‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా | - | Sakshi
Sakshi News home page

‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా

‘మన ఇసుక వాహనం’తో పారదర్శకంగా రవాణా

కరకగూడెం: గృహ నిర్మాణ అవసరాల కోసం సరసమైన ధరలకే ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా ‘మన ఇసుక వాహనం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనింగ్‌ ఏడీ దినేష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పెద్దవాగు ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఆదేశాల మేరకు త్వరలోనే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో భాగంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా చేపడతామని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కాంతయ్య, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్‌ ఏడీ దినేష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement