Bhadradri District Latest News
-
అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి
● జయంతి వేడుకల్లో కలెక్టర్ అంకిత్ ● హాజరైన ఎస్పీ రోహిత్రాజ్, అధికారులుసూపర్బజార్(కొత్తగూడెం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి పాల్గొన్న కలెక్టర్.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. రాజ్యాంగం రూపకల్పనలో అంబేడ్కర్ చేసిన చేసిన కృషి అపూర్వమని తెలిపారు. ఆయన దూరదృష్టితోనే దేశాభివృద్ధికి పునాదులు పడ్డాయని చెప్పారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశమైనా అంతా ఐక్యంగా నిలబడటానికి రాజ్యాంగమే కారణమని తెలిపారు. వాల్పోస్టర్లు ఆవిష్కరణ, ప్రతిజ్ఞ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ‘అరైవ్–అలైవ్’లో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, డీటీఓ వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, కమిషనర్ సుజాత, ఉత్సవ కమిటీ సభ్యులు ఆంతోటి పాల్, డాక్టర్ మద్దెల శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, సబ్బారపు మధుసూదన్ రావు, పీక కృష్ణ, కోలపూరి ధర్మరాజు, సలింగటి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు. -
● బియ్యం పక్కదారి..
గోదాంలు, మిల్లుల్లో బియ్యం నిల్వలు తగ్గించడం.. ప్రజలు ఎండలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పంపిణీ మొదలైంది. అటు మొదలుకాగానే ఇటు అక్రమార్కులు రంగంలోకి దిగారు. వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టుగానే పక్కదారి పట్టించడం మొదలైంది. ముందుగా జిల్లా కేంద్రంలో మొదలైన దందా క్రమంగా అన్ని మండలాలకు విస్తరించింది. దీంతో అప్రమత్తమైన పౌర సరఫరాల శాఖ దాడులను ముమ్మరం చేసింది. ఈక్రమాన ఇప్పటి వరకు సుమారు పది మెట్రిక్ టన్నుల (980 క్వింటాళ్ల) బియ్యాన్ని పట్టుబడడం గమనార్హం. అయితే, పట్టుబడింది తక్కువేనని.. ఇంతకు ఆరింతల స్థాయిలో బియ్యం ఇప్పటికే సరిహద్దులు దాటిందనే ప్రచారం జరుగుతోంది. -
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
భద్రాచలంఅర్బన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపం నివా రణ, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహనకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళ, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభం కాగా.. ఈ నెల 23 వరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నా రు. ఆరేళ్ల చిన్నారుల్లో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించి, తీసుకోవా ల్సిన ఆహారం, ఆవశ్యకతను వివరించనున్నారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు పోషణ్ పక్వాడాలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రసవానంతరం వీలైనంత త్వరగా పిల్లలకు తల్లిపాలు మొదటి ఆరు నెలలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలు వివరించి.. తల్లి పాలు మాత్రమే ఇచ్చేలా చూస్తారు. అమ్మమ్మ, నానమ్మ మాటల్లో పోషణ కథలను అంగన్వాడీ కేంద్రాల్లో చెప్పడం, గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పోషకాహా రం ప్రాముఖ్యత వివరిస్తారు. స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు ఉపయోగించి పలు రకాల ఆహార వంటకాలు, తల్లిదండ్రులకు వంటల పోటీ లు నిర్వహిస్తారు. జంక్, ప్యాకేజ్డ్ ఆహారాల వల్ల కలిగే హాని, పోషకాహారంపై ర్యాలీల నిర్వహణ, పిల్లల అభివృద్ధి మైలురాళ్లను గుర్తించడం, బాల్య ఆరంభ దశ సంరక్షణ, విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. చిన్నారులకు స్థానిక జానపద కళల ప్రదర్శనలు, పజిల్స్, నాటకీకరణ పోటీలు, శారీరక కండరాల అభివృద్ధికి ప్రోత్సాహం, రచన పోటీలు నిర్వహిస్తారు. లోపాలు ఉన్న వారిపై దృష్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను సేకరించగా.. కొందరిలో వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం గుర్తించారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టిసారించి తల్లిదండ్రులకు పోషకాహారంపై అవ గాహన కల్పించి లోపాలను అధిగమించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లి పాలు ఇచ్చే పద్ధతులు, రక్తహీనత, పర్యావరణ, వ్యక్తిగత పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ వివరిస్తారు. ఉడికించిన కోడి గుడ్లు, మురుకులు, పండ్లు, ఆకుకూరల ప్రదర్శన, చేతులను పరిశుభ్రంగా కడుక్కునే విధానం వివరిస్తారు. దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలతో పాటు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నాం. చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పౌష్టికాహారంపై వివరిస్తాం. –జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ -
అదిగదిగో భద్రగిరి !
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం రూపురేఖలు మారిపోయి సరికొత్త కళ రానుంది. ఆలయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం నడుం బిగించడంతో పాటు నిధులను కేటాయించడంతో పనుల ప్రణాళికల రూపకల్పనలో వేగం పెరిగింది. ఇప్పటికే స్థపతి సత్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ అధికారులు, వైదిక పెద్దల సలహాలు, సూచనలతో రూపొందించిన ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాక మార్చి 2027 నాటికి మొదటి విడత పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉండగా.. ఆలయ పరిసర ప్రాంతాల్లో హడావుడి మొదలైంది. ముహూర్తం ఖరారు భక్త రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం మినహా ఇతర నిర్మాణాలన్నీ తొలగించి సరికొత్త రూపు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, ఆళ్వార్లను కదిలించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 26న కళావాహనతో స్వామి వార్లను కలశాలలోకి ఆవాహన చేస్తారు. అనంతరం 72 మంది మూలమూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించే బాలాలయానికి తరలిస్తారు. తిరిగి పునఃప్రతిష్ఠ చేసే వరకు అక్కడే ఉంచి నివేదన, ఆరాధన జరపనున్నారు. ఈనెల 26న జరిగే పూజలకు చినజీయర్ స్వామి హాజరు కానుండగా.. దేవస్థాన అధికారులు, వైదిక పెద్దలు ప్రణాళికలు ఖరారులో నిమగ్నమయ్యారు. ఇక లక్ష్మీతాయారు అమ్మవారు, గోదాదేవి మూలమూర్తులను ప్రధాన ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలోకి చేర్చి నిత్య పూజలు నిర్వహిస్తారు. అయితే, ప్రధాన ఆళ్వార్లు, పంచలోహ విగ్రహాలను మాత్రం ఇక్కడే ఉంచనున్నారు. అమ్మవారి ఉపాలయంపై అస్పష్టత ప్రభుత్వం ఆమోదించిన నూతన మాస్టర్ ప్లాన్లో ప్రస్తుతం తొలగించనున్న లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయానికి ఇతర స్థలంలో చోటు కల్పించారు. అయితే ఇటీవల చినజీయర్ సలహాతో వైదిక పెద్దలు ప్రస్తుతం ఉన్న చోటే అమ్మవారి ఆలయం కొనసాగించాలనే ప్రతిపాదన తీసుకొచ్చి నట్లుగా సమాచారం. ఈ అంశంపై రెండు రోజుల్లో వైదిక పెద్దలు, అధికారుల సమాలోచనల తర్వాత స్పష్టత రానుంది. ఇక చిత్రకూట మండపంతో పాటు చుట్టుపక్కల నిర్మాణాలను కూడా తొలగించనున్నారు. చిత్రకూట మండపంలోని రాతి రాళ్లను భద్రపర్చనుండగా.. ఆగ్నేయంలో తిరిగి అదే తరహాలో నిర్మాణం చేపడుతారు. కాగా, లడ్డూ విక్రయాల కౌంటర్లను ఏడాది పాటు తాత్కాలికంగా ఏర్పాటుచేయాల్సి ఉండగా స్థలాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక నిర్మాణాల తొలగింపునకు టెండర్లు ఆహ్వానించారు. అభివృద్ధిలో భాగంగా ప్రధాన ఆలయం మినహా సమూల మార్పులు ‘ప్రసాద్’ భవనం పూర్తయి ఉంటే... ‘ప్రసాద్’ పథకం ద్వారా మంజూరైన నిధులతో జీ ప్లస్ టూ భవన నిర్మాణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అయితే, ఈ భవనం అనుకున్న సమయానికి పూర్తయితే ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడేదని చెబుతున్నారు. జీ ప్లస్ భవనంలోనే డార్మెటరీ హాళ్లు, నిత్యాన్నదానానికి హాల్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయి ఉంటే లడ్డూ కౌంటర్లతో పాటుగా కార్యనిర్వహణ గదులు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడేది. కానీ కాంట్రాక్టర్కు నాలుగు దఫాలు గడువు పొడిగించినా పూర్తిచేయకపోవడం గమనార్హం. కనీసం పుష్కరాల సమయానికైనా అందుబాటులోకి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర టూరిజం అధికారులు పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు. -
సీతారామలో రిజర్వాయర్లు!
●ఖమ్మంఅర్బన్: ఉమ్మడి జిల్లా సాగు అవసరాల కోసం గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అప్పటికప్పుడు వరద పారించడమే కాక సీజన్లో సముద్రంలో వృథాగా కలిగే నీటిని ఒడిసి పట్టేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. తక్కువ భూమి వినియోగంతో ఎక్కువ నీటి నిల్వ సామర్ధ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం సూచనలు చేయగా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే కూడా పూర్తిచేయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. సాగు, తాగు అవసరాలకు.. నాగార్జునసాగర్, కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ల పరిధిలో కాల్వల ద్వారా నీరు పారిస్తూ నిల్వల కోసం రిజర్వాయర్లు నిర్మించారు. సాగర్ ఎడమ కాల్వపై 40 కిలోమీటర్ వద్ద పెద్ద దేవులపల్లిలో, 70వ కి.మీ.వద్ద పునుగోడులో, 136 కి.మీ.వద్ద పాలేరులో రిజర్వాయర్లు ఉన్నాయి. అంతేకాక 220 కిలో మీటర్ వద్ద వైరాలో, 270 కి.మీ. వద్ద లంకా సాగర్ రిజర్వాయర్తో అటు సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఇదే తరహాలో సీతారామ ప్రాజెక్ట్ పరిధి లోనూ రిజర్వాయర్లు నిర్మిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయనే భావనకు వచ్చినట్లు సమాచారం. ములకలపల్లిలో ఒకటి? ఖమ్మం జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ. మేర సీతారామ కాల్వ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులను 13, 14, 15, 16వ ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో ఎక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే ఎక్కువ మేలు జరుగుతుందో నిర్ధారించేందుకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించినట్లు తెలిసింది. ఈమేరకు 15వ ప్యాకేజీ పరిధిలో గుట్టల మధ్య ఒక రిజర్వాయర్ నిర్మాణానికి అనువుగా ఉందని ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. ఈ ప్రాంతం మహబూబాబాద్ జిల్లా ములకలపల్లి పరిధిలోకి వస్తుండగా.. సుమారు 20 – 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం 2,500 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరం కాగా, సగం మేర ప్రభుత్వ భూమి పోను మిగతాది సేకరించాల్సి వస్తుందని నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ముంపు సమస్య కూడా రాదని చెబుతున్నారు. నిర్మాణ వ్యయం రూ.7వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లుగా అంచనా వేయగా... సుమారు రూ.4,500 కోట్లు నిర్మాణ పనులకు, మిగతాది భూసేకరణ తదితర ఖర్చులకు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఇదేకాక మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. అవసరాలకు భరోసా ఖమ్మం జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలకు కలిపి సుమారు 60 టీఎంసీల నీరు అవసరమవుతోంది. అంతేకాక తాగునీటి అవసరాలకు మరో ఆరు టీఎంసీలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 2.5 టీఎంసీలే కావడంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే సమస్యలు వస్తున్నాయి. ఈనేపథ్యాన సీతారామలో రిజర్వాయర్లు నిర్మిస్తే అటు సాగునీరు, ఇటు తాగునీటి అవసరాలకు స్థిరమైన భరోసా ఏర్పడనుంది. అంతేకాక కృష్ణా బేసిన్లో నీటి కొరత ఏర్పడినప్పుడు గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జల వనరుల శాఖ ఇంజనీర్ల సమావేశంలోనూ రిజర్వాయర్ల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. భూసేకరణ, సాంకేతిక అంశాలు, వ్యయంపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది.ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పొడవు సుమారు 190 కి.మీ.గా ఉన్నా నిర్మాణంలో ఎక్కడా రిజర్వాయర్లను ప్రతిపాదించలేదు. దీంతో గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రం ఆయకట్టుకు నీరు విడుదల చేయనుండగా.. నిల్వలకు అవకాశం లేదు. ఈనేపథ్యాన సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టేలా కాల్వల మధ్య రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వ సూచనలతో జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా సీతారామ ప్రాజెక్టు నీరే కాక వర్షాలతో వచ్చే వరద కూడా నిల్వ ఉంటుందని చెబుతున్నారు.20 టీఎంసీలతో ఒకటి ఖరారు ? -
వైభవంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామి వారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎంకు వినతి మణుగూరు రూరల్: ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈమేరకు మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సారథ్యాన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం హైదరాబాద్లో సీఎంకు వినతిపత్రం అందజేశారు. పోడుభూములకు పట్టాలు, సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు చెక్డ్యామ్లతో పాటు రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు, బోర్లు తవ్వేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. అలాగే, ఐటీడీఏల బలోపేతం, ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంపుపై విన్నవించగా సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యే పాయం తెలిపారు. ఆయన వెంట ఖానాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జ, డాక్టర్ మురళీనాయక్ పాల్గొన్నారు. నేడు డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరు మండలం నారాయణపురంలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక, కల్లూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత పెనుబల్లి మండలంలో పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. అంతేకాక పెనుబల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశాక మధ్యాహ్నం సత్తుపల్లిలో వంద పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించి అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం రేజర్లలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత 3–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి సందర్శిస్తారు. అక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నేటి నుంచి ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు ఖమ్మంసహకారనగర్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ‘దోస్త్’ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించగా, బుధవారం నుంచి మొదటి విడుత రిజిస్ష్రేన్లు మొదలుకానున్నాయి. ఈమేరకు డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరు ఈనెల 30నుంచి వచ్చే మే 8వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు ఇస్తే, మే 14వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 15నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విడతలో మే 15నుంచి 26వ తేదీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశముండగా మే 30న సీట్లు కేటాయిస్తారు. అలాగే, మూడో విడత రిజిస్ట్రేషన్లు మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉంటాయని, మే 21నుంచి జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇస్తే జూన్ 20వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
ఐటీడీఏ పీఓ రాహుల్ భధ్రాచలం: రాజ్యాంగ ఫలాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరూ ఎదిగేలా కృషి చేసిన అంబేడ్కర్ ఆశయ సాధనకు సమష్టిగా కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ చేరువ చేసిన మహనీయుడని కొనియాడారు. ఏపీఓ డేవిడ్రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, అధికారులు గన్యానాయక్, వేణు, సమ్మయ్య, రమేశ్, సైదులు, సున్నం రాంబాబు, ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని కంపగూడెం క్రాస్ రోడ్డు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు మంగళవారం సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గడ్డి మందు తాగి ఆత్మహత్య ముదిగొండ: కడుపునొప్పి తాళలేక గడ్డి మందు తాగి న యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముదిగొండ మండలం ముత్తారానికి చెందిన తాళ్ల సందీప్ (22) బ్యాటరీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆయన కడుపునొప్పి భరించలేక ఈ నెల 12న గడ్డిమందు తాగగా, కుటుంబీకులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించగా, మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో ఆయన నేత్రాలను నేత్రనిధికి అందజేశారు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బ లక్షణాలతో మహిళ మృతి కొణిజర్ల: వడదెబ్బ లక్షణాలతో బాధపడుతూ మహిళ మృతి చెందింది. మండలంలోని తనికెళ్లకు చెందిన ముత్యాల సత్యావతి(55) మిర్చి ఏరే పనులకు వెళ్తోంది. ఈ క్రమాన రెండు రోజుల క్రితం అనారో గ్యం బారిన పడగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోంది. మంగళవారం ఉదయం కుప్పకూలిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వడదెబ్బతోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. -
సహజ సౌందర్యం.. జీవ వైవిధ్యం
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో సహజ సౌందర్యం కలిగిన పులిగుండాలలో పర్యాటకులకు కొత్త అందాలు అందుబాలోకి వచ్చాయి. తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ 35,637 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఇక్కడి రిజర్వాయర్ ప్రకృతి ప్రేమికులకు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈమేరకు ప్రాజెక్టును పర్యావరణ హిత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. స్థానికులకు ఉపాధి లభించేలా వన్యప్రాణి, జీవావరణ పరిరక్షణ, పక్షి వీక్షణ, ట్రెక్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించడంతో మరింత అందాన్ని సంతరించుకుంది. పర్యాటకులకు సౌకర్యాలు పులిగుండాల ఎకో–టూరిజం ప్రాంత వీక్షణకు వచ్చే పర్యాటకుల కోసం వసతులు సమకూర్చారు. పులిగుండాల ప్రాజెక్టులో పెడల్ బోటింగ్ సౌకర్యం కల్పించగా.. తాత్కాలిక వసతి సౌకర్యం, పక్షి వీక్షణ టవర్లు, వ్యూ పాయింట్లు, సఫారీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక ట్రెక్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. 27 కి.మీల జంగిల్ సఫారీ పులిగుండాల పర్యాటక ప్రాంతంలో 27 కి.మీ. జంగిల్ సఫారీ ప్రత్యేకంగా నిలవనుంది. ఇది పులిగుండాల మినీ జలపాతం, చిరుత వీక్షణ టవర్ను అనుసంధానం చేస్తుంది. ఈ మార్గం ద్వారా సందర్శకులు కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని కిన్నెరసాని, భద్రాచలం ప్రాంతంతో పాటు పులిగుండాల కూడా పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందనుంది. ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యాన రూపొందించిన ప్రాజెక్టును ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి బుధవారం ప్రారంభించనున్నారని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. -
ఖమ్మం.. కాంగ్రెస్ కంచుకోట
● కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది ● జెండా మోసిన వారికి సముచిత గౌరవం ● డీసీసీ ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్, మంత్రి పొంగులేటి సాక్షి ప్రతినిధి, ఖమ్మం / ఖమ్మం మయూరిసెంటర్: పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా జెండా వీడని కార్యకర్తలు కాంగ్రెస్కు ఖమ్మంను కంచుకోటగా నిలబెట్టారని, భవిష్యత్లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తొలుత భారీ ర్యాలీగా జడ్పీసెంటర్కు చేరుకుని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నూతన కార్యవర్గంతో టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ ప్రమాణం చేయించాక డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్లో పదవులు పొందడం అదష్టమని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ విషయమై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాగా, కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలను తప్పక గుర్తిస్తామని.. ఇదే సమయాన ఉదాసీనంగా ఉండేవారిని పార్టీ గమనిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్కు ప్రాణమని తెలిపారు. పదవి చిన్నదా, పెద్దదా అని కాకుండా పనే ముఖ్యమని చెప్పారు. తొలిమెట్టు రాజకీయ ప్రస్థానానికి ఆరంభంగా నిలుస్తుందని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెడితే ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఎంతో శ్రమిస్తూ సంక్షేమ పథకాలను ఆపకుండా నడుపుతున్నారని చెప్పారు. కేటీఆర్ విదేశాలు తిరిగినా పెట్టుబడులు రాకపోగా, రేవంత్రెడ్డి నాయకత్వంలో రూ.5.78 లక్షల కోట్ల మేర వచ్చాయని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ వందకు పైగా సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం.. తెలంగాణ ప్రభుత్వం పేదల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలు చేరుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రభుత్వం కార్యకర్తల కష్టార్జితమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈమేరకు కొత్త కార్యవర్గం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, అంబేద్కర్ జయంతిని సందర్భంగా అంబేద్కర్ భవనంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయగా.. పారిశుద్ధ్య కార్మికులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, రాగమయి భోజనం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు బేబి స్వర్ణకుమారి, ముస్తఫా, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
ఎండల్లో ఎదురుచూపులు
బూర్గంపాడు: యాసంగిలో సాగుచేసిన వరి కోతలు ఊపందుకోగా, ధాన్యం రైతుల చేతికందుతోంది. దీంతో కల్లాల్లో ఆరబోస్తున్న అన్నదాతలు అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్న ప్రాంతాల్లో ఆరబోసిన వారు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికార యంత్రాంగం హడావుడి చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లుల కేటాయింపులు జరగలేదని, త్వరలోనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. దీంతో చేసేదేం లేక పలువురు రైతులు దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. 95వేల ఎకరాల్లో సాగు ఈ ఏడాది యాసంగిలో జిల్లా రైతులు సుమారు 95వేల ఎకరాలలో వరి సాగు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 168 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా 83,650 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెబుతున్నా.. ఎక్కడా గింజ కూడా కొనుగోలు చేసిన దాఖలు లేవు. అయితే, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు మిల్లుల కేటాయింపు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. కాగా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చాక కూడా మీనమేషాలు లెక్కించడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొడ్డురకమే ఎక్కువ... జిల్లాలో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు దొడ్డు రకాలే సాగు చేశారు. గత యాసంగి సీజన్లో సన్నరకం సాగు చేస్తే దిగుబడులు రాకపోగా.. ప్రభుత్వం ఇస్తామని రూ.500 బోనస్ కూడా చెల్లించలేదు. దీంతో రైతులు దొడ్డు రకాలకే మొగ్గుచూపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఫలితంగా చాలా కేంద్రాలు నిండిపోయాయి. మిగతా కోతలు కూడా పూర్తయి రైతులు ధాన్యం తీసుకొస్తే కుప్ప పోసే పరిస్థితులు కూడా లేవు. వాతావరణ మార్పులతో ఆందోళన ఇటీవల జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగలంతా తీవ్రమైన ఎండ ఉంటున్నా సాయంత్రం మబ్బు చేసి అక్కడకక్కడా జల్లులు పడుతున్నాయి. దీంతో కేంద్రాల్లో పగలంతా ధాన్యం ఆరబోస్తున్న రైతులు, సాయంత్రకల్లా కుప్ప చేసి టార్పాలిన్లు కప్పి కాపలా కాయాల్సి వస్తోంది. మధ్యాహ్నం గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ధాన్యంలో సరిపడా తేమ వచ్చినందున అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
● కట్టను కోసేస్తున్నారు..
సీతారామ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదీ తీరం నుంచి జిల్లా సరిహద్దు వరకు 104 కి.మీ మేరకు ట్రంక్ కెనాల్ నిర్మించారు. ఈ కాల్వ నిర్మాణ సమయంలో తవ్విన మట్టిని ఇరువైపులా పోశారు. బయటి నుంచి వచ్చే ప్రవాహం కాల్వలోకి వెళ్లకుండా ఈ మట్టి కట్టలు సహజ రక్షణ కవచాలుగా నిలుస్తాయి. కానీ అక్రమార్కులు ఈ మట్టి కట్టలపై కన్నేశారు. అశ్వాపురం మండలం మొదలు జూలూరుపాడు మండలం వరకు ఇరువైపులా అన్ని మండలాల్లో సీతారామ కెనాల్ మట్టిని ఇష్టారీతిగా తవ్వి తరలిస్తున్నారు. వాస్తవానికి సాగునీటి కాల్వ వెంట అవసరానికి మించి మట్టి పోగై ఉంటుంది. ఈ మట్టి కావాలనుకునే వారు ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతి తీసుకుంటే ఎంత మేర తీయొచ్చో నిర్ధారిస్తారు. కానీ అలాంటివేవీ జరగడం లేదు. ఫలితంగా భవిష్యత్లో సీతారామ ట్రంక్ కెనాల్తో పాటు చుట్టూ పంట భూముల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కిన్నెరసాని వాగులో ఇసుక తవ్విస్తున్న అక్రమార్కులు -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
బూర్గంపాడు: లారీ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని పోల వరం వద్ద చోటుచేసుకుంది. పోలీసు లు కథనం మేరకు.. ఏన్కూరు మండలానికి చెందిన మాలోత్ వెంగళరా వు (51) కొత్తగూడెంలో నివాసం ఉంటూ భద్రాచలం ఆర్టీసీడిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో పోలవరం వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను భద్రాచలం తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతుడి కుమారుడు బలరాం ఫిర్యా దు మేరకు ఎస్ఐ దేవ్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్కు గాయాలు దుమ్ముగూడెం: మండలంలోని పెద్ద నల్లబెల్లిలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉప్పు మహర్షి విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యాడు. గ్రామంలోని ఓ మిల్లు దగ్గర విద్యుత్ సమస్య రావడంతో మంగళవారం ఆయన ఎల్సీ తీసుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా సరఫరా వచ్చిందని సమాచారం. దీంతో ఆయన షాక్కు గురై గాయపడగా 108 వాహనంలో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కిలో గంజాయి స్వాధీనంభద్రాచలంటౌన్: పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద మంగళవారంఎకై ్స జ్ అధికారులు నిర్వహించిన తనిఖీ ల్లో కిలో ఎండుగంజాయి పట్టుబడింది. ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ చావా శ్రీహరిరావు బృందం వాహనాలను తనిఖీచేస్తుండగా.. టీజీ28ఏ 6621 నంబర్గల ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు కిలో గంజాయి తరలి స్తూ పట్టుబడ్డారు. వారిని అన్నపురెడ్డిపల్లి మండలం రాజపురానికి చెందిన అరవింద్కుమార్, హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన నక్క వాసుగా గుర్తించారు. వీరు ఒడిశాలోని కలిమెల నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి, బైక్, రెండు సెల్ఫోన్లను సీజ్ చేసి, నిందితులను భద్రాచ లం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించామని, గంజాయి విలువ రూ.1.38 లక్షలు ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు. తనిఖీల్లో ఖలీల్ అహ్మద్, రమేశ్బాబు, వీర బాబు తదితరులు పాల్గొన్నారు. -
పాతికేళ్ల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి!
మధిర: కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, మనసు ఎప్పుడూ ఇంటి దారి మర్చిపోదని మరోసారి రుజువైంది. చిన్నపాటి మనస్పర్దలతో 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన మధిర మండలం ఖమ్మంపాడుకు చెందిన షేక్ అక్బర్ 25 ఏళ్ల అనంతరం 38 ఏళ్ల వయస్సు వచ్చాక మంగళవారం సొంతగూటికి చేరుకున్నాడు. అంతేకాక భార్యాపిల్లలతో రావడం ఆయన కుటుంబంలో సంతోషాన్ని నింపింది. అప్పట్లో రైలులో పుణె వెళ్లిపోయిన అక్బర్ అక్కడే జీవనం సాగించాడు. ఈ మేరకు ఫేస్బుక్ ద్వారా కుటుంబాన్ని గుర్తించిన ఆయనకు కుటుంబీకులు, స్వగ్రామంపై మమకారాన్ని పెంచింది. దీంతో భార్యాపిల్లలతో వచ్చిన అక్బర్ను కుటుంబీకులు స్వాగతించి సంతోషంలో మునిగిపోయారు. అయితే, తన కోసం ఎదురుచూస్తూ తల్లి కన్ను మూసిందని తెలియగా.. ఒక్కసారైనా తల్లిని చూపించాలని అక్బర్ కోరడం అందరినీ కంటతడి పెట్టించింది. కుటుంబంపై ఇష్టాన్ని పెంచిన ‘ఫేస్బుక్’ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
రఘునాథపాలెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో జయనగర్కాలనీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన పందుల ఫణీంద్రకుమార్ (18), రాగం లోకేశ్ (16) మంగళవారం మధ్యాహ్నం బైక్పై పాండురంగాపురం వెళ్లి తిరిగి వస్తున్నారు. జయనగర్కాలనీ బోర్డు సమీపంలో ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో లోకేశ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, ఫణీంద్రకుమార్ను ఆస్పత్రికి తరలించాక మృతి చెందాడు. వీరిలో ఫణీంద్ర డిగ్రీ, లోకేశ్ ఇంటర్ చదువుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే తమ కుమారులు మృతి చెందారనే సమాచారం తెలియడంలో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, లోకేశ్ తండ్రి రామనాథం ట్రాక్టర్డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. -
రేషన్ దుకాణాల్లో తనిఖీలు
పాల్వంచ: పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా షాపులను పరిశీలించి, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పారదర్శక పంపిణీకి కావాల్సిన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం రేషన్ డీలర్షిప్ ఆథరైజేషన్, స్టాక్ పొజిషన్, పంపిణీకి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని, లబ్ధిదారులకు బియ్యం సకాలంలో అందేలా చూసుకోవాలని చెప్పారు. -
గిరిజనులు ఆయిల్పామ్ సాగు చేయాలి
అశ్వారావుపేటరూరల్: ఆర్థికంగా వెనుకబడి ఉన్న గిరిజనులంతా ఆయిల్పామ్ తోటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మొద్దులమడ గ్రామంలో ఆయన పర్యటించారు. 26 ఏళ్ల క్రితం నిర్మించిన సాగునీటి చెరువును ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సందర్శించారు. ఆయకట్టు గిరిజన రైతులతో మాట్లాడు. దాదాపు 400 ఎకరాల్లో జామాయిల్ సాగు చేస్తున్నారని తెలుసుకుని, వాటిని తొలగించి ఆయిల్పామ్ తోట లను సాగు చేయాలని సూచించారు. ఇందుకోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఐటీడీఏ పీఓ రాహుల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్బాబు, బిర్రం వెంకటేశ్వరరావు, చిప్పల బాబు తదితరులు పాల్గొన్నారు. జీపీఎస్ పాఠశాలను సందర్శించిన పీఓపీఓ మొద్దులమడ గ్రామంలో కొండరెడ్డి సర్పంచ్ వివాహ రిసెప్షన్కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మండలంలోని కోయ రంగాపురం జీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్సీఆర్పీ రాజా బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
ట్రామా కేర్..
అందుబాటులోకి వైద్య సేవలపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భరోసా కల్పించే పరిస్థితి లేదు. మెరుగైన, అధునాత వైద్యం కోసం ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అక్కడికి తరలించేలోగా విలువైన సమయం వృథా అవుతోంది. ఫలితంగా క్షతగాత్రులు, గుండెపోటు బాధితుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే, త్వరలో ఈ తరహా సమస్యలకు జిల్లాలోనే పరిష్కారం లభించనుంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం2023లో మంజూరు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇన్సియేషన్ (టెరి) పేరుతో సరికొత్త కార్యక్రమం అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రులు, జాతీయ రహదారులపై ప్రతీ 40 కి.మీ లకు ఒకటి వంతున అత్యవసర వైద్యసేవల విభా గాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వాస్పత్రులను ఎంపిక చేసింది. ఇందులో జిల్లా ఆస్పత్రులు 21, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు 17, ఏరియా ఆస్పత్రులు 16 వరకు ఉన్నాయి. అయితే, కొత్తగూడెం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్లడంతోపాటు బోధనా ఆస్పత్రి కూడా ఉంది. దీంతో ఇక్కడ 50 పడకల సామర్థ్యంతో అత్యవసర సేవలు (ట్రామా కేర్) అందించే ఆస్పత్రి 2023లో మంజూరైంది. రామవరంలో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యంతో 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో ఏరియా ఆస్పత్రి నిర్మించారు. మెడికల్ కాలేజీ వచ్చాక పడకల సామర్థ్యం 230కి పెరిగింది. రామవరంలో సువిశాలమైన క్యాంపస్లో ఉన్న మాతా శిశు ఆస్పత్రిని సైతం మెడికల్ కాలేజీ అనుబంధంగా మార్చారు. వైద్య కళాశాలకు అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న సర్వజన ఆస్పత్రి ప్రాంగణం ఇప్పటికే ఇరుకుగా మారింది. దీంతో ట్రామా కేర్ సెంటర్ను రామవరంలో ఉన్న మాతాశిశు ఆస్పత్రి ప్రాంగణంలో స్థలం కేటాయించారు. దాదాపుగా రెండేళ్లుగా భవన నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. సివిల్ వర్క్స్ పూర్తికాగా, మెడికల్ ఎక్వీప్మెంట్ను అమర్చాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసి ట్రామా కేర్ సేవలు అందుబాటులోకి తేవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అత్యవసర వైద్య సేవలను రెండు రకాలుగా విభజించారు. మొదటిదైన ప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాదాల్లో గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తీసుకువచ్చేలోగా అవసరమైన పరీక్షలు, వైద్య సాయం అందిస్తారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న 108 అంబులెన్సులను అప్గ్రేడ్ చేయడంతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సదరు టెక్నీషియన్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వివరాలను 108లో ఉన్న పరికరాల ద్వారా ఆన్లైన్లో వైద్యులకు చేరవేస్తారు. తద్వారా అంబులెన్స్ ఆస్పత్రికి వచ్చేలోగా సదరు గాయపడిన వ్యక్తికి అవసరమైన వైద్య పరీక్షలు దానికి అవసరమైన పరికరాలతో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా సిద్ధం చేస్తారు. రెండోదైన ఎమర్జెన్సీ విభాగంలో ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్రే, సెక్షన్ ఆపరేటర్లు, డిఫిబ్రిలేటర్లు, సీ ఆర్క్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్లు సమకూర్చుతారు. గుండె, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, మాతాశిశు తదితర విభాగాల్లో అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా పారామెడికల్, నర్సింగ్, స్పెషలిస్టు వైద్యులను కేటాయిస్తారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
పాల్వంచరూరల్ : మార్చి 14 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం ముగియగా, జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. చివరి రోజు పరీక్షకు 12,728 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 12,699 మంది విద్యార్థులు హాజరయ్యారు. 29 మంది గైర్హాజరైనట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. చివరి రోజు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అంకిత్, డీఈఓ తదితరులు తనిఖీ చేశారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, గురుకులాలను ఖాళీ చేసి విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ పాల్వంచ: పట్టణంలోని బొల్లేరుగూడెం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల పదో పరీక్ష కేంద్రంలో సోమవారం కలెక్టర్ అంకిత్ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. తాగునీటి సదుపాయం, విద్యుత్, ఫ్యాన్లు, శుభ్రత వంటి మౌలిక వసతులపై ఆరా తీశారు. విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బందితో మాట్లాడారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు మంగమ్మ, సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పీఆర్టీయూ నిరసన దీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయు ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన దీక్షను సోమవారం బస్టాండ్ సెంటర్లో ప్రారంభించారు. జిల్లా అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బి.రవిలకు పూలదండలు వేసి నిరసన దీక్షలను ప్రారంభించారు. 51 శాతం పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని, రిటైర్మెంట్ బకాయిలను చెల్లించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్లతో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు నాయకులు పాల్గొన్నారు. -
తక్షణ చర్యలు చేపట్టాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, గృహనిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరి ష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమస్యలపై చర్చించి, పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని, ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● రేషన్ కోసం ప్రతి నెలా 4.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని, తమ గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని టేకులపల్లి మండలం కొత్త తండా గ్రామ పంచాయతీకి చెందిన ప్రజలు విన్నవించారు. ● సర్వే నంబర్ 817/36లో భూమి ఉండగా, భూభారతి ఆన్లైన్లో నిషేధిత భూమిగా చూపిస్తున్నారని పాల్వంచ గాంధీనగర్కు చెందిన మంగళగిరి నాగమ్మ ఫిర్యాదు చేసింది. ● త్రిచక్రవాహనం మంజూరు చేయాలని భద్రాచలం రాజుపేటకు చెందిన, 80 శాతం దివ్యాంగునిగా ఉన్న శివకుమార్ వినతిపత్రం ఇచ్చాడు. ● 70 శాతం అంగవైక్యలం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఉన్నా దివ్యాంగుల పింఛన్ మంజూరుల చేయాలని ఇల్లెందు ఎల్బీఎస్ నగర్కు చెందిన తాటి లాలయ్య విన్నవించాడు. ● కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎస్టీ కుల ధ్రువీకరణ పొందుతున్నారని, దీనివల్ల నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని చర్ల మండలం ఆనంద కాలనీకి చెందిన ప్రజలు విన్నవించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పథకాలు గిరిజనుల చెంతకు చేరాలిఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజ నుల చెంతకు చేరేలా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజ నుల నుంచి దరఖాస్తుల ను స్వీకరించి మాట్లాడారు. దర్బార్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి, పరిష్కారమయ్యేవరకు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యకరమంలో అధికారులు అశోక్, సైదులు, రాంబా బు, వేణు,లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, ఆది నారాయణ, అనసూయ, నారాయణరావు, హేమంత్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళ, బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఖమ్మంలో జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం ముదిగొండ మండలంలో రహదారుల నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక బుధవారం ఉదయం పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి భట్టి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో కూడా సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. ఆపై దమ్మపేట మండలంలోని సోలార్ మోడల్ విలేజ్ గండుగలపల్లిలో 2 కేవీ సోలార్ రూప్టాప్ సిస్టమ్ను డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్/తల్లాడ/కల్లూరు రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9–15గంటలకు కల్లూరు మండలం చెన్నూరులో రూ.250 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత 10గంటలకు తల్లాడ మండలం బాలపేటలో గ్రామపంచాయతీ కార్యాల య భవనం, తల్లాడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ భవనం) ను ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొంటారు. అలాగే, సాయంత్రం ఖమ్మం 59వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి, ఆతర్వాత స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం వెళ్తారు. -
అంతర్ధానం
ఎంతో వేదనతో కొన్నేళ్లపాటు శ్రీరామనవమి వేడుకలు.. ఆ తర్వాత మిథిలా స్టేడియానికి మార్చినా.. భక్తుల రద్దీ, వర్షాల వేళ నిత్యకల్యాణం, హోలీ రోజు పసుపు కొట్టి రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం, రామదాసు జయంతికి సంగీతోత్సవాలు పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యుల సంస్కృత పాఠాలు.. ఆలయ హుండీ లెక్కింపు, ఆదాయ గణనా.. నవమి, ముక్కోటికి లడ్డూల తయారీ.. సత్యనారాయణ స్వామి వ్రతాలు.. ఇలా అన్నీ నా ఒడిలోనే 45 ఏళ్లుగా రామయ్య ఉత్సవాల్లో సేవలు అందించాను. ఉత్తర మెట్లు తొలగించాక భక్తులకు మార్గంగా, వీవీఐపీలు, వీఐపీల దర్శనానికి స్వాగత ద్వారంలా నిలిచాను. ఇంకా ఏళ్లపాటు సేవలు అందించాలని ఉన్నా.. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా.. రాములోరి ఆలయ ఆధునికీకరణ పనుల్లో నా అంతర్ధానం.. ఎంతో వేదనకు గురిచేస్తోంది. రామయ్య ఆలయం మరింత అందంగా ముస్తాబవుతుందంటే.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయంటే.. నేనెలా అడ్డుగా ఉండగలను. అందుకే తొలగిపోతున్నా.. అయినా ఎక్కడికెళ్తాను లెండీ.. మీ మదిలో చిరకాల జ్ఞాపకంగా నిలిచే ఉంటా. భక్తిప్రపత్తులతో చిత్రకూట మండపంచిత్రకూట మండపం -
ఐదు గ్రామాలు వచ్చేవరకు పోరు
భద్రాచలంటౌన్: ఏపీలో విలీనంచేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో (భద్రాచలంలో) కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ‘భద్రాద్రి పునరేకీకరణ’ సభ నిర్వహించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించి మాట్లాడారు. భద్రాద్రి ప్రాంత ఆడబిడ్డగా ఈ నేల, హక్కుల కోసం పోరాడతానని అన్నారు. ఇది భద్రాద్రి రామయ్య ఆదాయంతో ముడిపడి ఉన్న సున్నితమైన సమస్య అని పేర్కొన్నారు. సమస్యను గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించానని, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పా రు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే పాదయాత్ర నిర్వహిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని, కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతి పాదనలు పంపడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భౌగోళిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య మా ట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం ఐదు గ్రామ పంచాయతీలనైనా తిరిగి తెలంగాణలో విలీనం చేసేలా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఏడు మండలాలను అశాసీ్త్రయంగా ఆంధ్రప్రదేశ్లో కలపడంతో స్థానిక ప్రజలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాంకేతికంగా ఆ ఐదు గ్రామాలు ఏపీలో ఉన్నా, అక్కడి ప్రజల మనసంతా భద్రాచలం రామయ్య పాదాల చెంతనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లాలన్నా 9 కిలోమీటర్ల మేర ఆంధ్రా ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఆ ఐదు గ్రామాలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఏలూరి శ్రీనివాసరావు, చాడా రవికుమార్, ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాస్, కన్వీనర్ కొని దెల శ్రీనివాస్, భద్రాద్రి జిల్లా జేఏసీ చైర్మన్ అమర్నేని రామారావు, చైతన్య భార్గవ్, వీరబాబు, డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి -
చిత్రకూట మండపం తొలగింపు..
భద్రాచలం: చిత్రకూట మండపాన్ని శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో 45 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ జూలై 15, 1967లో శంకుస్థాపన చేయగా, 1982లో ఏప్రిల్ 4న నాటి దేవాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆలయంలో జరిగే పలు ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వం రామాలయ ఆధునికీకరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని పూర్తిగా తొలగించనుంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత ఇక కనిపించదు. రూ.21వేలకు చేరిన మిర్చి ధర ఖమ్మంవ్యవసాయం: ‘తేజా’ రకం మిర్చి ధర దూసుకెళ్తోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారం క్వింటా ధర రూ.20,100 పలకగా, సోమవారం రూ.21వేలకు చేరింది. అలాగే, కోల్డ్ స్టోరేజీలో నిల్వ మిర్చి ధర రూ.20,500 నుంచి రూ.21,800కు పెరగడం విశేషం. ఏప్రిల్ ఆరంభంలో రూ.19,450 పలికిన ధర 13 రోజుల వ్యవధిలో రూ.1,550 పెరిగింది. పంట సాగుతో పాటు దిగుబడులు తగ్గడంతో దేశీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరగగా ధర పెరుగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు కూడా అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. -
ఐటీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్పీడీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్రెడ్డి అన్నారు. సారపాక ఐటీసీ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు 19వ రోజుకు చేరాయి. సోమవా రం ఆయన దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు తగదని అన్నారు. వారికి న్యాయం జరిగేంతవరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పురుషోత్తం యాదవ్, బీఆర్టీయూజిల్లా అధ్యక్షుడు సాని కొమ్ము శంకర్రెడ్డి, జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి, సర్వేశ్వరరావు, మర్రి వెంకటరెడ్డి, కొనకంచి శ్రీనివాస్, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్రెడ్డి -
రేషన్ బియ్యం సీజ్
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలకలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశా రు. సోమవారం తనిఖీలు చేపట్టిన అధికారులు శ్రీనివాస మో డ్రన్ రైస్ మిల్ వద్ద సుమారు 607 ప్లాస్టిక్ బస్తాలలో నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు డీటీసీఎస్ అధికారులు పాల్గొన్నారు. బొగ్గు టిప్పర్ దగ్ధంమణుగూరుటౌన్: ిసంగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(కేసీహెచ్పీ) వద్ద షార్ట్ సర్క్యూట్తో బొగ్గు టిప్పర్ సోమవారం దగ్ధమైంది. పట్టణంలోని శేషగిరినగర్కి చెందిన కుమార్ టిప్పర్కు డీజిల్ పైప్ లీకేజీ ఉన్నట్లు సమాచారం. కాగా రోజూ మాదిరిగానే బొగ్గు లోడింగ్ కోసం రాగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓవర్ హీట్ కారణంగా టిప్పర్లో మంటలు చెలరేగి ఎగసిపడ్డాయి. దీంతో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. కాగా, ప్రమాద సమయంలో టిప్పర్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మహిళ ఆత్మహత్యసుజాతనగర్: అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సుజాతనగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై రమాదేవి కథనం ప్రకారం... మండలంలోని లెనిన్నగర్కు చెందిన తమ్మిశెట్టి నాగమణి (48) తన చెల్లెలుకు ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వాలని అడుగగా, చెల్లెలు పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అక్క నాగమణి ఈ నెల 8న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా బిల్లు పేరుతో మోసం
మణుగూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ద సంస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుందని, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎన్నికల కమిషన్(ఈసీ) పూర్తిగాకేంద్రానికి దాసోహం అయి నట్లు కనిపిస్తోందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆరోపించారు. మణుగూరులో సోమ వారం ఆమె పర్యటించగా, కాంగ్రెస్ నాయకుడు గురిజాల గోపి, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ట్రాక్టర్ నడిపిన ఆమె అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ నేపథ్యా న హడావుడి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. గ్యాస్ధరల పెంపు, కొరతపై మహిళలు తిరగబడతారనే భయంతోనే ఈ కొత్త నాటకానికి తెర తీశారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించి వారి రాజకీయ జీవితాలను మార్చిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్గాంధీకే దక్కుతుందని ఆమె తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న దిగుబడి ఆశాజనకంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న కాంగ్రెస్ బలోపేతానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషిచేయాలని ఆమె పిలుపునిచా రు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి -
దళితులపై కొనసాగుతున్న వివక్ష..
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలకు సంక్షేమ పథకాల అమలులో వివక్ష కనబరుస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను కేవలం బడ్జెట్లో కేటాయిస్తున్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని తెలిపారు. డీహెచ్పీఎస్ జిల్లా మహాసభ సోమవారం ఖమ్మంలో నిర్వహించగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితుల కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పడుతుండడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోతున్నారని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లోనూ 20 శాతం ఉన్న దళితులకు 16 శాతమే కేటాయింపులు చేశారని, అలాకాకుండా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, డీహెచ్పీఎస్ నాయకులు యంగల ఆనందరావు, పగిడిపల్లి ఏసు, తడికమళ్ల ఏబు, తోటపల్లి సీతారాములు, మామిడాల కిరణ్, యామాల గోపాల్రావు, సృజన, వరదా నర్సింహారావు, నారపోగు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక.. డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పగిడిపల్లి ఏసు, యంగల ఆనందరావును మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 31 మంది కౌన్సిల్ సభ్యులు, 18మంది కార్యవర్గ సభ్యులతో పాటు 11మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా తడికమళ్ల ఏబు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, సీతారాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా యామాల గోపాలరావు, కోశాధికారిగా సృజన ఎన్నికయ్యారు.డీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం -
రైతు ఇంట్లో నెమలి స్వాధీనం
ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలంలోని తీర్థాలలోని ఓ రైతు ఇంట్లో నెమలి ఉందన్న సమాచారంతో అటవీ శాఖాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతు మాలోత్ కిషన్ మొక్కజొన్న చేనులో ఇటీవల గాయాలతో పడి ఉన్న నెమలిని తీసుకొచ్చి ఇంట్లో సపర్యలు చేయడమే కాక బోనులో పెట్టి మేత వేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కూసుమంచి డిప్యూటీ రేంజర్ కేవీ.రామారావు గ్రామానికి వెళ్లి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
స్నేహితుడి కుమార్తెకు అండగా పూర్వ విద్యార్థులు
తిరుమలాయపాలెం: కలిసి చదువుకున్న వారిలో ఎవరైనా విధి వక్రీకరించి ప్రాణాలు కోల్పోతే వారి పిల్లల చదువులకు గాను పూర్వ విద్యార్థులు అండగా నిలుస్తున్నారు. మండలంలోని పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994–95 బ్యాచ్ విద్యార్థులు 2009లో కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ బ్యాచ్కు చెందిన ఐతనబోయిన రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుమార్తె మైత్రి పేరిట రూ.26వేల ఫిక్స్్డ్ డిపాజిట్ బాండ్ను సోమవారం అందజేశారు. గతంలో రూ.1.50లక్షలతో పాఠశాలలో వేదిక నిర్మించగా, 2019లో పెరుగు ఉపేందర్ కుమార్తె పేరిట రూ. 42 వేల ఫిక్స్డ్ డిపాజిట్ అందించారు. ఈ కార్యక్రమంలో మీగడ సైదులు, మేకల సత్యనారాయణ, మడికంటి స్కైలాబ్, రామనబోయిన వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, భాషబోయిన వీరభద్రం పాల్గొన్నారు. -
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి
సీఐటీయూ అధ్యక్షుడు మందా నర్సింహారావు రుద్రంపూర్: సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, రూ.51వేల కోట్ల బకాయి ప్రభుత్వం చెల్లించాలని సీఐటీయూ అధ్యక్షుడు మందా నర్సింహారావు అన్నారు. సోమవారం కార్పొరేట్ పరిధిలోని సెంట్రల్ వర్క్షాపులో జరిగిన పిట్ సమావేశంలో మాట్లాడారు. సింగరేణి పరిరక్షణ కోసం ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సౌధ, సెక్రటరియేట్లను ముట్టడించనున్నట్లు తెలిపారు. ఓపెన్కాస్ట్లలో బొగ్గు తీసే పనులను సింగరేణి కార్మికులతోనే చేయించా లని కోరారు. అనంతరం పలువురు కార్మికులు సీఐటీయూలో చేరగా, కండువాలు కప్పి ఆహ్వా నించారు. కార్యక్రమంలో రాష్ట కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, విజయగిరి శ్రీని వాస్, గాజుల అప్పారావు, రమేష్ పాల్గొన్నారు. పరికరాల పేరిట రూ.60వేలు స్వాహా ఖమ్మం అర్బన్: ఖమ్మంకు చెందిన ఓ మహిళా వైద్యురాలు సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.60 వేలు కోల్పోయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్న ఆమె అవసరమైన పరికరాల కోసం ఇన్స్ట్రాగామ్లో వెతుకుతోంది. ఈ నేపథ్యాన ఒక యాప్ ద్వారా ఆర్డర్ చేసి రూ.60వేలు చెల్లించినా పరికరాలు అందకపోవడం.. యాప్ బాధ్యులను సంప్రదించే ప్రయత్నాలు విఫలం కావడంతో మోసపోయినట్లు గుర్తించారు. ఈమేరకు బాధితురాలు ఫిబ్రవరిలోనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయగా, సోమవారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఆన్లైన్లో కొనుగోళ్లు చేసే సమయాన అపరిచిత వెబ్సైట్లు, యాప్లతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. ఖమ్మం ట్రాన్స్కో కార్యాలయం వద్ద శిబిరాన్ని వివిధ సంఘాల నాయకులు మందపాటి సత్యనారాయణరెడ్డి, సీతారాంగోపాల్, ఆర్.సత్యనారాయణ, నాగేం ద్రకుమార్, టి.శేషగిరిరావు, వెంకటరమణా రెడ్డి, సురేష్, శ్రీనివాస్, రమేష్, నాగేశ్వరరావు, ఎం.ప్రసాద్, కోక్యానాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీ నర్ అన్వర్ పాషా ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మెలో సురేందర్రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, దాసు, రామ్మోహన్, అజారుద్దీన్, నరసింహారావు, వెంకటరెడ్డి, మంగ్యానాయక్, సైదులు, నరేష్, నాగరాజు, మోబిన్, రమాదేవి, నాగలక్ష్మి, సంధ్యారాణి, నస్రీన్, రవి, భద్రు, అనంతయ్య, సురేష్, జానీ పాల్గొన్నారు. ● ఖమ్మం మామిళ్లగూడెం: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సమ్మె శిబిరాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి కామేపల్లి: మండలంలోని బర్లగూడెం శివారు పొలంలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డోర్నకల్కు చెందిన ఏడుగురిలో నలుగురు పట్టుబడగా, ముగ్గురు పరారయ్యారని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.10,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు దడువాయిలపై వేటు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు నష్టం జరిగేలా వ్యవహరించిన ముగ్గురు దడువాయిలను సస్పెండ్ చేస్తూ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం మార్కెట్తో పాటు కోల్డ్స్టోరేజీల్లో పంటలను కాంటా వేసే క్రమాన కమీషన్ వ్యాపారులు, ఖరీదుదారులతో కుమ్మకై ్కన కొందరు దడువాయిలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పత్తి, మిర్చి బస్తాకు 5 – 10 కిలోల మేర తూకం ఎక్కువగా వేస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమాన కొందరు దడువాయిలు, వ్యాపారులు కుమ్మకై ్క కొన్నాళ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో ముత్తబోయిన లక్ష్మీనారాయణ, చిన్నం నర్సయ్య, పిల్లలమర్రి బాబు 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘అరైవ్–అలైవ్’ వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాపాలన ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 వరకు నిర్వహించే అరైవ్–అలైవ్ కార్యక్రమం సోమవా రం ప్రారంభమైంది. ఈ సంరర్భంగా కలెక్టర్ అంకిత్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడా రు. రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. మాన వ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ విని యోగం, అధిక వేగంతో వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండడం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధి కారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘సెన్సస్’ గడువులోగా పూర్తి చేయాలిసెన్సస్కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్–2027 ఏర్పాట్లపై డీసీఓ భారతి హోళీకేరి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో సెన్సస్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘ముఖం’ గుర్తించట్లే..!
● ఉపాధి కూలీలు, సిబ్బందిని సతాయిస్తున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టం ● సిగ్నల్, సర్వర్ డౌన్ సమస్యలతో హాజరు నమోదులో ఆలస్యం ● ఎండలో పనిచేసినా మస్టర్ పడకపోవడంతో వేతనం కట్ ● జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్ల కొరతఅశ్వారావుపేటరూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ కూలీలకు శాపంగా మారుతోంది. యాప్ ద్వారానే కూలీల హాజరు నమోదు కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్య కారణంగా ఉపాధి పనికి వస్తే ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి యాప్లో ఒక్కో కూలీకి వ్యక్తిగతంగా ఐరిస్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నారు. హాజరు నమోదులో ఆలస్యం కావడం, గంటల కొద్దీ ముఖ హాజరుకే సమయం పట్టడంతో కూలీల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక్కో మేట్కు 40 మంది ఉపాధి హామీ పథకంలో సిబ్బంది కొరత కారణంగా యాప్లో కూలీల హాజరు నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. గతంలో పని ప్రదేశంలో కూలీ లను సమూహంగా ఒక్క ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోయేది. తాజాగా యాప్ విధానం ద్వారా ప్రతి ఒక్క కూలీని విడివిడిగా ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ప్రతి కూలీ ఫేస్ రికగ్నేషన్ కోసం ఫీల్ట్ అసిస్టెంట్లు గంటల కొద్దీ సమయం గడపాల్సి వస్తోంది. యాప్నకు సిగ్నల్ అందకపోయినా, సర్వ ర్ డౌన్ అయినా కూలీల ఫొటోలు అప్లోడ్ కావడంలేదు. దీంతో పని చేసినా వేతనం రావడం లేదు. ఫలితంగా సాంకేతిక సమస్యలు వస్తే కూలీలు ఆ రోజు పని చేయకుండానే వెనుతిరుగుతున్నారు. ఈ సమస్య కారణంగా జిల్లాలో రోజూ 400 నుంచి 500 మంది కూలీలు పనులకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత నేపథ్యంలో గతంలో ఉన్న మేట్ వ్యవస్థను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. అశ్వారావుపేట మండలలాన్ని పరి శీలిస్తే 27 గ్రామ పంచాయతీలకు కేవలం 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో మేట్లతో కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న మేట్లను గుర్తించి యాప్పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఒక్కో మేట్కు 40 మంది కూలీలను కేటాయించి, వారితో హాజరు నమోదు చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థలు యాప్లోఫొటోలు అప్లోడ్, కూలీల హాజరు నమో దు ప్రక్రియ పట్టణ సమీప ప్రాంతాల్లో సాఫీగానే సాగుతుండగా, మారుమూల ప్రాంతాల్లో అవస్థలు తప్పడం లేదు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల్లో సిగ్నల్ సమస్య సతాయిస్తోంది. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడెం, నందిపాడు, కుడుములపాడు, కొత్త కావడిగుండ్ల, కంట్లం, మొద్దులమడ, దిబ్బగూడెం(దురదపాడు), గాడ్రాలతోపాటు మరికొన్ని గిరిజన గ్రామాల్లో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామపంచాయతీల సంఖ్య: 481యాక్టివ్ కూలీల సంఖ్య : 2,02,000 జాబ్ కార్డుల సంఖ్య: 1,23,000జిల్లాలో ఎన్ఎస్ఎస్ఎం విధా నం 85శాతం మేర అమలు అవుతోంది. వంద శాతం అమలుకు కృషి చేస్తున్నాం. సాంకేతిక, సిగ్నల్, ఎర్రర్ సమస్యలు వచ్చే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. సిగ్నల్ లేని ప్రాంతాల్లో యాప్ ద్వారా హాజరు లేకుండా, నో లొకేషన్ ఏరియా ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా కొన్ని ప్రాంతాల్లో కొంతమేర సమస్య ఉన్న మాట వాస్తవమే. – నల్లబోతుల రవి, డీఆర్డీఏఏపీడీ -
కలెక్టరేట్లో అధికారుల నిర్లక్ష్యం
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్ అధికారుల నిర్లక్ష్యంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పౌర సౌకర్యాల నిర్వహణ అధ్వానంగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలాలు, గ్రామాలకు వెళ్లినప్పుడు ఉన్నతా ధికారులంతా పరిశుభ్రత, ఆరోగ్యం సలహాలు, సూచనలు చేస్తుంటారు. కానీ, వారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్లో మాత్రం మరుగుదొడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో ఉన్న మరుగుదొడ్లలో వాష్ బేసిన్లు, మూత్ర విసర్జన బేసిన్లకు పైపులు లేవు. ప్రజావాణి కార్యక్రమంతో పాటు వివిధ సమస్యలపై ప్రజలు నిత్యం కలెక్టరేట్కు వచ్చిపోయే ప్రజలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదు. కదలని బ్యాటరీ వాహనం కలెక్టరేట్ గేట్ నుంచి కార్యాలయం వరకు వృద్ధులు, దివ్యాంగులను తరలించేందుకు బ్యాటరీ వాహ నం ఏర్పాటు చేశారు. సోమవారం ఆ వాహనం నడపకపోవడంతో ప్రజావాణికి హాజరైన పలువురు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో కలెక్టరేట్ సిబ్బందికి ఈ వాహనం వినియోగించుకుంటున్నారు. కానీ అవసరార్థులకు ఉపయోగించడంలేదు. దీంతో వాహన ఏర్పాటు లక్ష్యం నెరవేరడంలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పౌర సౌకర్యాల నిర్వహణ మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు. -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నదీ హారతిభద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి తీరం ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పురోహితుడు రవికుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజ లు నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన గావించారు. భక్తి శ్రద్ధలత నదీ హారతి సమర్పించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సేవా లక్ష్మీనారాయణ దంపతులు, వారణాసి, కాశీ ప్రాంతాలకు చెందిన రిషికేశ్–సరిత, రాజేష్–అనామిక, అంజుకుమారి కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్స్ అసోసియేషన్ వారు పూజా సామగ్రిని సమకూర్చారు. రామయ్యకు స్వర్ణ పుష్పార్చనభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
ఇద్దరికి రాష్ట్రస్థాయి ర్యాంకులు
పాల్వంచరూరల్: జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. పాల్వంచ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ హెచ్ఈసీ గ్రూప్ చదివిన ఎన్.మణి సంపన్న 1000 మార్కులకు గాను 985 మార్కులను సాధించింది. రాష్ట్రస్థాయి ఇదే గ్రూప్నకు చెందిన జి.కీర్తి 1000 మార్కులకుగాను 923 మార్కులు, ఏఈటీ గ్రూపు విద్యార్థి మడకం చొక్కారావు 922మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినంధించారు. ఫస్టియర్లో మోరంపల్లి బంజర విద్యార్థి బూర్గంపాడు: మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన పేరం మహేందర్రెడ్డి స్టేట్ ర్యాంకు సాధించాడు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్గా నిలిచాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న మహేందర్రెడ్డి స్టేట్ ర్యాంకు సాధించటం పట్ల తల్లిదండ్రులు రామకొండారెడ్డి, రమాదేవి, స్థానికులు అతనిని అభినందించారు. -
గిరిజన గురుకులాల హవా..
భద్రాచలం టౌన్: గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీ డియట్ ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 1,456 మంది పరీక్షలు రాయగా 1,192 మంది ఉత్తీర్ణులై 81.76 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఇందులో బాలికలు 86 శాతం, బాలురు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,370 మందిలో 1,239 మంది ఉత్తీర్ణులు కాగా, 90.44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 91.77 శాతం, బాలురు 88.08 శాతం ఉత్తీర్ణత పొందారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఫస్టియర్లో యుగంధర్ 468, జోషిత్ 467, కృష్ణవేణి 467, కీర్తన, రమ్య 466 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో గణేష్ 991, నితిన్ 980, జస్వంత్ 979, దివ్య 978 మార్కులతో సత్తా చాటారు. -
అటు అప్పులు, ఇటు అనారోగ్యం
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య దమ్మపేట: అనారోగానికి అప్పులు తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన అడపా నరసింహారా వు (38) సొంత భూమితో పాటు మరికొంత కౌలు కు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల్లో సరైన దిగుబడి రాక అప్పుల పాలైన ఆయన పాంక్రియాటైటిస్ వ్యాధితో కొద్దికాలంగా బాధపడుతున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి కారులో అఖినేపల్లి శివారులోని కౌలు పొలానికి వెళ్లి కారులోనే పురుగుల మందు తాగా డు. సాయంత్రం అఖినేపల్లి వాసులు చూడగా నరసింహారావు మృతిచెందాడు. ఆయన భార్య కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. దాడిచేసినవారిపై కేసు పాల్వంచరూరల్: గేదెలను ఫామ్కు తీసుకెళ్తున్న బిహార్కు చెందిన లారీడ్రైవర్పై దాడిచేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కోడిపుంజులవాగు శివారులోని గేదెల ఫామ్కు గేదెలను తీసుకొస్తున్న బిహార్కు చెందిన లారీడ్రైవర్ విక్రమ్కుమార్పై గతరాత్రి అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడిచేసిన భూక్యా మధు, ధరావత్ పవన్, నూనవత్ నిరంజన్, ధరావత్ మహేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.సురేశ్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్పై.. మండలంలోని నాగారం సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం నాగారం సర్పంచ్ స్వప్న భర్త అడ్డుకున్నాడు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఏసు దురుసుగా ప్రవర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షలకు..
