
సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుండడంతోనే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన బుధవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఆకాశాన్ని అంటుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక ధరల నివారణకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుండా, కార్పొరేట్ శక్తులకు తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధరలను తగ్గించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వంగా వెంకట్, ఎస్కే ఫహీమ్, ధీటి లక్ష్మీపతి, కె.రత్నకుమారి, మునిగడప పద్మ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని -
‘దిగుబడి పేరుతో మోసం చేశారు..’
మణుగూరుటౌన్: మొక్కజొన్న అధిక దిగుబడి వస్తుందని పలువురు తమను నమ్మించి మోసం చేశారని మండలంలోని తిర్లాపురం రైతులు పేర్కొన్నారు. బుధవారం వారు వివరాలు వెల్లడించారు. మొక్కజొన్న పైనిర్ వైసీ 904 కంపెనీ విత్తనాలతో మంచి దిగుబడి వస్తుందని చెప్పగా 40 ఎకరాల్లో సాగు చేస్తే ఆశించిన ఫలితం లేక 12 మంది రైతులు నష్టపోయినట్లు వెల్లడించారు. చర్ల గ్రామానికి చెందిన కొందరు, మణుగూరుకు చెందిన మరికొందరితో కలిసి ఈ విత్తనాలు అంటగట్టారని తెలిపారు. అయితే, కోత సమయాన కొందరి వద్దే పంటను కొనుగోలు చేసి మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నందున అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. పోగొట్టుకున్న మొబైల్స్ అప్పగింత టేకులపల్లి: పోగొట్టుకున్న మొబైళ్లను సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పట్టుకున్న పోలీసులు బుధవారం బాధితులకు అందజేశారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బి.లింగయ్య, కోక్యతండాకు చెందిన రమేశ్ కొన్ని నెలల క్రితం తమ మొబైళ్లను పోగొట్టుకున్నారు. బాధితులు సీఈఐఆర్ పోర్టల్తోపాటు టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్లను రికవరీ చేసి, పోలీస్ స్టేషన్లో బాధితులకు అప్పగించారు. 71 కేజీల గంజాయి స్వాధీనం నలుగురు నిందితుల అరెస్ట్ సూపర్బజార్(కొత్తగూడెం): గంజాయి తరలిస్తున్న నలుగురిని కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వన్టౌన్ సీఐ కరుణాకర్ కథనం ప్రకారం.. వన్టౌన్ ఎస్ఐ రాకేశ్ ఆధ్వర్యాన సిబ్బంది మంగళవారం సాయంత్రం పాత కొత్తగూడెం సెంటర్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా 71.795 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులు మహ్మద్ అజాజ్, కొలి అరుణ్, రంగాల రాజారామ్, గోగుల సతీశ్ రూ.35,98,750 విలువైన గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలింది. నలుగురిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ వివరించారు. -
గ్యాస్ పంపిణీలో అవకతవకలపై విచారణ
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో హెచ్పీ గ్యాస్ పంపిణీకి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై హిందుస్థాన్ పెట్రోలియం రాష్ట్ర సేల్స్ అధికారి పవన్ బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 620 సిలిండర్లు పక్కదారి పట్టినట్లు బయటపడింది. ఈ మేరకు సిలిండర్ల పంపిణీ నిర్వహిస్తున్న సొసైటీకి రూ.8 లక్షల జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా సరఫరా చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాక ఆన్లైన్ చెల్లింపులు చేసిన వారికి వెంటనే గ్యాస్ సరఫరా, పాత విధానంలో బుకింగ్ పునరుద్ధరణకు కృషి చేస్తామని చెప్పారు. మరో ఇరవై రోజుల్లో గ్యాస్ సరఫరా పూర్తిగా గాడిలో పడుతుందని తెలిపారు. ఈ మేరకు సేల్స్ అధికారి పవన్కు టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇవ్వడమే కాక, పలు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడంపై సన్మానించారు. ఏజెన్సీకి రూ.8 లక్షల జరిమానా -
వెళ్దామా.. వద్దా ?!
● విద్యుత్ ఉద్యోగుల్లో ఊగిసలాట ● రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటుకు సన్నాహాలు ● ఇతర డిస్కంల్లోని ఉద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంవ్యవసాయం: విద్యుత్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిస్కంలకు తోడు ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటుచేస్తోంది. వ్యవసాయ సంబంధిత కనెక్షన్ల నిర్వహణ, విద్యుత్ పంపిణీతో పాటు ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఈ డిస్కంను ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు ప్రస్తుత డిస్కంల్లోని ఉద్యోగులే ఇందులో విధులు నిర్వర్తించేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కోల్లో ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. అయితే, కొత్త డిస్కంలోకి వెళ్లాలా, వద్దా అన్న మీమాసంలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త డిస్కంలో తక్కువ మంది ఉద్యోగులే ఉండనుండడంతో త్వరగా పదోన్నతులు వస్తాయని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలో ఉన్నట్లు సమాచారం. అందుబాటులో పోర్టల్ రైతు డిస్కంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటుచేసిన పోర్టల్ ఏప్రిల్ 30న అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ఉద్యోగులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే 12వ తేదీలోగా అర్హతలను పరిశీలిస్తారు. ఆతర్వాత ఎంపిక చేసిన వారికి ఈనెల 13న ఉత్తర్వులు ఇవ్వనుండగా.. ప్రస్తుత స్థానంలో 15న రిలీవ్ అయి రైతు డిస్కంలో 18వ తేదీ నాటికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 19వ తేదీన జారీ చేసే పోస్టింగ్ ఆర్డర్ల ఆధారంగా ఈనెల 25వ తేదీ వరకు కేటాయించిన స్థానంలో చేరాలి. కమిటీ వేయాలి ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్త్తోంది. ఇటీవల రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫరూక్తో యూనియన్ ప్రతినిధులు సమావేశమై బదిలీలకు సంబంధించి చర్చించారు. రైతు డిస్కంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న డిస్కంల కన్నా ప్రత్యేక రైతు డిస్కంతో కొత్తగా జరిగే మేలు ఏమీ ఉండనందున.. ప్రతిపాదనపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న డిస్కంల నుంచి ఉద్యోగులు వెళ్తే ఖాళీలు పెరిగి ఇబ్బందులు వస్తాయని సీఎండీకి వివరించారు. ఏం చేద్దాం? రైతు డిస్కంలో వెళ్లాలా, వద్దా అన్న మీమాంసలో విద్యుత్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. తొలిదశలోనే దరఖాస్తు చేసుకుని వెళ్లే పదోన్నతులు త్వరగా వస్తాయని, ఇతర బెనిఫిట్లలోనూ ముందు ఉంటామని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయాన వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు, ప్రభుత్వ నీటి సరఫరా పథకాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న డిస్కం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుందని ఇంకొందరు చెబుతున్నారు. మరోపక్క డిస్కం ఏర్పాటు ప్రతిపాదననే వెనక్కి తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నందున ఉద్యోగులు డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది. కొత్త డిస్కంలోకి వెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులకు కనీస సేవా కాలాన్ని కూడా నిర్దేశించారు. ఎస్ఈ తత్సమన అధికారులకు ఏడాది, డీఈల నుంచి కింది స్థాయి అధికారులు, ఫోర్మెన్లు కింది స్థాయి ఉద్యోగులైతే రెండేళ్ల పదవీ కాలం పూర్తయితే అర్హులుగా నిర్ణయించారు. అర్హతల, టీజీఆర్పీడీసీఎల్(రైతుడిస్కం) పాలసీ మేరకు పదోన్నతులు ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, ఏసీబీ, క్రిమినల్ వంటి కేసులు నమోదై వారిని బదిలీకి అనర్హులుగా ప్రకటించారు. వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ ప్రొటెక్షన్ వంటివి నిబంధన మేరకు ఉంటాయని.. ఈపీఎఫ్, జీపీఎఫ్, పెన్షన్ యథాతధంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. -
నకిలీ.. చెలామనీ !
ఆశ.. దురాశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ముద్రణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫలితంగా అచ్చు ఇలాంటి నట్లను తయారుచేయడం అసాధ్యం. కానీ అచ్చమైన నోట్ల తరహాలోనే నకిలీ నోట్లు తయారు చేస్తామని, వాటిని సులువుగా చలామణిలోకి తీసుకుకురావడం అనతి కాలంలోనే డబ్బు సంపాదించొచ్చని కొన్ని ముఠాలు నమ్మబలుతుకున్నాయి. ఇలాంటి వారిని నమ్మి ఉచ్చులో చిక్కుకుంటున్న కొందరు సామాన్యులను మోసం చేస్తున్నారు. ఆపై పోలీసులకు పట్టుబడితే ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. జూదస్థావరాలే లక్ష్యం నకిలీ నోట్ల దందా పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులు నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే చోట, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక పనుల్లో నిమగ్నమై త్వరగా ధనవంతులు కావాలనే దురాశ కలిగిన వారు, జూదం, తాగుడు వంటి వ్యక్తిగత బలహీనతలు ఉన్నవారిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకటికి నాలుగింతల నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మబలికి చలామణిలోకి తీసుకొస్తన్నట్లు సమాచారం. అక్కడ మోసం జరిగినట్టు తెలిసినా.. ఎవరూ బయటకు చెప్పలేరనే ధైర్యంతో నకిలీ కరెన్సీ ఇచ్చే వారు, చెలామణి చేసే వారు అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నకిలీ కరెన్సీ అప్పగింతలు జరిగే సమయంలో ఆయా బృందాల్లోని వారినే పోలీసుల రూపంలో ప్రవేశపెట్టి మరింత డబ్బు గుంజుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులకు చెప్పండి ఇతరులను మోసం చేద్దామనే ఉద్దేశంతో దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపే వ్యక్తులే ఎక్కువగా నష్టపోతున్నారు. అయినా ఇవి చట్టవ్యతిరేకమైన చర్యలు కావడంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనిని అదనుగా చేసుకుని నకిలీ నోట్ల గ్యాంగులు ఒకరి తర్వాత ఒకరిపై వల వేస్తూ తమ పని కానిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. మోసపోయామని తెలుసుకున్న వ్యక్తులు సైతం తమ దగ్గరి దొంగనోట్లను చలామణిలోకి తెచ్చే సాహసం చేయకుండా గుమ్మున ఉండిపోతున్నారు. ఆ నకిలీ కరెన్సీని కాల్చేయడమో లేదా చించేయడమో చేస్తున్నారు. ఎవరైనా నకిలీ నోట్లు ఇస్తామంటూ సంప్రదింపులు జరిపితే వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయడం ఉత్తమమని.. తద్వారా వారే కాక మరికొందరు మోసపోకుండా కాపాడినట్లవుతుందని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల అశ్వారావుపేటలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో ఫర్నిచర్ కొనుగోలు చేసి నగదు రూపంలో బిల్లు చెల్లించాడు. ఫర్నీచర్ షాపు యజమాని ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోట్లుగా తేలింది. దీంతో పోలీసులు లోతుగా విచారిస్తే నకిలీ నోట్ల దందా గుట్టు రట్టయింది. ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్టుగా తేలింది. ఇది జరిగిన కొద్దిరోజులకే వరంగల్లో మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠా సభ్యులు రసాయన చర్యల ద్వారా అసలు నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారు చేయవచ్చంటూ ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించినట్టు తేలింది. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం వాసి, మరొకరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన వ్యక్తిగా తేలింది. ఈ రెండు మండలాలు రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉండడం విశేషం. నకిలీ కరెన్సీ దందాపై పోలీసు శాఖ మరింత లోతైన విచారణ ఇప్పటికే మొదలుపెట్టింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే సైబర్ నేరాలు జిల్లా వాసులను ఇబ్బంది పెడుతుంటే చాపకింద నీరులా నకిలీ కరెన్సీ రాకెట్ కూడా కొనసాగుతుందా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. నకిలీ నోట్లకు సంబంధించి వివిధ జిల్లాల్లో ఇటీవల నమోదైన కేసుల్లో జిల్లా వాసుల పాత్ర బయటపడడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో నకిలీ నోట్ల దందాపై జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
అగ్నిప్రమాదంలో రైతులకు తీరని నష్టం
టేకులపల్లి: మండలంలోని కొత్త తండా(పి)లో జరి గిన అగ్నిప్రమాదంతో పలువురు రైతులకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రైతులు భూక్యా చీనా, ధరావతు చీనా గంగ ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి చేన్ల మీదుగా విద్యుత్ తీగలు వెళ్తుండగా, మంగళవారం గాలిదుమారానికి ఒకదానికొకటి రాసుకుని తెగిపడటంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి భూక్యా చీనాకు చెందిన 25 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు, బోరు కేసింగ్ కాలిపోగా, ధరావతు చీనాకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. లైన్లను సరిచేయాలని విద్యుత్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై లైన్మెన్ దేవ్సింగ్ను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రాలేదని, ప్రమాదం ఎలా జరిగిందో పరిశీలిస్తామని తెలిపారు. -
వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
టేకులపల్లి: సుజాతనగర్ మండలం స్టేషన్బేతంపూడికి చెందిన తేజావత్ టిల్లా (36) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెంకట్యాతండాకు చెందిన సరోజతో టిల్లాకు వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయ సీజన్లో సాగు పనులు, మిగతా సమయంలో కూలీకి వెళ్లే ఆయన మూడురోజుల క్రితం తండాలో మిర్చి ఏరే పనికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలో పనిచేశాక స్వగ్రామానికి వెళ్తూ రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు ఆయనను 108 అంబులెన్స్లో కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ డ్రైవర్ అరెస్ట్బూర్గంపాడు: గతంలో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ఖదిర్ను పలు అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఖదిర్ కారుడ్రైవర్గా పనిచేసిన ఫహీమ్ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఖమ్మం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ కథనం మేరకు.. బూర్గంపాడు సబ్రిజిస్ట్రార్గా పనిచేసిన ఖదిర్పై ఫిర్యాదుల మేరకు గత జూన్లో కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. ఖదిర్ తన కారుడ్రైవర్ ఫహీమ్తో లావాదేవీలు నడిపించి, లంచాలను అతని ఫోన్పేతో బదిలీ చేయించుకున్నట్లు తేలడంతో ఫహీమ్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి.. సుజాతనగర్: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమాదేవి కథనం మేరకు.. కోమటిపల్లికి చెందిన బాదావత్ శ్రీను (45) గ్రామంలోని చెరువు వద్దకు సోమవారం వెళ్లాడు. ఇంటికి రాకపోయే సరికి కుంటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం చెరువు వద్ద అతడి దుస్తులు కనిపించగా.. చెరువులో గాలించడంతో మృతదేహం దొరికింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవుశాత్తు మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. -
ఇంటాబయట.. ఆట !
పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సెలవుల్లో రోజూ ఆటలతో సరదాగా గడిపేద్దామని చిన్నారులు భావిస్తారు. వీరి కోరికను తల్లిదండ్రులు మన్నించినా ఒక క్రమపద్ధతిలో కొనసాగితేనే ప్రయోజనం ఉంటుంది. పిల్లల అభిరుచికి తగినట్లుగా మెదడు, శరీరానికి వ్యాయామం చేయించే ఆటలు ఆడిస్తే అటు మనోవికాసం.. ఇటు వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. – ఇల్లెందురూరల్ఎండవేడిలో ఆరుబయట ఆడితే పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్డోర్ గేమ్స్పై ఆసక్తి కలిగించాలి. ఇలాంటి ఆటలతో శారీరక కదలిక లేకపోయినా మెదడుకు పదును పెడుతాయి. పుస్తకాల్లో పజిల్స్ పూరించడంతో సమస్య పరిష్కారానికి ఉత్తమ మార్గాలు అన్వేషించే నైపుణ్యాలు అలవడుతాయి. క్యారమ్స్, చెస్తో ఏకాగ్రత, లక్ష్యంపై గురి ఏర్పర్చుకునే నైపుణ్యం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడటం ద్వారా భాష, పఠనా నైపుణ్యాలతో పాటు పద సంపద పెరుగుతుంది. మైదానాలు సిద్ధం చేయాలి దాదాపు ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. యువత వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆడుకునేలా కోర్టులతో పాటు చిన్నారులు సరదాగా గడిపేందుకు జారుడు బల్లలు, ఊయలలు, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణ లోపంతో కొన్ని పాడైనందున వేసవి సెలవుల నేపథ్యాన వీటిని శుభ్రం చేయించి అందుబాటులోకి తీసుకురావాలి. చిన్నారులు ఆడుకునేలా, వ్యాయామం చేసేలా కనీస సౌకర్యాలు కల్పించాలి. ఏ ఆటలు ఎక్కడ ఆడాలంటే.. వాతావరణం చల్లగా ఉన్న సమయాన ఉదయం, సాయంత్రం ఆరుబయట క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, లాంగ్జంప్, బాస్కెట్బాల్, జాగింగ్ వంటి ఆటలు ఆడుకోవాలి. అందరికీ ఆసక్తి ఉండే ఈత విషయానికొచ్చేరికి రక్షణ సామగ్రి ధరించడం, నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఇక ఎండ వేడి అధికంగా ఉండే మధ్యాహ్న సమయాన నీడ ప్రదేశాల్లో చెస్, క్యారమ్స్, వైకుంఠపాళి ఆడుకోవచ్చు. ఇదే సమయాన పద వినోదం, కాగితాల వ్యర్థాలతో బొమ్మల తయారీ, పెయింటింగ్, పుస్తకాలు చదువుకోవడం వంటివి సాధన చేస్తే సెలవులు సద్వినియోగం అవుతాయి. ఇవీ ప్రయోజనాలు వ్యాయామం ప్రతీ వ్యక్తికి శారీరక దారుఢ్యాన్ని అందిస్తుంది. పరుగెత్తడం, ఎగరడం, దూకడం ద్వారా కండరాలు బలోపేతం అవుతాయి. జట్టు క్రీడలతో సాంఘిక జీవనం, స్నేహసంబంధాలు మెరుగవుతాయి. మైదానంలో ఆడే ఆటలు సమస్య పరిష్కారం, ఏకాగ్రత, విమర్శనాత్మక ఆలోచన, సమయోచిత నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. తాజా గాలి, సూర్యకాంతి యువతకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తాయి. లేలేత కిరణాలు ప్రసరించే సమయంలో ఎండకు ఉండటంతో శరీరానికి విటమిన్ డీ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలపడుతాయి. అలాగే, శారీరక శ్రమతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. సెలవుల్లో వడదెబ్బకు గురికాకుండా సమయానుకూలంగా క్రమపద్ధతిలో ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా పిల్లలకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆటవిడుపు లభిస్తాయి. అంతేకాక అందరితో కలిసిపోవడం అలవాటుగా మారుతుంది. –డాక్టర్ మోతీలాల్, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు ప్రస్తుతం అన్ని వయస్సుల వారు సెల్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం సెల్ఫోన్ చూడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలా కాకుండా సెలవుల్లో ిపిల్లలను సెల్ఫోన్కు దూరంగా ఉంచాలంటే ఆటల వైపు దృష్టి మళ్లించాలి. – డాక్టర్ కె.రఘు, పీడీ, సుభాష్నగర్ హైస్కూల్, ఇల్లెందు మండలం -
