breaking news
Bhadradri District News
-
● పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ సందర్శన
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్ : దమ్మపేట మండలం జమేదార్బంజర, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పాత అల్లిగూడెం, నారంవారిగూడెం కాలనీ, నారంవారిగూడెం, జమ్మిగూడెం, ఊట్ల పల్లి, వినాయకపురం, అనంతారం, గాండ్లగూడెం తదితర కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విద్యా చందన, తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు పాల్గొన్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ కూడా పలు కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నాని, మొత్తంగా 82.65 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 85.13 శాతం, అశ్వారావుపేటలో 87.85, చంద్రుగొండలో 85.93, చుంచుపల్లిలో 66.19, దమ్మపేటలో 85.73, ములకలపల్లిలో 86.59, పాల్వంచ మండలంలో 86.58 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. -
మలిదశ మెరుగే..
ఖమ్మం గంటకు గంటకు ఇలా...చుంచుపల్లి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల పాటు చలి ప్రభావంతో 21.93 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఓటర్లు తరలి రావడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. 11 గంటల వరకు 57.57 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు కృషి చేశారు. ఎట్టకేలకు చివరకు 82.65 శాతం పోలింగ్ నమోదు కాగా, ఏడు మండలాల పరిధిలో 1,96,395 మంది ఓటర్లకు గాను 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు రావడం విశేషం. కాగా, మొదటి విడత జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 71.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మొదటి విడత కంటే రెండో దశలో 11 శాతానికి పైగా ఓటింగ్ పెరిగింది. ఉన్నతాధికారుల పరిశీలన.. మలి విడత పోలింగ్ ప్రక్రియను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చుంచుపల్లి మండలంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్రెడ్డి, చుంచుపల్లి తండా, బాబూక్యాంప్, రామాంజనేయకాలనీ కేంద్రాలను ఎస్పీ రోహిత్రాజు తనిఖీ చేశారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 138 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 386 మంది, 1,123 వార్డులకు 2,820 మంది పోటీ పడగా, పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదట వార్డులకు, తరువాత సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆ తర్వాత 82.91 -
కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రటేకులపల్లి: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఒంటెత్తు పోకడలతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలు సామాజిక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే వారు పార్టీని వీడుతున్నారని, ఇదే కొనసాగితే ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ అన్నారు. ఆదివారం టేకులపల్లిలోని హరిప్రియ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకుడు భూక్య దళ్సింగ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావుతో పాటు మాజీ దళకమాండర్ పూనెం సమ్మయ్య, పలువురు వార్డు సభ్యులు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటి అధిక స్థానాలు గెలుచుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిండిగల రాజేందర్, బొమ్మెర్ల వరప్రసాద్, ఆమెడ రేణుక, హరిసింగ్ నాయక్, రవి పాల్గొన్నారు. -
మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్దే గెలుపు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన మెచ్చు ఈదప్ప విజయం సాధించాడు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారుడు పండు సాంబశివరావుపై ఆయన 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంతేకాక పది వార్డులకు ఏడింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. రాజుపేట బీఆర్ఎస్ కై వసం కూసుమంచి: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు బానోత్ మహేష్ సర్పంచ్గా గెలుపొందాడు. పాలేరు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వగ్రామం ఇదే కావడంతో నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మహేష్ కాంగ్రెస్ బలపర్చిన కుర్రా రమేష్పై 23 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. బీటెక్ సర్పంచ్ ! కామేపల్లి: కామేపల్లి మండలం పొన్నేకల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గుగులోత్ భూమిక సర్పంచ్గా గెలిచింది. ఇక్కడ మొత్తం 842 ఓటర్లకు గాను 728 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు భూమిక 603 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. బీటెక్(ఈఈఈ) పూర్తి చేసిన ఆమె 23 ఏళ్ల వయస్సులోనే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికవడం విశేషం. విద్యావంతురాలినైన తాను గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రచారంలో వెల్లడించింది. ఎమ్మెల్సీ స్వగ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం విజయం తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ స్వగ్రామమైన పిండిప్రోలులో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కామళ్ల సువార్త 381ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆమెకు 1,750 ఓట్లు రాగా మాస్లైన్ అభ్యర్థి ఆరెంపుల కేతమ్మకు 1,369 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్, మాస్లైన్ అభ్యర్థులు నాలుగు వార్డులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ఎనిమిది వార్డులు దక్కాయి.పోరాడి .. విజయం సాధించిములకలపల్లి : తిమ్మంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై న తుర్రం శ్రీనివాసరావు అవిశ్రాంతంగా పోరాడుతూ, పరాజయాలను అధిగమిస్తూ విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. శ్రీనివాస్ టీడీపీ నుంచి 2013లో పీఏసీఎస్ డైరెక్టర్గా పోటీ చేసి పరాయజం పాలయ్యారు. ఆ తర్వాత ఐక్యకూటమి అభ్యర్థిగా ఉమ్మడి తిమ్మంపేట జీపీ సర్పంచ్గా పోటీ చేసి మరోమారు ఓటమి చెందారు. 2019లో తిమ్మంపేట ఎంపీటీసీగా శ్రీనివాసరావు భార్య ఈశ్వరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా విజయం దరిచేరలేదు. అయినా శ్రీనివాసరావు పట్టువదలని విక్కమార్కుడిలా ఈ దఫా తిమ్మంపేట సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి, సమీప సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అభ్యర్థి మడకం రాజులుపై 264 ఓట్ల ఆఽధిక్యంతో విజయం సాధించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికకరకగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు తోలెం బాలకృష్ణ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. పాల్వంచలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన బాలకృష్ణ.. ఈ నెల 20 నుంచి 24 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంకా ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకూ ఎంపికై నట్లు స్పోర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. -
రేపు బాక్సింగ్ జట్ల ఎంపిక
కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ జట్ల ఎంపిక పోటీలు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు. కొత్తగూడెంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యాన సీనియర్స్ విభాగంలో మహిళలు, పురుషుల జట్లను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు నిర్ధారణ పత్రంతో ఉదయం 9 గంటల వరకు ప్రగతి మైదానానికి రావాలని, వివరాల కోసం 98854 42131, 99490 83202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వెయిట్ లిఫ్టింగ్లో ప్రతిభమణుగూరు రూరల్ : రాష్ట్ర బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్లో మణుగూరు ప్రాంతానికి చెందిన కొమురెల్లి రవీందర్రెడ్డి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఖమ్మంలో జరిగిన పోటీల్లో 93 కేటగిరీ రవీందర్రెడ్డి 115 కేజీల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. జనవరి 6న హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఆత్మలింగేశ్వరాలయంలో పూజలుపాల్వంచ: పట్టణంలోని శ్రీ ఆత్మలింగేశ్వరాలయాన్ని ఉత్తరప్రదేశ్లోని మధురలో మలూక పీఠానికి చెందిన పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆదివారం సందర్శించారు. పీఠం బాధ్యులైన జగత్ గురుస్వామి రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్య బృందంతో ఈ నెల 6 నుంచి ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. 8వ రోజు యాత్రలో ఆత్మలింగేశ్వరాలయాన్ని సందర్శించారు. పూజలు నిర్వహించి, భిక్ష స్వీకరించారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో పరిరక్షణకు యాత్ర చేపట్టినట్లు స్వామీజీలు తెలిపారు. దర్మకర్త మచ్చా శ్రీనివాసరావు, అర్చకుడు జితేంద్ర కుమార స్వామి పాల్గొన్నారు. -
మేమూ ఓటేశాం..
● ఆసక్తి, ఆనందంతో తొలిసారి ఓటు హక్కు వినియోగం ● ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు యువతీయువకుల్లో హర్షంమొదటిసారి నా ఓటు హక్కు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందుకే బాధ్యతగా ఓటేశాను. – కొర్రా అంజలి, కామేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. అభివృద్ధి చేస్తా రని భావించిన అభ్యర్థులను నేను ఓటు వేశారు. – లకావత్ అమృత, పునుకుల తొలిసారి ఓటు హక్కు లభించిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటేశారు. రాజ్యాంగ హక్కును వినియోగించుకుని.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని.. మొదటిసారి ఓటేయడం బాధ్యతగా భావించడంతోపాటు మధురానుభూతిని కలిగించిందని.. గెలుపులో యువత ఓట్లే కీలకమని.. సమర్థులైన సర్పంచ్ల ఎన్నికల్లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని యువ ఓటర్లు పేర్కొన్నారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు ఆసక్తి, ఆనందంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. – దమ్మపేట/అశ్వారావుపేట రూరల్/చుంచుపల్లి/పాల్వంచ రూరల్/కామేపల్లి -
ఒక ఓటుతో వరించిన విజయం
కూసుమంచి/తిరుమలాయపాలెం: కూసుమంచి మండలంలోని జుజుల్రావుపేట సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారుడు దాట్ల సలీమ్ ఒక్క ఓటుతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతుదారు దాట్ల అనూషపై తొలుత మూడు ఓట్లతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం తెలపగా మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. చివరకు సలీమ్ను ఒక ఓటుతో సర్పంచ్ పదవి వరించింది. ●తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోనూ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ బలపరిచిన గడుపుడి వెంకటనారాయణ సర్పంచ్గా విజయం సాధించారు. వెంకటనారాయణకు 312 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడుపుడి వీరభద్రంకు 311 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వార్డుల వారీగా బీఆర్ఎస్కు 90 ఓట్ల మెజార్టీ రాగా, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. ●కూసుమంచి మండలం నేలపట్ల గ్రామపంచాయతీలో కూడా రీకౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు నూకల శోభన్బాబు నాలుగు ఓట్లతో విజయం సాధించాడు. ఇక కూసుమంచి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు కొండా కృష్ణవేణి వేయి ఓట్ల మెజార్టీతో గెలవగా.. జీళ్లచెరువు కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ 400పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. మునిగేపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గంగా స్రవంతి 250 ఓట్లతో విజయం సాధించడం విశేషం. -
వాగ్వాదాలు.. స్వల్ప ఘర్షణలు
అశ్వారావుపేటరూరల్:గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. మండలంలోని నారాయణపురం, ఊట్లపల్లి, జమ్మిగూడెం గ్రామ పంచాయతీల్లో ఇరుపార్టీల వర్గీయు ల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జమ్మిగూడెం పంచాయతీలో ఆదివారం తెల్లవారుజాము న కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఓటర్లకు నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్వారిపై దాడులు చేసి సెల్ఫోన్లు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఊట్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయు ల మధ్య అభ్యర్థుల ప్రచారంపై ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. నారాయణపురం కేంద్రంలో పోలింగ్ సమయం ముగిశాక గ్రామానికి చెందిన బండి అమూల్య ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్గీయులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో అమూల్య కిందపడిపోగా, కాలుకు స్వల్ప గాయం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సీఐ నాగరాజు, ఎస్సై యయాతీ రాజు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
● అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో పనులు ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అర్బన్: ఖమ్మంలో జరుగుతున్న అభి వృద్ధి పనుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పది కాలాలు మన్నికగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఆదివారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, కార్యాచరణపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా చెరువులు కలుషితం కాకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం ద్వారా రూ.249 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఖానాపురం ఊరచెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు 8.5 కి.మీ. మేర ట్రంక్ పైప్లైన్, ధంసలాపురంలో 44 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోటలో 9.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ పనులపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి, కేఎంసీ ఎస్ఈ వి.రంజిత్, కార్పొరేటర్లు ఆళ్ల నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామయ్యకు వెండి పల్లెం బహూకరణ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, రామలక్ష్మి రూ.1.50 లక్షల విలువైన వెండి పళ్లెం బహూకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. -
అత్యధికం హస్తగతం
చుంచుపల్లి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ఆదివారం ముగియగా.. ఈ దశలోనూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు నిలవగా, సీపీఐ మూడో స్థానం దక్కించుకుంది. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చుండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ, దమ్మపేట మండలాల పరిధిలోని 156 స్థానాలకు గాను 16 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరగకపోగా, పాల్వంచ పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్డ్ అభ్యర్థి లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 138 గ్రామపంచాయతీలు, 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,820 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధికంగా 80 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ బలపర్చిన వారు 31, సీపీఐ మద్దతుదారులు 21, సీపీఎం మద్దతుదారులు ఐదుగురు, ఇతరులు 17 చోట్ల విజయం సాధించారు. మొదటి, రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన అధిక్యం కనబరిచారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా కృషి చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని పలు పంచాయతీల్లో అధికార పార్టీ మద్దతుదారులకు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. రామయ్యను దర్శించుకున్న ఆండవన్స్వామి.. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మలిపోరుకు రెఢీ
చుంచుపల్లి: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో 16 పంచాయతీలు, 248 వార్డులు ఏకగ్రీవం కాగా, 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది శనివారం ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన స్థానాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్ల డిస్తారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. లేదంటే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు 90 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. 4,019 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఆర్ఓలు 187 మంది, పీఓలు 1,671, ఓపీఓలు 2,031 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 61 మంది. జోనల్ ఆఫీసర్లను 27 మందితో పాటు ఎఫ్ఎస్టీ టీమ్ 23, ఎస్ఎస్టీ టీమ్కు 19 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4.50 లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,420 బ్యాలెట్ బాక్సులు, 1,392 పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. బరిలో 3, 206 మంది.. జిల్లాలో రెండో విడతలో 156 గ్రామ పంచాయతీలు, 1,392 వార్డులకు గాను 16 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. పాల్వంచ మండలం పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్డ్ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయకపోగా, ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. మిగిలిన 138 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 1,384 వార్డులకు 13 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 248 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే 138 పంచాయతీల్లో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,123 వార్డులకు 2,820 మంది కాగా, మొత్తంగా 3,206 మంది బరిలో ఉన్నారు.నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు -
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత
ఇల్లెందు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పట్టిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజ్ తెలిపారు. శనివారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెంలోనూ ఇదే తరహాలో అధికారులను సన్నద్ధం చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్డీ, ఇతర ఎంఎల్ గ్రూపులు పోటీ చేస్తున్నాయని, అందుకే ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అతి సమస్యాత్మక గ్రామాలైన దామరతోగు, మామకన్ను, దనియాలపాడు, సుభాష్నగర్లో ఏకగ్రీవం కావడం శుభపరిణామం అన్నారు. జిల్లాలో 1,400 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ.. గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు భద్రత చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. భద్రాచలం మీదుగా జిల్లాలోకి వచ్చే గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని తెలిపారు. నంబర్ లేని బైక్లు, వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత్రికేయుల వాహనాలకు ప్రత్యేకంగా స్టిక్కర్లు సమకూర్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు వెంటనే పరిహారం అందజేశామని, ప్రస్తుతం జిల్లా నుంచి అజ్ఞాతంలో ఎవరూ లేరని చెప్పారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను, సీఐలు టి.సురేష్, బత్తుల సత్యనారాయణ, ఎల్.రవీందర్, ఎస్ఐలు హసీనా, సమ్మిరెడ్డి, రాజేందర్, శ్రీనివాసరెడ్డి, నాగుల్ మీరా, సైదా రవూఫ్ పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. కొత్తగూడెంటౌన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎస్పీ రోహిత్రాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బంది, అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా నగదు, మద్యం పంపిణీ చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడి -
‘వికాస తరంగణి’ ద్వారా విస్తృత సేవలు
● త్రిదండి చినజీయర్స్వామి సత్తుపల్లిటౌన్: సమాజ హితం కోసం వికాసతరంగణి విశేషమైన సేవలు అందిస్తోందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శనివారం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వికాతరంగణి ద్వారా స్వర్ణామృత ప్రాశన పంపిణీ జరుగుతోందని తెలిపారు. సమాజానికి వెన్నుముక అయిన మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడకుండా లక్షలాది మందికి అవగాహన కల్పిస్తూనే అవసరమైన వారికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీటన్నిటికి మూలాధారం శ్రీరామచంద్రుడేనని, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని మానవసేవను మాధవ సేవగా చేపడుతున్నామని తెలిపారు. అనంతరం రేజర్లలోని నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య నివాసంలో పాదపూజ నిర్వహించారు. మంత్రి తుమ్మల పూజలు సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శ్రీదేవి, భూదేవి సమ్మేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యావావచనం, రక్షాబంధనం అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏర్పాట్లు పూర్తి చేశాం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకుని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులకు ముందుగానే శిక్షణ ఇచ్చామని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసి సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అక్రమ నగదు, మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కీలక పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఓటర్లు భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పంపిణీ కేంద్రంలో పరిశీలన.. చుంచుపల్లి: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం క్లబ్లోని సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్ఓలను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఓట్లు వేయలేదని దూషిస్తున్నారు..
అశ్వాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటు వేయలేదంటూ కొందరు దూషిస్తున్నారంటూ అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామస్తులు వాపోయారు. ఓట్లు వేయలేదని కొందరు తమ ఇళ్ల ముందుకు వచ్చి తిడుతున్నారని, మహిళలను దూషిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో శనివారం స్థానిక పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. సీఐ అశోక్రెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి తగాదాలు వీడి కలిసికట్టుగా ఉండాలని సూచించారు. అయినా గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో బొల్లినేని గణేష్ ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీస్స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన -
ఓసీల్లో మహిళా ఆపరేటర్లు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తొలిసారిగా మహిళా ఆపరేటర్లు అడుగుపెట్టనున్నారు. ఆఫీస్ విధులకే పరిమితమైన మహిళలు ఇక నుంచి యంత్రాలతో బొగ్గు తవ్వకాలు చేపట్టడంతోపాటు రవాణా చేయనున్నారు. ఇందుకోసం సంస్థ సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళల నుంచి గత సెప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఓసీల్లో పనిచేసేందుకు 43 మంది ముందుకువచ్చారు. ప్రస్తుతం వారికి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు, ప్రధాన ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 డిసిగ్నేషన్తో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అనుకూలమైన యంత్రాలు.. ఓసీల్లో డోజర్లు మహిళా ఆపరేటర్లు పనిచేసేందుకు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ వైబ్రేషన్ ఉండటంతో సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటాయి. రోడ్లను లెవలింగ్ చేసేందుకు ఓసీల్లో గ్రేడర్లను, దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బరువులు ఎత్తడానికి హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగిస్తారు. 35 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన చిన్న డంపర్లు కూడా ఉన్నాయి. ఆయా యంత్రాల్లో ఆటోమేటిక్ వ్యవస్థ, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మహిళలు సులభంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మైనింగ్ జోన్లలో సేఫ్టీ రెస్పాన్స్ వాహనాలుగా ఉండే అంబులెన్స్లు కూడా మహిళా డ్రైవర్లు నడపవచ్చు. స్టాకర్ రిక్లైయిమర్, కన్వేయర్ సిస్టమ్, క్రషర్ ఆపరేటర్ వంటివి జాయ్స్టిక్, బటన్లతో నడిపే యంత్రాలపై మహిళలు తేలికగా పనిచేయవచ్చని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఒత్తిడి, శక్తి వినియోగంలేని యంత్రాలతో పని -
ఇసుక రవాణా నిలిపివేత
మణుగూరు రూరల్ : మండలంలోని ర్యాంపుల నుంచి ఇసుక రవాణా సాగించేందుకు రాజుపేట, గుట్టమల్లారం అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా తాత్కాలిక రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాజుపేట గ్రామస్తులు హైకోర్ట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఇసుక రవాణాను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించింది. దీంతో శనివారం మణుగూరు అటవీశాఖ అధికారులు రహదారులను మూసివేసి ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారు. అయితే అన్నారం, చినరాయిగూడెం ఇసుక సొసైటీ సభ్యులు మణుగూరు ఎఫ్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇసుక లారీలను నిలిపివేస్తే తమకు జీవనాధారం పోతుందని ఎఫ్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. కాగా అనుమతులు లేకుండా లారీలతో ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఓ మక్సూద్ మొహియుద్దీన్ హెచ్చరించారు. -
● న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి
గుండాల: ఏజెన్సీ ప్రాంత సమస్యలే ఎజెండాగా పోరాడుతున్న న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం కాచనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అధికార పార్టీ డబ్బు, మద్యం ఆశ చూపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకుంటోందని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. గుండాల మండలంలోని కాచనపల్లిలో జర్పుల కిష న్, గుండాలలో సీతారాములు, పడుగోనిగూడెంలో రవి, చెట్టుపల్లిలో ఇర్ప రాజేష్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు అటి కం నాగేశ్వరరా వు, బొర్ర వెంకన్న, రమేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్లు, బెదిరింపులకు భయపడేది లేదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యూడెమోక్రసీకి మద్దతు ఇస్తుండగా ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థితోపాటు ఇతర నాయకులు కిడ్నాప్లకు, బెదిరింపులకు పాల్పడతున్నారని, అయినా తాము భయపడబోమని ఆ పార్టీ నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి జగ్గాయిగూడెం గ్రామానికి చెందిన పొంబోయిన హరినాథ్ను బలవంతంగా కారులో ఎక్కించుకునిపోయి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోరం సీతారాములు, ఈసం పాపారావు, సుధాకర్, వీరన్న, తెల్లం భాస్కర్, యాసారపు వెంకన్న, అరెం నరేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు -
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
భద్రాచలంఅర్బన్: అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి బస్సులను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 36 సీట్లు ఉండే సూపర్ లగ్జరీ బస్సులు, 40 సీట్లు ఉండే డీలక్స్ బస్సులు, 49 సీట్లు ఉండే ఎక్స్ప్రెస్ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. కిలోమీటర్కు డీలక్స్ బస్సుకు రూ. 57, లగ్జరీ బస్సుకు రూ.59, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.68, ఏసీ రాజధాని బస్సుకు రూ.77 చొప్పున అద్దె చెల్లించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్వాములు వంట సామగ్రిని తీసుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బస్సులకు వెయిటింగ్ చార్జి గంటకు రూ.300గా నిర్ణయించారు. ఒక బస్సు బుక్ చేస్తే గురుస్వామితోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠ స్వాములు, అటెండరుకు చార్జి మినహాయింపు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేస్తే గురుస్వామికి రోజుకు రూ.300 చొప్పున కమీషన్ చెల్లించనున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు నిపుణులైన డ్రైవర్లను కేటాయించనున్నారు. బస్సుల కోసం డిపో మేనేజర్లను సంప్రదించాలని, ఇతర తీర్థయాత్రలకు కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అద్దెకు ఇస్తున్న యాజమాన్యం శబరిమల యాత్ర భక్తుల కోసం బస్సులను అద్దెకు ఇస్తున్నాం. కిలోమీటరు చొప్పున, వెయిటింగ్ సమయాన్ని లెక్కగట్టి తగిన ధర నిర్ణయిస్తాం. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలి. –జంగయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్, భద్రాచలం -
● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి
గుండాల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏజెన్సీలో అభివృద్ధి కావాలంటే ప్రశ్నించే, పోరాడేవారినే ఎన్నుకోవాలని, అందుకే మాస్లైన్(ప్రజాపంథా) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞాతంలో బాటన్న, కోటన్న, లింగన్న బాటలో సమస్యలపై పోరాడిన వ్యక్తి ఈసం శంకరన్న సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడని, ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపంచాలని కోరారు. అధికారులు అధికారపార్టీకే మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోందని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చండ్ర అరుణ, అభ్యర్థి ఈసం శంకర్, మాచర్ల సత్యం, సుగుణారావు, క్రిష్ణ, శాంతయ్య, జగన్, సాంబయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
టేకులపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 36 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కోరం సురేందర్, భూక్యా దేవా నాయక్, ఈది గణేష్ , బాణోతు భద్రు, బండ్ల రజిని, బోడ మంగీలాల్ పాల్గొన్నారు.ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. నేడు నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షకొత్తగూడెంఅర్బన్: ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు జిల్లాలో శనివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,852 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,472 మంది మాత్రమే హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి తెలిపారు. కొత్తగూడెంలోని పలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పరిశీలకులు ఆర్.సాంబశివరావు తెలిపారు. అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండిభద్రాచలంఅర్బన్ : భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్హౌస్లో వారు న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
రెండు మేజర్ జీపీలు హస్తగతం..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సారపాక, బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. సారపాక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన గుగులోత్ కిశోర్శివరామ్నాయక్ 2,998 ఓట్ల మెజారిటీతో, బూర్గంపాడు సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మందా నాగరాజు 571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 13 జీపీల్లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. -
లక్ష్మీదేవిపల్లి విభిన్నం..
● ఓ వైపు పంచాయతీ, మరోవైపు మున్సిపాలిటీ పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ (ఎస్) బీసీయం జాతీయ రహదారి వైపు ఉంటుంది. ఇందులో కొంత మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉంది. పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన భూక్యా విజయ్కుమార్ భార్య మంజులను ఈసారి బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో ఇక్కడ ద్విముఖ పోటీ ఉంటుంది. మొత్తం 1,056 మంది ఓటర్లు ఉండగా 514 మంది పురుషులు, 542 మహిళా ఓటర్లు ఉన్నారు. 8 వార్డుల్లో ఒకటో వార్డు ఎస్టీ జనరల్, 2వ వార్డు ఎస్టీ మహిళ, 3, 4 వార్డులు జనరల్ మహిళ, 5వ వార్డు ఎస్టీ మహిళ, 6, 7, జనరల్, 8వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వు అయ్యాయి. కాగా, లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలోకి విలీనం చేయాల ని స్థానికులు పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గెలిపిస్తే మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని బరిలో ఉన్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు హామీలిస్తున్నారు. -
‘చేతి’లో చర్ల సర్పంచ్ స్థానం..
చర్ల: చర్ల గ్రామ పంచాయతీలో హోరాహోరీగా సాగిన ఎన్నికలో సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన పూజారి సామ్రాజ్యం సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీతో పాటు బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారు. గురువారం అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. 16 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, సీపీఎం3, ఇతరులు 3 వార్డులను దక్కించుకున్నారు. కాగా, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ వార్డు సభ్యుడు కాపుల కృష్ణార్జున్రావును ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్గా పూజారి సామ్రాజ్యం, ఉప సర్పంచ్గా కాపుల కృష్ణార్జున్రావు -
ఇసుక రవాణాకు హైకోర్టు బ్రేక్
మణుగూరురూరల్: మున్సిపాలిటీ పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించిన ఇసుక, బొగ్గు రవాణాకు శుక్రవారం హైకోర్టు బ్రేక్ వేసింది. అనుమతులు లేకున్నా రాజుపేట గ్రామం మీదుగా దుమ్ము, ధూళి ఎగిసిపడేలా దూసుకెళ్తున్న లారీలు గ్రామాన్ని నిత్యం కప్పేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయంపై గ్రామస్తులు పలుమార్లు సింగరేణి, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లారీల మితిమీరిన వేగం, ఎగిసిడే దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురు పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయినా ఇసుక, బొగ్గు రవాణా ఆగలేదు. చివరికి గ్రామస్తుల ఆవేదన విన్న హైకోర్టు న్యాయవాది చప్పిడి రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజుపేట పరిస్థితులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి, జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం కదిలి కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ గ్రామం మీదుగా జరుగుతున్న ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజుపేట సమీపంలోని అటవీ భూభాగంలో అనుమతులు లేకుండా ఏళ్ల నాటి చెట్లను భారీ యంత్రాలతో నరికివేయించి రాత్రింబవళ్లు ఇసుక రవాణాను సాగిస్తున్నట్లు న్యాయవాది రామకృష్ణ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అటవీ నాశనంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు ఆపి.. తర్వాత మళ్లీ ఇసుక రవాణా యథావిధిగా సాగుతుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో చెట్ల నరికివేతపై ఆగ్రహం -
భద్రగిరి పీఠం కాంగ్రెస్దే..
● 20 వార్డులకు గాను 15 వారివే ● సర్పంచ్గా పూనెం కృష్ణ, ఉపసర్పంచ్గా రత్నం కవితభద్రాచలం: జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి.. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం సాగిన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ వశం చేసుకుంది. సర్పంచ్ స్థానంతో పాటుగా 20 వార్డులకు గాను 15 వార్డులలో వారి మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. దీంతో సుదీర్ఘ కాలం అనంతరం, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి పూనెం కృష్ణ విజేతగా నిలిచాడు. సర్పంచ్ స్థానానికి మొత్తం 19,838 ఓట్లు పోలవ్వగా పూనెం కృష్ణ 8,416 ఓట్లు సాధించి, తొలి స్థానంలో, బీఆర్ఎస్ మద్దతుదారుడు మానె రామకృష్ణ 6,732 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ కూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్ 2,756 ఓట్లు సాధించారు. ఇక ఓటుకు నోటొద్దంటూ వినూత్నంగా ప్రచారం చేసిన పూనెం ప్రదీప్కుమార్ 298 ఓట్లను సాధించారు. ఉపసర్పంచ్ కాంగ్రెస్దే.. భద్రాచలంలో హోరాహోరీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డుల్లో సైతం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 20 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఉపసర్పంచ్ పదవి సైతం కాంగ్రెస్కే దక్కింది. 16వ వార్డులో గెలిచిన రత్నం కవితను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. సీపీఎంకు రెండు, బీఆర్ఎస్కు ఒకటి, టీడీపీకి ఒకటి, ఇండిపెండెంట్కు ఒకటి దక్కాయి. 20 వార్డుల్లో విజేతలు వీరే.. 1వ వార్డులో చెంచు సుబ్బారావు(కాంగ్రెస్), 2వ వార్డు బొంబోతుల రాజీవ్(కాంగ్రెస్), 3వ వార్డు బొంత రమణ(కాంగ్రెస్), 4వ వార్డు బండారు శరత్(సీపీఎం), 5వ వార్డు నర్రా వాణి(కాంగ్రెస్), 6వ వార్డు అబ్బినేని వినీలా రాణి (టీడీపీ), 7వ వార్డు కావూరి గోపి (బీఆర్ఎస్), 8వ వార్డు పెద్దినేని లక్ష్మి (కాంగ్రెస్), 9వ వార్డు కారం సుజాత (కాంగ్రెస్), 10వ వార్డు నిట్టా రాజు(కాంగ్రెస్), 11వ వార్డు భూక్యా సుశీల(కాంగ్రెస్), 12వ వార్డు కారం దుర్గారావు (కాంగ్రెస్), 13వ వార్డు తాటి ఉదయ్ (కాంగ్రెస్), 14వ వార్డు ఇలమల అశోక్కుమార్ (ఇండిపెండెంట్), 15వ వార్డు (కాంగ్రెస్), 16వ వార్డు రత్నం కవిత (కాంగ్రెస్), 17వ వార్డు సున్నం భూలక్ష్మి (కాంగ్రెస్), 18వ వార్డు జగ్గా కుమారి(కాంగ్రెస్), 19వ వార్డు మహేశ్(సీపీఐ), 20వ వార్డు ఇర్పా అనుసూయ(సీపీఎం) గెలుపొందారు. -
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
టేకులపల్లి: నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటే తీవ్రంగా అవమానిస్తున్నారని, దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మండలానికి చెందిన భూక్య దళ్సింగ్నాయక్, ఆయన భార్య, మాజీ సర్పంచ్ భూక్య గంగా తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. 1987లో పార్టీలో చేరానని, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉంటూ పార్టీలోనే కొనసాగానన్నారు. అనేక పార్టీలు మారి వచ్చినవారే తనను దూరం పెడుతున్నారని తెలిపారు. 2019లో అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే చుక్కాలబోడులో కాంగ్రెస్ తరఫున తన భార్య గంగాబాయిని ఏకగ్రీవం చేసిన ఘనత తనదేనని, ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేద్దామని గ్రామస్తులు కోరితే తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే తరఫున వేరే అభ్యర్థితో నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతోనే రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో భూక్య రంజిత్, భూక్య రమేశ్, నాగేశ్వరరావు, బిచ్చా, బీక్య, జగపతి, బాలాజీ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల సందర్శన
చండ్రుగొండ: మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ అడిషినల్ డైరెక్టర్ (పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలిలకులు) సర్వేశ్వరరెడ్డి శుక్రవారం సందర్శించారు. పాఠ శాలలో మెనూ, విద్యాభ్యాసం జరుగుతున్న తీరు తెన్నులపై విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీ సుజాతనగర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. గర్భిణులకు అందుతున్న సేవలు, 30 ఏళ్లు పైబడినవారికి బీపీ, షుగర్ పరీక్షలు, చికిత్స, కీటక జనిత వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. చిన్నపిల్లల టీకాలు, 14 ఏళ్ల బాలికలకు నూతనంగా అందించబోతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి వివరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాలరాజు రుద్రంపూర్: సింగరేణి కార్పొరేట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ డీఎస్పీ పి.బాలరాజును నియమిస్తూ యాజమా న్యం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. ఆయ న ఈ పదవిలో ఏడాదిపాటు కాంట్రాక్ట్ పాత్రిపదికన ఉంటారు. దాడులపై కేసు నమోదు చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం, బస్వాపురంల్లో ఎన్నికల సందర్భంగా ఇళ్లపై దాడి చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. రామకృష్ణాపురంలో కన్నెబోయిన కుటుంబరావు ఇంటిపై ఉసికల లక్ష్మీనారాయణతో పాటు మరో 14 మంది కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రెండు బైక్లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కుటుంబరావు ఫిర్యాదుతో 15మందిపై కేసునమోదు చేశారు. బస్వాపురంలో సుంకసాని విజయలక్ష్మి ఇంటిపై కుక్కల నాగరాజుతో పాటు మరో 12 మంది దాడి చేయగా ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొదుమూరు, నర్సింహాపురం, అనంతసాగర్లలో జరిగిన ఘర్షణలపై మరో 37 మందిపై కేసులు నమోదు చేశామని వివరించారు. -
సత్వర సేవలు..
ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర వైద్యసేవలు అందించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేయటంలో 108 వాహనాలు కీలక ప్రాత పోషిస్తుండగా, గర్భిణులు, బాలింతలను క్రమం తప్పకుండా పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలదే ప్రముఖ పాత్ర. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి. అమ్మ ఒడి సేవలతో.. గతంలో గర్భిణులు ప్రతీనెలా వైద్య పరీక్షలతో పాటు ప్రసవ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ, 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహెచ్సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వాహనాలు ఉండగా, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 1,89,088 మంది గర్భిణులు, బాలింతలు వీటి ద్వారా వైద్యసేవలు పొందారు. 50,862 మందికి అత్యవసర సేవలు ఉమ్మడి జిల్లాలో అత్యవసర వాహన సేవలు కీలకంగా మారాయి. ప్రమాద బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రులకు చేర్చటంలో 108 వాహనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రసవ వేదనతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహనాలదే. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయాన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలు నిలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 49 ఉండగా, భద్రాద్రి జిల్లాలో 28 వాహనాలు, ఖమ్మం జిల్లాలో 21 వాహనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహనం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 50,862 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. బాలింతలు, గర్భిణులకు అండగా ‘102’ 108 వాహనం 102 వాహనం ఏడాది సేవలు ట్రిప్పులు సేవలు 2024 21,829 12,564 38,903 2025 23,509 11,765 37,650 108 వాహనం 102 వాహనం ఏడాది సేవలు ట్రిప్పులు సేవలు 2024 25,642 22,407 57,101 2025 27,353 21,765 55,434ఉమ్మడి జిల్లావాసులు 102, 108 వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం వాహనాలు వెళ్తున్నాయి. 102 వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. –శివకుమార్, 108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ -
‘అమృత్’ పనులు పరిశీలన
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ పథకం పనులను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవా త్సవ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్రెడ్డి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, తిరుపతి, షిరిడీలకు రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని, బెల్గావి, డోర్నకల్–కాజీపేట ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. న్యూ గొల్లగూడెం వరకు రోడ్డు విస్తరణ పనులకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అధికారులు గోపాలకృష్ణయ్య, మల్లాది శ్రీనివాస్, సిఫాలి, రాజేంద్రప్రసాద్, పాషా, విశ్వనాథ్, దిశా కమిటీ సభ్యుడు ఆనందరావు, శ్రీకాంత్, ఎం.రామకృష్ణ, కొదుమూరి శ్రీనివాసరావు, కంభంపాటి రవి పాల్గొన్నారు. రామయ్య సేవలో.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దామోదర్రావు స్వాగతం పలుకగా ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశారు. ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపిక అందచేశారు. రైల్వే అఽధికారులు, ఏఈఓ శ్రవణ్కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘వేట’ ముగిసిందా ?!
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్పార్కులో చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు ఆ తర్వాత విచారణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో ఇతర వేటగాళ్ల పాత్ర ఉందా.. వారికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. అసలు విచారిస్తున్నారా, లేదా అన్న అంశంపై కూడా స్పష్టత లేకపోగా, అధికారులు ఏ అంశాన్ని బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారి తీస్తోంది. వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ సత్తుపల్లి పార్క్లో దుప్పుల వేట సాగుతోందని, ఓ వ్యక్తి వివాహ విందులో దుప్పి మాంసం వడ్డించారనే సమాచారంతో ‘సాక్షి’లో గతనెల 29న ‘తూటా దూసుకెళ్తోంది..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో విషయం వెలుగులోకి రాగా వరుస కథనాలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తొలుత ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారం తర్వాత మరో ఇద్దరు తమ ఎదుట లొంగిపోయారని సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల ప్రకటించారు. ఆపై సైలెన్సర్ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లు గుర్తించామని, తదుపరి చర్యల కోసం రెండు జిల్లాల పోలీసు అధికారులు, భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి నట్లు డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ తెలిపారు. జవాబు లేని ప్రశ్నలెన్నో.. దుప్పులను వేటాడినట్లు నలుగురిని అరెస్ట్ చేయగా, అందులో ఎవరి పాత్ర లేదా అన్న ప్రశ్నకు అటవీశాఖ అధికారులు సమాధానం చెప్పడం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత ఇవ్వడంలేదు. ఐదు దుప్పులనే వేటాడారా.. ఇంకా ఎన్నింటిని హతమార్చారు, ఆ మాంసంను ఎక్కడ విక్రయించారనే వివరాలను.. రిమాండ్కు తరలించే ముందు వేటగాళ్లను విచారించి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేశారా, లేదా అన్నది తెలియరావడం లేదు. ఇక దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు తెలిసినా, ఎవరెవరు హాజరయ్యారు, ఆ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా, హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కాగా, వేటలో పాల్గొన్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంనకు చెందిన మెచ్చా రఘు నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకోగా, ఆయన లైసెన్స్ను దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. సత్తుపల్లి అటవీశాఖ డివిజన్ పరిధిలో ఎఫ్డీఓ, రేంజర్, ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్పార్కులో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఏ ఒక్కరికీ కనీస సందేహం రాకపోవడం గమనార్హం. ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై నిఘా పెట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు.. రెగ్యులర్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఈ అంశంపై సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజులను వివరణ కోరగా.. అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అది పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పట్టించుకోకపోవడంపై విమర్శలు -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటరు పోలింగ్ బూత్కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఓటర్ను బ్యాలెట్ పేపర్ దిశగా నడిపించడంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు వెనుకబడ్డారు. ఫలితంగా 71.79 శాతం పోలింగ్తో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అభ్యర్థులకు సమయం సరిపోలేదా..? గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. వార్డుస్థాయిలో ఒకటి రెండు ఓట్ల తేడా వల్ల కూడా ఫలితాలు తారుమారు అవుతాయి. ఈ క్రమంలో ప్రతీ ఓటరును బూత్ వరకు తీసుకొచ్చేందుకు అభ్యర్థులు శ్రద్ధ వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తొలి విడతలో ఉన్న పంచాయతీల నుంచి వార్డు మెంబర్గా, సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నవారు అప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులను కూడగట్టుకోవడం, ప్రత్యర్థులను బుజ్జగించడం వంటి పనులకే చాలా సమయం పోయింది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ నుంచి గుర్తులు కేటాయించే వరకు అభ్యర్థులకు తీరికలేదు. ప్రచారం మొదలైన తర్వాత తమకు కేటాయించిన గుర్తును ఓటర్లలోకి తీసుకెళ్లడానికే సమయం సరిపోయింది. దీంతో పోలింగ్ రోజున దగ్గరుండి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం లోపం ఎదురైంది. అందువల్లే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించడం, గ్రామాల్లో ఉంటూనే పొలం పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వారిని ఓటు వేసేలా ప్రేరేపించడంలో తగినంత కసరత్తు జరగలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అతి పెద్ద పంచాయతీగా ఉన్న భద్రాచలంలో 40 వేల మందికి పైగా ఓట్లు ఉంటే అక్కడ పోలింగ్ 48.87 శాతం దగ్గరే ఆగిపోయింది. అతి పెద్ద పంచాయతీలోనే సగం మంది ఓటర్లు తమ సర్పంచ్ ఎంపికకు దూరంగా ఉన్నట్లయింది. మలి, తుది విడత ఎన్నికల సమయానికై నా జిల్లాలో ఓటింగ్ శాతం పుంజుకునేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో నోటిఫికేషన్ వెలువడే వరకు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదు. ఎట్టకేలకు నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో మొదటి విడతలో జిల్లాలో పినపాక, అశ్వారావుపేట నియోజకర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 14 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. ఇందులో పోలింగ్ శాతం కేవలం 71.79 శాతమే నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ శాతంగా ఉంది. తొలివిడత ఎన్నికల్లో 71.79 శాతమే పోలింగ్ -
భద్రగిరిలో తీవ్ర నిరీక్షణ
● అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కౌంటింగ్ ● అందరికీ ఓటర్ల స్లిప్లు పంపిణీ చేయలేదనే ఆరోపణలు ● భద్రాచలం పంచాయతీలో అతి తక్కువ పోలింగ్ శాతం భద్రాచలం: అధికారుల నిర్లక్ష్యంతో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు సర్పంచ్ ఫలితాలు వెల్లడికాకపోవడంతో రాత్రంతా అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలు చలిలో గజగజ వణికిపోయారు. గురువారం ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ముగియాల్సి ఉంది. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో కొంత సమయం పట్టింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్లు చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ తీవ్ర జాప్యం జరిగింది. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారనే ఫిర్యాదుతో వెంకటలక్ష్మి అనే ఓటరుకు టెండర్ ఓటును కేటాయించారు. ఆ ఓటు కౌంటింగ్, విధి విధానాలు స్థానిక ఎన్నికల అధికారులకు తెలియకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాచారం తెలుసుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులోని ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో బయట వేచి చూస్తున్న అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలకు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు సైతం చేశారు. అఽధికారుల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పంచాయతీ సర్పంచ్ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. అప్పటివరకు చలిలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి తక్కువగా భద్రాచలంలో ఓటింగ్ జిల్లావ్యాప్తంగా అత్యధిక ఓటర్లు ఉన్న భద్రాచలం గ్రామపంచాయతీలో అతి తక్కువగా 48.87 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు స్లిప్లు ఇంటింటికీ చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఓటరు జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వివరాలు ముందస్తుగా ప్రచారం చేయలేదు. దీంతో ఓటర్లు భద్రాచలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉండటంతో వార్డు మెంబర్ పోటీదారులు తప్ప సర్పంచ్ పోటీదారులు అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేయలేకపోయారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా ప్రభావం చూపలేకపోయారు. ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఉంటున్న పట్టభద్రులు, ఉద్యోగులను భద్రాచలం తీసుకురాలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీదారులు ఓటుకు నోటునే బలంగా నమ్ముకోవడంతో అత్యధిక ఓటర్లు, వృద్ధులు నోటు తీసుకొని చడీచప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో 40,761 ఓట్లకుగాను 19,838 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. -
పొదెంXతెల్లం!
భద్రాచలం: భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యల మధ్య వర్గపోరు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి బహిర్గతమైంది. ఉపసర్పంచ్ ఎంపికపై రగడ నెలకొంది. ఉపసర్పంచ్ పదవికి ఎమ్మెల్యే వర్గం నుంచి రత్నం కవిత, మాజీ ఎమ్మెల్యే పొదెం వర్గం నుంచి చెంచు సుబ్బారావు పోటీపడ్డారు. దీంతో పొదెం అనుచరుడికి తొలుత మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్లు ఎమ్మెల్యే అనుచరుడికి పదవి ఇచ్చేలా కౌంటింగ్ కేంద్రం బయట ఇద్దరు నేతలు చర్చించుకుని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాక ఎమ్మెల్యే వర్గం సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. అత్యధిక సభ్యులు రత్నం కవితకు మద్దతు తెలపటంతో ఆమెనే ఉప సర్పంచ్గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే వర్గం ఒప్పందాన్ని పాటించకపోవడంతో పొదెం వీరయ్య తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాట తప్పారని, చివరి రెండేళ్లు తమవారికి ఉప సర్పంచ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు. పదవులు ఉన్నా, లేకున్నా.. భద్రాచలంటౌన్: పదవులు ఉన్నా, లేకున్నా కార్యకర్తగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై శుక్రవారం పార్టీ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పార్టీపై అసంతృప్తి పెరిగిపోయిందని, దీనికి ఎమ్మెల్యే వెంకట్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్టానానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పష్టమైన వివరణ రాలేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతుదారుల కోసం పనిచేశారని ఆరోపించారు. పరిమి శ్రీనివాసరావు, తమ్మల్లా వెంకటేశ్వరరావు, అడబాల వెంకటేశ్వరరావు, కోలపుడి వరుణ్, వాసిరెడ్డి సాంబశివరావు, కాపుల శ్రీను, బసవరాజు, సరిత, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉప సర్పంచ్ ఎంపికపై ఇరువర్గాల రగడ -
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్య, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రి నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రిజిస్టర్ కచ్చితంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వరాదని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడంతోపాటు రెండువేలకు పైగా ఓటర్లు ఉన్న జగన్నాథపురం, నరసాపురం, పెద్దిరెడ్డిగూడెం, వినాయకపురం, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు పంచాయతీ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెండో విడత ఎన్నికల సమీక్షలో కలెక్టర్ జితేష్ భద్రాచలంలో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను అంటిస్తామని తెలిపారు. సౌకర్యాలపై ఈ నెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్లో డివిజన్స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. దేవస్థానం ఈఓ దామోదర్రావు, అర్చకులు పాల్గొన్నారు. -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.శ్రీకనకదుర్గమ్మకు పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మకు శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేడు నవోదయ పరీక్ష కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుందని, 8 కేంద్రాల్లో 1,852 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, పరీక్ష సామగ్రి తెచ్చుకోవాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ను 99890 27943 నంబరులో సంప్రదించాలని సూచించారు. నేడు సింగరేణి ప్రణాళికలపై సమీక్షరుద్రంపూర్: హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఈ నెల 13న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కోల్ సెక్రటరీ విక్రమ్ దేవ్ దత్తాతోపాటు కేంద్ర ఇంధన శాఖ అధికారులు, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 2030 నాటికి చేపట్టే మధ్యకాలిక ప్రణాళిక, 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5,850 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ దీర్ఘకాలిక ప్రణాళికలు, 15 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్, కీలక ఖనిజ రంగంలో ప్రవేశం, అంతర్జాతీయస్థాయిలో గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినున్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, జి.బాలకృష్ణ, వల్లపు వెంకన్న పాల్గొన్నారు. -
ఫలితాలు మెరుగుపడేనా?
కొత్తగూడెంఅర్బన్: ఇన్చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులతోపాటు ఉసాధ్యాయులకు కూడా పరీక్షగా మారింది. ఎంఈఓలు, డీఈఓ ఇన్చార్జులే.. జిల్లా విద్యాశాఖలో ఎంఈఓల నుంచి డీఈఓల వరకు ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పాఠశాలల్లో బోధన పనుల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల విధులు వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అసలే ఇన్చార్జ్ల పాలన ఆపై వివిధ రకాల విధులతో బోధన, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండాపోయినట్లు కనిపిస్తోంది. గతేడాది పదో తరగతి, ఇంటర్మీడియట్లలో చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నా ఇతర పనులు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడింది. వెరసి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాయంత్ర వేళ ఒక గంట ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 302 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 12,828 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు మరో 394 మంది సప్లిమెంటరీ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 9వ స్థానం లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో 10,111 మంది విద్యార్థులు, సెకండియర్లో 10,085 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. స్లిప్ టెస్టులను నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరుగుతుంది. –నాగలక్ష్మి, డీఈఓపదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామని, అనంతరం వారిపై మరింత శ్రద్ధ పెడతామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా అపరాధరుసుంతో ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. -
ఫిర్యాదు చేయండి
వాతావరణ ం జిల్లాలో శనివారం మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం నుంచే చలి తీవ్రత ఉంటుంది. అవినీతి పరులపైపాల్వంచరూరల్: చట్టప్రకారం ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసింది. ఏసీబీ జిల్లాలో ఇటీవల దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి, జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూర్ కోడ్ స్కానర్లకు సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్చేసి సులభంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. 2025లో 20 కేసులు నమోదు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఫారెస్టు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఏడాది జనవరి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు వరకు 20 కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వశాఖల అధికారులను కటకటాలపాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూశాఖలో 6, పోలీసుశాఖలో 3, రిజిస్ట్రేషన్, వ్యవసాయశాఖ రెండు చొప్పున, మైనార్టీ సంక్షేమం, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్, కార్మిక, ఎకై ్సజ్, విద్యాశాఖల్లో ఒకటి చొప్పున కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇలా ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు అంటించిన స్టికర్(క్యూర్ కోడ్) స్కాన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి సెండ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. టోల్ఫ్రీ నంబర్ 1064, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ 91543 88981కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఏసీబీ అధికారులు సంప్రదించి వివరాలు సేకరించుకుని ఫిర్యాదుదారుని పేర్లను రహస్యంగా ఉంచుతారు. కాగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పనుల కోసం అధికారులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం. అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరైనా వదిలిపెట్టం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చు. – వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
ఎదురెదురుగా ఎంపీ, మాజీ మంత్రి
పాల్వంచరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పాల్వంచ మండలం దంతలబోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ గ్రామ స్కూల్ సెంటర్ వద్ద ఎదురుపడ్డారు. పరస్పరం అభివాదం చేసుకున్న వారు తిరిగి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా, దంతలబోరు, నాగారం, నాగారంకాలనీ, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని గుర్తించి కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగా సీతారాములు, యర్రంశెట్టి ముత్తయ్య, కోనేరు చిన్ని, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక వనమా వెంకటేశ్వరరావు మండలంలోని దంతలబోరు, తోగ్గూడెం తదితర గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
తొలిపోరు ప్రశాంతం
చుంచుపల్లి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పోలింగ్ జరగగా, మొత్తం 71.79 శాతంగా నమోదైంది. అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 85.08 శాతం ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా భద్రాచలంలో 48.87 శాతం మాత్రమే నమోదయ్యాయి. 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ కొంత మందకొడిగానే సాగగా, అప్పటివరకు 13.57 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ తర్వాత అంతటా పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 41.44 శాతం, పోలింగ్ పూర్తయ్యే సరికి 71.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించగా, ఎస్పీ రోహిత్రాజు భద్రాచలం, మణుగూ మండలం సమితి సింగారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కౌంటింగ్ సాగిందిలా.. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ పూర్తి కాగా, 2 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదట వార్డుల వారీగా లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ చేపట్టి విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు రంగులు చల్లుకుని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మహిళలదే హవా.. తొలివిడత ఎనిమిది మండలాల పరిధిలో 145 గ్రామ పంచాయతీలు, 1,097 వార్డులకు ఎన్నికలు జరగగా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి పరిధిలో మొత్తం 2,59,070 మంది ఓటర్లు ఉండగా, 1,85,974 మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఇందులో పురుషులు 90,175 మంది కాగా, మహళా ఓటర్లు 95,794 మంది ఉన్నారు. ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు -
యార్డుల్లో యాతన
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినా డంపింగ్ యార్డుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఉన్న యార్డు సరిపోకపోవడంతో రోజువారీ వెలువడుతున్న చెత్తను కొంత మేర రోడ్ల వెంటే వేయాల్సి వస్తోంది. దీంతో రహదారులపై దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మరో రెండు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. కొత్తగూడెంలో రోజువారీ చెత్త 30 మెట్రిక్ టన్నులు వెలువడుతుండగా పాల్వంచలో కూడా అదే స్థాయిలో సేకరణ జరుగుతోంది. ఇక కార్పొరేషన్లో విలీనమైన సుజాతనగర్ మండల పరిధిలోని నాలుగు డివిజన్లలో వెలువడే చెత్తను అక్కడే డంప్ చేస్తున్నారు. జనాభాకు తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, వాహనాలు పెంచడంతో పాటు కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్మికులు సరిపడా లేకపోవడంతో రోజు వారి కూలీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో డంపింగ్ యార్డే లేదు. రోజువారీ వెలువడే చెత్తను నివాసాల సమీపంలోనే డంప్ చేస్తున్నారు. మణుగూరు మున్సిపాలిటీలో రోజుకు 12 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నా సమీపాన అన్నారంలోని డంపింగ్ యార్డుకు తరలించాలంటే వర్షాకాలంలో ట్రాలీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బయో మైనింగ్ పూర్తయ్యేదెప్పుడో.. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో వెలువడే చెత్తను రామవరం డంపింగ్ యార్డులో వేసేవారు. అయితే అక్కడ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు తరచూ చెత్త తగులబెడుతుండడంతో దట్టమైన పొగ వ్యాపించి సమీప ప్రజలు ఇబ్బంది పడేవారు. దీంతో స్థానికులు చెత్త ట్రాలీలను అడ్డుకుని ఆందోళన చేయడంతో అక్కడ డంప్ చేయడం మానేశారు. గత మూడేళ్లుగా పాతకొత్తగూడెంలోని మొర్రేడువాగు సమీపంలోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 30వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. దీంతో ఇప్పుడు సేకరిస్తున్న చెత్త రోడ్లపైనే వేయాల్సి వస్తోంది. ఈ యార్డులో లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగించేందుకు ఆరు నెలల క్రితం బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటివరకు 33 వేల మెట్రిక్ టన్నుల చెత్త నుంచి గాజు, ప్లాస్టిక్ వేరు చేశారు. పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, గాజును క్రాష్ చేసి సిమెంట్ కంపెనీలకు పంపుతున్నారు. అయితే ఇంకా 67 వేల మెట్రిక్ టన్నుల చెత్త బయోమైనింగ్ చేయాల్సి ఉండగా మూడు నెలల సమయం పడుతుందని కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. పాల్వంచలోనూ బయోమైనింగ్కు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసినా.. ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇక డంపింగ్ యార్డుల్లో వర్మికంపోస్టు తయారీకి నిర్మించిన బెడ్లు ప్రస్తుతం వృథాగా ఉన్నాయి. వర్మీ కంపోస్టు తయారు చేసి, తక్కువ ధరకు కొత్తగూడెం చుట్టుపక్కల గ్రామాల రైతులకు అమ్మితే కార్పొరేషన్కు కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.కార్పొరేషన్ పరిధిలో కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రామవరంలోని పాత డంపింగ్ యార్డులో బయోమైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పని పూర్తయితే యార్డును పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా జాప్యం కాకుండా పర్యవేక్షిస్తున్నాం. -
పోలింగ్
మండలం మొత్తం ఓట్లు పోలైనవి శాతం అశ్వాపురం 32,860 25,743 78.34భద్రాచలం 40,761 19,920 48.87బూర్గంపాడు 44,878 31,018 69.12చర్ల 32,653 26,637 81.58దుమ్ముగూడెం 33,182 28,231 85.08కరకగూడెం 12,869 10,877 84.52మణుగూరు 36,480 22,783 62.45పినపాక 25,387 20,765 81.79 -
గ్రామం ఇక్కడ, ఓటర్లు అక్కడ..!