ఖమ్మం సహకారనగర్: ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతుండగానే తండ్రి మృతి చెందాడు. అయినా ఆ విద్యార్థిని దుఃఖాన్ని దిగుమింగుకుని పరీక్షలు రాసి సత్తా చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన గుంటి ప్రహర్ష ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె తండ్రి, ఆటోడ్రైవర్ శ్రీను మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందా డు. ప్రహర్షకు కళాశాల యజమాన్యం, అధ్యాపకులు ధైర్యం చెప్పడంతో పరీక్షలు రాసి వేయికి గాను 994 మార్కులు సాధించడం విశేషం. చిరుద్యోగి కుమార్తె వైరా: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చిరుద్యోగి కుమార్తె అత్యధిక మార్కులు సాధించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్ కూతురు సాత్విక వైరాలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమె 991 మార్కులు సాధించగా పలువురు అభినందించారు.994మార్కులు సాధించిన విద్యార్థిని -
ఇంటర్ ఫలితాల్లో ‘నలంద’ విజయభేరి
చుంచుపల్లి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెంలోని నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని సీఈఓ చైతన్య కృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీలో పి.చరణ్ 469 మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానాన నిలవగా ఉజ్వల్ అభినవ్ సాయి 468 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే, హారిక భరణి, పి.హర్షిణి, జెస్సింత రోజ్లు 467, ఎండీ ఆహాద్ఖాన్, ఎన్.నాగ సుజిత్, ఎస్కే సమీరా, గోలి భావన, వి.భావన, ఏ.లలిత ఆదిత్య 466 మార్కులు సాధించగా, ఈ విభాగంలో 30 మంది విద్యార్థులు 460 పైగా మార్కులు సాధించారని సీఈఓ పేర్కొన్నారు. అలాగే, జూనియర్ బైపీసీలో సాధనాల శ్రీలక్ష్మీమౌనిక 436 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని, కె.రేఖశ్రీ 435, ఏ.చరిష్మా, ఎండీ మహీన్తన్విన్ 434, జి.అభినవి, జి.రమేశ్, బండారి శ్రేష్ఠిత మూన్, పి.నవ్య తదితరులు 433 పైగా మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఎంఈసీలో జి.ఊర్మిళ 493 మార్కులతో అగ్రస్థానాన నిలవగా జి.సాయి మిథిల, ఆర్.అక్షయ్ 483, సీఈసీలో ఎస్.కౌశిక్ 489, ఎం.డీ.సనారజాక్ 488, పి.మంజు 483 మార్కులు సాధించారని చెప్పారు. ఇక ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తిమ్మిశెట్టి ప్రవళిక 994 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా, ఇస్లావత్ నాగరాజు 993, పి.పవన్శంకర్, జి.హన్సిక 990, బైపీసీలో డి.వినీల 990, టి.మైత్రి 986, బానోతు రూప, ఎం.సహస్ర 986, ఎంఈసీలో జి.రంగలహరి 976, సీఈసీలో భూక్య కుషిత 964 మార్కులు సాధించారని వెల్లడించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ వెంకటచౌదరి, సీఈఓ చైతన్యకృష్ణ, ప్రిన్సిపాల్ మల్లికార్జునరావు, రమేశ్, అధ్యాపకులు అభినందించారు. -
ఎస్ఎస్సీసీజీఎల్ పరీక్షలో 2,530 ర్యాంక్
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన భీముడి తేజశ్వినిరెడ్డి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (ఎస్ఎస్సీ సీజీఎల్) పరీక్షలో ప్రతిభ కనబరిచి ఆల్ఇండియా స్థాయిలో 2,530వ ర్యాంక్ సాధించింది. దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్గా నియామకం లభించనుంది. భీముడి వెంకట్రెడ్డి, శైలజ కుమార్తె తేజస్వినిరెడ్డి చిన్ననాటి నుంచే లక్ష్యసాధనలో ముందుండి.. ప్రతి దశ లో ప్రతిభ కనబరిచింది. కాగా, తేజస్వినిని గ్రామస్తులు అభినందించారు. -
రేషన్ దుకాణాల్లో సోదాలు
ఇల్లెందు: పట్టణంలో పలు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆకస్మికంగా తనఖీ చేశారు. ఆదివారం నంబర్–2 బస్తీలోని దుకాణాలను తనిఖీ చేసి, అక్కడి స్టాక్ పాయింట్ ఆధారంగా రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం జీసీసీ ఏరియాలోని షాపు, సత్యనారా యణపురంలో పలు గృహాలను తనిఖీ చేసి, పలు చోట్ల ఇళ్లల్లో నిల్వ చేసిన 100 క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్ పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి జీసీసీకి తరలించారు. డీటీలు మహేశ్, ప్రభాకర్, రాజు, రాంబాబు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి..ములకలపల్లి: సేవలు అందించే అన్ని ప్రైవేట్ సంస్థలు, ప్రాక్టీషనర్లు ప్రభుత్వం నిర్ణయించిన బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధన లు, ఔషధ వినియోగ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ స్పష్టం చేశారు. ములకలపల్లిలోని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆదివా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ వ్యర్థాలు నేరుగా జీపీ సిబ్బంది సేకరించే చెత్తతో కలిపి పారవేస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పరిమితికి మించి బెడ్లు, స్టాండ్ల ఏర్పాటు, అధిక యాంటిబయాటిక్స్ వాడుతున్న ట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ (సీహెచ్ఐ) సి.ప్రతాప్, డీపీఎంఓ ప్రతాప్ పాల్గొన్నారు. సింగరేణి సొత్తు చోరీ పట్టుకున్న సెక్యూరిటీ అధికారులు మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓ కాంట్రాక్ట్ టెండర్ వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న సింగరేణి సొత్తును సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇటీవల టెండర్ దక్కించుకుని ఓసీ–2లో ఓ అధికారి కింద నడుస్తున్న బొలెరో వాహనంలో డ్రైవర్ సుమారు 220 కేజీల ఐరన్ను వెనుక సీట్ల కింద ఉంచి తరలిస్తుండటంతో శబ్దం పెద్దఎత్తున వచ్చింది. దీంతో ఆ అధికారికి అనుమానం వచ్చి తిరిగి వాహనాన్ని క్వారీ వైపు మల్లించి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్లు తెలిసింది. కాగా ఆదివా రం సాయంత్రం సెక్యూరిటీ అధికారులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపినట్లు తెలిసింది. అయితే ఆ వాహనం ఓసీ–2లోని ఉద్యోగి.. వాహనానికి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్కు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 5వ తేదీన తిరుపతి వెళ్లి.. 9వ తేదీన భద్రాచలంలో రాములోరిని దర్శించుకుని, కూనవరం రోడ్డు వైపు వెళ్లి తప్పుపోయాడు. కుటుంబ సభ్యులు కూనవరం, చింతూరు పరిసర ప్రాంతాలలో వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. లక్ష్మణ్ కుమారుడు రాఘవ ఫిర్యాదు మేరకు ఆదివారం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎప్పుడు తెరుస్తారో..?
కొత్తగూడెంఅర్బన్: ముదురుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. మళ్లీ జూలైలోనే బియ్యం పంపిణీ చేస్తారు. రేషన్షాపుల నుంచి బియ్యంను తీసుకునేందుకు లబ్ధిదారులు క్యూకడుతున్నారు. ప్రతీ నెల 15వ తేదీ వరకే బియ్యం పంపిణీ చేయడం, ఆ తరువాత ఒకటి, రెండు రోజులు పొడగింపు ఉండడం వల్ల లబ్ధిదారులు చివరి తేదీ వరకు కూడా బియ్యం తీసుకునే వారు. కానీ, ఈసారి మూడు నెలల బియ్యం కావడంతో చివరి తేదీ వరకు ఆగకుండా ముందస్తుగానే రేషన్షాపుల వద్దకు వచ్చి బియ్యం తీసుకుంటున్నారు. అయితే, డీలర్లకు సమయపాలన లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపులు తీయడం, మూసివేయడానికి స్పష్టమైన సమయం కేటాయించడంలో డీలర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. బియ్యం అక్రమ దందాలో డీలర్లు కూడా చేతులు కలిపి, వారు ఎప్పుడు షాపులను తెరుస్తున్నారో తెలియడంలేదు. బియ్యం తీసుకోకుండా ఎంతమంది డబ్బులు తీసుకుంటు న్నారు? ఎంత బియ్యం మిగులుతోంది? ఎక్కడికి వాటిని తరలించాలనే విషయాలపైనే వారంతా కూడా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. దీంతో షాపుల సమయపాలన గాలికి వదిలేశారు. అయితే, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం సమయపాలన పాటించకపోతే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే షాపులను సీజ్ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందుకు డీలర్లు భయపడి సమయానికి షాపులు తెరచి బియ్యం లబ్ధిదారులకు అందిస్తారో, లేదో వేచి చూడాలి. రేషన్షాపుల సమయాలు ఇలా.. జిల్లాలో 442 రేషన్ షాపులుండగా డీలర్లు వారికి ఇష్టం వచ్చిన సమయంలో తెరస్తున్నారు. దీంతో షాపుల ముందు లబ్ధిదారులు పడిగాపులు కాయల్సిన దుస్థితి నెలకొంది. కొంత మంది డీలర్లు ఉదయం షాపులు తీస్తే, మరికొంత మంది మధ్యాహ్నం, సాయంత్ర వేళలో తీస్తున్నారు. అయితే రేషన్షాపులు తీయడానికి, మూసివేయడానికి కూడా సమయం కేటాయించినప్పటికీ వాటిని డీలర్లు ఎవరూ పాటించడం లేదని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపై షాపులు సమ యానికి తీయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రేషన్షాపులు ఉదయం 8 గంటల కల్లా తీసి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచి ఉంచాలని, దీంతో పాటు సాయంత్రం 4 గంటలకు తీసి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరచి ఉంచాలంటున్నారు. ఈ సమయాలు రానున్న రోజుల్లో ఎంత మంది డీలర్లు పాటిస్తారో వేచి చూడాలి. బినామీ పేర్లతో నిర్వహణ.. జిల్లాలో ఉన్న మొత్తం 442 రేషన్దుకాణాలు వీటి లో చాలా వరకు బినామీల పేర్లతో నడుస్తున్నాయి. ఒక్క డీలర్కు మూడు, నాలుగు దుకాణాలున్నా యి. వాటిని వారి బంధువుల బినామీ పేర్లతో నడిపిస్తున్నారు. దీంతో కొత్త వారికి, ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఇతర జిల్లాల్లో బినామీలను అధికారులు ఏరి పడేసి, వాటిల్లో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు గానూ నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం పదేళ్లుగా రేషన్ దుకాణాలకు ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదంటే ఏ స్థాయిలో మేనేజ్మెంట్ జరుగుతుందో జిల్లా అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవరసముంది. రేషన్ డీలర్లు కొంత మంది వారి బినామీ దుకాణాలను లీజుకు ఇవ్వడంతో పాటు, లీజు అయిన తరువాత కొత్త వారికి ఇవ్వడం, ఏడాదికి, నెలకు వాటిపై అదనపు ఆదా యం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కొన్ని రేషన్దుకాణాల వారు, వారి కుటుంబ సభ్యులే నడిపిస్తున్నారు. విద్యార్హతలు, ఆసక్తి ఉన్న యువత ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక అవకాశాల కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి పౌరసరఫరాలశాఖ అధికారులు బినామీల స్థానాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరముంది. -
పీఆర్సీ, పెండింగ్ బిల్లుల కోసం పోరాటం
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 12వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల కోసం ఏక మొత్తంగా రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జీపీఎఫ్, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు నాలుగు డీఏలను ప్రకటించాలని, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన దశలవారీ పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, టెట్ అర్హత మార్కులు తగ్గింపుపైనా పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షేక్ యూసుఫ్ సైదా, కోశాధికారి వి.రాంబాబు, నర్సయ్య, నాగేశ్వరరావు, ఉద్దండ, సురేష్, రామకృష్ణ, కోటేశ్వరరావు, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
ఖమ్మం జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్’ అవార్డు
●ప్రధాని చేతుల మీదుగా అందుకున్న నూతనప్రసాద్ నేలకొండపల్లి: మండలంలోని మంగాపుర తండాకు చెందిన ఆర్మీ జవాన్ భూక్యా నూతనప్రసాద్ విధినిర్వహణలో ప్రతిభకు గాను గుర్తింపు లభించింది. 2024లో మణిపూర్లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొట్టటంలో ఆయన ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నూతనప్రసాద్కు కేంద్రప్రభుత్వం వీరశౌర్య దివస్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు అవార్డు అందజేయగా కుటుంబీకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
బాలికలదే పైచేయి
● ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు ● ప్రథమ సంవత్సరంలో 63.49 శాతం.. ● ద్వితీయ సంవత్సరంలో 77.71 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచిన జిల్లా పాల్వంచరూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి కూడా విద్యార్థినులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో 63.49 శాతం, సెకండియర్లో 77.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు 8,508 మంది పరీక్ష రాయగా 6,620 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2,765 మందికి 1,919 మంది, బాలికలు 4,005 మందికి 3,342మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో మొత్తం 9,279 మందికి 5,819మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 3,146మందికి 1629 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,354మందికి 3,133 ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,738 మందికి 1,359 మంది ఉత్తీర్ణులు కాగా, 77.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 1,779 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,057 ఉత్తీర్ణులయ్యారు. 59.42శాతం ఉత్తీర్ణత వచ్చింది. గతేడాది జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం ఉత్తీర్ణత సాధిచంగా, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే ఈసారి కొంతమెరుగైన ఫలితాలు సాధించగా, రాష్ట్రస్థాయిలో జనరల్ ఇంటర్లో 9వ స్థానం, ఒకేషనల్లో 8వ స్థానంలో జిల్లా నిలిచింది. ఫెయిల్ అయిన విద్యార్థులు, అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు సమాధాన పత్రాలను రీకౌంటింగ్, స్కాన్ చేసి న కాపీతో కూడిన రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్(డీఐఈఓ) అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. గడువు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇంటర్మీడిఝెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) మే 13 నుంచి మొదలవుతా యని డీఐఈఓ తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత జూనియర్ కళాశాలలో ఈ నెల 13 నుంచి 20వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. బాలురు బాలికలు మొత్తం సెకండియర్ జనరల్ 69.4 83.45 77.71ఒకేషనల్ 66.09 86.16 78.19ఫస్టియర్ జనరల్ 51.78 71.96 63.49ఒకేషనల్ 44.69 71.98 59.42 -
ఇంటర్ ఫలితాల్లో ‘కృష్ణవేణి’ విద్యార్థుల ప్రతిభ
చుంచుపల్లి: సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కొత్తగూడెంలోని కృష్ణవేణి విద్యార్థులు అత్యత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కె.కావ్యకళ వేయి మార్కులకు 995 మార్కు లు, ఎన్.చందన 995 మార్కులు సాధించి సత్తా చాటారు. బైపీసీలో జి.ప్రహర్ష వేయి మార్కులకు 994 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. అలాగే, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సీహెచ్.భావన 470 మార్కులకు 468 మార్కులు, కె.పల్లవి 467, ఎస్కే ఫాతిమా 466 మార్కులు, బైపీసీలో సీహెచ్.ప్రశాంత్ 440 మార్కులకు 437 మార్కులు, సీఈసీలో ఇ.గీతిక 500 మార్కులకు 489 మార్కులు సాధించింది. విద్యార్థులతో పాటు వారు అత్యత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన అధ్యాపకులను డైరెక్టర్లు ఎం.కోటేశ్వరరావు, జగదీశ్, వెంకటేశ్వరరావు, రామారావు అభినందించారు. -
పూలేకు బార్ అసోసియేన్ నివాళి
సూపర్బజార్(కొత్తగూడెం): జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని లైబ్రరీ హాలులో బార్ అసోసియేషన్ అధ్యక్షు లు కిరణ్కుమార్ పూలే చిత్రపటానికి పూలమాల వేశారు. అసోసియేషన్ సభ్యులు, న్యా యవాదులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు బలికావొద్దు.. చుంచుపల్లి: యువత మత్తు పదార్థాలకు బలికావొద్దని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ పేర్కొన్నారు. ఆరోగ్య వారం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో శనివారం డ్రగ్ కంట్రోల్, రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేను పురస్కరించుకొని కొత్తగూడెంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సాయికల్యాణ్, ప్రతాప్ పాల్గొన్నారు. ఔషధ దుర్వినియోగంపై అవగాహన సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక.. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై శనివారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అలవాటుగా మారే ఔషధాలతో కలిగే దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం, నకిలీ మందులకు సంబంధించి ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ (1800–599–6969) గురించి వివరించారు. అనంతరం కూలీలైన్లోని కెమిస్ట్, డ్రగ్గిస్ట్ భవన్లో సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం, అరికట్టడంలో విద్యార్థులు, ఆరోగ్య రంగ భాగస్వాముల పాత్ర ఎంత కీలకమో వివరించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థుల కోసం వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈగల్ ఇన్స్పెక్టర్ పి.విజయ్రామ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అరవింద్కుమార్, తిరుపతిరెడ్డి, రవి, లక్ష్మణాచారి పాల్గొన్నారు. 108 వాహనంలో గర్భిణి ప్రసవం చింతకాని: ఏపీలోని గంపల గూడెం మండలం నెమలికొణిజర్ల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి శనివారం 108 వాహనంలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకులు ప్రసవం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి వైద్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేయగా 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమాన నాగులవంచ సమీపాన పురిటి నొప్పులు ఎక్కువవడంతో రమాదేవికి 108 సిబ్బంది గుజ్జర్లపూడి రామయ్య, పేరెల్లి రవీంద్రబాబు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
భద్రగిరిలో భక్తుల రద్దీ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శని, ఆదివా రాలు సెలవురోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులుదీరారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. కాగా అంతరాలయంలో మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన జరిపారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రోడ్డు భద్రతపై అవగాహనసూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తామని, ఇతర శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు చేపడతామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్ల డించారు. అరైవ్ అలైవ్–2026లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీవరకు ఆరు రోజు లపాటు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో వాహనదారులు భాగస్వాములు కావా లనికోరారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటివారి ప్రాణాలతోపాటు, మన ప్రా ణాల ను కాపాడుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నిబంధనలు పాటించే సివిక్ సెన్స్ కలిగి ఉండాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్లోడ్ వల్ల కలిగే ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 13న రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాల్లో కమిటీలు, 14న ప్రతిజ్ఞ, బ్లాక్స్పాట్ల వద్ద మరమ్మతులు, 15న విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, 16న పోలీస్స్టేషన్లలో ఆటో డ్రైవర్లకు అవగాహన, 17న ప్రథమచికిత్స, 18న ట్రాఫిక్ రూల్స్పై అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలుకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పరీక్ష ఫలితా లను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా ఇంటర్మీ డియట్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వెలువడే ఇంటర్మీడియట్ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు ముందుగా 80969 58096 నంబర్ను మీ సేవ తెలంగాణగా సేవ్ చేసుకుని, వాట్సాప్లో బీఐఈ ఎగ్జామ్స్ రిజల్ట్ సేవను ఎంపిక చేసి, రోల్ నంబర్, సంవత్సరం (1వ లేదా 2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్) వివరాలను నమోదు చేస్తే వెంటనే ఫలితాల వివరాలు అందుతాయని వివరించారు. -
దశాబ్దాలుగా బైపాస్!
● తీరని కలగా మిగిలిన కొత్తగూడెం బైపాస్ రోడ్డు ● పదేళ్లుగా ముందుకు సాగని నిర్మాణ పనులు ● వంతెనల నిధుల కోసం ‘సేతుబంధన్’ ద్వారా ప్రయత్నంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిత్యం వాహనాల రద్దీ ఉండే జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. బైపాస్ రోడ్లో కీలకంగా మారిన భారీ వంతెన నిర్మాణానికి నిధులు అడుగు దూరంలో నిలిచిపోయాయి. జిల్లా కేంద్రం, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం కార్పొరేషన్ మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఏపీ, ఛతీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు జిల్లా సరిహద్దుగా ఉంది. దీంతో నిత్యం వేలాదిగా భారీ వాహనాలు కొత్తగూడెం–పాల్వంచల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు స్థానికంగా రోజురోజుకూ కార్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల రద్దీ కూడా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం–పాల్వంచల పట్టణాల్లోకి భారీ వాహనాలు రాకుండా బైపాస్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన 90వ దశకం నుంచి ఉంది. చివరకు 2000–01 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం–పాల్వంచలకు బైపాస్ రోడ్డు మంజూరైంది. అలైన్మెంట్, స్థల సేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా నేటికీ అందుబాటులోకి రాలేదు. పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎట్టకేలకు 2015 నాటికి పాల్వంచ నవభారత్ నుంచి పాత కొత్తగూడెం వరకు ఓ వైపు రోడ్డు నిర్మాణం జరిగింది. ఖమ్మం రోడ్డులో చుంచుపల్లి తండా దగ్గర నుంచి విజయవాడ హైవేపై సీఎంపీఎఫ్ కార్యాలయం వరకు మరోవైపు కూడా రోడ్డు నిర్మాణం పూర్తయింది. మధ్యలో సీఎంపీఎఫ్ కార్యాలయం దగ్గరున్న గోధుమ వాగు బ్రిడ్జి దగ్గర ఒక వంతెన, పాత కొత్తగూడెం వైపు భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి రుద్రంపూర్లో ఉన్న సీహెచ్పీకి వెళ్లే రైల్వే ట్రాక్పై మరో వంతెన నిర్మించాల్సి ఉంది. ఇవి రెండు నిర్మిస్తేనే బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. కేవలం రూ.40 కోట్ల పనులకే పదిహేనేళ్లు పట్టడంతో ఈ వంతెనల నిర్మాణానికి బడ్జెట్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఎస్ఎఫ్)–సేతు బంధన్ పేరుతో రోడ్లపై వంతెన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. రైల్వే ట్రాక్లు వచ్చిన చోట వంతెన నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. దీంతో తెలంగాణలో 12 చోట్ల రోడ్ అండర్/ఓవర్ బ్రిడ్జిలకు నిధులు కేటాయించాలంటూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రాధాన్యత క్రమంలో కొత్తగూడెం బైపాస్లో కీలకమైన గోధుమవాగు, రైల్వేట్రాక్లపై వంతెనల నిర్మాణం అంశం మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న నల్లగొండ, ఖమ్మంలోని మధిర వంతెనలకు నిధులు మంజూరయ్యాయి. సేతు బంధన్ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని 2026, మార్చి 3న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాశారు. అదే లేఖ ఆధారంగా కిషన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 10 జరిపే కేటాయింపుల్లో బైపాస్ కల నెరవేరవచ్చనే నమ్మకం కలిగింది. కానీ, అలా జరగలేదు. ప్రస్తుతం మంజూరైన నిధులు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, త్వరలోనే 2025–26కు సంబంధించిన నిధులు వస్తాయని, అందులో బైపాస్కు రూ.163 కోట్ల మేరకు నిధులు మంజూరవుతాయనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే కూనంనేని వ్యక్తం చేస్తున్నారు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్ – ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలి. ఇతర వివరాలకు 96660 13544, 96182 18701 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
●అభయాంజనేయస్వామి
రామాలయ ప్రాంగణంలోని అభయాంజనేయస్వామి ఉపాలయం తొలగింపు లేదని ప్రస్తుతం పేర్కొంటున్నా.. ఉపాలయాలు, ప్రధాన ఆలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగాక ఇక్కడ కూడా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. ఆల య ప్రాంగణంలో ఉన్న ఆళ్వార్లకు సైతం ఉపాలయాల అభివృద్ధిలో భాగంగా మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. రామయ్య స్వామిని దర్శించుకున్నాక ఆలయం నుంచి రంగనాయకుల గుట్టవరకు భక్తులు సుమారు అరకిలోమీటరు నడిచివెళ్లాల్సి వస్తోంది. శివాలయం పక్క నుంచి 100 మీటర్ల రోడ్డు నిర్మిస్తే రంగనాథస్వామి ఆలయం, భక్త రామదాసు ధ్యాన మందిరం సులభంగా సందర్శించుకోవచ్చు. గుట్టపైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేయవచ్చు. -
ఎంత రుచో.. అంత ఆదాయం
● కొరమీను చేపల పెంపకంపై పలువురి ఆసక్తి ● రుణాల మంజూరుతో ప్రోత్సహిస్తున్నప్రభుత్వం ● నాగారంలో కొరమీను పెంచుతున్న ఓ యువరైతుపాల్వంచరూరల్: చేపల్లో కొరమీను ఎంతో రుచిగా ఉంటుందో ధర కూడా అదేస్థాయిలో ఉంటుంది. అధిక పోషకాలు కూడా ఉండటంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతాయి. తద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని అధికారులు అవగాహన కల్పించడంతో పలువురు రైతులు కొరమీను పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)లో యూనిట్కు రూ.4.40 లక్షల చొప్పున డీఆర్డీఏ రుణం కూడా మంజూరు చేస్తోంది. దీంతో అశ్వాపురం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో రైతులు కొరమీను పెంపకం చేపట్టారు. నాలుగు నెలలు ట్యాంక్లో.. నాలుగు నుంచి ఆరు అంగులాలు కలిగిన 15 నుంచి 20 రోజుల కొరమీను చేప పిల్ల లను నర్సరీ ట్యాంక్లో నాలుగు నెలలపాటు పెంచుతారు. ఆ తర్వాత 200 నుంచి 400 చదరపు మీటర్లు కలిగిన పాండ్లోకి వదులుతారు. ఇలా 8 నెలలపాటు పెంచితే చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువుకు చేరుకుంటుంది. కాగా, కిలో ధర మార్కెట్లో రూ. 350 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. నాగారంలో యువ రైతు ప్రయత్నం.. పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన నారకట్ల ఇసాక్ బీకాం చదువుకుని ఓ కంపెనీలో మార్కెటింగ్ డెవలపర్గా పనిచేస్తున్నాడు. మరో వైపు బ్యాంక్ రుణం రూ.4.19 లక్షలు తీసుకుని తనకు ఉన్న ఎకరం భూమిలో కొరమీను చేపలను పెంచుతున్నాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు, తెలంగాణలోని సంగారెడ్డి నుంచి రూ.20 వేలతో 1000 పిల్లలను కొనుగోలు చేసి తెచ్చాడు. పెంపకం కోసం రూ.1.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణం చేపట్టాడు. ఫీడింగ్ కోసం మరో రూ.1.26 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. 900 పిల్లలు బతికాయని, ప్రస్తుతం కేజీ నుంచి కేజీన్నర సైజుకు ఎదిగాయని యువ రైతు తెలిపాడు. 9 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ. 3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నాడు. గత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేపల పెంపకంపై అవగాహన కల్పించడంతో కొరమీను చేపల పెంపకం చేపట్టినట్లు ఇసాక్ తెలిపాడు. -
ఎకై ్సజ్ ఉద్యోగుల బదిలీలు
ఖమ్మంక్రైం/పాల్వంచరూరల్: : ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇటీవల ఆప్షన్లు స్వీకరించగా, పరిశీలన అనంతరం ఉమ్మడి జిల్లాలోని 200మంది హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు శనివారం కొత్త స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. వీరు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని నూతన స్థానాల్లో రిపోర్ట్ చేశారు. ప్రతీ స్టేషన్లో మహిళా సిబ్బంది ప్రతీ ఎకై ్సజ్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఒకరైనా ఉండాలని ఇటీవల ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఫలితంగా కొందరు ప్రస్తుత స్థానాల నుంచి దూరప్రాంతాల్లోని స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. కాగా, త్వరలోనే శాఖలోని సీఐలు, ఎస్ఐల బదిలీలు సైతం ఉంటాయని తెలుస్తోంది. పాల్వంచలో 8 మంది..పాల్వంచలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్న 8 మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణతోపాటు మరో ఏడుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో పది మంది బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. 200మంది హెచ్సీలు, కానిస్టేబుళ్లకు స్థానచలనం -
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు
● కలెక్టర్ అంకిత్ ● సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిణీ పాల్వంచరూరల్: గిరిజన ప్రాంతాల్లో మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారని కలెక్టర్ అంకిత్ కితాబిచ్చారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల సిబ్బంది 100 మందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేసి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్నర్సులు, వైద్యులు, జిల్లాస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా, సమన్వయంతో సేవలందిస్తుండటంతో రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయన్నారు. డీసీహెచ్ఎస్ రవిబాబు, తహసీల్దార్ దారా ప్రసాద్, వైద్యులు ముక్కటేశ్వరరావు, సోమరాజ్దొర, సూపరింటెండెంట్లు రామకృష్ణ, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ సాయివర్ధన్, డాక్టర్ మౌనిక, డాక్టర్ గౌరిప్రసాద్ పాల్గొన్నారు. సాదాబైనామా అర్జీలు పరిష్కరించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సాదాబైనామా, ఎస్ఐఆర్ మ్యాపింగ్, ఇతర భూ సమస్యలపై శనివారం తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. సడలించిన నిబంధనల ఆధారంగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ, ఇతర భూ సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికలను అందజేయాలని ఆదేశించారు. సామాజిక సమానత్వానికి మార్గదర్శి పూలేసామాజిక సమానత్వం, విద్యావ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతి రావు పూలే దేశానికి మార్గదర్శకుడిగా నిలి చారని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. కలెక్టర్ తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పూలే మహిళా విద్యకు ప్రాధాన్యతమిచ్చారని, ముందుగా తన భార్యకు విద్య అందించి, మహిళల సాధికారతకు పునాది వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, బీసీ సంక్షేమ అధికారి విజ యలక్ష్మి, ఇతర అధికారులు దినేష్, ఉపేందర్, జి.శ్రీనివాస్, సుధీర్కుమార్, బీసీ సంఘం నాయకులు కొదుమూరు సత్యనారాయణ, బొర్రా జయమ్మ గుమలాపురం సత్యనారాయణ, జి కృష్ణ, ఇంద్రాల మురళి, వారాధి సత్యనారాయణ, బండి రాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాలయాలకూ మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వం భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధిపై దృష్టి సారించింది. రూ.586 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉపాలయాలకు కూడా మహర్దశ పట్టనుంది. పనులు పూర్తయితే రామయ్య స్వామిని దర్శించుకున్న భక్తులు ఇతర ఆలయాలను కూడా సందర్శించి ఆధ్యాత్మిక వాతావరణంలో సేద తీరే అవకాశం ఏర్పడనుంది. తగిన ప్రచారం చేపడితే భక్తుల రద్దీ, దేవాదాయ శాఖకు ఆదాయం కూడా పెరగనుంది. –భద్రాచలంభద్రాచల రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి దేవస్థానానికి అనుబంధంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, యోగానంద లక్ష్మీ నరసింహాలయం, రంగనాయకుల గుట్టపై రంగనాథ స్వామి, తాతగుడి సెంటర్లో గోవిందరాజ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ధూప, దీప నైవేద్యాలతోపాటు నిత్య పూజలు రామాలయ సిబ్బందే నిర్వర్తిస్తున్నారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు తప్ప, ఇతర ఆలయాలకు తగిన ప్రచారం లేదు. దేవస్థానం నుంచి నేరుగా నడిచి వెళ్లేందుకు కనెక్టివిటీ కూడా లేదు. దీంతో భక్తుల ఆదరణ లభించటం లేదు. తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టేలా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని భక్తులుకోరుతున్నారు. ప్రస్తుతం ప్రసాద్ పథకంలో భాగంగా టూరిజం హోటల్లో నిరుపయోగంగా ఉన్న బ్యాటరీ వాహనాలతోపాటు ఇతర ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం రామాలయ ప్రాంగణంలో ఉంది. సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుంటారు. భక్తులకు ఇక్కడే వేదా శీర్వచనం ఇస్తారు. దసరా వేడుకలు నిర్వహిస్తారు. అభివృద్ధి పనుల్లో ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. ఆలయ ప్రాకారాల ఏర్పాటులో భాగంగా నిర్మాణం వేదిక మారనుంది. రామాలయం పక్కనే ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ భాగం విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయ శాఖకు అందజేశారు. ఉత్తరం దిక్కున శివపార్వతుల ప్రతిమలతో స్వాగతం పలుకుతుండగా, శివరాత్రి, ఇతర ఉత్సవాల రోజుల్లో రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం సరిపోవటం లేదు. దీంతో దక్షిణ భాగం వైపు విస్తరణతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
ఖమ్మం పెద్దాస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ–అడిక్షన్ సెంటర్) ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ను డీఎంహెచ్ఓ రామారావు శనివారం ప్రారంభించి మాట్లాడారు. మద్యపానం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికి సలహాలు, చికిత్స సాయంతో పాటు పునరావాస మార్గదర్శకత్వం చేసేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక మత్తు పదార్థాలతో ఎదురయ్యే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైతే క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు డీఎంహెచ్ఓ బహుమతులు అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్, మానసిక వైద్య నిపుణురాలు సౌమ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, పాలేరు నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ కృషి అభినందనీయం
భద్రాచలం: గిరిజన మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ చేస్తున్న కృషి అభినందనీయమని న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డైరెక్టర్ వమాలి దికాకు అన్నారు. శనివారం హైదరాబాదులోని డీఎస్ఎస్ భవనంలో రెండు తెలుగు రాష్ట్రాల ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంక్షేమ పథకాల అమలుపై వర్క్షాప్ నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ తరఫున ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ ఆధ్వర్యంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, టీసీఆర్టీఎన్టీ డైరెక్టర్ సమజ్వాల, ములుగు ఐటీడీఏ పీఓ దివాకర్ సమక్షంలో శాలువాతో సత్కరించి గిరిజన ఉత్పత్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీ డీఏ ఆధ్వర్యంలో ప్రారంభించిన భద్రగిరి మార్ట్ లక్ష్యం, ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు, ఆర్థిక చేయూత గురించి వివరించారు. అనంతరం వమాలి దికాకు మాట్లాడుతూ.. ఇలాంటి మార్ట్ల వల్ల గిరిజనులు ఆర్థికాభివృద్ధితో పాటు గిరిజన రైతులు, దళారుల దోపిడీకి గురి కాకుండా లాభపడతారన్నారు. మిగిలిన ఐటీడీఏల్లో కూడా ఇలాంటి గిరిజన మార్ట్లు ప్రారంభించి గిరిజన వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసి చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓలు, డీటీడీఓలు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సంతగుడి ఆవరణలో సంత యథాతథం
కారేపల్లి: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి (సంతగుడి) దేవస్థానం ప్రాంగణంలో ప్రతీ ఆదివారం జరిగే వారాంతపు సంత యథావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈఓ కె.వేణుగోపాలాచార్యులు, సింగరేణి గ్రామ కార్యదర్శి నెహ్రూ తెలిపారు. సంత ఆదాయంలో 15 శాతం గ్రామపంచాయతీకి చెల్లించాల్సి ఉండగా 2014 నుంచి రూ.3.52 లక్షలు బకాయి పేరుకుపోయింది. ఈ బకాయి చెల్లించకపోతే 12వ తేదీన సంత నిలిపివేస్తామని జీపీ నుంచి నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యాన శనివారం సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్తో పాటు పాలక వర్గం, దేవాదాయ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు వన్టైమ్ సెటిల్మెంట్లో భాగంగా దేవాదాయ శాఖ నుంచి రూ.2 లక్షలను రెండు దఫాలుగా చెల్లిస్తామని చెప్పడంతో అంగీకరించారు. దీంతో సంత నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. సమావేశంలో ఉప సర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, ఉద్యోగులు పగడాల మోహన్కృష్ణ, మూడ్ మోహన్చౌహాన్, వార్డు సభ్యులు ఆదెర్ల అంజయ్య, యాకూబ్ అలీ, రావుల రాజశేఖర్, భూమిక, రాధ తదితరులు పాల్గొన్నారు.దేవాదాయ శాఖ, జీపీ పాలకవర్గం మధ్య చర్చలు సఫలం -
ఆగని రేషన్ బియ్యం దందా