సీతమ్మసాగర్ నిర్వాసితులతో సమావేశం
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల గ్రామంలో సీతమ్మసాగర్ భూనిర్వాసితులతో మంగళవారం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మూడో ఫేజ్కు సంబంధించి భూములు కోల్పోతున్న ఎల్ఎన్రావుపేట, పెద్దబండిరేవు గ్రామాలకు చెందిన రైతులు తమ భూములకు రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా సబ్ కలెక్టర్ ఏజెన్సీలోని ప్రభుత్వ ధర ప్రకారం రూ. 11.50 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. రైతులు ఒప్పుకోకపోవడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, కలెక్టర్ మరోసారి గ్రామసభ నిర్వహించడానికి సమయం ఇస్తారని సబ్ కలెక్టర్ రైతులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్కుమార్, ఇరిగేషన్ డీఈ తాటి నాగేశ్వరరావు, డీఏఓ రాజేంద్రకుమార్, సర్పంచ్ బాగే ఖాదర్బాబు, ఆర్ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకులతో అర్చన నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రూ.1.70లక్షల విలువైన వెండి పళ్లెం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి భద్రాచలం వాస్తవ్యులు వెండిపళ్లెంను మంగళవారం వితరణగా అందజేశారు. భద్రాచలానికి చెందిన మద్దాల భవన్సాయి మెహర్ 655 గ్రాముల వెండితో రూ.1.70లక్షల విలువైన పళ్లెం చేయించాడు. దీనిని స్వామి వారి పాదాల చెంత పూజల అనంతరం ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అధికారులు కత్తి శ్రీనివాస్, అర్చకులు, దాత కుటుంబీకులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు పోటీలు సూపర్బజార్(కొత్తగూడెం): అథ్లెటిక్స్ జిల్లా జట్లను ఎంపిక చేసేందుకు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం పోటీలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓ.సుధాకర్రావు ప్రారంభించి మా ట్లాడారు. క్రీడాసాధనతో వ్యక్తిగతంగా ప్రతిభ చాటడమే కాక ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అసో సియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికై న జట్లు 10వ తేదీన హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డి.మల్లికా ర్జున్, కోచ్లు నాగేందర్, ఏ.వందన, ఎస్.కే.రియాజ్పాషా పాల్గొన్నారు. 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈనెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈమేరకు మంగళవారం వివిధ శాఖల అధికా రులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు రెండేసి సెషన్లలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2–30 నుంచి 5–30 వరకు పరీక్షలు జరగనుండగా జిల్లాలో 6,684 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దీంతో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేసవి నేపథ్యాన ప్రతీ కేంద్రంలో ఇద్దరు ఏఎన్ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. త్వరలోనే చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఓగా పద్మావతి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా ఎస్.పద్మావతి నియమి తులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణలో డిప్యూ టేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ గతంలో డీఆర్ఓగా పనిచేసిన హౌసింగ్ పీడీ రవీంద్రనాధ్ బదిలీ అయ్యాక ఎవరినీ నియమించలేదు. దీంతో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ డీఆర్ఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమేకు పద్మావతిని పూర్తిస్థాయి డీఆర్ఓగా నియమించారు. -
నిజాయితీకి బహుమతి
కరకగూడెం: కరకగూడెంనకు చెందిన రావుల ఓజస్వి రెండు నెలల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక పర్సు దొరికింది. అందులో పరిశీలించగా రూ.వేలల్లో నగదు, విలువైన చేతి గడియారం ఉంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పగానే ఆయన తీసుకెళ్లి స్థానిక పోలీసులకు అప్పగించారు. కొద్దిసేపటికే ఆ పర్సు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు. తమ కష్టార్జితం తిరిగి దొరకడంతో వారి కళ్లల్లో ఆనందం చూడగానే ఓజస్వికి ఎంతో సంతోషం కలిగింది. అంతేకాక ఓజస్వి నిజాయితీని మెచ్చుకున్న ఆ దంపతులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. వెలకట్టలేని వస్తువులు దొరికినప్పుడు ఆశ కలిగినా.. వాటిని యజమానులకు ఇచ్చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి గొప్పదని.. తద్వారా గౌరవం లభిస్తుందని చిన్నారి ఆ రోజే తెలుసుకుంది. -
ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు
భద్రాచలంటౌన్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న సిబ్బందిని ప్రోత్సహించేలా ‘ప్రగతి చక్ర’ అవార్డులు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. భద్రాచలం డిపోలో మంగళవారం జరిగిన సమావేశంలో రీజియన్ స్థాయిలో ఎంపికై న వారికి ఆయన అవార్డులు అందజేసి మాడ్లాడా రు. ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడం, సమయపాలన పాటించడమే కాక అత్యుత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించేందుకే పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం రీజియన్ పరిధిలో 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్ఎం అవార్డులు అందజేశారు. డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, ఖమ్మం డీఎంలు జంగయ్య, రామయ్య, లక్ష్మీనారాయణ, శివప్రసాద్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్ఐ చొరవతో నలుగురికి కృత్రిమ కాళ్లువైరా: ఉమ్మడి జిల్లాలోని నలుగురు దివ్యాంగులకు వైరా ఎస్ఐ పుష్పాల రామారావు చొరవ తో హైదరాబాద్కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులు కృత్రిమ కాళ్లను సమకూర్చారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన కొప్పుల రామకృష్ణారావు, గొల్లపూడికి చెందిన బంకా మల్లయ్య భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటకు చెందిన తుర్రం శ్రీరాములుతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీసాల వెంకటసత్యనారాయణ పలు కారణాల వల్ల ఒక్కో కాలు కోల్పోయారు. వీరి సమస్యను ఎస్ఐ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులకు వివరించా రు. దీంతో నలుగురికి కృత్రిమ కాళ్లను సమకూర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఎస్ఐని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాలిక అదృశ్యందమ్మపేట: మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బాలిక కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక (17) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి, ఇంటి వద్దనే ఉంటోంది. కాగా ఈ నెల 3న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
నిరంతర పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
పాల్వంచ: ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని, నిరంతర పోరా టాలతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ లక్ష్మీ బాంకెట్ హాల్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించగా.. కూనంనేని పాల్గొని మాట్లాడారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమ్యూనిస్ట్ కార్యకర్తలు లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో లౌకిక వాదాన్ని కాపాడుకోవాలని సూచించా రు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలన్నా రు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే బలమైన శక్తిగా ఎదగలమని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, సార య్య, సలిగంటి శ్రీను, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్రావు, కంచర్ల జమలయ్య, మురళి, వెంకటేశ్వర్లు, భాస్కర్, దస్రు, రాహుల్, వెంకటేశ్వర్లు, ఫహీం, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
చర్ల: ఇందిరమ్మ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించడంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చర్ల మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. తొలుత సత్యనారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లపై ఆరా తీశారు. అలాగే, కేంద్రంలో టార్పాలిన్లు, తాగునీటి వసతులపై సూచనలు చేశారు. అంతేకాక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయడమే కాక మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్... ప్రతీ దశలో నాణ్యతపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆపై చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్... మెటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, ఔట్ పేషెంట్ విభాగాల్లో పరిశీలించారు. ఆస్పత్రిలో త్రాగునీటి కొరత ఉన్నట్లు తెలియడంతో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఈదయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ సాయివర్ధన్, వైద్యులు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావుతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ముకేశ్, లావణ్య, అరుణ్, రాము పాల్గొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సూపర్బజార్(కొత్తగూడెం): ఇంటర్మీడియట్, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. పలు అంశాలపై అధికారులతో మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించాలని తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, చండ్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థులపై శ్రద్ధ కనబర్చాలని.. తద్వారా సప్లమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా చూడాలని చెప్పారు. ఇక పాఠశాలల్లో అభివృద్ధి పనులను పునఃప్రారంభం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