చుంచుపల్లి: మండల పరిధిలోని వెంకటేశ్ఖని గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఓటర్లందరూ ప్రస్తుతం గ్రామంలో నివసించడం లేదు. రెండు నెలల క్రితం సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి 70 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో ఇక్కడ ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే స్థానికంగా మిగిలిపోయారు. ఈ గ్రామ పంచాయతీకి 2014 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో కేవలం 146 ఓట్లతో ఇక్కడ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఇటీవల వరకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో 256 మంది జనాభా ఉండగా, తాజా ఓటర్ల జాబితాలో ఇక్కడ 183 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 93 మంది మహిళలు కాగా, 90 మంది పురుషులు ఉన్నారు. అయితే, సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా బ్లాస్టింగ్ జోన్కు ఆతిదగ్గరలో ఉండడంతో అధికారులు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతోపాటు గంగహుస్సేన్బస్తీలో ప్రత్యేక స్థలాలను ఇచ్చారు. దీంతో ఇక్కడ ఉన్న ఊరు ఖాళీ అయింది. ఇక్కడి కుటుంబాలు స్థానికంగా ఉన్న రామవరం, రుద్రంపూర్, పెనగడప, గౌతంపూర్ ప్రాంతాలకు తరలి వెళ్లాయి. కేవలం ఒక కుటుంబంలోని ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే ప్రస్తుతం ఊరిలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ చేశారు. మిగిలిన 4 వార్డులను ఎస్టీ జనరల్కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి కేటాయించారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్లు సైతం లేకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కూడా చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను వెతికి పట్టుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. చిరునామా కనుక్కొని వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న రెండో విడతలో వెంకటేశ్ఖని పంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 183 మంది ఓటర్లను ఇక్కడే ఓటు వేసే విధంగా అధికారులు చర్య లు చేపడుతున్నారు. వెంకటేశ్ఖనిలో విచిత్ర పరిస్థితి -
రెండో విడత ప్రచారాలకు నేటితో తెర
చుంచుపల్లి: జిల్లాలో ఈనెల 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాలకు శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. మలి దశలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని 155 గ్రామపంచాయతీలు, 1,384 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 16 గ్రామ పంచాయతీలు, 240 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇవి మినహాయించి మిగతా చోట్ల గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీలు గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వినూత్న రీతిలో ప్రచారం సైతం నిర్వహించారు. పాదయాత్రలు, మైకు ప్రచారాలతో గ్రామాలు హోరెత్తాయి. -
దొంగ ఓటు కలకలం..
● భద్రాచలంలో ఘటన ● టెండర్ ఓటు వేయించిన అధికారులు భద్రాచలంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగగా భద్రాచలం పట్టణంలోని 4వ వార్డుకు చెందిన కోటగిరి వెంకటలక్ష్మి కూనవరం రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 11వ నంబర్ బూత్కు వెళ్లింది. అధికారులు వివరాలు పరిశీలించి.. తమ ఓటు ఇప్పటికే పోలైందని, మళ్లీ ఓటు వేసేందుకు అవకాశం లేదని చెప్పడంతో సదరు ఓటరు షాక్కు గురైంది. ఇదే విషయంపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్తో పాటు ఇతర అధికారులకు తెలపడంతో.. ఆమెతో అధికారులు టెండర్ ఓటు వేయించారు. కాగా, భద్రాచలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అంశంపై తహసీల్దార్ మాట్లాడుతూ.. అది రిగ్గింగ్ కాదని, ఓట్లు పరిశీలించే అధికారి తప్పిదం వల్లే జరిగిందని చెప్పినా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎమ్మెల్యే వెంకట్రావుతో వాగ్వాదం.. ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు స్థానికులు, కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకురాలు తెలిపారు. వార్డు సభ్యుడిగా బరిలో నిలబడిన అభ్యర్థిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతివ్వడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే అక్కడే ఉండి అభ్యర్థిని కేంద్రంలోకి పంపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు.. ఓట్ల రిగ్గింగ్పై నిలదీయడంతో ఎమ్మెల్యేకు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. టెండర్ ఓటు అంటే..? ఓటింగ్ సమయంలో ఒకరి ఓటును మరొకరు వేస్తుంటారు. దీంతో అసలు ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతాడు. అయితే, అలా జరగకుండా భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్ 49(పీ)ను అమల్లోకి తెచ్చింది. ఓ వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేస్తే ఈ సెక్షన్ ద్వారా టెండర్ ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అధికారులు అసలు ఓటరు అతడేనని నిర్ధారించుకుంటే సాధారణ బ్యాలెట్ పేపర్ బండిల్లోని చివరి బ్యాలెట్ను ఇస్తారు. టెండరు బ్యాలెట్గా ఓటు వేయడానికి అనుమతిస్తారు. అయితే, ఆ టెండరు ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తారు. దానిని ప్రత్యేక కవర్లో పెట్టి టెండర్ బ్యాలెట్ వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేస్తారు. -
పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత
మణుగూరురూరల్: స్థానిక జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇరువైపులా టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయ ఎదురు వీధిలో టెంటు అడ్డంగా వేసి వచ్చే ఓటర్లకు గుర్తులు చూపి ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని సమాచారం అందుకున్న సీఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. బీఆర్ఎస్ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒకవర్గానికే సహకరిస్తే సహించేది లేదంటూ వాగ్వాదానికి దిగగా, సీఐ రెండు పార్టీల టెంట్లు తీసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బందిని కాపలా ఉంచారు. సీతంపేట, పాండురంగాపురంలో.. పినపాక: మండలంలోని సీతంపేట పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు సర్ది చెప్పారు. అక్కడి నుంచి నాయకులను పంపించివేశారు. పాండురంగాపురం పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈసం భవతి విజయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఎన్ని ఓట్లు, ఏ వార్డులు అనే సమాచారం లేకుండా ఎలా విజయాన్ని ధ్రువీకరిస్తారని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు సరైన సమాచారం లేకుండా ధ్రువీకరించారని ఆరోపించారు. పోలీసులు చేరుకొని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. -
అంతా ప్రశాంతం..
తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి. చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలింగ్ ముగిసింది. యువకులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోగా.. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, నడవలేనివారి కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వృద్ధులను ఎత్తుకుని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, రేగా కాంతారావు.. వారివారి గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామిని విశాఖపట్నంలోని డీఎస్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోకి కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. 13న నవోదయ ప్రవేశపరీక్ష కూసుమంచి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల పరీక్ష13, 14వ తేదీల్లో ఏర్పాటు పాల్వంచ: విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల కోసం పాల్వంచలోని జెన్కో ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 13, 14 తేదీల్లో (డిపార్ట్మెంట్ అకౌంట్స్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ), ఏఈలు సైతం పదోన్నతులు రావాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం పాల్వంచలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. 16 నుంచి క్రికెట్ టోర్నీరుద్రంపూర్: ఈనెల 16 నుంచి 18 వరకు కొత్తగూడెంలోని జయశంకర్ మైదానంలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం – కార్పొరేట్, ఇల్లెందు – మణుగూరు, భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి – మందమర్రి ఏరియాలను కలుపుతూ ఆరు టీమ్లుగా ఏర్పాటు చేశామని వివరించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టాస్తో వార్డు సభ్యురాలి విజయందుమ్ముగూడెం: మండలంలోని అచ్చితాపురం పంచాయతీలోని ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సోయం కౌసల్య, ఎవీఎస్పీ అభ్యర్థి సోయం నగ్మాకు చెరో 24 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కౌసల్యను విజయం వరించింది. -
సమాజమా మేలుకో..
ప్రతీ ఎన్నికల్లో ఆళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో ఇలా ప్రచారం చేస్తున్నా. యువతలో మార్పు రావాలని, అభివృద్ధి చెందాలని ప్రచారం చేపట్టాను. సొంత ఖర్చులతోనే మండలంలోని ప్ర తీ గ్రామంలో తిరుగుతున్నా. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. –ఇందుకుమార్, ఆటోడ్రైవర్ గుండాల: సర్పంచ్గా నిలబడే వ్యక్తి వద్ద ఓటర్ల లిస్టు కాదని, గ్రామంలోని సమస్యల లిస్టు.. గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక పత్రాలుండాలని, ఓటు నిజాయితీగా వేస్తే తలెత్తుకుని తిరిగేలా చేస్తుందని, చిల్లర డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే బానిసలా తల దించుకుని బతికేలా చేస్తుందని ఓ యువకుడు ఓటర్లకు అవగాహన కోసం ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. ఆళ్లపల్లి మండలం మర్కోడుకు చెందిన దివ్యాంగుడు ఇందుకుమార్ ప్రతీ సారి ఎన్నికల్లో ఓటర్లలో మార్పు రావాలని కోరుతూ.. తన సొంత ఖర్చులతో తన ఆటోకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మైకుతో ప్రచారం సాగిస్తున్నాడు. ‘రేపటి భవిష్యత్ కోసం ఆలోచించాలని, మద్యం, డబ్బు పంచే వ్యక్తి నాయకుడు కాదని, అర్ధరాత్రి పిలిచినా నేనున్నానంటూ ధైర్యం చెప్పేవ్యక్తి నాయకుడని, డబ్బులు పెట్టేవారు గెలిచాక ఎలా రాబట్టాలో చూస్తారని, యువత చేతుల్లోనే అభివృద్ధి దాగి ఉందని, వారు ముందుకు వచ్చి పోటీ చేయాలని, గెలిస్తే చరిత్ర అని, ఓడితే అనుభవమని ప్రచారం చేస్తున్నాడు. అయితే, అతడి ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఓ దివ్యాంగుడి ఆలోచనతో ఆటోలో ప్రచారం -
నర్సింగ్హోంలో డీఎంహెచ్ఓ తనిఖీ
పాల్వంచ: పట్టణంలోని దమ్మపేటరోడ్లో గల విజయ నర్సింగ్ హోంను డీఎంహెచ్ఓ తుకారంరాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆస్పత్రిలో శిశువు మృతిపై వస్తున్న ఆరోపణలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు విజయలక్ష్మికి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవల ధరల పట్టిక రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని, ల్యాబ్లో నిర్వహించే రక్త పరీక్షల ధరలు, ఆస్పత్రిలో పనిచేసే వైద్యుల పేర్లు కూడా అందులో ఉండాలన్నారు. కాన్పులు నిర్వహించే గదులు శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పీఎంఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలుపాల్వంచ: భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు వెనక భాగం నుంచి పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. పాల్వంచ మీదుగా గురువారం ఈ బస్సు వెళ్తుండగా నవభారత్ వద్ద బస్సు వెనుక భాగం నుంచి పొగలు మొదలై లోపల కమ్ముకున్నాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పక్కన నిలిపివేశాడు. అనంతరం మరమ్మతులు చేయడంతో పొగలు నిలిచిపోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సాంకేతిక లోపంతోనే పొగలు వచ్చినట్లు తెలిసింది. ట్యాంకర్ బోల్తా.. ములకలపల్లి: రసాయనాలు తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన డ్రైవర్ పవన్ (27) ట్యాంకర్లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని గోపాలపురం నుంచి హైడ్రో క్లోరిక్ ఆమ్లం (హెచ్సీఎల్)తో రాయపూర్కు బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి మండలంలోని రాజుపేట శివారులో పాములేరు వాగు వంతెన సమీపంలో ట్యాంకర్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి లోయలోకి దూసుకుపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ ఘటనా ప్రదేశానికి చేరుకున్నా, అర్ధరాత్రి కావడం, ట్యాంకర్ చుట్టూ చెట్టుకొమ్మలు అల్లుకొని ఉండడం, యాసిడ్ లీకై ఘాటైన వాసన వస్తుండటంతో రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. గురువారం వేకువజామున రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపకశాఖ సహకారంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న పవన్ మృతదేహాన్ని బయటకు తీసి, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వివరించారు. -
ఎన్సీసీతోనే క్రమశిక్షణ
కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్రటేకులపల్లి : యువతలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి వంటివి ఎన్సీసీతోనే పెంపొందుతాయని, ఈ మేరకు శిక్షణ ఇస్తామని 11 టీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర అన్నారు. స్థానిక ఏకలవ్య(ఈఎంఆర్ఎస్) పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్సీసీ ప్రాథమిక శిక్షణలో డ్రిల్, రైఫిల్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ిఫీల్డ్ క్రాఫ్ట్, రాక్ క్లైంబింగ్, మౌంటనీరింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాఠశాలలో ఎన్సీసీ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఎన్సీసీ కేడెట్ల ఆసక్తి, క్రమశిక్షణ చూసి హర్షం వ్యక్తం చేశారు. -
‘నమస్తే’తో వారికి గౌరవం
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికులకు భద్రత, గౌరవం కల్పించడంతో పాటు చేతితో శుభ్రం చేసే పనులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనులు చేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులు అనారోగ్యంతో మరణించొద్దనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేయాల్సిన ఈ పథకంపై కార్మికుల్లో అవగాహన కల్పించడంలో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు వెనుకబడ్డారనే విమర్శలున్నాయి. పథకాన్ని మార్చి కొత్తగా.. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నమస్తే’ను 2022లో ప్రారంభించారు. గతంలో అమలైన ‘మానవ మల స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం (ఎస్ఆర్ఎంఎస్)’స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దృష్టి సారిస్తే మేలు పీఎఫ్, ఈహెచ్ఎస్ వంటివి లేక, సరైన వేతనాలు అందకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. వారి వివరాల నమోదులో అధికారులు వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో కార్మికుడి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు లాగిన్ ఐడీల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు లాగిన్ ఐడీలు తీసుకున్నా.. కార్మికుల వివరాలు నమోదు చేయడం లేదని తెలుస్తోంది. కేఎంసీలో 700 మందికి పైగా కార్మికులు ఉంటే 74 మంది ప్రొఫైలింగ్ మాత్రమే పూర్తయింది. మిగతా వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ‘నమస్తే’పథకం ద్వారా కార్మికులకు దక్కే లబ్ధి భద్రతకే పరిమితం కాక ఆర్థిక స్వావలంబనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఆయుష్మాన్ భారత్ – పీఎం జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే, వృత్తిపరమైన భద్రత, యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తూ ఆ సమయాన నెలకు రూ.3 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. కార్మికులు సొంతంగా పారిశుద్ధ్య వ్యాపారాలు ప్రారంభించేలా వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటు (మహిళలకు 5 శాతం, పురుషులకు 6 శాతం)తో ఇచ్చే ఈ రుణం తిరిగి చెల్లించేందుకు ఏడేళ్ల గడువు ఇస్తారు. అలాగే, కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లు, బూట్లు, యాప్రాన్లు ఉచితంగా పంపిణీ చేస్తారు.నిర్ణీత కాల వ్యవధిలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి కార్మికులకు ఈ పథకంలో చోటు కల్పించేలా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, మణు గూరు మున్సిపాలిటీల పరిధిలో మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించి ప్రొఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేఎంసీ పరిధిలో 74, మధిర, వైరా ముగ్గురు చొప్పున, సత్తుపల్లిలో ఇద్దరు, కొత్తగూడెంలో 20 మంది, ఇల్లెందులో 10 మంది, మణుగూరులో ఇద్దరి ప్రొఫైల్ను పూర్తి చేసి పథకం అమలు చేస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీకి అనుబంధం కాకుండా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న ‘వేస్ట్ పిక్కర్ల’ప్రొఫైలింగ్ కొనసాగుతోంది. వీరిలో బయట రాక్ పిక్కర్లు, వెంట్రుకలు ఏరుకునే వాళ్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు వంటి వారు ఉన్నారు. ఆన్లైన్ పరిశీలన పూర్తయ్యాక వీరిందరికీ పథకం ప్రయోజనాలు దక్కుతాయి. ప్రొఫైలింగ్ పూర్తయిన ప్రతీ కార్మికుడికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం, భద్రత -
గోదావరి బ్రిడ్జిపై మరమ్మతులు
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిపై ఉన్న పాత బ్రిడ్జికి అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. రెండు బ్రిడ్జిలపై నెలకొని ఉన్న సమస్యలపై ‘వారధికి మరమ్మతులేవి..?’, ‘అమాత్యులైన మీరైనా..’శీర్షికన ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు మొదటి బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చారు. కుంగిపోయిన అప్రొచ్రోడ్కు ప్యాచ్వర్క్ పూర్తి చేశారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు బ్రిడ్జిలపై నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నూతన బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ?
ఇల్లెందురూరల్:మండలంలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ సుంకరగూడెం గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఫ్రాన్సీ ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతిపై కుటుంబీకులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా, ఇప్పటివరకు మిస్టరీవీడలేదు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మె ల్యే కోరం కనకయ్య సైతం సమగ్ర విచారణతో దోషులను శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. పది రోజులు గడిచినా విచారణ ముందుకు సాగకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి చెందిన రోజే తల్లిదండ్రులు కేజియా, ప్రభాకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు అనుమానాలు రావడంతో మరుసటి రోజు అనుమానితుల పేర్లతో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో తాత్సారం చేస్తుండటంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు. విచారణలో జాప్యంపై సీఐ సురేష్ను వివరణ కోరగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారిస్తామని, అనుమానితులను సైతం విచారించి దోషులుగా తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఉరి వేసుకుని మహిళ బలవన్మరణంసత్తుపల్లిటౌన్: ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లిలోని శ్రీవాణి కళాశాల రోడ్డులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుంటకు చెందిన ఇమ్మనేని నరేంద్ర – అనూష అద్దెకు ఉంటున్నారు. సూర్యాపేట జిల్లా నకిరేకల్కు చెందిన అనూష(37)తో ఎర్రగుంట వాసి నరేంద్రకు 2012లో వివాహమైంది. అయితే, వీరి మధ్య తరచూ మనస్పర్థలు వస్తుండేవని సమాచారం. ఈక్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన అనూష ఫ్యాన్కు ఉరి వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి లోపల గడియవేసి ఉండడంతో ఎంత పిలిచినా ఫలితం లేక కిటికీలో నుంచి చూడగా అనూష ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిసిందని నరేంద్ర కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. వీరికి ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రదీప్ తెలిపారు. -
‘క్లరికల్’ పరీక్ష ఊసేది..?
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష కోసం ఇంటర్నల్ అభ్యర్థులు 20 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రిక్రూట్మెంట్సెల్ జీఎంలు ముగ్గురు మారినా పరీక్ష నిర్వహణ ఊసే లేదు. దీంతో అర్హులైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా 8 విభాగాల్లో సుమారు 360 పోస్టుల భర్తీకి యాజమాన్యం 2014, మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విభాగాల్లో రాత పరీక్ష నిర్వహించి, భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. క్లరికల్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్ పోస్టులు 177 ఉండగా, 6,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అంతర్గత ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల చేశాక రిక్రూట్మెంట్ సెల్ జీఎంలు ముగ్గురు మారారు. డైరెక్టర్(పా)గా కూడా ముగ్గరు మారారు. అయినా పరీక్ష మాత్రం నిర్వహించలేదు. కాలయాపన చేస్తున్న యాజమాన్యం సంస్థలో 2018 నుంచి సుమారు 18 వేల మంది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. వారి వారసులు(డిపెండెంట్లు) సుమారు 16వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వారిలో 98శాతం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, కంప్యూటర్పై అవగాహన కలిగినవారు ఉన్నా రు. ఈ నేపథ్యంలో డిపెండెంట్లకు బదిలీ వర్కర్గా పోస్టింగ్ ఇచ్చినా యాజమాన్యం క్లరికల్ పనులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి రాత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. -
ముక్కోటి పనులు వేగవంతం
● హంస వాహనానికి రంగులు ● ఆన్లైన్ టికెట్లకు భక్తుల నుంచి ఆదరణభద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈనెల 20న ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్ల వారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. తెప్పోత్సవానికి ఉపయోగించే హంసవాహనానికి కార్మికులు రంగులు అద్దుతూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చలువ పందిళ్ల నిర్మాణం తుది దశకు చేరుకోగా, పంచ రంగుల పనులు నడుస్తున్నాయి. ప్రధాన ఆలయం, ఉపాలయాలకు రంగులు వేస్తున్నారు. బ్రిడ్జి రోడ్డు వద్ద స్వాగత ద్వారం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు పర్యటించి పనులు వేగంగా, నాణ్యంగా చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో టిక్కెట్లకు ఆదరణ దేవస్థానం వెబ్సైట్లో ఉంచిన ఉత్తర ద్వార దర్శనం టికెట్లకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. రూ.2 వేల విలువ గల వీఐపీ సెక్టార్ల టికెట్లు 650కు గాను 225 టికెట్లు, రూ.వెయ్యి విలువ గల టికెట్లు 200కు గాను 88 అమ్ముడుపోయాయి. రూ.500 విలువ గల టికెట్లు బీ సెక్టార్లో 49, సీ సెక్టార్లో 79, డీ సెక్టార్లో 22, రూ.250 విలువ గల టికెట్లు 21 ఇప్పటి వరకు భక్తులు ఆన్లైన్లో కొనుగోలు చేశారు. మరో 19 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని, ఒరిజనల్ టికెట్లను దేవస్థానం కార్యాలయం నుంచి ధ్రువీకరణ ఐడీతో పొందాలని ఈఓ దామోదర్రావు కోరారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ మూర్తులకు బుధవారం బేడా మండపంలో స్నపన తిరుమంజనుం వేడుకను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ఖర్చుల వివరాలు నమోదు చేయాలి
టేకులపల్లి: ఈనెల 3 నుంచి 17వ తేదీ వరకు చేసిన ఎన్నికల ఖర్చులను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని, వాటికి సంబంధిత రసీదు కూడా జత చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. ముత్యాలంపాడు రైతువేదికలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికలు, ఖర్చులపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ఖర్చు రూ.5వేల లోపైతే నేరుగా నగదు ఇవ్వొచ్చని, అంతకు మించితే చెక్కు లేదా ఆర్జీఎఫ్జీ ద్వారా చెల్లించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లో మొత్తం లెక్కలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిబంధనకు మించి అధికంగా ఖర్చు చేసినా, తప్పుడు లెక్కలు చూపినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఒక పంచాయితీలో అనుమతి తీసుకున్న వాహనంపై మరో పంచాయతీలో తిరిగితే దాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సహాయ ఎన్నికల అధికారి బైరు మల్లేశ్వరి మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పులను పంచాయతీ సిబ్బంది మాత్రమే పంచుతారని, అభ్యర్థులు, రాజకీయ నాయకులు పంచేందుకు అనుమతి లేదని తెలిపారు. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, జేఎల్ గణేష్గాంధీ తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య -
●ఒకే కుటుంబం నుంచి ఐదుగురు..
జూలూరుపాడు: మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా అక్కుల నరసింహారావు పోటీ చేస్తుండగా, అతని సోదరుడు అక్కుల రాములు సీపీఐ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి తల్లి అక్కుల నారమ్మ 2వ వార్డు నుంచి, సర్పంచ్ అభ్యర్థి రాములు పెద్ద కుమారుడు రాజేష్ 6వ వార్డు నుంచి, మరో సోదరుడు అక్కుల చిన్న రాములు 7వ వార్డు నుంచి బరిలో నిలిచారు. దీంతో కొత్తూరు పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. -
గొంతుకోసుకున్న వ్యక్తికి శస్త్రచికిత్స
● ప్రాణం కాపాడిన జిల్లా వైద్యాధికారులు ● అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్పాల్వంచ: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, ప్రభుత్వ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణం కాపాడారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్లో వంట మాస్టర్గా పనిచేసే వెస్ట్ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల బిశాల్ తమంగ్ మంగళవారం సాయంత్రం కత్తితో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరచలించగా, అక్కడి వైద్యులు వరంగల్ లోని ఎంజీఎంకు రెఫర్ చేశారు. సమాచారం అందడంతో బాధితుడిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని జిల్లా ప్రధాన ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రవిబాబు సూచించారు. ఈఎన్టీ వైద్యుడైన రవిబాబు అక్కడకు చేరుకుని, జనరల్ సర్జన్ సోమరాజు దొర, మత్తు వైద్య నిపుణుడు రాంప్రసాద్, సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఐసీయూ సేవల కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాగా శస్త్రచికిత్స చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రలోభాలకు లోను కావొద్దు
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలంఅర్బన్: అభ్యర్థులు, ఏజెంట్లు, రాజ కీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ల్లో భద్రతపై పోలీసులకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు, టౌన్ ఎస్ఐలు తిరుపతి, సతీష్, రామకృష్ణ, ఏఎస్ఐ సూర్యం, తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామంలో మంత్రి పొంగులేటి కల్లూరురూరల్: స్వగ్రామమైన కల్లూరు మండలంలోని నారాయణపురానికి బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డితో కలిసి తమ తండ్రి రాఘవరెడ్డి ఐదో ఆబ్దికంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాఘవరెడ్డి స్మృతివనంలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఖమ్మంలీగల్: చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల విచారణకు ఏర్పాటైన ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో మార్చి 2026 వరకు తాత్కాలిక పద్ధతిపై పనిచేసేలా సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ను నియమించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. 65ఏళ్లు నిండని రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ అభ్యర్థులైతే 18 – 34 లోపు వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, ఓఎస్ పోస్టుకు 7 నుంచి 10వ తరగతి వరకు అర్హతతో పాటు డ్రైవింగ్, ఎలకి్ట్రకల్, ఫ్లంబింగ్, వంటలో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 20 సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా జడ్జి ఓ ప్రకటనలో సూచించారు. బాలికల కరాటే శిక్షణకు నిధులుకేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి రూ.33.60లక్షలు ఖమ్మం స్పోర్ట్స్: సమగ్ర శిక్షా ఆత్మ రక్షణ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు రూ.29.10లక్షలు కేటాయించగా, ఇదే పథకం కింద కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలలకు రూ.4.50లక్షలు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని 194 పాఠశాలలను ఎంపిక చేశారు. కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ కోసం నిధులు మంజూరు చేసింది. గతంలో ఈ పథకం నిర్వహించినప్పుడు కొన్ని పాఠశాలల్లో శిక్షణ ఇవ్వకున్నా తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి 72 కరాటే తరగతులు నిర్వహించడంతో పాటు హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థినుల వివరాలతో రిజిస్టర్ నిర్వహిస్తేనే శిక్షణ ముగిశాక కోచ్లకు గౌరవ వేతనం అందజేస్తారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లోనూ శిక్షణకు గౌరవ వేతనం చెల్లిస్తారు. మతిస్థిమితంలేని వ్యక్తి చేరదీత భూపాలపల్లి రూరల్: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి – కాళేశ్వరం సమీపాన అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఒంటరిగా తిరుగుతున్నాడు. అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు బుధవారం కాళేశ్వరం మీదుగా ఖమ్మం వెళ్తుండగా సదరు వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆయనకు భూపాలపల్లి పోలీసుల సమక్షాన అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్లారు. వైద్యం చేయించి కోలుకున్నాక కుటుంబ వివరాలు తెలిస్తే చట్టపరంగా అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టాలి
కొత్తగూడెంటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ రోహిత్రాజు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్ ,శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, రమాదేవి, జయసింహారెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశం -
రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గోదావరి నది పరిక్రమణ(ప్రదక్షిణ) సమితి బృందం బుధవారం దర్శించుకుంది. బృందం సభ్యులకు ఈఓ దామోదర్రావు, అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రదక్షిణలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సాధువుల బృందం, తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి వస్త్రాల నిలిపివేత...? భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి వస్త్రాల కేంద్రం టెండర్దారునికి భక్తులు సమర్పించే వస్త్రాలను అందజేయటం నిలిపివేసినట్లు సమాచారం. స్వామి వారి వస్త్రాల పేరుతో బయటి మార్కెట్లో లభించేవి ఇటీవల కాలంలో ఆ కేంద్రం వద్ద ఆలయ సిబ్బంది పట్టుకున్న విషయం విదితమే. దీనిపై ఆ కాంట్రాక్టర్కు నోటీస్ జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వస్త్రాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఆ కాంట్రాక్టర్ కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వస్త్రాలను గతంలో మాదిరిగా దేవస్థానం సిబ్బందితోనే విక్రయించాలనే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిశాక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. పెద్దమ్మతల్లి ఆలయంలో 14 నుంచి పవిత్రోత్సవాలుపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈనెల 14 నుంచి 16 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మానికి చెందిన ఎ.ఎన్.కె.సంతోష్కుమార్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు ఈ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. అలసత్వం వహించొద్దుపినపాక: ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని, తనిఖీ కేంద్రంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఈ బయ్యారం క్రాస్రోడ్లోని ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్నికల నిబంధనావళిని ప్రతీ ఒక్కరు అనుసరించాలని, సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు తీసుకెళ్తే జప్తు చేయాలని చెప్పారు. రాత్రి వేళలో అదనపు సిబ్బందితో ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. -
●ఎన్నికల నియమావళి పాటించాలి
జూలూరుపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి ఎ. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జూలూరుపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఎన్నికల నియమావళి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ రోజు ఖర్చు వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఓలకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ నాయకులు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. అధికారులు నాగరాజు, టి. శ్రీనివాస్, పూరేటి అజయ్, శ్రీలక్ష్మి, బాదావత్ రవి, టి.తులసిరామ్ పాల్గొన్నారు. -
తొలిపోరు నేడే
మండలం జీపీలు వార్డులు అశ్వాపురం 23 193 భద్రాచలం 01 20 బూర్గంపాడు 13 125 చర్ల 26 152 దుమ్ముగూడెం 32 192 కరకగూడెం 16 118 మణుగూరు 14 123 పినపాక 20 174 చుంచుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి దశలో 8 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు మినహా 145 పంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. 3,028 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,70,573 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే 4,003 మంది అధికారులు, సిబ్బంది బుధవారమే సామగ్రితో సహా తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్నారు. ఇందులో 1,812 మంది పీఓలు, 2,191 మంది ఓపీఓలు ఉన్నారు. వీరితో పాటు అదనంగా మరో 10 శాతం మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎనిమిది మండలాల పరిధిలో 56 మంది రిటర్నింగ్ అధికారులు, 191 మంది స్టేజ్–2 అధికారులు, 79 మంది రూట్ ఆఫీసర్లు, 26 మంది జోనల్ అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఎవరినైనా పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. మొదట వార్డుల వారీగా ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. 14 జీపీలు ఏకగ్రీవం.. తొలివిడతలో అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని 159 పంచాయతీలు, 1,436 వార్డులకు గాను 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీల్లో నేడు పోలింగ్ కొనసాగనుండగా, 461 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 336 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,097 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2,567 మంది పోటీ పడుతున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2,70,573 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,21,037, పురుషులు 1,49,525 మంది కాగా ఇతరులు 11 మంది ఉన్నారు. తొలి విడతలో 1,428 పోలింగ్ కేంద్రాలకు గాను 1,510 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు దాదాపు 70 బస్సులు, 15 మినీ బస్సులతో పాటు ఇతర టాటా మ్యాజిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో తొలివిడత 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది బుధవారమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామగ్రితో సహా తరలివెళ్లారు. పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. – జితేష్ వి.పాటిల్, కలెక్టర్మొదటి విడత ఎన్నికలకు రంగం సిద్ధం -
మక్కల కొనుగోళ్లలో దందా!