ఇల్లెందురూరల్/టేకులపల్లి: సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. ఇల్లెందు మండలంలో కొన్నేళ్లుగా బియ్యం మాఫియా యథేచ్ఛగా తన వ్యాపారం సాగించగా.. అధికారులు పట్టుకున్నారు. అయినా అడ్డా మారుస్తూ దందా సాగిస్తున్నారని బయటపడింది. ఈ క్రమాన ఇల్లెందు రేపల్లెవాడలో అక్రమంగా నిల్వ చేసిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీ, బొలేరో వాహనాల్లో లోడ్ చేస్తుండగా జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేంకుమార్, డీటీలు మహేశ్, ప్రభాకర్ శనివారం చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. ఈ క్రమాన నిందితులు వాహనాలను వదిలేసి పారిపోయారు. ఆపై రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని జీసీసీ గోదాముకు తరలించడమే కాక వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఇక టేకులపల్లి మండలంలో కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు పట్టుకున్నారు. టేకులపల్లికి చెందిన లాలు, అక్షయ్ మండలంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కారేపల్లి మండలానికి చెందిన బడా వ్యాపారి గౌతమ్కు అమ్మేవారు. ఆయన ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా జరిగేది. ఈ మేరకు శనివారం టేకులపల్లి మండలం బోరింగ్ తండా సమీపంలో లారీలో తరలిస్తున్న 282 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. బాధ్యులైన ముగ్గురిపై 6–ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు డీసీఎస్ఓ తెలిపారు. తనిఖీల్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం సివిల్ సప్లయీస్ డీటీలు మహేశ్, ప్రభాకర్, రాజు, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. బియ్యం దందాపై ఆయన స్పందిస్తూ ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సివిల్ సప్లయీస్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఇందులో 480 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారని వివరించారు. సమగ్ర విచారణ అనంతరం నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
స్మార్ట్గా అంగన్వాడీ సేవలు
● అంగన్వాడీ సిబ్బందికి 4జీ ఫోన్లు ● ఇక ఆన్లైన్ సేవలు వేగవంతం ● జిల్లాలో రూ.2.25 కోట్ల విలువైన 1,954 మొబైళ్ల అందజేత భద్రాచలంఅర్బన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత ‘స్మార్ట్’గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభు త్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి నూతన స్మార్ట్ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలెక్టరేట్లో శుక్రవారం సిబ్బందికి ఫోన్లు పంపిణీ చేశారు. 1,954 మందికి స్మార్ట్ఫోన్లు భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల పరిధిలోగల 11 ప్రాజెక్ట్లు, 84 సెక్టార్ల పరిధిలో మొత్తం 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మూడేళ్లలోపు వారు 28,802 మంది, 3–6 ఏళ్ల లోపు వారు 23,834 మంది లబ్ధి పొందుతున్నారు. వీరితో పాటు 5,586 మంది బాలింతలు, 5,978 మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయి. 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం, డిస్ప్లే పగిలిపోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్తోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు. మంత్రి చేతులమీదుగా.. జిల్లాలో మొత్తం 1,866 అంగన్వాడీ కార్యకర్తలు ఉండగా 73 మంది సూపర్వైజర్లతోపాటు బ్లాక్ కోఆర్డినేటర్లతో కలిపి మొత్తం 1,954 స్మార్ట్ఫోన్లను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఐడీఓసీలో పంపిణీ చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 195 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7 మంది సూపర్వైజర్పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేవలు ఇలా.. ప్రతీరోజు యాప్లో లబ్ధిదారులకు అందించే 14 రకాల వస్తువుల వివరాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార వివరాలు నమోదు చేయాలి. చిన్నారులకు బోధించే పాఠాలు, వైద్య పరీక్షల సమాచారం, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్, పోషణ్ దివస్, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషియన్ సెషన్ వంటి కార్యక్రమాల వివరాలు, అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్, మరుగు దొడ్ల సౌకర్యాలు, మరమ్మతుల వివరాలను నమో దు చేయాలి. గతంలో పాత ఫోన్లతో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అందింస్తున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా 14 రిజిస్టర్ల వివరాలను యాప్లలో సకాలంలో నమోదు చేయాలి. సొంత పనులకు ఈ ఫోన్లను వినియోగించొద్దు. జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి. స్మార్ట్ ఫోన్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. –స్వర్ణలత లెనీనా, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతినెలా ఎస్ఆర్ఎస్ (ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్తఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తసెల్ టవర్లు 5జీ నెట్వర్క్ అందిస్తున్న వేళ 4జీ ఫోన్లతో భవిష్యత్లో మళ్లీ సమస్యలు వస్తాయని అభిప్రాయ పడుతున్నా రు. గతంలో అంగన్వాడీలకు 2 జీబీర్యామ్ సామర్థ్యం కలిగిన సెల్ఫోన్లు ఇవ్వడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈసారి 4 జీబీ ర్యామ్ సామర్థ్యం కలిగిన సెల్ఫోన్లు ఇస్తున్నారు. 12 జీబీ ర్యామ్ నడుస్తున్న తరుణంలో 4 జీబీ ర్యామ్ ఇవ్వడం సరికాదని, 6 జీబీ, అంతకంటే ఎక్కువ ఉండాలని కోరుతున్నారు. -
కొత్తగూడెం జీజీహెచ్లో అరుదైన చికిత్స
చుంచుపల్లి: కొత్తగూడెం రామవరానికి చెందిన నిర్మలకు ప్రమాదవశాత్తు ఇనుపరేకు తగిలి చెవి భాగం పూర్తిగా తెగిపోయింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు గురువారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించ గా క్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్య బృందం విజ యవంతంగా నిర్వహించింది. ఈఎన్టీ విభా గం డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరగగా.. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీఇల్లెందు: పట్టణంలోని పలు డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రథమచికిత్స కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం తనిఖీ చేసింది. శుక్రవారం జిల్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో ఆంజనేయ మెడికేర్ క్లినిక్, డయాగ్నస్టిక్ సెంటర్ను తనిఖీచేశారు. ఆ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. జనతా, న్యూ జనతా ప్రథ మ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. రోగులకు వాడిన సూదులను మళ్లీ వాడుతున్నట్లు గ్రహంచి, అనవసరమైన వాటికి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించి, నోటీసులు అందజేశామని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ, జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్, మణికంఠ, ప్రసాద్ తదితరులు ఉన్నారు. రేక్ పాయింట్కు 3,017 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు శుక్రవారం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 757.16 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,130 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 630 మె. టన్నులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. మిగతా 500 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా నిల్వ చేశామని తెలిపారు. అక్రమంగా పశువుల రవాణా.. ముగ్గురు అరెస్ట్ భద్రాచలంటౌన్: నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ బి.రామకృష్ణ కథనం ప్రకారం.. ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఎనిమిది పశువులను మేత, నీరు లేకుండా ఇరుకుగా తరలిస్తున్న వాహనం పట్టుబడింది. దుమ్ముగూడెం పరిసర గ్రామాల్లో పశువులను కొనుగోలు చేసి కొత్తగూడెం తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్ మందా శ్రీను, మహమ్మద్ సమ్మర్, షేక్ సాధిక్పాషాను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను పాల్వంచ గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. దాడిచేసిన వ్యక్తిపై కేసుఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ పంచాయతీ బుడగజంగాలకాలనీకి చెందిన యువకులు రాము, జంపన్న మధ్య డబ్బుల విషయంలో వాగ్వా దం చోటుచేసుకుంది. జంపన్న సోదరుడు శ్రీనివాస్ ఇదే విషయంపై రామును ప్రశ్నించగా.. తనచేతిలో ఉన్న బీరుసీసాతో శ్రీనివాస్పై దాడి చేశాడు. గాయ పడిన శ్రీనివాస్ను స్థానికులు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. జంపన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్ఐ సారంగపాణి తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్బూర్గంపాడు: మోతె పట్టీనగర్ జీపీ చింతకుంట గ్రామానికి చెందిన కుంజం లక్ష్మయ్య ఇంట్లో 2025 డిసెంబర్లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేర కు కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన కుక్కునూరు మండలానికి చెందిన కుమ్మరపల్లి రాజేశ్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. నిందితుడి నుంచి సెల్ఫోన్, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ వివరించారు. -
ఘోరమైన ఓటమి
అమెరికా సామ్రాజ్యవాదానికి ● అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కోల్పోయిన భారత్ ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మంమయూరిసెంటర్: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం, వనరుల దోపిడీకి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారానికి చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ గుణపాఠం చెప్పిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా స్థాయి ప్లీనంలో ఆయన మాట్లాడారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని ఉంచాలా, దించాలా అన్నది అక్కడి పాలన ఆధారంగా ప్రజలే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ పాలకులు తమకు పాదాక్రాంతం కాకపోతే దేశ నాగరికతనే నాశనం చేస్తామంటూ హిట్లర్ మాదిరి ట్రంప్ హెచ్చరించినా చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ ఎదురించిందని తెలిపారు. రాజకీయ సంకల్ప బలం, జాతీయవాదంతో వచ్చే ప్రేరణ, త్యాగనిరతి ఉన్న ప్రజల ముందు ఆయుధబలం ఓడిపోతుందని నాడు వియత్నాం, నేడు ఇరాన్ యుద్ధం నిరూపించిందన్నారు. కాగా, చైనా, రష్యా అండతో అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదంపై ఇరాన్ విజయం సాధిస్తే.. అమెరికా చెప్పింది చేసే అలవాటు ఉన్న మోదీ కారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన ప్రాముఖ్యత కోల్పోయిందని తమ్మినేని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్, వై విక్రమ్, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాలతో కార్మికుల ఆందోళన
పాల్వంచ/సూపర్బజార్(కొత్తగూడెం): ఆర్టిజన్ కార్మికులు శుక్రవారం కుటుంబాలతో కలిసి ఆందో ళన చేపట్టారు. ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింప జేయాలని ఆర్టిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరింది. కేటీపీఎస్ ఆస్పత్రి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా, కార్మికులు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాల్గొన్నా రు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ల కోరికలు న్యాయమైనవని, ప్రభుత్వం కార్మిక శ్రేయస్సును కాపాడాలని అన్నారు. సీపీఐజిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను రెండో శ్రేణి ఉద్యోగులుగా చూడటం బాధాకరమని అన్నా రు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు మాట్లాడుతూ ఆర్టిజన్లకు అండగా ఉంటా మని అన్నారు. కాగా, కొత్తగూడెం డివిజన్ కార్యాలయం ఎదుట కూడా ఆర్టిజన్ కార్మికులు ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అడుసుమల్లి సాయిబాబు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, బత్తుల మధుచంద్, సింధు తపస్వీ, గుగులోతు రాంబాబు, గుణచరిత్, పార్టీల నాయకులు ముతాల్య విశ్వనా థం, మల్లెల రవిచంద్ర, భట్టు మంజుల, ముత్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మూడో రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె -
రైలే లేదు
లైన్ ఉంది.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)–సత్తుపల్లి రైలు మార్గం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచింది. అయినా ప్రయాణికులకు రైలు సౌకర్యం కల్పించలేదు. భద్రాచలంరోడ్–కొవ్వూరు రైల్వేలైన్లో భాగంగా పరిగణిస్తున్న సత్తుపల్లి–భద్రాచలం రోడ్డు లైన్లో గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గు రవాణాకు 2022, మే 28 నుంచి అనుమతి వచ్చింది. అదే ఏడాది నవంబరులో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో లైన్ను ప్రారంభించారు. కొత్తగా 54 కి.మీ నిడివి కలిగిన ఎలక్ట్రిక్ సింగిల్ లైన్ను రూ. 928 కోట్లతో నిర్మించారు. ఇందులో రూ.619 కోట్లు సింగరేణి సమకూర్చింది. మూడేళ్లుగా సింగరేణి సంస్థ ఈ మార్గంలో 30 వేల టన్నుల బొగ్గు రవా ణా చేస్తోంది. ఫలితంగా రైల్వేకు ఏటా రూ.200 కోట్ల ఆదాయం లభిస్తోంది. సింగరేణి, రైల్వే ప్రయోజనం పొందుతున్నా.. రైలు మార్గంలో కొత్తగా సర్వారం, చండ్రుగొండ, పార్థసారథిపురం స్టేషన్లు నిర్మించారు. చివరిదైన సత్తుపల్లి టెర్మినల్ దగ్గర ప్రయాణికుల కోసం స్టేషన్ నిర్మించకుండా కేవలం కోల్ ట్రాన్స్పోర్టుకు అనుగుణంగానే లైన్ ముగించారు. దీంతో ప్యాసింజర్ రైలు నడిపించే విషయాన్ని రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే భారీ పరిశ్రమలకు సరుకు రవాణా చేసే మార్గంగానే పరిగణిస్తోంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాల మీదుగా వెళ్లే లైన్ ద్వారా కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించడం లేదు. ఈ లైన్ ద్వారా సింగరేణి, రైల్వే శాఖ ప్రయోజనం పొందుతున్నా స్థానిక ఏజెన్సీవాసులకు కలిగిన ఉపయోగంలేకుండా పోయింది. కనీస ప్రయత్నాలు లేవు నిబంధనల ప్రకారం కొత్త లైనులో కొన్నాళ్ల పాటు గూడ్స్ రైళ్లు నడిచాక ప్యాసింజర్ రైళ్లు నడిపే ప్రక్రి య మొదలవుతుంది. కొత్తగూడెం–సత్తుపల్లి ట్రాక్ పై కూడా ప్యాసింజర్ రైళ్లను కొంతకాలంపాటు ప్రయోగాత్మకంగా నడిపించాల్సి ఉంది. ప్యాసింజర్ రైళ్లు ఎన్ని బోగీలతో, ఎంత వేగంతో నడపవచ్చు, వేగం ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలనే అంశాలను పరిశీలిస్తారు. ట్రాక్ అనువుగా ఉందని భావించాక సేఫ్టీ సర్టిఫికెట్ కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేస్తారు. అనుమతులు రాగానే ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతాయి. కానీ ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు నడిపించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేయడంలేదు. ఫలితంగా కొత్త రైల్వే స్టేషన్లు అలంకారప్రాయంగా మారాయి. రైల్వే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ప్యాసింజర్ రైలు నడిపించే బాధ్యత ఎక్కువగా ఎంపీల మీదే ఆధారపడి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీలుగా వద్దిరాజు రవి చంద్ర, రామసహాయం రఘురాంరెడ్డి, బండి పార్థసారధిరెడ్డిలు ఉన్నారు. ఇటీవల వీరంతా జిల్లాకు సంబంధించిన భద్రాచలం రోడ్కు డివిజన్ హోదా, కొత్తగూడెంలో రోడ్డు విస్తరణ, డోర్నకల్ –మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్పు తదితర అంశాలను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పాటు రైల్వేబోర్డులోని ఉన్నతాధికారులను కలుస్తున్నారు. ఇదే చొరవను కొత్తగూడెం–సత్తుపల్లి లైన్లో ప్యాసింజర్ రైలు నడిపించడంపై కూడా చూపాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. -
డిజిటల్ సాంకేతికతతో సేవలు మెరుగు
● రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ● అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీసూపర్బజార్(కొత్తగూడెం): డిజిటల్ సాంకేతికతతో అంగన్వాడీ సేవలు మెరుగు పడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క) అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను సందర్శించారు. అంగన్వాడీ సిబ్బంది తయారు చేసిన ఆహార పదార్థాలు, పిల్లలకు అర్థమయ్యే విధంగా రూపొందించిన విద్యా నమూనా లను పరిశీలించారు. అనంతరం భేటీ బచావో పథ కం కింద ఆడపిల్లల తల్లులకు హిమాలయ కిట్లను అందజేశారు. తొలుత మంత్రికి ఆదివాసీ సంప్రదాయమైన కొమ్ము నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిసీతక్క మాట్లాడుతూ స్మార్ట్ఫోన్ల పంపిణీ ద్వారా అంగన్వాడీ సేవల నాణ్యత మెరుగుపడుతుందన్నారు. త్వరలోనే 15వేల అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి 12వేల భవనాలు మంజూరు చేశామని, మినీ కేంద్రాల అప్గ్రేడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు వంటి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కిందఇప్పటివరకు సుమారు రూ. 8కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపా రు. హైదరాబాద్లో 275 మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. మద్దుకూరులో కేరళ తరహా అంగన్వాడీ కేంద్రం.. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మా ట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. చండ్రుగొండ మండలం మద్దుకూరులో కేరళ తరహాలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడు తూ జిల్లాలో 1,954మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. డేటా సేకరణ, నివేదికల పంపిణీ, లబ్ధిదారుల వివరాల నిర్వహణ సులభతరం అవుతుందని చెప్పారు. జిల్లాలోని 2,061 అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు పూర్తిచేసి, రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత, ఇతర అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదాయం ఫుల్... వసతులు నిల్
● వ్యవసాయ మార్కెట్లలో రైతులకు వసతులు కరువు ● చెత్తాచెదారం, గత సీజన్ తాలుతో నిండిపోయిన యార్డులు ● ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా శుభ్రం చేయని వైనంబూర్గంపాడు: వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఏటా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై రూ. కోట్ల ఆదాయం వస్తోంది. ఆ ఆదాయంలో కనీసం 5 శాతం కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్వహణకు ఖర్చు చేయడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంకాగా, కొన్ని మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే రైతులు తెచ్చిన ధాన్యం రాశులుగా పోసుకునేందుకు, ఆరబెట్టుకునేందుకు అనువైన పరిస్థితులు లేవు. యార్డులు చెత్తాచెదారంతో నిండిపోయాయి. చెత్త శుభ్రం చేసేందుకు కూడా తమ వద్ద నిధులు లేవని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులే శుభ్రం చేసుకుని వడ్లు పోసుకుంటున్నారు. మార్కెటింగ్శాఖకు రూ.22.65 కోట్ల ఆదాయం జిల్లాలో బూర్గంపాడు, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, చర్ల, దమ్మపేటలలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటి పరిధిలో చెక్పోస్ట్లు, వ్యవసాయ గిడ్డంగులు, మార్కెట్ యార్డులు ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి మార్కెటింగ్శాఖకు రూ.22.65 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి నెలాఖరు వరకు సుమారు రూ. 19 కోట్లు సమకూరింది. మార్కెటింగ్ శాఖకు వచ్చిన ఆదాయం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కనీస వసతులు కల్పించాల్సి ఉంది. రైతులకు తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు తీర్చాలి. యార్డుల్లో విద్యుత్ దీపాలు, డ్రెయినేజీ సిస్టం, పరిశుభ్రత, టార్ఫాలిన్ల పట్టాలు, సెక్యూరిటీ గార్డుల నియామకం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై వచ్చిన ఆదాయంతో రైతులు భూములకు వెళ్లేందుకు పొలంబాటల అభివృద్ధి, పశు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాంలు నిర్మించాలి. అయితే మార్కెట్ కమిటీలు రైతుల వసతుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు. ప్రభుత్వం మార్కెటింగ్శాఖ ఆదాయాన్ని స్థానిక యార్డుల అభివృద్ధికి కాకుండా ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తోందనే విమర్శలున్నాయి. శుభ్రం చేయని గత సీజన్ చెత్తాచెదారం బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్కు ప్రస్తుతం రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు. యార్డులో ఎక్కడ చూసినా వానాకాలం సీజన్లోని ధాన్యం తూర్పార పట్టగా వచ్చిన తాలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా తయారైంది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా శుభ్రం చేయలేదు. యార్డులో కనీసం పది లారీల వరకు తాలు, చెత్తాచెదారం పేరుకుపోయి ఉంది. దీంతో రైతులే శుభ్రం చేసుకుంటున్నారు. యార్డులో విద్యుత్ లైట్లు సరిగా వెలగడంలేదు. పశువులు రాకుండా ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. మండుటెండల్లో యార్డుకు వస్తున్న రైతులకు కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. రైతుల విశ్రాంతి కోసం లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనంలో ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్లు సరిగా లేకపోవటంతో నిరుపయోగంగా మారాయి. రైతులు పండించిన పంటల క్రయవిక్రయాలపై మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ.. రైతుల అవసరాల కోసం రూపాయి ఖర్చు చేయకపోవటాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.ఆగస్టు నుంచి మార్కెట్ యార్డుకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. విద్యుత్, వాటర్, యార్డు క్లీనింగ్ బిల్లులు రాకపోవడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. యార్డు క్లీనింగ్కు చర్యలు తీసుకుంటాం. రైతులకు కనీస అవసరాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – శారద, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, బూర్గంపాడు మార్కెట్ -
వైభవంగా బేతంపూడి ఉర్సు వేడుకలు
టేకులపల్లి: మండలంలోని బేతంపూడి హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారీ బాబా దర్గా ఉర్సు వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉర్సు కమిటీ ఆధ్వర్యంలో దర్గా ఆవరణ మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సూపర్బజార్కు చెందిన సి.మాలిక్ నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, దర్గాలో సమర్పించారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నుస్రత్ ఆలీ జహంకార్ ఖవ్వాలి కార్యక్రమం ఆకట్టుకుంది. ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాకాహారం ప్రయోజనాలను తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేందర్,శ్రీనివాస్రెడ్డి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కుల, మతాలకతీతంగా భారీగా తరలివచ్చిన భక్తులు -
అక్రమంగా టేకు కలప నరికివేత
దుమ్ముగూడెం: మండలంలోని మంగ్వాయిబాడ్వ గ్రామానికి చెందిన కుంజా ఆదయ్య, పాయం లక్ష్మయ్యకు చెందిన పొలంలో పెంచిన 17 టేకు చెట్లను అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నరికివేసి చోరీ చేశారు. తమ పొలంలో పెంచిన టేకు చెట్లల్లో సుమారు 17 చెట్లను నరికి చోరీ చేశారని బాధితులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆటో, బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద శుక్రవారం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సూర్నపాక రవి, స్వరూప పొలం నుంచి ఇంటికి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. రవి, స్వరూప గాయపడటంతో స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత నెల 27న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేసి అప్పగించాలని ఆదేశాలను జారీచేశారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు గోదావరి పుష్కరాలు–2027 సైతం సమీపిస్తుండటంతో అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతమైంది. తొలుత ఆలయంలోని మొదటి ప్రాకారం నిర్మించేందుకు, ఉపాలయాలను తొలగింపునకు ప్రణాళికలు రచించారు. స్వామివారికి నివేదనను తయారుచేసే వంటశాల తాత్కాలికంగా షెడ్ను కొబ్బరికాయలకు కొట్టే ప్రదేశంలో శబరి విగ్రహం ఉన్న స్థలంలో నిర్మించనుండగా, శుక్రవారం పనులు ప్రారంభించారు. లడ్డూల తయారీ కేంద్రాన్ని సీఆర్వో కార్యాలయంపై భాగాన తానీషా కల్యాణ మండపానికి తరలించనున్నారు. ఇక చిత్రకూట మండపం, భద్ర మహర్షి ఆలయాన్ని సైతం తొలగించనున్నారు. 26న మూర్తులకు పూజలు ఆలయ విస్తరణలో ఉపాలయాల తొలగింపు కీలకంగా మారింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులను తొలగించనున్నారు. లక్ష్మీతాయారు అమ్మవారి మూల మూర్తులను అంతరాలయంలో ఉంచి పూజలను జరపనున్నారు. ఆళ్వార్లు, చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణ పూత వాహనాలను, మూర్తులను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి పనులన్నీ పూర్తి చేసి 26న అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులకు పూజలు చేసి, కదిలించనున్నారు. రూ.4 కోట్లతో భవనాల తొలగింపు ఆలయ అభివృద్ధికి రూ.586 కోట్లను ప్రకటించగా, తొలి విడతగా రూ.351 కోట్లతో మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు భాగాలుగా పనులను విభజించగా, రూ.75కోట్లతో గోదావరి ఘాట్లు, రూ.180కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టనున్నారు. పనుల బాధ్యత అప్పగించిన ఆర్అండ్బీ శాఖ ఏక కాలంలో మూడింటి పనులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. తొలుత ఉపాలయాలు, చిత్రకూట మండపం, ఇతర భవనాల తొలగింపునకు సుమారు రూ. 4కోట్ల తో టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మే మొదటి వారంలో పనులు ప్రారంభించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రామాలయ అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
దమ్మపేట: జీవితంపై విరక్తితో యువకుడు పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తాటిమల్లప్పగుంపు గ్రామానికి చెందిన అవివాహితుడు వాడే రాము (30) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఈ నెల 3న మద్యంలో పురుగులమందును కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి వాడే రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. లచ్చాపురంలో మరో యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన అల్లం సాయిప్రసాద్(25) మద్యానికి బానిసగా మారి ఈ నెల 9న గుర్తుతెలియని పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం మృతిచెందాడు. మృతుడి సోదరి గంపా వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.ఎలుకల మందు తాగిన మహిళ.. టేకులపల్లి: మండలంలోని దాసుతండాకు చెందిన బానోత్ జ్యోతి (45) మనస్తాపంతో ఎలుకలమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ పూల్సింగ్పై ఈనెల 5న చేతి కర్ర విషయంలో అదేతండాకు చెందిన బానోత్ దేవిజ్యా, బానోత్ చిలికి, ఆమె కూతురు కొర్రా సునీత దాడిచేస్తుంటే ఆపడానికి వెళ్లిన జ్యోతిపై కూడా కర్రలతో దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో జ్యోతి మనస్తాపానికి గురై ఎలుకలమందు తాగి.. తన సోదరుడికి విషయం తెలిపింది. దీంతో కుటుంబీకులు ఆమెను ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. జ్యోతి తల్లి హంస్లీ ఫిర్యాదు మేరకు బానోత్ దేవిజ్యా, బానోత్ చిలికి, కొర్రా సునీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేందర్ వెల్లడించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రేమలత
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా ప్రధాన న్యా యమూర్తిగా వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ప్రేమలత బదిలీపై రానున్నా రు. ఇప్పటివరకు జిల్లాప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పాటిల్ వసంత్ నల్లగొండకు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణకవచాలతో రామయ్య దర్శనంభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలతో దర్శనమిచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచా మృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. 20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 20వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణపై శుక్రవా రం అడిషనల్ కలెక్టర్వేణుగోపాల్ జిల్లా విద్యాధికారులతో తన చాంబర్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పదోతరగతి పరీ క్షలు 1,045మంది రాయనుండగా, ఐదు కేంద్రాలు, ఇంటర్ పరీక్షలు 1196 మంది రాయనుండగా, ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతాయని తెలిపారు. సెంటర్లలో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్స్, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షల కు హాల్టికెట్, ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజ రుకావాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి. నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శంభుప్రసాద్, వైద్య, పోలీసు, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్,ఇంటర్మీడియట్, ఆర్టీసీశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు సమాచారం కోసం ఎస్.మాధవరావును 89192 79238 నంబరులో సంప్రదించాలని సూచించారు. రామాలయానికి బారికేడ్ల వితరణభద్రాచలంటౌన్: మై హోమ్ ఇండస్ట్రీస్ (మహా సిమెంట్) యాజమాన్యం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి రూ. 4 లక్షల విలువైన 25 బారికేడ్లను శుక్రవారం బహూకరించింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె.దామోదర్రావు, ఏఈఓ శ్రవణ్ కుమార్లను సంస్థ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహా సిమెంట్ స్టేట్ హెడ్ కరుణాకర్ రావు, మార్కెటింగ్ మేనేజర్ సునీల్, రీజినల్ మేనేజర్ శ్రీనివాసరావు, డీలర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. -
ఎర్ర బంగారం కళకళ
● ‘తేజా’రకం క్వింటాకు రూ.20 వేలు దాటిన ధర ● దిగుబడి తగ్గిన వేళ పెరుగుతున్న డిమాండ్ ఖమ్మంవ్యవసాయం: తేజా రకం మిర్చి ధర కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ఈ రకం మిర్చి క్వింటాకు జెండాపాట రూ.20,100గా పలికింది. పంట సీజన్ ఆరంభంతో పోలిస్తే రూ.5 వేల వరకు పెరిగినట్లయింది. ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి నవంబర్లో మొదలుకాగా తొలినాళ్లలో గరిష్టంగా రూ.15 వేలు ధర పలికింది. సంక్రాంతి వరకు అదే పరిస్థితి ఉండగా.. జనవరి 20న రూ.17,600కు చేరింది. ఇక జనవరి 20 నుంచి 23వరకు మాత్రం రూ.20 వేల నుంచి 21,150 వరకు ధర పలికింది. మళ్లీ ఫిబ్రవరిలో రూ.18 వేలకు పడిపోయినా మార్చి నుంచి క్రమంగా పెరుగుతోంది. గురువారం రూ.19,800గా పలికిన ధర శుక్రవారం రూ.20,100కు చేరడం విశేషం. అంతేకాకుండా మరింత నాణ్యత కలిగిన కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ మిర్చి ధర రూ.20,500గా పలికింది. కాగా, మార్కెట్కు ప్రతిరోజూ సగటున 35 – 40 వేల బస్తాలకు పైగా మిర్చి తీసుకొస్తున్నారు. సాగు, దిగుబడి తగ్గడంతో.. మిర్చి పంట సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా తగ్గింది. సాధారణంగా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి గత ఏడాది 60 వేల ఎకరాలకు, ఈసారి 30 వేల ఎకరాలకు పడిపోయింది. గతంలో ఎదురైన నష్టాలతో రైతులు సాగు తగ్గించారు. అంతేకాక అధిక వర్షాలు, నల్లి కారణంగా దిగుబడులు కూడా రాలేదు. సాధారణంగా ఎకరాకు 30 – 40 క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఈ ఏడాది 15 క్వింటాళ్లు దాటలేదు. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి మిర్చి విదేశీ ఆర్డర్లు లేకున్నా దేశీయంగా డిమాండ్ పలుకుతోంది. ఇక్కడ కొనుగోలు చేసే తేజా రకం మిర్చిని కోల్కత్తా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం చైనాకు కూడా పంపిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి కోల్డ్స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇలా రకారకాల కారణాలతో గత ఏడాది ధరతో పోలిస్తే ఈసారి ఽమిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మిర్చి ధర కొంత మేరకు ఆశాజనకంగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో పంట సాగు చేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 50 బస్తాల మిర్చిని ఖమ్మం తీసుకొస్తే క్వింటాకు రూ.20 వేల ధర పలికింది. –బానోత్ కిషన్, నల్లెల్ల, మహబూబాబాద్ జిల్లా -
కలెక్టర్ సహకారంతోనే రాష్ట్ర అవార్డులు
సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసిన అవార్డుల్లో సుమారు 20 శాతం అవార్డులు జిల్లా టీవీవీపీ ఆస్పత్రులకు దక్కడం శుభపరిణామమని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు గురువారం కలెక్టర్ అంకిత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత కలెక్టర్ జితేష్ పాటిల్ నుంచి ప్రస్తుత కలెక్టర్ అంకిత్ వరకు సంపూర్ణ మద్దతు, సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సూపరింటెండెంట్లు తెలిపారు. వివిధ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సూచించిన అంశాలను ముందుండి గత ఒకటిన్నర ఏళ్లుగా దూరప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో రక్త నిల్వ కేంద్రాల స్థాపన, ఆపరేషన్ థియేటర్ల అభివృద్ధి, నిపుణులైన వైద్యులను ప్రోత్సాహకాలతో నియామకం, డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్ పరికరాల సమీకరణ, డిజిటల్ ఎక్స్–రే, ఈసీజీ యంత్రాల ఏర్పాటు, ఆస్పత్రుల మరమ్మతులు, పునరుద్ధరణ, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యాలు, డైట్, శానిటేషన్ సదుపాయాలు, వార్డుల్లో ఏసీలు, కూలర్లు తదితర మౌలిక వసతులు మెరుగుపర్చారని వివరించారు. ఈ చర్యల ఫలితంగా ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, క్లిష్ట కేసులను స్థానికంగానే నిర్వహించబడుతున్నట్లు చెప్పారు. అనంతరం సూపరింటెండెంట్లు కలెక్టర్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, రామ్ప్రసాద్, గౌరీప్రసాద్, హర్షవర్ధన్, జీజీ హెచ్ సూపరింటెండెంట్ రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. -
13న పునరేకీకరణ ‘అభ్యర్థన సదస్సు’
టీజీ ఈజేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ‘ఏలూరి’ఖమ్మం సహకారనగర్: భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎటపాక, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల జీపీలను ఏపీలో విలీనం చేయడం వల్ల భద్రాచలం కేవలం 10 చ.కి.మీకే పరిమితమైందన్నారు. తద్వారా అభివృద్ధికి ఆటంకంగా మారినందున తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో సామాజిక బాధ్యతగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు 13వ తేదీన తేదీన భద్రాచలం పాత ఆర్అండ్బీ భవనంలో ‘అభ్యర్థన సదస్సు‘నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యను రాజకీయ అంశంగా సామాజిక బాధ్యతగా చూస్తూ అందరూ హాజరుకావాలని కోరారు. అనంతరం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, బాధ్యులు కొణిదన శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, తుంబూరు సునీల్రెడ్డి, మల్లెల రవీంద్రప్రసాద్, పారుపల్లి నాగేశ్వరరావు, కట్టా శేఖర్రావు, సుబ్బయ్య, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాజుకుంటున్న ‘పంచాయితీ’
● ఐదు విలీన పంచాయతీల కోసం ఉద్యోగ సంఘాల పోరు ● తెలంగాణలో కలపాలని పార్లమెంట్లో లేవనెత్తిన ఎంపీలు భద్రాచలం: అన్యాయంగా, ప్రజల మద్దతు లేకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించగా, జిల్లా మంత్రులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన దివ్యా రాజన్ తెలంగాణలో కలిపితే ఆ గ్రామాల ప్రజలకు ఉపయోగకరమని ప్రభుత్వానికి నివేదిక కూడ అందజేశారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాన్గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఐదు గ్రామపంచాయతీల కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని పేర్కొంటున్నారు. అసంబద్ధంగా రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం మండల పరిధిలో యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెంలు ఉండేవి. భద్రాచలం పట్టణానికి మూడువైపులా సరిహద్దుల్లో ఈ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఆర్డినెన్స్ ద్వారా ఐదు పంచాయతీలను ఏపీలో కలిపారు. దీంతో భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ప్రజలు నాటి నుంచి మనోవ్యధకు గురవుతూ దశాబ్దకాలంగా తిరిగి తెలంగాణలో కలపాలని వేడుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో 2,161, పిచుకలపాడు పరిధిలో 2,187, గుండాల పరిధిలో 3,816, పురుషోత్నపట్నంలో 1,372, యటపాకలో 2,410తో మొత్తం 11,946 జనాభా ఉండగా, ప్రస్తుతం 25 వేలకు పైగా జనాభా ఉంటుందని అంచనా. భద్రాచలం పట్టణంలో నాడు 40 వేల జనాభా ఉండగా ఇప్పుడు సుమారు లక్ష వరకు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ జేఏసీ నేతృత్వంలో ఉద్యమం ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. గురువారం భద్రాచలంలో నిర్వహించిన ఐక్య వేదిక సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతోపాటు రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ నెల 13న భద్రాచలంలోని భారీ సభ నిర్వహించనున్నారు. ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉద్యోగ, ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో ఐదు పంచాయతీల వేడి రాజుకుంటోంది. -
మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
ఇల్లెందు: ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కోపోద్రికులైన కుటుంబీకులు ఇల్లెందుపోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలిలా.. ఈ నెల 5వ తేదీన గుండాల మండలం కాచనపల్లి జగ్గుతండాకు చెందిన గుగులోత్ పవన్(27) ఇంటి నుంచి బయలుదేరి టేకులపల్లి మండలం దాసుతండా అక్కడి నుంచి ఇల్లెందు చేరుకున్నాడు. తిరిగి ఇంటికి బయలుదేరే క్రమాన ఇల్లెందు నుంచి గుండాలకు వెళ్లే ఆర్టీసీ బస్ మిస్ కావడంతో ఓ కిరాయి ఆటోలో జగ్గుతండాకు బయలు దేరాడని, ఇంటికి చేరకుండా మార్గమధ్యలో తన తమ్ముడు పవన్ను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని సోదరుడు గుగులోత్ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఖమ్మంలో వైద్యం పొందుతున్న పవన్ మృతి చెందగా.. ఖమ్మం నుంచి మృతదేహంతో నేరుగా ఇల్లెందు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సీఐ సురేష్ ఆందోళనకారులతో చర్చించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆటో డ్రైవర్ వంశీ, హరి, వెంకన్నలపై తమకు అనుమానం ఉందని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘బావి’తరాలకు కనుమరుగు..
పాల్వంచరూరల్: 66 ఏళ్ల క్రితం పెద్దమ్మతల్లిని ప్రతిష్ఠించినప్పుడు తీసిన చేదబావిని పూడ్చివేశారు. మండల పరిధి కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారిని చింత చెట్టు కింద ప్రతిష్ఠించక ఏడాది మునుపే నాడు అటవీ ప్రాంతంలో తాగునీటి సౌకర్యార్థం 40 అడుగుల చేద బావిని తవ్వారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన బావిని ఇటీవల ఎండోమెంట్ అధికారులు పూడ్చివేసి గోడలను మాత్రం నామమాత్రంగా ఉంచారు. పురాతన బావిని పూడ్చడం సరికాదని భక్తులు పేర్కొంటుండగా.. ఈ విషయమై ఆలయ ఈఓ ఎన్.రజనికుమారిని ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. ఏంటి తల్లీ ఈ నిర్లక్ష్యం.. పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లే క్యూలైన్ బారికేడ్ పైపు విరిగినా, స్వాగతం కన్య విగ్రహం రెక్క విరిగిన ఇటు ఈఓ గాని, అటు పాలకవర్గం గాని పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో బారికేడ్ పైపు విరిగి ప్రమాదకరంగా మారుతుంది. ఆలయం వెనక ఉన్న స్వాగత విగ్రహానికి ఒక రెక్క విరిగి పోయి రోజులవుతున్నా ఎవరూ పట్టించుకున్న నాథుడే లేరు. దీంతో ఏంటి తల్లి ఇంత నిర్లక్ష్యం అంటు భక్తులు వాపోతున్నారు. -
జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలపై సమీక్ష
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించే మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల ఏర్పాట్లపై గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ జీఎం పర్సనల్ వెల్ఫేర్ – సీఎస్ఆర్ చాంబర్లో జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ జీ.వీ.కిరణ్కుమార్ అధ్యక్షతన బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి, హెచ్ఆర్డీ కాన్ఫరెన్స్ హాల్లో చేయబోయే ఏర్పాట్లను సివిల్, ఎలక్ట్రికల్, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి పరిశీలించారు. సింగరేణీయులందరూ పాల్గొని జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ లైజన్ ఆఫీసర్ వి.మురళి, బీసీ అసోసియేషన్ చీఫ్ లైసన్ హరిశంకర్రావు, ఎస్సీ లైజన్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, డీజీఎం(పర్సనల్)లు కేసా నారాయణరావు, బి.శివకేశవరావు, బీసీ అసోసియేషన్ సభ్యుడు, డీజీఎం(ఈ–ఎం) ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు. భద్రాచలం ఎస్డీసీగా ఆనంద్కుమార్ భద్రాచలం: భద్రాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ – ట్రైబల్ వెల్ఫేర్)గా ఎన్.ఆనంద్కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఆనంద్కుమార్ను భద్రాచలం ఎస్డీసీగా నియమించారు. టేకులపల్లి కార్యదర్శి సస్పెన్షన్ టేకులపల్లి: టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీలో ప్రొటోకాల్ పాటించడం లేదని సర్పంచ్ బోడ బాలు ఎంపీడీఓ, కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టి నివేదిక తయారు చేశారు. ఈమేరకు కలెక్టర్ అంకిత్కు నివేదిక అందజేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డీపీఓ సుధీర్ ఆమెను సస్పెండ్ చేస్తూ మూడు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. బస్టాండ్లో ఒడిశా వాసి మృతి సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ఒడిశాకు చెందిన అరవింద్(45) గురువారం మృతి చెందాడు. కొత్తగూడెం వన్టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్లో నిద్రపోయిన అరవింద్ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. మృతుడు బయ్యారం ఇటుకబట్టిలో పని చేస్తున్నాడని, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చెక్బౌన్స్ కేసులో మహిళకు రిమాండ్ సూపర్బజార్(కొత్తగూడెం): చెక్బౌన్స్ కేసులో ఓ మహిళకు 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. చుంచుపల్లి మండలం రాంనగర్కు చెందిన కె.రామకృష్ణారెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఆలేటి అరుణపై 2022లో చెక్బౌన్స్ కేసు పెట్టారు. కేసు నడుస్తుండగా అరుణ తరచూ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, ఆమెకు 14రోజుల రిమాండ్ విధిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మొదటిశ్రేణి న్యాయమూర్తి బి.రవికుమార్ తీర్పు చెప్పారు. దీంతో అరుణను భద్రాచలం సబ్జైలుకు తరలించారు. భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధి సత్యనారాయణపురం(మొండికట్ట) గ్రామానికి చెందిన మోగిత ప్రశాంత్, సరిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఈక్రమాన గురువారం భర్త, అత్తల మధ్య గొడవ జరగగా సరిత పురుగుమంది తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన భర్త కూడా పురుగుమందు తాగడంతో కుటుంబసభ్యులు అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
రెండో రోజు ఆర్టిజన్ల వంటా వార్పు
పాల్వంచ/సూపర్బజార్(కొత్తగూడెం): ఆర్టిజన్లను ఉద్యోగులుగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాల్వంచలో కేటీపీఎస్ ఆస్పత్రి ఎదుట మైదానంలో ధర్నా చేపట్టి వంటావార్పు నిర్వహించారు. జేఎసీ, ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఒకే సంస్థలో వేర్వేరు రూల్స్ ఎలా వర్తింపజేస్తారని, సమస్యలు పరిష్కరించే వరకూ విధుల్లోకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాగా, సాయంత్రం 5 గంటల వరకు విధుల్లోకి రాకుంటే తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపు ధోరణికి పాల్పడుతుందని, ఈనెల 13న లేబర్ కమిషనర్తో చర్చలు ఉండగా ఏవిధంగా డిస్మస్ చేస్తారని ప్రశ్నించారు. నాయకులు సాయిలు, పురుషోత్తంరావు, బాలకృష్ణ, అనిల్, నర్సింహారెడ్డి, రమేష్, సాంబ, రవీందర్, రాములు, జలీల్, కోటేశ్వరరావు, రాజేందర్, సాధం రామకృష్ణ, సతీష్రెడ్డి, మల్లయ్య, వేణుగోపాల్రెడ్డి, సాయిబాబు, వెంకట్రావ్, రమేష్, సాంబ, రవీందర్, శ్రీనివాసరావు, శారద నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెం డివిజన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మెలో ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలి నినాదాలు చేశారు. సమ్మెకు మద్దతుగా టీజీయూఈఈయూ(సీఐటీయూ) కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి పులి గణేష్బాబు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నుంచి కత్తి శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి, సీపీఎం పట్టణ కార్యదర్శి బాలరాజు, సింగరేణి సీఐటీయూ అధ్యక్షుడు మంద నరసింహారావు, టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ కూనూరాజు శ్రీనివాస్, కొత్తగూడెం డివిజన్ చైర్మన్ మోతీరామ్, కన్వీనర్ రాంబాబు, కో కన్వీనర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. డిస్మిస్ చేస్తామంటూ అల్టిమేటం.. తమ సమస్యల పరిష్కారానికి పాల్వంచలోని కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో ఉన్న కార్మికులు 95శాతం మంది విధులకు గైర్హాజరు అయ్యారు. అయితే సాయంత్రం షిప్ట్లోగా విధుల్లోకి రాకుండా యాజమాన్యం డిస్మస్ చేస్తామని చెప్పడంతో కొంతమంది మాత్రమే విధుల్లోకి వెళ్లారు. -
భద్రాచలం సబ్ జైల్లో హెల్త్ క్యాంప్..
భద్రాచలంఅర్బన్: తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ జైల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు జిల్లా క్షయ వాధి నివారణ అధికారి డాక్టర్ పుల్లారెడ్డి, పీపీఎం, ఏసీఎస్ఎం కోర్డినేటర్ డాక్టర్ సోమయ్యలు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. రెండు వారాల పాటు దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఎక్స్రే, తేమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాఽధి నిర్థారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడాలని, అందుకు పోషణ భత్యం కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి అందిస్తుందని చెప్పారు. అనంతరం ఖైదీలకు ఎయిడ్స్, బీపీ, ఆర్బీఎస్, సిప్లిస్, హెపీవీ, హెచ్బీఎస్ఏజీ–1,2లకు సంబంధించిన రక్తపరీక్షలతో తేమడ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, భద్రాచలం ఏడీటీసీఓ డాక్టర్ పావనిరెడ్డి, ఇతర వైద్యులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
పురుగుల మందే శరణ్యం..
● ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా ఇంటికి అడ్డంకులు ● నిర్మాణం చేపట్టి మూడు నెలలు అవుతున్నా పట్టింపు కరువు దుమ్ముగూడెం : మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన తాటి లక్ష్మికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణం ప్రారంభించి మూడు నెలలు కావొస్తున్నా నేటికీ పంచాయతీ కార్యదర్శి ఫొటో తీయలేదని ఎంపీడీఓ, తహసీల్దార్లకు గురువారం ఫిర్యాదు చేసింది. ములకపాడు గ్రామంలోని సర్వే నెం.149/1పి/1 గల భూమిలో గుడిసె వేసుకుని గత 35 ఏళ్లుగా లక్ష్మి తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈక్రమాన ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్, ఎంపీడీఓల సమక్షంలో భూమి పూజ చేపట్టి ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే మూడు నెలలు గడుస్తున్నా నేటికీ ఇంటి నిర్మాణ ఫొటో తీయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకే స్థలం ఇద్దరికి.. కాగా, అదే సర్వే నంబర్లో 2008వ సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ మూడు సెంట్ల భూమి తనకు కేటాయించారని తెలిపారు. అయితే అదే సర్వే నంబర్ 149/1పి/1లో గల 1.1880 భూమిని మరో గిరిజన మహిళకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సమయంలో ముగ్గురు వ్యక్తులు తమపై దాడి చేసి, దుర్భాషలాడారని దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం సక్రమంగా జరిగేలా అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కుటుంబం అంతా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. -
నగరంలో జర్మనీ బృందం..
● కార్పొరేషన్లోని పలు ప్రాంతాలను సందర్శించిన ప్రతినిధులు ● టీఓడీ ప్రాజెక్ట్ ద్వారా రుణ మంజూరుకు అవకాశం కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం కొత్తగూడెం కార్పొరేషన్లో పర్యటించారు. ట్రాన్సి ట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ (టీఓడీ) ప్రాజెక్ట్ అమలులో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్కు ఆర్థికసాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు ఎస్.పరిమల్, ఎన్ఎన్రావు, రుచిఖరనాలతో పాటు ఢిల్లీకి చెందిన నితిన్ తదితరులు కొత్తగూడెం నుంచి పెద్దమ్మగుడి వరకు నగర తీరుతెన్నులు పరిశీలించారు. పాల్వంచలోని నటరాజ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, మున్సిపల్ స్టేడియం, కొత్తగూడెం ఫుడ్కోర్ట్ తదితర ప్రాంతాలను సందర్శించారు. తొలుత కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న సర్వీసులు, ఆర్థిక వనరుల వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి కావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని మేయర్ మూడ్ గణేష్ కోరారు. కమిషనర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు. నగర అభివృద్ధికి నిధులు నగర అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రతినిధులు ప్రాజెక్ట్ పురోగతి, అమలు విధానం, మౌలిక వసతులు, అభివృద్ధిపై చర్చించి, అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన రవాణా మార్గాలు, రైల్వే, బస్సు కారిడార్ల పరిసర ప్రాంతాలను అభివృద్ధి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నివాసాలు, ఉద్యోగాలు, వాణిజ్య కేంద్రాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్ట్లు, ఫుట్పాత్లు, రహదారుల అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్ బృందం రుణ ఆమోదం ఇస్తే నగరం అభివృద్ధి కానుంది. -
చెట్ల పొదల్లో రేషన్ బియ్యం
● 70 క్వింటాళ్లను గుర్తించిన పౌరసరఫరాల అధికారులు ● లక్ష్మీదేవిపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మాఫియా సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సన్న బియ్యం అక్రమ వ్యాపారంలో మరో కీలకమైన తీగ పౌర సరఫరాల శాఖకు దొరికింది. ఇక్కడ నుంచి విచారణ ముమ్మరం చేస్తే దందా గుట్టు రట్టయ్యే అవకాశముంది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సుజాతనగర్ మండలం అంజనాపురంలో రేషన్ డీలర్పై కేసు నమోదైంది. తాజాగా గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలో నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. రూటుమార్చిన అక్రమార్కులు సన్నబియ్యం అక్రమ రవాణాపై వరుసగా వార్తా కథనాలతో మాఫియా రూటు మార్చింది. నిన్నా మొన్నటి వరకు ఊరి మధ్యలో అనధికారిక గోదాంల్లో బియ్యం దాచి ఉంచేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి ఊరికి దూరంగా చెట్ల పొదల్లో చిన్న చిన్న మూటలుగా నిల్వ ఉంచారు. అయితే సమాచారం అందడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి సుమారు 70 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు. హేమచంద్రాపురం గ్రామంలో తనిఖీలు చేయగా ఓ ఇంట్లో బియ్యాన్ని తూచేందుకు ఉపయోగించే కాటాలు, మరో మూడు క్వింటాళ్ల వరకు బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచిన చక్రాల నరసింహరావుపై కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అఽధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. పొదల్లో బియ్యం దాచిన వ్యక్తులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. దందాకు అడ్డుకట్ట ఎప్పుడు? జిల్లా కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు సన్న బియ్యం అక్రమ దందాకు కేంద్ర బిందువులుగా వ్యవహరిస్తున్నారు. రోజూ వచ్చిన బియ్యం వచ్చినట్టుగా పక్కదారి పడుతుంటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు నజర్ పెట్టారు. దందాలో కీలకంగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ‘ఖద్దరు’నేతల పేరు చెబుతూ, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని అధికారులు తమవైపు కన్నెత్తి చూడకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఓ వైపు దాడులు జరుగుతున్నా బియ్యం దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పుడు ఏకంగా క్వింటాళ్ల కొద్దీ బియ్యం లెక్కాపత్రం లేకుండా చెట్ల పొదల్లో లభించింది. ఇప్పటికై నా రేషన్ మాఫియాపై అధికారులు దృష్టి పెట్టాలనే డిమాండ్ అధికార పార్టీ నేతల నుంచే వస్తోంది. కొందరి స్వార్థంతో తమ పార్టీకి పేరు తీసుకురావాల్సిన పథకం నిర్వీర్యం అవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
సురక్షిత వాతావరణం కల్పించాలి
● బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్రెడ్డి ● బాలల హక్కుల పరిరక్షణపై ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సమీక్ష సూపర్బజార్(కొత్తగూడెం): అన్ని శాఖలు సమన్వయంతో బాలలకు సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలల భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణ, మరుగుదొడ్ల వినియోగం, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ కేసుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను కమిషన్ దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ములకలపల్లి మండలం ధర్మన్న నగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం గమనించామని, అటవీశాఖ అనుమతుల సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవసరమైతే కంటైనర్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పిల్లల సమస్యల పరిష్కారానికి అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు. సమగ్ర చర్యలు.. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. బాలసదన్ ద్వారా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పిల్లల సమస్యలపై తక్షణ స్పందన అందిస్తున్నామని వివరించారు. అన్ని పాఠశాలల్లో పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23 తరువాత బడిబాట కార్యక్రమం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తిస్తామని అన్నారు. సికిల్ సెల్ అనీమియా నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులను గుర్తించి, రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కమిటీ మెంబర్లు కంచికచర్ల వందన గౌడ్, చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత, వచన్ కుమార్, భరత రాణి, సుమిత్ర దేవి, సాధిక్ పాష, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఖమ్మం డీడబ్ల్యూఓ వేల్పుల విజేత తదితరులు పాల్గొన్నారు.పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కె. సీతాదయాకర్రెడ్డి సందర్శించారు. డీర్ పార్కు, జలాశయాలను వీక్షించారు. రిజర్వాయర్లో బోటు షికారు చేశారు. చైర్మన్తోపాటు కమిషన్ సభ్యులు వందనగౌడ్, చందన్, అపర్ణ, సాధిక్పాషా, సుమతి, భారతరాణి ఉన్నారు. -
రామయ్య కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోకంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. రైల్వే సమస్యలపై స్పందించండిరైల్వే మంత్రిత్వ శాఖ ఈడీకి ఎంపీ రఘురాంరెడ్డి వినతి కొత్తగూడెంఅర్బన్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వికాస్కుమార్ జైన్కు గురువారం ఆయన వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీదుగా వెళ్లనున్న డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్ – గద్వాల లైన్ అలైన్మెంట్ను మార్చి వెన్నారం, కురవి, అబ్బాయిపాలెం, మరిపెడ, మోతె మీదుగా లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ నుంచి న్యూ గొల్లగూడెం మీదుగా రహదారి విస్తరణకు 4,556 చ.మీ. రైల్వే భూమి అవసరమని తెలిపారు. ఇందుకు బదులుగా ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 9,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇవ్వనున్నందున ఇరు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఎంపీ కోరారు. ఎయిడ్స్పై అవగాహన ర్యాలీచుంచుపల్లి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్ డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వివాహానికి ముందు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి. ప్రసాద్, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, కార్యక్రమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ అంకిత్ ● యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన కొత్తగూడెంఅర్బన్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన కొత్తగూడెంలో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. లెవెలింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనాల రూపకల్పన, కల్పించే సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంఈఓకు షోకాజ్ నోటీస్.. పాతకొత్తగూడెంలో ఉన్న సమగ్ర శిక్ష పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం, పట్టణ బాలుర ఆవాస విద్యాలయం (యూఆర్ఎస్ )లను గురువారం కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంగ్లిష్ పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోధనలో లోపాలను గుర్తించి, ప్రిన్సిపాల్ను వివరణ కోరారు. స్టోర్రూమ్లో అవసరమైన సరుకులు లేకపోవడం, కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ వీధి బాలలు, రక్షిత బాలలు, డ్రాప్ అవుట్ బాలలు చదువుతున్నందున ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఓటు బ్యాంక్ను కాపాడుకునే, కేడర్లో జోష్ నింపే పనిలో పడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. త్వరలో సర్ అమలు ఓటర్ల జాబితాలో అవకతవకలను సరి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఓటరు గుర్తింపు కార్డు, ఒకటికి మించి ఉన్న ఓటరు కార్డులను తొలగిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అమలు చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ–ఎన్డీఏకి అనుకూలంగా సర్ ప్రక్రియ సాగుతోందని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సర్ జరుగుతున్న ప్రతీ చోట తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు, మూడు నెలల్లో తెలంగాణలో కూడా సర్ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలకంగా బూత్ లెవల్ ఇన్చార్జిలు జిల్లాస్థాయిలో సర్ అమలు బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఓటర్ల నుంచి వివరాలు సేకరించడం, పరిశీలించడం, నకిలీ, డబుల్ ఓట్లను తొలగించడం, చివరకు తుది జాబితాను ప్రకటించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఓట్ల తొలగింపు సున్నితమైన వ్యవహారం కావడంతో సర్ అమలు చేసిన ప్రతీ చోట వివాదాలు ఏర్పడుతున్నాయి. తమ ఓట్లు అన్యాయంగా తొలగించారంటూ ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో అభ్యంతరాల స్వీకరణకు బూత్ లెవల్ ఇన్చార్జిలు ఇచ్చే దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో బూత్ లెవల్ ఇన్చార్జిల నియామకం కీలకంగా మారింది. రంగంలోకి కాంగ్రెస్ ఓ వైపు సర్ అమలవుతున్న తీరుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మరోవైపు సర్కు సన్నద్ధమవుతోంది. ప్రతికూల ప్రభావాలు తమ పార్టీపై పడకుండా కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పోలింగ్ రోజున ఓటర్లను తరలించడం వంటి పనులు చేసే వారికి బూత్ లెవల్ ఇన్చార్జి పనిని రాజకీయ పార్టీలు అప్పగిస్తుంటాయి. కానీ, ఈసారి వీటికి తోడు ఓటు హక్కుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నవారిని ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా బూత్ లెవల్లో చురుకై న కార్యకర్తలను గుర్తించేందుకు అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఇన్చార్జిలను ఇప్పటికే నియమించింది. సదరు ఇన్చార్జిలు నియోజకర్గాల వారీగా అక్కడున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. సర్ ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బూత్ లెవల్ ఇన్చార్జిల ఎంపిక వంటి అంశాలపై చర్చలు మొదలు పెట్టారు. ఈ నెల 11లో ఇన్చార్జిలను ఎంపిక చేసి జాబితాను పీసీసీకి అప్పగించాల్సి ఉంది.బూత్ లెవల్ ఇన్చార్జిల నియామకాలకు సంబంధించి కొత్తగూడెం, సత్తుపల్లికి ఇన్చార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, భద్రాచలం ఇన్చార్జిగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ను నియమించారు. వీరు ఇప్పటికే తమ పని ప్రారంభించారు. ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు కూచన రవళీరెడ్డి, అశ్వారావుపేటకు సకలం రాజేశ్వరరావు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లాకు చెందిన నాగా సీతారాములును ములుగు, నర్సంపేట అసెంబ్లీ నియోజకర్గాలకు, మోతుకూరి ధర్మారావును వర్ధన్నపేకు ఇన్చార్జిలుగా నియమించారు.త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ -
భద్రగిరి మార్ట్కు ఆదరణ
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్భధ్రాచలం: గిరిజన నిరుద్యోగులకు, మహిళా సమాఖ్యలకు చేయూతనిచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్కు ఆదరణ లభిస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గురువారం ఐటీడీఏలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులను రిసీవ్ చేసుకునేందుకు గ్రూప్–4 గిరిజన మహిళా ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మార్ట్ ద్వారా రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తుందన్నారు. ముడి సరుకులకు ఇబ్బందులు లేకుండా జీసీసీ సహకారం తీసుకుంటున్నామని, త్వరలో పాల్వంచ, ఖమ్మం కేంద్రాలలో మార్టులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. భద్రాచలం మినీ స్టేడియం అధునాతనంగా నిర్మించేందుకు రూ.4 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సెంట్రల్ లైటింగ్ పనులకు తిరిగి టెండర్లను నిర్ణయించి పనులను పూర్తి చేస్తామని, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై దృష్టి సారిస్తామని వివరించారు. స్టేడియానికి 5 ఎకరాలు కేటాయింపు భద్రాచలంటౌన్: పట్టణంలో స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. బుధవారం రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంటనే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డీవైఎస్ఓ పరంధామరెడ్డిని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ దనియాల వెంకటేశ్వర్లు పంచనామా నిర్వహించి భూమిని క్రీడా శాఖకు అప్పగించారు. సర్పంచ్ పూనెం కృష్ణ, అధికారులు హరీష్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఉర్సు వేడుకలు
టేకులపల్లి: మండలంలోని బేతంపూడిలో ఉన్న హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారీ బాబా దర్గా ఉర్సు వేడుకలు ఈనెల 10న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఉర్సు కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. కులమతాలకు అతీతంగా జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దర్గా ఆవరణలో తోరణాలు కట్టారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సూపర్ బజార్కు చెందిన సి.మాలిక్ నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు. గంధం దర్గాలో సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో ఢిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నుస్రత్ ఆలీ జహంకార్ ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏటా సుమారు పది వేల మందికిపైగా భక్తులు తరలివస్తారని, ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అదుపుతప్పి బోల్తాపడిన స్కార్పియో
దుమ్ముగూడెం: మండలంలోని కోయనర్సాపురం శివారులో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన స్కార్పియో వాహనం బోల్తాపడింది ఛత్తీస్గఢ్ నుంచి మారాయిగూడెం, చెరుపల్లి మీదుగా భద్రాచలం వెళ్తున్న స్కార్పియో కోయనర్సాపురం శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని నలుగురు డీఆర్జీ జవాన్లు క్షేమంగా బయటపడ్డారు. వ్యక్తి అదృశ్యంపై కేసుదమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం వాసి కనిపించకుండాపోయిన ఘటనపై పోలీసులు బుధవా రం కేసు నమోదు చేశారు. మొద్దులగూడెం గ్రా మానికి చెందిన ఈదా నాగేంద్రబాబు(27) మొక్క జొన్న సీడ్ అర్గనైజర్గా అయుష్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 31న అతడు పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం నాగేంద్రబాబు భార్య రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం జూలూరుపాడు: జూలూరుపా డు విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత కారణంగా సబ్స్టేషన్లోని ఫీడర్ ట్రిప్ అవడంతోతీగల పైనుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. కింద ఉన్న చెత్తకు నిప్పురవ్వలు అంటుకోవడంతో మంటలు వ్యాప్తిచెందాయి. గమనించిన విద్యుత్ లైన్మెన్ భాస్కర్, సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ ఫలి తం లేకపోవడంతో ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటల ను ఆర్పివేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఇసుక నిల్వలు సీజ్బూర్గంపాడు: మండలంలోని రెండు గ్రామాల్లో నిల్వచేసిన ఇసుకను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. బూర్గంపాడులో 40 ట్రక్కులు, నాగినేనిప్రోలులో 43 ట్రక్కుల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించి విక్రయించనున్నట్లు తహసీల్దార్ ప్రసాద్ వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ సుజాతనగర్: గంజాయితో పట్టుబడిన ఇద్దరిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చుంచుపల్లి సీఐ ఆర్.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎస్ఐ ఎం.రమాదేవి ఆధ్వర్యంలో స్థానిక ధన్వంతరీ కళాశాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తగూడెంకు చెందిన యాకూబ్పాషా, సుజాతనగర్ మండలంలోని డేగలమడుగు గ్రామానికి చెందిన కుదురుబోయిన నరసింహారావు నిషేధిత గంజాయితో పట్టుబడ్డారని, వారి వద్ద నుంచి రూ.7,580 విలువ గల 151 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు కొత్తగూడెం శేషగిరినగర్కు చెందిన కిరణ్ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. హెచ్ఎం సస్పెండ్ కామేపల్లి: కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బి.నెహ్రూపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడమే కాక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
ఖమ్మంక్రైం: పోలీసులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుందని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఖమ్మం సిటీ ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్ ఆవరణలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు షటిల్ ఆడిన సీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, కుటుంబాలు కాంప్లెక్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తలసేమియా నిర్మూలనే లక్ష్యం ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా రహిత సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు పిలుపునిచ్చారు. వచ్చేనెల 8న ప్రపంచ తలసేమియా దినోత్సవం జరుపుకోనుండగా, నెల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలోని రితన్య ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీఎస్బీ ఏసీపీ టి.మహేష్, సీఏఆర్ ఏసీపీ నరసయ్య, సీసీఎస్ ఏసీపీ సర్వర్, సీఎస్బీ సీఐ రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడు తూ సంకల్ప సంస్థకు అండగా నిలిచేలా చిన్నారులకు అవసరమైన సమయాల్లో రక్తదానం చేస్తామని తెలిపారు. ఆతర్వాత డాక్టర్ డి.నారాయణమూర్తి, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి రవిచందర్ మాట్లాడగా ఏసీపీ టి.మహేష్, సీఐ రాజిరెడ్డి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడేనికి చెందిన రజని సాయిరాం ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం అనంతారం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రామన్నగూడెం శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సారియారంను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. -
ఆదా చేస్తేనే గృహజ్యోతి
భద్రాచలంఅర్బన్: జిల్లాలో వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఎండ వేడికి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను సాధారణం కంటే ఎక్కవగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గత నెలలో ఇప్పటివరకు 34.36 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించగా జనవరిలో 29.29 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఫిబ్రవరిలో 31.13 మిలియన్ యూనిట్లు వినియోగించారని అధికారులు చెబుతున్నారు. కాగా, గృహజ్యోతి పథకం కింద వినియోగదారులు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. 200 యూనిట్లు దాటితే బిల్లు పడుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 4,70,155 కనెక్షన్లకు రూ.5.74 కోట్ల బిల్లులు జిల్లావ్యాప్తంగా 4,57,216 విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీరిలో కేవలం జీరో బిల్లులు వస్తున్న వారు 1,77,430 మంది ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.5.74కోట్లు, ఏడాదికి సుమా రు రూ.68.88 కోట్లు చెల్లిస్తోంది. కాగా ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రూ.139 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యుత్ శాఖకు చెల్లించింది. 1,77,430 మందికి లబ్ధి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 1,81,386 మంది ఉండగా ప్రభుత్వం జీరోబిల్లు అమలు చేసిన నాటి నుంచి 1,77,430 మంది పథకానికి అర్హులయ్యారు. ఇప్పటికే మార్చిలో ఎండలు దంచికొట్టగా, ఏప్రిల్, మేలో వచ్చే ఎండలకు విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జీరో బిల్లు వచ్చే పరిస్థితి ఉండదు. విద్యుత్ వినియోగించే వారి సంఖ్య మరింత పెరగనుందని అధికారులు చెబుతున్నారు. 200 యూనిట్లు దాటిన వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చిలో 3328 మంది పథకానికి దూరం.. జిల్లావ్యాప్తంగా 1,77,430మంది వరకు గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరిలో వినియోగమైన విద్యుత్ను మార్చిలో రీడింగ్ తీయగా.. 3,328 మంది లబ్ధిదారులు ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు. దీంతో వారు ఫిబ్రవరి బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతేడాది మార్చిలో 3,923 మంది, ఏప్రిల్లో 12,600 మంది, మేలో 15,912 మంది లబ్ధిదారులు పథకానికి దూరమయ్యారు. వచ్చే జూన్ నుంచి వాతావరణం మారి వర్షాలు కురిస్తే విద్యుత్ వినియోగం 200యూనిట్ల పరిధిలోకి వచ్చి పథకానికి అర్హులవుతారు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లకే పరిమితం. ఒక్క యూనిట్ దాటినా యూనిట్కు రూ.5.10 చొప్పున బిల్లు పడుతుంది. 201 యూనిట్లు నమోదైతే ఇతర చార్జీలతో కలిపి కనీస బిల్లు రూ.1,050 చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి విద్యుత్ వినియోగంతో నష్టం ఎండలు మండుతుండంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతీ వినియోగదారుడు పొదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. 200 యూనిట్లు దాటితే వినియోగదారులు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వృథాను అరికట్టి సంస్థ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. అవసరమైన సమయంలోనే కరెంటు వాడాలి. – జీవన్కుమార్, డీఈ, భద్రాచలం -
రేషన్ బియ్యం
టోకుగా స్వాహా!నెలవారీగా అందించే సన్న బియ్యాన్ని ఒకేసారి మూడు నెలలకు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు రేషన్ మాఫియా రంగంలోకి దిగింది. ఇందుకోసం అక్రమ తరలింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వన్ అండ్ ఓన్లీ మ్యాన్, తన రైట్, లెఫ్ట్ హ్యాండ్లను పురమాయించాడు. ‘ఓన్లీ వన్ ఫసక్’ అన్నట్టు రేషన్ బియ్యంతో ఖజానా నింపుకునేందుకు మాఫియా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తోంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో జరిగే రేషన్ దందాలో ‘సింహ’భాగం అక్రమ రవాణాకు హేమచంద్రాపురం అడ్డాగా మారినట్టు సమాచారం. గడిచిన వారం రోజులుగా రోజుకో లారీ లోడ్ రేషన్ బియ్యం ఇక్కడి నుంచి తరలివెళ్తోంది. ఇక్కడున్న క్రీడా మైదానం దందాకు హబ్గా మారినట్టు స్థానికులు చెబుతున్నారు. బూడిదగడ్డ ఏరియా ఒకప్పుడు రేషన్ దందాకు ‘పవర్’సెంటర్గా ఉండేది. పాత దందాను చక్కబెట్టిన వ్యక్తులే మరోసారి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పగటి వేళ కూల్డ్రింకులు సరఫరా చేసే ట్రాలీ ఆటోల్లో రాత్రి వేళ రేషన్ బియ్యాన్ని తేలిగ్గా సేకరించి, పక్కదారి పట్టిస్తున్నారు. సుజాతనగర్ మండల పరిధిలో ఏకంగా ఒక రేషన్ డీలరే, సన్నబియ్యం మాఫియాతో నేరుగా సంబంధం పెట్టుకుని, లబ్ధిదారుల బయోమెట్రిక్తో సహా మేనేజ్ చేస్తూ సీల్ తీయకుండానే బస్తాలకు బస్తాలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు వైనం వెలుగు చూడటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేశారు. -
ఆర్టిజన్ల సమ్మె షురూ..
● విధులు బహిష్కరించిన కేటీపీఎస్ కార్మికులు ● మద్దతు పలికిన కార్మిక సంఘాలు పాల్వంచ: తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగారు. కేటీపీఎస్ ఆస్పత్రి ముందు గ్రౌండ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న తమను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్లుగా గుర్తించినా బ్రిటీష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్లను అంటగట్టి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే సంస్థలో వేర్వేరు రూల్స్ ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో సుమారు 23,600 మంది ఆర్టిజన్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళన బాటపట్టినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించేవరకు విధులకు హాజరుకాబోమని కార్మికులు హెచ్చరించారు. నాయకులు సాయిలు, పురుషోత్తం రావు, బాలకృష్ణ, అనిల్, నర్సింహారెడ్డి, రమేష్, ఆవుల కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, మల్లయ్య, వేణుగోపాల్ రెడ్డి, సాయిబాబు, వెంకట్రావ్, రమేష్, సాంబ, రవీందర్, శ్రీనివాసరావు, శారద నిమ్మల రాంబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎంఎ.వజీర్, కోటేశ్వరరావు, సాధం రామకృష్ణ, చారుగుండ్ల రమేష్, రాధకృష్ణ, అంకిరెడ్డి నరసింహారావు, రావుల మురళి, గొర్రె వేణుగోపాల్, పూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది విధులకు గైర్హాజరు కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో సుమారు 2200 మంది ఆర్టిజన్లు ఉండగా, బుధవారం సుమారు 1500 మంది వరకు విధులకు గైర్హాజరయ్యారు. రెండు షిఫ్ట్ల్లో కలిపి భారీ సంఖ్యలో కార్మికులు విధులు బహిష్కరించారు. కాగా, ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, విధులకు రాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది యాజమాన్యం పరిధిలో ఉందని సీఈలు ఎ.ప్రభాకర్ రావు, సూర్యనారాయణ తెలిపారు. -
దశాదిశ లేని సమావేశం
చుంచుపల్లి: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించాల్సిన దిశ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆలస్యంతో ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా మొదలైంది. కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఖమ్మం ఎంపీ, దిశ చైర్మన్ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కో చైర్మన్గా పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తూతూ మంత్రంగానే నిర్వహించారు. సమావేశం దాదాపు మూడు గంటలపాటు కొనసాగగా, ఎక్కడా కొత్త పథకాల అమలు, కేంద్రం నుంచి రాబట్టే నిధుల ప్రస్తావన కూడా రాలేదు. గతంలో చేసిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ఆగిపోయిన పనులపైనే కొంతమేర చర్చించి వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో టెక్నికల్ సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు శాఖల వారీగా నివేదికలను చదివి వినిపించారు. కొందరు అధికారులు మాత్రం ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం సైతం చెప్పకుండా దాటవేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పూర్తికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, ఇల్లెందు, అశ్వారావుపేటల మున్సిపల్ చైర్ పర్సన్లు దొడ్డ కిరణ్ మిత్ర, శశికళ, వివిధ శాఖల అధికారులు విద్యా చందన, నాగలక్ష్మి, మధు, కృష్ణా గౌడ్, దిశ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఎంపీ రఘురాంరెడ్డిజిల్లాలో అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేదని, ప్రస్తుతం 60 శాతం మాత్రమే ఇచ్చేలా మార్పులు చేపట్టిందని తెలిపారు. మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న సేవలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పైప్లైన్ లీకేజీలను నివారించాలన్నారు. మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
జీసీసీ సేల్స్మెన్కు మెమో
పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, సేల్స్మెన్లు తిరిగి విధులకు రాకూదని బ్రాంచి మేనేజర్ లక్ష్మణ్ ఆదేశించారు. ‘రిటైర్డ్ సేల్స్మెన్తో బియ్యం పంపిణీ’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం కథ నం ప్రచురితమైంది. దీంతో జీసీసీ బ్రాంచ్ మేనేజర్ స్పందించారు. కిన్నెరసానిలో విధులు నిర్వహిస్తున్న జీసీసీ సేల్స్మెన్ లక్ష్మయ్య.. తనకు బదులుగా రిటైర్డ్ సేల్స్మెన్ వెంకట్రావ్తో విధులు నిర్వహింపజేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లగా సేల్స్మెన్ లక్ష్మ య్యకు మెమో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని మేనేజర్ తెలిపారు. -
గ్యాస్ పైపులైన్ వేగవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు చేపట్టనున్న సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పైపులైన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇన్చార్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పైపులైన్ రూట్ మ్యాప్, పనుల పురోగతి, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. భూసేకరణ, అనుమతుల మంజూరు, రోడ్ల తవ్వకాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా 24 గంటల్లో అనుమతులు పొందే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, డిగ్ అండ్ రీస్టోర్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత నివారించేందుకు పీఎన్జీ సరఫరాను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ప్రాజెక్ట్కు నోడల్ అధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, తిరుమలేష్, సుధీర్, మున్సిపల్ కమిషనర్లు, సీజీడీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
ఈ నెల 10న జాబ్మేళా
రుద్రంపూర్: హైదరాబాద్లోని పోర్టియా హెల్త్కేర్లో కేర్ టేకర్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 10న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్మేళా ఉదయం 10 గంటలకు మొదలవుతుందని వెల్లడించారు. 18 – 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హతల పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వలస కూలీల తిరుగుపయనంచర్ల: మిర్చికోతలకు వచ్చిన సరిహద్దు ఛత్తీస్ గఢ్ వలస కూలీలు తిరుగుపయనమయ్యారు. బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల ఆదివాసీలు ఉపాధి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మిర్చి కోతలకు వలసవచ్చారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మిర్చి కోత పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో తిరిగి వెళ్తున్నారు. దీంతో సరిహద్దు రహదారులు, గ్రామాలు సందడిగా మారాయి. కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. గత ఆదివారం వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర విక్రయాలు భారీగా సాగాయి. మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకుంటుండడంతో ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ గూడేల్లో సందడి నెలకొంటోంది. నేడు ‘వనజీవి రామయ్య’ చిత్రబృందానికి సత్కారం ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల గద్దర్ అవార్డు గెలుచుకున్న ‘వనజీవి రామయ్య’ చిత్రబృందా న్ని గురువారం ఖమ్మంలో సన్మానించనున్నారు. జిల్లా అటవీ శాఖ, వాస్విక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10గంటలకు సన్మానం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేసి పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామ య్య జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రానికి ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రదా నం చేసింది. ఈమేరకు చిత్రబృందానికి జరిగే సత్కారంలో అధికారులు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు పాల్గొనాలని డీఎఫ్ఓ కోరారు. తల్లి మందలించిందని.. ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్య పాల్వంచ: తల్లి మందలించడంతో ఉరివేసుకు ని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన కేటీపీఎస్ ఆర్టిజన్ భూక్యా కిషన్, సునీతల కుమారుడు మహేందర్నాయక్ (12) డీఏవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవా రం ఇంట్లో మహేందర్నాయక్ పెదనాన్న కుమారుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన మహేందర్నాయక్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. బాలుడి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి అక్క కీర్తి తేజ ఉంది. కంటి ఆపరేషన్లు చకచకా.. ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ల నిర్వహణలో వేగం పెరగనుంది. ఈమేరకు శస్త్రచికిత్సకు అవసరమైన ఏ–స్కాన్, బీ–స్కాన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కంటి విభాగంలో ఈ యంత్రాలను ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ యంత్రాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు సాధ్యమవుతాయని తెలిపారు. అంతేకాక ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీలవుతుతుందని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు రాంబాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జిల్లా అంధత్వ నివారణ అధికారి, ఆప్తాల్మిక్ హెచ్ఓడీ రామూనాయక్, ప్రొఫెసర్ జయంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆయేషాబేగం, ఎస్కే. ఆస్మా, సీనియర్ రెసిడెంట్లు రవీనా, పావని, నందగిరి శ్రీను పాల్గొన్నారు. -
వేసవికాలంలో జాగ్రత్తలు పాటించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి రక్షణకు ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. కిట్లో టోపీ, కళ్లజోడు, వాటర్ బాటిల్, 30 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మాస్క్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. విధులపట్ల అలసత్వం వహించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్ రాజు -
మార్కెట్లకు నిధుల కటకట
● ఏడాదిగా పేరుకుపోయిన బకాయిలు ● జిల్లాకు రూ.2.10 కోట్ల మేర పెండింగ్ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఏడాది కాలంగా నిర్వహణ నిధులు నిలిచిపోయాయయి. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో 215 వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతుండగా ప్రతీ నెల లేదా రెండునెలలకోసారి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్వహణ నిధులు విడుదల చేసేది. కానీ గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే పది నెలలుగా నిధులు ఆగిపోయాయి. ఫలితంగా బకాయిలు దాదాపు రూ.200 కోట్లకు చేరాయి. చిల్లిగవ్వ లేక... వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పంట ఉత్పత్తులు నిల్వ చేసే గోదాములకు ఏటా బీమా చెల్లింపులు చేయాలి. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాక బీమా చెల్లింపులే కాక మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఆస్తి పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. అంతేకాక కరెంటు బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో పలుచోట్ల మార్కెట్లు, చెక్ పోస్టులకు సరఫరా తొలగించారు. ఇక రెగ్యులేటెడ్ మార్కెట్లలో క్లీనింగ్ కాంట్రాక్టర్లకు పది నెలల బిల్లులు రాక ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇవికాక కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్ల నిర్వహణతో పాటు చైర్మన్లకు వాహన ఖర్చులు, ఇతర చెల్లింపులూ జరగడం లేదు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మలక్పేట, బాట సింగారం, సిద్దిపేట, ఒంటిమామిడి వంటి పెద్ద మార్కెట్లకు రూ. కోట్లలో బకాయిలు ఉండగా, ఖమ్మం జిల్లాలోనే రూ.2.10 కోట్ల మేర నిధులు అందాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్లు పంట కొనుగోళ్ల నుంచి వసూలు చేసే ఫీజును మార్కెటింగ్ శాఖకు చెల్లిస్తున్నా మునుపెన్నడూ లేని విధంగా పది నెలల నిధులు నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటికై నా నిర్వహణ నిధులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీలు కోరుతున్నాయి. -
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలికొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్–సీఎస్సార్ జీవీ కిరణ్ కుమార్ తెలిపారు. ఏర్పాట్లపై బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లాయీస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల నిర్వహణకు యాజమాన్యం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిందన్నారు. సింగరేణీయులందరూ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల బాధ్యులు అంతోటి నాగేశ్వర్ రావు, జి.లింగమూర్తి, బి.నాగేశ్వర రావు, డి.పంతులా, జి.రమేష్, కే.హాతిరామ్, డాక్టర్ మాలతి, వి.మురళి, హరిశంకర్ రావు, అధికారులు కేసా నారాయణరావు, బి.శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, జి.వెంకటేశ్వర్లు, కే.వి.ప్రకాష్, ఏ.భాస్కర్రావు, ఎం.రాంబాబు పాల్గొన్నారు. సింగరేణి ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరారుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్రెడ్డి బుధవారం సింగరేణి ఆస్పత్రిని సందర్శించారు. పీడియాట్రిక్, మెటర్నిటీ వార్డుల్లో తనిఖీ లు నిర్వహించారు. నియోనేటల్ కేర్ తదితర వార్డుల్లో రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి వైద్యాధికారులు కిరణ్ రాజ్కుమార్, ఉష, అవి నాష్, విశ్వమేథి, అజమ్బోస్లే, లలిత పాల్గొన్నారు. రేపు ఆదివాసీ సమ్మేళనంహాజరుకానున్న రాష్ట్ర మంత్రి సీతక్క భద్రాచలం టౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో ఈ నెల 10న ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం, కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక బాధ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
ప్రశ్నించే గొంతుల అణచివేతే కేంద్రం లక్ష్యం
● అకస్మాత్తుగా నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ● సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని అక్రమ కేసులతో వేధించడం ఫాసిజమేనని, ఎన్ఐఏ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాభై ఏళ్లుగా ప్రజా సమస్యలు, హక్కుల కోసం పోరాడుతున్న తనపై పాత కేసులన్నీ 2026 మార్చి నాటికే కోర్టులు కొట్టివేశాయని తెలిపారు. అయినా అకస్మాత్తుగా ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 2025 నవంబర్లో నమోదైన ఓ కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, గాదె ఇన్నయ్య అరెస్టును ఖండించినందుకే తనపై కేసు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం.. మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కేజీ.రామచందర్, కె.రమ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్ఐఏ ద్వారా విచారణ పేరుతో వేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటు రంగారావు విచారణకు సిద్ధమేనని చెబుతూ... విచారణ పేరుతో కేసుల నమోదు చేయడం మాత్రం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మాస్లైన్ నాయకులు ఎస్.ఎల్.పద్మ, కె.సూర్యం, సదానందం, ఎం.కృష్ణారెడ్డి, గుర్రం అచ్చయ్య, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, మలీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, పోటు రంగారావుకు నోటీసులు ఇవ్వడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తరఫున ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేదల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై దేశద్రోహం తరహా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. -
ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేపట్టారు. తొలిరోజు బుధవారం కొత్తగూడెం డీఈ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. 92 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ కూనురాజు శ్రీనివాస్, కొత్తగూడెం డివిజన్ చైర్మన్ మోతీరామ్, కన్వీనర్ రాంబాబు, కో కన్వీనర్ రాజేందర్ తదితరులు మాట్లాడుతూ ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని కోరారు. పీస్ రేట్ కార్మికులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీఐటీయూ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి పులి గణేష్బాబు, 327 జిల్లా కార్యదర్శి రాజేష్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ డివిజన్ కార్యదర్శి ధర్మరాజు సంఘీభావం తెలిపారు. -
ఆగని వన్యప్రాణుల వేట..!
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ శివారులో ఈనెల 2న తాగునీటి కోసం బయటకు వచ్చిన రెండు దుప్పులు వస్త్రం సమ్మయ్య, కారెంగుల సాంబయ్య పెట్టిన ఉచ్చుల్లో పడ్డాయి. వీటిని చంపగా అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, వేసవి మొదలుకాగానే దాహంతో బయటకు వచ్చే వన్యప్రాణులను హతమార్చడం సాధారణమైపోయింది. చుంచుపల్లి: వేసవి ఆరంభంలోనే జిల్లాలో వన్యప్రాణుల వేట మొదలైంది. ఉచ్చులు, విద్యుత్ వైర్లను అమర్చి, వేటగాళ్లు అటవీ జంతువులను చంపతున్నారు. నదులు, చెరువులు, వాగుల వద్ద పొదల్లో ఉరులు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. జంతువుల వేటకు ఎక్కువగా ప్రమాదకరమైన విద్యుత్ తీగలనే వాడుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సిబ్బంది నిర్లక్ష్యం, రాత్రిపూట అటవీ ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో వేటగాళ్లకు అనుకూలంగా మారుతోంది. విద్యుత్ తీగలు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలూ తీస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోళ్లు, చర్మం విక్రయిస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతం జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవి పిల్లులు, ముంగీసలు, ఇతర జంతువులకు అనువుగా ఉంది. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచడం, వేటాడటం పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. జంతువులను వేటాడే వారికి ఏడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా.. నేరాన్ని బట్టి ఈ రెండింటినీ ఏకకాలంలో అమలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. కొన్ని జంతువులను వేటాడితే బెయిల్ కూడా లభించదు. గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తే హాని తలపెట్టకుండా అధికారులకు తెలపాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో రాత్రి సమయాల్లో దప్పిక తీర్చుకునేందుకు నీటి వనరులను అన్వేషిస్తూ గ్రామాల సరిహద్దుల్లోకి జంతువులు రావటం సాధారణంగా మారింది. ఇదే అదునుగా వేటగాళ్లు నీటి కుంటలు, ప్రధాన కాల్వల వద్ద విద్యుత్ వైర్లు, ఉచ్చులు ఏర్పాటు చేసి వధిస్తున్నారు. విద్యుత్ తీగలు అమర్చడంతో మనుషులు, పశువుల ప్రాణాలు కూడా పోతున్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిన్నెరసాని, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, దమ్మపేట, చంద్రుగొండ, దుమ్ముగూడెం, పినపాక, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో నాలుగేళ్లలో 50 కేసులకుపైగా నమోదయ్యాయని అటవీ అధికారులు తెలిపారు. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం వస్తుంటాయి. వేటగాళ్లు కరెంట్ తీగలు, ఉచ్చులు అమర్చి వేటాడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. అటవీ జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచుతాం. వేటకు పాల్పడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం. –కిష్టాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి 2021 డిసెంబర్లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన తండ్రీకొడుకులు ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్ వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. 2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్కుమార్ చుంచుపల్లి మండలం పెనుబల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు. 2023 మార్చిలో ఫారెస్ట్ స్పెషల్ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సుజాతనగర్ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి చనిపోయింది. -
ఆస్పత్రులకు అవార్డుల పంట
చుంచుపల్లి/భద్రాచలం అర్బన్/మణుగూరు టౌన్/దుమ్ముగూడెం/పాల్వంచ :ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులు, వైద్యులు, ఉద్యోగులకు అవార్డులు ప్రకటించగా జిల్లా సత్తా చాటింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్యసేవలు అందించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఈమేరకు సీహెచ్సీ పాల్వంచకు చెందిన డాక్టర్ శైలేష్ కుమార్, డాక్టర్ పి.రామ్ప్రసాద్, భద్రాచలం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణతో పాటు డాక్టర్ క్రాపా విజయ్, నర్సింగ్ ఆఫీసర్ కృష్ణవేణి, ఏ.వెంకటరావు జాబితాలో ఉన్నారు. అలాగే, మణుగూరు ఏరియా హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ మానస, ఫార్మసిస్ట్ ఏ.శారదాదేవి అవార్డులు అందుకున్నారు. అంతేకాక భద్రాచలం, మణుగూరు, చర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ట్రైబల్ ఏరియా’ విభాగంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రామకృష్ణ, గౌరీప్రసాద్, సాయివర్ధన్తో కలిసి డీసీహెచ్ఎస్ జి.రవిబాబు అవార్డులు స్వీకరించారు. ఇక దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పీహెచ్సీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా ఎంపిక కాగా డాక్టర్ రేణుకా రెడ్డి అవార్డు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు -
ప్రజలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం
పాల్వంచ/పాల్వంచరూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజానీకానికి నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారిలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినో త్సవం సందర్భంగా పాల్వచంలోని వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరో గ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యాన అందరూ బాధ్యతగా భావించాలన్నారు. ఇతర జిల్లాలతో పోలి స్తే మంచి పేరు ఉన్నప్పటికీ భవిష్యత్లో మెరుగైన సేవలతో రాష్ట్ర, జాతీయఅవార్డులు సాధించాలని తెలి పారు. అనంతరం డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ మా ట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతు న్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఆతర్వాత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ప్రతి భ కనబరిచిన 43 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రసాద్నాయక్, వైద్యులు స్పందన, తేజస్విని, ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
స్టాప్లు స్మార్ట్గా!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని ఏడు ప్రాంతాల్లో రెండు రకాల అత్యాధునిక బస్షెల్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈమేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ప్రతినిధులు ఇప్పటికే మూడు డిజైన్లతో పాటు నిర్మాణ అంచనాలను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు అందజేశారు. కేవలం కాంక్రీట్ కట్టడాలుగా కాకుండా పర్యావరణహితంగా, స్మార్ట్ ఫీచర్లతో ఈ షెల్టర్లు రూపుదిద్దుకోనున్నాయి. బస్ షెల్టర్లతో పాటు ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద సెక్యూరిటీ క్యాబిన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ‘వెర్నాక్యులర్’ ఎలా ఉంటుందంటే... పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునేలా ‘డిజైన్ అవేర్’ సంస్థ ప్రత్యేకంగా వెర్నాక్యులర్ బస్ షెల్టర్ నమూనా రూపొందించింది. స్టీల్ స్ట్రక్చర్పై వెదురు సూపర్ స్ట్రక్చర్, కాన్వాస్ కవర్తో షెల్టర్ నిర్మిస్తారు. అంతేకాక వేసవిలో ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చేలా మిస్టింగ్ సిస్టమ్(నీటి తుంపర్ల వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం షెల్టర్పై 2వేల లీటర్ల నీటి ట్యాంకు అమర్చుతారు. ఒక్కో షెల్టర్ 5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఉండి, చుట్టూ ప్లాంటర్లు, ల్యాండ్ స్కేపింగ్, స్టోన్ క్లాడింగ్తో ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మెట్రో లుక్ ఈ– ఫ్రాస్కేప్స్ సంస్థ మెట్రో నగరాల తరహా రూపును ఇచ్చేలా ఎంఎస్ స్ట్రక్చర్ బస్షెల్టర్లను డిజైన్ చేసింది. 15 అడుగుల ఎత్తుతో ఉండే ఈ షెల్టర్లకు 10 ఎంఎం మందపాటి మల్టీవాల్ పాలీ కార్పొనేట్ షీట్తో కప్పు నిర్మిస్తారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలతో పాటు రద్దీ సమయంలో ఆసరా కోసం స్టాండింగ్ బెంచీలు కూడా ఉంటాయి. మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చేలా ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ఈ మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.6లక్షల చొప్పున వ్యయం కానుండగా.. నాలుగు ప్రాంతాలను గుర్తించారు. ఏడు ప్రాంతాల ఎంపిక వెర్నాక్యులర్ రూపుతో పాటు ఎంఎస్ స్ట్రక్చర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి కేఎంసీ అధికారులు ప్రధాన ప్రాంతాలను గుర్తించారు. వెర్నాక్యులర్ డిజైన్తో ఐటీ హబ్, ప్రభుత్వ ఆస్పత్రి, ఖానాపురం ఎన్నెస్సీ కెనాల్ బ్రిడ్జిపై షెల్టర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక ఎంఎస్ స్ట్రక్చర్తో బల్లేపల్లి స్టేజీ, ఇందిరానగర్ పర్ణశాల, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళా శాల, ఇల్లెందు క్రాస్లోని విద్యుత్శాఖ స్టోర్ వద్ద నిర్మించనున్నారు.ఖమ్మంలో అత్యాధునిక హంగులతో బస్షెల్టర్లు ఖమ్మం అభివృద్ధితో పాటే మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధునాతన హంగులు, సౌకర్యాలతో కూడిన బస్ షెల్టర్లు నిర్మించనున్నాం. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్చర్లు ఇప్పటికే నమూనాలు సమర్పించారు. త్వరలోనే వీటి నిర్మాణాలను ప్రారంభిస్తాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ బస్ షెల్టర్లతో పాటు భద్రతను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో సెక్యూరిటీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ సెక్యూరిటీ గదిని మోడల్ క్యాబిన్గా తీర్చిదిద్దుతారు. వుడ్ కాంపోజిట్ రాఫ్టర్లతో నిర్మించే ఈ క్యాబిన్కు రూ.5లక్షలు వ్యయం అవుతుంది. ప్రతిపాదిత మూడు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఖమ్మం స్మార్ట్ సిటీగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. -
శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి తప్పనిసరి డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ బూర్గంపాడు: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇబ్బందులు ఎదురవుతాయని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మోరంపల్లి బంజర పీహెచ్సీ ఆధ్వర్యాన బూర్గంపాడు కేజీబీవీలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. శారీరక శ్రమ తగ్గడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తొలుత బూర్గంపాడు ప్రధాన కూడలి నుంచి కేజీబీవీ వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, డీపీఎంఓ మోహన్, ఎంపీహెచ్ఈఓ రవి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 13న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా రుద్రంపూర్: చుంచుపల్లి మండలం రుద్రంపూర్లోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఐటీఐ పూర్తిచేసిన వారికి వివిధ పరిశ్రమల్లో అప్రెంటిస్ అవకాశం కల్పించేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న జిల్లాలోని అభ్యర్థులు www. apprenticeshipindia. org. in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, ఆ కాపీతో పాటు బయోడేటా, విద్యార్హత పత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్! వాట్సాప్ సాయంతో సమాధానాలు రాసిన విద్యార్థి కొత్తగూడెంఅర్బన్/సుజాతనగర్: జిల్లాలో ఎస్సెస్సీ విద్యార్థి ఒకరు సెల్ఫోన్ సాయంతో పరీక్ష రాస్తుండడం బయటపడింది. పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. ఈమేరకు సుజాతనగర్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో ఓ విద్యార్థి సెల్ఫోన్ తీసుకొచ్చి వాట్సప్ ఆధారంగా సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. ఈమేరకు విద్యార్థిని డిబార్ చేసి మాల్ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. అయితే, సదరు విద్యార్థి ముందు రోజే కేంద్రానికి సెల్ఫోన్ తీసుకొచ్చి దాచినట్లు తేలింది. అంతేకాక ముందుగా సిద్ధం చేసుకున్న జవా బులను వాట్సాప్లో చూస్తూ రాశాడని గుర్తించినట్లు సమాచారం. కాగా, మంగళవారం పరీక్షకు జిల్లాలో 12,728 మంది విద్యార్థులకు గాను 12,700 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు. 10నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016 కంటే ముందు డిగ్రీ చదివి ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11వ తేదీల్లో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12, 13వ తేదీల్లో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షల వివరాల కోసం 91605 38938నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
కాస్త మెత్తగా.. పుచ్చులు త్వరగా..
దారి మళ్లకుండా.. పౌర సరఫరాల శాఖ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే కాక ఆహార భద్రత, అంత్యోదయ కార్డుల ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే, గతంలో బియ్యం దొడ్డుగా ఉండడంతో చాలామంది ఆహారంలో భాగంగా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఈ బియ్యం దళారుల ద్వారా కోళ్లఫారాల్లో దాణాగా చేరడం మొదలైంది. అంతేకాక కొన్నిచోట్ల మిల్లర్లు దక్కించుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సరఫరా చేశారు. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రచారం చేసిన సీఎం! ఏడాది కాలంగా రేషన్ లబ్ధిదారులకు నన్న బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. బియ్యం నాణ్యత బాగుండడంతో అందరూ వినియోగించడం ప్రారంభించారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డి 2025 ఏప్రిల్ 6న సారపాకలోని లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నమే తినడం ద్వారా మరింత ప్రచారం ఏర్పడింది. ఫలితంగా పక్కదారి పట్టడం దాదాపు ఆగిపోయింది. అయితే, ఆరు నెలల తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రేషన్షాపుల్లో ఇచ్చే సన్నబియ్యం వండితే మెత్తగా కావడం, త్వరగా పురుగులు పడుతోందని తెలిసినా యంత్రాంగం దృష్టి సారించలేదు. దృష్టి సారించకపోతే... నాణ్యత తగ్గిపోతుండడంతో లబ్ధిదారులకు సన్నబియ్యంపై ఆసక్తి తగ్గుతుందని తెలిసినా అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సన్న బియ్యానికి సంబంధించి 32 రకాలు పండిస్తున్నా అత్యంత నాణ్యమైన బీపీటీ రకానికి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. దీంతో ఈ రకాన్ని పండించిన రైతులు ఎక్కువ మంది ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు. ఒకవేళ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరినా తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక మండల లెవల్ స్టాక్ పాయింట్లలో ఏడాది కాలంగా నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి అవి సన్నబియ్యాన్ని సైతం ఆశిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా సన్నబియ్యం సాగు మొదలు పంపిణీ వరకు అధికారులు శ్రద్ధ పెట్టకపోతే ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న పథకానికి చెడ్డపేరు వచ్చే అవకాశముంది.ప్రస్తుతం షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ముగ్గురు లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి నెలకు 18కిలోల చొప్పున మూడు నెలలకు సంబంధించి 54కిలోల బియ్యం వస్తుండడంతో వాడుకోలేని పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. బియ్యం పురుగు పడుతుండడం, నూకలు ఎక్కువగా ఉండడమే కాక ఎంత జాగ్రత్త పడినా అన్నం మెత్తగా అవుతుండడంతో లబ్ధిదారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఏళ్ల తరబడి రేషన్ బియ్యం దందా సాగించిన దళారులు రంగంలోకి దిగారు. పాత పరిచయాలు, నెట్వర్క్ను ఉపయోగించుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఇది ప్రచారమేనని సివిల్ సప్లయీస్ అధికారులు కొట్టి పారేసినా ఇటీవల పలుచోట్ల బియ్యం పట్టుబడడం గమనార్హం. జిల్లా కేంద్రంలోనే లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు వెళ్తున్న ట్రాలీఆటో గత నెల చివరలో ప్రమాదానికి గురవడంతో విషయం బయటకు పొక్కింది. అంతేకాక ఈనెలారంభంలో టేకులపల్లిలో రేషన్ బియ్యం తరలిస్తున్న మరో ఆటో పట్టుబడింది. సన్న బియ్యంపై జనాల నిర్లిప్తత ! -
పంటకు మరో తడి..
● సాగుకు డోకా లేకుండా సాగర్ జలాలు.. ● రైతుల వినతులతో గడువు పొడిగింపు? ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలో రబీ పంటల సాగు ఆఖరి దశలో ఉండగా ఇబ్బందులు ఎదురుకాకుండా సాగర్ జలాలు మరికొన్నాళ్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఈనెల 7వ తేదీతో సరఫరా నిలిపివేయాల్సి ఉంది. అయితే, రైతుల డిమాండ్ దృష్ట్యా మరికొన్నాళ్లు నీటి విడుదల కొనసాగించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సమీక్షల్లో ఇంజనీర్ల నుంచి అందిన నివేదికలు, ఆయకట్టులో పంటల సాగుపై చర్చించారు. ఈమేరకు పంటలు ఎండి పోకుండా మరో తడి వరకు నీరు విడుదల చేయడానికి మంత్రి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో మరో వారం నుంచి పది రోజుల వరకు సాగర్ జలాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 25వేల ఎకరాలకు అవసరం జిల్లాలోని రైతులు యాసంగిలో సాగర్ ఆయకట్టు కింద 2,54,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 90 శాతం పంటలకు నీటి అవసరం తీరింది. అయినా దాదాపు 25వేల ఎకరాలకు నీటి అవసరం ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నందున ఒక్క తడి అందిస్తే సాఫీగా చేతికొచ్చే అవకాశముంది. ఈమేరకు రైతుల విన్నపాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాక జూలై వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా సాగర్ పరిధిలోని చెరువులను నింపాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం సాగర్ నుంచి పాలేరు వరకు 4,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, దిగువకు సుమారు 4వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 23 అడుగులకు గాను ప్రస్తుతం 21.5 అడుగులుగా ఉంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ సాగు, తాగు అవసరాలకు మళ్లించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. చెరువులు ఎండిపోవు... సాగర్ జలాల పొడిగింపు నిర్ణయం జిల్లా రైతులకు ఉపశమనం కలిగించనుంది. ఇదే సమయాన తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో 1,400కి పైగా చెరువులు ఉంటే, అందులో 700 చెరువులకు సాగర్ జలాలు చేరతాయి. ఆయా చెరువుల్లో ఇప్పటికే 50 – 100 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా చేపల వేట కోసం నీరు విడుదల చేస్తే తప్ప సాగర్ పరిధిలో చెరువులు ఎండిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నేరుగా సాగర్ జలాలతో నిండే 236 చెరువులకు సుమారు 2 టీఎంసీలు అవసరమనే అంచనాతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లాలో సాగర్ జలాలు చేరే చెరువుల పరిధిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం లేదు. అయినా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చెరువులను నింపుతాం. ఇక పంటలు ఎక్కడా ఎండిపోకుండా నీరు అందించాం. కొన్నిచోట్ల ఇంకా నీరు అవసరమని విజ్ఞప్తులు అందుతున్నాయి. నిల్వల ఆధారంగా విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. అయితే, తొలి ప్రాధాన్యత మాత్రం తాగు అవసరాలకు ఇస్తాం. – మంగళపూడి వెంకటేశ్వర్లు, సీఈ, జలవనరులశాఖ -
సిబ్బంది అప్రమత్తతతోనే ప్రాణరక్షణ
కరకగూడెం/చండ్రుగొండ: అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉండడం ద్వారా ఆపద లో ఉన్న వారి ప్రాణాలకు రక్షణ లభిస్తుందని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ ఆఫీసర్ కిషోర్ తెలిపారు. మండలంలోని జానంపేట, కరకగూడెంల్లో 108 వాహనాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, మందుల లభ్యతను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్, ఈ ఎంటీలు, పైలట్లు బట్టా సుమలత, పుల్లయ్య, రమ్యకృష్ణ, గాడిపల్లి సాయి, సాంబశివరావు, తేజ పాల్గొన్నారు. అలాగే, చండ్రుగొండలోని 108 ఆంబులెన్స్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. సెంట్రల్ ఆఫీసర్ ఫయాజ్, ఉద్యోగులు పాల్గొన్నారు. రిటైర్డ్ సేల్స్మెన్తో బియ్యం పంపిణీపాల్వంచరూరల్: ఉద్యోగవిరమణ చేసిన జీసీ సీ సేల్స్మెన్ తిరిగి బియ్యం పంపిణీ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బ్రాంచ్ పరిధిలోని కిన్నెరసాని, ఉల్వనూరు గ్రామాల్లో సేల్స్ డిపోలకు లక్ష్మణ్ సేల్స్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, డిసెంబర్ 31న ఉల్వనూరు సేల్స్మెన్ వెంకట్రావు ఉద్యోగ విరమణ చేయ గా, ఆయనతో కిన్నెరసాని సేల్స్మెన్గా లక్ష్మణ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈనెల రేషన్ బియ్యం పంపిణీ కిన్నెరసానిలో వెంకట్రావు నేతృత్వాన చేపట్టగా, అవకతవకలు జరిగితే ఎవరు బాధ్యులనేది చర్చనీయాంశంగా మా రింది. ఈ విషయమై జీసీసీ మేనేజర్ లక్ష్మణ్ వివరణ కోరగా.. రిటైర్డ్ ఉద్యోగితో పనిచేయించిన విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొండికట్ట బీట్లో భూమి పరిశీలన పాల్వంచరూరల్: గతంలో ఆక్రమణకు గురై తిరిగి అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిని రాష్ట్ర ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజశేఖర్ మంగళవారం పరిశీలించారు. పాల్వంచ మండలం యానంబైల్ రేంజ్లోని మొండికట్ట బీట్లో గతంలో అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసు కోగా పరిశీలించిన డీఎఫ్ఓ.. ఆ తర్వాత కిన్నెరసాని డీర్పార్కులో అభివృద్ధి పనులను సైతం పరిశీలించారు. పాల్వంచ వైల్డ్లైఫ్ డివిజన్ ఎఫ్డీఓ బి.బాబు, రేంజర్లు కవిత, మాధవి, సెక్షన్ ఆఫీసర్ కిషన్ పాల్గొన్నారు. కారు డ్రైవర్కు ఏడాదిన్నర జైలుసూపర్బజార్(కొత్తగూడెం): నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. జూలూరుపాడు మండలం పడమటినర్సాపురానికి చెందిన నాచబోయిన ప్రశాంత్ ఇంట్లో తల్లిదండ్రులు నాచబోయిన వెంకన్న– లలిత 2016 ఏప్రిల్ 21న రాత్రి నిద్రిస్తున్నారు. పాల్వంచకు చెందిన నందిగామ పవన్కుమార్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఇంట్లోకి దూసుకెళ్లగా లలిత తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అంతకుముందు మాచినపేటకు చెందిన లాకావత్ సాయికుమార్, బోడా అశోక్కుమార్ బైక్ను సైతం పవన్ తన కారుతో ఢీకొట్టగా గాయపడ్డారు. ఘటనపై అప్పటి ఎస్ఐ పి.శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ కె.రాందాస్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు 14 మంది సాక్షులను విచారించాక పవన్కుమార్కు ఏడాదిన్నర జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బి.విశ్వశాంతి వాదించగా, ఎస్ఐ డి.రాఘవయ్య, పీసీ ఉపేందర్రావు సహకరించారు. -
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం
సూపర్బజార్(కొత్తగూడెం): మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు భావించాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. చుంచుపల్లిలోని షీ టీమ్స్, ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. మహిళలు వారికి ఎదురయ్యే లైంగిక వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్ మెయిలింగ్పై షీ టీమ్స్ను సంప్రదించొచ్చని తెలిపారు. నేరుగా రాలేకపోతే 87126 82131 నంబర్కు ఫోన్ చేసినా సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. నిందితులను పిలిచించి తొలుత కౌన్సెలింగ్ ఇస్తారని, పరిస్థితి తీవ్రత ఆధారంగా కేసు నమోదు చేస్తారని చెప్పారు. కాగా, షీ టీమ్స్ సిబ్బంది రద్దీ ప్రదేశాల్లో గస్తీ కాస్తూ మహిళలు, విద్యార్థినులకు భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్, ఏఎస్సై నాగయ్య, సభ్యులు మల్లికాంబ, రాంబాబు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజ్ -
చికిత్స ఎలా.. భోజనం నాణ్యత ఎంత?
● అశ్వారావుపేట, ఇల్లెందులో పర్యటించిన కలెక్టర్ అంకిత్ ● ఇల్లెందులో ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్కు ఆదేశం అశ్వారావుపేట: విధుల్లో చేరిన నాటి నుంచి పాఠశాలలు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్న కలెక్టర్ అంకిత్ మంగళవారం కూడా కొనసాగించారు. ఈమేరకు అశ్వారావుపేట మైనార్టీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడమే కాక డైనింగ్ హాల్, స్టోర్ రూం నిర్వహణపై ఆరా తీశారు. నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేసి సరఫరాదారుల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సరుకులతో నాణ్యమైన ఆహారం అందించాలని, వడ్డించేముందు నాణ్యత పరిశీలనలో 8, 9, 10వ తరగతి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆతర్వాత విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఆహార నాణ్యత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. ఆతర్వాత ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లిన కలెక్టర్ రోజువారీ వైద్యసేవలపై ఆరా తీశాక డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారికి ఇచ్చే ఆహారం, కిచెన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాక భోజనంలో గుడ్డు, అరటిపండు ఉండాలని ఆదేశించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రతిపాదిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కిషోర్, ఎంపీడీఓ అప్పారావు, మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, ఆర్ఎంఓ మౌనిక, గురుకులం ప్రిన్సిపాల్ టి.సంగీత తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషి యల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్ – ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలి. వివరాలకు 96660 13544, 96182 16701 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సాగర్ ప్రధాన కాల్వ కట్టపై పగుళ్లు
● ప్రమాదాలకు చేరువగా పరిస్థితి? ● క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులుఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం పరిధి సాగర్ ప్రధాన ఎడమ కాల్వ కట్ట ప్రమాదం ముంగిట ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెగూడెం నుంచి కరకట్టకు వెళ్లే మార్గంలో కాల్వకు ఇరువైపులా కట్టపై బీటలు (నెర్రెలు) వారాయి. వారం రోజులుగా పగుళ్లు బయటపడుతుండగా రోజురోజుకూ విస్తరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు అర కిలోమీటరు పొడవునా ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు పెరుగుతున్న వేళ వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్లో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం సాగునీటి విడుదల కొనసాగుతుండగా, పగుళ్లు మరింత పెరిగితే ప్రమాదం జరగొచ్చని స్థానికులు అంటున్నారు. కట్ట దెబ్బతింటే సమీప గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన అధికారులు కాల్వ కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయనే సమాచారంతో జలవనరులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు నెర్రలు బారిన కట్ట ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. అంతేకాక ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. -
కళలపై దృష్టి సారించాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థులు విద్యతోపాటు కళలపైకూడా దృష్టి సారించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. ఖమ్మం గిరిజన సంక్షేమశాఖ గురుకులం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇర్పా స్వాతి పెయింటింగ్లను సోమవారం ఐటీడీఏలో పరిశీలించి ప్రశంసించారు. చిత్రాలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలోని డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు రూ. 2లక్షలు, స్వాతికి ప్రోత్సాహకంగా రూ.22,500 చెక్కులను అందజేశారు. దర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులొద్దు గిరిజనదర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందచేసి పరిష్కరించా లని సూచించారు. ప్రభుత్వ సహకారంతో గిరిజనులు స్వయం ఉపాధి, చిన్నత తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అశోక్, అరుణ కుమారి, సైదులు, రాంబాబు, వేణుగోపాల్, లక్ష్మినారాయణ, నాగేశ్వరరావు, గన్యా, హేమంత్, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణి దరఖాస్తు ల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్ ఆగిపోయిందని కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన దివ్యాంగురాలు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేయగా, డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా బుక్ కోసం టేకులపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోత్ తోలచంద్ వినతిపత్రం ఇవ్వగా, జిల్లా అటవీశాఖ అధికారికి, రేషన్కార్డు కోసం సుజాతనగర్కు చెందిన నునావత్కుమార్ దరఖాస్తు చేసుకోగా, డీఎస్ఓకు ఎండార్స్చేశారు. వివిధ సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకోగా, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం అందడం లేదని, మండల ప్రత్యే క అధికారులు, వసతి గృహాల పర్యవేక్షణ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ -
ప్రజావాణిలో సమయపాలనేది..?
సూపర్బజార్(కొత్తగూడెం): నూతన కలెక్టర్గా అంకిత్ బాధ్యతలు స్వీకరించాక క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్కు వివిధ పనుల కారణంగా ఒక్కోసారి కొంత ఆలస్యమైనా మిగతా అధికారులు ప్రజావాణిలో సమస్యల దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అయితే అధికారులు సకాలంలో రావడంలేదు. కలెక్టర్ వచ్చారా? అని ఆరా తీసి ఆ తర్వాతే అధికారులు ప్రజావాణి హాలులోకి వస్తున్నారు. సోమవారం కూడా 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఆ సమయానికి సుమారు 10 మంది అధికారులు కూడా రాలేదు. ఎండాకాలం, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అనేక వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకుని క్యూలైన్లో బారులుదీరారు. కానీ అధికారులు లేకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. ఆలస్యం కావడంతో వినతి పత్రాలు ఇచ్చాక తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు. ఇకనైనా అధికారులు సకాలంలో హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఎందుకింత కాఠిన్యం?
సింగరేణి యాజమాన్యం అవసరం తీరేవరకు ఒకలా, అవసరం తీరాక మరోలా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన సీనియర్ కార్మికుల కుటుంబాల క్షేమాన్ని విస్మరిస్తోంది. తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస అవసరాలకు కూడా కొర్రీలు పెడుతోంది. ఆఖరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల రక్షణకు ఇటీవల చట్టం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే సీనియర్ కార్మిక వాడల వెతలను పట్టించుకోవాలనే డిమాండ్ వస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం21 పిట్ గని సమీపంలో కార్మికులు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత గనికి సమీపంలోనే స్ట్రట్పిట్, 24, సెంచరీ ఇంక్లైన్ వంటి భూగర్భ గనులు, ఏరియా పరిధిలో జవహర్ఖని వంటి ఓపెన్కాస్ట్లు వచ్చాయి. మెజారిటీ కార్మికులు 21లోనే నివాసం ఉంటూ ఆయా గనుల్లో పని చేసేవారు. ఫలితంగా 1990వ దశకంలో రొంపేడు మేజర్ గ్రామపంచాయతీగా మారింది. ఆ తర్వాత విభజనలో కార్మికవాడలు ఉన్న ప్రాంతాలు శేషగిరి బస్తీ, విజయలక్ష్మినగర్, తిలక్నగర్ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. కార్మిక వాడల విషయంలో 2000 దశకం నుంచి సింగరేణి తీరులో మార్పు మొదలైంది. ఇల్లెందులో బొగ్గు గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ముందుగా కార్మిక వాడలకు ఉచిత కరెంటు సరఫరాను నిలిపేసింది. ఆ తర్వాత నీటి సరఫరా బాధ్యతల నుంచి తప్పుకుంది. చివరకు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు మంగళం పలికింది. కాగా, జవహర్ఖని విస్తరణతో మళ్లీ మంచిరోజులు వస్తాయనే నమ్మకం కలిగింది. అయితే, ఆ ఆశలకు ఆదిలోనే సింగరేణి గండి కొడుతోంది. -
ఆహార భద్రతపై అవగాహన ర్యాలీ
సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీలో కొనసాగగా, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, డీఎంహెచ్ఓ డాక్టర్తుకారామ్ రాథోడ్ పాల్గొని మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లో ఎక్స్పో నిర్వహించి, ఆహార భద్రతా నియమాలు, ప్రభుత్వమార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న సేవలపై ప్రజలకు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల వంట కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పోషకాహారం తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు, భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.రేపు దిశ సర్వసభ్య సమావేశంచుంచుపల్లి: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై సమగ్ర సమీక్ష కోసం ఈ నెల 8న దిశ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. తొలుత సమావేశాన్ని మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించా లని నిర్ణయించగా, పరిపాలనా కారణాల వల్ల సమయాన్ని సవరించి ఉదయం 11.00 గంటలకు మార్చినట్లు వివరించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల పురో గతి, నిధుల వినియోగం, లక్ష్యాల సాధన, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమస్యలపై ఆరాపాల్వంచ: పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్ను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రయాణికులను సమస్యలు అడిగి తెలు సుకున్నారు. పార్కింగ్ సమస్య పరిష్కరించా లని, బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించాలని కార్పొరేటర్లు విన్నవించా రు. బస్టాండ్కు మరమ్మతులు చేయాలని మరి కొందరు వినతి పత్రం అందించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, కార్పొరేటర్లు అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, సింధు తపస్వీ, దంతెబోయిన నరేష్, ధర్మసోతు నరేష్, నాయకులు కొల్లి శ్రీని వాస్ రావు, పాటిబండ్ల అభివన్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు అండగా నిలవాలిఎస్పీ రోహిత్ రాజు మణుగూరు టౌన్: బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. సోమవారం ఆయన మణుగూరు పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 డయల్కు ఫోన్ రాగానే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలని, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతతో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పోలీస్స్టేషన్ భవనం, పాత పోలీస్ క్వార్టర్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి, ఎస్బీ సీఐ శ్రీనివాస్, సీఐ నాగబాబు, ఎస్ఐ శ్రావణ్ తదితరులు ఉన్నారు. -
గాలివాన బీభత్సం
● విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● తడిసిన ధాన్యం, మిర్చి, దెబ్బతిన్న ఇళ్లుఅశ్వారావుపేటరూరల్/చర్ల: గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం అశ్వారావుపేట, చర్ల తదితర మండలాల్లో అకాల వాన కురిసింది. భారీవర్షం కురవడంతో ఇళ్ల పైకప్పులు, రేకులు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగి పలుచోట్ల పైకప్పులు, రేకుల షెడ్లు ధ్వంసం కాగా, ఇళ్లలోఉన్న వారంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆసుపాక గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. అశ్వారావుపేట–భద్రాచలం, ఖమ్మం ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామిడి, పొగాకు తోటలకు నష్టం జరిగింది. చర్లలో రాళ్ల వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి పంటలు తడిసిముద్దయ్యాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. చేతికొచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవానం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కోటి రామస్వరూప్కు ప్రధాన అర్చకుడిగా పదోన్నతి దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కోటి రామస్వరూప్ రాఘవాచార్యులుకు ప్రధాన అర్చకుడిగా పదోన్నతిని కల్పించారు. ఈ మేరకు ఈఓ దామోదర్రావు ఉత్తర్వులు అందజేశారు. కాగా ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు నవమి ఉత్సవాల అనంతరం పదవీ విరమణ చేశారు. మరో ప్రధాన అర్చకుడిగా విజయరాఘవన్ విధులు నిర్వరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. ఎండ నుంచి ఉపశమనానికి తివాచీలు దేవస్థానంలో భక్తులు పాదరక్షలు లేకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో వేసవి ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో తివాచీలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఆలయంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. -
ఆలయ అభివృద్ధి.. పుష్కరాల పనులు
● నిరంతర పర్యవేక్షణ, సమన్వయం అవసరం ● ఐఏఎస్ అధికారికి బాధ్యత అప్పగిస్తే మేలు భద్రాచలం: గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ప్రకటించింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పను ల పర్యవేక్షణ, గోదావరి పుష్కరాల పనుల బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు గోదావరి పుష్కరాలు 2027, జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కారిడార్లో పుష్కరాల విజయవంతానికి సుమారు 300 రూ. కోట్ల వరకు కేటాయించింది. భక్తులు అధికసంఖ్య లో వచ్చే భద్రాచలం వద్ద ఏర్పాట్లపై దృష్టి సారించింది. నెల రోజుల క్రితం పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రాచలం వద్ద సుమారు రూ.60కోట్ల నుంచి రూ. 80 కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. దీంతో ఈ ఏడాది పుష్కరాల పనులు నిర్విరామంగా జరగనున్నాయి. ఇటీవల భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశా రు. మొత్తంగా రూ.586 కోట్లు కేటాయించగా, మూ డు విడతలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో రూ.75కోట్లతో గోదావరి ఘాట్ల విస్తరణ, రూ.180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ.96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి.. మొత్తంగా రూ.351 కోట్ల పనులను చేయనున్నారు. వీటిని మార్చి 2027 లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రెండో విడతలో 2028 నాటికి కాపా రామలక్ష్మమ్మ ట్రస్టు వద్ద ఉన్న ఆరెకరాల స్థలంలో రూ.108 కోట్లతో పనలు చేపట్టాల్సి ఉంది. మూడో విడతలో రూ.127 కోట్లతో భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులు 2029వరకు పూర్తిచేయనున్నారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఐఏఎస్కు బాధ్యతలు అప్పగిస్తే... పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పుష్కరాల సమయంలో చివరి నిమిషంలో పనులు పూర్తి కాక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇటువంటి సమస్య రాకుండా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మేలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బి.రాహుల్ ఇద్దరు ఐఏఎస్లు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తగిన ఆలోచన చేసి వీరిద్దరిలో ఒకరికి లేదా మరో సీనియర్ అధికారికి అభివృద్ధి పనుల బాధ్యతలను అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
పాల్వంచరూరల్: కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామంలో నివాసం ఉంటున్న రజినీ ఆదినారాయణ(25)ఈ నెల 4న పురుగుల మందుతాగాడు. కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ పోలీసులకు సమాచారం అందించింది. వడదెబ్బతో వ్యక్తి.. భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పట్టణంలోని అశోక్నగర్ కొత్తకాలనీకి చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. ఇటీవల మద్యానికి బానిసగా మారాడని, ఈ క్రమంలో అతిగా మద్యం తాగి ఎండదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు చుక్కా శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఎస్ఐ శ్యాంప్రసాద్ కేసు నమోదు చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యఅశ్వాపురం: Ð]l$…yýlÌS MóS…{§é-°MìS ^ðl…¨¯]l K Ð]lÅMìS¢ ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éW B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$-¯é²yýl$. AÔ>Ó-ç³#-Æ>°MìS ^ðl…¨¯]l } §ýl$Æý‡Y IÆý‡¯Œl àÆŠḥzÐólÆŠḥ Ķæ$fÐ]l*° MýS…§ýl$ÌS Ð]l$«§ýl$-çÜ*-§ýl¯Œl Æ>Ð]l# (46) D ¯ðlÌS 4¯]l ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éV>yýl$. ©…™ø MýS$r$…½MýS$-Ë$ QÐ]l$Ã… Bçܵ-{†MìS ™èlÆý‡-Í…^éÆý‡$. ç³Çíܦ† ÑçÙ-Ð]l$…-V> Ð]l*Ç _MìS-™èlÞMýS$ ÔèæÈÆý‡… çÜçßæ-MýS-Ç…^èlyýl… Ìôæ§ýl° OÐðl§ýl$Å-Ë$ ™ðlÌS-ç³-yýl…-™ø C…sìæMìS ¡çÜ$-MýS$-Æ>V>, B¨ÐéÆý‡… Æ>{† Ð]l$–† ^ðl…§éyýl$. Ð]l$–™èl$yýl$ Ýù§ýl-Æý‡$yýl$}°ÐéçÜ-Æ>Ð]l# íœÆ>Å-§ýl$-™ø MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ-¯]lr$Ï ïÜI AÔZMŠSÆð‡yìlz ™ðlÍ´ëÆý‡$. రెండు బైక్లు ఢీ : ఇద్దరికి గాయాలుపాల్వంచరూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డ ఘటన మండలంలోని రంగాపురం వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం నకిరిపేటకు గ్రామానికి చెందిన ఎన్.లింగయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమసయంలో జింకలగూడేనికి చెందిన ఎస్కె.రెహమాన్ మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రంగాపురం శివారు కిన్నెరసాని వాగు బ్రిడ్జి వద్ద రెండ్ బైక్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. లింగయ్యకు తీవ్ర గాయాలుకాగా, కొత్తగూడెం తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విపత్తులపై అవగాహన ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విపత్తులపై సరైన అవగాహనతోపాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని కలెక్టర్ అంకిత్ అన్నా రు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ ఫామెక్స్ నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. విపత్తులకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, విపత్తు నిర్వహణ ప్రణాళిక అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచా యతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, ఇరిగేషన్, వ్యవసాయ తదితర శాఖల సమన్వయంపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి 15 రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెపెక్టర్ బిటన్సింగ్, బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ విధానాలను సమగ్రంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ.. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు. అర్హులు pmsuryaghar. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలూరుపాడు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యసిబ్బందిని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడు ప్రభు త్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. మందుల నిల్వలు, వైద్యులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ కేసుల నమోదును గుర్తించిన కలెక్టర్ ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలివేంద్రాలు, ఉపాధి పనిప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన జెడ్పీ సీఈ ఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వైద్య శాఖాధి కారి తుకారాం రాథోడ్, విద్యుత్ ఎస్ఈ జి మహేందర్, టీజీఆర్ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి.అజయ్ కుమార్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ జిల్లాలో వివిధశాఖల పరిధిలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, రోడ్లు–భవనాలు, ట్రైబల్ వెల్ఫేర్, విద్యుత్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ అనుమతులు, భూసంబంధిత సమస్యలు వంటి ఆటంకాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. రహదారుల నిర్మాణం, ఇందిర మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా పాఠశాలలు, సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలు, పంప్ హౌస్లు తదితర పనులను సమయానికి పూర్తిచేయాలని సూచించారు. అధికారులు అర్జున్ రావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, తిరుమలేష్, నళిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్లో బదిలీల గందరగోళం
● నాలుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్ఫర్లు ● నేటితో ముగియనున్న ఆప్షన్ల గడువు ● కుటుంబాలకు దూరమవుతామని సిబ్బంది ఆవేదనఖమ్మంక్రైం: ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల బదిలీల్లో 317 జీవో గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎకై ్సజ్శాఖలోని హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బదిలీల ప్రక్రియ మొదలుకావడంతో ఉద్యోగులు ఆనందపడ్డారు. కానీ ఈ జీఓ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని వాపోతున్నారు. నాలుగు జిల్లాల పరిధి 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో 317 జీఓను అమల్లోకి తెచ్చింది. ఈ జీఓ ప్రకారం సీడీ(4) కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఎక్కడైనా బదిలీ చేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాలే కాక ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నా.. ఉమ్మడి జిల్లాను వీడి వెళ్లాల్సి రానుండడంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. 41 స్టేషన్లకు ఆప్షన్ ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు పెట్టుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. కాగా, నాలుగు జిల్లాలో 44 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా.. ఉద్యోగులు 41 స్టేషన్లకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో సిబ్బంది ఆప్షన్లు నమోదు చేస్తున్నా ఏ జిల్లాకు బదిలీ అవుతుందోనని ఉత్కంఠకు లోనవుతున్నారు. కాగా, ఆప్షన్ల పరిశీలన అనంతరం 133 మంది కానిస్టేబుళ్లు, 32 హెడ్కానిస్టేబుళ్లకు ఈనెల 10వ తేదీన బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. పైరవీలు ప్రారంభం 317 జీఓపై అవగాహన లేదని చాలా మంది ఎకై ్సజ్ సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఖమ్మంలో పని చేసిన వారు భద్రాద్రి జిల్లాకు, భద్రాద్రి జిల్లాలో పనిచేసిన వారు ఖమ్మంకు బదిలీపై వచ్చారు. అయితే జీఓ 317 ప్రకారం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ను భద్రాద్రి జిల్లాకు కాకుండా వరంగల్ లేదా హనుమకొండ జిల్లాకు బదిలీ చేసినా తప్పక వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే కుటుంబం, పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని, తద్వారా ఇబ్బంది వస్తుందని తల పట్టుకుంటున్నారు. ఈనేపథ్యాన కొందరు తమకు తెలిసిన ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. పని చేస్తున్న ప్రాంతంలోనే మరో స్టేషన్కు బదిలీ చేయాలని, లేకపోతే పక్క జిల్లాకు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇంకొందరు రాజకీయ నాయకుల ద్వారా కూడా పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, ఎలాంటి పైరవీలకు తావు లేదని, ఎక్కడకు బదిలీ చేసిన వెళ్లాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
చుంచుపల్లి: బీజేపీ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెండా ఎగరవేసి మాట్లాడారు. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటమే బీజేపీ లక్ష్యమని, మోదీజీ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవీకే మనోహర్, బలగం శ్రీధర్, పైడిపాటి రవీందర్, వెంకన్న నాయక్, జల్లారపు శ్రీనివాస్, సముద్రాల గాయత్రి, ధారావత్ విష్ణు ప్రియ, జజ్జూరు మోహన కృష్ణ, రమణ, నరహరి బండి వీరస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మార్క్ఫెడ్ మేనేజర్గా శ్యామ్కుమార్ ఖమ్మంవ్యవసాయం: మార్క్ఫెడ్ సంస్థ రాష్ట్రంలోని 13మంది మేనేజర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్ సునీతను సిద్దిపేటకు బదిలీ చేశారు. అలాగే, హనుమకొండ జిల్లా మేనేజర్ ఐ.శ్యామ్కుమార్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లా మేనేజర్గా బదిలీ చేయడంతో పాటు మహబూబా బాద్ జిల్లా మేనేజర్గా బాధ్యతలు అప్పగించా రు. ఈమేరకు శ్యామ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, మొక్కజొన్నకొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. హైటెక్ వ్యభిచారం?ఫొటోలతో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న మహిళ పాల్వంచ: పట్టణానికి చెందిన ఓ మహిళ ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలు, విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరానగర్కాలనీకి చెందిన సద రు మహిళ ధనికవర్గాలు నివసించే కాంట్రాక్టర్స్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ వ్య వహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలు, విద్యార్థినులకు మాయమాటలు చెబుతూ రొంపిలోకి దింపుతున్నట్లు సమాచారం. వారి ఫొటోలను తీసుకుని, తిరిగి వారినే బ్లాక్ మెయిల్ చేస్తూ, భారీ ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వీడి యో కాల్స్ ద్వారా హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు, మహిళలను చూపించి విటులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేసి, బాధితులకు నామమాత్రపు సొమ్ము ఇచ్చి మిగిలినదంతా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కిలాడీ మహిళ వేధింపులు తాళలేక ఓ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీబూర్గంపాడు: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు భూక్యా రుక్మిణమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును ఆదివారం రాత్రి దొంగలు అపహరించారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా, గొలుసు చోరీ చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకును కాలేజీలో చేర్చడానికి వెళ్తూ...
● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● లారీ రూపంలో కబళించిన మృత్యువుకొణిజర్ల: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కల కన్నారు. అందులో భాగంగా ఉత్తమ బోధన ఉండే కాలేజీని ఎంచుకుని చేర్పించాలని హైదరాబాద్ బయలుదేరారు. కానీ వారు గమ్యాన్ని చేరకుండానే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కొణిజర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... రాజమండ్రి నుంచి ప్రయాణం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి గాదాలమ్మనగర్కు ఉండమట్ల వీర్రాజు(46) ధవళేశ్వరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య వీర శైలజ (36), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్ ఇటీవల పదోతరగతి పూర్తిచేయగా ఇంటర్లో చేర్పించేందుకు హైదరాబాద్లోని కళాశాలలు చూడడమే కాక బంధువులను కలవాలని కారులో బయలుదేరారు. వీరి కారు సోమవారం తెల్లవారుజామున కొణిజర్లలోని సాగర్ కాల్వ బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోవడమే కాక కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై అడ్డంగా తిరిగింది. అదే సమయాన వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న వీరశైలజ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను కేబిన్లో ఇరుక్కుపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగా.. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. అలాగే, వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కుపోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో విడదీసి వీర్రాజు, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో వీర్రాజును ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. కాగా, కారును ఢీకొట్టిన లారీ అడ్డం తిరిగి బ్రిడ్జిపై అడ్డంగా నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఎస్ఐ జి.సూరజ్ నేతృత్వాన జేసీబీలతో వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఇక ట్రాఫిక్ జామ్ అయిన క్రమాన కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిలిచిన లారీని ధాన్యం లోడ్తో వచ్చిన మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ధాన్యం లోడు లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. -
పరీక్ష లేదు.. ఫలితం లేదు
● ఖమ్మం పెద్దాస్పతిలోని టీ హబ్లో నిలిచిన టెస్టులు ● యంత్రాలకు కాలం చెల్లడంతో రెండు రోజులుగా బంద్ ● ఆస్పత్రుల నుంచి శాంపిళ్ల సేకరణకు బ్రేక్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలతో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడం ఇక్కడ సర్వసాధారమే అయినా ప్రస్తుతం యంత్రాల కాలం చెల్లడంతో రెండు రోజులుగా టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు. 57నుంచి 134 పరీక్షలకు... పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా, దశల వారీగా పరీక్షల సంఖ్య 134కు చేరింది. పెద్దాస్పత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం 2 వేలకు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్కు రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. అయితే, ఖమ్మం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సెంటర్ ద్వారా కొద్దినెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా, ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యంత్రాలు పూర్తిగా మూలనపడటంతో పరీక్షలన్నీ నిలిపివేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. లక్షలాది మందికి సేవలు పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్లో డయాగ్నస్టిక్ సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6,92,681 మంది నుంచి 12,74,564 శాంపిళ్లు సేకరించగా, 25,89,677 పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొత్త యంత్రాలు వస్తే తప్ప సెంటర్ తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అప్పటి వరకు రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. ఆస్పత్రిలోని హబ్లో పరీక్షలు నిలిచిపోయిన విషయం వాస్తవమే. హబ్లోని యంత్రాల పరిస్థితిని కలెక్టర్కు నివేదించాము. కొత్త యంత్రాల అవసరాన్ని ప్రతిపాదించాము. కలెక్టర్ చొరవతో త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – డాక్టర్ రాంబాబు, ఖమ్మం ఆస్పత్రి ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్డయాగ్నస్టిక్ హబ్లో గంటకు 1,520 పరీక్షలు సామర్ధ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 పరీక్షలు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా వంద మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సీబీపీ మిషన్ మిషన్ మినహా కెమిస్ట్రీ ఎనలైజర్, ఇమ్యూనో ఎనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలనపడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిపించి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్దిరోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. -
మార్కెట్కు పోటెత్తిన మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. గడిచిన గురువారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం భారీగా సరుకు వచ్చింది. జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దాదాపు 45 వేల బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మిర్చి విక్రయాలతో పాటు ధరలోనూ పురోగతి నమోదై మునుపటి కన్నా జెండా పాట ఎక్కువగా పలికింది. ఈనెల 2వ తేదీన తేజా రకం జెండాపాట క్వింటాకు రూ.19,450 పలకగా, సోమవారం రూ.19,500కు చేరింది. అలాగే, మో డల్ ధర రూ. 18వేలుగా నమోదైంది. అలాగే, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10వేలు, మోడల్ ధర రూ. 8,200గా పలికింది. కొనుగోళ్లను మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.‘తేజా’ రకం క్వింటాకు రూ.19,500 -
‘సహకారం’లో సందిగ్ధం!
బూర్గంపాడు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల కోసం ఆశావహులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పదవీకాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్లో పాలకవర్గాలను రద్దు చేసింది. అప్పటినుంచి పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది. ఆరు నెలలుగా పర్సన్ ఇన్చార్జ్ల పాలనే సాగుతుండగా, పాలకవర్గాలు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్లను, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలని యోచించింది. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదన కూడా అటకెక్కినట్లు తెలుస్తోంది. పర్సన్ ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతోంది. పర్సన్ ఇన్చార్జిలతో పాలనా వైఫల్యం.. జిల్లాలో 21 పీఏసీఎస్లు రైతులకు సేవలందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వటంతోపాటు రైతులకు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్గేజ్ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణకు రుణాలు, పశుపోషణకు రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో రైతులు పీఏసీఎస్ల్లోనే కొంటున్నారు. యూరియా 80శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతోంది. పీఏసీఎస్లు 88 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. తద్వారా ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2004కు ముందు నిర్వీర్యమైన పీఏసీఎస్ల్లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జవ సత్త్వాలు నింపాడు. అప్పటి నుంచి ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం కో ఆపరేటివ్ అధికారులనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించటంతో పాలనా వైఫల్యాలు కనిపిస్తున్నాయని సంఘ సభ్యుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో ఎరువులు అందటం లేదని, ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. -
వేధిస్తున్న ‘గ్యాస్’ కొరత
పాల్వంచరూరల్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తోంది. సిలిండర్లు అందక హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. బుక్ చేసుకున్నాక రెండు, మూడు రోజులకు అందించాల్సిన గృహ వినియోగ సిలిండర్లను ఆలస్యంగా సరఫరా చేస్తున్నారు. ఒకసారి గ్యాస్ బుక్ చేసుకున్నాక, మళ్లీ రెండోసారి బుక్ చేసుకునేందుకు 45 రోజుల సమయం పడుతోంది. ఇక శుభకార్యాలు జరుపుకుంటే కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారి చెబుతున్నా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవస్థ తప్పడం లేదు. బ్లాక్లో విక్రయిస్తున్న కొందరు డీలర్లు జిల్లాలో 4,69,075 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా, వీరిలో సింగిల్ గ్యాస్ సిలిడర్లు కలిగినవారు 2,41,175 మంది, డబుల్ సిలిండర్ కలిగినవారు 98,868 మంది, దీపం కనెక్షన్లు 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2,465, ఉజ్వల కనెక్షన్లు 73,162 ఉన్నాయి. జిల్లాలో రోజుకు నాలుగువేలకు పైగా బుకింగ్లు జరుగుతున్నాయి. అయితే బుక్ చేసుకున్నా గ్యాస్ సరఫరా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు బ్లాక్లో ఒక్కో సిలిండర్ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని కొనుగోలు దారులు చెబుతున్నారు. కొందరు డీలర్లు కూడా బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 364 సిలిండర్లు స్వాధీనం బ్లాక్ సిలిండర్ల విక్రయిస్తుండగా, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారుల తనిఖీల్లో 364 సిలిండర్లు పట్టుబడగా, 52మందిపై 6ఏ కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలో 11 సిలిండర్లు, లక్ష్మీదేవిపల్లిలో 17, జూలూరుపాడులో 34, దమ్మపేటలో 36, భద్రాచలంలో 24, మణుగూరులో 172, సుజాతనగర్లో 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదు. వినియోగదారులు బుక్చేసుకుంటే 45 రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు. ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్ వినియోగదారునికి అందుతుంది. ఎక్కడా బ్లాక్ చేసే అవకాశంలేదు. గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్గా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచాం. ఇటీవల పలు ప్రాంతాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేశాం. బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. –ప్రేమ్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
బైక్, లారీ ఢీ..
అశ్వారావుపేటరూరల్: బ్చంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరై, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే బావ, బామ్మర్ది దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం తాటి రామన్నగూడేనికి చెందిన మడకం సంతోష్ (19), తనకు కాబోయే బావ పండు సందీప్ (20) ఆదివారం ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ చిచ్చొడిగుంపులోని సంతోష్ మేనమామ చిచ్చొడి సత్తిపండు కుమార్తె మొదటి జన్మదిన వేడుకలకు హాజరయ్యా రు. అనంతరం సంతోష్, సందీప్ కలిసి తమ స్వగ్రా మానికి బైక్పై వెళ్తుండగా మండలంలోని గాండ్లగూడెం శివారులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో సంతోష్, సందీప్ అక్కడికక్కడే దుర్మర ణం చెందారు. ఎస్ఐలు యయాతిరాజు, అఖిల ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ప్రభు త్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అఖిల తెలిపారు. తీరని విషాదం.. సంతోష్, సందీప్ మరణంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంతోష్కు తల్లిదండ్రులు మడకం విజయ, నాగేశ్వరరావు, అక్క ఉంది. సంతోష్ అక్కను సందీప్ ప్రేమిస్తుండగా, త్వరలోనే పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సందీప్ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నర్సమ్మ సైతం కన్నీటిపర్యంతమయ్యారు. కాబోయే బావ, బామ్మర్దుల దుర్మరణం -
పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు డిపోల వారీగా లబ్ధిదారులు
డిపో ప్రయాణించిన మహిళలు చార్జీల విలువ (రూ.ల్లో) ఖమ్మం 2,42,52,201 118,78,47,000సత్తుపల్లి 2,03,31,248 87,47,41,000మణుగూరు 1,52,83,995 69,55,96,000కొత్తగూడెం 1,50,25,096 61,29,67,000భద్రాచలం 1,19,42,306 61,78,98,000మధిర 1,04,86,537 75,52,54,000ఇల్లెందు 43,12,708 17,76,50,000మొత్తం 10,16,34,091 492,19,53,000 -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. డీర్ పార్కులోని దుప్పులు, డ్యామ్, జలాశయాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 277 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.15,450 ఆదాయం లభించింది. 250 మంది బోటింగ్ చేయగా టూరిజం శాఖకు రూ.17,140 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.మార్కెట్ల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్ కమిటీల విశ్రాంత ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మం మార్కెట్లో టి.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించాక నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుగా ఆమంచి కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా టి.విశ్వనాథం, అధ్యక్షుడిగా జల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద నిరంజన్, కోశాధికారిగా సీహెచ్.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డి.ఉప్పలయ్య, బి.సుధాకర్, రెంటాల చిన్నహుస్సేన్, పరిటాల సత్యనారాయణ, మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ఆంజనేయులు, ఎం.కేశవరావు, కె.సురేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.అరుణ్కుమార్, పి.వెంకయ్య, డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఆర్.రెడ్డి, బాబులాల్, ఉదయలక్ష్మి, శర్మ, సారంగపాణిని ఎన్నుకున్నారు.ప్రభుత్వం పీఏసీఎస్లకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల మాదిరిగా నామినేటేడ్ పద్ధతిలో నియమించాలనే ప్రతిపాదనలు తీసుకువచ్చింది. దీనిపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చ కూడా సాగింది. అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలూ మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను కూడా పక్కకు పెట్టి పర్సన్ ఇన్చార్జిలను నియమించటంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విపక్ష పార్టీల నాయకుల నుంచి ఎన్నికలు జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వానాకాలం వ్యవసాయ సీజన్ ఆరంభం కాకమునుపే పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని సంఘ సభ్యుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. -
●‘సాక్షి’ ఫొటోగ్రాఫర్కు అవార్డు
‘సాక్షి’ ఖమ్మం యూనిట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ రాధారపు రాజుకు అవార్డు లభించింది. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్(టీపీజేఏ) ఆధ్వర్యాన గత ఏడాది జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రాజు అవార్డు అందుకున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్ -
గోదాం పేరుతో గుట్ట గుల్ల
కారేపల్లి: అదొక గుట్ట.. అది రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం గోదాం నిర్మాణానికి నిర్ణయించి కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టింది. దీన్ని అలుసుగా తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పరిమితికి మించి గుట్టను జేసీబీలతో తవ్విస్తూ మట్టి, రాళ్లను కిందకు తరలించి అమ్మకోవ డం మొదలు పెట్టాడని తెలిసింది. ఇందుకోసం గుట్ట పైనుంచి కిందకు ఏకంగా రోడ్డు మాదిరి చదును చేయించడం గమనార్హం. దీన్ని పక్క న పెడితే హద్దులుదాటి అటవీ భూమిలోనూ తవ్వకాలు మొదలుపెట్టడంతో అటు స్థానికులు, ఇటు అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఫలితంగా గోదాం నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే, ఇదంతా జరిగేలోగా సదరు కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జించినట్లు విమర్శలు వస్తున్నాయి. అది కూడా మనదే ! మండలంలోని చీమలపాడులో 33 ఎకరాల మేర అటవీ భూమిని సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో సేకరించారు. ఇందుకు బదులుగా రెవెన్యూ గుట్ట అయిన గంగదేవి గుట్టపై 33 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. కాగా, రెవెన్యూ పరిధిలోనే గోదాం నిర్మాణ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ అక్కడ మట్టి తవ్వి తరలిస్తూనే కొద్దికొద్దిగా అటవీ శాఖకు కేటాయించిన భూమి నుంచి కూడా తవ్వకాలు మొలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 25న గుర్తించిన కారేపల్లి అటవీ అధికారులు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు కలగజేసుకోవడంతో అప్పటి వరకు అటవీ అధికారులు – కాంట్రాక్టర్ నడుమ వివాదం సద్దుమణిగింది. మేం ఊరుకునేదే లేదు.. తవ్వకాల విషయంలో అటవీ అధికారులు కాస్త మెత్తబడినా.. స్థానికులు మాత్రం ససేమిరా అన్నారు. నూరు శాతం ఆదివాసీ గ్రామమైన గుట్టకింది గుంపు గ్రామంలోని గంగదేవి గుట్టను గోదాం నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తున్నారని, మట్టి తరలిస్తూ కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నాడంటూ తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులే కాక గుట్టకిందిగుంపు సర్పంచ్ ఉండం రాఘవులు, గ్రామస్తులు పనులు అడ్డుకుని మార్చి 25న ఆందోళన చేపట్టారు. జీపీ తీర్మానం లేకుండా పనులు చేపట్టడమే తప్పు కాగా, ఇక మట్టి తవ్వకాలను సహించేది లేదని హెచ్చరించారు. స్థానికులు, నాయకుల తిరుగుబాటును గమనించిన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. అప్పటికి కానీ స్పందించని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈమేరకు రెండు రోజుల క్రితం గిడ్డంగుల సంస్థ ఎస్ఈ ఆర్.శ్రీనివాసరావు గ్రామానికి వచ్చారు. పనుల ప్రదేశాన్ని పరిశీ లించడమే కాక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి అభ్యంతరాలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన నేపథ్యా న.. ఆ తర్వాత ఏం జరగనుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.ఎక్కడ.. ఏమిటీ కథ? కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామ సమీపా న గంగదేవి గుట్ట ఉంటుంది. ఈ గుట్టపై గోదాం నిర్మించేందుకు ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించడమే కాక రూ.9కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు కాంట్రాక్టర్కు అప్పగించగా మూడునెలల క్రితం పనులు మొదలయ్యాయి. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా సదరు కాంట్రాక్టర్ గుట్టపై చెట్లు నరికివేయడమే కాక మట్టిని జేసీబీలతో కొల్లగొట్టి టిప్పర్లతో తరలించడం ప్రారంభించాడు. ఇందుకోసం గుట్టను తొలిచి ఇల్లెందు–కారేపల్లి ప్రధాన రహదారి వరకు సుమారు 500 మీటర్ల రోడ్డు వేసేశాడు. దీంతో స్థానికులు పరిశీలించడంతో జేసీబీలతో తొలుస్తూ పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు తేలగా పనులు చేపట్టేందుకు వీల్లేదని పట్టుబట్టారు. ఇష్టారాజ్యంగా మట్టి, రాళ్ల తవ్వకం, తరలింపు -
కార్మికుల సంఖ్య తగ్గుముఖం
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో గనులు, కాలనీలు వెలవెలబోతున్నాయి. యాజమాన్యం యాంత్రీకరణ పేరుతో భూగర్భ గనులను మూసివేసి ఓపెన్కాస్ట్ గనులు ఏర్పాటు చేస్తుండటంతో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వీఆర్ఎస్, గోల్డెన్ హ్యాండ్షేక్ వంటి స్కీమ్లతో గత 14 ఏళ్లలో దాదాపు 28 వేల మంది కార్మికులు ఇంటిబాట పట్టినట్లు కంపెనీ గణాంకాలే చెబుతున్నాయి. 2013–14 సంవత్సరంలో 61,778 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 39,460 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. సంస్థలో కార్మికుల సంఖ్య తగ్గుతున్నా యాజమాన్యం మాత్రం ఏటా ఉత్పత్తి రేషియోను 10 శాతం పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే కార్మికుల సంఖ్య తగ్గుతుంటే, ఉత్పత్తి లక్ష్యం పెంచడం వల్లే కార్మికులపై పనిభారం పెరుగుతోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్లేవి?సింగరేణి సంస్థ మూడేళ్లుగా ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. 2023 సంవత్సరంలో 10 విభాగాల్లో 272 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత నియామకాలు చేపట్టలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన సీఎండీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సంస్థకు ఇద్దరు సీఎండీలు మారారు. కానీ ఎవరూ నోటిఫికేషన్లు, నియామకాలపై దృష్టిసారించలేదు. 2023 ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఏటా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక నియామకాల విషయం విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కార్మికుల ఉత్పత్తి (మిలియన్ సంఖ్య టన్నులు) 2013-14 61,778 50.47 2017-18 54,043 62.01 2021-22 43,672 65.02 2025-26 39,460 68.00సింగరేణిలో పెరుగుతున్న పనిభారం సింగరేణి సంస్థ ఉన్న గనుల్లో లక్ష్యాలను పెంచుకోవటం వల్ల బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పడుతున్నాయి. అదేరీతిలో కొత్త గనుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. అప్పుడు కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. –కాపు కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సంస్థలో గత 14 ఏళ్లలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. యాజమాన్యం మాత్రం ఉత్పత్తి లక్ష్యం పెంచుతూ కార్మికులపై పనిభారం మోపుతోంది. దీనివల్ల కార్మికులు గనుల్లో ఎక్కువ కాలం పనిచేయలేక పోతున్నారు. –రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలు సాధించాలికలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): మహనీయుల ఆశయాలను సాధించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఈకార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ సామాజిక న్యాయ సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి ఎం.శ్రీలత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల సూరి తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలిసింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు టేకులపల్లి: రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలోని ఇల్లెందు, కోయగూడెం ఓపెన్కాస్టుల్లో పర్యటించారు. కేఓసీ వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు. ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనుల వివరాలను జీఎం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో నూతన జేకే ఓసీ ప్రాజెక్ట్ రికార్డులు, ప్రణాళికలను పరిశీలించారు. ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తర్వాత నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న రోడ్డు, తదితర పనులను పరిశీలించారు. జేకే కాలనీలోని సీ–2 క్వార్టర్లను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అధికారులు రామస్వామి, జాకీర్ హుస్సేన్, అజ్మీర తుకారాం, రవికుమార్, పూర్ణచందర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవలకు ‘సెలవు’!
● గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నెలన్నర విరామం ● మైనార్టీ విద్యాసంస్థల్లో అమల్లోకి నిర్ణయం ● తిరిగి జూన్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారుల వెల్లడి ఖమ్మం మయూరిసెంటర్: గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కనపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు పనిచేసే పది నెలలే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో వీరి సేవలు వినియోగించుకోనందున వేతనం చెల్లించొద్దనే భావనతో విధులకు విరామం ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి గతనెల 31నుంచి, పాఠశాలల్లో ఈనెల 24నుంచి విరామం అమలుకానుంది. అయితే, ఇది నిబంధనల ప్రకారం ఇచ్చే విరామమే తప్ప ఎవరినీ తొలగించడం లేదని మైనార్టీ గురుకులాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగతా గురుకుల సొసైటీల్లో కూడా ఈ నిర్ణయం అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కాకపోవడంతో.. ఏటా ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చే విరామంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కానందున ప్రస్తుతానికి పక్కనపెట్టి జూన్ 1వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిపై పడుతుందని అంచనా. ఇందులో నాన్ – టీచింగ్ సిబ్బంది 70 మంది, బోధన విభాగంలో 30 మంది ఉంటారని తెలిసింది. ఇటీవలే ఉపాధ్యాయుల నియామకం జరగడంతో ఔట్సోర్సింగ్ టీచర్ల సంఖ్య తగ్గింది. వీరికి మినహాయింపు గురుకులాల్లో అత్యవసర విధులను దృష్టిలో ఉంచుకుని కొందరికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆఫీస్ సూపరింటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రిన్సిపాళ్లు మాత్రం యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. అంతేకాక భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, పరిశుభ్రత కోసం స్కావెంజర్లు కూడా విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కార్పొరేటర్ తనయుడి మృతి
● తల్లిని బైక్పై తీసుకెళ్తుండగా ఘటన ● వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కొడుకు మృతి, తల్లికి గాయాలు పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో తల్లి ముందే కొడుకు తీవ్రగాయాలై మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. తల్లిని మోటార్ సైకిల్పై తీసుకెళ్తుండగా, కారు రూపంలో మృతువు దూసుకొచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచలో బాబుజగ్జీవన్రామ్ జయంతిలో పాల్గొనేందుకు కరకవాగుకు చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మి శనివారం తన కుమారుడు అఖిల్ నందన్(19) బైక్పై బయలుదేరారు. బస్టాండ్ వద్ద కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టి.. కింద పడిన అఖిల్నందన్ పైనుంచి వెళ్లడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. విజయలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వీరి వెనకాలే మరో బైక్పై వస్తున్న పెద్ద కుమారుడు చైతన్శ్రీ స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అఖిల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు తల్లిని తీసుకెళ్తున్న కుమారుడు రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అఖిల్ తల్లిదండ్రులు భట్టు లక్ష్మణ్, విజయలక్ష్మిని పరామర్శించేందుకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోగా రోదనలు మిన్నంటాయి. అలాగే, మేయర్ మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కార్పొరేటర్లు, నాయకులు కూడా మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా, ఇంటర్ పూర్తిచేసిన అఖిల్నందన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ప్రమాదం జరగడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఆయన తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
వేతనం ఆదా అవుతోంది..
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తా. ఆర్టీసీ బస్సులో నిత్యం వచ్చి వెళ్తుంటాను. మహాలక్ష్మి పథకానికి ముందు ప్రతీనెల పాస్ కొనుగోలు చేశాను. ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగా పాస్ కొనే నగదు వేతనంలో ఆదా అవుతోంది. – మాధవి, నేలకొండపల్లిప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మాకు కలిసొచ్చింది. తక్కువ వేతనాలతో పని చేసే మాకు ఈ పథకం వచ్చాక భారం తప్పింది. చార్జీల నగదును ఇతర అవసరాలకు వినియోగిస్తూ, కొంత పొదుపు చేసుకునే వెసులుబాటు కలిగింది. – ప్రియ, నేలకొండపల్లి -
ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యవర్గం ఎన్నిక
పాల్వంచ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) అనుబంధ ఎన్పీడీసీఎల్ కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ‘ఏ’ కాలనీలో ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు ఆధ్వర్యాన జరిగిన సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.దేవ్సింగ్, ఉపాధ్యక్షులుగా బి.స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.నాగరాజు, సహాయ కార్యదర్శిగా వి.మోతీలాల్, ప్రచార కార్యదర్శిగా ఆర్.యాకయ్య, కోశాధికారిగా సీహెచ్.కృష్ణయ్యతో పాటు కార్యవర్గ సభ్యులుగా కె.బాలరాజు, జి.వేణు, ఎం.రాజు, ఎల్.బలరాంను ఎన్నుకున్నారు. అలాగే, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు యూనియన్లో చేరగా వారిని ఆహ్వానించాక రామారావు మాట్లాడారు. కార్మికులు కష్టించి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. అలాగే, నూతన కార్యవర్గం కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. నాయకులు ఎస్.శ్రీనివాసాచారి, డి.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్.సయ్యద్, వి.కోటేశ్వరరావు, యాకయ్య, భిక్షపతి, గణేశ్, అమర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ సిఫారసులపై చర్చ జరగాలి మధిర: రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికలోని సిఫారసులపై సమగ్ర చర్చ జరపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. అంతేకాక ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలిగించేవి, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తొలగించి విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలనే అమలు చేయాలని సూచించారు. మధిరలో యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అలాగే, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుచేయడమే కాక పెండింగ్ బిల్లులు, డీఏలు విడుల చేయాలని కోరారు. అంతేకాక సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లు, కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రవి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, వీరయ్య పాల్గొన్నారు. రైతులకు పరిహారం అందించాలి మధిర: మధిరలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీ ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోగా, మిర్చి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మధిరలో ఆదివారం జరిగిన కోల్డ్ స్టోరేజీ బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో రూ.కోట్ల విలువైన మిర్చి నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, బాధితులు పక్షాన పోరాడేందుకు కమిటీని ఏర్పాటుచేసి కన్వీనర్గా దొండపాటి నాగేశ్వరరావు, కోకన్వీనర్గా గువ్వల సీతారామిరెడ్డిని నియమించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మందడపు ఉపేందర్, రైతులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి పాల్వంచ: పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. బంగారుజాల, పేటచెరువు శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు కొత్తగూడెం సీసీఎస్ పోలీస్, పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులును అదుపులోకి తీసుకుని, మూడు బైక్లు, కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేశామని చెప్పారు. -
రూ.3.50 కోట్లతో ఇల్లు కొని మోసపోయి.. ఆత్మహత్య
అమీర్పేట: రూ.3.50కోట్లు చెల్లించి ఇంటిని కొనుగోలు చేశాడు... గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం సారపాకకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి (42) స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల వనస్థలిపురంలో రూ.3.50 కోట్లతో ఇల్లు కొనుగొలు చేశాడు. గృహప్రవేశం కోసం ఈ నెల 2న భార్య అనూష, కూతురుతో కలిసి నగరానికి వచ్చి నిజాంపేటలోని బావమరిది ఇంట్లో దిగారు. శుక్రవారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ప్రవీణ్రెడ్డి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేస్తే సమయం పడుతుందని తెలిపాడు. అర్ధరాత్రి 12 గంటల సమయాన మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అంతకుముందు భార్యకు పంపిన లొకేషన్ ఆధారంగా వెతుక్కుంటూ అమీర్పేట రాగా, రెనెక్సా అపార్ట్మెంట్ సమీపాన ఫుట్పాత్పై చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అమ్మిన వ్యక్తులు నకిలీ పత్రాలతో తనను మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. ఘటనపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలతో నమ్మించారని సూసైడ్నోట్ -
జాగ్రత్తలు పాటించాలి
భద్రాచలం: భద్రగిరి గిరిజన మార్ట్కు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తుల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శనివారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న యజమానులు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం శిక్షణ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమయ్యారు. గిరిజన నిరుద్యోగ కేరళలో నెపుణ్య శిక్షణ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలో శిక్షణకు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఐఎన్టీయూసీ నేతకు డాక్టరేట్
రుద్రంపూర్: ఐఎన్టీయూసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్కు డాక్టరేట్ లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి గాను ఆయనకు జీహెచ్ఆర్టీ ఇండియా సంస్థ ఆధ్వర్యాన డబ్ల్యూఈబీబీఐసీ – ఏఐయూ యూనివర్సిటీ ల సంయుక్త ఆధ్వర్యాన గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరి గిన కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంటేకులపల్లి: అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై రెవెన్యూ అధికారులు దాడిచేసి 85 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా.. టేకులపల్లి మండలం బోడులో రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేటలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు శివకుమార్, మహేష్, ప్రభాకర్లు శనివారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదా ల్లో గ్రామానికి చెందిన ఇరుప సమ్మయ్య నివా సంలో అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా.. బి య్యం నిల్వలు గౌతమ్కు చెందినవి కావడంతో ఆయనపై అధికారులు కేసు నమోదు చేశా రు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేదల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన బియ్యాన్ని సంబంధిత శాఖకు అప్పగించి, తదుపరి విచారణను వేగవంతం చేశారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు.. పాల్వంచరూరల్: మండల పరిధి నాగారం కాలనీ చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు దాడుతున్న గుర్రం దుర్గాప్రసాద్(48)ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ శనివారం ఫి ర్యాదు చేయగా.. లారీడ్రైవర్ సువర్ణపాక రవితేజ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కొత్తగూడెంఅర్బన్: ఆస్తి తగాదాల నేపథ్యాన సుపారీ తీసుకున్న వ్యక్తులు ఒకరిపై దాడి చేసిన ఘటన ఇది. కొత్తగూడెం గొల్లగూడెంకు చెందిన రాము శుక్రవారం రాత్రి డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్తుండగా భావన బార్ దగ్గర మేదరబస్తీకి చెందిన సంతోష్, చింటూ ఆపి వాహన లిఫ్ట్ అడిగి ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లాక దాడి చేశారు. ఆ సమయాన స్పృ హ కోల్పోయిన రాము తేరుకున్నాక త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాము బంధువుల వద్ద సంతోష్, చింటూ సుపారీ తీసుకొని దాడి చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కొత్త పింఛన్లకు మోక్షం
● రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆశలు ● జిల్లాలో 69,136కు పైగా పెండింగ్ దరఖాస్తులుచుంచుపల్లి: చేయూత పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అర్జీదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా 2 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,13,942 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆసరా పథకం కోసం వచ్చిన కొత్త అర్జీలను వెనువెంటనే పరిష్కరించి పింఛన్లు విడుదల చేసేవారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులకు రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4016 చొప్పున ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేశారు. కానీ ఆ తర్వాత పింఛన్ల మంజూరులో జాప్యం జరుగుతోంది. భారీగా చేయూత దరఖాస్తులు 2018లో అప్పటి ప్రభుత్వం పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2021 ఆగస్టు వరకు దరఖాస్తులను స్వీకరించి, 2022 ఆగస్టులో కొందరికి కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. మరికొందరికి మంజూరు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరుతో మళ్లీ దరఖాస్తుల స్వీకరించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువు, చేనేత, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పింఛన్ల కోసం జిల్లాలో 69,136 దరఖాస్తులు అందాయి. ఇందులో దివ్యాంగులు 7,438 మంది ఉండగా, ఇతర పింఛన్ల కోసం 61,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆ తర్వాత కూడా పలువురు దరఖాస్తులు అందజేశారు. తాజాగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా ప్రతినెలా రూ. 25.73 కోట్లను జిల్లాలోని లబ్ధిదారులకు అందజేస్తోంది. కొత్తగా మంజూరు చేయబోయే పింఛన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 233 కోట్లను మంజూరు చేసింది. ఈ విషయమై డీఆర్డీఓ ఎం.విద్యాచందనను సంప్రదించగా.. పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. -
డీసీసీబీ లాభాల్లో పీఏసీఎస్లకు వాటా
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం సాధించిన రూ.30 కోట్ల లాభాల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లకు రూ.6 కోట్లను డివిడెంట్ రూపంలో అందించింది. ఈమేరకు డీసీసీ బీ ఆర్థిక ప్రగతి వివరాలను బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వ్యాపారంతో పాటే లాభాలు గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.878 కోట్ల వ్యాపారాన్ని పెంచుకొని మొత్తం రూ.4,338 కోట్ల లావాదేవీలకు చేరిందని సీఈఓ తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని ఉన్న తొమ్మిది కేంద్ర సహకార బ్యాంకుల్లో రెండో స్థానాన నిలిచిందని పేర్కొన్నారు. రుణాలను సకాలంలో వసూలు చేయడం ద్వారా నిరర్ధక ఆస్తుల శాతాన్ని 0.95కు తగ్గించామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.30 కోట్ల లాభాలు గడిస్తే.. 2025–26లో రూ.30 కోట్లకు చేరాయని, ఇందులో నుంచి పీఏసీఎస్లకు డివిడెంట్గా అందించామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం, కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగా ఆర్ధికాభివృద్ధి నమోదైందని, 2026–27లో లావాదేవీలను రూ. 6 వేల కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.డివిడెంట్గా రూ.6కోట్ల పంపిణీ -
ఆర్టిజన్లకు భరోసా కల్పించాలి
పాల్వంచ: ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేసి, విద్యు త్ సంస్థల్లో పనిచేస్తున్న 19వేల మంది ఆర్టిజన్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని పలువురు రాజకీయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు అన్నారు. శనివారం కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జేఎసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను ఆర్టి జన్లుగా గుర్తించినా బ్రిటీష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ను అంటగట్టి తీవ్రఅన్యాయం చేశారని ఆరో పించారు. ఈ నెల 7వ తేదీలోగా డిమాండ్లను పరి ష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హె చ్చరించారు. ధర్నాకు కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు భట్టు లలిత, చెరకు భాగ్యలక్ష్మి, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ఎ.జలీల్, సీపీఐ నాయకులు పూర్ణచందర్రావు, నిమ్మల రాంబాబు, రాహుల్, గౌని నాగేశ్వరరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు చారు గుండ్ల రమేష్, రాధాకృష్ణ, అంకిరెడ్డి నరసింహారావు, రావుల మురళి, గొర్రె వేణుగోపాల్, పూరపాటి రమేష్, జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, సాయిలు, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాగూర్, శారద తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో రాజకీయ, జేఏసీ నాయకులు