ఇల్లెందురూరల్: ఆయిల్పామ్ సాగుతో ఏళ్ల తరబడి రైతులకు ఆశించిన మేర లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు మంగళవా రం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఇల్లెందు మండలం సుదిమళ్ల రైతువేదికలో ఉద్యాన పంటల సాగుపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అత్యధికంగా వంట నూనెల దిగుబడినిచ్చే పంటల్లో ఆయిల్పామ్ ప్రధానమైనదని చెప్పారు. ఎకరం వరిసాగుకు అవసరమయ్యే నీటితో మూడెకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయొచ్చని తెలిపారు. ఈ మేరకు మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా రైతులు దృష్టి సారించాలని చెప్పారు. ఈ పంట సాగు చేస్తే నిర్వహణ, అంతర్పంటల సాగుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇస్తుందని వెల్లడించారు. మార్కెట్ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర, సర్పంచ్లు శారద, మంగమ్మ, సాయమ్మ, ఏడీఏ లాల్చంద్, ఏఓలు సతీశ్, అన్నపూర్ణ, ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఉద్యాన అధికారి స్రవంతి, ఆత్మకమిటీ చైర్మన్ మంగీలాల్, ఏఈఓలు పాల్గొన్నారు. డీఏఓ బాబూరావు -
వంద శాతం ఉత్తీర్ణత నమోదు కావాలి
కొత్తగూడెంఅర్బన్: ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకున్నామని జిల్లా విద్యా శాఖా ధికారి బి.నాగలక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఫలితాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 90.58 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, తక్కువ ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అంతేకాక ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ జూన్లో జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు. కాగా, ఈనెల 11 నుంచి పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు, 12నుంచి పదో తరగతి రెమిడియల్ క్యాంపుల నిర్వహణతో పాటు జయశంకర్ బడిబాట, లైబ్రరీ డే, ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరర్ డే నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను డీఈఓ సన్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.శంభుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ మాధవరావు, ఎంఈఓలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ ఫలితాలపై సమీక్షలో డీఈఓ -
ప్రధాని సభను జయప్రదం చేయండి
చుంచుపల్లి: హైదరాబాద్లో ఈ నెల 10న జరగనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండగా.. జిల్లా నుంచి పార్టీ శ్రేణు లు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వాన అమలుచేస్తున్న పథకాలతో దేశంలో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాన్ని సైతం చేజిక్కించుకుందని తెలిపారు. కాగా, మహిళలకు చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల బిల్లును ప్రవేశపెడితే అడ్డుకున్న పార్టీల తీరును ప్రజలు గుర్తించారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పాలన సాగుతున్న నేపథ్యాన రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ గెలుపొందడం ఖాయ మని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ -
సమ్మర్ క్యాంపులతో నైపుణ్యాల అభివృద్ధి
భద్రాచలం: వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న క్యాంపుల వలన విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి సాధించవచ్చని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలి కల, వికాసం పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్స్, నృత్యం, పాటలు, కంప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించిన అనంతరం పీఓ మాట్లాడారు. విద్యార్థులోని మేధాశక్తి, ప్రతిభను వెలికితీయడానికి క్యాంప్లను నిర్వహిస్తుంగా.. భవిష్యత్లో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించి అభినందించారు. ట్రైబల్ వెల్ఫే ర్ డీడీ అశోక్, క్యాంప్ ఇన్చార్జ్ నాగరాజు, పీడీలు, పీఈటీలు, ఆర్పీలు వసంత్, మహాలక్ష్మి, నటరాజ్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జాతర పోస్టర్లు ఆవిష్కరణ రెండేళ్లకోసారి భద్రాచలంలోని అశోక్నగర్ కొత్తకాలనీలో జరిగే నాయకపోడు తెగ ఇలవేల్పు బాల కొర్రాజుల స్వామి జాతర పోస్టర్లను పీఓ రాహుల్ ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతర జరుగుతుందని పెద్దలు వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు తెల్లం రమణయ్య, పుల్లయ్య, మారయ్య, కొండయ్య, లక్క రామకృష్ణ, పాశం భరత్, జమ్మల శ్రీను, ముర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
సంగీత సాధన..