● రైతుల వద్ద తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు ● మార్క్ఫెడ్ కేంద్రాల్లో వారి పేరుతోనే విక్రయాలు ● ఫలితంగా మద్దతు ధర పొందలేకపోతున్న రైతులు ఇల్లెందు: మొక్కజొన్న కొనుగోళ్లలో వ్యాపారుల దోపిడీని అధికారులు నియంత్రించలేకపోతున్నా రు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రైతుల పేరుతోనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతు క్వింటాల్కు సుమారు రూ. 500 నుంచి 700 వరకు నష్టపోతున్నాడు. మార్క్ఫెడ్ ద్వారా ఇల్లెందు, కొమరారం, గుండాల, ఆళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో గుండాల, ఇల్లెందు సొసైటీల్లో ఏర్పాటు కేంద్రాలకు మక్కలు రాకుండా వ్యాపారులు అడ్డుపడుతున్నారు. 20 రోజులుగా ఇల్లెందు కొనుగోలు కేంద్రంలో 258 మంది రైతుల నుంచి 1,800 మెట్రిక్ టన్నులు, కొమరారంలో 76 మంది రైతుల నుంచి 525 మెట్రిక్ టన్నులు మొక్కజొన్న కొనుగోలు చేశారు. రైతుల వద్ద రూ.1,750కే.. వ్యాపారులు రైతుల వద్ద క్వింటాల్ రూ.1,450 నుంచి రూ.1,750కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,400 చొప్పున కేంద్రాల్లో వ్యాపారులు విక్రయించుకుని లాభం పొందుతున్నారు. మార్కెట్, సొసైటీ అధికా రులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, అందుకే వ్యాపారుల దర్జాగా కొనుగోళ్లు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన పంట, విక్రయించిన రైతులు వివరాలు సేకరించి విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. సుదిమళ్ల స్టేజీ వద్ద ఇద్దరు వ్యాపారులు సొసైటీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మట్టి పెడ్డలు, దుమ్ము, ధూళి ఏరివేసే జల్లెడ మిషన్లను కూడా రైతుల ముసుగులో వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. కొనుగోళ్లపై సొసైటీ సీఈఓ హీరాలాల్ను వివరణ కోరగా.. రైతుల పేరుతో వచ్చే పంటనే కొనుగోలు చేస్తున్నామని, ఆరంభంలో ఎక్కువ పంట వచ్చిందని, ఇటీవల తగ్గిపోయిందని వివరించారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం బూర్గంపాడు/భద్రాచలంటౌన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఆయన బూర్గంపాడు, భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సెక్టార్ల వారీగా పోలింగ్ సామగ్రి తరలింపునకు ప్రత్యేక బస్సులు, 10 మంది అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. చలి తీవ్రత దృష్ట్యా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ బాక్స్లను తెరవడం, మూయడం వంటి కీలక ప్రక్రియలపై సిబ్బందికి సమగ్రంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, తహసీల్దార్లు ధనియాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఎంపీడీఓలు బాలయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవలపై ఆరా.. చర్ల: చర్ల సీహెచ్సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆరా తీశారు. బుధవారం ఆయన స్థానిక సీహెచ్సీని పరిశీలించారు. ఆస్పత్రిలో కొన్నిచోట్ల లీకేజీలను గుర్తించి తక్షణమే సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించాలని వైద్యాధికారికి సూచించారు. గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఆర్ కొత్తగూడెంలో శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న విప్ప పువ్వు లడ్డూ, బర్ఫీ, చాక్లెట్, టీ పొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. విప్పపండ్లు సేకరణ సమయంలో నేలపై పడకుండా ఉండేలా అవసరమైన నెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వాటిని ఆరబెట్టేందుకు సోలార్ పరికరాలు కావాలని మహిళలు కోరగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, సీహెచ్సీ సూపరింటెండెంట్ సాయివర్దన్, వైద్యులు కాంత్, రవికుమార్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
‘మహాలక్ష్మి’కి రెండేళ్లు!
● రీజియన్లో 8.91కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం ● చార్జీల రూపంలో రూ.420 కోట్లు ఆదాప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఉమ్మడి జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. మహిళా ప్రయాణికులతో పాటు ఇతరులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఇదే సమయాన మరిన్ని సౌకర్యాలు కల్పించేలా సంస్థ చర్యలు చేపడుతోంది. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు నిండాయి. మహిళా ప్రయాణికులకు వరంలా మారిన ఈ పథకం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటివరకు రెండేళ్లలో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా మహిళలకు టికెట్ల రూపంలో రూ.420.05 కోట్లు ఆదా అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో ప్రయాణాలు మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గ్రామాల నుండి వివిధ పనులు, ఉపాధి నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్లే మహిళలు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పథకం వారికి ఊరటగా మారింది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో గత రెండేళ్లలో ఏకంగా 8.91 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. రోజుకు సగటున 1,23,605 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. తద్వారా వారికి చార్జీలు ఆదా అవుతుండగా, ఈ నగదును నిత్యావసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా ఈ పథకం మహిళా ప్రయాణికులకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ను ఇస్తోందని పలువురు అభివర్ణిస్తున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యాన బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యాన ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా బస్సులను సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం ద్వారానే స్వయం సహాయక సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన సంస్థకు అప్పగిస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తుండడంతో సిబ్బంది కొరత తీరుతోంది. -
భవితవ్యం మీ చేతుల్లోనే..
● ప్రలోభాలకు కాదు.. ప్రగతికి ఓటేద్దాం ● నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్కరకగూడెం: ప్రజాస్వామ్య పండుగగా నిలిచే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరుగనుంది. ఇది కేవలం ఓటు హక్కు వినియోగం మాత్రమే కాదు.. గ్రామ భవిష్యత్ను చక్కదిద్దే అవకాశం. ఈ ఓటుపైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ పౌరుడు ఆలోచించాల్సిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. గ్రామాల్లో కులం, బంధుత్వం, పార్టీ అభిమానం ఆధారంగా ఓటేస్తుంటాం. అలా కాకుండా మనం వేసే ఓటు.. రోడ్లు వేయించడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, వీధి దీపాలు వెలిగించడం వంటి మౌలిక వసతులు తీర్చేదిగా ఉండాలి. గ్రామాభివృద్ధికి కట్టుబడే నాయకుడిని ఎన్నుకుంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. లేదంటే రాబోయే ఐదేళ్లు గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది. నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతడికి ఎంత డబ్బు ఉందని చూడకుండా విద్య, పని చేయగల సామర్థ్యం, సమస్యలు అర్థం చేసుకునే గుణం, ప్రభుత్వ పథకాలు, నిబంధనలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వారికే ఓటు వేయాలి. ఒకరోజు సంతోషం కోసం ఓటు అమ్ముకోవడం ప్రమాదకరం. వారిచ్చే డబ్బు, మద్యం తీసుకుని ఓటేస్తే గెలిచిన అభ్యర్థి ఐదేళ్ల పాటు ప్రజాప్రయోజనాలు కాకుండా.. అధికారాన్ని తన సొంతానిని వినియోగించుకుంటాడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంతో పాటు గ్రామ భవిష్యత్తే దెబ్బతింటుంది. గ్రామాల్లో మహిళా ఓటర్లు, యువకులు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలి. పోటీ చేసే అభ్యర్థి గ్రామానికి ఏం చేస్తారో ప్రశ్నించాలి. అలాగే తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మహిళల నిర్ణయాధికారం పెరుగుతోంది. అందుకే ప్రలోభాలకు లొంగకుండా తమ కుటుంబ సంక్షేమం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్నికల తర్వాత కూడా గ్రామాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఎన్నికల సమయంలో శాంతి, సామరస్యాలు పాటించాలి. గొడవలు గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే గ్రామంలో ఏ పని అయినా సాధ్యమవుతుంది. -
ఎన్నికల సిబ్బందికి అరకొరగా భోజనాలు
దుమ్ముగూడెం: అధికారులు భోజన ఏర్పాట్లలో విఫలం కావడంతో ఎన్నికల విధులకు వచ్చిన పోలింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలానికి సుమారు 750 మందిని ఎన్నికల నిర్వహణకు కేటాయించారు వారికి కె.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల ఆవరణలో భోజనాలు ఏర్పాటు చేశారు. అరకొరగా ఏర్పాటు చేయడంతో అందరికీ భోజనం అందలేదు. దీంతో సిబ్బంది ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని, సరి చూసుకుని ఆకలితో కేంద్రానికి వచ్చే సరికి భోజనం లేకపోవడంతో ఆవేదన చెందా రు. అనంతరం అధికారులు బయట హోటళ్ల నుంచి భోజనాలు తెప్పించారు. అప్పటికే చాలా మంది సిబ్బంది లక్ష్మీనగరంలోని హోటళ్లకు వెళ్లి భోజనం, టిఫిన్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తీసుకెళ్లేందుకు బస్సులు సరిపోకపోవడంతో సుమారు 50 మందిని ఆటోల ద్వారా తరలించారు. -
●జోరుగా తాయిలాల పంపిణీ
రఘునాథపాలెం: తొలిదశ గ్రామపంచాయతీల్లో గురువారం పోలింగ్ జరగనుండగా మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇక బుధవారం రోజంతా అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు పోటాపోటీకి వీటిని ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇచ్చారో ఆరా తీయడంతో పాటు అంతకు మించి ఇచ్చినట్లు తెలిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.వేయి మొదలు రూ.1,500, రూ.2వేల వరకు పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కాక ప్రతీ ఇంటికి కేజీ, అరకేజీ చికెన్, చేపలు, పలువురికి మద్యం బాటిళ్ల పంపిణీ చేసినట్లు సమాచారం. త్రిముఖ పోటీ నెలకొన్న కొన్ని పంచాయతీల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులంతా ఇచ్చిన నగదు రూ.5 వేలు దాటిందని చెబుతున్నారు. నేలకొండపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లు కొందరు తమ తీరుతో సర్పంచ్ అభ్యర్థులను ఖంగు తినిపిస్తున్నారు. కొందరు అభ్యర్థులు దావత్ ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే, కొందరు ఓటర్లు ఇరుపార్టీల అభ్యర్థుల దావత్లకు హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదేమిటని అభ్యర్థులు తీస్తే ‘దావత్ వరకే అటు.. ఓటు మాత్రం నీకే వేస్తా’ అని చెబుతున్నట్లు సమాచారం. ఇంకొందరు ఫలానా బ్రాండ్ మద్యమే కావాలని హుకుం జారీ చేస్తున్నారని, నిరాకరిస్తే ఓటు పడుతుందో, లేదోననే బాధతో అభ్యర్థులు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నేలకొండపల్లి: కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటుకు ఇంత అని నగదు ఇస్తుండడమే కాక మద్యం కూడా పంపిణీ చేస్తున్నారని సమాచారం. తమకు తప్పక ఓటు వేస్తారనే నమ్మకం ఉన్న వారికి కొద్దిరోజులుగా 90 ఎం.ఎల్. లేదా క్వార్టర్ బాటిల్ ఇంటికే పంపిస్తున్నారని తెలిసింది. అలాగే, ప్రచారంలో తమ వెంట తిరుగుతున్న వారికి కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం, మద్యం సమకూరుస్తున్నట్లు సమాచారం. ఖమ్మంవైరారోడ్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను కేటాయించాలని బీఆర్ఎస్, సీపీఎం నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్కు వినతిపత్రం అందజేశారు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న గ్రామపంచాయతీల జాబితాను సీపీకి సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం, మాంసం -
విమానం ఎగిరేనా?
జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వేను నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో ఈ అంశంపై ఎంతో కొంత ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే ఎప్పటిలాగే విమానాశ్రయ ఏర్పాటు అంశం ప్రకటనలకే పరిమితం అవుతుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరెండు దశాబ్దాల కల.. కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక, పాల్వంచ మండలం బంగారుజాల – గుడిపాడు ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. అయితే ఎయిర్పోర్టు నిర్మాణానికి ఈ స్థలాలు అనుకూలంగా లేవని ప్రాథమిక దశలోనే తేలింది. దీంతో ప్రభుత్వం గతేడాది కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించింది. ఈ మేరకు ఆయా మండలాల పరిధిలో మొత్తం 950 ఎకరాలు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మళ్లీ మొదటికొచ్చిన కథ.. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కోసం గరీబ్పేట పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 950 ఎకరాల స్థలాన్ని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన టెక్నికల్ టీమ్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించింది. ఈ బృందం జనవరి 23న క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎంపిక చేసిన స్థలం సమీపంలో ఎత్తయిన గుట్టలు ఉండటం, ఇక్కడ గాలి వీచే దిశ, వేగం తదితర అంశాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేవంటూ ఆ బృందం ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ పురోగతిని వివరిస్తూ మార్చిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నివేదికలోని విషయాలను వెల్లడించగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం స్పష్టంగా ప్రకటన చేసింది. దీంతో కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణ (మెటీయోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రమ్ తదితర సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటున్నాయి. అదే విధంగా సదరు స్థలంలో ఉన్న ఎత్తయిన కొండలు, నిర్మాణాలు, వాగులతో విమాన రాకపోకలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. గతంలో ఎంపిక చేసిన బంగారుజాల – గుడిపాడు విషయంలోనూ ఎత్తయిన కొండలు, కేటీపీఎస్ చిమ్నీలు ఇబ్బందిగా మారాయి. తాజాగా గరీబ్పేటలోనూ భౌగోళిక పరిస్థితులే అడ్డుగా నిలిచాయి. అందుకే మరోసారి స్థలాన్ని గుర్తించేప్పుడు భౌగోళిక అంశాల విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికై తే పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిఽధిలో కొండలు, గుట్టలు, వాగులు లేని రెవెన్యూ స్థలాలను జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు సమాచారం.సందిగ్ధంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ కొత్తగూడెం ఎయిర్పోర్టు అంశంపై విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో కాకుండా మరోచోట స్థలాన్ని ఎంపిక చేస్తామని, అక్కడ ఫీజుబులిటీ సర్వే చేపట్టాలని కోరారు. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ ప్రారంభం, అడ్మిషన్లు, మౌలిక వసతుల కోసం ప్రణాళిక తయారీ తదితర అంశాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ అంశం మరుగునపడింది. ఇటీవల ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్రం తన స్పందనను స్పష్టం చేసింది. ఇకనైనా ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయ స్థలాల ఎంపికపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లిని డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, జగన్నాథపురం అభ్యర్థి బి.అనితతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం మండలంలోని జగన్నాథపురంలో పోటీ చేస్తున్న అనితతో కలిసి దేవీప్రసన్న ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బానేని నాగేశ్వరరావు, దార్ల జ్యోషి, నందనాయక్, బాదర్ల నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పుష్కరఘాట్ల పరిశీలన దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం గ్రామాల్లోని పుష్కరఘాట్లను హైదరబాద్కు చెందిన ప్రైవేట్ ఈవై కన్సల్టెన్సీ బృందం సభ్యులు సాయితేజ, కుసా, తాహరీం మంగళవారం పరిశీలించారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు అనువుగా పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు తొలుత పర్ణశాల ఘాట్లను పరిశీలించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పర్ణశాలలో ఘాట్ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని, అందుకు గాను దుమ్ముగూడెం వద్ద ఘాట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెంలోని నందులరేవు పుష్కరఘాట్లను ఫొటోలు తీసుకుని వెళ్లారు. వారి వెంట ఇరిగేషన్ జేఈ రాజ్సుహాస్, పీటీ మస్తాన్వలీ తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి..● ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి బూర్గంపాడు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పలు పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టులను జిల్లా సాధారణ పరిశీలకులు వి.సర్వేశ్వరరెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేసే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, టోకెన్ల పంపిణీతోపాటు మోరంపల్లి బంజర జెడ్పీహెచ్ఎస్, పినపాకపట్టీనగర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ వంటి సదుపాయాలపై అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మోరంపల్లి బంజర, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తనిఖీ చేశారు. డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మాజీ మావోయిస్టు నాయకుడు మృతిఅశ్వాపురం: మండలంలోని చింతిర్యాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నాయకుడు తోట సీతారామయ్య(70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన 1980లో విప్లవోద్యమంలో భాగమయ్యాడు. కొంత కాలం పీస్ బుక్ సెంటర్లో విప్లవ సాహిత్యాన్ని అమ్మే పనిచేయగా అప్పుడు పీబీసీ కుమార్ అని పిలిచేవారు. 1985లో పీస్బుక్ సెంటర్ మూసేశాక కొరియర్గా పనిచేశాడు. డీటీపీ, ఆప్సెట్ ప్రింటింగ్ నేర్చుకొని విప్లవ సాహిత్యాన్ని అచ్చువేసి ఉద్యమ ప్రాంతాలకు తరలించేవాడు. 2001నుంచి దండకారణ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతికి కంప్యూటర్ ఆపరేటర్గా, సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించారు. ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సీతారామయ్య 2023లో చికిత్స కోసం బయటకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత బెయిల్పై విడుదల కాగా, అనారోగ్యంతో చింతిర్యాలలో ఉంటూ సోమవారం మృతి చెందగా, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
‘తొలి పోరు’కు ఏర్పాట్లు సిద్ధం
చుంచుపల్లి : జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశామని డీపీఓ ఎం.సుధీర్కుమార్ తెలిపారు. మూడు విడతల జీపీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయని, షెడ్యూల్ ఏరియాలో 457, నాన్ షెడ్యూల్ ఏరియాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 14, రెండో విడతలో ఎన్నికలు జరిగే వాటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, వీటి పరిధిలోని 584 వార్డులు కూడా ఏకగ్రీవంగా నిలిచాయని తెలిపారు. మొదటి విడతలో 8 మండలాల్లోని 159 పంచాయతీలు, 1,436 వార్డులు, రెండో విడత ఏడు మండలాల్లో 155 జీపీలు, 1,384 వార్డులు, మూడో విడతలో ఏడు మండలాల్లోని 154 పంచాయతీలు, 1,330 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసం 3,808 పెద్దవి, 520 చిన్న బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. మొత్తంగా 13.50లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించామని, ఇందులో సర్పంచ్ స్థానాలకు సంబంధించి 6.50లక్షల పేపర్లు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వెల్లడించారు. మూడు విడతల ఎన్నికల్లో 12,507 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, ఇందులో పీఓలు 5,091 మంది, ఓపీఓలు 6,106 మంది ఉన్నారని, వీరికి అదనంగా 10 శాతం సిబ్బంది రిజర్వుడ్లో ఉంచామని తెలిపారు. వార్డు సభ్యుల పోలింగ్కు 200 మంది ఓటర్లు ఉంటే ఇద్దరు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 200 నుంచి 400 వరకు ఓటర్లు అయితే ముగ్గురు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 400కు పైగా ఓటర్లు ఉన్న వార్డులకు నలుగురు ఉద్యోగులతో పాటు ఇద్దరు అదనపు సిబ్బందిని కేటాయించామని వివరించారు.డీపీఓ సుధీర్కుమార్ వెల్లడి -
అప్రమత్తతతోనే ప్రమాదాలకు చెక్..
మణుగూరుటౌన్: మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతాయని, విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటే జరగవని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం (ఈఅండ్ఎం) దామోదర్రావు అన్నారు. మంగళవారం 56వ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మణుగూరు ఏరియా వర్క్ షాప్ను రక్షణ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వర్క్షాప్లో ఇన్చార్జ్ ఏరియా ఇంజనీర్ వీరభద్రుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థపై కృతజ్ఞత భావం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మెరుగైన పర్యవేక్షణ, పనిలో అంకితభావం, సమష్టి కృషి, సమయపాలన వంటి అంశాలు రక్షణతో కూడిన పనికి దోహదపడతాయన్నారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా పనిచేస్తే జీవితంలో చీకటి మిగిలుతుందని, విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి మాజీ కార్మికుడు ఎస్డీ నాజర్పాషా రచన, దర్శకత్వంలో సింగరేణి కళాకారులు ప్రదర్శించిన ‘తస్మాత్ జాగ్రత్త’నాటకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో అధికారులు టి.శ్రీకాంత్, వెంకట రామారావు, శ్రీనివాసాచారి, గుర్తింపు సంఘం నాయకులు వై.రాంగోపాల్, ఐఎన్టీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మదన్నాయక్, రక్షణ తనిఖీ బృందం సభ్యులు కృష్ణారెడ్డి, దామోదర్, సురేశ్, సుధాకర్ తదితరులు ఉన్నారు.రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం (ఈఅండ్ఎం) దామోదర్రావు -
రెండు రంగుల్లో బ్యాలెట్ పేపర్
● సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ ● తెలుపు రంగు వార్డు సభ్యులకు..సుజాతనగర్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తున్న విషయం విదితమే. అయితే త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక ఓటు సర్పంచ్కు, మరో ఓటు వార్డు సభ్యుడికి.. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. బ్యాలెట్ పత్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ చివరిలో నోటాను వినియోగిస్తున్నారు. పైఅభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్ పేపర్లో ఎనిమిది గుర్తులతో పాటు చివరలో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరో బ్యాలెట్ పేపర్ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్ వినియోగిస్తారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సును వరుసగా తెరుస్తారు. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. -
తుది విడతలో 10 జీపీలు ఏకగ్రీవం
చుంచుపల్లి: మూడో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు, వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. బుజ్జగింపులు, బేరసారాలు జరగడంతో చివరి నిమిషంలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 155 గ్రామపంచాయతీలు, 1,330 వార్డులకు ఈనెల 17న మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కోర్టు ఆదేశాలతో జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం విదితమే. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 10 గ్రామ పంచాయతీలు, 224 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడతలో 14 జీపీలు, 336 వార్డులు, రెండో విడతలో 16 జీపీలు, 240 వార్డులు, మూడో విడతలో 10 జీపీలు, 224 వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం. తుది విడత ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా.. బుధవారం నుంచి వీరి ప్రచారపర్వం ప్రారంభం కానుంది. ఏకగ్రీవంగా నిలిచినవివే.. సుజాతనగర్ మండలంలో టూ ఇంకై ్లన్ గ్రామపంచాయతీ సర్పంచ్తో పాటు మొత్తంగా 30 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 12 పంచాయతీలు, 80 వార్డులకు పోలింగ్ జరుగనుంది. ఆళ్లపల్లిలో 12 పంచాయతీలు, 90 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గుండాలలో 11 గ్రామపంచాయతీలు, 96 వార్డులకు మామకన్ను, దామరతోగు జీపీలతో పాటు 18 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. 9 గ్రామపంచాయతీలు, 78 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. జూలూరుపాడు మండలంలో శంభునిగూడెం, వినోభానగర్ జీపీలతో పాటు 14 వార్డులు ఏకగ్రీవం కాగా, 23 గ్రామపంచాయతీలు, 174 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. లక్ష్మీదేవిపల్లిలో హరియాతండా, కారుకొండ, అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీలు, 39 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28 పంచాయతీలు, 251 వార్డులకు పోలింగ్ జరగనుంది. టేకులపల్లి మండలంలో 68 వార్డు స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కాగా, 36 గ్రామపంచాయతీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు మండలంలో 29 గ్రామపంచాయతీలు, 274 వార్డులకు గాను సుభాష్నగర్, ధనియాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు 51 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. మిగిలిన 27 జీపీలు, 223 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.224 వార్డు స్థానాలు కూడా.. -
సర్పంచ్ బరిలో గర్భిణి!
అశ్వారావుపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఏడు నెలల గర్భిణి సర్పంచ్ పదవికి పోటీచేస్తోంది. మండలంలోని పాతరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 644 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 310 మంది పురుషులు, 334 మంది సీ్త్రలు ఉన్నారు. అత్యధికంగా కొండరెడ్ల ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. కొండరెడ్డి సామాజిక వర్గానికే చెందిన ఉమ్మల వెంకటరమణ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భంతోనే ప్రచారం నిర్వహిస్తోంది. వెంకటరమణ డిగ్రీ పూర్తి చేసింది. టేకులపల్లి: సర్పంచ్ బరిలో గర్భిణీ నిలిచింది. మండలంలోని చంద్రుతండాకు చెందిన భూక్య రాజా సతీమణి శైలజ ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కాంగ్రెస్ తరఫున చంద్రుతండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మంగళవారం నుంచి గ్రామంలో ప్రచారం చేస్తోంది. -
సమన్వయంతో పని చేయండి
● ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి ● అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని తరలించాలని, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సరిపడా ఉన్నాయా పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియోల ద్వారా రికార్డు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అవసరమైన వాహనాలను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి భోజనం, రవాణా వంటి సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. పెద్ద పంచాయతీలైన భద్రాచలం, సారపాక వంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. తొలివిడతలో 159 పంచాయతీలు.. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, పినపాక, చర్ల, కరకగూడెం మండలాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది అధికారులు, 2,295 మంది సిబ్బంది నియమించామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రత కట్టుదిట్టంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, డీఏఓ బాబురావు, డీఎంఓ నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు. -
ముగిసిన మొదటి దశ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులుచుంచుపల్లి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రధానమైన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా మైకులు మూగబోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేవారు గత వారం రోజులుగా విస్తృత ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. దాదాపు సర్పంచ్ అభ్యర్థులంతా డబ్బు పంపకాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధానంగా గ్రామాల్లో మూకుమ్మడిగా పడే ఓట్లపై అభ్యర్థులు కన్నేశారు. మరో వైపు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మందు, విందు పార్టీలు జోరందుకోగా పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు తీవ్రతరం చేశారు. ఇక మొదటి విడత 159 గ్రామపంచాయతీల్లో 14 జీపీలు, 336 వార్డులు ఏకగ్రీవం కాగా, మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 145 జీపీలతో పాటు 1,097 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 461 మంది, వార్డులకు 2,567 మంది బరిలో నిలిచారు. -
ఎన్డీ అభ్యర్థులను గెలిపించండి
ఇల్లెందు: దోపిడీ పాలక వర్గ పార్టీల అభ్యర్థులను ఓడించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పీడిత ప్రజల రాజ్య స్థాపనకు పోరాడే ఎన్డీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లెందులోని ఎన్డీ కార్యాలయంలో పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలులోకి తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 1978 నుంచి ఈ ప్రాంతంలో ఎంఎల్ పార్టీల అభ్యర్థులే విజయం సాధించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఇల్లెందు మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్డీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు జె.సీతారామయ్య, ఎండీ రాసుద్ధీన్, మండల కార్యదర్శి పొడుగు నర్సింహారావు, మోతీలాల్, సంతు, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నేతలు సాధినేని, మధు -
భారంగా నడిపిస్తున్నారు..
కొత్తగూడెంఅర్బన్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి అభివృద్ధి నిధుల విడుదల లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు ముందుకు నడిపించాల్సి వచ్చిందని, అయినా కనీస గౌవరం దక్కడం లేదని యూనివర్సిటీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీగా మారే అంశం ప్రారంభమైన గత జూన్ నుంచి కూడా పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ విభాగం సభ్యులంతా కంటికి నిద్ర లేకుండా కష్టపడితే ఇటీవల జరిగిన సీఎం ప్రోగ్రాంలో వారికి కనీస గౌవరం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి యూనివర్సిటీగా రూపురేఖలు మారిస్తే సీఎంకు కనీసం బొకే ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదని, కనీసం సీఎం ఉన్న సమయంలో స్టేజీ మీదకు కూడా వచ్చే అవకాశం రాలేదని వాపోతున్నారు. ఇలా ఉంటే భవిష్యత్లో యూనివర్సిటీ కోసం ఏరకంగా పని చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన రిజిస్టర్ బాధ్యత అంతా కూడా తీసుకొని ముందుండి నడిపించాల్సి ఉండగా అలా జరుగలేదని, జిల్లా అధికారుల ఒత్తిడి, ఆదేశాల మేరకు పని చేసిన వారిని ప్రోగ్రాంలో పట్టించుకోకపోవడం చాలా ఇబ్బంది కలిగించిందంటున్నారు. పరీక్షలపై లేని క్లారిటీ.. డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో సిలబస్ లేకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ అధికారులే మూడు నెలల క్రితం తయారు చేశారు. దీంతో పాటుగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ఫీజులు తీసుకొని, వాటిని యూనివర్సిటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. కానీ, ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో ఆ ఫీజులన్నింటినీ కాకతీయ యూనివర్సిటీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు. యూనివర్సిటీకి ప్రత్యేక అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేదనే ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టిన కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నూతనంగా అడ్మిషన్లు తీసుకొని యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న యూజీ, పీజీ విద్యార్థులకు జనవరిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లే ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని, పైగా యూనివర్సిటీలో పనిచేస్తారా.. కేయూలో పని చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని హెచ్వోడీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు సంబంధించి అధ్యాపకులు ఆరుగురికిపైగా వరంగల్లో డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు. దీంతో బీటెక్లో అధ్యాపకుల కొరత ఒక వైపు వేధిస్తుంటే, మరో వైపు యూనివర్సిటీలో కూడా ఇప్పుడిప్పుడే అధ్యాపకుల నియమాకం జరుగుతుండడం, రెండింటిని కూడా నడిపించడం అధ్యాపకులకు కత్తిమీద సాములాగా మారింది. యూనివర్సిటీకి సంబంధించి పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, టీచింగ్ స్టాఫ్, స్థానికంగా రిజిస్ట్రార్ స్థాయి అధికారి ఉంటే తప్పా యూనివర్సిటీ గాడిలో పడే అవకాశం లేదు.ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో పరీక్షలపై లేని క్లారిటీ -
వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం
సుజాతనగర్: వృద్ధులకు గౌరవంతో పాటు చట్టపరమైన రక్షణ అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. పాత అంజనాపురంలో ఇటీవల ఏర్పాటైన వృద్ధాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, వృద్ధులను గౌరవించడం చట్టపరమైన భాద్యత అన్నారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 గురించి వివరించారు. ఆశ్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, ఆశ్రమ నిర్వాహకులు పోటు రాఘవరావు, కొల్లు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళా సమాఖ్య సభ్యులు మంగళవారం ఆవిష్కరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పర్యవేక్షణలో వేడుక నిర్వహించారు. ఉపాధ్యాయురాలికి ఉత్తమ అవార్డుభద్రాచలంటౌన్/పాల్వంచ : భద్రాచలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో పనిచేస్తున్న ఐఈఆర్పీ రేగళ్ల సుమలత జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని ఐడీఓసీలో అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి సుమలతను అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సుమలత మాట్లాడుతూ.. తనకు ఈ పురస్కారం రావడానికి సహకరించిన ఐఈ కో ఆర్డినేటర్ సైదులు, విద్యా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 13న నవోదయ ప్రవేశ పరీక్షకొత్తగూడెంఅర్బన్ : 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 13న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు జిల్లా నుంచి 1,852 మంది విద్యార్థులు హాజరవుతారని, ఇందుకోసం జిల్లాలో 8 సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. అశ్వారావుపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర, భద్రాచలంలోని ఎస్ఎన్ఎం జెడ్పీహెచ్ఎస్ కొర్రాజులగుట్ట, భద్రాచలం జీహెచ్ఎస్, బూర్గంపాడు జీహెచ్ఎస్, కొత్తగూడెంలో సింగరేణి పాఠశాల, సెయింట్ మేరీస్, ఇల్లెందులోని సింగరేణి స్కూల్, జీహెచ్ఎస్ జేబీఎస్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే 94906 55706 నంబర్లో సంప్రదించాలన్నారు. -
ముక్కోటి భక్తులకు ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో తెప్పోత్సవం, ఏరు ఉత్సవం ఏర్పాటుచేసే ప్రదేశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్పెషల్ సబ్ జైలులో ఖైదీలు తయారుచేస్తున్న హెర్బల్ అగర్బత్తీ యూనిట్ను, లీగల్ ఎయిడ్ క్లినిక్ను సందర్శించారు. క్షణికావేశంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లాక ఉపాధి పొందేలా శిక్షణ ఇప్పించాలని జైలు అధికారులకు సూచించారు. ఖైదీలు తయారు చేస్తున్న అగర్బత్తీలు బాగున్నాయని, వీటిని స్థానిక మార్కెట్లో విక్రయించాలని అన్నారు. వీటితో పాటు పేపర్ కప్పులు, పేపర్ బాక్సుల తయారీ యూనిట్ కూడా పెట్టుకుంటే ఖైదీలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో కౌజు పిట్టల పెంపకానికి ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేసుకోవాలని జైలర్ ఉపేందర్కు సూచించారు. ఆ తర్వాత బ్రిడ్జి పాయింట్లో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి శిశువులకు, చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. శిశువులు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం అందించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో అనాథ పిల్లలను ఆశ్రమాల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, రామాలయ ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డీఈ జీవన్కుమార్, ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెల్లడి -
వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..!
● 20 ఏళ్లుగా ప్రజా సేవలో తిరుపతయ్య కుటుంబం కరకగూడెం: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. -
రామయ్య క్యాలెండర్లు సిద్ధం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు సిద్ధం చేయగా ఈఓ కొల్లు దామోదర్రావు మంగళవారం ఆవిష్కరించారు. తొలుత వీటిని అంతరాలయంలో మూలమూర్తుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య రంగురంగుల చిత్రాలను క్యాలెండర్, డైరీలలో పొందుపర్చామని తెలిపారు. స్వామివారి అవతారాలు, ముక్కోటి, శ్రీరామవమని వంటి ఉత్సవాల ఫొటోలతో పాటు ఆలయ సమాచారం, ప్రత్యేక, ఆర్జిత పూజల వివరాలతో కూడిన 12 పేజీల క్యాలెండర్ రూ.120, డైరీ రూ.75 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తులు, పర్యాటకులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానాచార్యులు స్థలశాయి. వేద పండితులు కృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఏఈఓ శ్రవణ్కుమార్, ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
బూర్గంపాడు: పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలలోని పినపాకపట్టీనగర్ గ్రామానికి చెందిన ఆదెమ్మ (63) తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పాల్వంచలోని తన మనవడి వద్ద ఉంటోంది. వీరికి ముగ్గరు కుమార్తెలు. సోమవారం భద్రాచలం వెళ్లి తిరిగి పాల్పంచ వెళ్తున్న ఆదెమ్మ పినపాకలో దిగి ఇంటికి చేరుకుంది. తర్వాత గ్రామంలోని వైకుంఠధామం సమీపంలో పురుగులమందు తాగింది. స్థానికులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా మంగళవారం మృతిచెందింది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని, అందుకే పురుగులమందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి మనవడు రమేశ్బాబు ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య బూర్గంపాడు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సోంపల్లి గ్రామానికి పెంకె ప్రేమలత (48) సోమవారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుంది. అర్ధరాత్రి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మోరంపల్లిబంజర పీహెచ్సీ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పురుగుల మందు తాగి వ్యక్తి.. చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన శీలం అంజి(37) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. నాటుసారా స్థావరాలపై దాడులు.. ● 1,900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం దుమ్ముగూడెం: మండలంలోని సుజ్ఞానపురం గ్రామంలోని నాటుసారా స్థావారాలపై దుమ్ముగూడెం పోలీస్, ఎకై ్సజ్ శాఖ పోలీసులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో దాచిన 1,900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 16 డ్రమ్ములను తగలబెట్టారు. నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, స్థానిక ఎస్ఐ రాజశేఖర్, డీటీఎఫ్ ఎస్ఐ గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు అక్రమంగా మద్యం, నగదు రవాణా చేస్తుంటారని, అలాంటి వాటిని అరికట్టాలని ఎస్పీ రోహిత్రాజు సిబ్బందికి సూచించారు. భద్రాచలం బ్రిడ్జి పాయింట్లో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టును సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అందుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ సతీష్ తదితరులు ఉన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
మద్యం రవాణా అరికట్టాలి
ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. వాతావరణ ం జిల్లాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. రాత్రి వేళ చలి ప్రభావం మాత్రం మరింతగా పెరుగుతుంది. కామేపల్లి: కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. స్వగ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటరెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1967లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి పంచాయతీగా లింగాల సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 1977లో ఏకగ్రీవం కాగా.. పదేళ్లు సర్పంచ్గా పని చేశారు. 1996లో సుజాతనగర్లో ఉప ఎన్నిక రావడంతో అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే, 2009లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2016లో అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. -
మెచ్చా.. రెండు సార్లు సర్పంచ్
అశ్వారావుపేట: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం సర్పంచ్గానే మొదలైంది. దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం సర్పంచ్గా రెండు సార్లు ఎన్నికై న ఆయన 2019లో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న మెచ్చా వెల్లడించిన వివరాలు.. రెండు సార్లు టీడీపీ బలపరచిన అభ్యర్థిగా సర్పంచ్గా గెలుపొందా. మొదట 1995లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినా, రెండో సారి ఏకగ్రీవమైంది. ఒకే గ్రామంలో ఓటర్లు ఉండటంతో కాలి నడకనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో మైకులు, ప్లెక్సీలు లేకపోగా బ్యానర్లు కూడా కట్టలేదు. వాల్పోస్టర్లు సత్తుపల్లి నుంచి తెచ్చుకుని ఇంటింటికీ అతికించేవాళ్లం. అవి కూడా పార్టీలో ఎవరైనా వాళ్ల డబ్బుతోనే ముద్రించి ఇచ్చేవాళ్లు. ప్రచారంలో పాల్గొనే పార్టీ కార్యకర్తలకు, గ్రామంలో అంతా తెలిసిన వాళ్లే కావడంతో ఏ వీధిలో వాళ్లు అక్కడే అభ్యర్థితో ప్రమేయం లేకుండా వాగ్దానం తీసుకుని ఓట్లు వేయించేవారు. ఒక్క సారి మాత్రమే నేను వెళ్తే మిగతా సమయమంతా పార్టీ వాళ్లే చూసుకునేవారు. అప్పట్లో బ్యాంకు ఖాతా నిబంధన లేకపోగా, ఖర్చు వివరాలు కూడా అడిగే వారు కాదు. -
వనమా.. 18ఏళ్లు జీపీలో
పాల్వంచరూరల్: Ð]l*i Ð]l$…{† Ð]l¯]lÐ]l* Ððl…MýS-sôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l# {V>Ð]l$-ç³…-^éĶæ$¡ ÐéÆý‡$z-çÜ-¿¶æ$Å-yìl-V>, çÜÆý‡µ…^Œl-V> VðSÌS-Ð]l-yýl…-™ø ´ër$ Ð]l$…{† Ýë¦Æ‡$$MìS G¨V>Æý‡$. ´ëÌS-Ó…^èl Ðól$fÆŠ‡ -ç³…-^éĶæ$-¡ÌZ 18HâýæÏ ´ër$ ÐéÆý‡$z çÜ¿¶æ$Å-yìl-V>, çÜÆý‡µ…^Œl-V> »ê«§ýlÅ-™èl-Ë$ °Æý‡Ó-Ç¢…-_¯]l A¯]l$-¿ýæ-ÐéË$ BĶæ$¯]l Ð]l*rÌZÏ-¯ól.. ´ëÌS-Ó…^èl {V>Ð]l$-ç³…-^éĶæ$¡ Ððl¬§ýlsìæ ÐéÆý‡$z ¯]l$…_ çÜ¿¶æ$Å-yìl-V> ´ùsîæ ^ólíÜ-¯]l-糚 yýl$ Æý‡*.100 ¯éÑ$¯ól-çÙ¯ŒS ïœk E…yól¨. Aç³µsZÏ ÐéÆý‡$z çÜ¿¶æ$ÅÌS §éÓÆ> çÜÆý‡µ…^Œl¯]l$ G¯]l$²-MøÐéÍÞ E…yól¨. Ððl$gêÈt çÜ¿¶æ$Å-Ë$ fÌSVýS… Ððl…VýS-âýæ-Æ>Ð]l# Ð]lÆý‡Y…ÌZ° ¯éOÐðlõ³ Ððl¬VýS$Y ^èl*í³-¯é ^ólMýS*Ç M>ÔèæÄ¶æ$Å Ð]lÆý‡Y…V> Æó‡Q çÜ™èlÅ… MýS*yé ´ùsîæ ç³yézÆý‡$. AƇ$$-¯é ¯ól¯ól VðSÍ^é. B ™èlÆ>Ó™èl 1989ÌZ Ððl¬§ýlsìæÝëÇ GÐðl$Ã-ÌôæÅ-V> VðSÍ^é. 2008ÌZ OÐðlGÝëÞÆŠḥæïÜG…V> E¯]l²-糚yýl$ BÆøVýSÅ-Ô>Q Ð]l$…{†V> ç³° ^ólÔ>. ¯ól¯]l$ çÜÆý‡µ…^Œl-V> ^ólíܯ]l AÀ-Ð]l–-¨®MìS 1980ÌZ ¯ésìæ VýSÐ]l-Æý‡²ÆŠ‡ MýS$Ð]l¬-§Šæ-»ô毌S-gZïÙ ^ól™èl$ÌS Ò$§ýl$-V> E™èl¢Ð]l$ {V>Ð]l$-ç³…-^éĶæ$¡ AÐéÆý‡$z A…§ýl$-MýS$¯é². ™öÍÝëÇ ÐéÆý‡$z çÜ¿¶æ$Å-yìl-V> ´ùsîæ ^ólíÜ-¯]l-糚yýl$ çÜÓíÜ¢MŠS VýS$Æý‡$¢Oò³ Kr$ ÐólĶæ*-ÌS° OòÜMìS-âýæÏOò³ †Æý‡$-VýS$™èl* {ç³^éÆý‡… ^ólõÜÐéâýæÏ…. -
ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు
పాల్వంచరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం స్టేజీ టూ ఎన్నికల అధికారులకు ఎన్నికల వ్యయం, మోడల్ఆఫ్ కండక్ట్పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చులను పరిశీలించాలని చెప్పారు. ప్రతి పైసాకు లెక్క రాయాలి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయాల జిల్లా నోడల్ అధికారి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యయంలో ఎన్నికల నియమావళిని పాటిస్తూనే ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు రాయాలని సూపచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, తహసీల్దార్ దారా ప్రసాద్, రూరల్ ఎస్ఐ.సురేశ్, శిక్షకులు రమేష్, పార్థసారథి పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలి
ములకలపల్లి: ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా నోడల్ అధికారి ఎ.శ్రీనివాసరావు సూచించారు. ములకలపల్లి రైతువేదికలో అభ్యర్థులకు సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు తప్పుడు లెక్కలు చూపినా, అసలు లెక్క చూపకున్నా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేయొద్దని సూచించారు. చేసే ప్రతీ ఖర్చుకు విధిగా రశీదులు తీసుకోవాలన్నారు. సదస్సులో సహాయ వ్యయ పరిశీలకురాలు పి.మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు తోడ్పాటు
● కేజీబీవీల్లో విద్యార్థినులకు పోటీ పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ● ఉమ్మడి జిల్లాలో ఆరు పాఠశాలలు ఎంపిక ● నెల రోజుల నుంచి కొనసాగుతున్న తరగతులుకరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థినులు పోటీ పరీక్షల్లో రాణించేలా, రాష్ట్ర, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 3,700 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, 4,300 మంది విద్యనభ్యసిస్తున్నారు. పెరగనున్న ఆదరణ మెరుగైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో శిక్షణ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
నేటితో తెర..
● ముగియనున్న ‘మొదటి దశ’ ప్రచారం ● చివరి సమయాన హోరెత్తిస్తున్న అభ్యర్థులుఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని రెండేళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూసిన ఆశావాహులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా మొదటి దశలో ఏడు మండలాలు ఉన్నాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈనెల 3న ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. ప్రచార హోరు తొలి విడతకు సంబంధించి ఏడు మండలాల్లోని 192 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 20 మంచాయతీలు, 172 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 172 గ్రామపంచాయతీలు, 1,582వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో ప్రచారం మోత మోగుతోంది. అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రతీ ఇంటికి ఒకటికి రెండు సార్లు వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, స్టిక్కర్లు, మైక్ల ద్వారా ప్రచారం ఉధృతం చేశారు. ప్రచారంలో అగ్ర నాయకులు తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల తరఫున అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున రఘునాథపాలెం మండలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారు. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ తదితరులు పాల్గొంటున్నారు.మొదటి దశగా గ్రామాల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగించాలి. దీంతో ఆదివారం నుంచి అభ్యర్థులు, వారి మద్దతుదారులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మంగళవారం సాయంత్రంతో గడువు ముగిశాక చేపట్టాల్సిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముందు ఇచ్చే హామీలు, చేసే ప్రచారం, ఓటర్లను మచ్చిక చేసుకునే అంశంపైనే గెలుపోటములు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. -
కలెక్టరేట్లో దివ్యాంగుల దినోత్సవం
సూపర్బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనీనా, మెప్మా పీడీ రాజేష్ తదితరులు దివ్యాంగ సంఘాల అధ్యక్షులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులందరూ యూడీఐడీ కార్డులు పొందాలని సూచించారు. డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి పొదుపు చేసి రుణాలు పొందవచ్చని తెలిపారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ప్రత్యేక అవసరం కలిగిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా మాట్లాడుతూ దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తుందని తెలిపారు. అనంతరం వికాసం ప్రత్యేక పాఠశాల బధిర విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. దివ్యాంగులకు సేవలందిస్తున్న 120 మందిని మెమెంటో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది, ఐఈడీ కోఆర్డినేటర్ సైదులు, బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, బధిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు సతీష్, మదర్ థెరిసా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, వీహెచ్పీఎస్ సంఘం అధ్యక్షుడు సుధాకర్, అక్షయ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు షమీం, ఎన్పీఆర్డీ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గుదాస్, బి.లక్ష్మణ్, ఎండి ముజాహిద్ పాల్గొన్నారు. -
రామనామంతో మార్మోగిన భద్రగిరి
భద్రాచలం : భద్రగిరి మాఢ వీదులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం విరమించారు. ఆలయ ఈఓ కె.దామోదర్రావు దంపతులు శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించగా.. మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఆ తర్వాత సేవాకాలం, ప్రవచనం, తీర్ధ గోష్టి గావించారు. సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం చేశారు. ముత్తంగి అలంకరణలో దర్శనం.. శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.వైభవంగా పునర్వసు దీక్ష విరమణ -
ఓటుకు నోటొద్దంటూ..
భద్రాచలం: విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, పైసాకు అమ్ముడుపోతే ఐదేళ్లు బానిస కావాలని, అభివృద్ధే ప్రధానంగా సర్పంచ్కు ఎన్నుకోండంటూ ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో ఆదివాసీ పూనెం ప్రదీప్కుమార్ సర్పంచ్ బరిలో నిలిచాడు. మిగతా అభ్యర్థులకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాడు. కళాశాలలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లతో గ్రూపు మీటింగ్లు నిర్వహిస్తున్నాడు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశానని, ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. తాను గెలిస్తే భద్రాచలం అభివృద్ధికి నిస్వార్థంగా పాటుపడతానని చెబుతున్నాడు. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం -
పల్లె నుంచే ప్రథమం
ఇల్లెందు: ‘ఆనాడు గ్రామపంచాయతీ సర్పంచ్గా బరిలోకి దిగిన నా నామినేషన్ ఫీజు పార్టీ చెల్లించగా.. ఇతరత్రా పైసా ఖర్చు పెట్టకుండా గెలిచాను’ అని గుమ్మడి నర్సయ్య వెల్లడించారు. ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన సర్పంచ్గా తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇల్లెందు తాలూకాలోని టేకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా 1981 ఎన్నికల్లో పోటీ చేశా. అప్పటి ప్రజాపంథా తరఫున బరిలోకి దిగగా, నామినేషన్ ఫీజు కూడా పార్టీయే చెల్లించింది. ఆ ఎన్నికల్లో నాతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉసిరికాయలపల్లి ఏరియా ఓట్లు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు పోల్ కాగా టేకులగూడెం ఏరియా ఓట్లు నాకు రావడంతో 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందా. రెండేళ్ల పాటు టేకులగూడెం గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసా విడుదల కాలేదు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున ఇంటి పన్నులు వసూలు చేయొద్దని ఆనాడు పార్టీలు పిలుపునివ్వడంతో రాబడి నిలిచిపోయింది. దీంతో పంచాయతీ సభలు, సమావేశాలకే పరిమితం కావాల్సి వచ్చేది. సర్పంచ్గా రెండేళ్లు పూర్తి కాకముందే 1983లో పార్టీ నన్ను ఎమ్మెల్యేగా పోటీలో నిలిపింది. నేను సర్పంచ్గా బరిలో ఉన్నప్పుడు ఇంటింటి ప్రచారం మినహా కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు, మైకుల హోరు లేదు. కానీ ఇప్పుడు రూ.లక్షలు ఖర్చు చేస్తే తప్ప సర్పంచ్గా ఎన్నికయ్యే అవకాశం దక్కడం లేదు. అంతేకాక ఆనాటి పెద్ద పంచాయతీలు ఇప్పుడు పదికి పైగా విడిపోయాయి.సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ఆరంభం -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
● పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు సెలవు పెట్టొద్దు ● అధికారులకు కలెక్టర్ ఆదేశం చండ్రుగొండ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్టేజ్ – 2 ఆర్ఓలకు సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశించారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. తొలుత మండలంలోని మద్దుకూరులో రైతు తలారి రవి చేపట్టిన మేకలు, కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, పశువైద్యాధికారి సంతోష్ పాల్గొన్నారు. ఐటీసీ ప్లాంట్లో పరిశీలన..బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ శైలేందర్ కుమార్ సింగ్, అధికారులు రాంబాబు, పి.శ్యామ్కిరణ్, చెంగల్ రావు తదితరులు ప్లాంట్ కార్యకలాపాల గురించి కలెక్టర్కు వివరించారు. ప్లాంట్లో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, ఉత్పత్తిలో పాటిస్తున్న నాణ్యత తదితర అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్ వారితో చర్చించారు. పేపర్ బోర్డు తయారీలో ఉపయోగిస్తున్న ఆధునిక యంత్రాలు, ఆటోమేషన్ టెక్నాలజీ, పర్యావరణ హిత తయారీ విధానాలను పరిశీలించిన కలెక్టర్ వారికి తగు సూచనలు చేశారు. -
● ‘ఆయిల్పామ్’ ఆవేదన!
ఆదాయం వస్తుందని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రచారం చేస్తుండటంతో నాలుగైదేళ్లుగా పలువురు రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా, తోట ఏపుగా పెరిగినా పూత, కాత రావడంలేదు. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ కూడా ఆయిల్పామ్ వేసి ఆందోళన చెందుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఐదున్నర ఎకరాల్లో తోట సాగు చేశాడు. కాత లేక పోవడంతో దిక్కుతోచనిస్థితిలో రెండు రోజులుగా ఆయిల్పామ్ చెట్లను తొలగిస్తున్నాడు. చెట్లను జేసీబీతో తొలగించేందుకు మట్టలు అడ్డురావడంతో కూలీలతో నరికిస్తున్నాడు. చిత్రంలో కనిపిస్తున్న ఆయిల్పామ్ మోడు రైతు ఆవేదనకు అద్దం పడుతోంది. –అశ్వారావుపేటరూరల్ -
నేడు తెలగాణ తల్లి విగ్రహావిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): స్థానిక ఐడీఓసీలో మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికా రులు, అనధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకంఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మైక్రో అబ్జర్వర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పోలింగ్కు ముందురోజే పరిశీలకులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రతి దశలోనూ నిశితంగా పర్యవేక్షిస్తూ, ఎన్నికల నియమావళి అమలుతీరును అంచనా వేసి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సాయికృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి ఉత్తమ అవార్డుదుమ్ముగూడెం : దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో నాన్ భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న దుమ్ముగూడెం మండల ఐఈఆర్పీ సతీష్కు జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్ అవార్డు దక్కింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆయన సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు తాను అందిస్తున్న సేవలకు గాను ఉత్తమ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. ‘ఐఈఎల్టీఎస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన ఐఈఎల్టీఎస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు, స్కాలర్షిప్ పొందేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్హులైన వారు టీజీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ www. tgbcstudycircle. cgg. gov. in ద్వారా ఈ నెల 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08742–227427, 94419 31359, 96521 61850, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. -
తాటి.. పెద్దకాపు చెబితే ఓట్లు
అశ్వారావుపేట: ఉమ్మడి రాష్ట్రంలోని పూర్వ ఖమ్మం జిల్లా, ప్రస్తుతం ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉన్న వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము 1981లో గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఆ గ్రామ తొలి సర్పంచ్గా సీపీఐ నుంచి ఎన్నికై న తాటి వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత టీడీపీలో చేరి బూర్గంపాడు, అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు.. 1981లో తాట్కూరుగొమ్ము గ్రామపంచాయతీ ఏర్పడగా సీపీఐ నుంచి సర్పంచ్గా పోటీ చేశా. అప్పట్లో పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు సైకిల్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కాలినడకే ఎంచుకునేవాళ్లం. ఒక గ్రామానికి వెళ్లగానే గ్రామ పెదకాపు(గ్రామపెద్ద) గ్రామస్తులందరినీ పిలిపిస్తే ఎవరి మంచం వాళ్లు తెచ్చుకుని కూర్చునేవాళ్లు. అంతా కలిసి ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని పెదకాపు తీర్మానిస్తే అంతా సరేననే వారు. అప్పట్లో కరపత్రాల కోసం ఓ మనిషి రాజమండ్రి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించి మరుసటి రోజు వచ్చేవారు. ఎర్రబట్ట కొని జెండాలు కుట్టించుకుని ప్రచారానికి వెళ్లేవాళ్లం. ప్రచారంలో పాల్గొనే వారు ఇంట్లోనే అన్నం తిని వచ్చేవాళ్లు. అందుకే ఖర్చు పెద్దగా కాలేదు. పంచాయతీ పరిధిలోని పొగాకు బ్యారన్ల నుంచి రూ.2వేల పన్ను మాత్రమే ఆదాయం ఉండగా, నా గౌరవ వేతనం రూ.200, గుమస్తా జీతం పోను మిగిలిన డబ్బుతో పనులు చేపట్టేవాళ్లం. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పువ్వాడ నాగేశ్వరరావుకు ఓటు వేశాం. బూర్గంపాడు సమితి ఎన్నికల్లో కూడా ఓటు వేశా. -
గొర్రెల చోరీకి యత్నం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లి డైట్ కళాశాల సమీపాన సోమవారం గొర్రెల దొంగతనానికి కొందరు యత్నంచారు. డొంకరోడ్డు ప్రాంతంలో పొలాల వద్దకు యరదేశి మల్లయ్య, వెంకటేశ్వర్లు తమ గొర్రెలను మేతకు తీసుకెళ్లగా ఆటోలో వచ్చిన ఐదుగురు జీవాలను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు తెలిసింది. అప్రమత్తమైన కాపరులు తమ గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి నిందితులను పట్టుకుని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ చేపడుతున్నామని సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు. -
పిట్లైన్పై పట్టింపేది ?
● టెర్మినల్ స్టేషన్గా భద్రాద్రి కొత్తగూడెం ● జిల్లా మీదుగా మూడు కొత్త లైన్లు ● భద్రాచలంరోడ్లో రైలు నిర్వహణ సౌకర్యం ● నానాటికీ పెరుగుతున్న పిట్లైన్ అవసరంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతంలో నడిచిన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త రైళ్లు నడిపించేందుకు వీలుగా భద్రాచలం రోడ్లో ‘రేక్’ నిర్వహణ కోసం ఆధునిక పిట్లైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైలు నిర్వహణ సౌకర్యాలు మెరుగుపడితే దాని తాలూకూ ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త రైళ్ల కొరత.. తెలంగాణ నుంచి తిరుపతి, షిర్డీ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తున్న భక్తుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి తిరుపతికి రైలు కావాలనే డిమాండ్ అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు గతంలో అనేక సార్లు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్, ఖమ్మం నుంచి రోజుకు మూడు రైళ్లు తిరుపతికి ఉన్నందున భద్రాచలంరోడ్ నుంచి కొత్త రైలు అవసరం లేదని, మంచిర్యాల స్టేషన్లో రైలు నిర్వహణకు సరిపడా మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి నుంచి తిరుపతికి రైలు నడిపించలేమని రైల్వే బోర్డు నుంచి సమాధానాలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి రైల్వే పరంగా సికింద్రాబాద్, ఆ తర్వాత కొద్దో గొప్పో కాజీపేట మినహా మరే స్టేషన్ కూడా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. మౌలిక సదుపాయాలేవి..? సాధారణంగా ఒక రైలుకు ఉపయోగించే బోగీలన్నింటిని కలిపి రేక్ అంటారు. ఈ రేక్లో ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై నాలుగు వరకు బోగీలు ఉంటాయి. సాధారణంగా ఈ బోగీలు మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఒకసారి సాధారణ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అవి తిరిగి ప్రయాణానికి అనువుగా ఉంటాయి. గతంలో సింగరేణి రైలు మెయింటెనెన్స్ భద్రాచలంరోడ్ స్టేషన్లో ఉండేది. ఇందు కోసం స్టేషన్ ఆవరణలో 14 బోగీల సామర్థ్యం కలిగిన పిట్లైన్ కూడా నిర్మించారు. కాలక్రమేనా సింగరేణి రైలు నిర్వహణ భారం కాజీపేటకు తరలిపోయింది. అప్పటి నుంచి రైలు రేక్ల మెయింటెనెన్స్ విషయంలో భద్రాచలం రోడ్ స్టేషన్కు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో కాజీపేట – మణుగూరు ప్యాసింజర్, బెళగావి ఎక్స్ప్రెస్లు నడిపించడం లేదని రైల్వేశాఖ పైకి చెబుతున్నా, ఆయా రైళ్ల నిర్వహణకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ లేకపోవడమే అసలు కారణం. భద్రాచలం రోడ్ కీలకం మణుగూరు – రామగుండం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.4వేల కోట్లతో రైల్వే శాఖ డీపీఆర్ సిద్ధం చేసింది. దీని నిర్మాణం పూర్తయితే బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గానికి మరో ప్రత్యామ్నాయ లైన్ అందుబాటులోకి వస్తుంది. భద్రాచలం – మల్కన్గిరి (ఒడిశా) కొత్త లైన్ను కేంద్రం 2024 ఆగస్టులో మంజూరు చేసింది. ఈ మార్గంలో 173 కిలోమీటర్ల మేరకు కొత్త లైన్ నిర్మించనున్నారు. ఇక కొత్తగూడెం – కిరోండల్ మధ్య దూరం 180 కిలోమీటర్లుగా ఉంది. ఈ లైన్ నిర్మాణానికి ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. ఇవి కాకుండా డోర్నకల్ – భద్రాచలం రోడ్ – మణుగూరు లైన్ ప్రస్తుతం సింగిల్ నుంచి డబ్లింగ్గా అప్గ్రేడ్ అవుతోంది. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి మార్గం కూడా ప్రారంభం కాగా, దీన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇందులో సగం ప్రాజెక్టులు మొదలైనా.. దక్షిణ మధ్య రైల్వేలో భద్రాచలంరోడ్ స్టేషన్ కీలకంగా మారుతుంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్ల నిర్వహణ కోసం భద్రాచలంరోడ్లో 24 బోగీల సామర్థ్యంతో కొత్త పిట్లైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
మద్యం రవాణాను అరికట్టాలి
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి)/చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండల పరిఽధిలోని పెంట్లం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు చురుగ్గా పని చేయాలని సూచించారు. ప్రతీ తనిఖీ విధిగా రికార్డులో నమోదు చేయాలని అన్నారు. అనంతరం చండ్రుగొండ రైతువేదికలో సర్పంచ్, వార్డు అభ్యర్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని సూచించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించిన దర్బార్లో అర్జీలు మాత్రమే స్వీకరించినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు ప్రత్యేక రిజిస్టర్తోపాటు ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల నియమావళి ముగిశాక సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణజూలూరుపాడు: భద్రాచలం ఐటీసీ, ప్రతం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్గంపాడులో పురుషులకు ఎలక్ట్రికల్, సోలార్ రంగంలో శిక్షణ, భద్రాచలంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత భోజన వసతి కూడా ఉంటుందని, 18–35 ఏళ్ల వయస్సు కలిగిన 8, 9, 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వలంటీర్ల ఎంపికకు దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): యూత్ వలంటీర్ల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లాలోని యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. ఏడాది సమాజసేవ నిమిత్తం 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18–29 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, చదువుతున్న వారు, ఉద్యోగులు అనర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ చెల్లించనున్నందున యువజన సంఘాల స్థాపన, క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కలిగిన వారు https:// nyks.nic.in/ NationalCrops/nyc.html ద్వారా మండలాన్ని ఎంచుకుని ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08742–296777 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్లోని కృత్రిమ బీచ్లో సోమవారం జరిగాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, రెండు, మూడో స్థానాల్లో మెదక్, నిజామాబాద్ జట్లు నిలిచాయి. ఇక బాలికల విభాగంలో ప్రథమస్థానం నిజామాబాద్ జట్టు సాధించింది. ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. విజేతల జట్లకు పోటీల రాష్ట్ర పరిశీలకులు మధు అందజేయగా, వాలీబాల్ అసోసియేషన్జిల్లాకార్యదర్శి బి.గోవిందా రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు డి.సైదులు, ఆదర్శ్కుమార్, నాగూల్మీరా, చిన్ని, అంజయ్య పాల్గొన్నారు. ‘కంపా’ నిధులెన్ని కేటాయించారు? ఖమ్మంమయూరిసెంటర్: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధులను ఎంత మేర కేటాయించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన సోమవారం లోక్సభలో అడిగారు. దీంతో ‘కంపా’ నిధుల్లో భాగంగా తెలంగాణకు ఇప్పటివరకు రూ.3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. -
ఏడు నెలలుగా ఇక్కట్లే..
● వేతనాలు అందక 104 ఉద్యోగుల అవస్థలు ● సేవలు రద్దు చేసి ఇతర విభాగాల్లో వినియోగం ● ఉమ్మడి జిల్లాలో 143 మంది సిబ్బంది ఆవేదనచాలా కాలంగా సకాలంలో జీతాలు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ఉద్యోగులకు కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పు చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఏడు నెలలుగా, భద్రాద్రి జిల్లా వారికి ఎనమిది నెలలుగా వేతనాలు రావాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ చూపి వెంటనే జీతాలు చెల్లించేలా చూడాలి. – మన్మథరావు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షడు ఖమ్మంవైద్యవిభాగం: గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించిన 104 వ్యవస్థకు గత ప్రభుత్వం మంగళం పలికింది. దీంతో వాహనాల్లో పనిచేసిన ఉద్యోగులను పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. వారి సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. వేతనాల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో వెలుగొంది.. క్రమంగా కనుమరుగై.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశారు. ముఖ్యంగా వైద్యం అందక నిరుపేదలు పడుతున్న కష్టాలను గమనించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన వెంటనే 104 వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ గ్రామానికి వాహనం వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఆయన ఉన్నంత కాలం గ్రామాల్లో 104 ద్వారా రోగులకు వైద్య సేవలతో పాటు మందులు కూడా సక్రమంగా అందేవి. ఆ తర్వాత 104 సేవలకు క్రమంగా గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం ఈ సేవలను పూర్తిగా రద్దు చేసి, వాహనాలను వేలం ద్వారా విక్రయించింది. దీంతో 104 సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. ఏడు నెలలుగా ఏడుపే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 143 మంది ఉద్యోగులు వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 85 మంది పనిచేస్తుండగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు కలిపి 43 మంది డీఎంఈ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 42 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. వీరందరికీ గత ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. భద్రాద్రి జిల్లాలో 58 మంది పనిచేస్తుండగా వారికి 8 నెలలు జీతాలు రావాల్సి ఉంది. వీరిలో 35 మంది డీఎంఈ పరిధిలో, 23 మంది వైద్యారోగ్య శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 23 వాహనాల ద్వారా నిరాటంకంగా లక్షలాది మందికి సేవలందించిన 104 సిబ్బంది.. ఆ వాహనాలను తొలగించిన తర్వాత దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. -
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
అశ్వారావుపేటరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో విషాదం చోటుచేసుకుంది. సమావేశం జరుగుతుండగానే గుండెపోటుకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కట్టా మధు(45) హఠాన్మరణం చెందారు. అశ్వారావుపేటకు చెందిన మధు మండలంలోని దురదపాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన యూటీఎఫ్ సమావేశం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన తర్వాత కూప్పకూలి కిందపడిపోయారు. తోటి ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అతిపెద్దది.. అతి చిన్నది
భద్రాచలం పంచాయతీలో అత్యధికంగా 40,761 మంది ఓటర్లు అడవి రామారంలో అత్యల్పంగా 85 మంది మాత్రమే.. ఉమ్మడి జిల్లాలో 88 ఓట్లతో రెండో చిన్న పంచాయతీగా దొంగతోగు చుంచుపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి పెద్ద గ్రామపంచాయతీగా నిలిచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం ఇక్కడే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో 40,761 మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వుడ్ చేశారు. 20 వార్డుల్లో 5 స్థానాలు ఎస్టీ జనరల్, 5 స్థానాలు ఎస్టీ మహిళ, మరో 5 స్థానాలు జనరల్కు, 5 స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్ స్థానానికి ఐదుగురు, వార్డులకు 75 మంది బరిలో నిలిచారు. భద్రాచలం పంచాయతీతోపాటు మండల కేంద్రంగా కూడా కొనసాగుతోంది. 1982లో తొలిసారి ఎన్నికలు.. తొలిసారి 1982లో భద్రాచలం మేజర్ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 1987లో న్యాయపరమైన అడ్డంకులతో ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత 2001లో పట్టణంగా ప్రకటించి ఈఓ పాలన తీసుకొచ్చారు. 2005లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా, అది కూడా న్యాయపరమైన చిక్కులతో రద్దయింది. మళ్లీ 2013లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2018 మళ్లీ మున్సిపాలిటీగా మార్చే ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో 2019లో ఎన్నికలు జరగలేదు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని ఒకే పంచాయతీగా కొనసాగించడంతోపాటు 14 ఎంపీటీసీ స్థానాలతో తిరిగి మండల కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఆళ్లపల్లి మండలంలోని అడవి రామారం ఉమ్మడి జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. ఇక్కడ 107 మంది మాత్రమే జనాభా ఉంది. కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించగా, నాలుగు వార్డుల్లో నాలుగు ఎస్టీలకే ఖరారు చేశారు. గ్రామ పంచాయతీకి తుది విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. అడవి రామారం పినపాక నియోజకవర్గంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామారాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక గతంలో దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచాయతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి విడిపోయి 2018లో కొత్తగా ఏర్పాటైంది. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు. -
క్రీడలతో స్నేహ సంబంధాలు
కలెక్టర్ జితేష్ వి.పాటిల్అశ్వాపురం: క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతమవుతాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో హెవీవాటర్ ప్లాంట్ హోమిబాబా క్రీడామైదానంలో జరుగుతున్న అండర్–14 బాలుర రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో విజేతగా రంగారెడ్డి, రన్నరప్గా హైదరాబాద్ జట్లు నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై బహముతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రెండో విడత బరిలో 3,206 మంది ..
చుంచుపల్లి: రెండో విడత ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల్లోని 155 గ్రామ పంచాయతీలు 1,384 వార్డులకు శనివారంతో ఉపసంహరణ గడువు ముగియగా, బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలింది. 154 గ్రామ పంచాయతీల్లో 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించలేదు. మిగిలిన 138 గ్రామ పంచాయతీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,384 వార్డులకు 248 వార్డులు ఏకగ్రీవం కాగా, 13 వార్డులకు అసలు నామినేషన్లు రాలేదు. మిగతా 1,123 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, 2,820 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం మీద మలి విడతలో 3,206 మంది అభ్యర్థులు పోరుకు సిద్ధమయ్యారు. గుర్తులు ప్రకటించటంతో ఆదివారం నుంచి అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. తమకే ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. మండలం పేరు సర్పంచ్ వార్డు అన్నపురెడ్డిపల్లి 24 182 అశ్వారావుపేట 66 459 చండ్రుగొండ 33 237 చుంచుపల్లి 52 420 దమ్మపేట 76 556 ములకలపల్లి 69 402 పాల్వంచ 66 564 -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 442 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్లైఫ్ శాఖకు రూ.23,625 ఆదాయం లభించింది. 250 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,170 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 17 మంది హెడ్కానిస్టేబుళ్లకు పదోన్నతిఖమ్మంక్రైం : ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 17 మంది హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ భద్రాద్రి జోన్ డీఐజీ సన్ ప్రీత్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఏడుగురు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాగా, 10 మంది భద్రాద్రి జిల్లా వారు ఉన్నారు. -
అమాత్యులారా మీరైనా..
భద్రాచలం: భద్రాచలం వారధులు భక్తులకు ఇంకా గుంతలతోనే స్వాగతం పలుకుతున్నాయి. పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన మట్టి, రాత్రివేళల్లో చిమ్మచీకటి, ఫ్లోరింగ్ సమానంగా లేకపోవడంతో ఎగుడుదిగులు వంటి సవాలక్ష సమస్యలతో బ్రిడ్జిలు రోదిస్తున్నాయి. మెయింటినెన్స్ చేయాల్సి ఉన్న జాతీయ రహదారుల శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతుండగా.. కనీసం ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిదులు సైతం అలసత్వం వహిస్తున్నారు. దీనిపై కథనాలు ప్రచురించినా నిమ్మకు నీరెత్తితున్నట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే ముక్కోటి నాటికై నా బ్రిడ్జిలకు మరమ్మతులు నిర్వహించాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. నిర్లక్ష్యానికి ప్రతీక.. ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్న గోదావరిపై రెండు బ్రిడ్జిలు భక్తులకు వారధిగా పని చేస్తున్నాయి. ఇందులో మొదటి బ్రిడ్జి నలభై ఏళ్ల క్రితం నిర్మించగా.. రెండోది గతేడాది శ్రీరామనవమి నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. అయితే బ్రిడ్జిల నిర్వహణ సక్రమంగా లేక రెండు బ్రిడ్జిలు భక్తులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ● మొదటి బ్రిడ్జిపై ఎంతో కాలంగా పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో పాటు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్రిడ్జిల నిర్వహణ నిత్యం చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. మట్టిని తొలగించక మట్టిదిబ్బెలా దర్శనమిస్తున్నాయి. ● ఇక రెండో బ్రిడ్జిని హడావుడిగా ప్రారంభించటం వలన రెయిలింగ్ను ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జిపై ఫ్లోరింగ్ సమాంతరంగా లేకపోవడంతో ప్రయాణం కుదుపులతోనే సాగుతుంది. దీనిపై ప్రధానంగా నేటి వరకు లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో చిమ్మచీకట్లో రాకపోకలు సాగుతున్నాయి. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జిల నిర్వహణను చేపట్టాల్సిన జాతీయ రహదారుల శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటోనని మండిపడుతున్నారు. మోక్షమెన్నడో..? భద్రాచలంలో ఈ నెల 20 నుంచి జనవరి 12 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగున్నాయి. 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కనీసం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికై నా బ్రిడ్జిలపై ఉన్న సమస్యలను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ముక్కోటికి జరిగే సన్నాహక సమావేశాల్లో దీనిని ప్రధాన అజెండాగా చేర్చి గుంతలను పూడ్చాలని భక్తులు కోరుతున్నారు. ఈ వైఫల్యం నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనంగా స్థానికులు భావిస్తున్నారు. ముక్కోటి నాటికై నా మోక్షం కలిగినా..? స్థానికులు, ప్రయాణికులు, భక్తులు ఈ బ్రిడ్జిలపై పడుతున్న కష్టాలపై గత నెల 27వ తేదీన ‘వారధికి మరమ్మతులేవి’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్థానికంగా చర్చకు దారి తీసింది. దిశగా మార్గనిర్దేశం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బ్రిడ్జి గుంతలకు మరమ్మతులు, లైటింగ్, పారిశుద్ధ్య పనులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘స్మార్ట్’గా ప్రచారం
వాతావరణ ం జిల్లాలో సోమవారం మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలంఅర్బన్: మొదటి, రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా వాల్, డోర్ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా ఎక్కువగా సోషల్మీడియా ద్వారానే ప్రచారం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోనే ప్రచార ఆయుధంగా మారిపోయింది. పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులపై పాటలు, గ్రామానికి గతంలో చేసిన సేవలు, ఇచ్చే హామీలను వివరిస్తూ ఆడియో, వీడియో పోస్టులు పెడుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు, మైకులతో ప్రచారానికి అనుమతులు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో పెద్దగా అనుమతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు పోస్టులతో గ్రూపులను పోటెత్తిస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా ఒకవైపు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే, ఇతరులను నిందించే, అసభ్యకరంగా ఉండే పోస్టులు పెడితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు -
యాసంగిలో 6,250 ఎకరాలకే సాగునీరు
పాల్వంచరూరల్: జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 41,900 ఎకరాల ఆయకట్టు ఉండగా, యాసంగిలో 6,250 ఎకరాలకే సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ సీఈ సుధీర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. మధ్యతరహా జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం 9.527 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.349 టీఎంసీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సరిపడా నీళ్లు లేనందున ఆయకట్టుకు 0.75 టీఎంసీల సాగు నీరు అందిస్తామని తెలిపారు. కిన్నెరసాని జలాశయం కింద ఆయకట్టు 10 వేల ఎకరాలు ఉండగా, 0.1 టీఎంసీల నీటిని వెయ్యి ఎకరాలకు అందిస్తామని, తాలిపేరు ప్రాజెక్టు కింద 24,700 ఎకరాల ఆయకట్టు ఉండగా 4వేల ఎకరాలకు 0.40 టీఎంసీల నీటిని, బయ్యారం పెద్దచెరువు కింద 7,200 ఎకరాల ఆయకట్టు ఉండగా, 1,250 ఎకరాల ఆయకట్టుకు 0.25 టీఎంసీల సాగునీరు అందిస్తామని వివరించారు. పెద్దవాగు ప్రాజెక్టులో నీళ్లు లేనందున అక్కడి ఆయకట్టుకు నీరు అందించలేమని సీఈ తెలిపారు. కాగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.మధ్యతరహా ప్రాజెక్ట్ల కింద ఆయకట్టుకు కటకట -
టెట్ నుంచి మినహాయించాలి
అశ్వారావుపేటరూరల్: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. ఆదివారం అశ్వారావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ విస్తృత కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ అర్హత ఉంటేనే సర్వీసులో కొనసాగుతారని కోర్టు తీర్పు చెబుతుండగా, రాష్ట్రంలో 45వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని అన్నారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చి రెండు నెలల దాటినా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని సంఘాలను కలుపుకోని ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 10న దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తొలుత పట్టణంలో డప్పు, కోలా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి రాజు, ఎం వెంకటేశ్వర్లు, మడివి కృష్ణారావు, ఆర్ రమేష్, హతీరాం, వరలక్ష్మి, రాజయ్య, పద్మారాణి, సత్యనారాయణ పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
ప్రతీ పేషంట్కు వైద్యం అందాలి
భద్రాచలంఅర్బన్: ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్క పేషంట్కు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మిృనాల్ శ్రేష్ఠ అన్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే పేషంట్లపై వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది వ్యవరిస్తున్న తీరుతో పాటు డ్యూటీ డాక్టర్ల విధులపై ఆరా తీసేందుకు ఆయనే స్వయంగా ఓ సామాన్యుడిగా వచ్చి ఓ స్టాఫ్ నర్సు వివరాలపై పలు మార్లు అడిగారు. ఆ సమయాన సదరు స్టాఫ్ నర్సు బదులిచ్చిన తీరును చూసి ఆమెను అభినందించారు. ఏజెన్సీ ప్రాంతం కావున గిరిజనుల ఎక్కువ శాతం వస్తున్నందున సంబంధిత వ్యాధిపై అవగాహన కల్పించాలని అన్నారు. భద్రాద్రి చిన్నారికి అవార్డు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని యమజాలనగర్ కాలనీకి చెందిన చిన్నారి శ్రీ యాన్వి భగవద్గీత శ్లోకాలను అలవోకగా చెప్పి ‘విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్’వర్సెస్ బ్లూమ్ అవార్డ్స్ను దక్కించుకుంది. హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. చిన్నారి తల్లి సత్య నాగలక్ష్మి గతంలో భగవద్గీత శ్లోకాలపై శృంగేరిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించగా.. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న నాలుగేళ్ల శ్రీ యాన్వి గత ఆరు నెలలుగా శ్లోకాలను నేర్చుకుంది. శ్రీయాన్వి భగవద్గీతలోని 50 శ్లోకాలను, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, బాల రామాయణంలోని కొన్ని శ్లోకాలను ఏకధాటిగా చెప్పే నైపుణ్యాన్ని గుర్తించిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్ సంస్థ చిన్నారికి అవార్డు బహూకరించింది. బైక్ను ఢీకొట్టిన వ్యాన్.. అశ్వారావుపేటరూరల్: కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ బైక్ వాహనాదారుడిని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా వ్యాన్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని కేశప్పగూడేనికి చెందిన పూసం జోగారావు శనివారం తన బైక్పై వడ్డెర రంగాపురం గ్రామంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మంపాడు దగ్గర ఎదురుగా వచ్చిన ఓ వ్యాన్ ఢీ కొట్టగా.. జోగారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై కొత్తగూడెం ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుమారుడు పూసం పోతురాజు ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా.. వ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ భూమి స్వాధీనం పాల్వంచరూరల్: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ఆదివారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధి బస్వాతారాకకాలనీ పంచాయతీ పరిధిలోని 61 సర్వే నంబర్లోని మూడెకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఇటీవల కబ్జా చేశారు. దీంతో తహసీల్దార్ దారా ప్రసాద్ ఆదేశాల మేరకు ఆదివారం హెచ్ కన్వేషన్ హాల్ మార్గంలో రోడ్డు కింద 16 ఫీట్ల ప్రభుత్వ భూమిని కబ్జా జరిగిందని సర్వేయర్ ద్వారా సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకుని హద్దులు నిర్దేశించినట్లు ఆర్ఐ నళనీకుమార్ తెలిపారు. ఇట్టి ప్రభుత్వ భూమిని గతంలో కంటి ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించబడిందన్నారు. -
అక్రమాలకు సహకార సంస్థ
పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అధికారులు, సిబ్బంది, డీలర్లు కలిసి సన్నబియ్యం కాజేద్దామని పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. రేషన్ బియ్యంతో వచ్చే లారీ పాల్వంచలోని ఎంఎల్ఎస్ పాయింట్కు రాకుండా మధ్యలోనే దారిమళ్లించారు. కానీ లారీ ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చి గోదాంలో బియ్యం అన్లోడ్ చేసినట్లు, అక్కడి నుంచి డీలర్లు తీసుకెళ్లినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. డీలర్లు కూడా బయోమెట్రిక్ నమోదు చేసి సంతకాలు పెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలతో వ్యవహారం వెలుగు చూడగా, నిందితులు కటకటాలపాలయ్యారు. జీసీసీలో గోల్మాల్? గిరిజన సహకార సంస్థలో తరచూ అవకతవకలు జరుగుతున్నాయి. పాల్వంచలోని జీసీసీ గోదాములో ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వహిస్తుండగా, ఇక్కడి నుంచి పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లోని రేషన్ షాపులకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే బియ్యం నిల్వల్లో గోల్మాల్ జరుగుతోంది. గోదాం ఇన్చార్జులే సూత్రదారులుగా మారి అవకతవకలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో గతంలో ముగ్గురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరి సస్పెన్షన్కు డీఎం ఉన్నతాధికారులకు శనివారం ప్రతిపాదనలు పంపారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చి.. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలోని జీసీసీ పర్యవేక్షణలో ఉన్న గోదాంను పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్గా కొనసాగిస్తోంది. ఈ నెల 2న మణుగూరులోని మల్లారం స్టాక్ పాయింట్ నుంచి సన్న రేషన్ బియ్యం లోడ్ ఇక్కడి ఎంఎల్ఎస్ పాయింట్కు బయల్దేరింది. బూర్గంపాడు మండలంలోకి ప్రవేశించాక బియ్యం లోడ్ను నకిరిపేట సమీపంలోని ఓ మిల్లు వద్ద ఉంచి, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చారు. ప్రతి నెలా 6 వేల క్వింటాళ్లు రవాణా జీసీసీ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఎంల్ఎస్ పాయింట్ గోదాం నుంచి ప్రతి నెలా మూడు మండలాల్లోని రేషన్ షాపులకు సమారు ఆరు వేల క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్నారు. 86 రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్నానరు. ఈ క్రమంలో జీసీసీ అధికారులు, సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలోనూ అవకతవకలు ఏడాది క్రితం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీసీసీ గోదాంలోని బియ్యం నిల్వలను తనిఖీ చేయగా, 395 క్వింటాళ్ల తేడా వచ్చింది. మధ్యాహ్న భోజనానికి సరఫరాచేసే బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోదాం ఇన్చార్జిగా ఉన్న మొగిలి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు. అంతకుముందు రూ.14 లక్షల ముష్టి గింజల అక్రమాల ఘటనలో అకౌంటెంట్, గోదాం ఇన్చార్జిగా సంజీవరావు, కల్తీ కృష్ణతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇలా అధికారులు, సిబ్బంది చేతివాటానికి పాల్పడుతూ జీసీసీకి కళంకం తెస్తున్నారు. జీసీసీ గోదాంల సముదాయంలో ఏర్పాటు చేసిన ఎంఎల్ఎస్ పాయింట్ను ఇక్కడ నుంచి తొలగించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను పలుమార్లు కోరాం. అయినా వారు తరలించడంలేదు. దీంతో మాకు చెడ్డపేరు వస్తోంది. –లక్ష్మణ్, జీసీసీ మేనేజర్బియ్యం కాజేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో జీసీసీ గోదాం ఇన్చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాంట్రాక్టర్, 8 మంది రేషన్ డీలర్లతో సహా మొత్తం 15 మందిపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్కు తరలించినవారిలో ఎన్.శ్రీనివాస్ (కాంట్రాక్టర్)తోపాటు ప్రశాంత్, సత్యావతి, కృష్ణకుమార్, అనిల్కుమార్, ఎన్.రాజయ్య, రమేష్ చంద్రరాఠి, కె.శ్రీనివాసరావు, కె.చంద్రం, కలీ, ఎ.లక్ష్మీదేవి, పి.శ్రీకాంత్, భద్రమ్మ, నరహరి, నాగరాజు ఉన్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. జీసీసీ గోదాం ఇన్చార్జి సత్యావతి, డేటా సెంటర్ ఆపరేటర్ కృష్ణకుమార్, హమాలీ నాగరాజు సహకారంతో స్టాక్ పాయింట్ నుంచి లారీ గోదాముకు వచ్చినట్లు నకిలీ ఎంట్రీలు చేశారు. డీలర్లు గోదాం నుంచి రేషన్ బియ్యం తీసుకున్నట్లు బయోమెట్రిక్ సంతకాలు చేశారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి లారీని పట్టుకున్నారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు. గోదాం ఇన్చార్జి, ఆపరేటర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని ఉన్నతాధికారులకు రిపోర్టు చేసినట్లు డీఎం సమ్మయ్య తెలిపారు. -
ఓట్లు పడాలంటే..
● ప్రభుత్వ పథకాల ఎర ● విందులు, వినోదాలు.. వైరా: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ.. ప్రభుత్వ పథకాలను ఆశగా చూపిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. వృద్ధాప్య, వితంతు ఫించన్లతో పాటుగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి రెండో పర్యాయం నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామాల్లో తమ హయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కొత్తగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ తమను సర్పంచ్గా గెలిపిస్తే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కారం చేస్తామని ఓట్లు అడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. మహిళ అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు సమస్యల పరిష్కారం తమతో సాధ్యం అవుతుందని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక విందులు పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ పార్టీలు ఇవ్వడం గ్రామాల్లో నిత్యం కనిపిస్తునే ఉంది. ప్రతిరోజూ మద్యంతో పాటుగా చికెన్ దుకాణాల్లో ఏరోజుకు ఆ రోజు కేజీల కొద్ది మాంసాన్ని పంపిణీ చేస్తుండడం విశేషం. ప్రచారం చివరి రోజుల్లో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓట్లు దండుకోవచ్చనే ఉద్దేశంతో అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ విజయమే పరమావధిగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. -
‘ఐదేళ్ల’ పామాయిల్ మొక్కలు నరికివేత
● పూత, కాత రాకపోవడంతో తొలగించిన బాధిత రైతు ● పరిశీలించిన ఆయిల్పామ్ గ్రోయర్స్ సొసైటీ నాయకులుఅశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన రైతు రామదేను దుర్గాప్రసాద్ తన ఐదున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న పామాయిల్ తోట ఐదేళ్లు దాటినా కనీసం పూత, కాత రాకపోవడంతో మొక్కలను తొలగించాడు. విషయం తెలుసుకున్న ఆయిల్పామ్ గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, చక్రధర్రెడ్డి, చెలికాని వెంకట్ బృందం ఆదివారం పామాయిల్ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. గతంలో సాగు చేసిన పామాయిల్ తోటలో ఎకరానికి 10 టన్నుల గెలల దిగుబడి రాగా, ఆ తోటను పరిశీలించిన నాటి ఆయిల్ఫెడ్ చైర్మన్, అధికారుల ప్రోత్సాహంతో మరో ఐదున్నర ఎకరాల్లో ఉన్న మామిడి తోటను తొలగించి 2019–2020లో ఆయిల్ఫెడ్ నర్సరీ నుంచి తెచ్చిన పామాయిల్ మొక్కలను సాగు చేశానన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్క టన్ను గెల కాదు కదా.. కనీసం పూత కూడా రాకపోవడంతో కాత, పూత లేని మొక్కలను పూర్తిగా నరికించినట్లు చెప్పాడు. కాగా, తోటను పరిశీలించేందుకు వచ్చిన రైతు సంఘం నాయకులు వచ్చినట్లు తెలుసుకొని తమ తోటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, వాటిని పరిశీలించాలని వినతి చేశారు. అనంతరం సంఘం బాధ్యులు మాట్లాడుతూ.. ఆయిల్ఫెడ్ నిర్లక్ష్యం, నాసిరకం మొక్కల కారణంగా బాధిత రైతుకు రూ.లక్షలాది రూపాయాలు నష్టపోయాడని, బాధిత రైతుతో పాటు ఇదే ప్రాంతంలో మరో 500 ఎకరాల్లో రైతులు తోటలు వేశారని, వారి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోందనని వేచి చూడాలని చెప్పారు. -
చర్యలు తీసుకోవాలి
మణుగూరు రూరల్: సమితిసింగారం గ్రామపంచాయతీ రాజీవ్గాంధీనగర్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుండి గౌరి ప్రచారం వాహనంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఽఅధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. ఆదివారం దాడిని ఖండిస్తూ అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే ప్రచార వాహనంపై, డ్రైవర్పై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహరావు, కుర్రి నాగేశ్వరరావు, కె.లక్ష్మణ్, ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, వేర్పుల సురేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
చికిత్స పొందుతున్న మరో విద్యార్థి మృతి
సత్తుపల్లిటౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన ఐదుగురు విద్యార్థులు కలిసి పెనుబల్లి వైపు నుంచి సత్తుపల్లికి కారులో వస్తుండగా కిష్టారం అంబేడ్కర్నగర్కాలనీ వద్ద జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు సిద్దేశి జాయ్, మర్సకట్ల శశిధర్, ఎస్కే సాజిద్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నపురెడ్డిపల్లికి చెందిన తలారి జయరాజు, శ్రావణి దంపతుల కుమారుడు అజయ్ (25) ఆదివారం మృతిచెందాడు. ఇతని తండ్రి జయరాజు అనారోగ్య కారణాలతో నాలుగేళ్ల క్రితం మరణించాడు. తల్లి శ్రావణి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మృతుడు డిగ్రీ పూర్తి చేయగా అతడికి దివ్యాంగురాలైన సోదరి ఉంది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ మహిళ..బూర్గంపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బూర్గంపాడు మండలం అంజనాపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అంజనాపురం గ్రామానికి చెందిన పింపి (48) శనివారం గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. సారపాక వైపునకు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన పింపిని స్థానికులు భద్రాచలం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీగా గంజాయి పట్టివేత ? భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఓ ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. మోతుగూడెం నుంచి మహారాష్ట్రకు రోడ్డు మార్గాన తరలించే ప్రయత్నంలో భాగంగా భద్రాచలం మీదుగా వెళ్తున్న ఈ గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, పట్టుబడిన గంజాయి దాదాపు 200 కేజీలకు పైగానే ఉంటుందని, ఈ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
ఖమ్మంలో ఉమ్మడి జిల్లా డ్రైవర్ల సంఘం సమావేశం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జహీంగీర్అలీ, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ఎండీ సలీం, జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు. ఖమ్మం జిల్లా సంఘానికి వాహనం కొనుగోలు చేసినందుకు సభ్యులు ఆమోదించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వేణుగోపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ రాఘవులు, నాగరాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలువురిపై కేసు నమోదు మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ వాహనంపై దాడి చేసిన ఘటనలో పలువురిపై కేసు నమోదైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేశ్, నరేశ్లతో పాటు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, పలువురు నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మొన్నటి వరకు జెడ్పీటీసీ.. నేడు వార్డు బరిలో
చండ్రుగొండ: మండలకేంద్రం చండ్రుగొండకు చెందిన తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి నేడు పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడి బరిలో నిలిచారు. 2019 మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం 2024 వరకు జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం వార్డు సభ్యుడిగా పోటీ చేయడం చర్చనీయంగా మారింది. గతంలో ఎంపీపీ.. నేడు సర్పంచ్ బరిలో ఉమ్మడి చండ్రుగొండ మండలం ఎంపీపీగా పనిచేసిన పోకలగూడెం గ్రామానికి చెందిన గుగులోతు బాబు నేడు పోకలగూడెం పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచారు. 2006 నుంచి 2011 వరకు ఎంపీపీగా ఆయన పనిచేయగా.. అంతకుముందు 2004 నుంచి 2006 వరకు బాబు సతీమణి గుగులోతు మీన ఎంపీపీగా పనిచేశారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తనిఖీసుజాతనగర్ : సుజాతనగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తేమ శాతం పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఆరబెట్టుకున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. రైతులకు అందిస్తున్న గోనె సంచులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, ఏఈఓ ప్రనూష పాల్గొన్నారు. భవన నిర్మాణాల్లో వేగం పెంచాలిములకలపల్లి : భవిత పాఠశాలల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కస్తూర్బా విద్యాలయం, రాజుపేట ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వివిధ తరగతుల విదార్థులతో మాట్లాడి, వారి సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో..ములకలపల్లి జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ సురేష్బాబు, జీపీ కార్యదర్శి రవి ఉన్నారు. క్రీడా సామగ్రి అందజేతభద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని వికాసం పాఠశాల బాల బాలికలకు క్రీడా సామగ్రి పంపిణీ చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వికాసం పాఠశాల పిల్లలతో పీఓ దంపతులు సరదాగా గడిపారు. అనంతరం సుమారు రూ.60 వేల విలువైన టేబుల్ టెన్నిస్ సెట్, చెస్, క్యారం బోర్డ్, టెన్నికాయిట్ ఆట వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణకుమారి, ప్రియాంక, కృష్ణవేణి, అరుణ పాల్గొన్నారు. -
స్నైపర్ గన్తో జింకల వేట
● ఆర్మ్స్, వైల్డ్లైఫ్ నేరాల కింద చార్జీషీట్ దాఖలు ● ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఖమ్మంవ్యవసాయం: సత్తుపల్లిలోని అర్బన్ పార్క్ల్లో వన్యప్రాణుల వేటకు సంబంధించి సమగ్ర విచారణ అనంతరం నిందితులను గుర్తించి రిమాండ్కు తరలించామని ఖమ్మం జిల్లా అటవీఅధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. ఖమ్మంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పార్కులోకి కొందరు తుపాకులతో వచ్చి ఐదు జింకలు వేటాడి చంపినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేయడమే కాక సత్తుపల్లి ఎఫ్డీఓ, ఎఫ్ఆర్ఓ ఆధ్వర్యాన విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలుత సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పార్క్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ, ఉదయం వాకింగ్కు వచ్చే శ్రీరాంప్రసాద్ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. స్నైపర్ గన్తో వేట విచారణ కొనసాగిస్తుండగా అశ్వారావుపేట నుంచి మెచ్చా రఘు కూడా వేటలో పాల్గొన్నట్లుగా తేలిందని డీఎఫ్ఓ చెప్పారు. ప్రొఫెషనల్ షూటర్ల వద్ద మాత్రమే ఉండే స్నైపర్ గన్తో రఘు రెండో గేట్ నుంచి రాగా, మెయిన్ గేట్ నుంచి వాహనంలో కుంజ భరత్ వచ్చినట్లు బయటపడిందన్నారు. దీంతో రఘు, వాహనం యజమాని భరత్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమే కాక పూర్తిస్థాయి విచారణ కోసం కొత్తగూడెం ఎస్పీ, డీఎఫ్ఓకు సమాచారం ఇచ్చినట్లు డీఎఫ్ఓ తెలిపారు. అలాగే, ఆర్మ్స్ యాక్ట్ కింద చార్జిషీటు దాఖలు కోసం ఖమ్మం ఎస్పీ సునీల్దత్కు సమాచారం ఇచ్చిన తాము వైల్డ్లైఫ్ నేరాల కింద చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మెచ్చా రఘు వద్ద 2021–22 నుంచి తుపాకులు ఉన్నాయని తెలిపారు. గత నెల 24న అర్బన్పార్కుకు రాగా, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే గన్ను పోలీసులకు సరెండర్ చేశాడన్నారు. ప్రస్తుతం గన్ పోలీసుల వద్దే ఉన్నందున వారు ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షల అనంతరం చార్జీషీట్ దాఖలు చేసే అవకాశముందని తెలిపారు. కాగా, ఖమ్మం అటవీ రేంజ్లోనూ తమిళనాడు వాసి తుపాకీ కలిగి ఉండగా అరెస్ట్ చేశామని డీఎఫ్ఓ వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు వీరభద్రరావు, రాధిక, స్నేహలత పాల్గొన్నారు. -
సమాజంలో మార్పు ఆశిస్తున్నా..
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా సాదాసీదా జీవితాన్ని గడపడమే కాక, తనకు వచ్చే జీతాన్ని సైతం పేదలకు సాయం చేసిన గొప్ప వ్యక్తి గుమ్మడి నర్సయ్య అని, ఆయన జీవిత చరిత్రతో తీస్తున్న సినిమాతో సమాజంలో కొంతైనా మార్పు రావాలని ఆశిస్తున్నానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై నల్లా సురేష్ రెడ్డి నిర్మిస్తున్న గుమ్మడి నర్సయ్య(ప్రజల మనిషి) సినిమా షూటింగ్ను శనివారం ఆయన పాల్వంచలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా ఇప్పటివరకు ఏ సినిమాకూ క్లాప్ కొట్టలేదని, షూటింగ్లకు వెళ్లలేద ని, నర్సయ్యపై ఉన్న అభిమానంతోనే పాల్వంచకు వచ్చానని తెలిపారు. నర్సయ్య జీవితాన్ని సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, తనతో పాటు రాష్ట్రంలో ఏ నాయకుడూ నర్సయ్యకు సాటిరారని చెప్పారు. షూటింగ్ కొంత ఆలస్యమైనా సరే కానీ పాన్ ఇండి యా స్థాయిలో తీయాలని సూచించారు. తన కుటుంబానికి ఎంతో సన్నిహితులైన సురేష్ రెడ్డి ఈ సినిమా తీయడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మొదట పాల్వంచ నుంచే ప్రారంభమైందని, గుమ్మడి నర్సయ్య వంటి జననేత తెలంగాణ వాసి కావడం గర్వంగా ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పునకు ఇలాంటి గొప్ప రాజకీయ నేత చరిత్ర అవసరం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఆదర్శం గుమ్మడి నర్సయ్య అన్నారు. హీరో శివరాజ్కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతీ రాజకీయ నాయకుడికి ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. నిర్మాత నల్లా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాల్వంచకు ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి నర్సయ్యతో పాటు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, సమాచార హక్కు కమిషనర్ పి.వి.శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, సినీ దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే, స్థానిక నేతలు నాగ సీతారాములు, వై.మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, ఎడవల్లి కృష్ణ, కోనేరు చిన్ని, ముక్తేవి గిరీష్, వజీర్, అనురాధ పాల్గొన్నారు. పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కోమటిరెడ్డి పాల్వంచరూరల్ : మండలంలోని శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శని వారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశాక అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట కన్నడ సినీ హీరో శివరాజ్కుమార్, ‘గుమ్మడి నర్సయ్య’ సిని మా నిర్మాత నల్లా సురేష్రెడ్డి ఉన్నారు.‘గుమ్మడి నర్సయ్య’ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి -
గద్దర్తో బాలసుబ్రహ్మణ్యంకు పోటీ అనవసరం
ఇల్లెందు: పీడిత ప్రజల కోసం తుది వరకు పోరాడిన గద్దర్ ఆశయ సాధనకు తాను నడుం బిగించానని ఆయన కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల తెలిపారు. ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు సందర్భంగా గద్దర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోందని చెప్పారు. కానీ గద్దర్ – బాలసుబ్రహ్మణ్యం మధ్య పోటీ అనవసరమని తెలిపారు. కాగా, గద్దర్ త్యాగాలు, జీవితాంతం ప్రజల కోసం పోరాడిన తీరు, ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా ఆయనపై ప్రజల్లో అభిమానం ఉండగా, తనకు సైతం ఆదరణ లభిస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలోని 524 మంది సభ్యులకు గతంలో ఆరు నెలలకోసారి వేతనాలు అందేవని.. తాను బాధ్యతలు తీసుకున్నాక సమస్య తీర్చానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందుతున్న ప్రజలు గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని వెన్నెల కోరారు. ఈ సమావేశంలో నాయకులు గోచికొండ శ్రీదేవి, మడుగు సాంబమూర్తి, గోచికొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల -
గాడిన పడని రైళ్లు !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్త లైన్ల సంగతి దేవుడెరుగు.. జిల్లాకు కనీసం కొత్త రైళ్ల మంజూరులోనూ ఆ శాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. చివరకు గతంలో నడిచిన రైళ్లను పునరుద్ధరించేందుకు సైతం మీనమేషాలు లెక్కిస్తోంది. బెళగావికి ఏడాది మణుగూరు నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని కొల్హాపూర్ వరకు 2017లో రైలు ప్రారంభించారు. సాయంత్రం వేళ బయలుదేరే ఈ రైలు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్, 11 గంటలకు లింగంపల్లికి చేరుకునేది. ఐటీ సెక్టార్లో పని చేస్తున్న వారికి ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉండేది. కానీ కరోనా కాలంలో ఈ రైలు రద్దయింది. అనంతరం 2023 జనవరిలో కొల్హాపూర్ రైలు స్థానంలో మణుగూరు – సికింద్రాబాద్ – బెళగావి రైలు ప్రారంభించారు. అయితే, ఈ రైలు నడిపించిన సమయంలో కాజీపేట – డోర్నకల్ – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు జరగడంతో రాకపోకలు కష్టంగా సాగాయి. దీంతో కొన్నాళ్లు మణుగూరు నుంచి, ఆ తర్వాత భద్రాచలం రోడ్ నుంచి నడవగా.. మూడో లైన్ పనుల పేరుతో రెండు నెలలు కాజీపేట వరకే పరిమితమైంది. ఇలా ఆగుతూ సాగుతూ నడిచిన బెళగావి రైలును రద్దు చేస్తున్నట్లు 2024 డిసెంబర్ 18న రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలును పునఃప్రారంభించాలని అటు కర్నాటక, ఇటు తెలంగాణకు చెందిన ప్రయాణికుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయాన్ని రైల్వే బోర్డుకు నివేదించారు. అయితే నేటికీ ఈ అంశంపై రైల్వే బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది. కుంటిసాకులే.. భద్రాచలం రోడ్ స్టేషన్ మీదుగా ప్రస్తుతం కాకతీయ, సింగరేణి ఎక్స్ప్రెస్ రైళ్లు, విజయవాడ ప్యాసింజర్ నడుస్తున్నాయి. వీటితో పాటు మణుగూరు నుంచి సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది. కరోనాకు ముందు ఈ మూడు రైళ్లతో పాటు భద్రాచలంరోడ్ – డోర్నకల్, మణుగూరు – కాజీపేట ప్యాసింజర్ రైలు కూడా నడిచేది. ఇందులో కాకతీయ రైలుతో సమానంగా ఆదరణ కలిగిన సర్వీసుగా మణుగూరు – కాజీపేట ప్యాసింజర్కు గుర్తింపు ఉండేది. ఉదయం మణుగూరులో బయలుదేరి మధ్యాహ్నం కాజీపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం అక్కడ బయలుదేరి రాత్రికి మణుగూరు చేరుకుంటుంది. ఈ ప్యాసింజర్కు ఉపయోగించే రేక్ (రైలు పెట్టెలు)నే కాకతీయ ప్యాసింజర్కు కూడా ఉపయోగించేవారు. అయితే కరోనా సమయంలో ఈ రైలు రద్దయింది. ఆ తర్వాత కాకతీయ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ మారిపోయింది. దీంతో మణుగూరు – కాజీపేట ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ డోలాయమానంలో పడింది. హామీ ఆ ఒక్క రైలుకే.. కరోనాకు ముందు డోర్నకల్ – భద్రాచలం రోడ్ మధ్య ఉదయం – సాయంత్రం వేళలో తిరిగే ప్యాసింజర్ రైలును పునఃప్రారంభిస్తామని రైల్వే శాఖ హామీ ఇస్తోంది. వాస్తవానికి మణుగూరు – కాజీపేట ప్యాసింజర్తో పోల్చితే ఈ రైలుకు ఆదరణ తక్కువ. కానీ, డోర్నకల్ ప్యాసింజర్పై ఉన్న శ్రద్ధ కాజీపేట ప్యాసింజర్పై చూపడం లేదు. మణుగూరు – కాజీపేట రైలుకు రేక్ షేరింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు మణుగూరు – కాజీపేట రైలును పెద్దపల్లి – కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు పొడిగించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతం కృష్ణా ఎక్స్ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. అది కూడా చుట్టూ తిరిగి వెళుతోంది. మణుగూరు నుంచి నిజామాబాద్ వరకు కొత్త రైలు అవసరమని ప్రయాణికులు అంటున్నారు. పశువులకు నిలయంగా.. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి మార్గంలో గూడ్సు రైళ్లు మొదలై రెండేళ్లు దాటినా ఇప్పటికీ ప్రయాణికుల రైలు పట్టాలెక్కలేదు. దీంతో ఈ మార్గంలో నిర్మించిన చండ్రుగొండ, భవన్నపాలెం వంటి స్టేషన్లు పశుపక్షాదులకు నిలయంగా మారుతుండడంతో పాటు చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. జిల్లా నుంచి తిరుపతి, షిర్డీలకు రైళ్లు నడిపించాలనే డిమాండ్ దశాబ్దాలుగా అమలుకు నోచడం లేదు.జిల్లాకు ఐదు అవసరం.. ఒక్కదానికే హామీ మణుగూరు – బెళగావి మణుగూరు – కాజీపేట భద్రాచలంరోడ్ – డోర్నకల్ భద్రాచలంరోడ్ – సత్తుపల్లి భద్రాచలంరోడ్ – తిరుపతి/షిర్డీ -
తుమ్మల స్వగ్రామంలో ఫలించని ఏకగ్రీవం
దమ్మపేట : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడికి సర్పంచ్, కాంగ్రెస్ మద్దతుదారుడికి ఉప సర్పంచ్ పదవులతో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి కూడా ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా పోటీ తప్పడం లేదు. 1800 మంది ఓటర్లున్న ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అంది. సర్పంచ్ స్థానానికి మొదట ఆరుగురు నామినేషన్లు దాఖలుచేయగా శనివారం నాటికి నలుగురు ఉపసంహరించుకున్నారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారుడు మెచ్చు ఈదప్ప, బీఆర్ఎస్ బలపర్చిన పండు సాంబశివరావు బరిలో ఉన్నారు. మొత్తం 10 వార్డులకు గాను 20 మంది నామినేషన్ దాఖలు చేయగా రెండో వార్డు ఏకగ్రీవం కావడంతో 9 వార్డులకు 18 మంది పోటీలో నిలిచారు. -
మలిదశలో 16 ఏకగ్రీవం
చుంచుపల్లి: రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు, వార్డుల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి నిమిషంలో బుజ్జగింపులు, బేరసారాలు జోరుగా సాగడంతో నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 155 గ్రామపంచాయతీలు, 1,384 వార్డులకు ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరగనుండగా ములకలపల్లి మండలం చాపరాలపల్లి పంచాయతీకి హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 16 గ్రామ పంచాయతీలతో పాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడతలో 14 జీపీలు, 336 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఆదివారం నుంచి ప్రచార బాట పట్టనున్నారు. మండలాల వారీగా వివరాలిలా.. ●చుంచుపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీ లకు గానూ విద్యానగర్ కాలనీ ఏకగ్రీవమైంది. మిగతా 17జీపీలకు 55మంది సర్పంచ్ అభ్యర్థులు బరి లో నిలిచారు. 168 వార్డులకు 9 ఏకగ్రీవం కాగా, 159 వార్డులకు 420మంది పోటీలో మిగిలారు. ●చుండ్రుగొండ మండలంలో 14 పంచాయతీల్లో మంగయ్యబంజర, బెండాలపాడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 134 వార్డులకు 26 ఏకగ్రీవం కాగా, మిగిలిన 108 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానాల బరిలో 33 మంది, వార్డులకు 237 మంది పోటీలో ఉన్నారు. ●అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీల్లో ఊటపల్లి, గుంపెన సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం ఆయ్యాయి. మిగిలిన 8 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 98 వార్డులకు 19 ఏకగ్రీవం కాగా, 79 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ●పాల్వంచ మండలంలో 36 పంచాయతీల్లో సంగం, తవిశలగూడెం, ఇల్లెందులపాడు తండా, బిక్కుతండా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 32 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. 282 వార్డులకు 62 ఏకగ్రీవం అయ్యాయి. 208 వార్డులకు బరిలో 491 మంది బరిలో ఉన్నారు. 12 వార్డులకు రిజరేషన్ అభ్యర్థులు లేక నామినేషన్లు దాఖలు కాలేదు. ●అశ్వారావుపేట మండలంలో 27కు గాను మద్ది కొండ, రామన్నగూడెం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 25 జీపీల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. 234 వార్డులకు 37 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 197 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ●దమ్మపేట మండలంలో మొద్దులగూడెం, తాటిసుబ్బన్నగూడెం, అల్లిపల్లి, పూసుకుంట గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, 27 జీపీల్లో ఎన్నికలు జరుగుతాయి. 290 వార్డులకు 56 ఏకగ్రీవం కాగా, 234 స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ●ములకలపల్లి మండలంలో 20 సర్పంచ్ స్థానాలకు గాను పొగళ్లపల్లి ఏకగ్రీవం కాగా, చాపరాలపల్లిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 18 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 178 వార్డులకు 34 ఏకగ్రీవం కాగా, 144 చోట్ల ఎన్నికలు జరుగుతాయి. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ -
● నాడు ఎంపీటీసీ.. నేడు వార్డు సభ్యుడు
అశ్వారావుపేటరూరల్: ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మండలంలోని నందిపాడు గ్రామ పంచాయతీ 7వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా మాడి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశాడు. మరో అభ్యర్థి శనివారం నామినేషన్ ఉపసంహరించుకోవడంతో నాగేశ్వరరావు ఏకగ్రీవమయ్యాడు. ఈయన 2004లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిళ్లవారిగూడెం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును సీపీఎం నాయకులు కె.పుల్లయ్య, సొడెం ప్రసాద్, చిరంజీవి అభినందించారు. -
ఒకే ఇంటి నుంచి నలుగురు పోటీ
పాల్వంచరూరల్: మండల పరిధిలోని ప్రభాత్నగర్ (రెడ్డిగూడెం) గ్రామ పంచాయతీలో ఒకే కుటుంబం నుంచి నలుగురు ఎన్నికల బరిలో నిలిచారు. సీపీఐ మద్దతుతో పొదెం రాజేష్ సర్పంచ్గా, ఆయన భార్య నాగమణి 5వ వార్డు సభ్యురాలిగా, తండ్రి వెంకన్న 7 వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. రాజేష్కు ప్రత్యర్థిగా అతని సోదరి పొదెం నిషారాణి పోటీ చేస్తోంది. ఈమెకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది. వార్డు బరిలో మాజీ సర్పంచ్ గత పాలకవర్గంలో రెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా పనిచేసిన ఇర్ప మంగమ్మ ఈ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేశారు. -
రెండెకరాల్లో పోడు నరికివేత
అశ్వారావుపేటరూరల్: అడవులను సంరక్షించాలని ప్రభుత్వాలు, ఫారెస్టు అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు అక్రమార్కులు పోడు పేరుతో అటవీ వృక్షాలను నరికివేసి భూములను ఆక్రమిస్తున్నారు. తాజాగా అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో అనంతారం సెక్షన్ చెన్నాపురం బీట్లోని గాండ్లగూడెం సమీపంలో ఓ వ్యక్తి పోడు పేరుతో చెట్లను నరికి వేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ గ్రామీణ వైద్యుడు కొందరు కూలీలతో తన పోడు వ్యవసాయ భూమి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను భారీస్థాయిలో నరికించాడు. దాదాపు రెండు ఎకరాల్లో ఉన్న మారుజాతి చెట్లను నరికి వేయడంతో గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, రెండెకరాల్లో భారీ వృక్షాలను నరికివేసినా స్థానికులు ఫిర్యాదు చేసేవరకు అటవీ శాఖ అధికారులు గమనించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిపై కేసు నమోదు గ్రామీణ వైద్యుడు కూలీలతో పోడు పేరుతో అడవి నరికివేసిన ఘటనపై శనివారం అశ్వారావుపేట ఫారెస్టు రేంజర్ మురళి కేసు నమోదు చేశారు. అడవి నరికివేస్తున్నారనే సమాచారం అందగా, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి గొడ్లళ్లతో నరుకుతున్న ముగ్గురు కూలీలతోపాటు సదరు వ్యక్తిను అదుపులోకి తీసుకుని రేంజ్ ఆఫీసుకు తరలించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, రూ.15,400 జరిమానా విధించినట్లు రేంజర్ తెలిపారు. -
చిన్నారులకూ ‘అపార్’
● ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమలు జిల్లాలో ఇప్పటివరకు 44.8 శాతం నమోదు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలతోపాటు దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టులో కూడా చిన్నారులకు అపార్ నమోదు చేపడుతున్నాం. మిగిలిన చిన్నారులకు పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. –జ్యోతి, సీడీపీవో, దుమ్ముగూడెం ప్రాజెక్టుభద్రాచలంఅర్బన్: వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ నినాదంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేస్తోంది. ప్రతీ విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తోంది. రెండేళ్ల నుంచి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అపార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. పాఠశాలస్థాయి నుంచి ఉన్నత విద్యను అభ్యసించేస్థాయి వరకు అన్నిరకాల సర్టిఫికెట్లను ఇందులో భద్రపరుచుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన విద్యార్థులకు కూడా అపార్ నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొనసాగుతున్న నమోదు ప్రక్రియ జిల్లాలోని 2061 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులు 21,822 మంది ఉండగా, 11,153 మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 9,777 మంది చిన్నారులకు 44.8 శాతం అపార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఐసీడీఎస్ అధికా రులు తెలిపారు. ఆధార్ కార్డు కలిగి ఉన్న 10,669 మంది చిన్నారులకు అపార్ నమోదు చేయాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. నమోదులో ఇబ్బందులు అపార్ నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల వద్ద నెట్వర్క్ సక్రమంగా రాకపోవడం, ఆధార్ కార్డులులేని వారికి అవి వచ్చే వరకు వేచి చూడాల్సి రావడం, గిరిజన ప్రాంతాల్లో చిన్నారులను సకాలంలో కేంద్రాలకు పంపించకపోవడ వంటి కారణాలతో అపార్ నమోదులో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
లేఖలేక రాస్తున్నా..
మనసులోని భావాలకు అక్షర రూపమిస్తే అవతలివారి హృదయాలను తాకుతుంది. అందుకే చేతిరాత లేఖలు అందగానే ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాలపై ఉన్నతాధికారుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతో విషయ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా విస్తరించిన తరుణంలో ఉత్తరాల సంస్కృతి కనుమరుగవుతోంది. ఆ మధుర భావనలు నవతరం కూడా ఆస్వాదించేలా తపాలా శాఖ ‘ఢాయీ ఆఖర్’ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్నట్టు ఉత్తమ లేఖలకు నగదు బహుమతులు కూడా ప్రకటించింది. కరకగూడెం: ఆధునిక కాలంలో ఈ–మెయిల్స్, సోషల్ మీడియా, సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు రాయడం దాదాపుగా కనుమరుగైంది. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ఉత్తరాలను గుర్తు చేసేందుకు ఢాయీ ఆఖర్ పేరుతో జాతీయస్థాయి లేఖల పోటీ నిర్వహిస్తోంది. యువతకు లేఖల సంస్కృతిని అలవర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ‘లెటర్ టు మై రోల్ మోడల్’(నా ఆదర్శప్రాయులకు లేఖ) థీమ్తో పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక స్థాయిలో ప్రభావం చూపిన ఆదర్శమూర్తులు ఉంటారు. వారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఏదైనా రంగంలో గొప్ప విజయం సాధించిన వ్యక్తులై ఉండవచ్చు. రోల్ మోడల్కు తమ మనసులోని భావాలను, కృతజ్ఞతలను, స్ఫూర్తిని తెలియజేస్తూ చేతి రాతతో లేఖ రాయాలి. లేఖ ఇన్లాండ్ లెటర్లో 500 పదాల్లోపు ఉండేలా చూసుకోవాలి. కవరుపై వయసు రాసి, అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రం జత చేయాలి. నగదు బహుమతులు పోటీల్లో అన్ని వయసులవారూ పాల్గొనవచ్చు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా ఏ భాషలోనైనా లేఖ రాయవచ్చు. లేఖల పోటీ గత అక్టోబర్ 3న ప్రారంభంకాగా, ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. లేఖలను సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, పిన్కోడ్–507003 లేదా చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్, పిన్కోడ్–500001 చిరునామాకు పంపాలి. సర్కిల్స్థాయిలో మొదటి బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు అందజేస్తారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఉత్తరాల పోటీ డిజిటల్ యుగం ఎంత ముందుకెళ్లినా లేఖ రాయడం అనేది భావాల్ని హృదయపూర్వకంగా వ్యక్తపరిచే అందమైన పద్ధతి. ఈ ఏడాది ‘లెటర్ టు మై రోల్ మోడల్’థీమ్కు విద్యార్థులు, యువత నుంచి స్పందన వస్తోంది. ఖమ్మం డివిజన్ పరిధిలోని అనేక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పిల్లలు ఆసక్తితో లేఖలను స్వయంగా రాసి పంపుతున్నారు. వచ్చే నెల 23న ఫలితాలు ప్రకటించి నగదు బహుమతులు అందిస్తాం. –వీరభద్ర స్వామి, తపాలా శాఖ, సూపరింటెండెంట్, ఖమ్మం -
సామాజిక తెలంగాణకు కృషి
కొత్తగూడెంఅర్బన్: సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ చిత్రషూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్తూ మార్గమధ్యలోని పోస్టాఫీస్ సెంటర్లో ఆగారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు వీరన్న, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లకావత్ సురేష్, రాంబాబు, ఆది, రవికుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు.. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి భారతరత్న అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం అంబేద్కర్ సంక్షేమ సంఘం, దళిత బహుజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగంలో రిజర్వేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు సమ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, దళిత సంఘాల నాయకులు డాక్టర్ శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, తాండ్ర వెంకటేశ్వర్లు, సీఐ కరుణాకర్, చెన్నూరి శ్రీనివాస్, చీకటి కార్తీక్, కుంజా కవిత, జేబీ శౌరి, ఎర్రా కామేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ: గుమ్మడి నర్సయ్య చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, మల్లు నందిని, కొత్వాల శ్రీనివాసరావు, నూకల రంగారావు, కాల్వ ప్రకాష్, కాల్వ దేవదాస్, భాస్కర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
హోంగార్డుల సేవలు అమోఘం
కొత్తగూడెంటౌన్: హోంగార్డ్ ఆఫీసర్ల సేవలు అమోఘమని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో జరిగిన హోంగార్ుడ్స ఆవిర్భావ వేడుకల(రైజింగ్ డే)కు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శాంతికపోతాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదలు, ఎన్నికల సమయంలో హోంగార్డులు అంకిత భావ ంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేయాలని సూచించారు. అనంతరం త్వరలో పదవీ విరమణ పొందనున్న ఇద్దరు హోంగార్డులను సన్మానించారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్, ప్రతాప్, ఆర్ఐ నర్సింహారావు, హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
సాయి ఈశ్వరాచారికి నివాళి
ఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కలేదనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిన సాయి ఈశ్వరాచారికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించా రు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద శనివారం కొ వ్వొత్తులు వెలిగించి నివాళులర్పించగా జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడారు. రాజకీయ పార్టీల కుట్రలో సాయి ఈశ్వరాచారి అమరుడయ్యాడని తెలిపారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగన్నబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, నాయకులు గద్దె వెంకటరామయ్య, మల్లికార్జున్, గజ్జల శ్రీదేవి, ఇనగాల ఉపేంద్రాచారి, కృష్ణవేణి, సిద్ధు, సచ్చితానంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలి ఖమ్మంసహకారనగర్: ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారే కాక దివ్యాంగులు, గర్భిణు లు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటు న్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నాయకులు కోరారు. ఎన్నికలవిధుల కేటాయింపులో సీనియర్ ఉపా ధ్యాయులకు కాకుండా జూనియర్లకు స్టేజీ–2 బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇక నైనా సీనియర్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, వారు పనిచేస్తున్న మండలం నుంచి సమీప ప్రాంతాల్లోనే విధులు కేటాయించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు డు ధరావత్ రాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీనివాసరావు, సింగారపు వేణు ఒక ప్రకటనలో కోరారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుమణుగూరు టౌన్: కట్టుమల్లారం గ్రామంలోని రోడ్డుపై శనివారం రాత్రి రెండు మోటార్సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. విఘ్నేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో భద్రాచలం తీసుకెళ్లారు. చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్యా (62) శనివారం రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ వల విసిరే క్రమంలో వల కాళ్లు, చేతులకు చుట్టుకోవడంతో ఆయన నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రబోయినపల్లిలో ఎస్ఓటీ పోలీసుల తనిఖీలుసత్తుపల్లి: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సైబర్ క్రైంలో నిందితులుగా ఉన్న కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికిచెందిన పోట్రు ప్రవీణ్, పోట్రుప్రకాష్ ఇళ్లలో శనివారం ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేపట్టారు. పోట్రు ప్రకాష్ తల్లి ఇటీవల కన్నుమూయగా ఆమె దశదినకర్మ కోసం ఎర్రబోయినపల్లికి చెందిన ముగ్గురు జామీన్ సమర్పించి ఆయనను తీసుకొచ్చారు. అయితే, ఆయన శుక్రవారం హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు లొంగిపోవాల్సి ఉన్నా వెళ్లకపోవడంతో శనివారం పోలీసులు చేరుకున్నారు. ఈ మేరకు జామీన్ సమర్పించిన వారితో పాటు ప్రవీణ్, ప్రకాశ్ తండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అటు స్థానిక పోలీసులు, ఇటు ఎస్ఓటీ పోలీసులు స్పందించడానికి నిరాకరించారు. కాగా, అరెస్టుల సంఖ్య ఇప్పటికే 11కు చేరడంతో ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయోనన్న చర్చ జరుగుతోంది. -
పతాక నిధికి కలెక్టర్ తొలి విరాళం
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాయుధ దళాల దినోత్సవ పతాక నిధి కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించి తొలి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీరమరణం పొందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం వినియోగించే పతాక నిధికి విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి ఎం చంద్రశేఖర్, వింగ్ కమాండర్ రిటైర్డ్ సురేందర్, ఆర్మీ రిటైర్డ్ సుభాని, కృష్ణమూర్తి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కోయగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి
టేకులపల్లి: మండలంలోని కోయగూడెం సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగుతున్న తనపై ఇల్లెందు ఎమ్మెల్యే సోదరుడు కోరం సురేందర్ దంపతులు దాడి చేశారని పూనెం కరుణాకర్ ఆరోపించారు. శుక్రవారం చుక్కాలబోడు నామినేషన్ల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి మాట్లాడారు. వార్డు అభ్యర్థులతో కలిసి శుక్రవారం రెండో సెట్ దాఖలుకు రాగా, ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరుడు సురేందర్ – ఉమ దంపతులు పత్రాలు లాక్కున్నారని తెలి పారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని, అయ్యప్ప మాల ధరించిన తనను దుర్భాషలాడుతూ సురేందర్ దంపతులు దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆర్ఓ, ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కాగా, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఆరోపించారు. నాయకులు హరిసింగ్, బొమ్మెర్ల వరప్రసాద్, రామ, బాలకృష్ణ, పాపయ్య పాల్గొన్నారు. ఈ ఘటనలో సురేందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. ● టేకులపల్లి నామినేషన్ కేంద్రంలో ప్రచారం చేయొద్దని సూచించిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బానోతు పూర్ణను కులం పేరుతో దూషించినట్లు అందిన ఫిర్యాదుతో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్పై అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.ఎమ్మెల్యే సోదరుడిపై ఫిర్యాదు, కేసు -
నామినేషన్ ఫీజు కోసం భిక్షాటన
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల సర్పంచ్గా బరిలోకి దిగుతున్న స్వతంత్ర అభ్యర్థి బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం భిక్షాటన చేశారు. దుబ్బతండాకు చెందిన బానోత్ బద్రి తన భర్త శ్రీను, తదితరులతో కలిసి ఓటర్లను కలిసి నామినేషన్ ఫీజు కోసం విరాళాలు కోరగా రూ.3వేలు సమకూరాయి. ఆ నగదుతోనే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన బద్రి 506ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, తద్వారా కాకర్ల గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
యాసంగిలో ఎరువుల అవసరం
72,397ఎంటీఇప్పటికే 23,212 మెట్రిక్ టన్ను(ఎంటీ)ల నిల్వసూపర్బజార్(కొత్తగూడెం): యాసంగి వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులపై దృష్టి సారించింది. గత యాసంగిలో పంటల సాధారణ విస్తీర్ణం 1,21,857 ఎకరాలుకాగా ఈసారి 1,56,667 ఎకరాలుగా అంచనా వేసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లెక్కల తేల్చింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు యూరియా 28,273 మెట్రిక్ టన్నులు(ఎంటీ), డీఏపీ 5,443 మెట్రిక్ టన్నులు, పొటాష్ 3,922 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 32,657 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్ఫేట్ 3,103 మెట్రిక్ టన్నులు.. మొత్తంగా 72,397 మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. ఇప్పటివరకు 23,212 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. యూరియా కొరత నివారిస్తారా? గత వానాకాలం సీజన్లో యూరియా కొరతతో రైతులు అవస్థ పడ్డారు. రేయింబవళ్లు పీఏసీఎస్ల వద్ద పడిగాపులు కాశారు. యా సంగి సీజన్లో అధికారుల అంచనాల ప్రకారం కాంప్లెక్స్ ఎరువుల తర్వాత యూరి యా వినియోగమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో యారియా కొరత లేకుండా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నెల యూరియా డీఏపీ పొటాష్ కాంప్లెక్స్ పాస్ఫేట్ అక్టోబర్ 6,381 1,137 1,053 7,170 503 నవంబర్ 2,685 812 524 5,724 325 డిసెంబర్ 3,900 1,364 577 5,499 611 జనవరి 7,120 1,392 691 7,716 814 ఫిబ్రవరి 5,190 592 640 4,843 493 మార్చి 2,997 146 437 1,705 457 మొత్తం 28,273 5,443 3,922 32,657 3,103 నిల్వ 7,264 1,653 1,365 10,625 2,305 -
రియల్ అండ్ రీల్ హీరోస్..
ఇల్లెందు/కారేపల్లి/పాల్వంచ: ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచినా అతి సాధారణ జీవనం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యాన నల్లా సురేష్రెడ్డి నిర్మాతగా కామారెడ్డికి చెందిన పరమేశ్వర హివ్రాలె దర్శకత్వంలో సినిమా చిత్రీకరించనున్నారు. సినిమా షూటింగ్ పాల్వంచలో శనివారం మొదలుకానుండగా.. గుమ్మడి నర్సయ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్స్టార్ డాక్టర్ శివరాజ్కుమార్ శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడేనికి శివరాజ్కుమార్ – గీత దంపతులు వచ్చారు. ఆయనతో సమావేశమైన శివరాజ్కుమార్.. గుమ్మడి జీవనశైలి, ఎన్నికల వేళ అవలంబించిన విధానాలు, ప్రజల్లో అభిమానం తదితర వివరాలు తెలుసుకున్నారు. కాగా చిత్ర నిర్మాత నల్లా సురేష్రెడ్డి పాల్వంచలో, మాస్లైన్ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ ఇల్లెందులో సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలు వెల్లడించారు. సమావేశాల్లో సినిమా దర్శకుడు పరమేశ్వర హివ్రాలెతో పాటు, మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శిపోటు రంగారావు, యాకుబ్షావలీ, మల్లెల వెంకటేశ్వర్లు, పిల్లి మల్లేష్, వేముల గురునాథం, కొత్తపల్లి రఘు, నరేష్, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, శ్రీను, నర్సింహారెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దుప్పుల వేట.. పెళ్లిలో విందు
● మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు లొంగుబాటు ● ఆయనతో పాటు ఇంకొకరి రిమాండ్సత్తుపల్లి: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెచ్చా రఘు శుక్రవారం సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజుల సమక్షాన లొంగిపోయాడు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోదరుడి కుమారుడైన ఆయనతో పాటు దమ్మపేట మండలం గొర్రెగుట్టకు చెందిన చెందిన కుంజా భరత్ కూడా లొంగిపోగా అధికారులు విచారణ చేపట్టారు. సత్తుపల్లిలో దుప్పుల వేటపై సాక్షి’లో గతనెల 29నుంచి ‘తూటా దూసుకెళ్తోంది.., అటు నగదు.. ఇటు వేట, అసలు వేటగాడు పట్టుబడలేదా?’ శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టి అర్బన్పార్క్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పంతంగి గోపికృష్ణ, శొంఠి శ్రీరాంప్రసాద్ను కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రఘు, భరత్ లొంగిపోగా విచారణ అనంతరం వారిద్దరిని సాయంత్రం కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. అయితే, వేటలో కీలకంగా రఘు వ్యవహరించినట్లు తెలుస్తుండగా కేసులో ఆయను ఏ2గా నమోదు చేసి గోపీకృష్ణ, శ్రీరాంప్రసాద్, భరత్ పేర్లను ఏ1, ఏ3, ఏ4గా చేర్చడం గమనార్హం. దుప్పి మాంసంతో విందు దుప్పుల వేటలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు వివాహ వేడుక ఇటీవల సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి అర్బన్పార్కు దుప్పులను వేటాడి ఈ విందులో వడ్డించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమాన ఆయన లొంగిపోగా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేటాడారు, అటవీశాఖ సిబ్బంది ఎవరైనా సహకరించారా, వేటలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు రాబట్టేందుకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అంతేకాక రఘు తుపాకీ ఎక్కడ కొన్నాడు.. అశ్వారావుపేట పోలీస్స్టేషన్లో లైసెన్స్ ఉన్న తుపాకీ సరెండర్ చేసినా ఇంకా ఆయన వద్ద తుపాకులు ఉన్నాయా అనే వివరాలు రాబట్టినట్లు సమాచారం. కాగా, సత్తుపల్లి అర్బన్ పార్కులోకి అక్టోబర్లో ఓ రోజు రాత్రి 11 గంటల సమయాన కొందరు వ్యక్తులు కారులో లోపలకు వెళ్లి ఐదు దుప్పులను వేటాడి తీసుకెళ్లినట్లు అధికారులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించినట్లు సమాచారం తెలిసింది. ఆ రోజు ఆరు దుప్పులు వేటాడగా.. ఐదు దుప్పులే వీరికి దొరికాయని, ఒకటి గాయాలతో తప్పించుకుని మరుసటి రోజు జనావాసాల్లోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు వైద్యం చేయించి పార్క్లో వదిలిపెట్టారు. ఈ అంశాలన్నింటినీ నిర్ధారించుకునేలా రఘు, భరత్ను విడివిడిగా విచారించాక రిమాండ్కు తరలించినట్లు సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల వెల్లడించారు. కాగా, అటవీ జంతువులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ స్పష్టం చేశారు. -
సర్వేలకే పరిమితం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దశాబ్దాలు గడిచినా తెలంగాణలోని కొత్త రైల్వే మార్గాలకు మోక్షం లభించడం లేదు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా వెళ్లే నూతన రైలు మార్గాల పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. మరో డీపీఆర్ సిద్ధం మణుగూరు–రామగుండం ప్రాంతాల మధ్య 208 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించాలని పదేళ్ల క్రితం నిర్ణయించారు. కోల్ కారిడార్ రైలు మార్గంగా దీన్ని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలిపే మార్గం కావడంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు మేలు జరుగుతుందని, అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని ప్రగల్భాలు పలికారు. భూ సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఐదేళ్ల క్రితం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 2,911 కోట్లుగా అంచనా వేశారు. కానీ సకాలంలో పనులు ప్రారంభం కాలేదు. రైలు మార్గం తాజా పరిస్థితిని వివరించాలని రైల్వే బోర్డును ఇటీవల పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ కోరగా ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించామని చెప్పారు. డీపీఆర్ ప్రకారం నిర్మాణ అంచనా వ్యయం రూ. 3,998 కోట్లకు చేరుకుంది. గత డీపీఆర్లో పేర్కొన్న అంచనా కంటే వ్యయం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు పెరిగింది. రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు జరిపితే సరే, లేదంటే అంచనా వ్యయం మళ్లీ పెరగక తప్పదు. మూడు దశాబ్దాలైనా.. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ మూడు దశాబ్దాలుగా నలుగుతోంది. 2011లో సమర్పించిన డీపీఆర్లో పాండురంగాపురం నుంచి సారపాక వరకు 13 కి.మీ రైలు మార్గం నిర్మాణానికి రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిర్మాణ వ్యయంలో సగం అప్పటి ఏపీ ప్రభుత్వం భరించాలనే షరతు విధించారు. ఇక అప్పుడు బిగుసుకున్న పీటముడి ఇప్పటివరకు వీడలేదు. రైలుమార్గ నిర్మాణ పనులూ మొదలు కాలేదు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే భద్రాచలం–మల్కన్గిరి (ఒడిశాల)ల మధ్య కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 ఆగస్టులో ప్రకటించారు. అంతకుముందు ఆయన అనేకసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయినా ప్రకటనల్లో ఉన్న వేగం పనుల్లో కనిపించడం లేదు. నిధులు మంజూరైతే ముందుగా సారపాక – పాండురంగాపురం సెక్షన్ను పూర్తి చేయించాలని తెలంగాణ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.రైల్వేలైన్ దూరం మణుగూరు– రామగుండం 208 కి.మీ భద్రాచలం రోడ్–కొవ్వూరు 151 కి.మీ భద్రాచలం–మల్కన్గిరి 173 కి.మీ కొత్తగూడెం –కిరండోల్ 180 కి.మీ కొత్తగూడెం –కొండపల్లి 125 కి.మీ ముందుకు సాగని కొత్త రైలు మార్గాల నిర్మాణం భద్రాచలం–కొవ్వూరు లైన్ పూర్తయ్యేదెన్నడో..? భద్రాచలం–కొవ్వూరు రైల్వేలైన్ దాదాపుగా నలభై ఏళ్లుగా సర్వేలకే పరిమితమవుతోంది. సింగరేణి సహకారం వల్ల సత్తుపల్లి వరకు రైలు మార్గం నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు మందగించాయి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద రైల్వేశాఖ పెట్టింది. భూమిని సేకరించి ఇస్తే మిగిలిన పనులు తాము చేస్తామని చెబుతోంది. దీంతో ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంపై ఏపీ సర్కార్ మౌనం పాటిస్తోంది. కొత్తగూడెం – కిరండోల్, కొత్తగూడెం– కొండపల్లి మధ్య రైలు మార్గం నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. కానీ నిధులు మంజూరు కాలేదు. -
సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి
● కేవీకే శాస్త్రవేత్త హేమశరత్చంద్ర ఇల్లెందురూరల్: రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రయ ఎరువులకు ప్రాధాన్యతనిస్తే నాణ్యమైన, మెరుగైన దిగుబుడులు వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమశరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త శివ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ భరత్ సూచించారు. మండలంలోని పూబెల్లి గ్రామంలో శుక్రవారం మాతృక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు తమ పంట చేలల్లో రసాయన ఎరువుల వినియోగం పెంచడం వల్ల నేల సారాన్ని కోల్పోయి పంట దిగుబడి, నాణ్యతపై ప్రభా వం చూపుతుందన్నారు. దీనికోసం సేంద్రియ ఎరవుల వినియోగం పెంచాలని సూచించారు. సాగులో పంట మార్పిడి పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో చేపపిల్లలను వదిలారు. వార్షిక లక్ష్యసాధనకు కృషి చేయాలిమణుగూరుటౌన్: 2025–26 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 76 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీతకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పీ అండ్ పీ) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి కేసీహెచ్పీలో బెల్ట్ లోడింగ్ సిస్టం, పీకేఓసీ, మణుగూరు ఓసీ గనుల వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియా వార్షిక లక్ష్యం 115 లక్షల టన్నుల ఉత్పత్తికి అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాఘవేంద్రరావు, శ్రీనివాసచారి, రమేశ్, గౌడే, వీరభద్రరావు, సురేశ్కుమార్, రమణారెడ్డి, బైరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. బస్సుకింద పడి మహిళ మృతి ● ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు అల్పాహారం తెచ్చేందుకు వస్తుండగా ఘటన ఇల్లెందు: జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమార్తెకు అల్పాహారం తీసుకొచ్చేందుకు బైక్పై వస్తున్న తల్లి బస్సు(క్యారవ్యాన్)కింద పడి మృతిచెందిన ఘటన ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకుంది. స్ట్రట్ఫిట్బస్తీకి చెందిన ఎండీ రహీముద్దీన్, తన భార్య ఎండీ సుహానా (40) దంపతుల కుమార్తె జాస్మిన్కు జ్వరం రావడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆమెకు చపాతీ తీసుకొచ్చేందుకు దంపతులు బైక్పై ఇంటికి వెళ్లి వస్తుండగా ఓ క్యారవ్యాన్ సైడ్ ఇవ్వకుండా వస్తోంది. ప్రభుత్వాస్పత్రి సమీపంలో సైడ్ ఇచ్చినట్టే ఇచ్చి.. డివైడర్ వైపు జరగడంతో క్యారవ్యాన్కింద పడిన సుహానా అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి సీఐ టి.సురేశ్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, జ్వరంతో బాధపడుతున్న కుమార్తె జాస్మిన్.. ఆస్పత్రిలో ఉండగా.. సుహానా మృతదేహం మార్చురీలో ఉంది. దీంతో రహీముద్దీన్, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఐదు నిమిషాలైతే ఆస్పత్రికి చేరుకునేవారమని, వ్యాన్ తన భార్యను బలితీసుకుందని భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.


