breaking news
Bhadradri District Latest News
-
గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించాలి
కొత్తగూడెంఅర్బన్: బంజారులు మాట్లాడే గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం మార్కెట్ యార్డ్లో లంబాడీ (బంజారా)సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని, ట్రైకార్ రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఐటీడీఏల్లో బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రతీ చోట భగవాన్ హతీరామ్ బావాజీ గుడి నిర్మించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు లాగే హతీరామ్ బావాజీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాజేష్ నాయక్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, బానోత్ రాములు నాయక్, హతిరామ్నాయక్, వీరూనాయక్, వెంకట్ నాయక్, సీతారాంనాయక్, రవి నాయక్, లాల్ సింగ్ నాయక్, బాబులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
3,500 ఇన్.. 3,390 అవుట్
● ఇటీవల కొత్త రేషన్కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ● బియ్యం తీసుకోని, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నవారివి రద్దు ● ఆందోళన చెందుతున్న రద్దయిన రేషన్కార్డుదారులు కొత్తగూడెంఅర్బన్: అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు సర్వే నిర్వహించి కొందరి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రద్దైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గత మార్చి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో బియ్యం తీసుకోనివారు కూడా రేషన్ షాపుల వద్దకు వచ్చి క్యూలో నిలబడి బియ్యం తీసుకెళ్తున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా ఇంకా కొందరు రేషన్ బియ్యం తీసుకోనివారు ఉన్నారు. ఫలితంగా రేషన్ షాపులో బియ్యం మిగిలి, బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయీస్ అధికారులు రెవెన్యూ శాఖ సహకారంతో సర్వే నిర్వహించారు. చాలా మంది రేషన్కార్డులు కలిగి ఉండి, బియ్యం తీసుకోవడం లేదని సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా రేషన్బియ్యం తీసుకోనివారు, ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉండి ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను సేకరించారు. ఇలా జిల్లాలో 3,390 రేషన్ కార్డులను, 5,401 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించారు. మరో 78 కార్డులకు సంబంధించిన సర్వే ప్రక్రియ సాగుతోంది. మరో 6,459 కార్డులు పంపిణీకి సిద్ధం జిల్లాలో రేషన్కార్డు దరఖాస్తులపై సర్వే పూర్తి చేసి దాదాపు 3,500 కొత్త కార్డులను సివిల్ సప్లై అధికారులు మంజూరు చేశారు. వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంకా 6,459 కార్డులను అప్రూవల్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతి ఇస్తే ఆ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు. అప్రూవల్ చేసిన కార్డుల్లో కొత్తవాటితోపాటు, మార్పు చేర్పులు చేపట్టినవి కూడా ఉన్నాయి. రేషన్ కార్డులో పేరు తొలగింపునకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పేరు చేర్చాలంటే మీ సేవలో దరఖాస్తు చేయాలని సివిల్ సప్లాయిస్ అధికారులు చెబుతున్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ రేషన్కార్డుల జారీ, పేర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో మరో 6,459 కొత్త రేషన్కార్డులు అప్రూవల్ దశలో ఉన్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు కార్డులు జారీ చేస్తాం. – రుక్మిణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు అన్నప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రశాంతంగా ‘అండర్ మేనేజర్’ పరీక్షసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 33 అండర్ మేనేజర్ పోస్టులకు ఆదివారం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, 234 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 217 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని సింగరేణి ఎడ్యుకేషన్ జీఎం బి.నికోలస్ పర్యవేక్షించారు. సింగరేణి విజిలెన్స్, సెక్యూరిటీ, రికూట్మెంట్ సెల్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ శారద పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం ప ర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చా రు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దు ప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 717 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.38,115 ఆదాయం లభించింది. 450మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.22,330 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త పరికరాలుఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలకు కొత్త పరికరాలు చేరుకున్నాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానం అమలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా ముగించేలా కొత్త కంప్యూటర్లు, స్కానర్లు, బయోమెట్రిక్ డివైజ్లను అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ పరికరాలు వచ్చాయి. పాత వాటితో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతుండగా కొత్త పరికరాలు సరఫరా చేశారని, వాటిని ఆయా కార్యాలయాల్లో అమర్చామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ● రజత పతకం సాధించిన మల్లెమడుగు విద్యార్థినులు ఖమ్మంఅర్బన్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో మల్లెమడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాట్లారు. కె.అనిత, టి. నవ్యశ్రీ రజత పతకం సాధించారు. గతేడాది వనపర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అనిత కాంస్య పతకం సాధించిందని, హైదరాబాద్లో జరిగిన సీఎం కప్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుందని ప్రధానోపాధ్యాయురాలు జి.కృష్ణవేణి, పీడీ బియ్యని కృష్ణయ్య వివరించారు. కాగా, ఈ విద్యార్థినులను ఎంఈఓ శైలజలక్ష్మి తదితరులు అభినందించారు. -
భక్తులతో పోటెత్తిన భద్రగిరి
భద్రాచలం: భద్రగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో భక్తులు భద్రాచలం బాట పట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ ఉండటంతో పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో, దేవస్థానం వసతి గృహాల్లో గదులు దొరకక భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రామయ్యకు వైభవంగా కల్యాణం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీసీతారామచంద్ర స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చనస్వామివారి సేవలో ఎస్పీ శ్రీ సీతారామ చంద్రస్వామివారిని ఎస్పీ రోహిత్ రాజు, మౌనిక దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రసాదాలను అందజేశారు. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్చర్ల: ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. ఆదివారం ఆయన డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మితో కలిసి మండలంలోని ఉంజుపల్లి పల్లె దవాఖానాను సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సికిల్ సెల్ ఎనీమియా, టీబీ ముక్త్ భారత్, ఎన్సీడీ స్క్రీనింగ్, జ్వర పీడితుల గుర్తింపు తదితర వైద్య సేవలపై అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్, చర్ల ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ స్పందన, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ తేజశ్రీ, ఉంజుపల్లి సబ్సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముంపు ముప్పు
పొంచి ఉన్నపోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో భద్రాచలంలో భయం.. భయం ● మేడిగడ్డ బరాజ్తోనూ తప్పదని మంత్రి ఉత్తమ్ ప్రకటన ● పోలవరం ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ బృందంతో సర్వే ● ఎగువ బరాజ్ల ప్రభావంపైనా సర్వే చేయాలని డిమాండ్లుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్ట్ ముంపుపై స్పష్టమైన అంచనాలు బయటకు రాకముందే మేడిగడ్డ బరాజ్తోనూ భద్రాచలం ప్రాంతానికి ప్రమాదమని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆరంభించే సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ 2016లో గోదావరి బ్యాక్ వాటర్ వల్ల కలిగే ముంపు సమస్యపై అధ్యయనం చేసింది. ప్రాజెక్ట్లో 45.72 మీటర్ల మేర నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేస్తే గోదావరి ఎగువ భాగంలో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే వివరాలను ఇందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు పోలవరం బ్యాక్ వాటర్కు సంబంధించి ఈ నివేదికే ప్రామాణికంగా ఉంది. దీని ప్రకారం పోలవరం డ్యామ్ దగ్గర 45 అడుగుల మేర నీరు నిలిచినా భద్రాచలం పట్టణంతోపాటు ఎగువన ఉన్న బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ముంపు భయం ఉండదని పేర్కొంది. కానీ 2022 జూలైలో వచ్చిన భారీ వరద సీడబ్ల్యూసీ అంచనాలను తారుమారు చేసింది. సందేహాలకు తావిచ్చేలా.. మూడేళ్ల క్రితం 2022, జూలై 16న అర్ధరాత్రి 27 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉండగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71.30 అడుగులకు చేరుకుంది. కరకట్ట ఎత్తు 80 అడుగులు కావడంతో దాదాపుగా అంచుల దగ్గర వరకు అన్నట్టుగా వరద పోటెత్తింది. ఎటపాక దగ్గరయితే కరకట్ట మీద నుంచి నీళ్లు ఊళ్లోకి రావడం మొదలైంది. దీంతో ఏ క్షణమైనా కరకట్ట తెగిపోయి భద్రాచలం జలమయం అవుతుందా అనే భయాలు నెలకొన్నాయి. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ప్రమాదం తప్పింది. సాధారణంగా గోదావరికి వరద ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా తగ్గిపోతుంది. కానీ 2022లో 71 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకున్న వరద తిరిగి 51 అడుగుల స్థాయికి చేరుకునేందుకు రెండున్నర రోజుల సమయం పట్టింది. పోలవరం డ్యామ్ కారణంగానే వరద వెనక్కి తగ్గడంలో ఆలస్యమైందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలవరం – భద్రాచలం ముంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పోలవరం అథారిటీ దృష్టికి.. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణలో 103 గ్రామాల్లో 954 ఎకరాలు, 16 వేలకు పైగా ఇళ్లు ముంపునకు గురవుతున్నాయంటూ పోలవరం అథారిటీ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. దీనిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంపు కేవలం 200 ఎకరాల లోపే ఉంటుందని వాదించింది. చివరకు ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఓవైపు వాదనలు సాగుతుండగానే ముంపు ప్రభావం తెలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆసక్తి చూపించారు. తెలంగాణపై పోలవరం ముంపు ప్రభావాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించారు. జనవరి 4న ఆదేశాలు జారీ చేస్తూ ఫిబ్రవరి చివరి నాటికి నివేదిక రావాలంటూ గడువు విధించారు.ఆలస్యంగానైనా వస్తున్నారు.. సీఎం ఆదేశాల మేరకు ఐఐటీ బృందం వచ్చే వారం పది రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరిలో సీఎం నుంచి ఆదేశాలు వచ్చాక ఐఐటీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన భారీ వరదలు, వాటి తాలూకు ప్రభావం తదితర వివరాల కోసం సీడబ్ల్యూసీ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖల దగ్గరున్న రిపోర్టులను సదరు కమిటీ అధ్యయనం చేసింది. చివరగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు రానుంది. భద్రాచలానికి దిగువన ఉన్న పోలవరంతోపాటు ఎగువన ఉన్న మేడిగడ్డ, సమ్మక్క సాగర్ బరాజ్ల వల్ల భద్రాచలం పట్టణానికి ఉండే ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై హైదరాబాద్ ఐఐటీ బృందం దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
తగ్గిన పశు సంపద
● గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పశుగణన ● ఐదేళ్ల క్రితం సర్వే ప్రకారం జిల్లాలో 4.55 లక్షలు ● ఇటీవలి గణనలో తక్కువ ఉన్నట్లు తేలడంతో రీసర్వే పాల్వచరూరల్: ఐదేళ్లకోసారి నిర్వహించే జాతీయ పశుగణన ప్రక్రియ జిల్లాలో గత నెలలో ముగిసింది. తెల్ల పశువులు, గెదేలు, గొర్రెలు, మేకల సంఖ్య తగ్గిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. దీంతో పశువులు ఎందుకు తగ్గాయి.? అందుకు గల కారణాలు, పరిస్థితులు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం రీ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి పదిరోజులపాటు జిల్లాలో పది మండలాల్లో పశుసంవర్థక శాఖ అధికారులు రీ సర్వే నిర్వహించారు. గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు.. జాతీయస్థాయిలో ఐదేళ్లకోసారి పశుగణన నిర్వహిస్తుండగా చివరిసారిగా 2018–19 సంవత్సరంలో గణించారు. ఇప్పటివరకు 20 సార్లు పశుగణన చేపట్టారు. తాజాగా గతేడాది డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ వరకు పశుగణన సర్వే నిర్వహించారు. వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 473 రెవెన్యూ గ్రామాల్లో 140మంది ఎన్యూమరేటర్లు, 30 మంది సూపర్వైజర్లు 2,91,273 నివాసాల్లో పశుగణన చేపట్టారు. గతంలో కంటే పశుసంపద బాగా తగ్గిందని సర్వేలో తేలింది. 35 శాతం వరకు తగ్గిన తెల్ల, నల్ల పశువులు 2018–2019లో సర్వే ప్రకారం జిల్లాలో 4.55 లక్షల పశువులు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 2.80లక్షలు, నల్లపశువులు (గేదెలు) 1.70లక్షలు, మేకలు 2.50లక్షలు, గొర్రెలు 2.60 లక్షలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కోళ్లు 3.27లక్షలు, నాటుకోళ్లు 1.38 లక్షలు, పందులు 3,180, కుక్కలు 30 వేలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కానీ తాజా సర్వేలో తెల్లపశువులు 35–40శాతం, గేదెలు 30–35శాతం, గొర్రెలు 20–25శాతం, మేకలు 30శాతం, పెరటి కోళ్లు 35–40 శాతం తగ్గినట్లు తేలింది. ఎందుకు తగ్గాయంటే..? పశువుల సంఖ్య తగ్గడానికి కారణాలను కూడా విశ్లేషించారు. పోషణభారం కావడంతోపాటు పశువులను మేపే వారు తగ్గిపోవడం, బీడు భూములు లేకపోవడం, అటవీశాఖ అధికారులు ఫారెస్ట్లోకి పశువులు, మేకలు, గొర్రెలను రానివ్వకపోవడం, వ్యవసాయంలో యంత్రపరికరాల వినియోగం పెరగడం, ఇరిగేషన్ భూములు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పశువుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా రీ సర్వేలో తేలింది. పశువుల సంతతి తగ్గింది జిల్లాలో 21వ జాతీయ పశుగణన ప్రక్రియ నిర్వహించారు. 20వ సర్వేలో తేలిన పశువుల సంఖ్య కంటే తాజా సర్వేలో తక్కువ సంఖ్యలో పశువులు ఉన్నట్లు తేలింది. కేంద్రం ఆదేశాలతో పాల్వంచ, చండ్రుగొండ, బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, కరకగూడెం, ములకలపల్లి, పినపాక, మణుగూరు, ఇల్లెందు మండలాల పరిధిలో రీ సర్వే నిర్వహించాం. వివరాలను పశుగణ్ యాప్లో ఆన్లైన్ చేస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి -
మార్కెట్ కార్మికుల చార్జీలు పెంపు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే కార్మికుల చార్జీలు 13 శాతం పెరిగాయి. రెండేళ్లకు ఒకసారి మార్కెట్ కార్మికుల రేట్ల పెంపుపై నూతన ఒప్పందం ఉంటుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసరాలు, ఇతర అవసరాలకు అనుగుణంగా తమకు రేట్లు పెంచాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గానికి, ఖమ్మం మార్కెట్ కమిటీకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ, చాంబర్ ఆఫ్ కామర్స్, రైతు సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది మిర్చి ధర తగ్గినందున కార్మికుల రేట్ల పెంపును విరమించుకోవాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కార్మికులు అభ్యర్థించిన రేట్ల పంపును పరిశీలించి 13 శాతం పెంచుతున్నట్లు నిర్ణయించారు. మార్కెట్లో హమాలీలు, దడవాయిలు, స్వీపర్లు, రెల్లుడు వంటి కార్మిక విభాగాలు పనిచేస్తాయి. ఆయా కార్మికులుకు గతంలో నిర్ణయించిన రేట్లపై 13 శాతాన్ని పెంచారు. పత్తి, పంటలు బోరాల్లో నింపితే అదనంగా చార్జి చెల్లించాల్సి ఉంటుంది. గింజలు పెట్టడం, ధాన ధర్మాలు(ముష్టి) వంటి విధానాలు పూర్తిగా నిషేధించారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ పర్యవేక్షణలో ఈ నూతన రేట్లు అమలు కానున్నాయి. రైతుల పంటను ఖరీదుదారులకు విక్రయించటంలో మధ్యవర్తులుగా వ్యవహరించే కమీషన్దారులు నూతన కార్మికుల రేట్లు అమలు చేయాల్సి ఉంటుంది. పెంచిన 13 శాతం రేట్లు మార్కెట్లో పనిచేసే సుమారు 2,500 మంది కార్మికులకు వర్తించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి 13 శాతం పెంపు అమలు -
రేకుల షెడ్డు దగ్ధం
దమ్మపేట: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు దగ్ధమైన ఘటన మండలంలోని పట్వారిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీతారాములు తన కుటుంబంతో అదే గ్రామంలో రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తన భార్యతో కలిసి కూలీ పనులకు వెళ్లగా.. వారి కుమారుడు (5) ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఒక్కసారిగా రేకుల షెడ్డుకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా, అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5,000 తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు. కారు బోల్తా అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఓ కారు బోల్తా పడిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి అశ్వారావుపేట వైపు వస్తున్న కారు మండలంలోని ఆసుపాక సమీపంలో గేదె అడ్డురావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. కారులోని భద్రాచలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ఫిర్యాదు రాలేదని స్థానిక ఎస్ఐ యయాతిరాజు తెలిపారు. ఇద్దరికి గాయాలు -
కాంగ్రెస్ హయాంలోనే ప్రతిపాదనలు
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్పీ) డిజైన్ చేసిన బీఆర్ఎస్ హయాంలో డిస్ట్రిబ్యూటర్ కెనాళ్ల ఊసేలేదని, కాంగ్రెస్ హయాంలో ప్రత్యేకంగా కాల్వల ప్రతిపాదనలు రూపొందించామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ వెల్లడించారు. దీనిని విస్మరించి ఆదే పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నెస్పీ కాల్వకు నీటి తరలింపు నేపథ్యంలో, బీజీ కొత్తూరు నుంచి గోదావరి జలాలు మండలంలోని వీకే రామవరం శివారులోని పంప్హౌస్–2కు చేరాయి. ఆదివారం పంప్హౌస్–2 ద్వారా నీళ్లు ఎత్తిపోయగా, డిశ్చార్జ్ పాయింట్ వద్ద గోదావరి జలాలకు ఎమ్మెల్యే పూజలు చేసి, మాట్లాడారు. ప్రాజెక్ట్ ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గంలోని 1.39 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. ఈ ఏడాది ములకలపల్లి మండలంలో 15,200 ఎకరాలు, చండ్రుగొండలో 16,750, అన్నపురెడ్డిపల్లి మండలంలో 12,560 ఎకరాలకు సాగు నీరందిస్తామని, వచ్చే జూన్ నాటికి అశ్వారావుపేటలో 29 వేలు, దమ్మపేటలో 46 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని వివరించారు. మొరాయించిన మోటార్లు పంప్హౌస్–2 మోటార్లు కొంతసేపు మోరాయించడంతో ఇరిగేషన్ అధికారులు హైరానా పడ్డారు. రెండుసార్లు ట్రయల్ వేసినా ట్రిప్ అయింది. మూడో మారు ఆన్ చేయడంతో విజయవంతగా నీళ్లు ఎత్తి పోశాయి. 15 కి.మీ. దూరంలోని కమలాపురంలోని పంప్హౌస్–3కి రాత్రి 8.30 గంటలకు నీరు చేరుకుంది. కాగా, మండలంలోని వీకే రామవరం పంప్హౌస్–2 నుంచి గోదావరి జలాలు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి. బీజీ కొత్తూరు నుంచి ఇక్కడికి గోదావరి జలాలు గ్రావిటీ ద్వారా వస్తున్న క్రమంలో లీకుల ద్వారా వృథాగా పోతున్నాయి. ఇలా భారీగా లీకేజీలు బయటపడి నీరంతా పోతుండటంతో క్రమేపీ కట్టకు ప్రమాదం ఉంటుందని పలువురు సందేహిస్తున్నారు. నాణ్యతాలోపం వల్లే ఇలాంటివి తలెత్తుతున్నాయని, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పంప్హౌస్–2 వద్ద ప్రత్యేక పూజలు -
భూ వివాదాలను న్యాయపరంగా పరిష్కరించుకోవాలి
ఇల్లెందురూరల్: గ్రామంలో భూ వివాదాలు ఉంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలే తప్ప స్థానికంగా పెద్దమనుషులు పంచాయతీ చేయడం చట్టవిరుద్ధమని డీఎస్పీ చంద్రభాను స్పష్టం చేశారు. కుల బహిష్కరణ ఆరోపణల నేపథ్యంలో ఆదివారం మండలంలోని పాతపూసపల్లి, కొత్తపూసపల్లి గ్రామాల్లో ఆయన గ్రామసభ నిర్వహించి విచారణ చేశారు. రెండు గ్రామాల్లో గ్రామపెద్దలు, ఆరోపించిన కుటుంబాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులను అంశాల వారీగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రెండు కుటంబాల మధ్య చోటుచేసుకున్న భూ వివాదం మనస్పర్దలకు దారితీసి సమస్యాత్మకంగా మారిందని గుర్తించారు. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించిన పెద్దలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ జఠిలంగా మారిందని తెలుసుకున్నారు. కుల బహిష్కరణ జరగలేదని నిర్ధారించుకున్న ఆయన భవిష్యత్లో ఇలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా గ్రామపెద్దలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న భూవివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పాతపూసపల్లి, కొత్తపూసపల్లి గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఐటీఐల ఏర్పాటు కలేనా?
ఇల్లెందు: జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేటలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఐటీఐలు ప్రారంభమయ్యే అవకాశాలు అడుగంటాయి. గత మార్చి లో రెండు ఐటీఐలు ప్రభుత్వం మంజూరు చేస్తూ జీఓ జారీ చేసి సౌకర్యాల కల్పనకు నిధులు కూడా విడుదల చేసింది. దీంతో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భూమి ఎంపిక చేసి ప్రభుత్వం వద్దకు ఫైల్ పంపించారు. కానీ, సీసీఎల్ఏ నుంచి భూమి కేటాయించకపోవడంతో ఐటీఐలు ప్రారంభానికి నోచుకోలేదు. మొదటి విడత కౌన్సెలింగ్ గడువు కూడా ముగిసింది. దీంతో వృత్తి విద్య నేర్చుకోవాలనుకున్న ఈ ప్రాంత విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది. కార్యరూపం దాల్చలేదు.. విద్యా సంవ్సతరం ప్రారంభమైనా ఐటీఐల ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చ లేదు. ఆరు నెలల కిందట అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేశారు. భూమి గుర్తించారు. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జేకే ఏరియాలోని నూతన గ్రంథాలయ వద్ద నాన్వెజ్ మార్కెట్ స్థలం కేటాయించారు. గత మార్చి 10వ తేదీన జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య స్థలం పరిశీలించారు. మార్చి 13న తహసీల్దార్ నుంచి కలెక్టర్కు స్థలం కేటాయిస్తూ లేఖ అందజేయగా జిల్లా కలెక్టర్ నుంచి మార్చి 15న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి పంపించారు. సీసీఎల్ఏలో నిలిచిన ఫైల్ హైదరాబాద్లో సీసీఎల్ఏలో ఐటీఐలకు సంబంధించిన ఫైల్ నిలిచిపోయింది. ఐటీఐలకు స్థలం కేటాయిస్తూ సీసీఎల్ఏ నుంచి ఆదేశాలు అందితే ఇక్కడ ఐటీఐ ప్రారంభం అయినట్లేనంటున్నారు. భూమి కేటాయింపు జరుగనంత కాలం అనుమతి లభించదంటున్నారు. తక్షణం భూమి కేటాయించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటమే మార్గం అంటున్నారు. కాగా, జిల్లాలో మరో పాటిటెక్నిక్ కాలేజీ కృష్ణసాగర్లో మంజూరు కాగా భూమి కేటాయింపు సమస్యగా మారింది. పాలిటెక్నిక్ కళాశాల కోసం 10 ఎకరాల స్థలం ఎంపిక చేశారు. నిధులు కూడా మంజూరై భూమి కేటాయింపు ఆదేశాలు అందితే ప్రారంభం అయ్యే అవకాశం ఉండేది. ఐటీఐల్లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి ఇల్లెందు, అశ్వారావుపేటలో ఏర్పాటుపై నీలినీడలు ఏర్పాటైతే 200 మంది చొప్పున విద్యార్థులకు అవకాశం ఇంకా అనుమతి రాలేదు.. ఐటీఐ ప్రారంభించేందుకు ప్రభుత్వం నంచి అనుమతి రాలేదు. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీ కూడా త్వరలో రాబోతుంది. అప్పటికై నా అనుమతి లభిస్తే ప్రారంభించే అవకాశం ఉంటుంది. –జి.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్, ఇల్లెందు ఐటీఐ ఈ ఏడాదే ప్రారంభించాలి.. ఇల్లెందు, అశ్వారావుపేట ఐటీఐలు, కృష్ణసాగర్లోని పాలిటెక్నిక్ కాలేజ్లు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు సాంకేతిక విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. –భయ్యా అభిమన్యు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడుఐటీఐ వస్తే ఐదు ట్రేడ్లు ఇల్లెందు ఐటీఐలో ఐదు ట్రేడ్లతో 200 మందితో ఏర్పడనున్న ఐటీఐ వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య విద్య అందుతుంది. ప్రతీ ట్రేడ్లో 40 మంది విద్యార్థులకు అవకాశం ఉంది. ఎలక్ట్రీషియన్ కోర్సులో రెండేళ్లు 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఫిట్టర్లో రెండేళ్లు 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఐఓటీ స్మార్ట్ అగ్రికల్చర్లో ఏడాది, 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, ఫ్యాషన్ డిజైనర్ టెక్నాలజీలో ఏడాది 2 యూనిట్లు 40 మంది విద్యార్థులు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సు ఏడాది 2యూనిట్లు 40 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు చేపట్టారు. కృష్ణసాగర్ ఐటీఐ నుంచి ఇన్చార్జ్ వైస్ ప్రిన్సిపాల్ను కూడా కేటాయించారు. -
రేగాను పరామర్శించిన కోనేరు కోనప్ప
కరకగూడెం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి ఇటీవల మృతిచెందగా.. సిర్పూర్ కాగజ్ననగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివారం రేగాను పరామర్శించారు. ఆయన తల్లి నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు వివిధ పార్టీల నాయకులు కాంతారావును పరామర్శించారు. వరద తగ్గింది.. బురద మిగిలిందిభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరద వచ్చి తగ్గింది. సుమారు 42 అడుగులకు చేరుకోవడంతో స్నానఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద తగ్గడంతో ఆదివారం కొంత మేరకు స్నానఘట్టాలపై నీరు తగ్గింది. కానీ బురద మిగిలిపోయింది. దీంతో స్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా భక్తులే బురదను తొలగించుకుని స్నానాలు చేశారు. నాటు కోళ్ల చోరీకి యత్నంజూలూరుపాడు: మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫారంలోని నాటు కోళ్లను గుర్తు తెలియని యువకుడు చోరీ చేసేందుకు యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జూలూరుపాడుకు చెందిన ప్రభాకర్ తన వ్యవసాయ క్షేత్రంలో నాటు కోళ్లు పెంచుతున్నాడు. శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు కోళ్ల ఫారం షెడ్లోకి ప్రవేశించి కోళ్లు ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. సీసీ కెమెరాలు అమర్చిన విషయాన్ని గమనించకుండా ఐరన్ జాలీని తొలగించి లోపలికి ప్రవేశించి కోళ్లు ఎత్తుకెళ్లేందుకు యత్నించడంతో సీసీ కెమెరాల అలర్ట్ సైరన్ మోగింది. దీంతో యువకుడు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు యజమాని ప్రభాకర్ పేర్కొన్నాడు. సింగరేణి హాస్టల్ వద్ద పడిగాపులు సింగరేణి(కొత్తగూడెం): రామవరం సీఆర్పీ క్యాంపులోని సింగరేణి ఇంటర్మీడియట్ మహిళల వసతిగృహం వద్ద పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆదివారం పడిగాపులు కాశారు. హాస్టల్ వార్డెన్, మహిళా సెక్యూరిటీ గార్డులు యాజమాన్యం ఆదేశాలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రులను గంటల కొద్దీ ఎదురుచూసేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, విద్యార్థులను చూసేందుకు వచ్చే తల్లిదండ్రులను ఒకరి తర్వాత ఒకరిని లోపలికి అనుమతించాలని యాజమాన్యం నిబంధనలు పెట్టినప్పటికీ సిబ్బంది పాటించడం లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. తల్లి లేదా తండ్రి ఒకరే విద్యార్థిని కలవాలని చెబుతున్నట్లు తెలిసింది. -
నగరాలు, పట్టణాలకు నిధులు..
● కార్పొరేషన్, మున్సిపాలిటీలకు విడుదల చేస్తూ జీఓ ● స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరు ● టాయిలెట్లు, భవనాల నిర్వహణకు వినియోగం ● కేఎంసీకి రూ.3.71 కోట్లు..ఖమ్మంమయూరిసెంటర్ : నిధులు లేక నిర్వహణలో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరాలు, పట్టణాలకు స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి నిధులు విడుదల చేస్తూ సీడీఎం, స్టేట్ మిషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో టాయిలెట్లు, భవనాల నిర్వహణ, బయోమైనింగ్ పనులకు ఈ నిధులను వినియోగించుకునేలా వీలు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మధిర, మణుగూరు, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఈ నిధులు విడుదల చేశారు. పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆ పట్టణ నిధులను కూడా కొత్తగూడెం కార్పొరేషన్కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మెరుగుపడనున్న సౌకర్యాలు.. మున్సిపాలిటీలకు సరైన నిధులు లేక, ఆదాయం రాక కార్యాలయ భవనాల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ వనరులు తగ్గడంతో మున్సిపాలిటీలపై భారం పెరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. బయోమైనింగ్కు నిధులు.. పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడం, జనాభా పెరగడంతో వ్యర్థాల నిర్వహణ మున్సిపాలిటీలపై తీవ్ర ప్ర భావం చూపుతోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వ్యర్థాల డంపింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్పెట్టేందుకు కేఎంసీ అధికారులు బయో మైనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. బయోమైనింగ్ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు రూ.3.71 కోట్లుకు పైగా ఎస్బీఎం కింద నిధులను కేటాయించగా.. ఇందులో రూ.3,35,62,783 బయోమైనింగ్కు కేటాయిస్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్కు రూ.99.17 లక్షల నిధులు విడుదల చేయగా.. బయోమైనింగ్ కోసం రూ.76,65,007 కేటా యించారు. ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.8,17,360 మంజూరు కాగా, బయోమైనింగ్కు రూ.1,36,924 కేటాయించారు. -
జామాయిల్ చిగుర్ల చోరీపై విచారణ
ములకలపల్లి: జామాయిల్ మొక్కల చిగుర్ల చోరీపై టీఎస్ఎఫ్డీసీ అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలోని సుమారు 50 హెక్టార్లలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లోని చిగుర్ల చోరీపై శనివారం ‘జామాయిల్ మొక్కల చిగుర్లు చోరీ?’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో సంబందిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాంటేషన్ మేనేజర్ (పీఎం) సునీత క్షేత్రస్థాయిలో పర్యటించి, వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిగుర్ల చోరీలో తమశాఖ సిబ్బంది ప్రమేయం లేదని తెలిపారు. సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. -
కాంగ్రెస్ హయాంలో సుపరిపాలన
● పాల్వంచలో మరో పవర్ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ● రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ/సుజాతనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యాన సుపరిపాలన సాగుతోందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. కొత్తగూడెం క్లబ్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆమె కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశాక మాట్లాడారు. కాగా, సింగరేణిలో అవకతవకలపై విచారణ చేయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 167 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 165 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం పాల్వంచలో తొలగించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం (పాత ప్లాంట్) కర్మాగారాన్ని కలెక్టర్ జితీశ్ వి.పాటిల్తో కలిసి సందర్శించిన ఎంపీ రేణుకాచౌదరి కేటీపీఎస్ సీఈ శ్రీనివాసబాబు, అధికారులతో మాట్లాడారు. పాల్వంచలో మరో విద్యుత్ కర్మాగారాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఎన్ఎండీసీ విస్తరణపైనా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎస్ఈ యుగపతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సొసైటీల చైర్మన్లు మండే వీరహన్మంతరావు, కొత్వాల శ్రీనివాసరావు, నాయకులు నాగా సీతారాములు, ఎస్కే సాబీర్పాషా, ఎడవల్లి కృష్ణ, మంగీలాల్, జలీల్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సుజాతనగర్కు చెందిన దివంగత సీపీఎం నేత కాసాని ఐలయ్య కుటుంబాన్ని ఎంపీ రేణుకాచౌదరి పరామర్శించారు. -
ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం
ఖమ్మంవ్యవసాయం: పాల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యాన సేకరణ, విక్రయాలు మరింత పెంచాలని రాష్ట్ర పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనిట్ల వారీగా సేకరించిన పాలను ఆయా యూనిట్ల పరిధిలోనే ఏ రోజుకు ఆ రోజు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయాన పాల ఉత్పత్తుల వ్యాపారంపైనా దృష్టి సారించాలని ఆ ఆదేశాల్లో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం యూనిట్లలో సేకరించే పాలలో తక్కువ శాతం స్థానికంగా విక్రయిస్తూ మిగిలిన పాలను రాష్ట్ర పాడి పరిశ్రమకు చేరవేస్తున్నారు. అక్కడ పాలను పొడిగానే కాక ఇతర ఉత్పత్తులుగా మార్చి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో ఖర్చు పెరుగుతుండడమే కాక వ్యాపారం మందగించినప్పుడు పాల ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. ఈ అంశంపై సమీక్షించిన అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగానే ఎక్కడ సేకరించిన పాలను అక్కడే విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ‘విజయ’ డెయిరీ పాలకు ఆదరణ ఉన్నప్పటికీ అందుబాటులో లేక వ్యాపారం తగ్గుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6వేల లీటర్ల సేకరణ ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 30మండలాల్లో 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 3,025 మంది పాడి రైతుల నుంచి నిత్యం 6వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలోని పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఖమ్మంలోని రోటరీనగర్లో 25వేల లీటర్ల సామర్ధ్యంతో యూనిట్ ఉన్నా అందుకు అనుగుణంగా పాల సేకరణ జరగడం లేదు. సీజన్లో 15వేల లీటర్ల పైగా, మిగతా సమయాల్లో ఆరు వేల లీటర్లు దాటడం లేదు. స్థానికంగా వ్యాపారంపై ప్రణాళిక ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలను స్థానికంగానే విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 6వేల లీటర్ల మేర పాలు సేకరిస్తుండగా రెండు వేల లీటర్లే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇందులో 1,500 లీటర్లు ప్రైవేట్ మార్కెట్ ద్వారా, 500 లీటర్ల పాలను ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పాలను హైదరాబాద్ రాష్ట్ర పాడి పరిశ్రమకు పంపిస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు ఉన్నందున అన్నింటికీ విజయ పాలు సరఫరా చేసేలా నిర్ణయించి, భద్రాచలం ఐటీడీఏ పీఓను డెయిరీ పాడి పరిశ్రమ అధికారులు కలిశారు. అన్నీ కలిసొస్తే త్వరలోనే ఇక్కడే విజయ డెయిరీ పాల విక్రయం పెరగనుంది. మరిన్ని పార్లర్లు, ఏజెంట్లకు ప్రోత్సాహం విజయ పాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పార్లర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంతో పాటు జిల్లాలో కేవలం ఐదు పార్లర్లే కొనసాగుతున్నాయి. విజయ పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పటికీ లభ్యత లేక ప్రజలు ప్రైవేట్ డెయిరీలపై ఆధారపడుతున్నారు. ఈనేపథ్యాన పార్లర్లు కనీసం మరో 15 ఏర్పాటుచేయడం ద్వారా విక్రయాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఖమ్మంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మం రూరల్, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, కోదాడ, సూర్యాపేటల్లో కూడా పార్లర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇదే సమాయన ఏజెంట్లను ప్రోత్సహించాలనే భావనకు వచ్చారు. సంస్థ లీటర్ పాలపై డిస్ట్రిబ్యూటర్లకు రూ.5 చొప్పున కమీషన్ ఇస్తుంది. అక్కడి నుంచి ఏజెంట్లకు సరఫరా చేస్తారు. ఈనేపథ్యాన ఏజెంట్లను మరింతగా పెంచడం ద్వారా వ్యాపారం పెంపొందించేలా కసరత్తు మొదలుపెట్టారు. విజయ డెయిరీ అధికారుల కార్యాచరణ పట్టణాల్లో ఇంకొన్ని పార్లర్ల ఏర్పాటుకు చర్యలు ఏజెంట్లను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయంపాల సేకరణ పెంపునకు కృషి ఉమ్మడి జిల్లాలో పాల విక్రయానికి వనరులు ఉన్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న పాలలో మూడో వంతే ఇక్కడ విక్రయిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో మొత్తం పాలను స్థానికంగా విక్రయానికి ప్రణాళిక రూపొందించారు. ఇదే సమయాన పాల సేకరణను 20 వేల లీటర్లకు పెంచేలా కృషి చేస్తున్నాం. – కె.రవికుమార్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం -
●ఖర్చు పెట్టుకోలేక..