ఆన్లైన్ శిక్షణ ఇల్లెందురూరల్: చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడమంటే ఇష్టం. నా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో సంగీతంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. కానీ స్థానికంగా శిక్షణ అందుబాటులో లేకపోవడంతో బందువుల ద్వారా తెలుసుకుని బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థకు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనుమతి లభించడంతో క్రమం తప్పకుండా ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందుతున్నా. శిక్షణ తీసుకుంటూనే సాధన చేస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోంది. మంచి గాయనిగా ఎదగాలన్న నా ఆకాంక్షకు వేసవి సెలవులు సద్వినియోగం అవుతున్నాయని ఆనందంగా ఉంది. –గాదె జియాన్షి, 5వ తరగతి, కొల్లాపురం, ఇల్లెందు మండలం -
పీఏసీఎస్ల్లో పాత పాలకవర్గాలకే పగ్గాలు
టేకులపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు ఎన్నికలు నిర్వహించే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సంఘాల కమిటీలను గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్ లను నియమించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఇటీవల విచారణ చేపట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకు గతంలో ఎన్నికై న పాలకవర్గాలనే కొనసాగించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 21 పీఏసీఎస్ల్లో చైర్మన్లు, వైస్చైర్మన్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగానే టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు సైతం పర్సన్ ఇన్చార్జ్ కె.ఆదినారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించగా, సీఈఓ పొన్నోజు ప్రేమాచారి, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్చైర్మన్లు -
భగవంతుడిని ప్రేమతో పూజించండి
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడిని పవిత్ర ప్రేమతో పూజించాలని.. అప్పుడే స్వామి అనుగ్రహం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్బోధించా రు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలా జీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు మంగళవారం హాజరైన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు నెలకొల్పే ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతీఒక్కరూ నేను, నాది అనే అహం విడిచిపెట్ట డమే కాక మానవజాతికి గతి, గమ్యం, దిక్కు, రక్షకుడు దేవుడేనని గుర్తించాలని సూచించారు. ఆలయాలు, ఆలయ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. అలా కాకుండా ఆలయ వ్యవస్థ చెడితే సమాజానికే అరిష్టమని స్పష్టం చేశారు. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయానికి రెండేళ్ల క్రితం వచ్చానని జీయర్ స్వామి గుర్తు చేసుకున్నారు, ఆలయ నిర్మాణకర్తలు 2,232 ఎకరాలు భూమి ఇచ్చారని, ఆ రోజుల్లోనే గర్భాలయం, అర్థమండపం, ముఖ మండపం, బేడామండపంతో కూడిన సువిశాల ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయంలో ప్రస్తుతం మహాకుంభాభిషేకాన్ని ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణను జీయర్స్వామి అభినందించారు. తొలుత ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యాన జీయర్స్వామిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులతోపాటు సర్పంచ్ లాకావత్ లక్ష్మి, మేనేజర్ పాకాల వెంకటరమణ, కమిటీ సభ్యులు పర్సా వెంకటేశ్వర్లు, బొంకూరి సురేష్, వనమా శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, బోడా పద్మ, శ్రీను, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లాల నర్పింహారావు, వనమా గాంఽధీతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి -
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. రెవెన్యూ సమస్యలు, పింఛన్లు తదితర సమస్యలు, వివిధ సంక్షేమ పథకాల కోసం అర్జీలు పెట్టుకున్నారని చెప్పారు. భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డీఏఓ రాజేంద్రనాథ్, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట