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వరి నారును జీవాల నుంచి కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు నారు చుట్టూ రక్షణగా కంచెలు, పరదాలు, వలలు, గ్రీన్షీట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇవి కొంతమేర ఖర్చుతో కూడుకున్నవి. కానీ, రూపాయి ఖర్చు లేకుండా అశ్వారావుపేట మండలం మొద్దులమడ గ్రామంలో ఓ గిరిజన రైతు ఇంట్లో వాడి వృథాగా పడేసిన పాత చీరలను కంచెకు కట్టి వరి నారుకు రక్షణగా ఏర్పాటు చేశాడు. ఈ దృశ్యాన్ని శనివారం ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది. –అశ్వారావుపేటరూరల్ -
‘సీతారామ’ జలాలు విడుదల
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఒక మోటారు ద్వారా శని వారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్చేసి విడుదల చేశారు. నాగార్జుసాగర్ ఎడమ కాలు వ ఆయకట్టులో తీవ్ర నీటి సమస్య నెలకొని నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ సమస్యను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరిలో 8లక్షల క్యూసెక్కుల జలాలు డిశ్చార్జ్ అవుతున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు పంప్హౌస్ నుంచి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు. కాగా గోదావరి జలాలు ఇక్కడి నుంచి ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) ద్వారా ఎన్ఎస్పీ కెనాల్కు తరలనున్నాయి. నీటిపారుదల శాఖ ఎస్ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, ఓరుగంటి రమేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మోటారు స్విచాన్ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం -
రైతులకు ‘యూరియా’ వెతలు
● కొరత, అంతకుమించి ప్రచారంతో ఆందోళన చెందుతున్న కర్షకులు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో మరింత అయోమయం ● పీఏసీఎస్ గోదాంల వద్ద బారులుదీరుతున్న రైతులు ● జిల్లాకు సరిపడా కోటా వచ్చిందంటున్న వ్యవసాయాధికారులు బూర్గంపాడు: పంటల సాగు ప్రారంభంలోనే యూరియా కొరతతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని పీఏసీఎస్ గోదాంల వద్ద బారులుదీరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో అయోమయం చెందుతున్నారు. యూరియా కోటా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి విన్నవించారు. ఆ మరునాడే తెలంగాణలో రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలని నడ్డా సూచించడంతో యూరియా కొరత నిజమేననే నిర్ధారణకు రైతులు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరాను బాగా తగ్గించడంతో పీఏసీఎస్ గోదాంల వద్ద క్యూ కడుతున్నారు. సాగు పనులు ఊపందుకోవడంతో.. జిల్లాలో ఇప్పటికే 90 శాతం మేర పత్తి విత్తనాలు నాటారు. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సాగు పనులు ఊపందుకోవటంతో రైతులు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. యూరియా సరఫరా కూడా జిల్లాకు రావాల్సిన కోటాకు తక్కువగా వస్తుండటంతో రైతులు కలవరపడుతున్నారు. రసాయనిక ఎరువుల్లో తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు యూరియా వినియోగాన్ని బాగా పెంచారు. యూరియా వినియోగంతో పంటలకు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నా రైతులు పెట్టుబడి వ్యయం దృష్టిలో ఉంచుకుని యూరి యానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వ రాయితీపోను 45 కిలోల యూరియా బస్తా రూ.267కు దొరుకుతుంది. అదే కాంప్లెక్స్ ఎరువులైన డీఏపీ, 20:20:0:13లు బస్తా రూ.1400కు చేరింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తా రూ.1,750 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ ధరలు పెట్టలేక యూరియా వినియోగిస్తున్నారు. జూన్, జూలై నెలలకు కలిపి జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఆ మేరకు సరఫరా అయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కోటా సరిపడా వస్తే రైతులు గోదాంల వద్ద ఎందుకు బారులుదీరుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన కోటా రాలేదని, అప్పుడు వినియోగించుకోవాల్సిన రైతులు జూన్ మొదటివారంలో వినియోగించుకున్నారని, ఈ క్రమంలో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. గోదాంల వద్ద బారులు యూరియా కోసం రైతులు ఒకేసారి అధిక సంఖ్య లో వస్తుండటంతో పీఏసీఎస్ ఎరువుల గోదాంల వద్ద గొడవలు జరుగుతున్నాయి. పీఏసీఎస్లకు వస్తున్న రెండు, మూడు లారీల కోసం వందలాదిమంది క్యూ కడుతున్నారు. వీరిలో సగం మందికి కూడా యూరియా అందడంలేదు. దీంతో విక్రయాలు పీఏసీఎస్ సిబ్బందికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆధార్కార్డ్కు ఒకట్రెండు యూరియా బస్తాలు ఇవ్వటం ప్రారంభించారు. పంటలు సాగు చేయని వారి ఆధార్కార్డులు కూడా వస్తుండటంతో యూరియా ఎటూ సరిపోవటం లేదు. ఈ నేపథ్యంలో మూడురోజులుగా పట్టాదా రు పాస్ పుస్తకాలు, ఆధార్కార్డుల జిరాక్స్లు ఆధారంగా ఎకరాకు ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో పంటలకు ఎరువుల విని యోగం మరింతగా పెరగనుంది. ఈ పరిస్థితుల్లో యూరియా సరిపడా అందుబాటులోకి వస్తుందా లేదా అనేది వేచిచూడాలి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం యూరియా కొరత ఉండదని, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించుకోవా లని సూచిస్తున్నారు.వేచి చూస్తున్నాం.. ఈ ఏడాది యూరియాకి ఇబ్బందిగానే ఉంది. ఒక రోజు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చి రావాలి. లోడ్ వచ్చిన రోజు వెళ్లి సీరియల్ కోసం వేచిచూడాలి. ఈలోపు వచ్చినా యూరియా అయిపోతే మళ్లీ లోడ్ వచ్చేవరకు ఎదురుచూడాలి. – నిమ్మల రాములు, రైతు, నాగినేనిప్రోలు, బూర్గంపాడు మండలంయూరియా దొరకటం లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. తొలివిడత ఎరువు వేద్దామంటే యూరియా దొరకటం లేదు. మూడురోజులుగా పీఏసీఎస్ గోదాంకు తిరుగుతున్న ఎకరాకు బస్తా ఇస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అడుగుతున్నారు. – సాంబశివరావు, రైతు, పెద్దతోగు, గుండాల మండలం -
ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా
అశ్వారావుపేటరూరల్: ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని పలువురు వ్యాపారులు, దుకాణాదారులకు సత్తుపల్లి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ పి.విజయశ్రీ జరిమానా విధించారు. శనివారం ఆమె అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్తోపాటు సైకిల్స్టాండ్, పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైకిల్ స్టాండ్ నిర్వాహకుడు విని యోగదారుల వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధికగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో రూ.1000 జరిమానా విధించారు. బస్టాండ్లోని మరుగుదొడ్లను తనిఖీ చేసి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి నిర్వాహకురాలికి రూ.1000, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు ఆర్టీసీ కేటాయించిన స్థలం కంటే అధికంగా ఆక్రమించినట్లు గుర్తించి బాధ్యురాలికి రూ.1000 చొప్పున జరిమానా విధించి రశీదులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారిపై కుక్కల దాడిబూర్గంపాడు: బూర్గంపాడులోని గౌతమీపురంలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గౌతమీపురానికి చెందిన మందా ప్రవీణ్ కుమార్తె యసిక శని వారం ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఆ చిన్నారి మెడను కొరికేందుకు కుక్కలు ప్రయత్నిస్తుండగా స్థానికులు రాళ్లు విసరటంతో ఆమె ముఖాన్ని కరిచాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోదాల పేరుతో దౌర్జన్యం చేశారని ఫిర్యాదుపాల్వంచరూరల్: సివిల్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు పోలీసులు సోదాల పేరుతో దౌర్జన్యం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కిన్నెరసానిలోని పెద్దబోయిన వెంకటనర్సమ్మ దుకాణం వద్దకు శుక్రవారం సివిల్ దుస్తుల్లో ప్రసాద్, నరేశ్ వచ్చి.. గంజాయి విక్రయిస్తున్నావంటూ దుర్భాషలాడారు. ఆమె కుమారుడిని తనిఖీ చేశారు. మహిళ అని చూడకుండా తనను బలవంతంగా నేట్టివేశారని శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్ఐ సురేశ్ను వివరణ కోరగా మహిళ ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేకాట స్థావరంపై దాడిఅశ్వాపురం: మండలంలోని మొండికుంట శివారులో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.19 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కొండచిలువల సంచారం బూర్గంపాడు: అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం ఫారెస్ట్ సెక్షన్లో కొండచిలువల సంచారం పెరిగింది. 250 ఎకరాల్లో ఇటీవల అటవీశాఖ అధికారులు ప్లాంటేషన్ చేపట్టారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు శనివారం ప్లాంటేషన్ నిర్వహణకు వెళ్తున్న క్రమంలో రెండుచోట్ల కొండచిలువలు (ఇండియన్ ఫైథాన్) కనిపించాయని తెలిపారు. అటవీ సంరక్షణ చర్యలతో కొన్ని జీవజాతులు మళ్లీ అడవుల్లో కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కుక్క, కోతి దాడిలో నలుగురికి గాయాలు ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురం, ముదిగొండ, యడవల్లిగ్రామాల్లో శనివారం కుక్క, కోతి చేసిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీధిలో వెళుతున్న నఫీసా, మరో కూలీ పై కుక్క దాడి చేయగా, మరో ఇద్దరిపై కోతులు దాడి చేశాయి. ఈమేరకు గాయపడిన వారికి ముదిగొండ పీహెచ్సీలో చికిత్స చేయించారు. -
మేల్కొనేదెలా..?
ముందస్తుగాఆధునికీకరణ తప్పనిసరి 1987లో రూపొందించిన ఫ్లడ్ మ్యానువల్ను ఆధునికీకరించాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 2022 వరదల నుంచి మరింతగా డిమాండ్ చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. వరదలు సంభవించిన సమయంలో హడావుడి చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రెవెన్యూ, దేవస్థాన తదితర శాఖల అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేసి ఫ్లడ్ మ్యానువల్ను రూపొందించాల్సి ఉంది. గతంలో వరదల సమయంలో పని చేసిన సీనియర్ అధికారులు, సిబ్బంది సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే గోదావరి వరదల గరిష్ట స్థాయి అంచనాలతో పటిష్ట ప్రణాళిక రూపొందించాలి. దీనివల్ల వరద నష్టనివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టే అవకాశం ఉంటుంది.భద్రాచలం: ఏటా వర్షాకాలంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలకు గోదావరి వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. జనావాసాలు, పంట చేలు నీటమునుగుతున్నాయి. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికకు సంబంధించి అధికారులు పాత ఫ్లడ్ మ్యానువల్నే అనుసరిస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్తో ముంపు ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వరద సమస్యలను ఎదుర్కొనేందుకు ఫ్లడ్ మ్యానువల్ను ఆధునికీకరించాల్సి ఉంది. 1984లో రూపకల్పన.. భద్రాచలం ఏజెన్సీని ఏటా గోదావరి వరదలు ముంచెత్తుతాయి. వరద నీటిమట్టం ఎన్ని అడుగులకు చేరుకుంటే ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయి? ఏయే గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలి? పంట చేలు ఏ మేరకు దెబ్బతింటాయి? తదితర వివరాలు, ముందస్తు జాగ్రత్తలను పొందుపరుస్తూ 1984లో తొలిసారిగా ఫ్లడ్ మ్యానువల్ రూపొందించారు. దీని ప్రకారం అధికారులు ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. కాగా 1986 ఆగస్టు 16న గోదావరి వరద అత్యధికంగా 75.6 అడుగులుగా నమోదయింది. దీంతో 1987లో, అనంతరం 2007లో మరోసారి ఫ్లడ్ మ్యానువల్లో మార్పులు చేశారు. అదే మ్యానువల్ను అధికారులు ఇప్పటికీ మార్గదర్శనిగా ఉపయోగిస్తున్నారు. పోలవరం నిర్మాణంతో పెరుగుతున్న ముంపు ఏపీలో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వరద ముంపు తీవ్రత అధికమవుతోంది. వరద నుంచి రక్షణకు నిర్మించిన కరకట్టకు ఇవతలి వైపున ఉన్న దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలంలో వరద ముంపు పెరిగింది. నదికి అవతలివైపు ఉన్న బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పొలాలు నీట మునుగుతున్నాయి. 2022 జూలై 16న గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చగా, వరద 71.6 అడుగులుగా నమోదయింది. వేలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తొలిసారిగా బూర్గంపాడు, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో ముంపు తీవ్రత అధికమైంది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ వల్లే ముంపు తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికల స్థాయిలో స్థిరమైన వరద ప్రవాహం కొద్ది రోజులపాటు కొనసాగుతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.40 ఏళ్ల క్రితం రూపొందించిన ఫ్లడ్ మ్యానువలే అనుసరణ 2022 వరదల తర్వాత నుంచి ముంపు బాధితుల్లో ఆందోళన పోలవరం ప్రాజెక్ట్తో ఏటేటా పెరుగుతున్న ముంపు తీవ్రత ప్రస్తుత పరిస్థితికి తగినట్టు మ్యానువల్ ఆధునికీకరణ తప్పనిసరి -
అట్రాసిటీ కేసుపై విచారణ
జూలూరుపాడు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ రజనీ జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. శనివారం విచారణ అధికారి, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను వెంగన్నపాలెంలోని బాధితురాలు రజనీ ఇంటికి వెళ్లి విచారించారు. ఈ విషయంపై డీఎస్పీ చంద్రభానును వివరణ కోరగా అట్రాసిటీ కేసు విచారణ నిమిత్తం వచ్చామని, బాధితురాలు, సాక్షుల నుంచి వివరాలు సేకరించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. -
నెమ్మదిస్తున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం శనివారం సాయంత్రం నుంచి నెమ్మదించింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో రెండు రోజులుగా నదిలో వరద ఉధృతి పెరిగింది. వరద నీటిమ్టటం శుక్రవారం రాత్రి 11 గంటలకు 38.8 అడుగులకు చేరింది. శనివారం ఉదయం 40.5 అడుగులకు, క్రమంగా మధ్యాహ్నం వరకు 41.5 అడుగులకు పెరిగింది. అనంతరం తగ్గుముఖం పట్టింది. రాత్రి 9 గంటలకు 40 అడుగులకు తగ్గింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఇన్ఫ్లో తగ్గుతుండటంతో క్రమంగా గోదావరి వరద కూడా తగ్గుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరద ఉధృతితో రహదారులు మునిగి భద్రాచలం దిగువన ఉన్న ఏపీలోని విలీన మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జిల్లా అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దుమ్ముగూడెంలో నిలకడగా.. దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల నుంచి వరద నెమ్మదించడంతో శనివారం మండలంలో గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. పర్ణశాల నారచీరల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉండగా, సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద 41.5 అడుగులకు పెరిగి తగ్గుతున్న వరద -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులకు శని వారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. నిలిచిపోయిన మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపాల్వంచరూరల్: జిల్లావ్యాప్తంగా శనివారం మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలోని తోగ్గూడెం వద్ద ఉన్న భగీరథ నీటిశుద్ధి కేంద్రంలోకి ఇటీవల కురిసిన వర్షాలతో బురద నీరు చేరింది. దీంతో అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేసి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేశారు. ఆదివారం నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని డీఈ సాయి తెలిపారు. రాక్ క్లైంబింగ్లో ప్రతిభదుమ్ముగూడెం: మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి రాక్ కై ్లంబింగ్ పోటీల్లో రాణించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ విజేందర్సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నీరజ్యాదవ్లు శనివారం వివరాలు వెల్లడించారు. 12 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, ఏడుగురు ప్రతిభ చూపారు. విజేతలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అభినందించారు. భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలకు అధికారులు శనివారం నీటిని విడుదల చేఽశారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధి కారి రమేష్ పూజలు నిర్వహించగా, ప్రాజెక్టు డీఈఈ రమేష్రెడ్డి మోటార్ స్విచాన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి మండలాల్లోని ఆయకట్టుతో పాటు చెరువులకు నీరు చేరుతుందని డీఈఈ తెలిపారు. మెట్ట పంటలు, వరి సాగుకు తొలుత పదిరోజులు నీరు సరఫరా చేస్తామని, ఈలోగా పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు చేరాక చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వరదలతో అప్రమత్తంగా ఉండాలి
● సాగర్లో మరమ్మతుల నేపథ్యంలో ఎన్నెస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి వరదల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజుతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది క్రితం భద్రాచలం ఏజెన్సీలో బ్రిడ్జిలు ధ్వంసమైతే ఇప్పటివరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని అధికారులను ప్ర శ్నించారు. పనులు చేపట్టకపోవడంతో వరదల వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. గ్రా మాల్లో పారిశుద్ధ్య బాధ్యత పూర్తిగా పంచాయతీరాజ్ శాఖదేనని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. గోదావరికి వరదలు పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నాగార్జున సాగర్లో మరమ్మతులు ఉండటంతో వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు తరలిస్తున్నట్లు తెలిపారు. సాగర్ కెనాల్కు రెండు రోజుల్లో నీరు చేరుతుందని అన్నారు. రాబోయే సీజన్ వరకు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలు, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు 25 వేల నుంచి 50 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇతర అధికారులు శ్రీనివాస్రెడ్డి, మహేందర్, బాబూరావు, వెంకటేశ్వరరావు, జయలక్ష్మి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓసీ విస్తరణ వైపు అడుగులు
● రెండు గ్రామాల్లో భూసేకరణకు ప్రజామోదం ● కార్మికులు, అధికారుల్లో హర్షాతిరేకాలు ● 455.7 ఎకరాల భూమికి లైన్ క్లియర్ మణుగూరుటౌన్: పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, బొగ్గు వినియోగం, ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడిన కంపెనీలు, స్థానికంగా ఉపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు మణుగూరు ఓసీ విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపాదిత గ్రామాలైన మణుగూరు, తిర్లాపురం, రామానుజవరంలో రెండు గ్రామాల ప్రజలు భూసేకరణకు గ్రామసభల్లో ఆమోదం తెలపారు. దీంతో సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణపై ఇటు అధికారులు, అటు కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏరియా ఓసీ–2, ఓసీ–4, మణుగూరు ఓసీ, కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ గనుల నుంచి ఏటా వందల టన్నుల బొగ్గును అందిస్తూ రాష్ట్ర, దేశ అభివృద్ధిలో తనవంతుగా మణుగూరు ఏరియా భాగస్వామ్యం అవుతోంది. ఈ నేపథ్యంలో మణుగూరు ఓసీ బొగ్గు నిల్వలు అడుగంటుతుండటం మరో ఆరు నెలల్లో గని మూతపడే పరిస్థితికి రావడంతో ఓసీ విస్తరణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో (దాదాపు ఏడాదిన్నర సమయం అనంతరం) గ్రామస్తులు భూసేకరకు ఆమోదం తెలిపడంతో సింగరేణి అధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 20 ఏళ్లు మణుగూరులో తమ ప్రస్థానం కొనసాగిస్తూ సమీప గ్రామాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందని తమ కృషికి తగిన ఫలితం దక్కుతోందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024లో నిర్ణయం మణుగూరు ఓసీ విస్తరణకు భూ సేకరణ జరపాలని 2024 ఫిబ్రవరి 7వ తేదీన సింగరేణి అధికారులు ప్రభుత్వానికి తెలుపారు. అందుకుగాను స్పె షల్ డిప్యూటీ కలెక్టర్ సుమను నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతిపాదిత మణుగూరు మున్సిపాలిటీలోని కొమ్ముగూడె, తిర్లాపురం, రామానుజవరం గ్రామాల్లో 813 ఎకరాల భూ సేకరణకు ఒక్కోచోట మూడు సార్లు గ్రామసభలు నిర్వహించినా, క్షేత్రస్థాయిలో పర్యటించి నచ్చజెప్పినా ఫలితం లభించలేదు. శాశ్వత ఉపాధి కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఓసీ విస్తరణలో ఏర్పడే అవకాశాలు నిర్వాసితులకే అవసరమైతే శిక్షణ కూడా ఇచ్చేందుకు భరోసా కల్పించారు. ఎకరానికి రూ.22.50 లక్షల పరిహారం.. తాజాగా మణుగూరు పట్టణంలోని కొమ్ముగూడెం, తిర్లాపురం గ్రామాల్లో ప్రజామోదం లభించడం పట్ల సింహభాగం పూర్తయినట్లు అధికారులు భావిస్తున్నారు. సేకరించనున్న 813 ఎకరాల భూ సేకరణలో రెండు గ్రామాల రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో 455.7ఎకరాలకు గ్రామస్తులు ఆమోదం తెలిపినట్లయింది. సింగరేణి పూర్తిగా వ్యవసాయ భూమి సేకరణపైనే దృష్టి సారించగా, నివాసాలు ఎవరూ కోల్పోవడం లేదు. ఏజెన్సీ చట్టాలను అనుసరించి గిరిజనులకు ఎకరాకు 22.50 లక్షలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.5.50 లక్షలు, పొలంలోని, మోటార్లు, చెట్లు, ఇతర పనిముట్లకు విలువ కట్టి అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. గిరిజనేతరులకు, పట్టాలేని వారికి ఎకరాకు రూ.11.2.5 లక్షలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలు అందించనున్నారు. పెద్ద చెరు వు, రాయుగటకుంట, చింతకుంట, బుర్దన్వాయ్ కుంట, మల్లంపాడు చెరువుల అభివృద్ధికి రూ. 17.45 కోట్లు కేటాయించారు. ఆయా చెరువులపై ఆధారపడిన, రిజిస్టర్ అయిన సొసైటీలో సభ్యత్వం ఉండి ఉపాధి కోల్పోయే వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్ట్ మొత్తం 300 కుటుంబాలు ఉండగా, 500 మంది పీఏఎఫ్ (ప్రాజెక్ట్ ప్రభావిత వ్యక్తులు) ఉన్నట్లు ప్రాథమిక అంచనా. విస్తరణ వివరాలు.. భూములు సేకరించే గ్రామాలు: రామానుజవరం, తిర్లాపురం, మణుగూరు కోల్పోతున్న పెద్ద చెరువులు: రాయల కుంట, చింతకుంట, బుర్దన్వాయ్కుంట, మల్లంపాడు. ప్రతిపాదిత సేకరణ భూమి.. తిర్లాపురం 359.34 ఎకరాలు రామానుజవరం 356.16 ఎకరాలు మణుగూరు కొమ్ముగూడెం 96.36 ఎకరాలు అటవీ భూమి 58.51 హెక్టార్లు మొత్తం 813 ఎకరాలుసర్వే సమయంలో స్థానికంగా ఉండాలి మణుగూరు ఓసీ విస్తరణలో అందించే పరిహారం విని గ్రామస్తులు ఆమోదం తెలిపారు. సర్వే జరిగే సమయంలో అన్ని పనులు పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో ఉండాలి. అవార్డులో తప్పులకు తావివ్వకుండా సర్వే సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిర్వాసితులకు నేరుగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దళారులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు. –సుమ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ -
జామాయిల్ మొక్కల చిగుర్లు చోరీ?
ములకలపల్లి: జామాయిల్ మొక్కల లేలేత చిగుర్లు చోరీకి గురవుతున్నాయి. మొక్కల పునరుత్పత్తి చేసే చాంబర్లలో వీటికి భారీగా డిమాండ్ ఉండడంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లోని చిగుర్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. స్థానిక సిబ్బంది సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మండంలోని జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలో సుమారు 50 హెక్లార్లలోని జామాయిల్ తోటలను రెండు నెలల కిందట నరికేశారు, విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ ప్రదేశంలో జామాయిల్ మొక్కలు లేలేత చిగుర్లతో పెరుగుతున్నాయి. చిగుర్ల ద్వారా జామాయిల్ మొక్కల పునరుత్పత్తి చేపట్టనున్న తరుణంలో జామాయిల్ చాంబర్లలో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పలువురు ఇక్కడి చిగుర్లపై దృష్టి సారించారు. చిగుర్లను చోరీ చేసి వాహనాల్లో చాంబర్లకు తరలిస్తున్నారు. జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలో సిబ్బంది సహకారంతో కొంతకాలంగా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ప్లాంటేషన్ మేనేజర్ సునీతను వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు
● నాలుగు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని తాలిపేరు ప్రాజెక్ట్ ● శిథిలమైపోతున్న కుడి, ఎడమ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు ● ఐదారేళ్లుగా చివరి భూములకు అందని సాగునీరు ● ప్రాజెక్ట్పై నిర్లక్ష్యం వీడాలని కోరుతున్న ఆయకట్టు రైతులు చర్ల: తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. గడిచిన ఐదారేళ్లుగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక చివరి భూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. తాలిపేరు ప్రాజెక్ట్ను 1985లో నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం, దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక (46.46 కిలోమీటర్ల) వరకు సాగునీరు ఇస్తున్నారు. 1992లో కుడి కాలువ 10.44 కిలోమీటర్ల మేర నిర్మించి సాగునీరు అందిస్తున్నారు. రెండు ప్రధాన కాలువలపై 42 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ద్వారా ఏటా ఖరీఫ్లో అధికారికంగా 24,700 ఎకరాలకు, అనధికారికంగా మరో 15,000 ఎకరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా చిన్నచూపే తాలిపేరు నిర్మించి 40 ఏళ్లు గడిచినా ప్రాజెక్ట్ అభివృద్ధికి ఏనాడూ పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టడంలేదు. అరకొరగా కేటాయించే నిధులను గేట్లు, మోటార్లు, జనరేటర్లు ఇతర మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ వంటి పనులకు వినియోగిస్తున్నారు. ఏటా అధికారులు తాత్కాలికంగా కాలువల మరమ్మతులు చేస్తూ సాగునీరు అందిస్తున్నారు. కూలిపోయిన సైడ్ వాల్స్ చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రధాన కాలువలు పలు చోట్ల కోతకు గురయ్యాయి. సైడ్ వాల్స్ కూలిపోయాయి. వాగులపై నిర్మించిన యూటీలు దెబ్బతిన్నాయి. దానవాయిపేట, బోటిగూడెం గ్రామాల మధ్య టపావాగుపై ఉన్న యూటీ సైడ్ వాల్స్ కూలాయి. కుదునూరు–దేవరాపల్లి గ్రామాల మధ్య జోడిచీలికలవాగుపై ఉన్న యూటీ కూడా కుంగింది. గత ఖరీఫ్ సమయంలో ఈ రెండు చోట్ల యూటీలకు మరమ్మతులు చేపట్టేందుకు కొంత మేర నిధులు మంజూరయ్యాయి. రబీలో సాగునీరు నిలిపివేసి పనులు చేసేందుకు అధికారులు సిద్ధమవగా, ప్రాజెక్టు పరిధిలోని రెండో జోన్లో రబీ పంటలకు సాగునీరు ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీంతో పనులను నిలిపివేసి యూటీ కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేసి సాగునీరు విడుదల చేశారు. ఆ తర్వాత మే, జూన్ నెలల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నా పనులు పూర్తయ్యేందుకు సమయం సరిపోదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. సాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తాలిపేరు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డ చోట్ల, యూటీలు కుంగిన చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం. ఖరీఫ్ పూర్తికాగానే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం. – ఎస్.ఏ.జానీ, ఈఈ, తాలిపేరు ప్రాజెక్టు నిర్లక్ష్యం వీడాలి తాలిపేరు ఆయకట్టు కింద రెండు మండలాల్లోని సుమారు 25 వేల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రాజెక్ట్, కాలువలు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. – కూరపాటి వీర్రాజు, రైతు, ఆర్.కొత్తగూడెంనిధులు విడుదల చేయాలి తాలిపేరు ప్రాజెక్ట్, కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని అవసరమయ్యే నిధులను విడుదల చేయాలి. ఏజెన్సీ రైతులను ఆదుకోవాలి. – డేగల అబ్రహం, రైతు, కుదునూరు -
ఆధార్ క్యాంపునకు విశేష స్పందన
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో మూడురోజులపాటు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వివరాలు వెల్లడించారు. మొత్తం 3,772 సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఇందులో కొత్త నమోదులు 489, వయోవృద్ధుల సేవలు 45, దివ్యాంగుల నమోదు 12, ట్రాన్స్జెండర్ నమోదు 1, బయోమెట్రిక్, ఇతర అప్డేట్లు 602, పుట్టిన తేదీ సవరణలు 5, ఆధార్ రద్దు కేసులు 2, సాధారణ ఎంకై ్వరీలు 50, మరికొన్ని ఇతర సమస్యలకు పరిష్కారం లభించిందని వివరించారు. క్యాంపునకు 10 వేల మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారు ధ్రువీకరణ పత్రాలు పొంది మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా నిర్వహించే మెగా ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఆధార్ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. క్యాంపు విజయవంతానికి సహకరించిన రాష్ట్ర యుఐడీఈ బృందం, ఈ డిస్ట్రిక్ట్ మేనేజరు సైదేశ్వరరావు, రెవెన్యూ, ఐటీ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. 3,772 సమస్యలకు పరిష్కారం -
తెరుచుకునేనా?
● పాతికేళ్లపాటు నడిచి పదేళ్ల క్రితం మూతపడిన పరిశ్రమ ● ఫ్యాక్టరీని తెరవాలంటూ కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ● సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు హామీ ● కేటీపీఎస్ కాంప్లెక్స్లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు‘స్పాంజ్ ఐరన్’సాక్షి ప్రతినిధి, భద్రాది కొత్తగూడెం: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ నడిబొడ్డున ఎన్ఎండీసీ, కేటీపీఎస్లలో ఇంచుమించు 900 ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉంది. ఈ స్థలాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దక్షిణాసియాలోనే మొదటిది.. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 1980లో దక్షిణాసియాలోనే మొదటిసారిగా కోల్ బేస్డ్ స్పాంజ్ ఐరన్ యూనిట్ను పాల్వంచలో నిర్మించారు. మొదటి యూనిట్ విజయవంతం కావడంతో 1985లో రెండో యూనిట్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా 1993లో 7.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. అనంతరం 1997లో పిగ్ ఐరన్ నుంచి స్పాంజ్ ఐరన్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మించారు. ఇలా దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థను 2010లో ఎన్ఎండీసీలో విలీనం చేశారు. ఆ తర్వాత నిర్వహణ లోపాల కారణంగా నష్టాల బారిన పడి 2016లో పూర్తిగా మూతపడింది. అనంతరం రాజకీయ ఒత్తిడితో స్పాంజ్ ఐరన్ ఇండియా, పాల్వంచ యూనిట్ను 2019 జనవరిలో ఎన్ఎండీసీ సంస్థ తిరిగి ప్రారంభించినా రెండు నెలలకు మించి ఎక్కువ రోజులు నడవలేదు. చివరకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా అవి కూడా ఫలప్రదం కాలేదు. కేటీపీఎస్లో మరో ప్లాంట్ నిర్మించాలని.. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ తొలి యూనిట్ 1969లో మొదలైంది. ఇటీవల కాలపరిమితి ముగియడంతో నాలుగు స్టేజ్లకు సంబంధించిన 720 మెగావాట్ల ప్లాంట్ను 2020 పూర్తిగా మూసివేశారు. ఆ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణాలను గతేడాది కూల్చేశారు. దీంతో ఇక్కడ 400 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బొగ్గు, నీటి లభ్యతతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ లేదా ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించాలని గడిచిన ఏడాది కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఎంత? భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందనే అంశాలపై ప్రభుత్వం నివేదిక రూపొందిస్తోంది. ఇందులో కొత్త ప్లాంట్లకు స్థాపన అవసరం ఉందని తేలితే, కేటీపీఎస్ ప్రాంగణంలో ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమమం అవుతుంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ప్రయత్నిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం.. పారిశ్రామిక రంగంలో జిల్లాకు వందేళ్ల చరిత్ర ఉన్నా మధ్య, చిన్న తరహా పరిశ్రమలు రావడం లేదు. కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను పునరుద్ధరించడం సాధ్యంకాని పక్షంలో ఈ పరిశ్రమల స్థలంలో కోల్డ్ రోలింగ్ మిల్ కాంప్లెక్స్, హాట్ రోలింగ్ మిల్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డెడ్ పైపుల పరిశ్రమ, సెమికండర్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇథనాల్ ప్లాంట్, బ్యాటరీస్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.మళ్లీ ప్రయత్నాలు ఏడాది క్రితం ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తెరిపించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి నడిపించాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆ తర్వాత కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజుల దృష్టికి ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోద్రావు తీసుకెళ్లారు. తాజాగా రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు విజ్ఞప్తి మేరకు ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు నిపుణుల కమిటీని పంపిస్తానని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. -
గోదావరి పరవళ్లు..
వాతావరణ ం జిల్లాలో శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది. రాత్రి 11 గంటలకు 38.8 అడుగుల వరద ● అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారులు ● పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మవారి నారచీరల ప్రాంతంశనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం తరలివస్తోంది. గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 36.80 అడుగులకు, రాత్రి 11 గంటలకు 38.8 అడుగులకు చేరింది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు స్థానిక అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం, తాలిపేరు ప్రాజెక్ట్ల నుంచి వరద నీటిని దిగువకు వదులు తున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో గోదావరి ఉధృతి పెరిగింది. గురువారం 23 అడుగులు ఉన్న గోదావరి శుక్రవారం ఉదయం 7 గంటలకు వేగంగా 33.5 అడుగులకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు 35, సాయంత్రం 5 గంటలకు 36.8, రాత్రి 11 గంటలకు 38.8 అడుగులకు వచ్చింది. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం నీట మునిగాయి. కాగా భద్రాచలం వద్ద 43 అడుగులకు మొదటి, 48 అడుగులకు రెండో, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. అప్రమత్తం చేసిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక వైపు గోదావరి పరుగులు పెడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నది ఒడ్డున ఉన్న స్లూయిస్ పాయింట్ల వద్ద భారీ మోటార్లను సిద్ధం చేశారు. కరకట్టకు ప్రమాదం జరగకుండా ఇసుక బస్తాలను అమర్చారు. హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ భద్రాచలం అర్బన్: గోదావరిలో నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం కరకట్ట వద్ద వరదను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సహాయక చర్యల కోసం ఐదు డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.పరీక్షించి.. పదును పెట్టి.. విద్యార్థుల స్థాయి అంచనాకు ‘బేస్లైన్’ ‘మిడ్లైన్’ ‘ఎండ్లైన్’ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టారు. 8లోన్యూస్రీల్ -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు, కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ సీఈఓపెద్దమ్మతల్లి అమ్మవారిని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాతలు దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు.17న మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని మెడికల్ కళాశాలలో వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని 20 విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు 10, అసోసియేట్ ప్రొఫెసర్ 36, అసిస్టెంట్ ప్రొఫెసర్ 18, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 37 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులు హాజరు కావాలని కోరారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలికొత్తగూడెంఅర్బన్: హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఏజెన్సీల నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలను, ప్రమాణాలను పాటించాలని జిల్లా డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ వాకా మధువరుణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం, పాల్వంచ, సారపాక, భద్రాచలం ప్రాంతాల్లోని వివిధ ఆహార ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్లు లేకుండా ఆహార వ్యాపారాలు, మాంసాహార విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్, వైన్షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆదివాసీలకు మెరుగైన వైద్య సేవలు
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుచర్ల: ఆదివాసీ గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు మొబైల్ వైద్యశాలలు, ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1.50 కోట్లతో మండలంలోని పూసుగుప్పలో ఏర్పాటు చేసిన మొబైల్ వైద్యశాల, అంబులెన్సులను ఆయన కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఆస్పత్రితో పూసుగుప్ప, వద్దిపేట, ఉంజుపల్లి గ్రామాలతోపాటు ఛత్తీస్గఢ్లోని సరిహద్దు గ్రామాలకు వైద్య సేవలు అందుతాయన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు కూడా మాట్లాడారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఎంకే సింగ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు ఏ.రాజువర్మ, సీహెచ్ శ్రీనివాస్, ఈ.శ్రీనివాస్, తహశీల్దార్ ఎం శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, వైద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకు పూర్తి చేయాలి
పాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పను లను నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని హౌజింగ్ పీడీ రవీంద్ర నాథ్ ఆదేశించారు. మండలంలోని తోగ్గూడెం గ్రామంలో శుక్రవారం నిర్మాణంలో ఉన్న ఇళ్ల ను పనిశీలించారు. లబ్ధిదారులకు మాట్లాడా రు. ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించని లబ్ధిదారులు వారంలోగా ప్రారంభించాలని సూచించారు. నిర్దేశించిన గడువులో ఇళ్ల నిర్మా ణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, హౌ జింగ్ ఏఈ విశ్వేశ్వరరావు, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలనఅన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ శానిటరి కాంప్లెక్స్, రామకృష్ణాపురంలో మునగసాగు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అబ్బుగూడె, మర్రిగూడెంలో ఇంకుడుగుంతల నిర్మాణాలు, సైడ్ డ్రెయిన్ పనులకు భూమిపూజ చేశారు. తొలుత ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కావూరి మహాలక్ష్మితోపాటు వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూసుమంచి ఏడీఏ సరితకు పదోన్నతిభద్రాద్రి జిల్లా ఆత్మ డీపీడీగా నియామకం ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: కూసుమంచి వ్యవసాయ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ ఏ) బి.సరితకు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ)గా నియ మిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశా రు. దీంతో శుక్రవారం సరిత విధుల నుంచి రిలీవ్ అయి భద్రాద్రి జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయాన ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఎం.సతీశ్కు కూసుమంచి ఏడీఏ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సరిత సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఏగా, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తించారు. ఓసీ విస్తరణకు ప్రజామోదం మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూ రు ఓసీ విస్తరణలో భాగంగా శుక్రవారం గ్రామసభలో తిర్లాపురం గ్రామస్తులు చేతులు ఎత్తి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తిర్లాపురం రైతువేదికలో గ్రామసభ నిర్వహించారు. భూ సేకరణలో ఎకరాకు రూ.22.5 లక్షలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు పొలా లు పోని వారికి ఆర్అండ్ఆర్ అందిస్తామని, ని ర్వాసితులకు సింగరేణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యో గం కల్పిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆమోదం తెలుపుతూ చేతులు ఎత్తారు. సమావేశంలో తహసీల్దార్ అద్దంకి నరేశ్, జీఎం దుర్గం రాంచందర్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సింగరేణి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర స్థాయి సదస్సు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలో ఈనెల 13న రాష్ట్రస్థాయి యోగా సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మరికంటి వెంకట్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే ఈ సదస్సుకు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా కేజీ నుంచి పీజీ వరకు యోగా విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని తీర్మానించనున్నామని తెలిపారు. -
పని చేసే ప్రతీ కూలీకి నగదు ఇవ్వాలి
గుండాల: గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన ప్రతీ ఒక్క కూలీకి డబ్బులు చెల్లించాలని, పనులు జరిగే ప్రదేశాలకు సిబ్బంది వెళ్లాలని అడిషనల్ డీఆర్డీఓ రవి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఏడాది కాలంగా నిర్వహించిన ఉపాధి హామీ పనుల వివరాలను తనిఖీ బృందం వెల్లడించింది. అన్ని గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో రిజిస్టర్లలో తప్పులు, మెయింటెనెన్స్ లేకపోవడం, కూలీలకు డబ్బులు చెల్లించడంలో జాప్యం ఏర్పడడం గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పలువురి నుంచి రూ.14,610 రికవరీతో పాటు, నిర్లక్ష్యం కారణంగా రూ.11 వేలు జరిమానా విధించామని తెలిపారు. పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లి ఎప్పటికప్పుడు మట్టర్లు వేయడం, పనులను పర్యవేక్షించడం, కంప్యూటర్లలో నమోదు చేస్తే తప్పులు జరిగే ప్రసక్తి ఉండదని చెప్పారు. అవినీతికి పాల్పడినా, అలసత్వం వహించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డీవీఓ రమణ, ఎంపీడీఓ బాలరాజు, ఏవీఓ అనూష, ఆర్ఆర్పీ సుశీల, ఎంపీఓ శ్యాంసుందర్, ఏపీఓ రవితేజ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. -
పదును పెడతారు..
పరీక్షిస్తారు..కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించడం అనే సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, విద్యార్థుల అభ్యసన స్థాయిలను శాసీ్త్రయంగా అంచనా వేసేందుకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘బేస్లైన్’ ‘మిడ్లైన్’ ‘ఎండ్లైన్’ అనే పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరీక్షల ఫలితాలను ప్రత్యేక ‘స్కూల్ ఎడ్యుకేషన్’ యాప్లో నమోదు చేస్తూ డేటా ఆధారిత బోధన ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టే ఈ కార్యక్రమం సర్కార్ బడుల రూపురేఖలను మార్చే దిశగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి వారి పురోగతిని పారదర్శకంగా అంచనా వేయడానికి ఈ సరికొత్త విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లా వ్యాప్తంగా 953 ప్రాథమిక, 162 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు ఉండగా 46,754 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అభ్యసన స్థాయిని నిర్ధారించడం.. ఈ మూడు దశల పరీక్షల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయిని నిర్ధారించడం, వారి పురోగతిని ట్రాక్ చేయడం, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులను సర్దుబాటు చేయడం. ●బేస్లైన్ పరీక్షలు: జూన్ చివరిలో ఈ పరీక్షలను ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. ప్రాథమిక అంశాల్లో ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారో ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది. ●మిడ్లైన్ పరీక్షలు: నవంబర్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు అందించిన బోధన ఎంతవరకు ఫలించిందో, విద్యార్థులు ఎంత పురోగతి సాధించారో అంచనా వేయవచ్చు. ●ఎండ్లైన్ పరీక్షలు: విద్యా సంవత్సరం ముగింపులో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థి సాధించిన మొత్తం అభ్యసన స్థాయిని, నైపుణ్యాల పెంపుదలను స్పష్టంగా తెలియజేస్తుంది. ●పారదర్శకతకు పెద్దపీట ఈ పరీక్షల ఫలితాలను ప్రత్యేక ‘స్కూల్ ఎడ్యుకేషన్’ యాప్లో నమోదు చేయడంతో ఫలితాలు పారదర్శకంగా ఉంటాయి. విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఏ విద్యార్థికి ఏ అంశంలో ఎక్కువ శ్రద్ధ అవసరమో గుర్తించడానికి యాప్ డేటా సహాయపడుతుంది. విద్యార్థుల పురోగతికి విద్యాశాఖ కొత్త అడుగు సామర్థ్యాలను తెలుసుకునేందుకు మూడు దశల్లో పరీక్షలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తింపు అందుకు అనుగుణంగా విద్యాబోధన స్థాయి ఆధారంగా బోధన పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని బట్టి ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి గణితంలో వెనుకబడి ఉన్నట్లు బేస్లైన్ పరీక్షలో తేలితే ఆ విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధతో, విభిన్న బోధనా సామగ్రితో బోధన అందిస్తారు. ఈ సమగ్ర విధానం కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడనుందని చెబుతున్నారు. భవిష్యత్కు బలమైన పునాది.. రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ పరీక్షల విధానం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని కచ్చితంగా అంచనా వేసి వారి అవసరాలకు అనుగుణంగా బోధనను అందించడానికి ఇది మాకు సహాయపడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వేస్తుంది. –నాగరాజశేఖర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో తెలిసింది ఈ కొత్త పరీక్షలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. బేస్లైన్ పరీక్ష రాసిన తర్వాత నేను ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో తెలిసింది. టీచర్లు కూడా మాకు అర్థం కాని విషయాలను మళ్లీ చెబుతున్నారు. పరీక్షలు పెట్టడం వల్ల మేము ఎక్కడ ఉన్నామో తెలుస్తోంది. బాగా చదువుకోవడానికి ప్రోత్సాహంగా ఉంది. –పి.సుశాంత్, 9వ తరగతి, భట్టుపల్లి జెడ్పీహెచ్ఎస్ -
తాత్కాలిక పద్ధతులను ప్రోత్సహించాలి
కొత్తగూడెంఅర్బన్: కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను ప్రోత్సహించాలని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి జయలక్ష్మి సూచించారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని మొర్రేడువాగు బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలని చెప్పారు. మహిళల పోషక స్థితిని మెరుగుపరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మధువరన్, యు. తేజశ్రీ , ఫైజ్మోహియుద్దీన్, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మణుగూరుటౌన్: దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఈ నెల 9న మండలంలోని కూనవరం జీపీ రేగులగండి చెరువు వద్దకు వెళ్లిన కార్మికుల బృందంలో ఓసీ ఈపీ ఆపరేటర్ సుంకరి శ్రీనివాస్ (36) గల్లంతైన విషయం విదితమే. శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. భద్రాచలం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, మణుగూరు ఫైర్ రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉండగా, ఇటీవల గోదావరిఖని నుంచి మణుగూరు బదిలీపై వచ్చాడు. కాగా, మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామం ఎస్సీకాలనీలో టాటా ఏస్ వాహనం ఢీకొని కనుకు వెంకటమ్మ (60) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఓ శీతల పానీయానికి చెందిన టాటా ఏస్ వాహనం నర్సాపురం గ్రామంలో కూల్డ్రింక్స్ అన్లోడ్ చేసి రివర్స్ చేస్తుండగా రోడ్డుపై నడిచివస్తున్న వెంకటమ్మను ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన వెంకటమ్మను నర్సాపురం వైద్యశాలకు.. అక్కడి నుంచి భద్రాచలం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా వైద్యశాలలో ఉంచగా బంధువులు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్ఐ గణేశ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రేపల్లెవాడ రైతువేదికలో టీవీ చోరీఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్కు వినియోగించే టీవీ చోరీకి గురైంది. శుక్రవారం రైతువేదికలో టీవీ కనిపించక పోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యవ సాయశాఖ అధికారుల కు సమాచారం అందించారు. పరిశీలించిన ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీశ్ చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రైతువేదిక వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలోని జర్పుల సాగర్ మూడు రోజుల కిందట టీవీ భుజంపై పెట్టుకొని ఇల్లెందు వైపుగా నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశామని పలువురు రైతులు చెప్పడంతో అతని ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. పోలీసులతోపాటు గ్రామస్తులు సైతం హెచ్చరించడంతో తానే చోరీ చేసినట్లు సాగర్ అంగీకరించాడు. సుభాష్నగర్ జీపీలో విక్రయించానని చెప్పడంతో పోలీసులు సాగర్ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే టీవీని తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు ఆదేశించారు. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య కామేపల్లి: మండలంలోని బాసిత్నగర్కు చెందిన తేజావత్ మౌనికకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సపావట్ కృష్ణప్రసాద్కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన ఆయన కృష్ణప్రసాద్ మౌనికను అనుమానిస్తుండడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తండ్రి వీరన్న ఫిర్యాదుతో ఆమె భర్త, అత్త, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యా సామర్థ్యాలు పెంపొందించేలా కృషి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలు ప్రతీ సబ్జెక్ట్లో మెరుగుపడేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని భద్రాచ లం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల హెచ్ఎంలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ టీచర్లు ఉద్దీపకం వర్క్బుక్ల ద్వారా విద్యార్థులకు బోధన సాగించాలని తెలిపారు. పాఠశాలలకు సరఫరా చేసిన నోటుబుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్లు వెంటనే అందించాలని, నూతన మెనూ ప్రకారం భోజనం సమకూర్చాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యాన పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్లు లేనిచోట వేడి చేసిన నీటినే విద్యార్థులకు అందించాలని పీఓ సూచించారు. సమావేశంలో డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్, ఏసీఎంఓలు రాములు, రమేశ్, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
● చిన్న కుటుంబాలుగా మారిన సమాజం ● అమ్మ, నాన్న, ఒక్కరిద్దరు పిల్లలతో జీవనం
ఇల్లెందురూరల్/నేలకొండపల్లి: సమాజంలో ఆర్థిక పరిస్థితులు, స్వార్థం, నేను అనే భావన వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. నేడు కుటుంబం అంటే భార్య, భర్త, వారి ఒకరిద్దరు సంతానం మాత్రమే. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా బలపడినా మానసికంగా మాత్రం బలహీనపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆయా కుటుంబాల పిల్లల మానసిక పరిపక్వత ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చిన్న కుటుంబాల్లో మంచి మాటలు చెప్పే పెద్దలు లేకపోవడంతో పిల్లలు టీవీ, సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇది వారి ఆరోగ్య స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతోంది. -
దమ్మక్కకు నీరాజనం
భద్రాచలం : భద్రగిరి రామయ్య మూలమూర్తులకు నీడనిచ్చి, పూజలందించిన అపర భక్తురాలు దమ్మక్కకు వైభవంగా నీరాజనం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తురాలిగా ఖ్యాతిగాంచిన పోకల దమ్మక్కకు.. ఆషాఢ పూర్ణిమ రోజున గిరిజనుల సమక్షంలో దమ్మక్క సేవా యాత్ర పేరిట దేవస్థానం ఆధ్వర్యంలో 2014 నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆషాఢ పూర్ణిమ కావడంతో ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని చెట్టు వద్ద గల దమ్మక్క విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల నడుమ చప్టా దిగువన ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద, సీతారామ ఆఫీసర్స్ క్లబ్ వద్ద నున్న శబరి విగ్రహం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. రామదాసు కీర్తనలతో నగర సంకీర్తన చేశారు. అనంతరం దేవస్థానంలో రామయ్యకు దమ్మక్క తరఫున పలు రకాల పండ్లు, పూలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, ప్రధానార్చకులు విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురంలో రామయ్య కల్యాణం.. కాగా, దమ్మక్క సేవా యాత్రను పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రామయ్య కల్యాణాన్ని జరిపించారు. ప్రచార రథంలో స్వామివారు వెళ్లగా భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా తమ ముందుకు వచ్చిన భద్రాద్రి రామయ్యకు భక్తులు మొక్కులు సమర్పించారు. కమనీయంగా గోవిందరాజ స్వామి కల్యాణం.. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుబంధ ఆలయం, తాతగుడి సెంటర్లో వేంచేసి ఉన్న గోవిందరాజ స్వామి వారి తిరుకల్యాణోత్సవాన్ని గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి – భూదేవి సమేత గోవిందరాజ స్వామి వారికి దేవస్థానం తరఫున అధికారులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ కమనీయంగా గోవిందరాజస్వామి కల్యాణంకళ తప్పిన సేవాయాత్ర.. భద్రాచలంలో నిర్వహించిన దమ్మక్క సేవా యాత్ర పూర్తిగా కళ తప్పింది. గతంలో వివిధ గ్రామాలను ప్రత్యేక బస్సుల ద్వారా గిరిజనులను ఒకరోజు ముందుగానే భద్రాచలం తీసుకొచ్చి వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించేవారు. సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు సైతం ఉత్సాహంగా పాల్గొని స్వామి వారికి పూలు, పండ్లు సమర్పించేవారు. వేడుక అనంతరం ఆలయం తరఫున గిరిజనులకు వస్త్రాలు అందించేవారు. కానీ ఈ ఏడాది అలాంటివేమీ లేకుండానే సాదాసీదాగా వేడుక నిర్వహించారు. కాగా, గురువారం జరిగిన సేవా యాత్రలో గిరి ప్రదక్షిణను ఆదివాసీ నాయకులు పూనెం కృష్ణ, వీరభద్రం అడ్డుకొని నిరసన తెలిపారు. గిరిజన సంఘాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. దేవస్థానం అధికారులు గిరిజనులను అవమానించారని ఆరోపించారు. -
● చాలా సంతోషంగా ఉన్నాం
నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్–లావణ్య దంపతులు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంతానం ఒక్కరు చాలని నిర్ణయించుకున్నారు. వీరికి శ్రీ లలిత్ సౌరి ఉన్నాడు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, పిల్లలకు కనీస అవసరాలు తీర్చడం కోసం అధిక మొత్తాలను వెచ్చించాల్సి రావడం వంటి సమస్యలను గుర్తించి ఒక్కరు చాలనకున్నామని, ఒక్క బాబుతో సంతోషంగా జీవనం సాగిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఆర్థిక భారం పెరగడంతో చాలా మంది దంపతులు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. విద్య, వైద్యం, ఆహారం, బట్టలు తదితర అవసరాల కోసం భారీగా ఖర్చు పెరుగుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో పాపైనా, బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన గద్దల రాధాకృష్ణ(30) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్పై కొత్తగూడెం వెళ్లొస్తుండగా అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చర్ల: మండలంలోని సుబ్బంపేటకు చెందిన పైవేట్ ఎలక్ట్రీషియన్ కనితి శాంతమూర్తి (30) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద వాల్ కటింగ్ మిషన్తో గోడకు రంధ్రాలు చేస్తుండగా విద్యుదాఘతానికి గురై పడిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి యజమాని సామ్రాజ్యం కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరిని కొ య్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, శాంతమూర్తి అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలుచండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అన్నపురెడ్డిపల్లికి చెందిన గుండు మాధవి తోటి కూలీలతో కలిసి ఆటోలో పనికి వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో అన్నపురెడ్డిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చున్న మాధవి కాలు తెగి దూరంగా పడింది. ఆటోలోని మిగతా కూలీలకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రురాలిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం చండీ హోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకొచ్చారు. అక్కడ మండపారాధన, గణపతిపూజ అనంతరం చండీహోమం గావించి చివరకు పూర్ణాహుతి చేశారు. హోమంలో పాల్గొన్న 21 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కాగా, గురువారాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో ‘జారె’అశ్వారావుపేటరూరల్ : విద్య – ఆరోగ్యంపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే ఒకరికే అవకాశం దక్కడం విశేషం. ఈ మేరకు తొలిరోజు సదస్సులో ఆరోగ్య అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి వివరించారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. భారీగా గంజాయి స్వాధీనంభద్రాచలంటౌన్ : ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సీఐ సీహెచ్ శ్రీనివాస్ కథన ప్రకారం.. కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వాహనాలను ఆపి తనిఖీ చేయగా 8.85 కిలోల గంజాయి లభించింది. వారిని విచారించగా హైదరాబాద్కు చెందిన ముడావత్ మోహన్ నాయక్, గంట పవన్కుమార్, రమావత్ గణేష్, అయ్యప్ప నాయక్, ఆకుల దర్శత్ చంద్రాలు గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించామని, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. టేకులపల్లిలో 4 కిలోలు.. టేకులపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తుండగా టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. సీఐ టి.సురేష్, ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా ఏఆర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ దుంప ప్రసాద్ జల్సాలకు అలవాటు గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా వెంకట్యాతండా వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, 4.130 కిలోల గంజాయితో పాటు ఆటో, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి విలువ రూ.2.06 లక్షలు ఉంటుందని తెలిపారు. -
ఒకరు లేదా ఇద్దరు చాలు!
ఎక్కువ సంతానంతో పోషణ, సంరక్షణ భారమవుతుందా?సంతానం ఒకరు చాలా.. అంత కంటే ఎక్కువ ఉండాలా? ఒకరే సంతానంతో పిల్లలకు ఒంటరితనం ఎదురుకాదా?ఒకే సంతానంతో యువజన జనాభా తగ్గనుండడంతో ఎక్కువ మందిని కనాలన్న సూచన మంచిదేనా?●అలాంటిదేమీ ఉండదుఅవునుఒకరుకాదుప్రస్తుత జీవన వ్యయంతో సాధ్యం కాదుఅయినా తప్పదుఇద్దరు3930214614537ఆలోచించాల్సిన అంశమేఅంతకు మించితే పోషణ భారమే.. ● ‘సాక్షి’ సర్వేలో జంటల నోట ఇదే మాట ● సంతానం విషయంలో నేటి తరంలో స్పష్టత -
కలిసుంటే.. కలదు సుఖం!
ఆర్థిక పరిస్థితుల వల్లే..ఉమ్మడి కుటుంబం ఐక్యతకు ప్రతీక.. కష్టసుఖాలను పంచుకునే వేదిక. బంధం, అనుబంధం, ప్రేమానురాగాలతో బృందావనాన్ని తలపిస్తుంది. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, బాబాయిలు, చిన్నమ్మలు, మేనత్తలు, మామలు, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు, బావలు, బావమరుదులతో ఆనందంగా జీవిస్తుంటారు. పూర్వం నుంచి దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ కాలక్రమంలో మార్పులు వచ్చాయి. స్వేచ్ఛ లేదని, ప్రైవసీ కొరవడుతుందనే భావనతో వేరుగా జీవిస్తుండటంతో దాదాపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయే దశకు చేరగా.. ఇంకా ఒకటో, రెండో కుటుంబాలు అక్కడక్కడా ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నాయి. ఆ కుటుంబాల గురించి తెలుసుకుందాం. –ఖమ్మంగాంధీచౌక్ఒంటరితనం దూరం.. ప్రయోజనాలనేకం ఉమ్మడి కుటుంబతో ఒంటరితనం దూరమవుతుంది. కుటుంబ వాతావరణం పిల్లల్లో సానుకూల ప్రభావం చూపుతుందని, వ్యవహారిక జ్ఞానం పెంచుతుందని, మానసిక పరిపక్వతకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ప్రతి జంట ‘మేమిద్దరం.. మాకొక్కరు’అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో తోబుట్టువులు లేకపోవడంతో చిన్నారులు ఎక్కువ శాతం మంది ఒంటరితనానికి లోనవుతున్నారనే నిపుణుల పరిశీలనలో తేలింది. ఆడుకునేందుకు తమ ఈడు పిల్లలు లేకపోవడం, ఒక్క సంతానమని తల్లిదండ్రులు గారాబంగా, బయటకు వెళ్లనీయకుండా పెంచడంతో ఒంటరితనానికి లోనవుతున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. చిన్నాన్న, పెదనాన్న పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒంటరిగా చదువుకోలేని పిల్లలు ఉమ్మడిగా చదువులో కూడా రాణిస్తారు. నాయనమ్మ, తాతయ్యలతో ఉంటే నీతికథలు వింటూ అనుభవాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆనందంగా గడిపే పిల్లలు శారీరకంగా, మానసికంగా పటిష్టంగా ఉంటారు. పెద్దల సలహాలు లభిస్తాయి. బాధలో ఉన్నప్పడు ఓదార్పు, అభయం లభిస్తుంది. మహిళలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది.● మా కుటుంబంలో 40 మంది.. బూర్గంపాడు: కరకగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ ఖాజాహుస్సేన్, రహిమున్నీషా బేగం దంపతులకు తొమ్మిదిమంది సంతానం. వీరిలో ఏడుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పెద్ద సయ్యద్ ఖాజాహుస్సేన్ పదిహేను ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ అందరినీ చదివించి పెద్దచేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించి ప్రయోజకులుగా మార్చాడు. కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, మవవళ్లు, మనవరాళ్లతో కుటుంబ సభ్యులు 40కి చేరారు. కుమారులు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. మనవళ్లు, మనవరాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లతో సంతోషంగా కాలం గడుపుతున్నానని, కుటుంబం తనను ఎంతో అప్యాయతతో చూసుకుంటోందని ఖాజాహుస్సేన్ తెలిపాడు. కాగా అతని భార్య రహిమున్నీషా పదేళ్ల క్రితం మృతి చెందింది. ● అంతా కలిస్తే పండుగే.. ఇల్లెందు: ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ ఎల్లాపురానికి చెందిన మోకాళ్ల కన్నయ్య–చుక్కమ్మలకు ఎనిమిది మంది సంతానం. ఆరుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. వారి పిల్లలతో మొత్తం కుటుంబంలో 33 మంది ఉన్నారు. శుభకార్యాలు జరిగితే సందడి నెలకొంటుంది. ఏడాదికి ఒకసారైనా అంతా ఒక చోట కలిసి పండుగ చేసుకుంటుంటారు. కన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు, మాజీ సర్పంచ్ మోకాళ్ల కృష్ణ కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. మూడో తరంలో 16 మంది సంతానం. నేటి వరకు తోబుట్టువుల మధ్య పొరపొచ్చాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందరూ ఒక చోట చేరి చర్చించుకుని ముందుకు సాగుతామని కృష్ణ తెలిపాడు. దీంతో గ్రామంలో గౌరవం కూడా ఉందని పేర్కొన్నాడు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవంఉమ్మడి కుటుంబాలతోనే జీవన మాధుర్యం కష్టసుఖాల్లో ఒకరికి అందరూ.. అందరికీ ఒకరు ప్రేమానురాగాలు, వ్యవహారిక జ్ఞానం ద్విగుణీకృతం -
● నా కష్టం పిల్లలు పడకూడదని..
మాది పెద్ద కుటుంబం. ఎనిమిది మంది సభ్యులం. ఇంత మందిని పోషించడం అమ్మనాన్నలకు ఇబ్బందిగా ఉండేది. చాలా రోజులు ఆహారం లేక ఉపవాసంతోనే నిద్రించేవాళ్ళం. ఆ పరిస్థితి నా పిల్లలకు ఎదురవ్వొద్దని నా చిన్నతనంలోనే నిర్ణయించుకున్నా. నాకు రామనాథంతో పెళ్లయ్యాక భర్తను ఒప్పించి కొడుకై నా, కూతురైనా ఒక్కరే చాలనుకున్నాం. కుమార్తె జన్మించింది. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, రెక్కల కష్టంతో కుమార్తెను సుఖంగా పోషించుకుంటున్నాం. ఆమెను ప్రయోజకురాలిని చేయాలన్నదే మా లక్ష్యం. – చింత భారతి – రామనాధం, కుంజవారిగూడెం, ఇల్లెందు మండలం -
ఎరువుల దకాణాల్లో తనిఖీలు
దమ్మపేట : మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని దమ్మపేట, మొద్దులగూడెం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లోని దుకాణాల్లో స్టాక్, రికార్డులను తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారి శీలం చంద్రశేఖర రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్..దమ్మపేట : మండలంలోని దురదపాడు, లింగాలపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. 147 ఎకరాల విస్తీర్ణంలో 63 మంది రైతుల వ్యవసాయ క్షేత్రాల్ల మొక్కలు నాటారు. ఆయిల్ఫెడ్ డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు సతీష్, అప్పారావు, అర్షద్, రైతులు సోయం ప్రసాద్, మడకం రాజేష్, ఎర్రా వసంతరావు, శేషుబాబు, కాసాని నాగప్రసాద్, మంగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాచలం ఆస్పత్రిలో ఖరీదైన శస్త్రచికిత్సభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం ఓ మహిళకు ఖరీదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన రమణ అనే మహిళకు గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడటంతో ఈ నెల 9న ఆస్పత్రిలో చేరింది. దంతో వైద్యులు రామకృష్ణ, వెంకట్, నిఖితలు ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ నిర్వహించి గాల్ బ్లాడర్ తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండగా, జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి అని సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఇదేచికిత్స ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహిస్తే రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలింపు నేలకొండపల్లి: అత్యాచారం కేసులో నిందితుడి కోసం భద్రాద్రి జిల్లా గుండాల పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన కుంభం వీరబాబు 2019లో గుండాల పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో గురువారం గుండాల సీఐ ఎల్.రవీందర్, సిబ్బంది రాజేశ్వపురం వచ్చి ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆగస్టు 13లోగా న్యాయస్థానంలో హాజరయ్యేలా చూడాలని బంధువులకు సూచించారు. కాగా, వీరబాబు ఆచూకీ తెలిసిన వారు 87126 82082, 87126 82084 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
‘ఉద్దీపకం’తో గుణాత్మక విద్య
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్తో గుణాత్మక విద్య అందించే అవకావం ఉంటుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక బీఈడీ కళాశాలలో ఏహెచ్ఎస్, ఏపీఎస్, జీపీఎస్ పాఠశాలల ఎస్జీటీలకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస సామర్థ్యాలు అర్థమయ్యేలా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో వర్క్బుక్లను రూపొందించామని చెప్పారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గుణకారాలు, భాగాహారాల్లో నైపుణ్యం పెంచేలా ఉపకరిస్తోందని వివరించారు. 1, 2 తరగతుల వారికి తెలుగు, 3 నుంచి 7వరకు ఇంగ్లిష్, గణితం వర్క్బుక్లు రూపొందించామని చెప్పారు. ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని, చదువులో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం బీఈడీ, డీఈడీ కళాశాలల డార్మెటరీ గదులను పరిశీలించారు. ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, ఏసీఎంఓలు రమేష్, శ్రీరాములు, ఏటీడీఓలు అశోక్ కుమార్, రాధమ్మ, సీఆర్పీలు వరబాబు, శంకర్, మోతీలాల్, అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలివర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఓ రాహుల్ సూచించారు. మారుమూల మండలాల సబ్ యూనిట్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, బాధితులకు చికిత్స చేయాలన్నారు. ఏజెన్సీ ఏరియాలోని 113 హైరిస్క్ గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించేలా ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఉన్నట్లు తేలితే మందులు అందించడంతో పాటు ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయలక్ష్మి, ఏడీఎంహెచ్ఓ చైతన్య, మలేరియా అధికారి స్పందన తదితరులు పాల్గొన్నారు. -
మరో పోరాటానికి సిద్ధం కావాలి
● అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి రాష్ట్రం ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సూపర్బజార్(కొత్తగూడెం): అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. అభివృద్ధి చెందుతున్న దశలో కాంగ్రెస్ చేతికి వెళ్లి తిరోగమనంలో పయనిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొత్తగూడెం క్లబ్లో గురువారం నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం ప్రగతిబాటలో పయనించేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 18 నెలల కాలంలో సీఎం రేవంత్రెడ్డి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించారని, పెన్షన్లు పెరగక పోగా, రైతులందరికీ రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందని, చర్చకు సిద్ధమన్న సీఎం.. రమ్మంటే తోకముడిచి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన ఐదు పచాయతీలను తెలంగాణలో కలపాలని అక్కడి సీఎంకు లేఖ రాశామన్నారు. భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. కాగా, సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి డి.వీరన్న తన అనుచరులతో కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ‘సీతారామ’ తక్షణమే పూర్తి చేయాలి పాల్వంచ/పాల్వంచరూరల్ : పెండింగ్లో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పాల్వంచలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా సీతారామ ప్రాజెక్ట్ పనులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రూప్సింగ్, సదానందం గౌడ్, మాధవి, పవన్ నాయక్, సిఽంధు తపస్వి, హుస్సేన్, కాపు కృష్ణ, నవతన్, కిరణ్మార్, వరప్రసాద్, కాంపెల్లి కనకేష్, అనుదీప్, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. రేగాకు పరామర్శ.. కరకగూడెం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తల్లి నర్సమ్మ బుధవారం మృతిచెందగా, కవిత గురువారం కుర్నవల్లిలో రేగాను పరామర్శించారు. నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పోరాటం వల్లే రాష్ట్ర కేబినెట్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిందని కవిత అన్నారు. కుర్నవల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ బిల్లు దేశానికి కూడా దారి చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కొత్త పార్టీ పెడుతున్నారా’ అని విలేకరులు కవితను ప్రశ్నించగా ‘జై తెలంగాణ’ అంటూ సమాధానమిచ్చారు. తాతా, వనమా పరామర్శ.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఆయన తల్లి నర్సమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. -
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్
సుజాతనగర్: జిల్లాలోని సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, చర్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో చొరబడి చోరీలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, అపహరించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యా పారిని సుజాతనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. భద్రాచలం సీతారాం నగరం కాలనీకి చెందిన షేక్ ధారుక్బాబా చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటై పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతను గతంలో పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో చోరీ లకు పాల్పడగా అరెస్టయి కొన్ని నెలల పాటు జైలు లో ఉండి వచ్చాడు. తరువాత మోతెకు చెందిన స్నే హితుడు అఖిల్తో కలిసి సుజాతనగర్లో ఒక చోరీ, మణుగూరుకు చెందిన మరో స్నేహితుడు సూర్యప్రకాశ్తో కలిసి బూర్గంపాడులో చోరీ, ఎటపాకకు చెందిన పేరాల నరసింహారావు, భద్రాచలానికి చెందిన అల్లాడ రవీందర్, ఖమ్మానికి చెందిన ఎండీ మతిన్తో కలిసి భద్రాచలంలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలే కాకుండా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడి బంగారం ,వెండి వస్తువులను దోచు కున్నాడు. ఇలా చోరీలతో వచ్చిన సొమ్ములో కొంత అఖిల్, సూర్యప్రకాశ్, నల్లమటి సాయిరాంకు ఇస్తుండేవాడు. బంగారు, వెండి వస్తువులను భద్రాచలంలోని బంగారు షాపు యజమానులైన వల్లే విజయరావు, గొర్ల శ్రీనుకు విక్రయించాడు. కొంత బంగారాన్ని అమ్మేందుకు మంగళవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తుండగా వాహన తనిఖీల్లో సుజాతనగర్ పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ వెల్లడించారు. ధారూక్బాబా, నలమటి సాయిరాం, బంగారు, వెండి వస్తువులు కొన్న వల్లే విజయరావును అరెస్ట్ చేశామని, వారి నుంచి 36 తులాల బంగారం, 102 తులాల వెండి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్ఐలు ఎం. రమాదేవి, ప్రవీణ్, క్లూస్ టీం సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. 36 తులాల బంగారం, 102 తులాల వెండి స్వాధీనం -
సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో సైన్స్ ఎక్స్పో
సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం సైన్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ ఎస్ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డి.కాశీనాథ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవ జీవన గమనంలో ప్రతి దశలో సైన్స్ అంతర్భాగమన్నారు. సైన్స్ లేకపోతే జీవితమే లేదని, సైన్స్, సమాజం రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వేప, పసుపు వంటి సంప్రదాయ ఔషధాల ఉపయోగాల గురించి, జన్యుపరమైన కేన్సర్ను గుర్తించే నానో టెక్నాలజీ అప్లికేషన్స్ ఆవశ్యకతను వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయులు నిరంతర అన్వేషకులని తెలిపారు. మరో గౌరవ అతిథి జీకే కిరణ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద కూడా మాట్లాడారు. వివిధ విద్యాసంస్థల నుంచి 55 మంది విద్యార్థినులు సైన్స్ ప్రాజెక్టు ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. మొదట కార్యక్రమ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి.శైలజ కార్యక్రమ నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో కె.శ్రీలత, డాక్టర్ సీహెచ్ పావని, ఎం.పుష్పలత, కె.స్వర్ణలత, బి.సరోజ, డాక్టర్ కె.రాజ్యలక్ష్మి, షాషేదా పర్వీన్, కె.ఉషారాణి, వి.రేణుక, వి.శ్రీలత, జె.రోజా, ఎస్.ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు. -
రేగులగండి చెరువులో కార్మికుడి గల్లంతు
మణుగూరుటౌన్: సమ్మె నేపథ్యంలో ఆటవిడుపుగా రేగులగండి చెరువుకు వెళ్లిన కార్మికుల బృందంలో ఒకరు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. తోటి కార్మికుల కథనం ప్రకారం.. సింగరేణి కాల రీస్ మణుగూరు ఏరియాలోని పీకేఓసీ కార్మికులు సుమారు 15 మంది బృందంగా ఏర్పడి కూనవరం పంచాయతీలోని రేగులగండి వద్దకు వెళ్లారు. సాయంత్రం ఈతకు దిగిన ఓసీ–2 ఈపీ ఆపరేటర్ సుంకరి శ్రీనివాస్ ఎంతకూ బయటికి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి, జాలర్లకు సమీప గ్రామస్తులకు సమాచారం అందించగా.. వారు వచ్చి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం 8 గంటలకు గాలింపు చర్యలు చేపడతామని రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. -
కుల బహిష్కరణ అవాస్తవం
ఇల్లెందురూరల్: మండలంలోని పాతపూసపల్లిలో పలువురిని కుల బహిష్కరణ చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రామపెద్దలు వర్స అవినాష్, సూర్నపాక వెంకటనారాయణ, తెల్లం శ్యాం, కుంజ వీరస్వామి, వర్స పుల్లయ్య స్పష్టం చేశారు. గ్రామంలో బుధవా రం వారు మాట్లాడుతూ.. తమపై ఆరోపణలు చేసిన వ్యక్తులు కొత్తపూసపల్లి వాసులని, గ్రామంతో సంబంధం లేని వ్యక్తులను తాము కుల బహిష్కరణ చేశామని ఆరోపించడం గర్హనీయమన్నారు. గతంలో తమ గ్రామంలో పార్టీ విస్తరణకు సీపీఎం నేతలు ప్రయత్నిస్తే తిరస్కరించగా, కాంగ్రెస్లో కొనసాగుతున్న తమపై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో గ్రామస్తులు సూర్నపాక రామారావు, ఈసం కృష్ణ, సూర్నపాక సుజాత, సోది మహేశ్, కల్తి వినోద్, సూర్నపాక సత్యనారాయణ, సోది హరీశ్, కుంజ సందీప్, కుంజ మోహన్, వర్స ఆనంద్, కల్తి సోమయ్య, గుమ్మ డి గురువమ్మ తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడికొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, లక్ష్మీదేవిపల్లి పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.39,530 నగదు, ఆరు సెల్ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని ఎస్ఐ కార్తీక్ తెలిపారు. మొక్కలు నాటి రక్షించాలిటీజీఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య చుంచుపల్లి: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ఇందుకోసం మొ క్కలు నాటి సంరక్షించాలని టీజీ ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం కొత్తగూడెం, పాల్వంచ డివి జన్ కార్యాలయంలో అటవీ అధి కారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు. మానవాళికి ప్రాణవా యువు అందించే మొక్కల పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ, ఇతర ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ఎఫ్డీ ఓ కోటేశ్వరరావు, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డీఎంలు చంద్రమోహన్, కవిత, గణేష్, డీఆ ర్ఓ తోలెం వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, చారి పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దుపాల్వంచ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణా పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ పిలుపు మేరకు కేటీపీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో 5, 6, 7 దశల కర్మాగారాల ఎదుట వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేఏసీ నాయకులు డి.ఉమా మ హేశ్వరరావు, కోటేశ్వరరావు, డోలీ శ్రీనివాసరా వు, అఖిలేష్, పుల్లారావు, కోటేశ్వరరావు, రవీందర్, పరుశురాం, సురేంద్రాచారి, వెంకటేశ్వర్లు, నా గేశ్వరరావు, శ్రీనివాసరావు, సీతారాంరెడ్డి, జయభాస్కర్, శ్రీపాల్, పావని, రజిత పాల్గొన్నారు. -
భవనం.. భయానకం
● భద్రాచలంలో ప్రమాదకరంగా 131 శిథిల భవనాలు ● వాటి తొలగింపుపై మీనమేషాలు ● ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి ● నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో శిథిల భవనాలు ప్రాణసంకటంలా పరిణమిస్తున్నాయి. అవి ఎప్పుడూ కూలుతాయో తెలియదు. వాటిని గుర్తించి కూల్చివేస్తే పెనుముప్పును తప్పించినట్లే. భారీ వర్షాలు కురిసే ముందే కార్యాచరణకు దిగాల్సిన అవసరం ఉంది. ఇటీవల భద్రాచలంలో వరుసగా కురిసిన వర్షాలకు గోడలు నాని ఉంటా యి. ఈ క్రమంలో వర్షాలు అధికంగా కురిసి, భవనా లు కూలితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చోటుచేసుకోకముందే భద్రాచలం గ్రామ పంచాయతీ అధికారులు కఠినంగా వ్య వహరించాల్సి ఉంది. ఈ ఏడాది రెండు నెలల వర కు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాత భవనాలు నాని కూలే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు అలాంటి భవనాలపై నిఘా ఉంచి, పట్టణంలో ఉన్న శిథిల భవానలను నేలమట్టం చేయాలి. అడ్డగోలుగా నిర్మాణాలు.. భద్రాచలం పట్టణంలోని గ్రామ పంచాయతీ పరిధి లో భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, ఆయా నిర్మాణాలకు అనుమతు లు ఉన్నాయా? లేవా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతు లు తీసుకుంటున్న యజమానులు నాలుగు నుంచి ఐదు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక బిల్డర్లు ఏ మేరకు నాణ్యత పాటిస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లాభాల కోసం భవనాలను నిబంధన లకు విరుద్ధంగా నిర్మిస్తున్నారనే విమర్శలున్నా యి. ఇటీవల భద్రాచలం నిబంధనలకు విరుద్ధంగా జీ+1కు అనుమతి తీసుకుని జీ+3, జీ+4, జీ+5 అంతస్తులకు స్లాబ్ వేసినవి 130 భవనాలు ఉన్నా యి. వీటిలో కేవలం 15 మంది యజమానులకే నోటీసులు జారీ చేసి వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు. 23 భవనాలకు నోటీసులు.. భద్రాచలం పట్టణంలో 23 శిథిలావస్థ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అందులో 5 ఇళ్లు ఇటీవల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా తొలగించినట్లుగా సమాచారం. మరో 18 భవనాలు అలాగే ఉన్నాయి. పూర్తిగా శిథిలమైన భవనాలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమ ర్శలున్నాయి. ఇవే కాకుండా భద్రాచలం పట్టణంలో పలు చోట్ల పాత భవనాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అధికారులు గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. అలాగే, పాత భవనాలపై కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ పాత భవనంపై నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చి 26న శ్రీపాద శ్రీపతికి చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు భవన నిర్మా ణ కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్ట్ 4వ తేదీన వర్షానికి నాని తాతగుడి సెంటర్లో ప్రహరీ కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. పాత భవనాల పరిస్థితి ఎమిటనేది కూడా తెలుసుకోకుండా అను మతులు ఎలా ఇస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నా యి. సంబంధిత అధికారులు కూడా అనుమతులు ఇచ్చేటప్పుడు ఆయా స్థలాలను పరిస్థితిని పరిశీలించకుండా అంచనావేయడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
బాలుడిని రక్షించిన వైద్యులు
భద్రాచలంఅర్బన్: కరకగూడెం మండలంలో పద్మాపురం గ్రామానికి చెందిన రెండున్నర ఏళ్ల బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ప్రాణాపాయం నుంచి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సారయ్య, నాగమణి దంపతులు తమ కుమారుడు విక్రమాధిత్యను ఓ విషపురుగు కాటేసిందని మంగళవారం సాయంత్రం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండి, నోటి నుంచి నురగలు కక్కుతున్నాడు. కాటేసిన ఆనవాళ్లు లేకపోవడంతో వైద్యులు కొంత సందేహించినప్పటికీ, 8 గంటల పాటు శ్రమించి తేలు, పాము కాటుకు అందించే చికిత్స అందించారు. బాలుడు కోలుకోవడంతో బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేసినట్లు ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలుడిని రక్షించేందుకు కృషి చేసిన వైద్యులు రజశేఖర్రెడ్డి, కై లాష్మోహన్ను ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు. -
నల్ల బ్యాడ్జీలతో ఆలయ ఉద్యోగుల నిరసన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన ఈఓ రమాదేవిపై దాడిని నిరసిస్తూ టీఎన్జీవోస్ డివిజన్ శాఖ, భద్రాద్రి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, వివిధ దేవస్థానాల వైదిక పరిపాలన సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో బుధవా రం తానీషా కల్యాణ మండపం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆలయ భూములను పరిరక్షించడానికి వచ్చిన దేవస్థానం సిబ్బందిపై అభ్యంతరకరంగా మాట్లాడటమే కాకుండా దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, భద్రాద్రి రామయ్య భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు చోటుచేసుకోకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నిరసన కార్యక్రమానికి శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆల య పాలకమండలి సభ్యులు బుధవారం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, ఏఈఓ భవానిరామకృష్ణారావు, రవీంద్రనాథ్, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు, కుసుమ హరినాథ ఆలయ చైర్మన్ యక్కటి శ్రీనివాసరావు సభ్యులు తంబళ్ల కృష్ణార్జున్రావు, పునుగుపాటి సీత, తంగెళ్ల సుజాత పాల్గొన్నారు. భద్రాద్రి ఈఓపై దాడి బాధాకరందక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి భూములు కబ్జా చేయడంతోపాటు అడ్డుకునేందుకు వెళ్లిన ఈఓ రమాదేవి, సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడిపై భక్తితో దాదాపు 900 ఎకరాల స్థలాన్ని ఓ దాత దానం చేశారని, ఇదే విషయంలో గతంలో దేవాలయ గోశాలను కూడా కబ్జా చేస్తూ.. వెళ్లేందుకు దారి మూసివేసిన విషయంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేసిందని గుర్తు చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భద్రాద్రి రాముడి భూముల రక్షణకు ప్రత్యేక కమిటీ వేసిందని పేర్కొన్నారు. కానీ, నేడు కబ్జాదారులు చెలరేగిపోవడం.. ఏకంగా ఆలయ ఈఓ పైనే దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. భద్రాద్రి రాములలోరి అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కాగా, భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవిపై దాడి హేయమైన చర్య అని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే రేగాకు మాతృవియోగం
కరకగూడెం/బూర్గంపాడు: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి నర్సమ్మ (85) బుధవారం తెల్లవారుజామున మండలంలోని కుర్నవెల్లిలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతి సమాచారం తెలియగానే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితరులు కాంతారావును ఫోన్లో పరామర్శించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చందా లింగయ్య, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి, బడే నాగజ్యోతి, లక్ష్మణ్, తుళ్లూరి బ్రహ్మయ్య, చందా సంతోష్కుమార్, నబీ, జాఫర్ హుస్సేన్, గిన్నారపు రాజేశ్, హరిప్రసాద్యాదవ్, చాంద్పాషా, ఉపేందర్ నరసమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా, రేగా కాంతారావును రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఎంపీ హైదరాబాద్ నుంచి వచ్చేలోగా నరసమ్మ అంత్యక్రియలు పూర్తికావడంతో రేగా నివాసంలో ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్ -
సమస్యల ఒడి..!
శిథిల బడి.. చర్ల: మండలంలోని బోదనెల్లి పంచాయతీ పరిధిలోని చింతగుప్ప పూర్తిగా గిరిజనులే నివసించే గ్రామం. దీంతో అక్కడ సుమారు 40 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవీవీకే(గిరిజన విద్యా వికాస కేంద్రం) కోసం భవనం నిర్మించి, ప్రైవేట్ టీచర్లతో బోధన కొనసాగించారు. ఆ తర్వాత జీపీఎస్(గిరిజన ప్రాథమిక పాఠశాల)గా అప్గ్రేడ్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. అయితే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా.. అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరింత దెబ్బతిని స్లాబు పెచ్చులూడి పడుతున్నాయి. 20 మందికి పైగా విద్యార్థులు.. గ్రామంలో 48 కుటుంబాలు ఉండగా ఈ ఏడాది 1 నుంచి 5వ తరగతి వరకు 20 మందికి పైగా విద్యార్థులు జీపీఎస్లో చదువుతున్నారు. శిథిలమైన భవనాన్ని కూల్చాల్సి ఉన్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో స్థానిక అధికారులు అందులోనే బడిని కొనసాగిస్తున్నారు. గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో స్లాబు నుంచి లోపలికి నీరు వస్తుండడంతో పాటు పైపెచ్చులు ఊడి పడుతుండగా విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే తమ పిల్లలు చదువులో వెనుకబడతారనే భయంతో ప్రత్యామ్నాయం వెదుకుతుండగా.. పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి గోడలు నిర్మించకుండా స్లాబు వేసిన ఇల్లు కనిపించడంతో గత వారం రోజులుగా అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు. కాగా, ఐటీడీఏ పీఓ గతేడాది ఈ పాఠశాలను సందర్శించి నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికై నా నిధులు మంజూరు చేసి పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చింతగుప్పలో శిథిలమైన గిరిజన సంక్షేమ పాఠశాల పెచ్చులూడి పడుతున్న స్లాబు.. పిల్లలను పంపేందుకు తల్లిదండ్రుల నిరాకరణ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో తాత్కాలిక నిర్వహణనాలుగైదు ఏళ్లుగా భయపడుతున్నాం పాఠశాల భవనం పూర్తిగా పాడైంది. నాలుగైదేళ్లుగా భయపడుతూనే పిల్లలను బడికి పంపించాం. ఈ ఏడాది మరింత శిథిలం కావడంతో ఇక పంపించొద్దనుకున్నాం. స్లాబు ఎప్పుడు కూలిపడుతుందో తెలియని పరిస్థితి ఉంది. – కాకా నాగేశ్వరావు, చింతగుప్ప ఇల్లు ఇవ్వాలని బతిమిలాడాం మా ఊర్లో బడి పూర్తిగా శిథిలమైంది. పిల్లలను ఇక పంపించొద్దు అనుకున్నాం. అయితే మా బంధువు ఇల్లు కడుతుంటే గోడలు లేకున్నా సరే కొన్ని రోజులు బడికి ఇవ్వాలని కోరాం. ఆయన ఒప్పుకోవడంతో పిల్లలను పంపిస్తున్నాం. ఇకనైనా కొత్త భవనం నిర్మించాలి. – సోడి రమేష్, గ్రామస్తుడు -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
దమ్మపేట: వివాహం జరిగి ఏడాది కూడా నిండకముందే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గండుగులపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన కుంట ఏడుకొండలుకు ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన యతిరాజు కృప (19)కు ఎనిమిది నెలల కిందట పెళ్లి అయింది. కొంతకాలంగా ఏడుకొండులు తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడమే కాకుండా వేరే మహిళతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన కృప.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వీరకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతిబూర్గంపాడు: గత నెల 26వ తేదీన పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సందెళ్లరామాపురం గ్రామానికి చెందిన కారం సందీప్ (16) జూన్ 26వ తేదీన ఇంట్లో పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే, పదో తరగతి పూర్తిచేసిన సందీప్ను పైచదువులు చదువుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో అది ఇష్టం లేని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామాలయంలో చోరీ మణుగూరుటౌన్: స్థానిక పీవీకాలనీలోని రామాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. రోజూమాదిరిగానే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన ఆలయ పూజారి బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసే సరికి హుండీ పగులగొట్టినట్లు గుర్తించాడు. రూ.2 వేల వరకు హుండీలో భక్తుల కానుకలు ఉండొచ్చని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
కేబినెట్ ఆమోదిస్తేనే..
విలీనం జరిగితేనే.. పురుషోత్తపట్నంలో ఉన్న 889 ఎకరాలు తెలంగాణ దేవాదాయ శాఖకు స్వాధీనం చేస్తే.. దేవస్థానం అవసరాలకు తగ్గట్టుగా పంటలు సాగు చేసే అవకాశం స్థానిక రైతులకే ఇస్తామని ఆలయ అధికారులు ఇప్పటికే హామీ ఇచ్చారు. అయినా ఆ భూములు అప్పగించే అంశంపై ఏపీ సర్కారు నుంచి కనీస మద్దతు లేదు. పైగా ‘తెలంగాణ వారికి మా భూములతో సంబంధం ఏంట’నే ప్రశ్నలు సంధిస్తూ అధికారులపై దాడులకు దిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటికై నా దేవస్థానంతో పాటు భద్రాచలంపై ఆధారపడే స్థానిక గిరిజనుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఆలయ భూములు స్వాధీనం చేసుకునే అంశంలోనైనా ఏపీ ప్రభుత్వంపై నలువైపులా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉంది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని ఈ భూముల్లో కొంత భాగమే దేవస్థానం ఆఽధీనంలో ఉండగా, అత్యధిక భూమిని ఏపీకి చెందిన స్థానిక రైతులు ఆక్రమించుకున్నారు. ఆలయ భూముల్లో విఽవిధ పంటలతో పాటు జామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ భూములు తమవేనని స్థానిక రైతులు.. కాదు దేవస్థానానివేనని ఆలయ వర్గాల నడుమ కొన్నేళ్లుగా వివాదం నడిచింది. చివరకు ఈ భూములు ఆలయానికి చెందినవేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీంతో భూముల స్వాధీనానికి ప్రయత్నించిన ప్రతీసారి ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. ఈ క్రమంలో ఆలయ భూముల్లో జరుగుతున్న నిర్మాణ పనులు అడ్డుకునేందుకు మంగళవారం వెళ్లిన ఈఓ రమాదేవిపై అక్కడి రైతులు దాడి చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య నానుతున్న ఈ సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. డిమాండ్లకే పరిమితం.. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీని తెలంగాణలో ఉంచగా పట్టణ శివారులో ఉన్న గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. దీంతో టెంపుల్ టౌన్గా ఉన్న భద్రాచలం పట్టణానికి స్థల సమస్య ఏర్పడింది. భద్రాచలం ఆలయ భూములతో పాటు ఇక్కడున్న స్థలాల కొరత సమస్యను అధిగమించేందుకు ఏపీలో ఉన్న యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామపంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలనే డిమాండ్ తరచుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వీలు చిక్కినప్పుడల్లా భద్రాచలం సమీపంలో ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీ బలరాంనాయక్ అయితే ఏపీలో కలిసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానమేంటి ? ఏపీలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలనే అంశంపై ఏపీ, కేంద్ర ప్రభుత్వాలతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై రాష్ట్ర సర్కారు తరఫున 11 ఏళ్లుగా కచ్చితమైన రోడ్మ్యాప్ కరువైంది. భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం, అసెంబ్లీలో వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకుని విలీనానికి అనుకూలంగా తీర్మానం చేయడం వంటి పనులపై ఇప్పటి వరకు కనీస చర్చ జరగలేదు. శ్రీరామనవమి ఏర్పాట్లు, గోదావరి వరదల సమీక్ష, ఆలయ భూముల వివాదం వంటి సందర్భాల్లోనే సరిహద్దు గ్రామాల విలీనంపై ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు తప్పితే ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనే స్పష్టత కరువైంది. రామాలయ భూముల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్లోనే భూముల అప్పగింతకు చొరవ చూపని ఏపీ ప్రభుత్వం భద్రాచలం చుట్టూ ఏపీకి చెందిన ప్రాంతమే.. ఐదు పంచాయతీల విలీనమే భూ సమస్యకు పరిష్కారం ఈ అంశంపై కొరవడిన తెలంగాణ సర్కారు కార్యాచరణ -
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
అశ్వాపురం: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలను పరిశీలించి, మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించారు. తరగతి గదిలో కూర్చుని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలు బోర్డుపై రాయించి తెలుగులో అర్థాలు చెప్పేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయం వంటి వాటిపై పిల్లలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలం నేపథ్యంలో వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం చందు, వార్డెన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి సమ్మె పోటు
చుంచుపల్లి : కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమ్మె ఆర్టీసీలో విజయవంతంమైంది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న కార్మికులు ఉదయం నుంచే విధులు బహిష్కరించి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో జిల్లాలో పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు నడిచాయి. భద్రాచలం డిపోలో మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. అక్కడ దాదాపు 70 శాతం సర్వీసులు పూర్తి స్థాయిలో రోడ్డెక్కాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల్లో 10 శాతం బస్సులు మాత్రమే తిప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు ఉదయమే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. అద్దె బస్సుల యజమానులు సైతం పూర్తిస్థాయిలో సమ్మెకు మద్దతు తెలిపారు. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్, ఖమ్మం, ఇల్లెందు, వరంగల్, గోదావరిఖని, మణుగూరు, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇక ఏపీకి చెందిన బస్సు సర్వీసులకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగలేదు. సమ్మెతో నాలుగు డిపోల పరిధిలో దాదాపు రూ.22 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు దమ్మక్క సేవా యాత్రభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఆధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు గిరిజన పెద్దలు, కళాకారుల నృత్యాల నడుమ దమ్మక్క సేవా యాత్ర సాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నుట్లు పేర్కొన్నారు. బీఈడీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో రెగ్యులర్ బీఈడీ కోర్సు(2025–27)లో ప్రవేశానికి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణలోని గిరిజన అభ్యర్థులు అర్హులని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. మొత్తం 100 సీట్లలో మహిళలు, ప్రత్యేక కేటగిరీ వారికి రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో దరఖాస్తులు తీసుకుని, ఆగస్టు 8వ తేదీ వరకు అందజేయాలని, వివరాలకు 89784 77345 నంబర్లో సంప్రదించాలని పీఓ సూచించారు. సింగరేణిలో ఏడుగురు సివిల్ అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఏడుగురు సివిల్ అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ హెచ్ఓడీ ఏజే మురళీధర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీపీపీ డీజీఎం జి.శివప్రసాద్ను మణుగూరు డీజీఎంగా, కార్పొరేట్ విజిలెన్స్ డీజీఎం జి.రాంచందర్ను ఎస్టీపీపీ డీజీఎంగా, మణుగూరు ఏరియా ఎస్ఈ బీవీఎన్ పాత్రుడును ఎస్టీపీపీకి, ఆర్జీ–3 ఏరియా ఎస్ఈ పి.రాజేంద్రప్రసాద్ను కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాకు, కార్పొరేట్ సివిల్ హెచ్ఓడీ (డివైఎస్ఈ) శ్రీనాథ్ను విజిలెన్స్ కార్పొరేట్కు, కార్పొరేట్ సివిల్ హెచ్ఓడీ(ఏఈ) పప్పి ప్రజ్వలను ఇల్లెందు ఏరియాకు, కార్పొరేట్ ఏరియా మేనేజ్మెంట్ ట్రైనీ రామ్చరణ్ను మణుగూరు ఏరియాకు బదిలీ చేశారు. వీరంతా ఈనెల ఈనెల 15వ తేదీ లోగా ఆయా స్థానాల్లో చేరాలని పేర్కొన్నారు. -
ఆధార్ సవరణకు పోటెత్తారు..
సూపర్బజార్(కొత్తగూడెం): ఆధార్కార్డులో సవరణలు ఉంటే బుధ, గురువారాల్లో కలెక్టరేట్లో నిర్వహించే మెగా ఆధార్ క్యాంపునకు రావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్తో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో 21 ఆధార్ సవరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మెగా ఆధార్ క్యాంపునకు అధికారులు ఊహించని స్పందన లభించింది. బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో సహా వేల సంఖ్యలో ఐడీఓసీకి చేరుకున్నారు. వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. వేల సంఖ్యలో ప్రజలు హాజరు కాగా, వందల సంఖ్యలోనే లోపలికి అనుమతించడంతో బయట ఉన్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పనులు మానుకుని వచ్చామని, ఇప్పుడు లోనికి పంపించకపోవడమేంటని నిలదీశారు. భారీగా వచ్చిన ప్రజల నుంచి నిరసన స్వరం వెల్లువెత్తడంతో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, ప్రతీ మండలంలో ఆధార్ సవరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. 17 వరకు మండలాల వారీగా.. కలెక్టరేట్లో నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపునకు విశేష స్పందన లభించిందని, ఈ నేపథ్యంలో ఈనెల 17 వరకు మండలాల వారీగా క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించామని అదనపు కలెక్టర్ వెల్లడించారు. 10, 11వ తేదీల్లో కలెక్టరేట్లో కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, చండ్రుగొండ, మండలాల వారికి శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. 14, 15, 16 తేదీల్లో భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో భద్రాచలం, బూర్గంపాడు చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల వారికి క్యాంపులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే 15, 16, 17 తేదీల్లో దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల వారికి, మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల వారికి ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతీ కేంద్రంలో అవసరానికి తగినన్ని ఆధార్ కిట్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు వేగవంతంగా సేవలందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆధార్ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యూఐడీఐ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ సౌభన్, జిల్లా ఇ– డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఊహించని స్పందనతో అధికారుల ఉక్కిరిబిక్కిరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడిన ప్రజలురేపు రమ్మంటే తిరిగి వెళ్తున్నాం అధిక సంఖ్యలో జనం రావడంతో లోపలికి అనుమతించలేదు. మా బాబు రోహన్రుషికి ఆధార్కార్డు చేయిద్దామని వచ్చాను. మళ్లీ రేపు రమ్మని అధికారులు చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నాం. – బోడా బాబులాల్, పాపకొల్లు, జూలూరుపాడు మండలం -
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
టేకులపల్లి : టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యమని వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్.వి.వేణుగోపాలచారి అన్నారు. బొమ్మనపల్లి, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి సెక్షన్ల వినియోగదారులకు బొమ్మనపల్లి సబ్ స్టేషన్ ఆవరణలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో సమస్యలు పెండింగ్లో లేవని చెప్పారు. రహదారుల వెంట, పొలాల్లో, జన సమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో లూజు వైర్లు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కాపర్లు ట్రాన్స్ఫార్మర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మార్పు, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సత్వరమే పరిష్కరించారు. బాధితుడికి రూ.80 వేల చెక్కు పంపిణీ.. ములకపల్లి మండలం మాధారాం పంచాయతీ రామాంజనేయపాలెం గ్రామానికి చెందిన వేముల కృష్ణమూర్తికి చెందిన ఆవు గతేడాది ఏప్రిల్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందింది. కాగా, కృష్ణమూర్తి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటినా పరిహారం అందలేదని సదస్సులో వినతిపత్రం అందించగా వెంటనే స్పందించిన ఎస్ఈ మహేందర్.. రూ.80 వేల చెక్కును బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో ఫోరం సభ్యులు కె. రమేష్, ఎన్. దేవేందర్, ఎం. రామారావు, డీఈ రంగస్వామి, ఏడీఈ హేమచందర్రావు, ఏఈలు దేవా, బుజ్జికన్నయ్య, రాఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాల చారిపారిశ్రామిక వినియోగదారులకు మెరుగైన సేవలు.. పాల్వంచ: పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్ఈ జి.మహేందర్ అన్నారు. నవభారత్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు సరఫరా వ్యవస్థలో పవర్ ఫ్యాక్టర్ అంశాలు, దాని ప్రభావాలు, మెరుగుదల పద్ధతులు, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, అన్ బ్లాక్ తొలగించడం వంటి వాటిని వివరించారు. కార్యక్రమంలో సింగరేణి, ఐటీసీ, నవభారత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యపై పట్టు సాధించాలి
మణుగూరు రూరల్ : విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ విద్యపైనా పట్టు సాధించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని బాపూజీనగర్ ఎంపీపీఎస్లో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ప్రయోగశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు విద్య గొప్ప ఆయుధంలా పని చేస్తుందన్నారు. అనంతరం భవిత కేంద్రంలో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, బోధన సామగ్రిని పరిశీలించారు. దివ్యాంగ పిల్లలకు చక్కని బోధన అందించాలని సమ్మిళిత విద్య రిసోర్స్ పర్సన్లకు సూచించారు. జిల్లాలోని 17 మండలాల్లో భవిత కేంద్రాలకు అనుమతులు మంజూరయ్యాయని, ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 14న నవోదయ ప్రారంభం.. కరకగూడెం: కరకగూడేనికి మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. బుధవారం ఆయన కరకగూడెం జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు రావడం అదృష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఎంఓ సైదులు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓలు జి స్వర్ణజ్యోతి, వీరస్వామి, మంజుల, సాంబాయిగూడెం కాంప్లెక్స్ హెచ్ఎం ఎం.శ్రీలత, ఎమ్మార్పీలు ఎం. విష్ణు, పి. బాలరాజు, పి. రామకృష్ణ, కె. రాంబాబు, ఐ. బాలాజీ, ఐ. రమేష్, టి శ్రీకాంత్, పాఠశాల హెచ్ఎం బ్రహ్మయ్య, బి.విజయ, ఏఏపీసీ చైర్మన్ ఉత్తమకుమారి, సమ్మిళిత రిసోర్స్ పర్సన్లు నాగశ్రీ, శ్యామ్ పాల్గొన్నారు.డీఈఓ వెంకటేశ్వరా చారి -
సింగరేణిలో సమ్మె సక్సెస్
● స్వచ్ఛందంగా పాల్గొన్న 80 శాతం మంది కార్మికులు ● నైట్ షిఫ్ట్ కార్మికులతో ఓసీల్లో పని చేయించిన యాజమాన్యం ● యార్డ్కోల్ను ఉత్పత్తిగా చూపిన అధికారులు సింగరేణి(కొత్తగూడెం): నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సంస్థవ్యాప్తంగా గల 11 ఏరి యాల్లోని గనులు, డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యవసర విభాగాలకు చెందిన 20 శాతం మినహా మిగిలిన 80 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం 18 ఓసీల్లో రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీయాల్సి ఉండగా పూర్తిగా స్తంభించినట్టు సమాచారం. కాగా, యాజమాన్యం మంగళవారం రాత్రి షిఫ్ట్కు హాజరైన కార్మికుల(ఆపరేటర్ల)తో బుధవారం కూడా పనులు చేయించింది. అంతేకాక సమ్మెతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి స్థానంలో వర్షాకాలం దృష్ట్యా నిల్వచేసిన యాడ్కోల్ను చూపిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమ్మె సందర్భంగా కొత్తగూడెంలో ఐఎఫ్టీయూ, జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. హెడ్డాఫీస్కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకున్నారు. ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్కోడ్లను తీసుకురావడం, 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. -
రెండేళ్ల బాలుడికి పాముకాటు
కరకగూడెం: ఓ మహిళ పొలం పనులకు వెళ్తూ తన రెండేళ్ల మనవడిని వెంటబెట్టుకెళ్లగా ఆ చిన్నారిని పాముకాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఊకే సారయ్య – నాగమణి దంపతుల కుమారుడు విక్రం ఆదిత్యను మంగళవారం ఉద యం ఆయన నాయనమ్మ పొలం పనులకు తీసుకెళ్లింది. సమీపాన బాబు ను పడుకోబెట్టి ఆమె పనుల్లో నిమగ్నం కాగా చిన్నారిని పాము కాటు వేయడంతో నురగలు కక్కుతూ స్పృహకోల్పోయాడు. దీంతో స్థానికుల సహకారంతో కారు లో పినపాక పీహెచ్సీకి తీసుకెళ్లగా వైద్యాధికారులు దుర్గా భవాని, కారం మధు చికిత్స చేశారు. ఆతర్వాత 108 వాహనంలో మణుగూరు ఆస్పత్రికి అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స చేస్తున్నారు. అయితే, బాలుడి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని సమాచారం. మద్యం మత్తులో పురుగులమందు తాగి వ్యక్తి మృతి ములకలపల్లి: మద్యం మత్తులో పురుగులమందు సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మొగరాలగుప్ప గ్రామానికి చెందిన రాములమ్మకు, కొమ్ముగూడెంనకు చెందిన గడ్డం భద్రం (57)తో వివాహం కాగా.. ఇల్లరికం వచ్చి మొగరాలగుప్పలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భద్రం రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. పలుమార్లు కుటుంబీకులు మద్యపానం ఆపేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ నెల 5వ తేదీన అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన భద్రం.. భార్య రాములమ్మ అన్నం తెచ్చేలోగానే ఇంటి వెనుకకు వెళ్లి, పురుగలుమందు డబ్బాను మద్యం బాటిల్గా భావించి సేవించాడు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలి
భద్రాచలంటౌన్: గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజల రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేయా లని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు. సుభాష్నగర్, కూనవరం రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట స్లూయిస్ పనులు, విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిస్లను పీఓ బి.రాహుల్తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. గోదావరి వరద హెచ్చుతగ్గులతో ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు, అన్నదాన సత్రం, పట్టణంలోని డ్రెయినేజీలు నిండిపోయి వరద నీరు రోడ్డుపైకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచిచారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఈసారి వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంత, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీసీతారామ క్లబ్లో రూ.5 లక్షలతో నిర్మించిన టాయిలెట్ల సముదాయాన్ని ఎమ్మెల్యే, పీఓ ప్రారంభించారు. -
ఐదుగురిని వరించిన డాక్టరేట్
ఇల్లెందురూరల్: మండంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురికి డాక్టరేట్ వచ్చింది. వరంగల్లో జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, వీసీ ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఒక ఉపాధ్యాయుడు, నలుగురు అధ్యాపకులు డాక్టరేట్ అందుకున్నారు. సుభాష్నగర్ ఉన్నత పాఠశాల పీడీ కె.రఘు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అధ్యాపకుడు ఎం.వెంకటేశ్వరరావు, రాజనీతిశాస్త్రం అధ్యాపకుడు ఎం.రాజు, తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చరిత్ర అధ్యాపకుడు జి.శేఖర్ డాక్టరేట్ అందుకోగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, ఎంఈఓ ఉమాశంకర్ తదితరులు అభినందించారు. -
మాకూ కావాలి..
బెంగాలీ కూలీ.. పినపాక: పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు కూలీలు వలస వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు. పొలాల దగ్గరే గుడారాలు వేసుకుని ఉంటూ.. ఇక్కడి కూలీలతో పోలిస్తే తక్కువ తీసుకుంటూ పని పూర్తి చేస్తున్నారు. అయితే, వీరు నాట్లు వేసే విధానం ఎంతో మేలు చేకూర్చుతోందని రైతులు చెబుతున్నారు. వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి వరి నాట్లు వేస్తుండటంతో రోజురోజుకూ వారికి డిమాండ్ పెరుగుతోంది. రైతులు బెంగాలీ కూలీలతో పనిచేయించుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఉపయోగాలు ఇవీ.. విత్తనాలు తక్కువ పడతాయని, నారు వృథాగా పోదని, ఎకరాకు 15 కేజీల వడ్లు సరిపోతాయని, రెండు బస్తాల దిగుబడి ఎక్కువగా వస్తుందని, పద్ధతిగా లైను కట్టినట్టు వేస్తారని, కలుపు మందుల ఖర్చు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. నాటు వేసే విధానం బెంగాలీ కూలీలు నాటు వేసేటప్పుడు దారాలతో లైన్లు చూసుకుంటూ ఒక పద్ధతిలో వేయడంతో ఖర్చు తగ్గుతోంది. లైన్కు లైన్కు మధ్యలో గ్యాప్ చూసుకుంటూ నాట్లు వేయటం వల్ల వెలుతురు, గాలి సోకి పురుగు రాదు. దీంతో పురుగు ముందులు ఒకటి – రెండు సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. వారు ఎకరాకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు తీసుకుంటారు. రవాణా ఖర్చు ఉండకుండా పొలాల దగ్గరే గుడారాలు వేసుకొని ఉంటారు. ఇక్కడి కూలీలు రూ.5 వేల వరకు తీసుకోవడంతోపాటు రవాణా ఖర్చు కూడా ఉంటుంది. కానీ, బెంగాలీ కూలీలతో ఎకరాకు రూ.6 వేల వరకు కలిసి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తెలిపారు. ఏటా 80 నుంచి 100 మంది వచ్చి నాట్లు వేసి వెళ్తుంటారు. అక్కడి కూలీలతో చకాచకా వరి నాట్లు పొలాల దగ్గరే గుడారాల్లో నివాసం పని పూర్తయ్యాక మరోచోటికి.. అక్కడ పనిలేక ఇక్కడికి వలస పెరుగుతున్న డిమాండ్ -
20 మందిపై కేసు
పాల్వంచరూరల్: భూమిని అక్రమంగా చదును చేస్తున్న 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన గొల్లమారి రత్నారెడ్డికి మండలంలోని రెడ్డిగూడెంలో భూమి ఉంది. అందులోకి మంగళవారం వేపలగడ్డ గ్రామానికి చెందిన మోరే రవి, అశ్వాపురం మండలం వెంకటాపురంవాసులు కొందరు ప్రవేశించి భూమిని చదును చేస్తున్నారని భూ యజమాని ఫిర్యాదు చేశా డు. 20 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కాగా, సాగు లో ఉన్న ఆదివాసీలు, నిరుపేద రైతులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా గిరిజనులు రెడ్డిగూడెం శివారులోని భూమి వద్ద, తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించడం తగదని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది మందిపై కేసు పాల్వంచరూరల్: భూ వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేయగా పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మండలంలోని నాగారంకాలనీకి చెందిన సపావత్ సరస్వతి తన భూమిలో అక్రమంగా ప్రవేశించారని భూక్యా భద్రుతో ఈనెల 5వ తేదీన వివాదం జరిగింది. మంగళవారం భూక్యా భద్రు, గుగులోతు రమేశ్, విజయ, జి.ధన్సింగ్, రాములు తనపై దాడి చేశారని సరస్వతి ఫిర్యాదు చేయగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తమఫై దాడి చేశారని విజయ ఫిర్యాదు చేయగా సరస్వతి, వెంకటేశ్వర్లు, మోతీలాల్, దగ్మా, సంధ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
కిన్నెరసాని జలాలు కలుషితం!
● కేటీపీఎస్ డ్రైయాష్ను బయటకు వదులుతున్న అధికారులు ● కిన్నెరసాని ఉప నదిలో కలుస్తున్న బూడిద ● పర్యావరణానికి, జీవరాశులకు తీరని ముప్పు పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వల్ల నిత్యం వెదజల్లే జల, వాయు కాలుష్యంతో చుట్టు పక్కల ప్రాంతాలు కలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని ఒక రకంగా రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తున్నారు. అయితే, విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో కర్మాగారం నుంచి వెలువడే వాయు కాలుష్యం ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుండ గా మరో వైపు జల కాలుష్యం మరింత ఆందోళన కలిస్తోంది. ఇప్పటికే కాలుష్యం వల్ల గాల్లో అనేక కాలుష్య ఉద్గారాలు కలిసిపోతున్నాయి. దీంతో అనేక రకాల ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీ వలి కాలంలో యాష్ పాండ్కు వెళ్లాల్సిన డ్రై యాష్ ను అధికారులు కిన్నెరసాని వాగులో కలిసేలా చేస్తూ జలకాలుష్యానికి తెరలేపడం తీవ్రంగా కల వరం రేపుతోంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా కిన్నెరసాని జలాలను కలుషితం చేస్తున్నా కా లుష్య నియంత్రణ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అధిక మొత్తంలో బూడిద విడుదల కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో 1000 మెగా వాట్లు, 7వ దశ కర్మాగారంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకు గాను సింగరేణి బొగ్గును మండించడం ద్వారా అధిక మొత్తంలో బూడిద వెలువడుతోంది. బాయిలర్లో బొగ్గు మండించడం ద్వారా ఫ్లైయాష్, డ్రైయాష్ వెలువడుతోంది. ఫ్లైయాష్ను సైలో ద్వారా యాష్ ట్యాంకర్లలో నింపి బయటకు పంపిస్తుంటారు. ఇక డ్రైయాష్ను యాష్ పాండ్ (బూడిద కట్ట)కు తరలించాల్సి ఉంటుంది. యాష్ పాండ్లో నిల్వ అయి న బూడిదను లారీల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు పంపిస్తుంటారు. కాగా 5, 6 దశల కర్మా గారంలో డ్రైయాష్ను పైపులైన్ల ద్వారా బూడిదకట్టకు తరలించాల్సి ఉండగా ‘సీ’ గేటు సమీపంలో పైపులైన్ వాల్వు ఓపెన్ చేసి తరచు బూడిద చెర్వు అలుగు నీళ్లలోకి వదులుతున్నారు. ఇలా బూడిద కలిసిన నీరంతా కిన్నెరసాని వాగులో కలుస్తోంది. అలా కలిసిన కిన్నెరసాని ఉప నది నీరంతా గోదావరిలోకి వెళ్తోంది. యాష్ పాండ్లు నిండకుండా ఇలాఅడపాదడపా అధికారులు నిబంధనలకు విరు ద్ధంగా బయటకు వదులుతుండటం వల్ల స్వచ్ఛ జలాలు కాస్తా కలుషితంగా మారిపోతున్నాయి. ముప్పు ఎంతో.. ఈ అలుగు నీటిని చుట్టు పక్కల ఉండే రైతులు పంట భూములకు వాడుతుంటారు. వర్షాలకు అధిక మొత్తం వరద పోటేత్తితే పంట భూములు సైతం బూడిద నీటితో నిండిపోయి పంట సారం దెబ్బతింటుంది. బూడిద మేటలు వేయడం వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కిన్నె రసాని జలాలు తాగడం వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతేగాక పశువు లు, జీవరాశులకు తీరని ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే ఇక్కడి కాలుష్యం వల్ల అనేక మంది కేన్సర్, శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడు తూ అనేక మంది మృతువ్యాత పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జల కాలుష్యానికి అధికారులు తెరలేపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పలువురు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించి విచారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావును వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, పరిశీలిస్తానని తెలిపారు. -
నీడ కోసం కాదు.. మొక్కల కోసమే.!
జాతీయ రహదారిపై బారులుదీరిన వాహనాలుజాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పచ్చని చెట్ల నీడలో బారులుదీరిన ఈ వాహనాలు నీడ కోసం అనుకుంటే పొరపాటే. అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర్లో రహదారికి పక్కనే ఆయిల్ ఫెడ్కు చెందిన పామాయిల్ మొక్కల నర్సరీ ఉంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ నేపథ్యంలో ఆయిల్పాం తోటల సాగుకు అనుకూల వాతావరణం కావడంతో రైతులు పామాయిల్ మొక్కల కోసం నర్సరీ వద్దకు వస్తున్నారు. అక్కడ మొక్కలు తరలించేందుకు వాహనాలు అధిక సంఖ్యలో రాగా, వాటిలో కొన్ని వాహనాలు మంగళవారం తమవంతు కోసం రహదారిపై ఇలా బారులుదీరాయి. – అశ్వారావుపేటరూరల్ -
కళాశాలలో ఆకస్మిక తనిఖీ
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియ ట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ మంగళవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల తో సమావేశం నిర్వహించారు. అడ్మిషన్లు పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించా రు. డ్రాపవుట్లు లేకుండా చూడాలని, ప్రతీ ఒక్కరూ కాలేజీకి వచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. హాస్టల్ వసతి సమస్యను పరిష్కరించాలని వార్డెన్కు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఏకలవ్య విద్యాలయాల్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమాటిక్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉండగా, గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2024–25లో ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 11న చర్లలోని ఏకలవ్య విద్యాలయంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్కు అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్తో హాజరు కావాలని పీఓ సూచించారు. ఆయిల్పామ్, పండ్ల సాగుపై దృష్టి సారించాలిపాల్వంచరూరల్: రైతులు సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్, పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండలంలోని కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఆమె మొక్కలు నాటి వనమహోత్స వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ ఓ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతు లకు ఉచితంగా మొక్కలు అందించడమే కాక నిర్వహణ ఖర్చులు కూడా ఉపాధిహామీ పథకం ద్వారా లభిస్తున్నందున ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఓ పోరండ్ల రంగా, కార్యదర్శి శ్రీనివాస్తో పాటు కొత్వాల శ్రీనివాసరావు, బరపటి వాసు దేవరావు, కొండం వెంకన్న పాల్గొన్నారు. బీటీపీఎస్ను సందర్శించిన జెన్కో డైరెక్టర్మణుగూరు రూరల్: మండల పరిధిలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను జెన్కో డైరెక్టర్(థర్మల్) వై. రాజశేఖర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ప్లాంట్లోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రోజు వారీ విద్యుత్ ఉత్పత్తి వివరాలను సీఈ బిచ్చన్న ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి చేపట్టాల్సి న చర్యలపై పలు సూచనలు చేశారు. -
పంట చేలల్లోకి వన్యప్రాణి సాంబారు
చండ్రుగొండ: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడు శివారు కనకగిరి అటవీప్రాంతం నుంచి పంట చేలల్లోకి ఓ వన్యప్రాణి మంగళవారం వచ్చి మృత్యువాత పడింది. రైతుల కథనం ప్రకారం.. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పరుగులు తీస్తున్న ఓ వన్యప్రాణిని కొందరు రైతులు గమనించారు. మనుషుల్ని చూసిన ఆ జీవి పొలం ఫెన్సింగ్లో చిక్కుకుంది. అప్పటికే గాయలపాలై అచేతనంగా ఉన్న ఆ ప్రాణి చూస్తుండగానే కుప్పకూలి తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న బేస్క్యాంప్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వన్యప్రాణి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజర్ ఎల్లయ్యను వివరణ కోరగా వన్యప్రాణి (సాంబారు) అడవి నుంచి బయటకు వచ్చి మృతి చెందిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. పోస్టుమార్టం అనంతరం ఆ ప్రాణిని ఖననం చేస్తామని తెలిపారు. జనాల్ని చూసి బెదిరి ఫెన్సింగ్ తీగల్లో చిక్కుకుని మృత్యువాత -
హక్కుపత్రాలు లేవు.. సాగు చేయొద్దు
ఇల్లెందు: సింగరేణి భూనిర్వాసితుడు, ఇల్లెందుకు చెందిన సుందర్లాల్లోధ్కు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారుల నుంచి మరోమారు చుక్కెదురైంది. ఓసీ ఏర్పాటులో ఆయన 50 ఎకరాల మేర భూమి కోల్పోగా నెలల తరబడి నిరసనల అనంతరం గత ఏడాది ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యా మ్నాయంగా భూమి చూపించారు. కారేపల్లి బైపాస్లోని సోలార్ ప్లాంట్ ఎదుట భూమిలో సాగుకు సిద్ధం కాగా మంగళవారం సెక్యూరిటీ విభాగం ఉద్యోగులు రాజేశ్, కామరాజు అడ్డుకున్నారు. హక్కు పత్రాలు లేనందున సాగు చేయడానికి అనుమతించబోమని తెలిపారు. దీంతో సుందర్లాల్ కుటుంబం మరోమారు ఎమ్మెల్యే కనకయ్యను ఆశ్రయించేందుకు సిద్ధమైంది. -
ఫైన్ కడితే.. లైన్ క్లియర్
2022లో సీతమ్మ సాగర్ నిర్మాణ పనులు ప్రారంభం ● అనుమతి లేకుండా పనులేంటని ఎన్జీటీ ఆగ్రహం ● తక్షణమే నిలిపేయడంతో పాటు రూ.53.41 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశం ● జరిమానా చెల్లింపునకే ప్రభుత్వం మొగ్గు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు చేపట్టింది. ఈ క్రమంలో సీతమ్మ సాగర్ పేరుతో గోదావరిపై బరాజ్ నిర్మిస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఆ వెంటనే వివిధ ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మిస్తున్నారని, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయని భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు 2022 డిసెంబర్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చైన్నె బెంచ్ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2023 ఏప్రిల్ 26న ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. డీపీఆర్కు లైన్ క్లియర్.. సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు ఈ బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)కు కూడా అనుమతులు లేవు. దీంతో గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 ఆగస్టు నుంచి ప్రయత్నించగా ఈ ఏడాది ఏప్రిల్ 24 నాటికి డీపీఆర్కు ఎకనామిక్ ఫీజుబులిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం లభించాయి. ఇక పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కూడా సాధిస్తే సాంకేతిక చిక్కులన్నీ తొలగిపోయినట్టే. అయితే ఈ పర్మిషన్లు రావాలంటే ముందుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఎదురైంది. అప్పీల్పై యూటర్న్.. సీతారామకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత రూ. 53.41 కోట్ల జరిమానాపై అప్పీల్కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే అప్పీల్కు వెళ్లడం ద్వారా ఒనగూరే ప్రయోజనం కంటే విలువైన సమయం వృథా అవుతుందనే భావనతో ప్రభుత్వ పెద్దలు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్జీటీ విధించిన జరిమానా చెల్లించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరితగతిన ఎన్జీటీకి జరిమానా చెల్లించి ఆ వెంటనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు సాధించడంపై సర్కారు దృష్టి సారించాల్సి ఉంది. ఈ పనులన్నీ రాబోయే రెండు, మూడు నెలల్లో జరిగితేనే, ఈ ఏడాది చివరి నాటికి బరాజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. లేదంటే మరో ఏడాది వృథా కానుంది. ఇప్పటికే బరాజ్ నిర్మాణ పనులు (జలవిద్యుత్ కేంద్రం మినహాయించి) దాదాపు 40 శాతం వరకు పూర్తయ్యాయి. -
కమ్యూనిస్టులతోనే సమస్యల పరిష్కారం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకారేపల్లి: కమ్యూనిస్టులు అండగా నిలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కారేపల్లి మండలం మాధారంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికే పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. పదవులు ఉన్నా, లేకున్నా పేదవారి పక్షాన పోరాడేతత్వం కమ్యూనిస్టులకు ఉంటుందని తెలిపారు. కాగా, డిసెంబర్ 26న సీపీఐ వందేళ్ల వేడుకల ముగింపు సభ ఖమ్మంలో నిర్వహించనున్నామని వెల్లడించారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ విధానాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు భాగం హేమంతరావు, యర్ర బాబు, సీతామహాలక్ష్మి, రావి రామకృష్ణ, ఉంగరాల సుధాకర్, పాపినేని సత్యనారాయణ, బట్టు సంగయ్య, చెన్నంశెట్టి భూషయ్య, దళ్సింగ్, బట్టు సంగయ్య, బి.వీరునాయక్, కొల్లి వీరయ్య, రాయల రామారావు, పోతనబోయిన సహదేవ్, పి.రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణం కల్పించాలి
● పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలి ● డీఈఓ వెంకటేశ్వరా చారి పాల్వంచ: పిల్లలు చదువుకునేందుకు ఇళ్లలో ప్రశాంత వాతావరణం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తల్లిదండ్రులకు సూచించారు. అంతేకాక పిల్లలతో స్నేహ పూర్వకంగా మెలగాలని అన్నారు. స్థానిక వికలాంగుల కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలపై పిల్లలతో చర్చించాలని, హోం, క్లాస్ వర్క్ పూర్తి చేయించాలని కోరారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ అమలు చేయాలని, డిజిటల్ పాఠాల కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు వినియోగించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఎస్కే.సైదులు, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 15న జిల్లా స్థాయి కామిక్ రచన పోటీలు.. కొత్తగూడెంఅర్బన్: ఈనెల 15న జిల్లా స్థాయి ‘కామిక్ రచన’ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీల్లో చదివే 6 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులు పాల్గొనవచ్చని సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు ఉంటాయని, ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని వివరించారు. ఈ మేరకు విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వివరాలకు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ను సంప్రదించాలని తెలిపారు. -
అరకొర వసతులతోనే..
● జిల్లా పరిషత్కు ఏళ్లుగా పక్కా భవనం లేదు ● కొత్త మండలాలదీ అదే పరిస్థితి.. ● కనీస సౌకర్యాలు లేక సిబ్బంది ఇక్కట్లుచుంచుపల్లి : జిల్లా ప్రజా పరిషత్తో పాటు, పలు కొత్త మండల కార్యాలయాలకు సొంత భవనాలు లేక అరకొర వసతుల నడుమే పాలన సాగుతోంది. 2016 అక్టోబర్ 11న ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి జిల్లా కొత్తగా ఏర్పడింది. ఆ సమయంలోనే కొత్తగా మరో ఆరు మండలాలలకూ అవకాశం దక్కింది. దీంతో మొత్తం 21 మండలాలతో కలిసి జిల్లా పరిషత్ వ్యవస్థ రూపొందింది. 2019 జూలైలో తొలిసారి జిల్లా, మండల ప్రజా పరిషత్లకు ఎన్నికలు జరగగా ఆరేళ్లుగా జెడ్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. గతంలో ఉన్న కొత్తగూడెం మండల పరిషత్ భవనం నుంచే జెడ్పీ పాలన సాగిస్తున్నారు. ఇక్కడ సరైన గదులు, సమావేశ మందిరం అందుబాటులో లేక అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇటీవల జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం కోసం స్థలం గుర్తించి పక్కా భవన నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. కొత్త పాలక వర్గాలు వచ్చేలోపైనా జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. కొత్త మండలాలదీ ఆదే పరిస్థితి.. కొత్త జిల్లా ఏర్పాటు సమయంలోనే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం మండలాలు సైతం ఏర్పాటయ్యాయి. ఈ మండల పరిషత్ కార్యాలయాలకూ పక్కా భవనాలు లేవు. గుండాల మండలం నుంచి 10 గ్రామ పంచాయతీలతో ఆళ్లపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. మండల ఆవిర్భావ సమయంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి ఇరుకు గదులు, అరకొర సౌకర్యాల మధ్యే పాలన సాగుతోంది. చండ్రుగొండ మండలంలోని 10 గ్రామ పంచాయతీలను కలిపి అన్నపురెడ్డిపల్లి మండలాన్ని ఏర్పాటు చేయగా.. సాంఘిక సంక్షేమ భవనంలో అరకొర వసతుల నడుమ పాలన కొనసాగుతోంది. పినపాక నుంచి విడిపోయిన కరకగూడెం మండల పరిషత్ను గిరిజన సొసైటీ భవనంలో ఏర్పాటు చేయగా.. నేటికీ అక్కడి నుంచే అధికారులు పని చేస్తున్నారు. చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని పాత ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్లో కొనసాగిస్తుండగా సిబ్బందికి సరైన గదులు, వసతులు లేక ఇబ్బంది తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఏర్పాటు చేయగా, ఇక్కడ కనీసం సమావేశాలకు హాలు కూడా లేకపోవడం గమనార్హం. సుజాతనగర్ మండల పరిషత్ను పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయగా, అక్కడా అరకొర సదుపాయాల నడుమే పాలన సాగుతోంది. మరోసారి ప్రతిపాదనలు పంపుతాం జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం కోసం పాత జిల్లా పరిషత్ పరిధిలోని స్థలాన్ని కేటాయించాం. నిర్మాణ పనులకు రూ.10 కోట్లతో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇంకా నిధులు మంజూరు కాలేదు. మరోసారి ప్రతిపాదనలు పంపాలనుకుంటున్నాం. కొత్త మండలాల పరిధిలో పక్కా భవనాలకు స్థలాలను ఆయా మండలాల అధికారులు చూస్తున్నారు. – డి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ -
‘నవోదయానికి’ తొలి అడుగు
అశ్వాపురం: మండలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరనుంది. నవోదయ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ మేరకు మండల పరిధిలోని బీజీ కొత్తూరులో 30 ఎకరాల ప్రభుత్వ భూమి పత్రాలను తహసీల్దార్ మణిధర్ నవోదయ విద్యాలయ అధికారులకు మంగళవారం అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు నవోదయ విద్యాలయం రాగా, బీజీ కొత్తూరులో ప్రభుత్వ భూమిని గుర్తించడంతో పాటు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడ తిరిగి నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తారా, ఇతర ప్రాంతాలకు తరలిస్తారా అని ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. కాగా, ఎట్టకేలకు భూమి కేటాయింపుతో స్థానికుల కల సాకారం కానుంది. -
పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 6303408458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈఓపై దాడిని ఖండించిన మంత్రి తుమ్మలభద్రాచలంటౌన్ : భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈఓను ఫోన్లో పరామర్శించిన ఆయన.. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కాగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ కూడా ఈఓకు ఫోన్ చేయగా, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేరుగా పరామర్శించారు. ఆలయ ఉద్యోగుల ఖండన.. ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు, తీవ్ర పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరు కండిసింగరేణి కార్మికులకు డైరెక్టర్(పా) పిలుపు సింగరేణి(కొత్తగూడెం): సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్(పీఅండ్పీ) కె.వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెంరాజు కార్మికులను కోరారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. తమ కార్యాలయాల్లో మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లలో ఒక్కటి కూడా సింగరేణికి సంబంధించినది లేదని తెలిపారు. ఇప్పటికే వివిధ కారణాలతో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపులో కొంత వెనకబడి ఉన్నామని, ప్రస్తుతం వర్షాకాలం అయినందున జూలై, ఆగస్టు నెలల్లో ఉత్పత్తికి మరింతగా అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయాలను కార్మికులు గమనించి సమ్మెకు దిగకుండా విధులకు హాజరు కావాలని కోరారు. బాధితుల సమస్యలు పరిష్కరించాలికొత్తగూడెంఅర్బన్: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించాక మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా బాధ్యతగా మెలగాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎస్పీతో పాటు అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. తొలుత డీఎస్పీ రెహమాన్ ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఎస్సైలు పురుషోత్తం, విజయకుమారి పాల్గొన్నారు. -
ఐదు గిరిజన కుటుంబాల వెలి..
● వారికి ఎవరూ సాయం చేయొద్దంటూ కట్టుబాటు ● జిల్లాలోని పాత పూసపల్లిలో అనాగరిక చర్య ● ఏడాదిగా ఇబ్బంది పడుతున్న బాధితులు ఇల్లెందు : ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ కాలంలోనూ అనాగరికం రాజ్యమేలుతోందనడానికి ఈ ఘటన నిదర్శనం. భూపంచాయితీలో తమ మాట వినలేదంటూ ఐదు గిరిజన కుటుంబాలను వెలివేయడంతో పాటు వారికి ఎవరూ సాయం చేయొద్దంటూ నిబంధన విధించారు గ్రామ పెద్దలు. ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్న బాధితులు సీపీఎం నాయకుల సహకారంతో మంగళవారం తమ గోడును బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఇల్లెందు మండలం పాతపూసపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ముడిగె రాములు, ముడిగె సీతమ్మ, ముడిగె సుగుణ, ముడిగె లక్ష్మీనారాయణ, ముడిగె సత్యనారాయణకు అదే కులానికి చెందిన కుంజా రాంబాబు కుటుంబంతో భూ వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో గ్రామంలో పంచాయితీ పెట్టించగా స్థానిక పెద్దలు వర్సా అవినాష్, సూర్నబాక వెంకటనారాయణతో పాటు మరో 15 మంది కుల పెద్దలు రాంబాబు కుటుంబానికి అనుకూలంగా ఏకపక్ష తీర్పు చెప్పారని బాధితులు తెలిపారు. ఈ తీర్పును తాము వ్యతిరేకించడంతో ముడిగె కుటుంబాలకు చెందిన తమను గ్రామం, కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో ఏడాది కాలంగా తమను గ్రామంలో ఏ పనికీ పిలవడం లేదని, నెల క్రితం తమ కుటుంబంలో ఓ మహిళ మృతి చెందితే కడసారి చూపునకు కూడా ఎవరూ రాలేదని వాపోయారు. దహన సంస్కారాల్లో సహకరించేందుకు పక్కనున్న మిట్టపల్లి గ్రామం నుంచి కొందరు వస్తే వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని, గ్రామంలో ఉపాధి హామీ పనులకు కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ తమ ఐదు కుటుంబాలతో గ్రూప్ ఏర్పాటుచేసి పని కల్పించారని చెప్పారు. తమ కుటుంబంలోని ఓ చిన్నారిని పాఠశాలకు వెళ్లేందుకు ఆటో కూడా ఎక్కించుకోకుంటే తల్లిదండ్రులే ప్రతి రోజూ తీసుకెళ్తున్నారని, మహిళలకు డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని వెల్లడించారు. బూర్జువా పాలన సాగుతోంది.. పాతపూసపల్లి గ్రామంలో బూర్జువా పాలన సాగుతోందని సీపీఎం, గిరిజన సంఘం నాయకులు వజ్జా సురేష్, కొడెం బోసు, మన్నెం మోహన్రావు అన్నారు. ఏడాది కాలంగా ఐదు కుటుంబాలను హింసించడం దుర్మార్గమని, ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ విషయమై బాధితులు ఎస్సై హసీనాను కలవగా, ఆమె పిలిపించి మాట్లాడినా గ్రామ పెద్దలు వినలేదని సమాచారం. -
మునగ తోట.. లాభాల బాట
● పత్తి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేయండి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి : మునగ తోటలు సాగు చేసి లాభాల బాట పట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండాలో సాగు చేసిన మునగ తోటను మంగళవారం ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు గాంధీని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తి గల రైతులంతా మునగ సాగు చేయాలని సూచించారు. పత్తి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేయొచ్చని చెప్పారు. మునగ కాయలు, ఆకులతో పాటు ఎండిన విత్తనాలతో కూడా అధిక ఆదాయం వస్తుందని వివరించారు. రైతులు బయోచార్ కోల్ తయారు చేసుకోవాలని, అందుబాటులో ఉన్న కలపను ‘వి’ ఆకారంలో తీసిన గొయ్యిలో వేసి కాల్చాలని, తద్వారా వచ్చిన బొగ్గును గో మూత్రంలో కలిపి ఎరువుగా వినియోగించాలని సూచించారు. ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఇంకుడు గుంతలు నిర్మించేలా చూడాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ బి.మల్లేశ్వరి, ఎంపీఓ జక్కుల గణేష్ గాంధీ, ఏఓ అన్నపూర్ణ, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రవికుమార్, ఈసీ తిరుపతయ్య, కార్యదర్శి రాజశేఖర్, సీసీలు శ్రీలత, సునీల్, టీఏ సురేష్, ఎఫ్ఏ సాగర్, ఏఈవో భాగ్యశ్రీ పాల్గొన్నారు. పిల్లల సంరక్షణ అందరి బాధ్యత.. సూపర్బజార్(కొత్తగూడెం): పిల్లల సంరక్షణ అందరి భాధ్యత అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక రహిత జిల్లాగా మార్చేందుకు కోళ్లఫామ్లు, ఇటుక బట్టీలు, షాపింగ్ మాళ్ల వంటి చోట తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయో నివేదిక అంజేయాలని ఆదేశించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలన్నారు. అనంతరం చైల్డ్ హెల్ప్లైన్ 1098 వాల్పోసర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ జయలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీడబ్ల్యూఓ లెనీనా, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఐటీ కోర్ సీఐ రాము పాల్గొన్నారు. కాగా, ఈనెల 9, 10 తేదీల్లో కలెక్టరేట్లో నిర్వహించే మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
అధికారులకు నివేదించాం
ఢిల్లీకి చెందిన ఎన్జీఓ సంస్థ రాష్ట్రీయ మహిళా కోష్ రుణాల రికవరీకి సంబంధించిన సమస్య సీరియస్గా ఉన్న మాట వాస్తవమే. సమస్య తీవ్రతను జిల్లా అధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – సంతోష్కుమార్, సెర్ప్ ఏపీఎం 92 కేజీల గంజాయి స్వాధీనందమ్మపేట: మండలంలోని అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న పామాయిల్ క్షేత్రంలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి కథనం ప్రకారం... అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వరరావుకు దమ్మపేట అర్బన్ కాలనీ శివారులో పామాయిల్ తోట ఉంది. సోమవారం వెంకటేశ్వరరావు తోటకు వెళ్లగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి 92 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.46,17,500 ఉంటుందని, ప్యాకెట్లను తోటలో దాచి ఉంచిన ముద్దాయిల కోసం విచారణ చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
రామయ్య భూముల్లో అక్రమంగా నిర్మాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన భూముల ఆక్రమ కొనసాగుతోంది. పట్టణ సరిహద్దులోని ఏపీ పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న దేవస్థాన భూముల్లో కొందరు ఆక్రమణదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ అధికారులు, సిబ్బంది వెళ్లి అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ హైకోర్టు పురుషోత్తపట్నంలోని 889.50 ఎకరాల ఆలయ భూములను దేవస్థానానికి అప్పగించాలని న్యాయస్థానం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీసు అధికారులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోకో పంటకు ఉద్యాన శాఖ రాయితీసూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కోకో పంటకు కూడా ఉద్యానశాఖ రాయితీ లభిస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ తెలి పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పంటకు సెమీ షేడ్ అవసరమైనందున ఆయిల్పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చని సూచించారు. హెక్టార్కు 500 మొక్కలు అవసరమవుతాయ ని తెలిపారు. మొదటి సంవత్సరం హెక్టారుకు రూ.18 వేలు, రెండో సంవత్సరం రూ. 12 వేలు.. మొత్తం రూ.30 వేలు ఉద్యాన శాఖ ద్వారా మంజూరు చేస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అన్నపై తమ్ముడి హత్యాయత్నంటేకులపల్లి: భూవివాదం కారణంగా అన్నపై తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి టేకులపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని మూడు తండాకు చెందిన గుగులోత్ రవి సోమవారం రాత్రి టేకులపల్లి జీపీ ఆఫీసు సెంటర్లోని బేకరీ వద్దకు వెళ్లా డు. ఆయన తమ్ముడు (బాబాయి కొడుకు) గుగులోత్ వినోద్కుమార్ కూడా రావడంతో ఇటీవల విక్రయించిన గుంటన్నర భూమి విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో వినోద్ కత్తితో రవిని బలంగా పొడవగా గాయాలయ్యాయి. ఆపై వినోద్ పారిపోగా, రవిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విష యం తెలియడంతో ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, అదే సమయంలో వినోద్ భార్య అటు వైపు రాగా స్థానికులు దేహశుద్ధి చేస్తుండడంతో ఎస్ఐ ఆమెను పోలీసుస్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా వినోద్కుమార్ కత్తి తీసుకుని సెంటర్కు వెళ్లి తన స్నేహితులతో రవిని పిలిపించి హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఇద్దరి మధ్య రూ.2.50లక్షల నగదు వివాదంతో దాడి జరిగిందని ఇంకొందరు చెబుతున్నారు. అదుపుతప్పి లారీ బోల్తాఅశ్వారావుపేటరూరల్: ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సోమవారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా హాలియా నుంచి కోల్కతాకు బత్తాయి కాయల లోడుతో వెళ్తున్న లారీ వ్యవసాయ కళాశాల వద్ద ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ స్వల్పంగా ధ్వంసం కాగా, దాంట్లో ఉన్న బత్తాయి కాయలు దెబ్బతిన్నాయి. -
విద్యుత్ కోతలపై ఆందోళన
జూలూరుపాడు: అప్రకటిత విద్యుత్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భేతాళపాడు గ్రామస్తులు జూలూ రుపాడు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నరకయాతన పడుతున్నామని అన్నారు. రాత్రి వేళలో ఏ కొద్దిపాటి వర్షం కురిసినా కరెంట్ పోతుందని పేర్కొన్నారు. విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీధర్, మండల కార్యదర్శి యాసా నరేష్లు సంఘీభావం తెలి పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని జూలూరుపాడు విద్యుత్శాఖ ఇన్చార్జి ఏఈ నరసింహారావు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డిబోయిన గోవిందు, శ్రీను, చలమల నరసింహారావు, రెడ్డిబోయిన నవీన్, చౌడం సాయికుమార్, ధరావత్ బాల కిషన్, నాగభూషణం, గుగులోత్ భాస్కర్, బానోత్ సుగుణరావు, వెంకటేష్, రేగళ్ల సీతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
దుగినేపల్లి వాసికి డాక్టరేట్
పినపాక: పినపాక మండలంలోని దుగినేపల్లికి చెందిన పంతగాని చందర్రావు సోమవారం వరంగల్లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టరేట్ అందుకున్నారు. ఫిజిక్స్ విభాగంలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక పత్రానికి డాక్టరేట్ ప్రకటించగా, యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ప్రతాప్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు చందర్రావును అభినందించారు. కాళేశ్వరరావుకు...పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి చెందిన మంత్రి సూర్యప్రకాశ్రావు – సువర్ణాదేవి దంపతుల కుమారుడైన కాళేశ్వరరావు అర్ధశాస్త్ర విభాగంలో డాక్టరేట్ సాధించారు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. భద్రాచలం వాసి మంజులాదేవికి... భద్రాచలంటౌన్: భద్రాచలంకు చెందిన బుడగం మంజులాదేవి ‘సాహిత అకాడమీ అవార్డు విన్నింగ్ నోవెల్స్ – స్టడీ ఆఫ్ సెలెక్ట్ ఇంగ్లిష్ నొవెల్స్‘ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేయూలో సోమవారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నారు. దుమ్ముగూడెం వాసికి బంగారు పతకాలుదుమ్ముగూడెం: దుమ్ముగూడేనికి లంక కనకదుర్గ కేయూ స్నాతకోత్సవంలో చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతు ల మీదుగా మూడు బంగారు పతకాలు అందుకున్నారు. ఎమ్మెస్సీ గణితం పూర్తిచేసిన ఆమె బంగారు పతకాలు అందుకోగా కుటుంబీకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. -
మళ్లీ మొదటికొచ్చిన నిర్వాసితుడి సమస్య
● ఎమ్మెల్యే చొరవతో గత ఏడాది భూకేటాయింపు.. ● సాగును అడ్డుకున్న సింగరేణి అధికారులుఇల్లెందు: సింగరేణి నిర్వాసితుడు, ఇల్లెందుకు చెందిన సుందర్లాల్ లోథ్ భూ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఏడేళ్ల పాటు ఆయన పోరాడగా గత ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే కోరం కనకయ్య హామీ తో భూమి కేటాయించారు. అయితే, సదరు భూమి లో సాగు పనులను సింగరేణి అధికారులు అడ్డుకోవడంతో మళ్లీ సమస్య మొదలైంది. తాతముత్తాల నుంచి సంక్రమించిన భూమిలో సింగరేణి ఓసీ ఏర్పాటు చేసినా తనకు పరిహారం చెల్లించకపోగా, పని కూడా కల్పించలేదని ఇల్లెందుకు చెందిన సుందర్లాల్ ఏళ్ల తరబడి నిరసన తెలిపారు. ఎడ్లబండిపై ఇసుక తీసుకొచ్చి అమ్ముతూ జీవనం సాగించే ఆయన అదే బండికి బ్యానర్లు కట్టి నిరసన కొనసాగించాడు. మూడేళ్ల క్రితం ఎడ్లబండితో ప్రగతిభవన్కు బయల్దేరగా పోలీసులు అడ్డుకోవడంతో బస్సులో వెళ్లి తన ఆవేదన వివరించారు. ఆపై ఓసారి సెల్ టవర్ ఎక్కడం, మరో మారు సుందర్లాల్ కుమారుడు సంజయ్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆపై 2022 డిసెంబర్లో జీఎం కార్యాలయం వద్ద ఎడ్లబండిని నిలిపి ఎద్దులతో మూత్రం పోయించాడని కేసు పెట్టడంతో జరిమానా విధించారు. చివరకు గత ఏడాది ఆగస్టులో సంజయ్ దేశంలో జీవించే అవకాశం లేదంటూ నేపాల్కు పయనమై మార్గమధ్యలో చిత్రీకరించిన వీడియో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే కనకయ్య ఆయనతో ఫోన్లో మా ట్లాడి వెనక్కి రప్పించారు. ఆపై ఇల్లెందు – కారేపల్లి బైపాస్ రోడ్లో సోలార్ ప్లాంట్ ఎదుట ఆరు ఎకరా ల భూమి చూపించగా అందులో సాగుపనులు మొ దలుపెట్టాడు. కానీ సింగరేణి అధికారులు అక్కడ సాగు చేయొద్దని అడ్డుకోవడంతో చేసేదేం లేక సోమవారం ఇల్లెందులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏళ్లనాటి తమ సమస్యకు శాశ్వ త పరిష్కారం చూపించాలని కోరాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ హనుమంతులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికు ల కథనం ప్రకారం.. బొజ్జాయిగూడెం గ్రామపంచా యతీ కొల్లాపురం గ్రామానికి చెందిన ప్రణీత్కుమార్ (24), స్నేహితుడు కుంజ జలమయ్య బైక్పై కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హనుమంతులపాడు గ్రామంలో ఆగి ఉన్న బోర్వెల్ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, జలమయ్య చికిత్స పొందుతున్నాడు. చండ్రుగొండలో ఒకరు..చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం .. మండలంలోని తిప్పనపల్లి తండాకు చెందిన తేజావత్ రమేష్ అలియాస్ గోపి (35) ఆదివారం రాత్రి కిరాణషాపునకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో చండ్రుగొండ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన గోపిని కొత్తగూడెం చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యఇల్లెందురూరల్: అమ్మ డబ్బులివ్వలేదని క్షణికావేశానికి గురై ఓ యువకుడు పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొల్లాపురం గ్రామానికి చెందిన పూనెం వంశీ (23) అతిగా మద్యం తాగుతున్నాడు. సోమవారం డబ్బుల కోసం తల్లితో ఘర్షణ పడి క్షణికావేశంలో ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మహిళా కోష్’తో వణుకు!
● 2006లో ఢిల్లీ ఎన్జీఓ నుంచి రూ. 7 కోట్ల రుణాలు.. ● ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరు ● రుణాల రికవరీకి అక్కడి కోర్టు నుంచి తరచూ నోటీసుల జారీ ● తాజాగా మరోసారి నోటీసు రావడంతో మహిళా సమాఖ్యల ఆందోళనచండ్రుగొండ: మహిళా సమాఖ్యల రుణాల రికవరీపై ఢిల్లీకి చెందిన ఎన్జీఓ రాష్ట్రీయ మహిళాకోష్ సీరియస్గా పావులు కదుపుతోంది. తాజాగా మండల సమాఖ్య బాధ్యులకు శుక్రవారం నోటీసలు రావడంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో మహిళా సంఘాల్లో వణుకు పుడుతోంది. సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళా సంఘాల సభ్యులు మనోవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2006 ఏడాది రాష్ట్రీయ మహిళాకోష్ సంస్థ 14 మండలాల్లో మహిళా సమాఖ్యలకు రూ. 7 కోట్ల రుణాలను మంజూరు చేసింది. చండ్రుగొండ, కొత్తగూడెం, ములకలపల్లి, దమ్మపేట, సత్తుపల్లి, మధిర, వేంసూరు, బోనకల్, చింతకాని, గార్ల, కామేపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, తిరుమలాయపాలెం మండలాల్లో ఒక్కో మండలానికి రూ. 50 లక్షల చొప్పున రుణాలను రెండు విడతలుగా ఇచ్చారు. అప్పట్లోనే సదరు నిధుల నుంచి ఒక్కో గ్రామ సమాఖ్యకు రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుణాలను పంపిణీ చేశారు. 2011 ఏడాది వరకు సక్రమంగానే వాయిదాలు చెల్లించారు. రుణాల నిధుల కేటాయింపు సమయంలో ఎన్జీఓ మండల సమాఖ్య అధ్యక్ష,కార్యదర్శులతోపాటు కోశాధికారిని ఢిల్లీ పిలిపించి వారినే బాధ్యులను చేస్తూ రుణ మొత్తాలను అప్పగించింది. 2011 ఏడాది తర్వాత మండల సమాఖ్యలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉన్న మండల సమాఖ్య బాధ్యుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. దీంతోపాటు అప్పటి ఇందిరాక్రాంతి పథం అధికారులు, సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రీయ మహిళాకోష్ రుణాలు వాయిదాల చెల్లింపులను ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎన్జీఓ అక్కడి మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. 2014 ఏడాది కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు మండల సమాఖ్య మహిళల ఇళ్లకు వచ్చి నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచే కేసు సాగుతూ వచ్చింది. తాజాగా ఢిల్లీకి చెందిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మహిళా సంఘాలకు మరో మారు నోటీసులు జారీ చేశారు. దీంతో సమాఖ్య మహిళలు ఆందోళన చెందుతున్నారు. భారీగా వడ్డీ భారం మహిళా సమాఖ్యలు తీసుకున్న రాష్ట్రీయ మహిళాకోష్ రుణాల వడ్డీ ప్రస్తుతం తడిసి మోపైడెంది. చండ్రుగొండ మండలానికి అప్పట్లో 32 సంఘాలకు రూ. 50 లక్షలు రుణాలు ఇచ్చారు. అందులో 2011 ఏడాది వరకు రూ. 37 లక్షలు తిరిగి చెల్లించారు. అందులో రూ. 13 లక్షల వరకు అసలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వడ్డీతో మొత్తం రూ. 60 లక్షలకు చేరుకుంది. ఇదే పరిస్థితి ఉమ్మడిజిల్లాలోని మిగిలిన 13 మండలాల్లో కూడా నెలకొంది.రికవరీ నిధులు గోల్మాల్ చేశారా? 2011 ఏడాది తర్వాత రికవరీ ఎందుకు ఆగిపోయిందంటే.. ప్రస్తుతం ఉన్న అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. రికవరీ సొమ్మును అప్పటి అధికారులు, సిబ్బంది కాజేశారా ? లేదా గ్రామసమాఖ్యలే కట్టలేదా? అనే విషయం కూడా తేలని పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు కూడా ప్రస్తుతం సెర్ప్ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. -
మావోయిస్టులతో అభివృద్ధికి ఆటంకం
కరకగూడెం: అభివృద్ధికి ఆటంకం మావోయిస్టులేనని జిల్లా అడిషనల్ ఎస్పీ నరేందర్ పేర్కొన్నారు. మండలంలోని రేగళ్ల గొత్తికోయ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ లకు పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మా వోయిస్టులకు సహకరించొద్దని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అనంతరం చిన్న పిల్లలకు పలకలు, పుస్తకాలు, మహిళలకు నిత్యావసర వస్తువులు, యువతకు వాలీబాల్ కిట్లు అందజేశారు. పొలం పనులకు వెళ్లే మహిళలకు ప్లాస్టిక్ రైన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు పాల్గొన్నారు. -
పర్ణశాలలో అభివృద్ధి పనులు
● ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ● కొనసాగుతున్న కాటేజీ, బయో టాయిలెట్ల నిర్మాణందుమ్ముగూడెం: భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం అనుబంధ ఆలయం పర్ణశాలకు ప్రసాద్ పథకంతో మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్(ప్రసాద్) పథకం కింద పర్ణశాల రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. దీంతో కాటేజీల నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం స్లాబ్ లెవల్ వరకు పూర్తయింది. నార చీరల ప్రాంతం వద్ద బయో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి భద్రాచలం ప్రధాన ఆలయానికి అనుసంధానం చేశారు. పనులు పూర్తయితే పర్ణశాల ఆలయంతోపాటు గ్రామ రూపురేఖలు సైతం మారనున్నాయి. రూ.4 కోట్లు కేటాయింపు పర్ణశాల అభివృద్ధికి గతంలో కేటాయించిన నిధులతో నిర్మాణ పనులు జరుగుతుండగా భద్రాచలం ఆలయానికి కేటాయించిన నిధుల్లో మిగిలిన మరో రూ.4 కోట్లను పర్ణశాలకు మళ్లించారు. ఆ నిధులతో ఓపెన్ షెడ్ నిర్మాణం, ఆలయ ఆవరణలో గ్రానైట్ రాయితో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. భక్తులు వేచి ఉండేందుకు, భవిష్యత్లో ఏర్పాటు చేయబోయే అన్నదానం కార్యక్రమానికి అనువుగా మరో రెండు షెడ్లను నిర్మించనున్నారు. గ్రామం చుట్టూ హైమా స్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీ సీతా రామలక్ష్మణులు 14 ఏళ్లపాటు పంచవటీ కుటీరం ఏర్పాటు చేసుకుని వనవాసం చేసిన పుణ్యస్థలం పర్ణశాలలో అభివృద్ధిపనులు సాగుతుడటంతో భక్తు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ సజావుగా పూర్తయితే భక్తుల రద్దీ, ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశంఉంది. వ్యాపారం పెరుగుతుంది.. పర్ణశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు సైతం మంచిగా సాగుతాయి. భక్తులు రాత్రి పూట సేద తీరేలా ఉండేందుకు కూడా నిర్మాణాలు చేపట్టాలి. –గోసంగి నరసింహారావు, పర్ణశాల గ్రామస్తుడు -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పులికాదు.. తోడేలు !పాదముద్రలు సేకరించిన అటవీ అధికారులు పాల్వంచరూరల్ : పాండురంగాపురం – నర్సంపేట పరిసరాల్లో పెద్దపులి సంచారం ఉదంతం వైరల్ కావడంతో పాల్వంచ అటవీ శాఖ రేంజర్ సురేష్, డీఆర్ఓ సిబ్బందితో కలిసి సోమవారం పాండురంగాపురం నుంచి ఉప్పుసాక మార్గంలో పరిశీలించారు. అక్కడ లభించిన పాదముద్రలు నక్క లేదా తోడేలుకు సంబంధించినవని గుర్తించారు. పులి పాదముద్ర అయితే 10 సెం.మీ.వెడల్పు, 14 సెం.మీ. పొడవు ఉంటుందని, ఇక్కడున్న పాదముద్రలు 6 సెం.మీ. వెడల్పు, 7 సెం.మీ.పొడవు మాత్రమే ఉన్నాయని వివరించారు. పరిసర ప్రాంత రైతులు, ప్రజలు కూడా పులి ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారని, పులి సంచారం ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని రేంజర్ సూచించారు. మహిళలంతా ఎస్హెచ్జీలో సభ్యులుగా ఉండాలిడీఆర్డీఓ విద్యాచందన చుంచుపల్లి: జిల్లాలోని ప్రతీ మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని, అవసరమైతే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ ఎం.విద్యాచందన సెర్ప్ సిబ్బందికి సూచించారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త సంఘాల్లో బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి, 2025 – 26 భవిష్యత్ ప్రణాళికను వివరించారు. బ్యాంకు లింకేజీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 101 శాతం ప్రగతి సాధించామని, ఈ ఏడాదిలో 100 శాతం ప్రగతి సాధించాలని అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలను ప్రతీ మహిళ వినియోగించుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫామ్ తయారీ చార్జీలు మొత్తం రూ. 97,98,058 మంజూరయ్యాయని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు జిల్లాలో 9 బస్సులు కేటాయించామని, ఒక్కో బస్సును రూ.36 లక్షల చొప్పున మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ (సెర్ప్) నీలేష్ పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఎప్సెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో గత వారం రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ కౌన్సెలింగ్ మంగళవారం ముగియనుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ చందా సుధాకర్ తెలిపారు. కాగా, సోమవారం 800 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 760మంది హాజరయ్యారని వెల్లడించారు. -
విద్యుదుత్పత్తిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి
పాల్వంచ: విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని టీజీ జెన్కో డైరెక్టర్(థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.లక్ష్మణ్, జనరేషన్ సీఈ పి.రత్నాకర్తో కలిసి కోల్ ప్లాంట్, వ్యాగన్ టిప్లర్, బీఓబీఆర్లో పర్యటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో ఇంజనీర్లకు బదిలీ పాలసీ రూపొందించాలని పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల నాయకులు డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, లక్ష్మయ్యకు వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు భర్తీ చేయాలని, కేటీపీఎస్లో నూతన కర్మాగారం, క్వార్టర్లు నిర్మించాలని, పింఛన్ పాలసీ అమలు చేయడంతో పాటు పీఎల్ఎఫ్ పాలసీ అలవెన్స్ మంజూరు చేయాలని నాయకులు ఉమామహేశ్వరరావు, సంపత్, రాజేష్, రాజబాబు, చంద్రకళాధర్, అరుణ్, నరేందర్, రామారావు, కృష్ణ, అక్బర్, వెంకట్రావు తదితరులు కోరారు. జెన్కో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి -
కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్ !
● ఇంటర్ విద్యార్థులకు నేటికీ అందని వైనం ● పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న బాలికలు ● విద్యాశాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలుకరకగూడెం: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల బాలికలకు విద్యనందించడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు బోధన సాగుతోంది. ఇంటర్ బోర్డు నిర్దేశించిన సిలబస్ను అనుసరించి తెలుగు అకాడమీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ప్రచురితమైన పుస్తకాలను ఇక్కడ బోధిస్తుండగా ఇవి ఇంగ్లిష్ మీడియంలో ఉంటాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంటర్ విద్యార్థినులకు ఇప్పటికీ కొత్త పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో పాత పుస్తకాలతో చదువు కొనసాగిస్తున్నారు. జిల్లాలో పాల్వంచ, టేకులపల్లి, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, ములకలపల్లి, చండ్రుగొండ, భద్రాచలం, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, చర్ల, పినపాక మండలాల్లో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా 1,310 మంది ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు. పేద విద్యార్థినులపై నిర్లక్ష్యమా.. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా కేజీబీవీల్లో ఇంటర్ పుస్తకాలు సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రణాళిక, సమన్వయ లోపంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో నిరుపేద విద్యార్థినులే ఎక్కువగా చేరుతుంటారని, వారి భవిష్యత్తో ప్రభుత్వం ఆడుకోవద్దని కోరుతున్నారు. త్వరలోనే అందజేస్తాం.. కస్తూర్బా విద్యార్థినిలకు పుస్తకాల సరఫరాలో జాప్యం జరి గింది నిజమే. సాంకేతిక కారణాలు, ప్రింటింగ్ ప్రక్రియలో ఆలస్యమైంది. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. త్వరలోనే అన్ని కస్తూర్బా విద్యాలయాలకు పుస్తకాలను అందజేస్తాం. ప్రస్తుతం వారి అభ్యసనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నాం. – అన్నామణి, జీసీడీఓ పుస్తకాలు లేక అర్థం కావడం లేదు పుస్తకాలు లేకపోవడంతో లెక్చరర్లు చెప్పే పాఠాలు సరిగా అర్థం కావడం లేదు. పాఠం చెప్పాక తిరిగి చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి కష్టంగా ఉంది. పాత పుస్తకాలు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. త్వరగా కొత్త పుస్తకాలు ఇవ్వాలి. – ఎం.లావణ్య, ఇంటర్ ఫస్టియర్, కేజీబీవీ భట్టుపల్లి అభ్యసనంపై ప్రభావం.. కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యార్థినులకు పుస్తకాలు అందకపోవడంతో అభ్యసనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాఠాలను అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినడం తప్ప వాటిని తిరిగి సాధన చేయలేకపోతున్నామని బాలికలు అంటున్నారు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో గతేడాది చదివిన విద్యార్థినుల పాత పుస్తకాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వమే త్వరగా పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘మారెళ్లపాడు’ పనుల్లో వేగం పెంచాలి
అశ్వాపురం/భద్రాచలంఅర్బన్/చుంచుపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ‘నేను వచ్చేదాకా పనులపై పర్యవేక్షణ చేయరా.. అంత సమయం లేదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలని ఏడాది క్రితమే చెప్పినా.. ఇంతవరకూ ప్రారంభించలేదని మండిపడ్డారు. ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సోమవారం వచ్చిన తుమ్మల.. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్పాటిల్తో ఫోన్లో మాట్లాడారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలన్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మలచెరువుకు నీరందించి 16 వేల ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మొదట పినపాక, ఆ తర్వాత కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు సాగుతున్నాయని వివరించారు. రామాలయ అభివృద్ధి నా చిరకాల వాంఛ.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి తన చిరకాల వాంఛ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో రూ.1.15 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంటల్ర్ లైటింగ్, డివైడర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. మాడ వీధుల విస్తరణకు ఇళ్లు తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించాక మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి భూసేకరణ ముఖ్యమని తెలియగానే.. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.33 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఆగమశాస్త్ర పండితుల సూచనల ఆధారంగా పనులు జరుగుతాయన్నారు. జీవజాతులకు ఉపయోగపడే మొక్కలు నాటాలి.. మనుషులతో పాటు పక్షులు, కోతుల వంటి జీవజాతులకు ఉపయోగపడేలా పండ్ల మొక్కలు విరివిగా నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్పోయిన అటవీ సంపద పునరుద్ధరణకు వనమహోత్సవం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. వాతావరణ సమతుల్యత పరిరక్షణకు మొక్కలు నాటడమే ముఖ్యమని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అన్ని రవాణా మార్గాలకు కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, ఎస్పీ రోహిత్రాజు, నీటిపారుదల శాఖ ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏడాది దాటినా ఎందుకు ప్రారంభించలేదు.. అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం భద్రాద్రి ఆలయ అభివృద్ధే లక్ష్యమని స్పష్టీకరణ అటవీ సంపద పునరుద్ధరణకు కృషి చేయాలని పిలుపుమంత్రి రాకతో హడావిడి .. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు మంత్రి తుమ్మల సోమవారం రావడంతో అధికారులు హడావిడిగా ఆదివారం పనులు ప్రారంభించారు. శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు గడిచినా ఎర్త్వర్క్, బ్లాస్టింగ్ పనులు మాత్రమే చేపట్టారు. పంప్హౌస్ నిర్మాణ ప్రధాన పనులు మొదలే కాకపోవడం గమనార్హం. పొదెం వీరయ్యకు ఆహ్వానమేదీ ?మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించిన వనమహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యను అటవీ శాఖ అధికారులు విస్మరించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో సైతం కనీసం ప్రొటోకాల్ ప్రకారమైనా ఆయనతో పాటు ఎంపీ రఘురాంరెడ్డి ఫొటో పెట్టకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. -
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని అన్నారు. మత్స్య సొసైటీల ఏర్పాటు, ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, పోడు పట్టాల్లో పేర్ల మార్పు తదితర అంశాలపై పలువురు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. గిరిజన దర్బార్లో వచ్చిన ఆర్జీలన్నీ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణ కుమారి, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, ఈఈ హరీష్, రాజారావు, ఆదినారాయణ, చంద్రకళ, భార్గవి, చలపతి, రామ్ కుమార్, మోహన్, స్వాతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
పరిశ్రమల ఊసేది?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాడ జిల్లాలో అంతంతగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకున్న నూతన పారిశ్రామిక విధానం – టీఎస్ ఐ పాస్ ద్వారా లేదంటే ప్రస్తుత ‘ప్రజాపాలన’లో కానీ జిల్లాకు చెప్పుకోదగ్గ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాలేదు. అప్పట్లో హడావిడి.. ప్రతీ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని గత ప్రభుత్వ హయాంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేవని తేల్చేశారు. మిగిలిన మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇల్లెందు మండలం లచ్చగూడెం, అశ్వాపురం మండలం గొందిగూడెం, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. కానీ ఆ తర్వాత ఈ అంశంలో అడుగు ముందుకు పడలేదు. దీనిపై రాజకీయ నాయకుల నుంచి చొరవ లేకపోవడం, జిల్లా అధికారుల వైపున క్రియాశీలత లోపించడంతో కొత్త పరిశ్రమల స్థాపన ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా మారింది. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అనువైన స్థలాలు, బ్యాంకు రుణాలు లేవంటూ కాలం గడుపుతున్నారు. రుణాలు వచ్చేది ఎలా? సారపాక ఐటీసీ, పేపర్ పరిశ్రమ నుంచి వెలువడే కలప గుజ్జు ఆధారంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ(1/70 పరిధిలో లేదు)లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేకం వెలిశాయి. ఇదే తరహాలో సింగరేణి, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలకు అనుబంధంగా మధ్య, చిన్న, కుటీర తరహా పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశముంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించే వీలుంది. అయితే జిల్లాలో అత్యధిక ప్రాంతం 1/70 చట్టం పరిధిలో ఉండడంతో పరిశ్రమల స్థాపన అవసరమయ్యే మూలధనం సమకూర్చుకునే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రుణాల మంజూరుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గిరిజన ప్రణాళిక కావాలి.. ఏజెన్సీ జిల్లాలో పరిస్థితులు, వెనుకబాటుతనంతో పాటు ఇక్కడ అమల్లో ఉండే చట్టాలను అనుసరించి పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఉన్న సహజ వనరులు, ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలు, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్ట్యా ఇక్కడ ఏ పరిశ్రమలు స్థాపించవచ్చనే అంశంపై రోడ్మ్యాప్ సిద్ధం చేయాలి. అలాగే నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చేందుకు ఐటీడీఏతో పాటు గిరిజన సంక్షేమ శాఖలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఇవేమీ లేకుండా మైదాన ప్రాంతాలకు అన్వయించే విధానాలనే వెనుకబాటు తనం, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం ఉండే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అమలు చేయడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఇలా చేయడం వల్లే జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనీస స్థాయిలో కూడా లేకుండా పోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జాడలేని చిన్న, మధ్య తరహా ఫ్యాక్టరీలు మైదాన ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థలాలు కరువు ఏజెన్సీ ఏరియాలో అందని బ్యాంకు రుణాలు జిల్లాలో మందకొడిగా పారిశ్రామిక పురోగతి నిరుపయోగంగా స్థలాలు.. కొత్తగూడెం నగర నడిబొడ్డున వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ గతంలో అనేక మంది లీజుకు తీసుకున్నారు. కొందరు తూతూ మంత్రంగా యూనిట్లు స్థాపించి ఆ తర్వాత మూలన పడేశారు. ఇక జిల్లా కేంద్రం పరిధిలోని రామవరంలో బేరియం ఫ్యాక్టరీ స్థలం నిరుపయోగంగా మారి దట్టమైన అడవిని తలపిస్తోంది. పరిశ్రమల కోసం పక్కన పెట్టి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూముల లెక్క తీస్తే జిల్లా కేంద్రంలోనే కొత్త పరిశ్రమలకు అవసరమైనంత స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడైతే బ్యాంకు రుణాలకు ఇబ్బంది ఉండదు. అయితే ఈ అంశాన్ని కనీసం పట్టించుకునే వారు లేరు. -
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాలు ఉండడంతో కలెక్టర్తో పాటు కొందరు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదు. ఇక మోహర్రం పండుగ, వ్యవసాయ సీజన్ కావడంతో ఫిర్యాదుదారులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. -
రామాలయంలో తొలి ఏకాదశి సందడి
భద్రాచలం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం ఘనంగా జరిపారు. కాగా, ఈ నెల 10న ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గిరిజన ఉత్సవం దమ్మక్క సేవాయాత్రను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. -
పెద్దమ్మతల్లికి జలాభిషేకం
పాల్వంచరూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగ కావడంతో మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు క్యూలైన్ ద్వారా దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్. రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. అమ్మవారికి వెండి తాంబాళం బహూకరణ పెద్దమ్మతల్లి అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్త దంపతులు పొల్కంపల్లి ప్రసాద్, అరుణ రూ.7,116 విలువైన వెండి తాంబాళం బహూకరించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
మంత్రిని కలవకుండా మహిళల అరెస్ట్
కొత్తగూడెంటౌన్: మంత్రిని కలవకుండా తొమ్మిది మంది మహిళలను టూటౌన్ పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాయాబజార్, రుద్రంపూర్లకు చెందిన తొమ్మిది మంది పల్లపు కొమరమ్మ, బండారి లీలావతి, గుంజా నాగమణి, కల్లూరి రేణుకా, ఓర్పు, అనుషా, ఓర్పు రాజేశ్వరి, పల్లపు శారద, బండా ప్రవళిక, పల్లపు శైలజాతోపాటు ఓర్పు వెంకన్న, పల్లపు రాజేష్లు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇవ్వలేదని పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ సమస్య చెప్పుకుందామంటే సీఐ అరెస్ట్ చేసి, వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాగా మంత్రి పర్యటన ముగిశాక పోలీసులు వారిని వదిలిపెట్టారు. -
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు కేటాయించాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యులకు రాజీవ్ స్వగృహ ప్లాట్లు కేటాయించాలని సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సుమారు 3,500 మంది సభ్యులు ఉన్నారని, ఇందులో సగం మందికే ఇళ్ల స్థలాలు వచ్చాయని, మిగతా వారికి రాజీవ్ స్వగృహ ప్లాట్లు నాలుగు బ్లాక్లు టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు కేటాయించాలని తీర్మానించామని అన్నారు. మధ్య తరగతి ఉద్యోగులు టీఎన్జీవోస్లో అధికంగా ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీకి ఎన్నికై న బాలకృష్ణ, జైపాల్ విజయ్కుమార్తో పాటు ఇటీవల పదోన్నతులు పొందిన ఎర్రమల శ్రీనివాసరావు, నాగరాజును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాస్, నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, శ్రీధర్ సింగ్, ప్రకాశరావు, కరణ్సింగ్, తాళ్లూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, ఏలూరి హరికృష్ణ, రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజావాణి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం ఉద యం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటి ల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధి కారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. డ్యామ్, జలా శయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి సౌందర్యాల నడుమ సేదతీరారు. 510 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ. 27,630 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూ రిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,030 ఆదా యం సమకూరి నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐటీఐ విద్యార్థులకు ఎక్స్లెంట్ అవార్డుమణుగూరు టౌన్: ప్రభుత్వ ఐటీఐలో చదువుకు ని ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు పూర్వ విద్యార్థులు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ నుంచి ఎక్స్లెంట్ అవార్డులు అందుకున్నారు. మణుగూరు ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. అవార్డు గ్రహీతలు సమీర్, ద్వారకామైలను అభినందించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారని తెలిపా రు. నేటి నుంచి శిక్షణకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ల నిర్వహణపై రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని, వీటి నిర్వహణపై ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట ఉన్నత పాఠశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ల్యాబ్లో అత్యాధునిక పరికరాలను వినియోగం, ప్రాజెక్ట్లు తయారీ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక విచారణబూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవల ఫా రెస్ట్ అధికారులకు, ఆదివాసీ మహిళలకు మధ్య జరిగిన దాడి ఘటనపై మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిజనిర్ధారణ విచారణ చేపట్టారు. వేదిక ప్రతినిధులు బాధిత ఆదివాసీ మహిళలతో మాట్లాడి పూర్తి వివరా లు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వలస ఆదివాసీ మహిళలపై దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈఘటనపై ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పం దించకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి పోడు సాగుచేసుకుంటున్న వారందరికీ పట్టాలివ్వాలని కోరారు. కొసగుంపు ఘటనపై జ్యుడీషియరీ ఎంక్వైరీ చేయాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొసగుంపులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం, తాగునీటి వసతులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు, ఖాదర్బాబా, జిల్లా అధ్యక్షుడు దాగం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి దిలీప్, రమేష్ బండారి, ఊకే ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కవిత్వంతో సామాజిక చైతన్యం
కొత్తగూడెంఅర్బన్: కవులు తమ కవిత్వంతో సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం రగిలిస్తారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత, ప్రముఖ ప్రజా, ప్రకృతి కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు, రచయితలు ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారని, అలాంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు. ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ సామాజిక ఉద్యమాల యోధుడని పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు, సామాజిక ఉద్యమకారులు, ప్రకృతి ప్రేమికులను అభినందించారు. కాగా జయరాజుతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు, కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్, ఎస్.కె.బాసిత్, కాల్వ దేవదాస్, మొక్కల వెంకటయ్య, వేల్పుల భాస్కర్, ప్రకృతి వైద్యులు సుగుణారావు, కోచైర్మన్ కూసపాటి శ్రీను, బిక్కసాని నాగేశ్వరరావు, ఎర్రా కామేష్, మారపాక రమేష్ కుమార్, శనగ వెంకటేశ్వర్లు, కోచర్ల కమలారాణి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పెరుగుతున్న స్వరం
పుష్కరాల తరుణంలోభద్రాచలం: గోదావరి పుష్కరాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువులో లక్షల కొద్దీ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాత్కాలిక వసతులు, శాశ్వత నిర్మాణాలు, మరుగుదొడ్లు, అన్నదానసత్రాలు వంటివి నిర్మించాలి. కానీ భద్రాచలంలో ఇప్పటికే భూ సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పుష్కరాల అభివృద్ధి పనులకు భూమెక్కడ అనే ప్రశ్న తలెత్తోంది. ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేస్తే 2027 జూలైలో జరిగే పుష్కరాలకు భూ సమస్య తీరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వసతులు పరిమితం.. అద్దెలు అధికం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేవస్థానం కాటేజీలు, వసతి గదులు మాత్రం స్వల్ప స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారాంతపు సెలవు దినాల్లో రూ. వేలల్లో అద్దె వసూలు చేస్తున్నారు. పది వేల మంది భక్తులు వస్తేనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే పుష్కరాల సమయంలో రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తారు. దీంతో వసతి సమస్య జఠిలంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా శాశ్వత, తాత్కాలిక వసతి నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రంలో పుష్కరాల పనులకు భూ సర్వే చేస్తున్నారు. ఐదు పంచాయతీలను కలిపితే భూమి అందుబాటులోకి.. ప్రస్తుతం భద్రాచలానికి మూడు వైపులా కిలోమీటరు పరిధి మించి విస్తీర్ణం లేదు. కానీ ఏపీలో కలిసిన గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాలు ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగానే ఉన్నాయి. రాష్ట్రాలు వేరయినా దైనందిక కార్యక్రమాలు, పనులు భద్రాచలంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపితే భద్రాచలానికి భూమి అందుబాటులోకి వస్తుంది. పురుషోత్తపట్నంలో స్వామి వారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. దీంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. చర్ల రోడ్డులో ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న గుండాల పంచాయతీల్లో అటు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను నియంత్రించవచ్చు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీల విలీన డిమాండ్పై స్వరం మరింత పెరుగుతోంది. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి మా అభిప్రాయం తెలుసుకోకుండా ఏపీలో విలీనం చేసి అన్యాయం చేశారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పార్టీలన్నీ ఏకమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి. రానున్న పుష్కరాల సమయంలో అందరి దృష్టీ భద్రాచలం వైపే ఉంటుంది. పంచాయతీలకు ఇదే సరైన తరుణంగా భావించి ఎంపీలు చొరవ చూపాలి. – బండారు వీరభద్రం, కన్నాయిగూడెం, విలీన గ్రామపంచాయతీ వాసిమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారానే విలీనం పూర్తయ్యే అవకాశం ఉండటంతో పార్లమెంట్ సభ్యుల పాత్రే కీలకం. ఎన్నికల ముందు ఎంపీ బలరాంనాయక్ సైతం ఇదే హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఇతర ఎంపీల సహాయ సహకారాలతో పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తాలని బలరాంనాయక్ను భక్తులు కోరుతున్నారు. నిజామాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను ఇటీవల కలిసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయమై విన్నవించారు. పుష్కరాల తరుణంలోనైనా విలీన పంచాయతీలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. ఏపీ విలీన పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ వసతి, సౌకర్యాలకు భూ సమస్య కూడా తీరే అవకాశం భద్రాచలంలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లకు స్థలం మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు గళమెత్తాలని విన్నపాలు -
క్రీడా పాఠశాలలతో ఉజ్వల భవిష్యత్..
● స్పోర్ట్స్ స్కూళ్లలో చేరేందుకు బాలబాలికల ఆసక్తి ● చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ● గత ఏడేళ్లలో రాష్ట్రస్థాయి పోటీలకు 106 మంది ఎంపిక ● ఏటా జూన్లో మండల, జిల్లాస్థాయి పోటీల నిర్వహణకొత్తగూడెంటౌన్: ‘మాకు క్రికెట్ అంటే ఇష్టం.. ధోనిలా ఆడతాం. పీటీ ఉషలా పరుగెడతాం. గోపీ చంద్, సైనా నెహ్వాల్లా బ్యాడ్మింటన్ ఆడతాం.’ అంటూ చిన్నారులు క్రీడపట్ల ఆసక్తి చూపుతున్నా రు. నచ్చిన క్రీడలను ఎంచుకుని రాణించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొందరు క్రీడా పాఠశాలల్లో చేరి రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేందుకు శ్రమ పడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తుండటంతో తల్లి దండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తోంది. చదువుతోపాటు క్రీడల్లో శిక్షణనిస్తోంది. వివిధ క్రీడా పోటీలకు రాష్ట్రం తరఫున విద్యార్థులను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులు క్రీడా పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా, తల్లిదండ్రులు తోడ్పాటునందిస్తున్నారు. ఏటా జూన్లో ఎంపికలు ప్రతి ఏడాది క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు జూన్లో ఎంపికలు నిర్వహిస్తారు. మూడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగో తరగతిలో అడ్మిషన కల్పిస్తారు. గత నెల 26న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా యు వజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లలో ప్రభుత్వ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 4వ తరగతిలో చేర్చితే, 12వ తరగతి వరకు విద్యాభ్యాసంతో ఫ్రీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్రీడల్లో శిక్షణనిస్తూ వివిధపోటీలకు విద్యార్థులు హాజరయ్యలా చూస్తారు. ఈసారి రాష్ట్రస్థాయి పోటీలకు 20 మంది.. గత జూన్లో జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో ఎంపికలు నిర్వహించారు. 170 మంది చిన్నారులు పోటీ పడగా 20 మంది బాలబాలికలు ఎంపికయ్యారు. వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నారు. ఏ చిన్నారిని పలకరించినా జాతీయస్థాయిలో రాణిస్తామని, పతకాలు సాధిస్తామని చెబుతున్నారు. గత ఏడేళ్లలో జిల్లా నుంచి సుమారు 106 మందికి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018 ఏడాదిలో 20 మంది, 2019లో ఆరుగురు, 2020లో పది మంది, 2022 సంవత్సరంలో 20, 2023 ఏడాదిలో 17 మంది, 2024లో 13 మంది, 2025 ఏడాదిలో 18 మంది ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. -
ఎవరూ నిరాశ చెందొద్దు
కొత్తగూడెంఅర్బన్: భవిష్యత్లో గుడి లేని గ్రామం ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడతలో ఇళ్లు రానివారు నిరాశకు గురి కావొద్దని, రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, చుంచుపల్లి మండలాల లబ్ధిదారులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్ఆర్టీ నగర్, మాయాబజార్ ప్రాంతాల నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతీ సోమవారం ఖాతాల్లో నగదు.. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామని, ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం వడివడిగా సాగుతోందని అన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు, రూ. 500కే వంట గ్యాస్, రేషన్ కార్డుల పంపిణీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, నాలుగు రోజుల క్రితమే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా అందించామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, కొందరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండు సున్న ఖాయమని స్పష్టం చేశారు. పదేళ్లలో రూ. 8.19 లక్షల కోట్ల అప్పు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ 8 లక్షల 19 వేల కోట్ల రూపాలయ అప్పు చేసిందని మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రామవరంలో భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కొత్తగూడెంలో జర్నలిస్టులకు బీపీఎల్ కోటాలో స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. కొత్తగూడెం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల ప్రక్రియను హోల్డ్లో పెట్టారని, దానిని ఎత్తివేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్ విద్యాచందన, నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, మండే వీరహనుమంతరావు, రజాక్, ఆళ్ల మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే విడతల్లో మిగిలినవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా ఖాయం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
లింక్ పంపి.. డబ్బులు చోరీ..
రఘునాథపాలెం: స్మార్ట్ఫోన్ను ప్రతీ ఒక్కరు విరవిగా వాడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ యాప్స్ వాడకం ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు కూడా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే, అమాయక ప్రజలు సైబర్ మోసాల బారినపడుతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తప్పుడు యాప్స్, గిఫ్ట్ లింకులు, ఫేక్ కాల్స్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరాల్లోనే కాక, రూరల్ ప్రాంతాల్లోనూ మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు మొబైల్కు సందేశాల రూపంలో ‘గిఫ్ట్ లభించింది‘, ‘మీకు లాటరీ వచ్చింది‘, లేదా ‘వివరాలు అప్డేట్ చేయాలి‘ అంటూ తప్పుడు లింకులు పంపుతున్నారు. అమాయకులు వాటిని ఓపెన్ చేస్తే, వారి ఫోన్ హ్యాకింగ్కు గురై ఖాతాల్లోని డబ్బులు మాయమవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఒక్క వారం వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు నష్టపోయారు. ఇక పరువు పోతుందని భావించి చాలామంది మోసపోయిన విషయాన్ని బయటపెట్టడంలేదు. కాగా, సైబర్ మోసగాళ్లు మరో పంథాను ఎంచుకుంటున్నారు. ‘మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు.. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేస్తాం’ అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా మోసాలతో భయపడిన కొన్ని కుటుంబాలు డబ్బులు పంపించిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘ఏ సందేశమైనా, యాప్ అయినా డౌన్లోడ్ చేసేముందు తాను ఎవరితో డీలింగ్ చేస్తున్నానో తెలుసుకోవాలి. ఎవరికై నా డబ్బులు పంపేముందు నమ్మదగిన వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవాలి’ అని అధికారులు సూచిస్తున్నారు. సక్రమమైన బ్యాంకింగ్ యాప్ల ద్వారామాత్రమే లావాదేవీలు చేయాలని, గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. ప్రతీ ఒక్కరు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత మేర తెలిసిన వారి ద్వారానే యాప్ల ద్వారా లావాదేవీలు సాగించాలి. వచ్చిన ప్రతి మేసేజ్లను క్లిక్ చేయకుండా తెలియక పోతే తెలిసిన వారికి చూపించిన తర్వాతనే ముందుకు సాగాలి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించి బ్యాంక్ లావాదేవీలను ఆపించాలి. కొత్త వ్యక్తులు పంపే లింక్లను ఓపెన్ చేయొద్దు. ఓటీపీలను చెప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆరా తీయాలి. – ఉస్మాన్షరీఫ్, సీఐ రఘునాథపాలెం -
వణికిస్తున్న విషజ్వరాలు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వల్ప కాలంలోనే జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశాల జారీ చేసినా.. తూతూమంత్రంగా నిర్వర్తిస్తుండడంతో ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి తగ్గడం లేదు. పారిశుద్ధ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మురుగు కాల్వల్లో వ్యర్థాలు, పూడిక తీయక నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతూ సీజనల్ వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా తయారైంది. ఆస్పత్రులు కిటకిట.. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రి ఓపీ 100 నుంచి 200కి పైగా ఉంటుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనూ సాధారణ రోజులో కంటే రెండింతలు ఎక్కువే వస్తున్నారు. ప్రస్తుతం విష జ్వరాలు, డెంగీ వ్యాధులు ప్రబలే కాలం కావడంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యాన గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటా సర్వే చేస్తుండగా జ్వరపీడితులు ఆర్ఎంపీలను ఆశ్రయించడం లేదా జ్వరం తగ్గకపోతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ప్రైవేట్లో దోపిడీ... విషజ్వరాలు ప్రబలడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. యజమానులు, వైద్యులు అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తోంది. ఏజెన్పీ గ్రామాల్లో విషజ్వరాలు పెరిగిపోతుండడంతో స్థానికంగా ఏ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ముఖ్యంగా మెడికల్ మాఫియా జోరు కొనసాగుతోంది. గతంలో డెంగీ, చికెన్గున్యా వ్యాధులకు పరీక్షల పేరిట రూ.1800లు వసూలు చేయగా ఇప్పుడు భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇక సీబీపీ, టైఫాయిడ్, మలేరియా, సీఆర్పీ పేరుతో రూ.2 వేలకు బదులు రూ.800లు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ రేట్లను కొంతమంది మాత్రమే అనుసరిస్తున్నారని, ఇంకొందరు అవసరం లేకున్నా ఇతర పరీక్షలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు ల్యాబ్ల వారితో కుమ్మకై ్క రోగుల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. విషజ్వరాలు విస్తరించకుండా అవగాహన కల్పించాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా పర్యటన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలో విజృంభిస్తున్న దోమలు జిల్లాలో ఇప్పటికే 25 మలేరియా, 9 డెంగీ కేసుల నిర్ధారణ రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పంచాయతీల్లో పడకేసిన పారిశుద్ధ్యంసర్కారు లెక్కలకు పదింతలు తేడా... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకరాం ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మలేరియా, 7 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకు పదిరెట్లు బాధితులు ఉంటున్నారని తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వర పీడితులు భారీగా చేరుతున్నప్పటికీ అధికారుల లెక్కల్లో ఆ కేసులు నమోదు కావడం లేదు. వాటి కూడా పరిగణలోకి తీసుకుంటే కేసుల సంఖ్య భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలు స్తోంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ముందస్తు చర్యలు చేపట్టాం. దోమల నివారణ చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రజలు వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో చూపించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
దుమ్ముగూడెం: మండలంలోని మారాయిగూడెం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్య కారణంగా పత్తిపాక గ్రామానికి చెందిన సోడి లక్ష్మి(45) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మి గత కొంతకాలంగా బీపీతో బాధపడుతూ శుక్రవారం కింద పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా వైద్యం చేసిన సదరు ఆర్ఎంపీ భద్రాచలం తరలించాలని సూచించగా.. వారు అక్కడకు తీసుకెళ్లి చూపించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మంకు రిఫర్ చేయగా.. అంబులెన్స్లో వారితో పాటే సదరు ఆర్ఎంపీ వెళ్లడం.. మార్గం మధ్యలో తరచూ అపుతూ వెళ్లడంతో ఖమ్మం చేరేసరికి ఆలస్యమైంది. అయినా చికిత్స అందించే క్రమానికి మరింత ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందింది. లక్ష్మి మృతికి ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటంబసభ్యులు ఆర్ఎంపీకి దేహశుద్ధి చేసినట్టు తెలిసింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ..ములకలపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. కొత్తగంగారం అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఇలా తెలిపారు. అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కుర్సం అర్జున్రావు(38) స్నేహితులతో కలిసి ట్రాక్టర్పై ములకలపల్లి మండలంలోని పాతగుండాలపాడు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మూత్రవిసర్జన నిమిత్తం ట్రాక్టర్ను కొత్తగంగారం అటవీ ప్రాంతంలో ఆపగా.. అటు వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న అర్జున్రావుతలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్యపద్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి స్వాధీనం పాల్వంచరూరల్: ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి సోములగూడెం వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఎస్సై సురేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో జామాయిల్ తోటలో పాల్వంచకు చెందిన షకీర్, గోపి, జగన్నాధపురం గ్రామానికి చెందిన చరణ్, శ్రీరాంలు అనుమానస్పదంగా సంచరించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో వారి వద్ద ఒరిస్సాలోని బెజంగూడా నుంచి రూ.19వేల విలువ కలిగిన 380 గ్రామాల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బీపీతో గిరిజన మహిళ మృతివ్యక్తి దుర్మరణంనలుగురిపై కేసు నమోదు -
అథ్లెటిక్స్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ కె.మహీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 20 మంది పాల్గొన్నారు. వారిలో కొత్తగూడేనికి చెందిన సీహెచ్ కృతిక కిడ్స్ జావెలిన్ త్రోలో రజత పతకం, కిన్నెరసానికి చెందిన డి.లోకేష్ ట్రయలాన్లో రజత పతకం, కాచనపల్లికి చెందిన వై.శృతిహాసన్ ట్రయలాన్లో రజత పతకం, భద్రాచలానికి చెందిన వి.సంజనశ్రీ 60 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం, కిన్నెరసానికి చెందిన కె.దిలీప్ ట్రయలాన్లో కాంస్య పతకం సాధించారు. విజేతలను జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, కోచ్లు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ తాగిన బాలుడు.. ● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయంకరకగూడెం: మండలంలో ఇటీవల థమ్సప్ బాటిల్లో నిల్వ ఉంచిన గడ్డిమందును తాగి ఒక బాలు డు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మరవకముందే అలాంటిదే మరో ఘటన స్థాని కంగా కలకలం రేపింది. అయితే ఈసారి తల్లిదండ్రుల సకాలంలో స్పందించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన మూడేళ్ల బాలుడు ఆదివారం ఉదయం ఆడుకుంటూ గ్రా మంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఖాళీ స్ప్రైట్ బాటిల్లో నిల్వ ఉంచిన హైడ్రోజన్ పెరాకై ్సడ్ ద్రావణాన్ని చూసి మంచినీళ్లు అనుకుని తాగేసి ఇంటికి వచ్చాడు. ఆతర్వాత కొద్దిక్షణాల్లోనే బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయి వాంతులు, విరేచనాలు చేసుకుంటూ స్పృ హ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంకటే మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించడంతోవారంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు విషపూరిత పదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలని, ముఖ్యంగా మంచి నీళ్లు లేదా కూల్డ్రింక్స్ బాటిళ్లలో రసాయనాలను నిల్వ చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. ‘అబద్ధాలతోనే రేవంత్ పాలన’ఖమ్మంరూరల్: అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎదులాపురం సాయిగణేశ్నగర్లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే భరోసా అని, కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్, కేటీఆర్ను తిట్టటమే రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లో అర్ధరాత్రి వరకు నిలడబడాల్సి వస్తోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని సూచించారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, జర్పుల లక్ష్మణ్నాయక్, కోటి సైదారెడ్డి, ఉదయ్, సొడేపొంగు ప్రశాంత్, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో ఉద్యోగాలు లేవు..ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేవని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఖమ్మం నగర 5వ మహాసభ ఆదివారం నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. సభకు ముందు నగరంలో సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. హేమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యమైందని, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని విమర్శించారు. అలీన విధానానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బీజీ క్లెమెంట్, నగర కార్యదర్శి జానీమియా, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, జ్వాలా నర్సింహారావు, యానాలి సాంబశివారెడ్డి, నూనె శశిధర్, ఏనుగు గాంధీ పాల్గొన్నారు. -
ఉన్నత చదువులకు ‘ఓపెన్’
● పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం ● ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 56 స్టడీ సెంటర్లుఖమ్మంసహకారనగర్: ఓపెన్ స్కూల్ అనేది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఓ వరం లాంటిది. వివిధ కారణాలతో విద్యను అభ్యసించలేకపోయిన వారు, చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు, తమ వయసుతో సంబంధం లేకుండా మళ్లీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదవకాశాన్ని ఇచ్చింది. ఓపెన్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఈ ఓపెన్స్కూల్స్లో చేరేందుకు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2008వ విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధా నం ప్రారంభం కాగా.. అప్పటి నుంచే పదో తరగతి ప్రారంభించారు. 2010–11వ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. 56 కేంద్రాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 56 ఓపెన్ స్కూల్ కేంద్రాలుండగా... అందులో ఖమ్మం జిల్లాలో 25 సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 కేంద్రాలున్నాయి. చిన్నప్పటి నుంచి చదువుకోకపోయినా సరే నేరుగా పదో తరగతిలో చేరే అవకాశం వీటి ద్వారా కలుగుతుంది. వయోజనులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తాము ఉన్నత విద్యావంతులుగా మారేందుకు కృషి చేసుకోవచ్చు. అర్హతలిలా... పదో తరగతిలో చేరాలనుకునే వారికి 31–08–2025 నాటికి 14 సంవత్సరాలు నఉండాలి. ఇంట ర్మీడియట్లో చేరేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. చదివిన తరగతులకు సంబంధించిన టీసీ, బోనఫైడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారు మాత్రం తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 11 వరకు గడువు.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే ఈ నెల11వ తేదీ వరకు దరఖాస్తులు అధ్యయన కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా అపరాధ రుసుం పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్కు రూ.200లతో ఆగస్టు(వచ్చే నెల) 12వ తేదీ వరకు మీ సేవా, ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు పదో తరగతికి జనరల్ పురుషులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీలు, మహిళలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్మీడియట్కు జనరల్ పురుషులకు రూ.1,800, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగులకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి అడ్మిషన్ పొందేందుకు గాను వయస్సు ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీని తెలిపే ఏదైనా పాఠశాల రికార్డు షీట్/టీసీ లేదా మున్సిపల్ అధికారి/ తహసీల్దార్/జిల్లా జన న మరణ రిజిస్ట్రార్ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువపత్రం సమర్పించాలి. వచ్చే నెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉన్న వారు తమ ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు తీసుకెళ్లాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ అదనంగా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త కేంద్రాలివే... ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరుగుతున్న క్రమంలో జిల్లాలో కొత్తగా జెడ్పీహెచ్ఎస్ రఘునాథపాలెం, జెడ్పీహెచ్ఎస్ ఏదులాపురం, జీహెచ్ఎస్ నేలకొండపల్లి, జెడ్పీహెచ్ఎస్ తల్లాడలలో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ కరకగూడెం, అశ్వాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ మిట్టగూడెం, జెడ్పీహెచ్ఎస్ ఆళ్లపల్లి, జీహెచ్ఎస్ టేకులపల్లి, జెడ్పీహెచ్ఎస్ చండ్రుగొండ, జెడ్పీహెచ్ఎస్ ఎర్రగుంట (అన్నపురెడ్డి మండలం), జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీదేవిపల్లిలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సద్వినియోగం చేసుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశం. చదువులు మధ్యలో ఆపేసిన వారు, చదవాలనుకునే వారు ఇందులో అడ్మిషన్ పొందొచ్చు. పది, ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారు ఈ నెల 11 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం ఉన్నత విద్యకు దోహదం ఓపెన్ స్కూల్లో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారున్నారు. అభ్యర్థుల ఆసక్తి మేరకు ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కొత్తగా 11 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అధ్యయన కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. – మద్దినేని పాపారావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గత మూడేళ్లలో అడ్మిషన్లు, ఫలితాలిలా.. ఖమ్మం జిల్లా సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఇంటర్మీడియట్ ఫలితాల శాతం 2022–23 770 26.3 995 48.53 2023–24 789 40.44 881 44.71 2024–25 607 40.44 797 57.93 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2022–23 671 23.66 856 40.48 2023–24 623 32.28 788 50.97 2024–25 538 31.04 728 51.19 -
వృద్ధురాలిని కాపాడిన గజ ఈతగాడు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఓ వృద్ధురాలని ఓ గజ ఈతగాడు కాపాడాడు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతేకాక ఆమెకూ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా.. తన కుమారుడు మరణం తర్వాత తనను ఎవరూ పట్టించుకోవడంలేదని మనస్థాపంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈనేపథ్యాన శనివారం నదిలో దూకగా.. స్థానిక గజ ఈతగాడు ప్రసాద్ గమనించి వృద్ధురాలిని కాపాడాడు. తర్వాత ఆమె బాధను ఈతగాడితో పంచుకోక ఆమెకు భోజనానికి కావాల్సిన నగదును అందజేశాడు.మహిళా రెస్క్యూ టీమ్కు సర్టిఫికెట్ల ప్రదానంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన 13మందితో కూడిన మహిళా జట్టుకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్లో శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. జీఎం(రెస్క్యు) శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఈడీ ఎస్డీ.సుభానీ తదితరులు అందజేశారు. వార్డెన్ బాధ్యతల కోసం పోటాపోటీ పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో వార్డెన్ బాధ్యతల కోసం పలువురు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం రెండు గ్రూపులుగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ పునఃప్రారంభమయ్యాక శంకర్ వార్డెన్ విధులు నిర్వర్తిస్తుండగా, ఈనెల 3న వెంకటేశ్వర్లుకు హెచ్ఎం రామారావు అప్పగించారు. ఇదే బాధ్యతల కోసం పీడీ అంజయ్య పోటీ పడుతుండడంతో సమస్యను డీడీ దృష్టికి తీసుకవెళ్లారు. అయితే, ఈ ఏడాది వెంకటేశ్వర్లునే కొనసాగించాలని కొందరు ఉపాధ్యాయులు తీర్మానం చేసినట్లు సమాచారం. ఇంతలోనే రెగ్యులర్ హెచ్ఎం రామారావు సెలవులో వెళ్లగా ఇన్చార్జ్ బాధ్యతలు శంకర్కు అప్పగించారు. రెండు పశువుల మృతి చర్ల: మండలంలోని కుదునూరుకు చెందిన దొడ్డా వేమయ్యకు చెందిన రెండు ఆవులు, ఒక లేగదూడ శుక్రవారం మేతకు వెళ్లి సాయంత్రం రాలేదు. ఈక్రమాన రాత్రి సమయాన ప్రధాన రహదారిపై ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో రెండు ఆవులు మృతి చెందగా, లేకదూడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆవుల విలువ రూ.30వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. -
ఇద్దరు దొంగల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో శనివారం సాయంత్రం రూ.లక్ష విలువ గల సామగ్రి ఉన్న బ్యాగును అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. కరకట్ట ప్రాంతంలో ఫొటోలు తీసేందుకు అవసరమైన కెమెరా ఇతర సామగ్రి ఉన్న ఒక బ్యాగును ఇద్దరు వ్యక్తులు అపహరించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బ్లూకోట్ టీం అక్కడకు చేరుకొని వారిని స్టేషన్కు తరలించి విచారించగా.. పాల్పంచ పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన చలపతి, ఉపేంద్రగా తెలిసింది. -
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
ఇల్లెందు: విత్తనాలు సేకరించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థులకు చాలెంజ్ విసరడంతో మండలంలోని ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ స్కూల్ విద్యార్థులు 120 రకాల విత్తనాలు సేకరించి మండల స్థాయి విజేతలుగా నిలిచారు. శనివారం ఇల్లెందు మండలస్థాయి విత్తన సేకరణ చాలెంజ్ ప్రదర్శన పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్లో నిర్వహించారు. శుక్రవారం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిగిన పోటీల్లో గర్ల్స్ హైస్కూల్, జేబీఎస్, 21 ఫిట్ జెడ్పీ హైస్కూల్, మొయిన్ రోడ్ హైస్కూల్, చల్లసముద్రం, కొమరారం, సుభాష్నగర్ల పరిధి నుంచి ఒక్కో స్కూల్ నుంచి పోటీల్లో పాల్గొనగా.. ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ జిల్లాస్థాయికి ఎంపికై నట్లు ఎంఈఓ ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ హెచ్ఎం కబ్బాకుల రవి, టీచర్ ఆరెం రవికుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు లలిత, అరుణ్కుమార్, లాలు, కల్పన, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
కొత్తగూడెంఅర్బన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం క్లబ్లో జరిగే కార్యక్రమంలో చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. చుంచుపల్లి మండలం ఎస్ఆర్టీ, మాయాబజార్, వనమా కాలనీ నిర్వాసితులకు ఇంటి స్థలాల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం– రూప్లా తండా హైలెవల్ బ్రిడ్జి పనులకు, ఒంటి గంటకు చింతపెంటిగూడెంలో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాల్వంచలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొననున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలిఇల్లెందురూరల్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. శనివారం ఆమె మండలంలోని రొంపేడులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నెలకొల్పేందుకు స్థల పరిశీలన చేశారు. కొమ్ముగూడెం గ్రామపంచాయతీ నాయకులగూడెం గ్రామంలో పౌల్ట్రీ మదర్ యూనిట్ నిర్మాణ పనులను, బొజ్జాయిగూడెం గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపీడీవో ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఎం దుర్గారావు పాల్గొన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలికొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఫార్మాట్లలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న 4,369 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవని మండల విద్యాధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆధార్ కార్డుల జారీకి ముందుగా జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆర్డీఓలకు సూచనలు చేశారని వివరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు పొందాలని, ఆ తర్వాత పాఠశాలల్లో, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆధార్ కార్డు పొందాలని వివరించారు. తహసీల్దార్ నుంచి పొందిన రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి పేరు కూడా ఆధార్ లేని కారణంగా యూడైస్ వెబ్సైట్లో నమోదు చేయకుండా ఉండొద్దని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం సింగరేణి(కొత్తగూడెం): దేశ రక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం మంచికంటి భవన్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరల చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నాయకులు పోతినేని సుదర్శన్, మధు, యలమంచిలి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్, అన్నవరకు కనకయ్య, వంశీకృష్ణ, బ్రహ్మాచారి, కే.పుల్లయ్య, ఎండీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కలప రవాణాపై ముమ్మర తనిఖీ..
ఇల్లెందురూరల్: మండలలోని ఇల్లెందు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత వారం రోజులు గా బొజ్జాయిగూడెం, కొత్తూరు పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా టేకు కలప తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇప్పటివరకు రూ.2.70 లక్షలు విలువ చేసే 124 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మరింత లోతుగా విచారణ నిర్వహిస్తే కలప అక్రమ తరలింపులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ఇల్లెందు రేంజ్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ చలపతిరావును వివరణ కోరగా.. టేకు కలప అక్రమంగా తరలిపోయినట్లు నిర్థారించుకుని తనిఖీలు ప్రారంభించాం. ఇంకా తనిఖీలు కొనసాగించి అనుమానితులపై విచారణ కొనసాగిస్తాం. ఇప్పటివరకు రూ.2.70 లక్షల టేకు దుంగలు స్వాధీనం -
‘ఉద్యానం’ సతమతం!
● జిల్లా ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులు ● ఉన్న అధికారులపై పెరుగుతున్న పనిభారం ● కనీసం కార్యాలయాలు కూడా లేని దుస్థితి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా ఉద్యాన శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కలెక్టరేట్లోని ఉద్యాన శాఖ కార్యాలయం తప్ప జిల్లాలో మరెక్కడా ఉద్యానశాఖకు కనీసం కార్యాలయాలు లేవు. దీంతో అధికారులు రైతు వేదికల నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో జిల్లా ఉద్యాన శాఖాధికారిగా పనిచేసిన అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ స్థానంలో జంగా కిషోర్ను ఇన్చార్జ్గా నియమించారు. ప్రస్తుతం జిల్లా ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. మరో వైపు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవతో కొందరు రైతులు లాభదాయకమైన మునగసాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయల సాగు చేపడితే ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కానీ వీటిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే ఉద్యాన శాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఆరుగురు హార్టికల్చర్ ఆఫీసర్లు జిల్లా కేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో టెక్నికల్ హార్టికల్చర్ ఆఫీసర్ ఒకరు ఉండగా, అశ్వారావుపేట, అశ్వాపురం, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ కేంద్రాల్లో మరో ఐదుగురు హార్టికల్చర్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అశ్వారావుపేట హార్టికల్చర్ ఆఫీసర్ పరిధిలో ములకలపల్లి, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, దమ్మపేట ఆఫీసర్ పరిధిలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వాపురం ఆఫీసర్ పరిధిలో పినపాక, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, ఇల్లెందు ఆఫీసర్ పరిధిలో ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, పాల్వంచ ఆఫీసర్ పరిధిలో జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలు ఉన్నాయి. రైతు వేదికలే కార్యాలయాలు హార్టికల్చర్ ఆఫీసర్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా 67 రైతువేదికలు ఉన్నాయి. వీటి నుంచే అధికారులు శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యకలాపాలు ఉన్నపుడు ఉద్యానశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాఖాపరమైన విధులతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల విధులు, సర్వే వంటి పనులు, వరద సహాయక కార్యక్రమాలు తదితర బాధ్యతలు కూడా కేటాయిస్తుండటంతో ఉద్యాన అధికారులు పనిభారంతో సతమతమవుతున్ననారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యాన శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్న అధికారులతోనే రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. ఉద్యాన శాఖ నుంచి వివిధ పంటలకు ఇస్తున్న రాయితీలపై అవగాహన కల్పిస్తున్నాం. – జంగా కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి ఎక్స్టెన్షన్ అధికారులే లేరు ప్రతీ హార్టికల్చర్ ఆఫీసర్కు ఇద్దరు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు సహాయకులుగా ఉండాలి. జిల్లాలో 12 మంది టెక్నికల్ ఆఫీసర్లను ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉన్న అధికారులపైనే పనిభారం పడుతోంది. జిల్లాలో 2019 వరకు ఎనిమిది మంది ఎక్సటెన్షన్ ఆఫీసర్లు విధులను నిర్వహించారు. వారు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడంతో అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఎస్సైకు గోల్డ్ మెడల్
భద్రాచలంఅర్బన్: జోనల్ డ్యూటీ మీట్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన భద్రాద్రి జోనల్ డ్యూటీ మీట్ ఈనెల 4న ముగిసింది. జోనల్ పరిధిలో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వరంగల్, మహబుబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 19 మెడల్స్ రాగా వీరిలో భద్రాచలం టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంజి స్వప్నకు రెండు విభాగాలలో గోల్డ్ మెడల్ సాధించింది. -
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
పాల్వంచ: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ అన్నారు. శనివారం జెన్కో ట్రైనింగ్ సెంటర్లో విద్యుత్ సరఫరా అంతరాయాలపై జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న విద్యుత్ నియంత్రికలు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది పూర్తి రక్షణ పరికరాలు వాడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆదేశించారు. అనంతరం డైరెక్టర్ను అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ మహేందర్, డీఈలు, ఏడీఈలు, అకౌంట్స్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకునే అవకాశం ఉంది. తాలిపేరుకు వరద ఉధృతిరెండు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్కు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రెండు రోజుల నుంచి ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం ప్రాజెక్ట్ 25 గేట్లలో రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి ఉంచి 2,105 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నీటిమట్టాన్ని 71.74 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసేందుకు సరిపడా నీరు ప్రాజెక్ట్లో ఉందని డీఈ తిరుపతి తెలిపారు. -
తెర ఒక్కటే.. సినిమాలు రెండు
ఒకప్పుడు థియేటర్లో ఒకే సినిమా నాలుగు ఆటలు ● మల్టీప్లెక్స్ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలోనూ సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్కు తగ్గట్టు ప్రతీ పూట వేర్వేరు చిత్రాల ప్రదర్శనకొత్తగూడెం నగరంలోని ఓ థియేటర్ మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు.. ఇళ్లలోకి టీవీలు వచ్చాక థియేటర్ల కథ ముగుస్తుందనే ప్రచారం జరిగింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ పేరుతో డాల్బీ డిజిటల్, డిజిటల్ ట్రాక్ సౌండ్ (డీటీఎస్), డాల్బీ ఆట్మోస్ పేరుతో సౌండ్ క్వాలిటీ, కుషన్, కపుల్ చైర్స్ వంటి సౌకర్యాలతో ఏసీ హాళ్లు వచ్చాయి. దీంతో ఎంటర్టైన్మెంట్లో థియేటర్లు మరింత అగ్రస్థానానికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకే ప్రాంగణంలో రెండుకు మించి స్క్రీన్లు, మూడుకు పైగా సినిమాలు ప్రదర్శించడం మొదలైంది. టాయిలెట్స్ మొదలు స్క్రీన్ వరకు అన్నింటా బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ సినిమాకు సరికొత్త కేరాఫ్ అడ్రెస్గా మల్టీప్లెక్స్లు నిలిచాయి. ఓటీటీల రాకతో.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ సినిమా థియేటర్ల పాలిట మృత్యుపాశంగా మారింది. ఓ వైపు మల్టీప్లెక్స్ హవా పెరుగుతుంటే మరోవైపు ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్లు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. రీజినల్, ఇంటర్నేషనల్ కంటెంట్ లోకల్ లాంగ్వేజ్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వినోద రంగంలో థియేటర్లకు గట్టి ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రేక్షకుడిని ఇంటి నుంచి థియేటర్కు రప్పించాలంటే స్టార్ పవర్ లేదంటే మంచి కంటెంట్ ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది. థియేటర్ల మూసివేత గతంతో పోల్చితే స్టార్డమ్ ఉన్న నటుల నుంచి వచ్చే సినిమాల తగ్గిపోవడం, ఓటీటీలో మంచి కంటెంట్ వస్తుండటంతో థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం సినిమా విడుదలైతే సోమవారం నుంచి ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో షోలు క్యాన్సిల్ చేయడం రివాజుగా మారింది. కొన్ని థియేటర్లయితే క్రేజ్ ఉన్న సినిమా విడుదలైనప్పుడు తెరవడం, ఆ తర్వాత మూత వేయడం చేస్తున్నారు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు గుండెకాయలా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో థియేటర్లు మూతపడిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఖమ్మంలో పదకొండు థియేటర్లు ఉంటే ఇప్పుడు కేవలం ఐదే మిగిలాయి. కొత్తగూడెంలో ఏడుకు బదులు నాలుగు, పాల్వంచలో నాలిగింటా రెండు, ఇల్లెందులో మూడు, మణుగూరు, భద్రాచలంలలో మూడింటా రెండు థియేటర్లే నడుస్తున్నాయి. ఇక మండల కేంద్రాల్లోని థియేటర్లు ఎప్పుడో మూతపడ్డాయి. ఒకే రోజు రెండు, మూడు సినిమాలు.. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమ పంథాను మార్చుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లలో నాలుగు షోలలో ఒకే సినిమా నడిపించడగా ఇప్పుడు ఒకే రోజు రెండు, మూడు సినిమాలు నడిపించే పద్ధతిని అమల్లోకి తెస్తున్నారు. సినిమాలో ఉండే కంటెంట్, వచ్చే ప్రేక్షకులను బట్టి షోలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఖమ్మం వినోద థియేటర్లో హాలీవుడ్ చిత్రం జురాసిక్పార్క్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్నింగ్, మ్యాట్నీ షోలు ఉండగా ఫస్ట్ షో, సెకండ్ షోలలో ఇంగ్లిష్ వెర్షన్ ప్రదర్శించారు. ఇదే సినిమా కొత్తగూడెం ఏషియన్ మహేశ్వరి, భద్రాచలం విజయ్భాస్కర్లలో మ్యాట్నీ, సెకండ్షోలు ఉండగా మిగిలిన షోలలో కన్నప్ప, కుబేరా సినిమాలు ఆడిస్తున్నారు. ఈ ట్రెండ్ ఆర్నెళ్ల క్రితమే మొదలైనా పాపులారిటీ ఉన్న సినిమాలు ఇలా ఆడకపోవడంతో ఈ అంశం వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి వేర్వేరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతో ఒకే థియేటర్లో వేర్వేరు షోలకు వేర్వేరు సినిమాలు ప్రదర్శించే అవకాశం చిక్కింది. ట్రెండ్కు తగ్గట్టు సింగిల్ స్క్రీన్లే మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. -
బీఏఎస్కు విద్యార్థుల ఎంపిక
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మం జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల (బీఏఎస్)ల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి గత నెల 20వ తేదీన లక్కీ డ్రా ద్వారా విద్యార్థినులను ఎంపిక చేయగా పలువురు చేరలేదు. దీంతో కొత్త వారి ఎంపికకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం డీడీ విజయలక్ష్మి ఆధ్వర్యాన డ్రా తీశారు. అధికారులు హరీశ్, అశోక్కుమార్, నారాయణరెడ్డి, రాములు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎదగాలి కొత్తగూడెంఅర్బన్: మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని ట్రెయినీ కలెక్టర్ సౌరబ్శర్మ అన్నారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఆర్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెప్మా డీఎంసీ, ఏడీఎంసీ, టీఎంసీ బి.వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శాంతకుమార్, మౌలాల్, సరిత, ఆర్పీలు పాల్గొన్నారు. కేన్సర్ బాధితురాలికి ఆర్థిక చేయూత కొత్తగూడెంటౌన్: కొత్తగూడెంకు చెందిన సింధు కేన్సర్తో బాధపడుతుండగా చికిత్సకు వసుధ ఫౌండేషన్ బాధ్యులు చేయూతనిచ్చారు. కొత్తగూడెంలో శనివారం ఎస్పీ రోహిత్రాజు చేతుల మీదుగా రూ.10 వేల చెక్కు అందజేశారు. ఫౌండేషన్ కన్వీనర్ విగేశ్న శ్రీనివాసరాజు, రమేష్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి సింగరేణి(కొత్తగూడెం): ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్బీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని రైటర్ బస్తిలో జరిగిన విప్లవ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె విజయవంతం ద్వారా కేంద్రానికి కనువిప్పు కలిగించాలని కోరారు. నాయకులు గౌనీ నాగేశ్వరరావు, ఎన్. సంజీవ్, మ ల్లీఖార్జన్రావు, శ్రీను, కృష్ణ, శరత్, రామకృష్ణ, రాజేష్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 10న తెలంగాణ జాగృతి సమావేశం సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ జాగృతి జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని కొత్తగూడెం క్లబ్లో ఈనెల 10న నిర్వంహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో శనివారం జరిగిన సన్నాహాక సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకుడు రూప్సింగ్, సదానందంగౌడ్, మహిళా అధ్యక్షురాలు మాధవి మాట్లాడారు. ఈనెల 10న జరిగే సమావేశానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానుండగా, సీఐటీయూ పట్టణ కార్యదర్శి వీరన్న నేతృత్వంలో పలువురు జాగృతిలో చేరనున్నారని తెలిపారు. జిల్లా కన్వీనర్ పవన్నాయక్, నాయకులు సింధుతపస్వి, బత్తుల వీరయ్య, ఎం.డీ.హుస్సేన్, నవతన్, కిరణ్కుమార్, వరప్రసాద్, సాదిక్పాషా పాల్గొన్నారు. -
తొలి పండగకు సిద్ధం..
● హిందువులకు మొదటి పండుగగా పేరు ● ముస్తాబైన వైష్ణవ ఆలయాలు ● ఉపవాసాలు, దానధర్మాలతో మోక్షం నేడు తొలి ఏకాదశికొత్తగూడెంటౌన్: హిందువులకు ఎంతో విశిష్టమైన పండగలో మొదటి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే ఈ పండగను దేవశయన ఏకాదశి లేదా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢశుద్ధ ఏకదశి తిథి సందర్భంగా నేడు(ఆదివారం) పండుగను జరుపుకుంటారని అర్చకులు, వేదపండితులు చెబుతున్నారు. ఏడాది కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది మొదటిది కాగా తలెగు పండుగలన్నీ దీంతోనే ప్రారంభమవుతాయి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. ఇక సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన తరుణాన ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా గోపద్మవ్రతాన్ని కార్తీకమాస శుక్లపక్షం వరకు జరుపుకుంటారు. ఇందుకోసం శ్రీవైష్టవి ఆలయాలను నిర్వాహకులు ముస్తాబుచేయడంతో పాటు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. విశిష్ట పూజలు. ఏకాదశి రోజున కొందరు చతుర్మాస వ్రతాలు ప్రారంభిస్తారు. సూర్యోదయానికి ముందే శ్రీహరిని పూజించి, విష్ణువు ప్రతిమను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి చక్కెర పొంగళి నైవేధ్యంగా పెడతారు. అంతేకాక కర్పూర హారతులిచ్చి భక్తులు ఉపవాసంతో వైష్ణవ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. గోపూజ చేయడం మంచిదని, పితృ దేవతలకు ప్రీతికరమైన పేలాల పిండిని తినాలని పెద్దలు, అర్చకులు చెబుతున్నారు. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తేమోక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. తొలి ఏకాదశితో పండగలు మొదలు.. గ్రీష్మ రుతువు ముగిసి, వర్ష రుతువు ప్రారంభమైన సందర్భంగా పండగను జరుపుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో అందరూ నేడు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొదటి పండగ.. తొలి ఏకాదశి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలకు ఇష్టమైన పండుగ కావడంతో ఈ రోజు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయి. పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. – శ్రీధరాచార్యులు, రామవరం శివాలయం అర్చకుడు -
పీరీల పండగకు వేళాయే ు..
● త్యాగానికి ప్రతీకగా మొహర్రం ● పండుగకు ముస్తాబైన పీరీలు ● కులమతాలకతీతంగా భక్తుల పూజలు నేడు పీరీల పండుగ కొత్తగూడెంటౌన్: న్యాయం, ధర్మం, సత్యం వంటి మానవీయ విలువలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం చేసిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకంగా జరుపుకునే పండగ మొహర్రం. ఈ పండగలో భాగంగా కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను జరుపుకుంటారు. పండుగ నాడు భక్తులంతా పీరీలను వీధుల్లో ఊరేగిస్తుండగా.. భక్తులు కొబ్బరికాయలు, ఊద్లుతో మొక్కులు తీర్చుకుంటారు. పీరీల ముస్తాబు.. పీర్ల పండుగను జరుపుకునేందుకు ఆదివారం ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇందుకు అషుర్ఖానాల్లోని పీర్లను ముస్తాబు చేసి పీరీలకొట్టంలో మానిక్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 76కు పైగా అషూర్ఖానాలు ఉండగా.. కొత్తగూడెం సూపర్బజార్, రామవరంలోని మార్కెట్ ఏరియాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పీర్ల పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను కూర్చోబెట్టి అమరవీరులను, పెద్దలను స్మరిస్తూ ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడిచి తమ భక్తిని చాటుతారు. తెల్లవారుజాము నుంచే సందడి తెల్లవారు జామున పీరీలతో వీధుల్లోని ఇంటింటికి ఊరేగింపుగా తీసుకెళ్లగా.. భక్తులు కులమతాలకు అతీతంగా మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. తిరిగి పండుగ రోజు సాయంకాలం వీటిని మార్కెట్లలో ఏర్పాటు చేయగా.. అందరూ అక్కడకు చేరుకుని ఆడిపాడి సందడి చేస్తారు. ఇందుకు దర్గాల్లో పీరీలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇస్లాం నూతన సంవత్సరం.. మహ్మద్ప్రవక్త మనవడు ఇమా మ్ హుస్సేన్ వారి మనవడు సహచరుల ప్రాణత్యాగాలకు ప్రతీకగా మొహర్రంను జరుపుకుంటారు. కులమతా లకు అతీతంగా షరబత్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేస్తారు. ఇది అన్ని వర్గాలకు ఇష్టమైన పండుగ. – యాకుబ్పాషా, నూరియా హనఫీయా ఎడ్యుకేషనల్ సొసైటీ, పాల్వంచత్యాగానికి గుర్తు.. త్యాగాలకు గుర్తుగా మొహర్రం పండుగను జరుపుకుంటాం. పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులకు ఆశీర్వచనాలు, ఊద్లాంటివి అంది స్తాం. ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. వీరత్వం నుంచి స్ఫూర్తి పొందిన పండగా..అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారు. – బాబా, అసూర్ఖానా నిర్వాహకుడు, వేణుగోపాల్నగర్కాలనీ, రామవరం -
కొత్తగూడెం టూ కిరండోల్
కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ● రెడ్కారిడార్లో రైల్వే కనెక్టివిటీ పెంపునకు చర్యలు ● కచ్చితమైన సమాచారం కోసం లైడార్ సర్వేకు ఆదేశాలు ● గతంలోనే ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టిన అధికారులుదేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఫలానా రైల్వే లైను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను చేపడుతుంది. రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి? నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా? అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలను సేకరించి రిపోర్టు తయారు చేస్తారు. సమగ్ర వివరాల సేకరణసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగూడెం – కిరండోల్ కొత్త రైల్వేలైన్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టాలని గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం, కిరండోల్ ప్రాంతాల మధ్య 180 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో కొత్తగూడెం నుంచి పాండురంగాపురం వరకు ఇప్పటికే రైలుమార్గం అందుబాటులో ఉంది. మణుగూరు–భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) సెక్షన్లో ఉన్న పాండురంగాపురం నుంచి కిరండోల్ వరకు కొత్తగా 160.33 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మించడంతోపాటు పాండురంగాపురం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం వరకు 9.50 కిలోమీటర్ల మేర నూతన మార్గం నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రునిపేట, అడవి రామవరంల మీదుగా మరో 12.32 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోకి ఈ మార్గం ప్రవేశిస్తుంది. గంగ్రేల్, గొల్లపల్లి, చింతల్నార్, నీలంపల్లి , తమోడిల మీదుగా కిరండోల్కు ఈ మార్గం చేరుకుంటుంది. 160 కిలోమీటర్ల లైన్లో తెలంగాణ పరిధిలో 22 కిలోమీటర్లు ఉండనుంది. ప్రకటన వచ్చినా నిధులు కేటాయించలే.. భద్రాచలం–మల్కన్గిరి (ఒడిశా) కొత్త లైను నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేరకు రైల్వేలైను నిర్మించేందుకు 2022 జూన్లో ప్రాథమిక సర్వే రిపోర్టు వచ్చింది. ఇందులో ఒడిశా పరిధిలో మల్కన్గిరి, బదాలి, కోవాసిగూడ, రాజన్గూడ, మహరాజ్పల్లి స్టేషన్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురం స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలుమార్గం దారిలో గోదావరి, శబరి నదులతోపాటు పలు ప్రాంతాల్లో 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3,592 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లకు వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతున్నట్టు 2024 ఆగస్టులో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కానీ గత రైల్వే బడ్జెట్లో ఈ లైనుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదే విధంగా మణుగూరు – రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి రైల్వేలైన్ల పరిస్థితి కూడా సర్వేల దశను దాటి అడుగు ముందుకు పడటం లేదు.లైడార్ సర్వేకు నిర్ణయం.. ప్రస్తుతం కిరండోల్కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీలుగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్తగూడెం–కిరండోల్ రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014/15లో బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. ఆ తర్వాత 2018 ప్రాథమిక సర్వే చేపట్టింది. 2023 సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టారు. కానీ ఆ తర్వాత ఈ లైను విషయంలో ఉలుకూపలుకు లేకుండా పోయింది. తాజాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం–కిరండోల్ మార్గం తెర మీదకు వచ్చింది. దీంతో రెండోసారి ఫైనల్ లొకేషన్ సర్వే చేపడుతున్నారు. ఈసారి మరింత కచ్చితమైన సమాచారం కోసం లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వే కూడా చేపట్టాలని నిర్ణయించారు. -
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: అశ్వారావుపేటలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మత్తు వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈనెల 10వ తేదీ లోగా ఐడీఓసీలోని జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో అందజేయాలని కోరారు. వైద్య నిపుణుడికి నెలకు వేతనం రూ.1.50 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. స్కౌట్ మాస్టార్ పోస్టులకు.. పాల్వంచరూరల్: జిల్లాలోని 23 మండలాల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్కౌట్ మాస్టార్లు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గద్దల రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు స్కౌట్ మాస్టార్లుగా అర్హులని పేర్కొన్నారు. పాల్వంచ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళాశక్తి హోటల్లో దరఖాస్తులు అందజేయాలని, ఎంపికై న స్కౌట్ మాస్టార్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తారని వివరించారు. తాలిపేరులోకి వరదనీరు..చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరుతోంది. రెండు నెలలపాటు సాధారణ నిర్వహణ పనులను పూర్తి చేసిన అధికారులు శుక్రవారం ప్రాజెక్ట్ 25 స్పిల్వే గేట్లను దించివేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు వస్తుండగా, గేట్లను దించిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. కనిష్ట నీటిమట్టం 69 మీటర్లు, గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా, గురువారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 70.65 మీటర్లుగా నమోదైంది. నాలుగైదు రోజులపాటు వరద ప్రవాహం కొనసాగితే ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్, సుమన శుక్రవారం ప్రాజెక్ట్ను పర్యవేక్షించారు. -
చేప చెరువుకు చేరేనా?
● ఊసేలేని ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ● ప్రతిపాదనలు కూడా రూపొందించని అధికారులు ● జిల్లావ్యాప్తంగా నిరీక్షిస్తున్న మత్స్యకారులు పాల్వంచరూరల్: ఉచిత చేప పిల్లలు ఈసారి చెరువులకు చేరే పరిస్థితి కన్పించడంలేదు. జూలైలో చేప పిల్లలను చెరువులో వదిలితే మత్స్యకారులు ఉపాధి, ఆదాయం పొందుతారు. కానీ చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా పంపలేదు. జిల్లాలో గతేడాది 734 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఆలస్యంగా పంపిణీ చేయడంతోపాటు కేవలం 86 లక్షల చేపపిల్లలను మాత్రమే చెరువుల్లో వదిలి చేతులు దులుపుకున్నారు. ఈసారి సీజన్ ప్రారంభమైనా పంపిణీ ప్రక్రియపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు నిరీక్షిస్తున్నారు. 734 చెరువులు, కుంటల్లో పెంపకం జిల్లాలో చేపలు పెంచే చెరువులు, కుంటలు 734 ఉన్నాయి. 70 మత్స్య పారిశ్రామిక సొసైటీల ఆధ్వర్యంలో పెంపకం చేపడుతున్నారు. వీటిల్లో 3,248 మంది సభ్యులు ఉండగా, చేపల పెంపకం ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది 86 లక్షల చేప పిల్లలను, అంతకుముందు సంవత్సరం 1,93,76,000 చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ఈసారి పంపిణీ ఊసేలేదు. కిన్నెరసానిలో ఉత్పత్తి కేంద్రం.. కిన్నెరసానిలో మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప గుడ్లు(స్పాన్) పోసి రెండు నెలలపాటు పెంచి గిరిజన మత్స్యకార సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. 20 లక్షల చేప పిల్లలను పెంచేలా ఇక్కడ 13 తొట్లు నిర్మించగా, ప్రస్తుతం కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. గతేడాది 12 లక్షల చేప పిల్లలను మాత్రమే పెంచారు. ఈసారి మాత్రం గుడ్లు ఇంతవరకు పోయలేదు. గుడ్లు తీసుకురావాల్సిఉంది ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే జిల్లాలో 1.75 కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం సిద్ధం చేసి పంపిస్తాం. కిన్నెరసాని ఉత్పత్తి కేంద్రానికి చేప గుడ్లను కరీంగనగర్ నుంచి తేవాల్సి ఉంది. –ఇంతియాజ్ అహ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారిసమయం దాటితే.. చేప పిల్లలను సీజన్ ప్రారంభంలో చెరువుల్లో వదిలితే 8,9 నెలల్లో చేపలు పెరిగి ఆశించిన దిగుబడి లభిస్తుంది. కానీ అదును దాటాక చేప పిల్ల లను పోసినా ఉపయోగం ఉండదు. ఆలస్యమైతే చేపలు ఎదగపోవడంతోపాటు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా జూలైలో 50, 60 రోజుల చేప పిల్లలను చెరువుల్లో వదులుతారు. ఫిబ్రవరి, మార్చి నాటికి చేప ఎదుగుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలే రూపొందించలేదు. గుడ్లు తెచ్చి పిల్లల పెంపకం చేపట్టలేదు. జూలై తర్వాత పిల్లలను కొనుగోలు చేసి వదిలినా చేప ఎదిగే అవకాశం ఉండదు. మార్చి నాటికి చెరువుల్లో నీట్టిమట్టం కూడా తగ్గిపోతుందని, ఈ ఏడాది ఉచిత చేప పిల్లలు లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. -
సజావుగా ఆరోగ్య కార్యక్రమాల అమలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సజావుగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జయలక్ష్మి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా కోసం కమ్యూనిటీ స్క్రీనింగ్పై దృష్టి సారించాలని, శిశువులకు యాంటెనటల్ కేసుల నమోదు చేయాలని, రోగనిరోధక కవరేజీని వందశాతం సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్పందన, డాక్టర్ పుల్లారెడ్డి, సీహెచ్ఓ నాగభూషణం, బి.సోమ్లా నాయక్, జిల్లా స్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఫోన్లు తనిఖీ.. పోలీసులకు ఫిర్యాదుఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా కార్మిక సంఘాల నేతల ఫోన్లు విజిలెన్స్ బృందం తనిఖీ చేసిన విషయమై ఓ కార్మిక సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అటు కార్మిక సంఘాల నేతలను, సింగరేణి ఎస్అండ్పీసీ నేతలను పోలీస్ స్టేషన్కు పిలిచి వాకబు చేశారు. రెండు రోజుల కిందట రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు వేర్వేరు కార్మిక సంఘాల నేతల ఫోన్లు సింగరేణి విజిలెన్స్ విభాగం టీంసభ్యులు తనిఖీ చేశారు. ఓ నేత ఫోన్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో డ్యూటీలో ఉన్న తన ఫోన్ అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుని తనిఖీ చేయడంపై సదరు నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు రహస్యంగా సింగరేణి అధికారులను విచారిస్తున్నారు. చేయూత పెన్షన్లపై అవగాహనచుంచుపల్లి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోస్టల్ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లకు చేయూత పెన్షన్లపై శుక్రవారం ఐడీఓసీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భర్త/భార్య చనిపోతే భాగస్వామి పెన్షన్ పొందడం, పెన్షన్ డ్రా చేయని ఖాతాలు, చనిపోయిన వారి పేర్లను తొలగించటం, పంచాయతీ కార్యదర్శి ధ్రవీకరణ వంటి అంశాలపై సెర్ప్ డైరెక్టర్ గోపాలరావు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ఎం విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటి సీఈఓ చంద్రశేఖర్, డీపీఓ చంద్రమౌళి, సెర్ప్ అదనపు డీఆర్డీఓ నీలేష్, సిబ్బంది కె.చంద్రశేఖర్, రవి, లోకేష్ పాల్గొన్నారు. కేటీపీఎస్లో ఆర్టిజన్కు కరెంట్ షాక్పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో ఓ ఆర్టిజన్ కార్మికుడు విద్యుదాఘతానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సీతారాంపట్నం సబ్స్టేషన్ పరిధిలో పనిచేసే ఆర్టిజన్ కార్మికుడు ఆర్.కాంతారావు కేటీపీఎస్ కర్మాగారంలో స్విచ్ యార్డ్ వద్ద 220 కేవీ లైన్ జంపర్లను కలిపేందుకు గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇండక్షన్ జరిగి కరెంట్ షాక్కు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సీఆర్పీ చేసి కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొత్తగూడెం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. వైద్యం వికటించిందని ఆందోళన పాల్వంచ: వైద్యం వికటించిందని బాధితురాలు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం.. వికలాంగులకాలనీకి చెందిన భూక్యా అరుణ శాసీ్త్రరోడ్ రెండోబజార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి నీరసంగా ఉందని చెప్పడంతో వైద్యుడు రెండు చేతులకు క్యాన్లా పెట్టారు. అనంతరం చేతులు రెండు వాచిపోయి గడ్డలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లగా వైద్యం వికటించిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకు రూ.లక్ష వరకు ఖర్చు అయింది. ఇంకా చికిత్స అందించాల్సి ఉందని తెలపడంతో ఇచ్చే స్తోమత లేదని వాపోయారు. అందుకు కారణమైన పాల్వంచ ఆస్పత్రికి అరుణ కుటుంబ సభ్యులు వచ్చి బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఆస్పత్రి వైద్యులు పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని, పరిశీలిస్తున్నామని తెలిపారు. -
బాల్యం వికసించేలా..
● ఆపరేషన్ ముస్కాన్తో బాలకార్మికులకు విముక్తి ● ఈ నెల 31 వరకు కార్యక్రమాలు ● జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు ● గత మూడేళ్లలో 251 మంది గుర్తింపు, సంరక్షణకొత్తగూడెంటౌన్: అనాథలు, బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ ముస్కాన్తో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తోంది. బాల కార్మికులను గుర్తించి వారి భవిష్యత్కు అండగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికుల కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి 2025 వరకు దాదాపుగా 251 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కలిగించినట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. హోటళ్లు, బట్టల షాపులు, ఇటుకల నిర్మాణ, భవన నిర్మాణ ప్రదేశాలు, బేకరీలు, సినిమాహాళ్లతోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. జిల్లా సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖలు, బాలల సంరక్షణ బృందాలు, చైల్డ్లైన్(1098), బాలల సంక్షేమ సమితి, ప్రత్యేక బాలల విభాగం, జాతీయ బాల కార్మిక విభాగాల సమన్వయంతో సబ్ డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలకార్మికులను రక్షిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచుకోని పిల్ల లు, తప్పిపోయిన పిల్లలు, అనాథలు, బాల కార్మికులుగా దుర్భర జీవితం సాగిస్తున్న చిన్నారులకు ఆపరేషన్ ముస్కాన్తో భరోసా కల్పిస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికలతో పనులు చేయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏటా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుర్తించిన బాల కార్మికులకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద బాల సహాయక కిట్లు ఇవ్వడంతోపాటు సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది. బాలలతో పనులు చేయించడం నేరం బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నాం. 31వ తేదీ వరకు తనిఖీలు కొనసాగిస్తాం. బాలబాలికలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం. బాల కార్మికులను గుర్తించి వారికి విద్య నేర్పించేందుకు కృషి చేస్తాం. బాలకార్మికులతో ఎవరైనా పనులు చేయిస్తే 1098కు సమాచారం ఇవ్వాలి. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమశాఖ అధికారి గత మూడేళ్లలో విముక్తి కల్పించిన బాలల వివరాలు ఏడాది ఆపరేషన్ బాలురు బాలికలు మొత్తం 2022 స్మైల్ 30 05 35 2022 ముస్కాన్ 56 12 68 2023 స్మైల్ 22 09 31 2023 ముస్కాన్ 28 05 33 2024 స్మైల్ 14 07 21 2024 ముస్కాన్ 21 02 23 2025 స్మైల్ 33 07 40 మొత్తం 204 47 251 -
పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి నిర్వహించారు. తొలుత కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరయ్య అని కీర్తించారు. తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య పేరని వ్యాఖ్యానించారు. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్పవీరుడని కొనియాడారు. మాజీ సీఎం రోశయ్యకు నివాళి బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య జయంతి నిర్వహించారు. మొదట రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ పనినైనా నిబద్ధతతో చేసే ఆయన ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలందించారని కొనియాడారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, క్రీడల అధికారి పరంధామరెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, కురుమ సంఘం సభ్యులు దూడల బుచ్చయ్య, లింగయ్య, రవికుమార్, చంద్రశేఖర్, దూడల కిరణ్, సుంక ప్రవీణ్, కోటిలింగం, సంపత్కుమార్, కె.రవి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏలో..భద్రాచలం: మాజీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్యకు ఐటీడీఏలో శుక్రవారం ఘనంగా నివాళుల ర్పించారు. పీఓ బి.రాహుల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేసే, భక్తులు వచ్చే పలు ప్రదేశాలను సందర్శించారు. రామాలయం, అన్నదాన సత్రం, గోదావరి కరకట్ట, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియానికి సులువుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ సెంటర్లోని మహనీయుల విగ్రహాలను సందర్శించి, మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో డేవిడ్ రాజ్, మణెమ్మ, హరీష్, భాస్కరరావు, ఉదయ్ కుమార్, రమేష్, వేణు, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, ఆదినారాయణ, అలివేలు మంగతాయారు, శ్రీనివాస్, రవీందర్, వెంకటేశ్వర్లు, వీరభద్రం పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
విత్తన చాలెంజ్లో సత్తా
టేకులపల్లి: కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఇచ్చిన విత్తన చాలెంజ్ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలలు సత్తా చాటాయి. 13 కేజీల 985 గ్రాముల విత్తనాలు సేకరించి సులానగర్ కాంప్లెక్స్లోని హనుమాతండా ఎంపీపీఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈఓ అజ్మీర జగన్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి కాంప్లెక్స్లో 4 కేజీల 600 గ్రాములతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సులానగర్ కాంప్లెక్స్లో 13 కేజీల 985 గ్రాములతో ఎంపీపీఎస్ హనుమాతండా , బొమ్మనపల్లి కాంప్లెక్స్లో కేజీతో ఎంపీపీఎస్ బొమ్మనపల్లి, ముత్యాలంపాడు కాంప్లెక్స్లో 4 కేజీల 900 గ్రాములతో ఎంపీయూపీఎస్ తావుర్యాతండా, బోడు కాంప్లెక్స్లో 2 కేజీల 900 గ్రాములతో ఎంపీపీఎస్ బర్లగూడెం, కుంటల్ల కాంప్లెక్స్లో 4 కేజీలతో ఎంపీపీఎస్ దాసుతండా పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు, విజేత పాఠశాలల హెచ్ఎంలు మోహన్రావు, దేవ దాసు, మంగీలాల్, రామచంద్రసింగ్, అజ్మీర జగన్నాయక్, స్వర్ణలత, పద్మ, జైల్సింగ్, రమేశ్బాబు, విజయనిర్మల పాల్గొన్నారు. విజేతగా నిలిచిన హనుమాతండా పాఠశాల -
రామాలయంలో సెక్యూరిటీ పటిష్టం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. రెండు డోర్ ఫ్రేమ్లను, మెటల్ డిటెక్టర్, ఆరు హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి శుక్రవారం ఆలయంలో అమర్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి అనుమతించారు. ఈఈ రవీందర్ పర్యవేక్షించారు. వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా అన్యమత ప్రచారం చేసే కవర్లను దేవస్థానంలో వినియోగించినందుకు దేవస్థానం అఽధికారులు వస్త్ర దుకాణ టెండర్దారుడికి రూ.లక్ష జరిమానా విధించారు. నెల రోజుల క్రితం ఆంధ్రాకు చెందిన ఓ భక్త జంట స్వామివారి వస్త్రాలను ఆలయ ప్రాంగణంలో కొనుగోలు చేయగా, వాటిని ఆ దుకాణ దారుడు ఓ కవర్లో పెట్టి ఇచ్చారు. పరిశీలించగా కవరుపై అన్యమత ప్రచారం ఉంది. ఆ దంపతులు ఈఓకు ఫిర్యాదు చేయగా, ఏఈవో శ్రవణ్కుమార్ను విచారణకు ఆదేశించారు. ఆయన విచారించి ఇచ్చిన నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ నిబంధనలను అతిక్రమించి అన్యమతం ప్రచారం చేసినందుకు ఈఓ రూ.లక్ష జరిమానా విధించారు. మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు -
డంపింగ్యార్డులో గిరిజనుల నిరసన
అశ్వారావుపేటరూరల్: తమ పట్టా భూములను జాయింట్ సర్వే చేసి అప్పగించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్నంగా ఓ డంపింగ్యార్డు లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రామన్నగూడేనికి చెందిన 150 మంది గిరిజనులకు సర్వే నంబర్లు 30,36, 39లో 573 ఎకరాలకు సంబంధించి తమ పూర్వీకుల నుంచి పట్టాలు కలిగి ఉన్నారు. కాగా, ఈ భూములు కొన్నేళ్లుగా అటవీ, ఎఫ్డీసీ ఆధీనంలో ఉండగా ఆయా భూముల్లో టేకు, వెదు రు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఈ భూములను నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్తోపాటు హైకోర్టు పూర్వ పట్టాలు ఉన్న గిరిజనులకు సర్వే చేసి అప్పగించా లని 13 ఏళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈ భూములను జాయింట్ సర్వే చేసేందుకు రెవెన్యూ, ఫారెస్టు, ఎఫ్డీసీ అధికారులు ముందుకు రాకపోవడంతో ఏళ్లుగా గిరిజనులు తమ భూము లు అప్పగించాలని దశలవారీగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా రామన్నగూడెం పంచాయతీ డంపింగ్ యార్డులో బాధిత గిరిజనులు తమ వద్ద ఉన్న పూర్వ పట్టాలను చేతుల్లో పట్టుకొని గంటపాటు నిరసన వ్యక్తం చేసి, జాయింట్ సర్వే చేయాలని డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోత్ వినోద్ (35) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బోయితండా పంచా యతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన వాంకుడోత్ వినోద్, అదే గ్రామానికి చెందిన ప్రేంకుమార్ బైక్పై ఇల్లెందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మామిడిగూడెం వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను తప్పింబోయి నేరుగా చెట్టుకు ఢీకొన్నారు. ప్రమాదంలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేంకుమార్కు గాయాలయ్యాయి. ఇతడిని స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి ఇల్లెందురూరల్/ఇల్లెందు: మండలంలోని సుభా ష్నగర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తుతెలియ ని వ్యక్తి రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఇల్లెందు పోలీసులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యు ల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 87128 2070 నంబర్లో సంప్రదించాలని ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కోరారు. రేషన్ బియ్యం పట్టివేతజూలూరుపాడు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. సుజాతనగర్ మండలం చింతలతండాకు చెందిన మాలోత్ వినోద్కుమార్ జూలూరుపాడు మండల పరిసర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలుచేసి, అధికధరకు అమ్ముకుంటున్నాడు. గుండ్లరేవు గ్రామం నుంచి వినోద్కుమార్ తన ట్రాలీలో రేషన్బియ్యాన్ని సుజాతనగర్ వైపు తరలి స్తుండగా భేతాళపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ట్రాలీని స్వాధీనం చేసుకుని, వినోద్కుమార్ను అదుపులోకి తీసుకున్నామని, బియ్యం విలువ సుమారు రూ.11,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవి పేర్కొన్నారు. వివాహిత ఆత్మహత్యబూర్గంపాడు: మండల కేంద్రంలోని ముదిరాజ్బజార్కు చెందిన నీరుడు సంధ్య (38) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంధ్య తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కుటుంబసభ్యులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం భర్త శేషయ్య పనులకు వెళ్లిన తరువాత సంధ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, లోకేశ్ ఉన్నారు. మృతురాలి చెల్లెలు మేకల లీలావతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందగా శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆదివాసీల సంక్షేమానికి కృషి
కొత్తగూడెంఅర్బన్: ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని గంగమ్మ కాలనీ గొత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పిల్లలకు విద్య నేర్పిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం 27 కుటుంబాలకు దుప్పట్లు, దోమ తెరలను పంపిణీ చేశారు. విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మద్దె గుంపునుకు చేరుకుని అక్కడ నివసిస్తున్న ఆదివాసీ ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి.నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, కార్తీక్, లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
నానో యూరియాతో సత్ఫలితాలు
ఇల్లెందురూరల్: సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఇల్లెందుకు చేరిన యూరియా, విక్రయం, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలు తెలుసుకున్నారు. విక్రయ కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష ఎకరాల వరకు మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రోజూ 40 టన్నుల యూరియా ఇల్లెందుకు రవాణా అవుతోందని తెలిపారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, ఏడీఏ లాల్చంద్, ఏవో సతీష్, పీఏసీఎస్ సీఈవో హీరాలాల్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు -
సింగరేణిలో 21 మంది అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 21 మంది ఫైనాన్స్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే మురళీధర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీఅయిన వారిలో డీజీఎం, ఫైనాన్స్ మేనేజర్, ఇద్దరు డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్లు, 8 మంది సీనియర్ అకౌంట్ ఆఫీసర్లు, నలుగురు మేనేజ్మెంట్ ట్రైనీలు, ఐదుగురు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరూ ఈ నెల 12వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
టీఎల్యూడీ పద్ధతిలో బయోచార్ తయారీ
సుజాతనగర్: టీఎల్యూడీ (టాప్ లిట్ అప్డ్రాఫ్ట్) పద్ధతిలో నాణ్యమైన బయోచార్ తయారు చేయవచ్చని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని వేపలగడ్డకు చెందిన కుందూరు లక్ష్మీనారాయణరెడ్డి వెల్డింగ్ దుకాణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బయోచార్ యూనిట్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 30 కిలోల వేస్ట్ కట్టె ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా చేసి మండించడం ద్వారా 10 కిలోల నాణ్యమైన బయోచార్ను కలెక్టర్ తయారు చేయగలి గారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలా తయారైన బయోచార్ను ఆవుపంచకం (ఆవుపేడ మొదలైనవి)తో కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచి ఆరబెట్టి, పొడిగా చేసి పంటలకు ఎరువుగా ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని రైతువేదికల ద్వారా బయోచార్ తయారీ విధానం గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తక్కువ ఆక్సిజన్లో టీఎల్యూడీ పద్ధతిలో బయోచార్ తయారు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు బయోచార్ తయారు చేసి, విక్రయించడం ద్వారా లాభం పొందొచ్చని సూచించారు. బయోచార్ తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే వేడిని ఎలా ఉపయోగించుకోవచ్చో, బయోచార్ తయారీ విధానాన్ని మరింత తక్కువ ఖర్చు తో, సులభతరంగా రైతులు ఉపయోగించుకునేలా రూపొందించడానికి వివిధ పద్ధతులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీ విద్యాచందన, ఎంపీడీఓ బి.భారతి, ఏఓ నర్మద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ -
ప్రైవేట్ మందులే దిక్కు..
● పల్లెల్లో కానరాని పశువైద్యం ● మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ● ఏడు నెలలుగా నిలిచిన సరఫరా ● ప్రైవేట్లో మందులు కొంటేనే పశువులకు వైద్యం బూర్గంపాడు: జిల్లాలో పశువైద్యం ప్రైవేట్లో మందులు కొంటేనే సాధ్యపడుతోంది. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలోని పశు వైద్యశాలలకు ఏడునెలలుగా మందుల సరఫరా నిలిచిపోయింది. గత నవంబర్లో వచ్చిన మందులే తప్ప ఇంతవరకు సరఫరా జరగలేదు. పశువులకు ఏదైనా రోగమొచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి గాయపడినా పశు వైద్యశాలల్లో మందులు లేవు. దీంతో పశువుల పెంపకందారులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు కొనుక్కుంటేనే వైద్యం అందించే పరిస్థితులున్నాయి. పశు వైద్యశాలల్లో మందుల కొరతతో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి. కనీసం నట్ట ల నివారణ మందులు కూడా పశు వైద్యశాలల్లో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లుగా నట్టల మందులు కరువు.. జిల్లాలో 2.12లక్షల గేదెలు, ఆవులు ఉన్నాయి. సుమారు 3.25లక్షల మేకలు, గొర్రెలున్నాయి. ఇవి కాకుండా పందులు, పెంపుడు కుక్కలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. పశువులకు, జీవాలకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 80 ప్రభుత్వ పశువైద్యశాలలున్నాయి. పశువులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నా రు. అయితే పశువుల ఆస్పత్రులకు మందుల కొర త తరచుగా వేధిస్తోంది. వర్షాకాలం పశువులు, జీవాలలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ తరుణంలోనే పశువులకు, జీవాలకు ప్రభుత్వపరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని పశువైద్యశాలల్లో యాంటీ బయాటిక్స్ కొరత ఎక్కువగా ఉంది. వ్యాధుల నివారణకు యాంటీ బయాటిక్స్తో పాటుగా బలానికి ఇచ్చే సపోర్టింగ్ మందులు (విటమిన్, మినరల్స్) కూడా అందుబాటులో లేవు. అనారోగ్యంతో ఆస్పత్రులకు తీసుకువచ్చిన పశువులకు తక్షణ శక్తి కోసం ఇచ్చే సెలెన్ బాటిళ్లు కూడా లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. మేకలు, గొర్రెలకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు వేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా నట్టల నివారణ మందుల సరఫరా లేకపోవటంతో జీవాల పెంపకందారులు ప్రైవేట్ దుకాణా ల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కనీసం నట్టల నివారణ మందులు కూడా లేకపోవటం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. వైద్యం కోసం పశువుల పెంపకందారులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మందుల చీటీ రాయించుకుని ప్రైవేట్ దుకాణాల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వైద్యం చేసే పరిస్థితులున్నాయి. -
900 గ్రాముల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 900 గ్రాముల గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్ఐ సంధ్య ఆధ్వర్యాన తనిఖీలు చేస్తుండగా.. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ మోహిత్ గంజాయి అమ్ముతూ కొత్త బస్టాండ్ సమీపంలోని గుట్టపై పట్టుబడ్డాడు. ఆయన నుంచి రూ.30 వేల విలువైన 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాక కొనుగోలుకు వచ్చిన గోపాలపురం, జహీర్పురవాసులు బాదావత్ ప్రవీణ్, దూర్ సందీప్, దోన్వాన్ సాయివినయ్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక సీజ్ పాల్వంచ: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పట్టణ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన లారీ ఇసుకను రెవెన్యూ ఆర్ఐ రవికుమార్ సీజ్ చేశారు. అనంతరం ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాంట్రాక్టర్స్కాలనీలో చోరీ? పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. ఓ మహిళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా.. ఘటనపై విచారిస్తున్నామని తెలిపారు. ఒక్కటే గుక్క.. ఊపిరి తీసింది.. కరకగూడెం: శీతలపానియం సీసా కనిపిస్తే తీసుకుని ఒక్క గుక్క వేశాడు.. అంతే అదే ఆ బాలుడి ప్రాణాలు బలికొంది. అందులో ఉన్నది పురుగులమందు అని తెలియక తాగిన బాలుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి తనువుచాలించాడు. మండలంలోని చొప్పల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల రెండో సంతానం వరుణ్ తేజ (5) గత నెల 29న ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో తన తండ్రి గ్రామంలో ఓ వ్యక్తి అడిగాడని ఖాళీ శీతలపానియం సీసాలో గడ్డిమందు పోసి ఇంటి ముందు పెట్టి ఊర్లోకి వెళ్లాడు. అది చూసిన వరుణ్ తేజ తాగాడు. కొన్ని క్షణాల్లోనే తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పలువురు దాతలు కూడా ఆర్థిక సాయం చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి వరుణ్ తేజ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మృత్యువుతో పోరాడి ఓడిన బాలుడు వరుణ్ తేజ -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం కొత్తగూడెంఅర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఇన్సులిన్, మలేరియా మందుల సరఫరాకు కృషి చేస్తానని చెప్పారు. ‘భవిత’తో మనో వికాసం.. భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. కొత్తగూడెం రైటర్ బస్తీలోని భవిత కేంద్రాన్ని గురువారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని, రెయిలింగ్, రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు.ఫిజియోథెరపిస్టులు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. గోడౌన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి వెళ్లనివ్వొద్దని సిబ్బందికి సూచించారు. మేకపాల విశిష్టతను తెలియజేయాలి.. జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులు, మహిళల వద్ద గల మేకల సంతతిని అభివృద్ధి చేయాలని, అధిక పాల దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన పశువైద్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేకపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. మేకపాల నుంచి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తులు తయారు చేసి వినియోగించే పద్ధతులపై ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలు అందించేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్ ద్వారా గిరిజనులు, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్, పశువైద్యాధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీ జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లు, ఏడుగురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. -
ఫలించిన ‘అంగన్వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశం భద్రాచలంఅర్బన్ : రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 10 నుంచి 17 వరకు నిర్వహించిన ‘అమ్మమాట – అంగన్ వాడీ బాట’ కార్యక్రమం విజయవంతమైంది. అంగన్వాడీ కేంద్రాలు అందించే సేవలను తల్లిదండ్రులకు వివరించడంతో జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 13,760 మంది చిన్నారులు చేరగా, 3,966 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. పౌష్టికాహారం, ఆటపాటలతో విద్య.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం, గుడ్డు, మురుకులు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా పాలు, గుడ్డు వంటి పోషకాహారం అందుతోంది. ఆటపాటలు, కథలు, సంభాషణ నైపుణ్యాలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పుతున్నారు. పుట్టిన వెంటనే తల్లులు, చిన్నారుల పేర్లను అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడం ద్వారా బాలింతలకు పోషకాహారం, చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఖాళీల భర్తీతో మరింత బలోపేతం.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 1,869 మంది టీచర్లు, 1,103 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇంకా 191 టీచర్ పోస్టులు, 957 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమీప కేంద్రాల టీచర్లు ఖాళీగా ఉన్న కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వారికి అదనపు భారంగా మారుతోంది. గతేడాది నుంచి ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపినా ఇంకా భర్తీ చేయలేదు. పోస్టుల భర్తీతో పాటు ఆయా సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తే లబ్ధిదారులకు మరింతగా సేవలు అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలలుగా అద్దె పెండింగ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అద్దె చెల్లించక ఇంటి యజమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతోందని వాపోతున్నారు. అలాగే, రెండేళ్లుగా ఈవెంట్ బిల్లులు, మూడేసి నెలలుగా ఆరోగ్యలక్ష్మి, గ్యాస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో 785 అంగన్వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఒక్కో భవనానికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల చొప్పున ఆరు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అలాగే, సంక్షేమశాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాలు వివరించేందుకు ఈవెంట్లకు రూ.200 నుంచి రూ.500 వెచ్చిస్తుండగా ఒక్కో సెంటర్కు దాదాపు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు చెల్లించాల్సి ఉంది. అంగన్వాడీలకు వచ్చేలా చర్యలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమీప చిన్నారులు చేరేలా అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాం. వారం రోజుల్లోనే మంచి ఫలితాలు నమోదయ్యాయి. చిన్నారులను చేర్పించే కార్యక్రమం కొనసాగిస్తూనే, కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. అలాగే, అద్దె బకాయిలు, ఈవెంట్ బిల్లులపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించాం. చిన్నారులందరికీ యూనిఫామ్ ఇచ్చేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమశాఖ అధికారిఈసారీ కొందరికే యూనిఫామ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తోంది. అయితే, జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయస్సు వారు 33,800 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 2,800 ఉన్నారు. అయితే, గత ఏడాది 612 కేంద్రాల్లోని 6,362 పిల్లలకే యూనిఫామ్ పంపిణీ చేశారు. అమ్మాయిలకు గౌన్, అబ్బాయిలకు నిక్కరు, చొక్కా కుట్టించి ఇవ్వగా.. మిగతా మిగతా కేంద్రాల్లో చిన్నారులకు నిరాశ ఎదురైంది. ఈసారి సైతం జిల్లాలో అదే సంఖ్యలో యూనిఫామ్ పంపిణీ చేయనున్నారని తెలుస్తుండగా.. అందరికీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల చిన్నారులకు యూనిఫామ్ ఇచ్చి మిగతా వారిని విస్మరించడం సరికాదని చెబుతున్నారు. -
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామంలో సర్వే నంబర్ 196లో ఉన్న 9.9 ఎకరాల భూమిని కోర్టు ఆదేశాలతో గురువారం ఖమ్మం అర్బన్ ఆర్ఐ వాహిద్, సర్వేయర్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో.. సర్వేనంబర్ 196లోని భూములను గతంలో ఇద్దరు రైతులకు అసైన్మెంట్ రూపంలో కేటాయించారు. అయితే, స్వయంగా సాగు చేసుకోవాలే తప్ప విక్రయించొద్దనే నిబంధన విధించారు. కానీ వారిద్దరు ఇతరులకు అమ్మగా.. ఆపై ఇంకొన్ని చేతులు మారినట్లు తేలింది. ఈనేపథ్యాన కోర్టు సూచనల మేరకు 9.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సైదులు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించగా, ఎవరూ ఆక్రమించకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఇతరులకు అమ్మినట్లు తేలడంతో చర్యలు స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.50కోట్లు!ప్లాట్ల యజమానుల్లో ఆందోళన సీలింగ్ భూములు తీసుకున్న వారు సాగు చేయకపోవడమే కాక ఇతరులకు విక్రయించారు. ఆపై చేతులు మారగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకుని ప్లాట్లుగా విడగొట్టి 80 మందికి విక్రయించినట్టు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకోవడంతో విషయం తెలియక ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియగానే పలువురు అక్కడకు చేరుకుని డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించడం కనిపించింది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్, శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.3లక్షలకు మించని అభ్యర్థులు శుక్రవారం లోగా http.// twd. telangana gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై ఆబ్జెక్టివ్ టైప్, ఆస్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి డీఎంహెచ్ఓ జయలక్ష్మి గుండాల : ప్రజల ఆరోగ్యంపై సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయలక్ష్మి అన్నారు. ఆళ్లపల్లి పీహెచ్సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, రక్తహీనతపై ప్రతీ గ్రామాన్ని, పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. పాము, తేలు, కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అనంతరం అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాల, మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి సికిల్సెల్ పరీక్షలను పరిశీలించారు. ఆమె వెంట వైద్యాధికారి సంఘమిత్ర, రేవంత్, సీహెచ్ఓ సోమ్లా నాయక్, ఎస్యూఓ హరికృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, హెచ్ఏ నరేష్, శ్రీధర్బాబు, రేవతి, సావిత్రి, రమణ తదితరులు పాల్గొన్నారు.