Bhadradri District Latest News
-
మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి
ఇల్లెందురూరల్: మూడు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుండగా.. కుటుంబ సభ్యులంతా నూతన రంగులతో ముస్తాబు చేసుకున్నారు. శుభలేఖలు బంధువులకు ఇచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురి తండ్రి మృతిచెందాడు. దీంతో ఆ ఇంట్లో ఊహించని విషాదం అలుముకుంది. పట్టణంలోని 24 ఏరియాకు చెందిన పిల్లి శ్రీనివాస్ అలియాస్ ఏసుదాస్ (60) సింగరేణి గెస్ట్హౌస్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలుండగా.. ఇద్దరి వివాహాలు అయ్యాయి. ఈ నెల 30న తన ఉద్యోగ విరమణ ఉండటంతో ఆలోపు మూడో కుమార్తె సునీత పెళ్లి చేయాలని నిర్ణయించారు. గోదావరిఖని వాసి ప్రసాద్తో సంబంధం కుదిర్చి.. ఈ నెల 16వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. శ్రీనివాస్ బంధువులకు శుభలేఖలు పంపిణీ చేసేందుకు శుక్రవారం మండలంలోని కొమరారం వెళ్లి.. తిరిగి వస్తున్నాడు. మామిడిగూడెం సమీపంలో ఎదురుగా వచ్చిన కోతులను తప్పించబోయి నేరుగా చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి -
ఎస్హెచ్జీలకు అండగా..
● బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్న ప్రభుత్వం ● సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షలు పరిహారం ● ఉమ్మడి జిల్లాలో 43,521 స్వయం సహాయక సంఘాలు చుంచుపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం పాటుపడుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి రుణాలు అందిస్తోంది. మహిళాశక్తి పేరుతో ప్రత్యేక రుణాలను అందించడంతోపాటు చిరు వ్యాపారాలను కూడా ప్రోత్సహిస్తోంది. తాజాగా రూ.10 లక్షల వరకు ప్రమాద పరిహారం వర్తింపజేసేలా రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు ఎస్హెచ్జీ సభ్యులు మృతి చెందితే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ప్రమాద బీమాను 2024 మార్చి 14 నుంచి వర్తింపజేయనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మృతి చెందిన సభ్యులు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోయి ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల్లో రుణ బకాయిలు మినహాయించుకుని మిగతా పరిహారం బాధిత కుటుంబాలకు అందజేస్తారు. సహజ మరణం పొందిన సభ్యులకు మాత్రం రూ.2 లక్షల లోపు రుణ బకాయిలు ఉంటే డబ్బులను ప్రభుత్వమే చెల్లించి వారి రుణ ఖాతాలను మూసివేయనుంది. ఉమ్మడి జిల్లాలో 43,521 ఎస్హెచ్జీలు గతంలోనూ సభ్యులు కొంత మేర ప్రీమియం చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం జోడించి బీమా సౌకర్యాన్ని కల్పించేది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించడంతో బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో 43,521 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,54,313 మంది మహిళలు సభ్యులు కొనసాగుతున్నారు. వీరికి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రుణ, ప్రమాద బీమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రమాదంలో సభ్యురాలు మృతి చెందినా, వంద శాతం వైకల్యం కలిగినా రూ.10 లక్షలు అందిస్తారు. 50 శాతం వైకల్యం కలిగితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. మృతిచెందిన మహిళలకు పొదుపు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. ఇందుకు గాయాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం ధ్రువపత్రాలు, చికిత్స పొందిన ఆస్పత్రి పత్రాలు, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. బీమా సౌకర్యం 18 నుంచి 60 ఏళ్ల వయసున్న సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటివరకు రుణం పొందిన మహిళల్లో ఎవరైనా మరణిస్తే వడ్డీతో కలిపి ఆమె కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఎంతో ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు కల్పించిన ప్రమాద బీమా సౌకర్యంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగనుంది. ప్రమాదంలో మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం వర్తిస్తుంది. దీనిపై మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. –ఎం.విద్యాచందన, డీఆర్డీఓఉమ్మడి జిల్లాలో ఎస్హెచ్జీల వివరాలు ఖమ్మం భద్రాద్రి మండలాలు 20 22వీఓలు 1,017 981ఎస్హెచ్జీలు 25,106 18,415సభ్యులు 2,72,701 1,81,612 -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలం: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ముందస్తు జాగ్రత్తలను పాటించాలని చెప్పారు. సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని, 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. చర్ల, దుమ్ముగూడెం, సింగరేణి, కారేపల్లి మండలాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, ఆయా మండలాల్లో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పాటించాలని, డెంగ్యూ నిర్ధారణ కేసులు నమోదైన గ్రామంలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలని సూచించారు. వైద్యాధికారులు చైతన్య, రామకృష్ణ, జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజ శ్రీ పాల్గొన్నారు. మెరిట్ విద్యార్థులకు అభినందనలు గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల్లో చదివి జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్లలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పీఓ అభినందించారు. శుక్రవారం విద్యార్థులు పీఓ రాహుల్ను ఆయన చాంబర్లో కలవగా వారిని శాలువాతో సత్కరించారు.ఉన్నత విద్యలో సైతం ఇదే విధంగా ప్రతిభ చాటాలని సూచించారు. గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, బాలస్వామి, పద్మావతి, రమేష్, నరసింహారావు, శ్రీనివాస్, సత్యనారాయణ, రమేష్ , హరీష్, కేశవరావు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
మలేరియాతో వ్యక్తి మృతి..?
అశ్వారావుపేటరూరల్: తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పాతరెడ్డిగూడేనికి చెందిన ఉమ్మల చిన్నవెంకటరెడ్డి (38) పది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. బుధవారం జ్వరం తీవ్రంకావడంతో మండలంలోని వినాయకపురం పీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ, కుటుంబీకులు గురువారం సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మలేరియా కారణంగానే చిన్న వెంకటరెడ్డి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వినాయకపురం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం పాతరెడ్డిగూడెంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరుగురు జ్వరాలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. పీహెచ్సీ వైద్యులు రాందాస్నాయక్ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తే మలేరియా జ్వరం నిర్ధారణ కాలేదని, జ్వరం అధికంగా ఉండటంతోపాటు ప్లేట్లెట్లు పడిపోవడంతో కొత్తగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశామని చెప్పారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
మెనూ పక్కాగా అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. విద్యాశాఖ కోఆర్డినేటర్లు నాగరాజశేఖర్, ఓ.సైదులు, సతీష్కుమార్, శ్రీనివాసరావు, బాబూలాల్, రవి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
రక్తదాతలు.. ప్రాణదాతలు..
భద్రాచలంఅర్బన్: ఎన్నో సందర్భాల్లో రక్తం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చినప్పటికీ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాక తనువు చాలించాల్సిన ఘటనలు అనేకం. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. ఈ రక్తాన్ని కేవలం మరో వ్యక్తి నుంచే సేకరించాలి. అందుకే రక్తదానానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం రక్తదానంపై విద్యావంతులు, యువకుల్లో అవగాహన పెరిగింది. అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. రక్తదానం వెలకట్టలేనిది. సరైన సమయానికి దొరికితే ఓ నిండు ప్రాణం నిలబడుతుంది. రక్తదానం అన్నది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం. రక్తం ఆవశ్యకత తెలిసినప్పటికీ ఇప్పటికీ రక్తదానం చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తూనే ఉన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ భావన బలంగా ఉంది. అయితే ఆరోగ్యవంతులు రక్తదానం చేస్తే మరింత ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. రక్తదానం కోసం వాట్సప్ గ్రూపులు.. ప్రస్తుతం కొందరు యువకులు రక్తదానం చేసేందుకు చాలా చొరవ చూపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండటంతో సామాజిక దృక్పథం గలవారితో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి తద్వారా అవసరమైన వారికి రక్తదానం చేయిస్తున్నారు. ఎవరికై నా పలానా బ్లడ్ గ్రూపు కావాల్సి ఉందని వివిధ రకాల గ్రూపుల్లో మెసేజ్ పెట్టినా రక్తం అందుతోంది. ఇలా భద్రాచలంలో మొత్తం 7 వాట్సాప్ గ్రూప్లు నిత్యం రక్తదానాలపై పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్ బ్లడ్ బ్యాంకుగా.. మొబైల్ ఫోన్నే ఓ బ్లడ్ బ్యాంకుగా కూడా సృష్టించుకోవచ్చు. స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నంబర్లు ఫీడ్ చేసుకునే సమయంలోనే వారి బ్లడ్ గ్రూపు కూడా ఫీడ్ చేసుకుంటే అదే ఓ బ్లడ్ బ్యాంక్ అయ్యే అవకాశముంది. ఎవరికై నా ఏదైనా గ్రూపునకు సంబంధించి బ్లడ్ అవసరం అని తెలియగానే మన మొబైల్ ఫోన్లో ఆ గ్రూపుబ్లడ్ వారికి ఫోన్చేసి రక్తదానం చేసే ఏర్పాటు చేయించవచ్చు. ఎవరు రక్తదానం చేయవచ్చు..? రక్తదానం చేయడానికి ఉండాల్సింది రెండే అర్హతలు. చక్కటి ఆరోగ్యం, మంచి మనసు. 19 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన సీ్త్ర, పురుషులు ఎవరైనా 45 కేజీల బరువు పైబడి ఉన్నవారు, 12.5 ఎంజీ హిమోగ్లోబిన్ కలిగిన వారు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు నిస్సంకోచంగా రక్తదానం చేయవచ్చు. ఎంత రక్తం సేకరిస్తారు? ఒక మనిషి నుంచి కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారు. సాధారణంగా మనుషుల్లో 5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే ఒక లీటరు వరకు రక్తం పోతుంది. అయినా మనిషికి ఏమీకాదు. దీన్ని తెలుసుకుంటే కేవలం 300 మిల్లీలీటర్ల రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదని అర్థమవుతుంది. బ్లడ్ డొనేషన్పై యువకుల్లో పెరిగిన అవగాహన ఆపద సమయాల్లో రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న యువత నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తదానంతో ప్రయోజనాలు.. రక్తదానంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తదానం చేయడం వల్ల శరీరంలో పాత రక్తం పోయి కొత్తరక్తం ఉత్పత్తి అవుతుంది. బ్లడ్ ప్లాస్మా కూడా పునరుజ్జీవం పొంది ల్యూకోసైట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. రక్తదానం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కేన్సర్ను దూరం చేస్తుంది. రక్తదానం చేస్తుండటం వల్ల శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గుర్తించవచ్చు. -
బాలకార్మికులను గుర్తించాలి
చండ్రుగొండ : బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన అధికారులకు సూచించారు. మండలంలోని అయన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తొలుత పిల్లలతో విద్యాభ్యాసం చేయించారు. పలకలు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పీఎంశ్రీ నిధులతో నిర్మించిన తరగతి గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, ఇతర సైదులు, నాగరాజశేఖర్, బయ్యారపు అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బ్యాటరీల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
అశ్వారావుపేటరూరల్: పార్కింగ్ చేసి ఉన్న వాహనాల నుంచి విలువైన బ్యాటరీలను అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట శివారులో శుక్రవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కిశోర్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా రెండు బ్యాటరీలను గుర్తించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా.. వినాయకపురం వద్ద రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్టర్, డోజర్ (బ్లేడ్ ట్రాక్టర్) నుంచి వాటిని అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఆటోను సీజ్ చేసి, చోరీ చేసిన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న బ్యాటరీల విలువ రూ.15 వేలు ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు. -
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన హెచ్ఎం
దుమ్ముగూడెం: అతనో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ప్రస్తుతం ఆయనలా పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ఎక్కడ చదివిస్తారో అందరికీ తెలిసిందే. కానీ, ఈయన మాత్రం తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మండలంలోని నారాయణరావు పేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంజా శ్రీనివాసరావు బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తన కుమార్తెకు 4వ తరగతిలో అడ్మిషన్ ఇచ్చారు. గతేడాది భద్రాచలంలో చదివిన చిన్నారి.. ప్రస్తుతం ఈ పాఠశాలలో చేరింది. ప్రభుత్వ జీతం వేలల్లో తీసుకుంటూ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేవారు ఎంతో మంది ఉండగా.. ప్రధానోఫాధ్యాయుడు శ్రీనివాసరావు తీసుకున్న ఈ నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇదిలాఉండగా బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు పూలబొకేలు అందచేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సర్వేశ్దొర, నాగభూషణం, కోటేశ్వరరావు, మల్లం వెంకటేశ్, మల్లయ్య, వీరయ్య, కల్యాణి, సుభద్ర, హరిలాల్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
ములకలపల్లి: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా అన్నదాతలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు సూచించారు. మండల పరిధిలోని జగన్నాథపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 45 రోజులపాటు క్లస్టర్ పరిధిలోని 66 గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, ఆయిల్పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాంకేతిక విజ్ఞానాన్ని వివరించినట్లు పేర్కొన్నారు. తొలుత శాస్త్రవేత్తలు నీలిమ, కోటేశ్వరరావు రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ రవికుమార్, కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్కుమార్, ఎంఏఓ అరుణ్బాబు, ఏఈఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణకవచ ధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్కిల్ ట్రైనింగ్కు 28 మంది ఎంపికసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం బాబూక్యాంపులోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్మేళాలో 52 మంది పేర్లు నమోదు చేసుకోగా, 28 మంది ట్రైనింగ్కు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ వివరాలు వెల్లడించారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తూ వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందని, ఆ తర్వాత అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్, ఫుడ్ అండ్ బేవరేజ్ స్టెవార్డ్, రిటైల్ సేల్స్ అసోషియేట్లలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ వార్డుల విభజనపై ఆరాఅశ్వారావుపేటరూరల్: కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియను శుక్రవారం వార్డుల విభజన ప్రత్యేకాధికారి, మధిర మున్సిపాలిటీ కమిషనర్ ఏ.సంపత్ పరిశీలించారు. పలు ప్రాంతాలను సందర్శించి విభజనపై ఆరా తీశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టణ ప్రణాళిక అధికారి వలసాల శ్రీనివాసరావుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది ఎం.కామేష్, నాగేంద్ర, రమణ, మురళి, కట్టా శ్రీను పాల్గొన్నారు. -
కౌలు రైతులకు సాయమేది..?
● రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ● అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆ ఊసేలేదు ● పెట్టుబడులకు ప్రైవేటు అప్పులతో ఆర్థిక భారంబూర్గంపాడు: కౌలు రైతులకు పంటల పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆ ఊసెత్తటం లేదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వక, రైతు భరోసా అందక కౌలు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడులకు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపటం లేదు. పంటల అమ్మకానికీ, ఎరువులు కొనుగోలుకూ నానా యాతన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వ్యవసాయ సీజన్లు ముగిసినా కౌలు రైతులకు మాత్రం రూపాయి సాయం అందలేదు. జిల్లాలో 42వేల మందికి పైగానే.. జిల్లాలో 42 వేల మందికి పైగా కౌలు రైతులున్నారు. వీరిలో 90శాతం మంది చిన్న సన్నకారు రైతులే. తమకు ఉన్న ఎకరం, అరెకరం భూమితో పాటుగా మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత అందటం లేదు. కనీసం బ్యాంకుల్లో పంట రుణాలకు కూడా వీరు అర్హులు కాలేకపోతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వపరంగా అందించే సాయం పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్న పట్టాదారుల పేరుమీదనే కొనుగోలు చేయాల్సి వస్తుంది. పెరిగిన కౌలు ధర జిల్లాలో సుమారు 1.65 లక్షల ఎకరాల భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నట్లు అంచనా. గత రెండేళ్లుగా భూముల యజమానులు కౌలు ధరను అమాంతం పెంచారు. మాగాణి భూముల కౌలు ఎకరం రూ.18వేల నుంచి రూ.20వేల వరకు, పత్తి సాగు చేసే మెట్ట భూములకు రూ.20 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరిగింది. మిర్చి, పొగాకు, కూరగాయల పంటల సాగు చేసే భూములు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 35 వేల వరకు పెంచారు. కౌలు ధరలతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్ దుక్కులు, కూలీల వేతనాలు కూడా ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక అప్పుల పాలవుతున్నారు. అప్పుల బాధతో ఇటీవల కాలంలో కౌలు రైతుల ఆత్మహత్యలకు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఎన్నికల హామీ మేరకు రైతుభరోసా అందించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
మక్కా పాదయాత్రికుడికి సత్కారం
ఇల్లెందు: పట్టణంలోని నంబర్–2 బస్తీకి చెందిన అబీద్ మూడు దేశాలను చుట్టి 7,500 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా నడిచి వెళ్లి మక్కా యాత్రను విజయవంతం చేసుకుని ఇల్లెందుకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం సత్కరించారు. బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, జేకే శ్రీనివాస్, శీలం రమేశ్, చోటిమియా, అబ్దుల్ నబీ, అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేశ్, చాంద్పాషా, భుక్యా సురేశ్, నీలం రాజశేఖర్, సన రాజేశ్, సాతల్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఖమ్మంమామిళ్లగూడెం: వచ్చే నెల 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం రీజియన్లోని మణుగూరు, సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. జూలై 8న సాయంత్రం 7 గంటలకు ఖమ్మం నుంచి, మణుగూరు నుంచి 6 గంటలకు, సత్తుపల్లి నుంచి 7 గంటలకు బయలుదేరే బస్సులు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత 9వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. అలాగే, 10వ తేదీన గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం మధ్యాహ్నం బయలుదేరే బస్సులు 11వ తేదీన ఉదయం డిపోలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఖమ్మం, సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.2,500, మణుగూరు నుంచి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.2,750 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్ఎం తెలిపారు. ఇతర వివరాలు, రిజర్వేషన్ కోసం మణుగూరు డిపో మేనేజర్ (99592 25963), సత్తుపల్లి డీఎం 99592 25962, ఖమ్మం డీఎం 99592 25958 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారినట్లు ఎస్ఈ జి.మహేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఈ, డీఈల ఫోన్ నంబర్ల వివరాలిలా ఉన్నాయి. ఎస్ఈ – 87124 85815 డీఈ(టెక్నికల్) – 87124 85816 కొత్తగూడెం డీఈ – 87124 85849 పాల్వంచ డీఈ – 87124 85949 భద్రాచలం డీఈ – 87124 86022 నాణ్యతతో చెక్డ్యాం నిర్మాణం చేపట్టాలిదుమ్ముగూడెం : మండలంలోని బొజ్జిగుప్ప గ్రామంలో చేపట్టిన చెక్డ్యామ్ పనులు నాణ్యంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రవికుమార్ సూచించారు. శుక్రవారం ఆయన చెక్డ్యాంను క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సయ్యద్ అహ్మద్ జానీ, వెంకటరమణ, మధుసూదన్రావు, రవీందర్, రాజ్సుహాస్, శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు జూలూరుపాడు: స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు జూలూరుపాడు పోలీస్స్టేషన్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ సమయంలో కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో పాల్వంచకు చెందిన డ్రైవర్ శివప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. ముగ్గురు పిల్లలతో వివాహిత అదృశ్యం ములకలపల్లి: ముగ్గురు పిల్లలతో వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. అన్నపురెడ్డిపల్లి మండలానికిి చెందిన సునీతకు ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కుక్కముడి నవీన్తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు కుమార్తెలున్నారు. గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులను వెళ్లగా, సునీత పిల్లలతో కలిసి బయటికి వెళ్లింది. ఇంటికొచ్చిన కుటుంబీలకు ఎవరూ కనిపించకపోవడంతో సునీత తల్లిదండ్రులను ఆరాతీయగా అక్కడికీ రాలేదని తెలిసింది. సునీత తండ్రి మహంకాళి శ్రీను శుక్రవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే. మురళీధర్రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్లోని టెక్నికల్ సర్వీసెస్లో జీఎం వి.రామమూర్తిని డైరెక్టర్ ఈ అండ్ ఎం విభాగానికి, జైపూర్లోని ఎస్టీపీపీ పీసీఎస్ జీఎం కొండారెడ్డి శ్రీనివాసులు ఎస్టీపీపీ ఈఅండ్ఎంకు, కార్పొరేట్లోని ఎంపీ డిపార్ట్మెంట్ అడిషినల్ జీఎం పి.మురళీకృష్ణను టెక్నికల్ సర్వీసెస్కు, ఆర్జీ–2 ఏరియా ఇంజనీర్ నర్సింహరావును జైపూర్లో ఎస్టీపీపీకి బదిలీచేశారు. వీరందరూ ఈ నెల 21వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘అరుదైన’ అన్వేషణ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నెల రోజుల క్రితం చైనా, అమెరికాల మధ్య మొదలైన టారిఫ్ల వార్ ఇటీవల సద్దుమణిగింది. తన దగ్గరున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ను (అరుదైన మూలకం) అమెరికాకు ఎగుమతి చేయడంపై చైనా ఆంక్షలు విధించడంతో అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గక తప్పలేదు. దీన్నిబట్టి అంతర్జాతీయంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎంతో ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ రంగంలో మైనింగ్కు సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. కీలక ఒప్పందం రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ ప్రారంభించేందుకు సింగరేణి ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) – భువనేశ్వర్ అనుబంధ సంస్థగా ఉన్న ఇన్సిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో ఇటీవల ఒప్పందం చేసుకుంది. సింగరేణి గనులు ఉన్న ప్రాంతంలో రేర్ ఎర్త్ మినరల్స్ను కనుగొనడం, దేశ పారిశ్రామిక అవసరాలను ఆ మినరల్స్ ఏ మేరకు ఉపయోగపడతాయనే అంశాలపై ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. అరుదైన ఖనిజాల ఆనవాళ్లు గోదావరి – ప్రాణహిత లోయలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. సంస్థ పరిధిలో 22 భూగర్భ గనులు, 18 ఓపెన్కాస్ట్ గనులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఓపెన్ కాస్ట్ గనులు ఉన్న చోట అరుదైన ఖనిజాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గును థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పంపుతున్నారు. అక్కడ మండించిన బొగ్గు నుంచి వెలువడిన బూడిదలో కూడా కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ అవశేషాలు లభించాయి. ఇప్పటివరకు సింగరేణి ప్రాంతంలో 14 రకాల ఖనిజాల ఉనికిని సైంటిస్టులు కనిపెట్టారు. వీటిలో లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కేటగిరీలో లాంథనమ్, సిరియమ్, ప్రసియోడీమియం వంటి మూలకాలు ఉండగా హెవీ ఎర్త్ ఎలిమెంట్స్ విభాగంలో ఇట్రియం, స్కాండియం, డిస్ఫ్రోజియం తదితర ఎనిమిది రకాల మూలకాల జాడ లభించింది. జిల్లాలో మణుగూరు బ్లాక్ పరిధిలోకి వచ్చే దుర్గం గుట్టలు (వాజేడు మండలం బొగత జలపాతం క్యాచ్మెంట్ ఏరియా) దగ్గర సగటున 266.21 పీపీఎం స్థాయిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన నమూనా పరీక్షల్లో తేలింది. ఉపయోగపడతాయా ? సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతంలో కనిపిస్తున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు డీప్ సైంటిఫిక్ రీసెర్చ్ చేయాల్సిన అవసరముంది. దీని కోసమే భువనేశ్వర్లోని ఐఎంఎంటీతో సింగరేణి చేతులు కలిపింది. దేశీయంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తూనే విదేశాల్లో కూడా రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణలో ఉంది. ముఖ్యంగా లిథియం మైనింగ్ కోసం బొలీవియా, చిలీ, అర్జెంటీనాలో గల అవకాశాలను పరిశీలించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో అరుదైన ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి అవగాహనకు వచ్చినట్టు సింగరేణి యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. గోదావరి లోయలో 14 రకాల అరుదైన ఖనిజాల ఆనవాళ్లు మరిన్ని పరిశోధనల కోసం ఐఎంఎటీతో ఒప్పందం సానుకూల ఫలితాలు వస్తే సింగరేణి దశ తిరిగినట్టే వరుస ప్రకటనలు వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి పదేళ్ల కిందట విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి వచ్చి సానుకూల ఫలితాలు సాధించింది. ఈ రంగంలో దక్కిన విజయాలు అందించిన ఉత్సాహంతో బహుముఖంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఓపెన్కాస్ట్ గనుల నుంచి ఇసుక తీసే విధానం పరిశీలించినా... ఆశించిన ఫలితాలు రాలేదు. ఇల్లెందు, రామగుండంలో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజీ హైడల్ పవర్ ప్లాంట్ అంశం, మణుగూరు దగ్గర జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అంశాల పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు రేర్ ఎర్త్ మైనింగ్ అంశం తెర మీదకు వచ్చింది. అయితే ‘అరుదైన’ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు అందిస్తే సింగరేణి దశాదిశా మారడం ఖాయం. -
హత్య కేసులో 12 మంది అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఏఎస్ఆర్ కాలనీలో ఈ నెల 7న జరిగిన కణితి సతీశ్ హత్య కేసులో పరారీలో ఉన్న 12 మంది నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు గుంజ సాయిని ఈ నెల 10న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వాసి మాగ్దం మొహినుద్దీన్నజీర్, భద్రాచలానికి చెందిన మోటుపలి కామేశ్, వల్లెపు సాంబ, వల్లెపు దుర్గాప్రసాద్, గుంజా గోపిచంద్, గోళ్ల గణేశ్, చెంచాలపు రాహుల్తేజ, గుంజా వెంకటేశ్, ఎటపాక మండలం చేన్నాంపేట వాసి గుండి రాకేశ్, ఎటపాకకు చెందిన బానోత్ మధు, సారపాకకు చెందిన చల్లా అజయ్, మోతుకురి సాయి ఉన్నారని, ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని ఏఎస్పీ వివరించారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు.రామయ్య సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జిభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమమూర్తులను దర్శించుకున్నాక శ్రీ లక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్, ఆలయ ఏఈఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్సూపర్బజార్(కొత్తగూడెం): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పెద్దబజారులోని హమాలీ కార్మికులతో గురువారం నిర్వహించిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. పేదరికంతో చాలామంది బాలలు కార్మికులుగా మారుతున్నారని అన్నారు. అనంతరం కిరాణా షాపులను తనిఖీ చేశారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం సహాయ కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లపోతు సాయి, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.36 మంది సర్వే అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలోని వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది సర్వే అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ విభాగాధిపతి ఎ.జె. మురళీధర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏడుగురు సర్వే అధికారులు, 29 మంది జూనియర్ సర్వే అధికారులు ఉండగా.. వీరంతా ఈనెల 21లోగా కేటాయించిన ఏరియాల్లో జాయిన్ కావాలని సూచించారు. -
11 ఏళ్లుగా సుస్థిర పాలన
చుంచుపల్లి: గత 11 ఏళ్లుగా దేశంలో సుస్థిర పాలన సాగుతోందని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పేరాల శేఖర్రావు, పోరెడ్డి కిషోర్రెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమ విధానాలతో దేశ దశ దిశను మార్చారని తెలిపారు. తద్వారా ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, త్వరలో తెలంగాణలోనూ పార్టీ హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు జీవీకే మనోహర్, నాయకులు విద్యాసాగర్, కృష్టారెడ్డి పాల్గొన్నారు. -
ఊపందుకోని సాగు
● వర్షాభావ పరిస్థితులతో ముమ్మరంకాని వ్యవసాయ పనులు ● జిల్లాలో ఇప్పటివరకు 27,620 ఎకరాల్లోనే పంటల సాగు ● వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 6,03,124 ఎకరాలుసూపర్బజార్(కొత్తగూడెం): వానాకాలం సీజన్లో రైతులు పంటల సాగు మొదలుపెట్టినా ఇంకా ఊపందుకోలేదు. తొలకరి పలకరించినా వర్షాభావ పరిస్థితులతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులు ఉన్న చోట సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాధార ప్రాంతాల్లో అన్నదాతలు ఆకాశంకేసీ చూస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం 21,016 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. అధికంగా టేకులపల్లి మండలంలో 8,036 ఎకరాలు, అశ్వాపురం మండలంలో 1,980 ఎకరాలు, బూర్గంపాడు మండలంలో 7,250 ఎకరాలు, సుజాతనగర్ మండలంలో 845 ఎకరాల్లో పత్తి విత్తారు. మొక్క జొన్న 69 ఎకరాలు, పెసర 22 ఎకరాలు, పచ్చిరొట్ట ఎరువు కోసం ఉపయోగించే జీలుగు 3,087 ఎకరాలు, జనుము 152 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం 27,620 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 6,03,124 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడంతో కేవలం 27,620 ఎకరాల్లోనే రైతులు సాగు పనులు చేపట్టారు. రాబోయే రోజులో వర్షాలు పెరిగితే ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపట్టనున్నారు. 10 మండలాల్లో వర్షాభావం.. జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, బూర్గంపాడు, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. చర్ల, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచ, దమ్మపేట మండలాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 37.9 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా శ్రీహరి
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్థానంలో శ్రీహరిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్గా నియమించారు. అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉమ్మడి వరంగల్కు కొనసాగిస్తూ, నల్లగొండ ఇన్చార్జ్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు. -
బాలలు బడిలోనే ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): బడి ఈడు బాలలందరూ బడిలో ఉండాలని, బాలకార్మికులుగా ఎవ రూ మిగిలి పోకూడదని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ బాలకార్మి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపా రు. బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలుత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎండి షర్ఫుద్ధీన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరికుమారి, డీసీపీయూ యూనిట్ బాధ్యులు అజీజ్, నాగరాజు, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
చల్లారని మంటలు!
● రామయ్య భూముల వ్యవహారంలో తరచూ ఘర్షణ ● తాజాగా గ్రామస్తులు, ఆలయ సిబ్బంది నడుమ వాగ్వాదం ● భూముల అప్పగింతలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం ● అవి తమవేనంటున్న రైతులు భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూముల వివాదం ఆగేలా లేదు. ఆలయ భూములున్న ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు, రైతులకు – దేవస్థానం సిబ్బందికి నడుమ జరుగుతున్న వాగ్వాదాలు, గొడవలు ఆరని మంటల్లా సాగుతూనే ఉన్నాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూములు అప్పగించడంలో ఏపీ ప్రభుత్వం, అధికారుల వైఫల్యం ఉందని దేవస్థానం వర్గాలు అంటుండగా, ఆ భూములు తమవేనని పురుషోత్తపట్నం గ్రామస్తులు వాదిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నిరంతర రణరంగంలా మారుతోంది. ఏపీ ప్రభుత్వ వైఫల్యమే.. రామయ్య భూములను ఆలయానికి అప్పగించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని దేవస్థానం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూములకు సంబంధించి గతంలో ఏపీ హైకోర్టుకు ఆధారాలతో వెళ్లగా, న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెబుతున్నాయి. 12 శాఖలకు చెందిన అధికారులు దేవస్థానానికి భూములను అప్పగించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా వారు పట్టించుకోవడం లేదని ఆలయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఆలయ భూముల్లో రేకుల షెడ్ నిర్మిస్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మళ్లీ వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ సీఎంను కలిసేందుకు ప్రణాళికలు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా, ఆలయానికి భూములను అప్పగించేడాల చూడాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూములను అప్పగించడంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు సహకరించడం లేదని, దీంతోనే వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే గాని రామయ్య భూములు స్వాధీనం కావని వివరించే అవకాశం ఉంది. ముందుకు సాగని అభివృద్ధి పురుషోత్తపట్నంలోని భూములు, వాటిపై వచ్చే ఆదాయం ఆలయానికి అందకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. అయితే ఆ భూములు తమవేనని పురుషోత్తపట్నం గ్రామస్తులు వాదిస్తున్నారు. 917 ఎకరాల భూమిని సోమరాజు పురషోత్తమదాసు అనే భక్తుడు 1878లో రామాలయానికి దానం చేశాడని, ఆ భూమిని నైజాం కాలంలో వరంగల్ తాలూకాలో వేలం వేయగా మహ్మద్ హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడని వారు చెబుతున్నారు. అనంతర కాలంలో ఆ భూములు క్రయ విక్రయాలు జరుగుతూ తమవద్దకు వచ్చాయని అంటున్నారు. దీనిపై తాము తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని, స్టేటస్ కో ఉందని వాదిస్తున్నారు. ఆక్రమణలో 750 ఎకరాలు.. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,350 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం 889 ఎకరాల భూమి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో ఉంది. ఇందులో దాదాపు 750 ఎకరాల భూమి ఆక్రమణకు గురయి ఉంటుందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన భూమి అయినా కాపాడుకునేందుకు దేవస్థానం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూముల్లోనే సుమారు 104 ఎకరాల్లో గోశాలతో పాటు చెరువు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఈ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులు.. తరతరాలుగా తమవేనని వాదిస్తున్నారు. జామాయిల్ సాగుతో పాటు శాశ్వత నిర్మాణాలు, ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పుడల్లా ఆలయ అధికారులు, సిబ్బంది అడ్డుకోవడం, వాగ్వాదం జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తోపులాటలు, భౌతిక దాడులతో రామయ్య భూములు రణరంగంగా మారుతున్నాయి. -
సింగరేణి డైరెక్టర్(పా)గా గౌతమ్ పొట్రు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి డైరెక్టర్(పా)గా గౌతమ్ పొట్రును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న గౌతమ్.. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వర్తించారు. కాగా, 2014 నుంచి సింగరేణిలో పూర్తిస్థాయి డైరెక్టర్(పా) ఐఏఎస్ను నియమించకుండా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాలన కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిని నియమించడం పట్ల కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
హెచ్ఎం పిల్లలిద్దరూ ప్రభుత్వ పాఠశాలలోనే..
టేకులపల్లి: మండలంలోని గోలియాతండా పంచాయతీ వాగొడ్డుతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాణోతు లక్ష్మా(దివ్యాంగుడు) తన పాఠశాలలోనే ఐదో తరగతి పూర్తి చేసిన కుమారుడిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించాడు. కూతురిని ఇప్పటికే టేకులపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ పలువురుగా ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా లక్ష్మాను హైస్కూల్ హెచ్ఎం మేరుగు శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. తుమ్మలచెలక హెచ్ఎం పూల్సింగ్ చొరవ తీసుకుని గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఎనిమింది మంది విద్యార్థులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేర్పించారు. పాఠశాలల పునః ప్రారంభం రోజు గురువారం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పూలు , పెన్నులు, పెన్సిళ్లు , ఎరేజర్లు అందజేసి స్వాగతించారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. హెచ్ఎం జర్పల పద్మ, ఉపాధ్యాయులు నీరజ షారోన్తోపాటు లోగాని శ్రీనివాస్, మహమ్మద్ ఖాసిం, జ్యోతి రాణి పాల్గొన్నారు. -
కేసీఆర్ను కలిసిన దిండిగాల
ఇల్లెందు: మాజీ సీఎం కేసీఆర్ను హైదరాబాద్లోన ఆయన ఇంటి వద్ద ఇల్లెందు బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, పాలనలో విఫలమైందని ఆరోపించారు. అటవీ సంపదను ధ్వంసం చేస్తే చర్యలుదుమ్ముగూడెం: అటవీసంపదను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధి కారులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. దుమ్ముగూడెం మండలంలో అటవీ అధికారుల విధులను అడ్డుకుని, ప్లాంటేషన్ ధ్వంసం చేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా, కాక సమ్మయ్య అనే వ్యక్తిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఏడు రోజుల రిమాండ్ విధించారని తెలి పారు. గొంది కమల అనే మహిళను స్వంత పూచీకత్తుపై విడుదల చేశామని పేర్కొన్నారు. కుమారుడు అన్నం పెట్టలేదని ఫిర్యాదుతల్లాడ: గొడవ పడిన తన కుమారుడు భోజనం పెట్టలేదంటూ ఓ తల్లిని పోలీసులను ఆశ్రయించింది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన చల్లా తిరపతమ్మకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు జరగగా కుమారుడైన చల్లా అశోక్(తంబి) వద్ద ఆమె ఉంటోంది. అయితే, బుధవారం తల్లితో గొడవపడిన ఆయన భోజనం పెట్టకపోవడంతో తిరపతమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు అశోక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశానికి పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపికకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని పది జిల్లాలనుంచి 30 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల క్రీడాకారులు హాజరుకాగా, సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం ఫిజికల్ టెస్ట్, ఈవెంట్లలో పోటీలు నిర్వమించారు. ఈమేరకు ప్రతిభతో పాటు వైద్య పరీక్షల అనంతరం అర్హులకు అకాడమీ లో ప్రవేశం కల్పించనున్నారు.డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్కోచ్ ఎం.డీ.గౌస్, కోచ్లు ఎం.శ్రీనివాసరావు, ఎం.డీ.అక్బర్ అలీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్, మేనేజర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు రోజుల్లో విద్యార్థులంతా చేరాలి
పాల్వంచరూరల్ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులంతా సోమవారం లోగా చేరుకునేలా వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు చర్య తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అన్నారు. పాల్వంచ గిరిజన బాలికల అశ్రమ పాఠశాల, కొత్తగూడెంలోని పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్ గదులు, డార్మెటరీ, డైనింగ్ హాళ్లు, బాతురూమ్లు, వంటగదులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సుమారు రెండు నెలల పాటు ఇంటివద్ద గడిపిన విద్యార్థులు హాస్టల్కు చేరుకోగానే వాతావరణ మార్పులతో అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని, పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని ఏఎన్ఎంలకు సూచించారు. సురక్షిత తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని, నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని చెప్పారు. వసతిగృహాలు పురాతనంగా ఉన్నాయని, ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్లపైనే ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలుంటే వార్డెన్కు తెలియజేయాలని, చదువు పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. భవిష్యత్ లక్ష్యాల సాధనకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, హాస్టల్ వార్డెన్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వార్డెన్లు, హెచ్ఎంలు ఈ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి హాస్టళ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశం -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు
డీఈఓ వెంకటేశ్వరా చారిచుంచుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు మెరుగైన సౌకరాయలు కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని పెనుబల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఆయన విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, మరో మూడు రోజులు రాగిజావ వంటి పౌష్టికాహారం అందిస్తున్నామని, నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతులు బోధిస్తున్నామని చెప్పారు. పిల్లలను రూ.లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, పాఠశాల హెచ్ఎం నిర్మల, రాజయ్య, శారద హరిలాల్, విజయ, సుజాత, సెక్టోరియల్ అధికారి సైదులు, సీఆర్పీలు మధు, రవి పాల్గొన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. గురువారం ఆయన చుంచుపల్లిలోని జీహెచ్ఎస్, విద్యానగర్లోని ప్రాథమిక పాఠశాల, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న అధునాతన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, జీవన నైపుణ్యాలు మరెక్కడా లభించవని అన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. పలు పాఠశాలల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాలాజీ, కృష్ణయ్య, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, ప్రధానోపాధ్యాయురాలు తబితా సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలలైనా.. ఆచూకీ లేదు!
ఆగిన ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ● జిల్లాకు మంజూరైన జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ● గత నవంబర్లో ప్రకటించిన మంత్రి తుమ్మల ● ఎక్స్లెన్స్ సెంటర్ వస్తే సేంద్రియ సాగుకు మంచి రోజులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాకు మంజూరైనట్టు ప్రకటన వచ్చి ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎక్స్లెన్స్ సెంటర్ను జిల్లాకు తీసుకొచ్చే వరకూ ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. దేశంలో ఐదు ఇన్స్టిట్యూట్లు.. ప్రస్తుతం నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్కు సంబంధించి దేశ వ్యాప్తంగా జోన్ల వారీగా ఐదు ఇన్స్టిట్యూట్లు పని చేస్తున్నాయి. ఇందులో సౌత్ జోన్కు సంబంధించిన సంస్థ బెంగళూరులో ఉంది. దీనికి అనుబంధంగా పని చేసే సెంటర్ను తెలంగాణకు మంజూరు చేశారు. ఈ కేంద్రాన్ని కొత్తగూడెంలో నెలకొల్పాలని మంత్రి తుమ్మల నిర్ణయించారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయిల్ ఫామ్ తరహాలో పూర్తి స్థాయి సంస్థగా ఈ కేంద్రం అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆరు నెలలు గడిచినా ఈ అంశంపై మరో ప్రకటన రాకపోవడంతో జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వస్తే.. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, సేంద్రియ వ్యవసాయంలో పని చేస్తున్న ఎన్జీఓలు, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులంతా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్లో భాగస్వాములుగా ఉంటారు. వీరు స్థానిక రైతులకు, వ్యవసాయ సంఘాలకు సేంద్రియ సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర జిల్లాలకు ఆయా సేవలు, నైపుణ్యాన్ని విస్తరిస్తారు. తెలంగాణకు మంజూరైన సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థలో పని చేసేందుకు దేశ వ్యాప్తంగా పేరెన్నిక గల శాస్త్రవేత్తలు వస్తుంటారు. వీరి రాకపోకలకు సులువుగా ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే కొత్తగూడెం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తుండగా, రైలు కనెక్టివిటీ కూడా ఉంది. రాబోయే నాలుగేళ్లలో కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఈ సంస్థను కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్గానిక్కు డిమాండ్ వ్యవసాయ రంగంలో ఇప్పటికే పురుగుల మందులు, ఎరువుల వినియోగం గరిష్ట స్థాయికి చేరుకున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో సేంద్రియ ఎరువులు, మందులు వాడుతూ పండించే పంటలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అయితే సేంద్రియ సాగును లాభసాటిగా మార్చే పద్ధతులు, నైపుణ్యంపై రైతులకు సరైన అవగాహన, శిక్షణ లేదు. దీంతో కొందరు ఔత్సాహికులు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు సేంద్రియ సాగుపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఎక్స్లెన్స్ సెంటర్ అందుబాటులోకి వచ్చి సేంద్రియ సాగుపై ఉన్న అపోహలు, భయాలు తొలగితే ఇతర ప్రాంతాల రైతులకు జిల్లా అన్నదాతలు మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంటుంది. -
స్కూటీని ఢీకొట్టిన లారీ
బూర్గంపాడు: సారపాకలోని ఆర్చీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీసీ రిటైర్డ్ ఉద్యోగి మృతిచెందాడు. సారపాకలోని మసీద్ రోడ్డులో నివాసముంటున్న గంగుల రాజేశ్వరరావు(65) గురువారం సాయంత్రం సారపాక సెంటర్ నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో భద్రాచలం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో రాజేశ్వరరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ చక్రాల కిందపడటంతో సుమారు 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో శరీరం ఛిద్రమైంది. అతనిని గుర్తు పట్టేందుకు స్థానికులకు కూడా అరగంట సమయం పట్టింది. ఎస్ఐ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతుడు రాజేశ్వరరావు ఐటీసీ పీఎస్పీడీలో రా మెటీరియల్ విభాగంలో మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతిసత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టగా వాహనదారుడు మృతి చెందాడు. సత్తుపల్లి శివారులో గురువారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం కుమురంభీం కాలనీకి చెందిన ఊకే రాము(45), ఏసుబాబు సత్తుపల్లి నుంచి గంగారంవైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఏలూరు వెళ్తూ పట్టణ శివారు పెద్ద వంతెన సమీపా వీరి వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమాన్ని తాకడంతో ఊరే రాము బస్సు వెనుక టైర్ల కిందపడగా తీవ్రగాయాలతో మృతి చెందాడు. అలాగే, ఏసుబాబు కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాము భార్య నాలుగేళ్ల క్రితం మృతిచెందగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో తల్లిని ఇప్పుడు తండ్రిని కోల్పోయిన కుమార్తెలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ట్రాక్టర్ పైనుంచి పడి డ్రైవర్..తిరుమలాయపాలెం: దుక్కి దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడు. మండలంలోని పిండిప్రోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిలారు ఉపేందర్(39) బుధవారం మధ్యాహ్నం ఓ రైతు చేను దున్నేందుకు వెళ్లాడు. ఈక్రమాన ట్రాక్టర్ బండరాయిపైకి ఎక్కడంతో అదుపు తప్పగా కింద పడిన ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మంకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. ఉపేందర్కు భార్య త్రివేణి ఉండగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.రిటైర్డ్ ఐటీసీ ఉద్యోగి మృతి -
గంజాయి సీజ్
భద్రాచలంఅర్బన్: అక్రమంగా తరలిస్తున్న 4.2 కేజీల గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మూడు బైక్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పాల్వంచకు చెందిన ముగ్గురు మైనర్లతోపాటు ఏపీలోని ఏలూరుకు చెందిన పసుపులేటి నాగకుమార్, వంజరపు శ్రీనివాస్, అభిషేక్ ఉన్నారు. వీరు ఒడిశాలోని మల్కన్గిరి నుంచి పాల్వంచకు, అక్కడి నుంచి ఏలూరుకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను, వాహనాలను స్థానిక ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ అప్పగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీ హరిరావు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్అశ్వారావుపేటరూరల్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై యయాతిరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని వడ్డెర బజార్కు చెందిన యువకుడు మక్కెళ్ల మారేష్ మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై కొద్దిరోజులుగా ప్రేమపేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలి తల్లి ఈ నెల 2న ఫిర్యాదు చేయగా, అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు. బెల్లం, పటిక స్వాధీనంజూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండాలో నాటు సారా తయారీకి ఉపయోగించే రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హలావత్ శ్రీనుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నల్లబెల్లం విలువ రూ 23,400, పటిక విలువ రూ .1200 ఉంటుందని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. కరకగూడెంలో...కరకగూడెం: మండలంలోని కలవలనగారం గ్రామ అటవీ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాల బెల్లం, 10 కేజీల పటిక, 10 లీటర్ల గుడుంబాను బుధవారం రాత్రి ఎకై ్సజ్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణుగూరులోని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, నిందితుడు కె.సాగర్పై కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి తెలిపారు. -
గంగానమ్మ ఆలయంలో చోరీ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో గురువారం తెల్లవారుజాము న చోరీ జరిగింది. ఆలయం తలుపు తెరిచి లోపల ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి సుమారు రూ.50 వేలు అపహరించినట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలి పారు. పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై యయాతిరాజు దర్యాప్తు చేపట్టారు. 117 మందికి జరిమానాసూపర్బజార్(కొత్తగూడెం): మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 117 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్టౌన్ పరిధిలో 24 మంది, ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 13మంది, కొత్తగూడెం టూటౌన్ పరిధిలో 30 మంది, సుజాతనగర్ పరిధిలో 10మంది, చండ్రుగొండ పరిధిలో 10మంది, ములకలపల్లి స్టేషన్ పరిధిలో 30మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధించారు. ప్రాణం తీసిన పాల డబ్బుల గొడవఅశ్వారావుపేటరూరల్: పాలు పోసిన డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఎస్సై యయాతిరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని నందమూరినగర్ కాలనీకి చెందిన గొల్ల సత్యవతి అదే కాలనీకి చెందిన షేక్ సమీరాను పాలు పోసిన డబ్బులు ఇవ్వాలని అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న సమీరా బంధువు మౌలాబీ రావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. గమనించిన గొడవను ఆపేందుకు వెళ్లిన సత్యవతి తల్లి గుండుబోయిన మంగ(40)ను కూడా నెట్టివేశారు. ఒక్కసారిగా కింద పడిపోయిన మంగ కొద్ది సేపట్లోనే తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారస్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిచగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుకు గురై మృతి చెందిందనితెలిపారు. మృతురాలి కుమార్తె సత్యవతి ఫిర్యాదుతో మృతికి కారణమైన షేక్ సమీరా, మౌలాబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. కార్మిక సమస్యలపై బీఎంఎస్ ఆందోళనసింగరేణి(కొత్తగూడెం): బొగ్గు పరిశ్రమల అభివృద్ధి, కార్మిక సమస్యల పరిష్కారానికి ఏబీకేఎంఎస్ అనుబంధ బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ సంఘం కార్యదర్శి పి. మాధవనాయక్ తెలిపారు. ఇటీవల బిలాస్పూర్లో జరిగిన యూనియన్ పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం ఆయన వివరించారు. సింగరేణిలో ఉత్పత్తి పేరుతో కాంట్రాక్ట్ల ఆధారిత విధానం విపరీతంగా పెరిగిందని, కార్మికుల భవిష్యత్కు హానికరమని పేర్కొన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పిట్ మీటింగ్లు, గేట్ మీటింగ్లు నిర్వహించి కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 14న జీఎం కార్యాయాల దుట ధర్నాలు, 15 నుంచి 25 వరకు జనసంపర్క అభియాన్ కార్యక్రమాలు, ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్ మీటింగ్లు, మీడియా సమావేశాల ద్వారా ప్రజలలో చైతన్యం కల్గించే కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. -
మా భూమి ఇప్పించండి
సూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట నుంచి కొత్తగూడెం వరకు గత మూడు రోజులుగా పాదయాత్ర చేసిన ఆదివాసీలు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు 80 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతో పాదయాత్రగా చేరుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడేనికి చెందిన ఆదివాసీలు సర్వే నంబర్ 30, 36, 39లో 1954 నుంచి 150 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాయని ఆదివాసీ నాయకుడు మడకం నాగేశ్వరరావు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇచ్చిందని, సాగు చేసుకుంటున్న 573 ఎకరాల భూమి ఆదివాసీలదేనని హైకోర్టు సైతం 2011లో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. అయినా అటవీ శాఖాధికారులు వ్యవసాయం చేయనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ ధర్నా వద్దకు చేరుకుని కలెక్టర్కు సమస్యలు వివరించి పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ఆందోళన -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చుంచుపల్లి/చండ్రుగొండ : భూ సమస్యలు పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. చుంచుపల్లి మండలం ఎన్కే నగర్, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి, వెంకటియాతండా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు, ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు కృష్ణ, సంధ్యారాణి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, కార్యదర్శి ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
బడి.. జ్ఞాపకాల ఒడి
అన్నయ్య ప్రోత్సాహంతోనే.. కొత్తగూడెం అర్బన్: పాఠశాలలో చేర్పించడానికి మా నాన్న తీసుకెళ్తే పారిపోయా. ఈ విషయం తెలిసి మా అన్నయ్య నన్ను వెదికి పట్టుకుని బడిలో అడ్మిషన్ ఇప్పించడమే కాక ప్రతిరోజూ వెళ్లేలా చూసేవాడు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువుకుని ఈ స్థాయికి చేరా. నల్లగొండ టౌన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా, ఆతర్వాత ఎంఏ పూర్తి చేశా. విద్యాశాఖలో ఉద్యోగం సాధించి డీఈఓ స్థాయికి చేరడంతో విద్యారంగంలో జిల్లాను ముందుంచేలా కృషి చేస్తున్నా. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టంతో చదువుతూ లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధనకు కృషి చేయాలి. – ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాశాఖాధికారి బడంటే సంతోషం.. హాస్టలంటే భయం బూర్గంపాడు: పాఠశాల ప్రారంభం రోజే మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయనే లెక్కలు వేసుకుంటూ వెళ్లేవాళ్లం. నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లడం సంతోషంగానే ఉండేది. కానీ అప్పట్లో హాస్టల్లో అన్నంలో పురుగులు, నీళ్ల చారు తలుచుకుంటేనే ఏడుపొచ్చేది. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు పాఠాలు చక్కగా చెప్పేవారు. సరిగా చదవకుంటే తన్నులు తప్పేవి కావు. ఎర్రుపాలెం మండలం కేసిరెడ్డిపల్లిలో నాలుగో తరగతి వరకు, ఆ తర్వాత హాస్టల్లో ఉంటూ ఎర్రుపాలెం జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి వరకు చదివా. ఇప్పుడు విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలి. – వేల్పుల బాబూరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి●ఆవాసాలకు దూరంగా ప్రభుత్వ పాఠశాలలు.. అక్కడ కూడా అరకొర వసతులు.. ప్రైవేట్ పాఠశాలలు అందుబాటులో ఉన్నా అందులో చదివే స్థోమత లేక ఇబ్బందులు.. ఈ సమస్యలు వేధిస్తున్నా.. చదవాలనే తపనకు తోడు గురువుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరిన వారెందరో ఉన్నారు. నేడు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో పలువురు ప్రముఖులను పలకరించగా.. వారి పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ వివరాలు ‘సాక్షి’ పాఠకుల కోసం.. -
ఇష్టంతో కష్టపడి చదివాం..
బూర్గంపాడు: ప్రస్తుత కరకగూడెం మండలంలోని చిరుమళ్ల నుంచి సుమారు 80 కి.మీ. దూరంలోని బూర్గంపాడుకు వెళ్లి చదువుకున్న రోజులు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పాయి. అక్కడ హాస్టల్లోనే ఉన్నా.. సెలవులు వచ్చినప్పుడు, తిరిగి బడికి వెళ్లేటప్పుడు కాలినడకన చెప్పులు లేకుండా అంతదూరం వెళ్లేవాడిని. చదువుపై ఇష్టంతో వాగులు, వంకలు దాటి పుస్తకాలు మోసుకుంటూ తిండీతిప్పలు లేకుండా వెళ్లడంతో మరింత కసిగా చదివా. వేసవి సెలవుల తర్వాత బడికి వెళ్తుంటే స్నేహితులు, ఉపాధ్యాయులను కలుస్తున్నామనే సంతోషం వేసేది. బూర్గంపాడులో 6 – 10వ తరగతి వరకు చదివిన రోజులు ఉన్నత లక్ష్యాలకు బాటలు వేశాయి. అప్పట్లోనే ఓయూలో ఎంఏ, ఎంఫిల్ చేశాక డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చినా కాదనుకుని రాజకీయాల్లోచేరి బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఖమ్మం జెడ్పీ చైర్మన్గా ప్రజలకు సేవ చేశా. ఇప్పుడు పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నందున విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువు కొనసాగించి సమాజహితం కోసం పాటుపడాలి. – చందా లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్● -
ఆదివాసీలకు అండగా ఉంటాం
చర్ల: ఇంతకాలం మావోయిస్టుల చేతిలో నలిగిపోయి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఆదివాసీలకు అండగా ఉంటామని ఎస్పీ రోహిత్రాజు హామీ ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో మండలంలోని 20 గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ మల్టీపర్పస్ మిల్లులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మావోయిస్టులు వారికి తీవ్ర నష్టం కలిగించారని, విద్య, వైద్యం, రహదారులు, కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలు అందకుండా అభివృద్ధికి దూరంగా ఉంచారని అన్నారు. ఇంతకాలం తర్వాత అయినా మావోయిస్టుల ఆగడాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీలు అబివృద్ధిని కోరుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని, ఇప్పటివరకు చదువుకుని ఖాళీగా ఉంటున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి అవకాశాలను చూసుకోవాలని సూచించారు. తమ శాఖ ద్వారా కూడా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే విప్ప నూనె తీసే మిల్లులను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, అన్ని గ్రామాలకు రహదారులు, విద్య, వైద్యం వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇకపై ఎవరూ మావోయిస్టులకు సహకరించొద్దని కోరారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఓఎస్డీ జి.నరేందర్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు భరోసా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు.. భద్రాచలంఅర్బన్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. బుధవారం ఆయన ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారినికి కృషి చేయాలన్నారు. అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ నరేందర్, టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐలు స్వప్న, రామకృష్ణ, శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
ఏరువాక సాగారో...
జేష్ఠ మాస పౌర్ణమి(ఏరువాక పౌర్ణమి) సందర్భంగా జిల్లా రైతులు బుధవారం సాగు పనులను మొదలుపెట్టారు. ఉదయమే పశువులు, నాగళు, ట్రాక్టర్లతో పొలాలకు చేరుకుని పూజలు చేశారు. రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో పీఏసీఎస్ చైర్మన్ మందడపు సుధాకర్ పలువురు రైతులతో కలిసి పూజలు చేయడంతో పాటు మహిళలకు సారె పెట్టి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. నీటి సంఘం మాజీ చైర్మన్ మాధవరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, బాలు తదితరులు పాల్గొన్నారు. ఇక నేలకొండపల్లి తదితర మండలాల్లో కూడా రైతులు దుక్కులు దున్ని సాగు పనులు మొదలపెట్టారు. – రఘునాథపాలెం -
దిశ కమిటీ సమావేశం వాయిదా
చుంచుపల్లి: ఐడీఓసీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరుగనున్న దిశ కమిటీ సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.పంటల సాగుపై అవగాహన ఉండాలికేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మసూపర్బజార్(కొత్తగూడెం): తాము చేసే సాగుపై రైతులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ అన్నారు. చిట్టి రామవరంలో బుధవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అవసరం మేరకే రసాయనిక ఎరువులు వాడాలని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పక రశీదు తీసుకుని భద్రపర్చాలని సూచించారు. పచ్చిరొట్ట పంటలు సాగుచేయడం ద్వారా 30 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. పంటల మార్పిడితో సుస్థిర ఆదాయం పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఈఏసీ సభ్యుడు యాదగిరి, ఉద్యాన శాస్త్రవేత్త బి శివ, మండల వ్యవసాయాధికారి కరుణ, విస్తరణాధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.కొనసాగుతున్న పాదయాత్రములకలపల్లి : అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్లు 30, 36, 39లో గల భూములను తమకే అప్పగించాలని కోరుతూ స్థానిక ఆదివాసీలు కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం ములకలపల్లికి చేరింది. మంగళవారం వారు అశ్వారావుపేట నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తంగా 70 కిలోమీటర్ల మేర నడుస్తూ బుధవారం రాత్రికి పాల్వంచ శ్రీనివాస కాలనీలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడే బస చేశారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కలెక్టర్ కార్యాలయానికి గురువారం చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని ఆదివాసీలు మడకం నాగేశ్వరరావు, మడకం స్వరూప, మొడియం రమాదేవి, కొర్సా శ్రీను, కొర్సా నాగబాబు, మాడి సీతారాముడు, మడకం కన్నారావు తదితరులు తెలిపారు. -
బడిగంట మోగింది..
కొత్తగూడెంఅర్బన్ : వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల ఆవరణలు, తరగతి గదులను స్వచ్ఛ కార్మికులతో శుభ్రం చేయించారు. ఇందుకోసం వారికి జిల్లా స్థాయిలో రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పాఠశాలకు రాగానే పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించాలని ఇప్పటికే డీఈఓ వెంకటేశ్వరాచారి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే బుధవారం సాయంత్రం వరకూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ అలాంటి హడావిడి కనిపించలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అడ్మిషన్ల కోసం ప్రతీ సంవత్సరం చేసే హడావిడి ఈ ఏడాది కూడా కనిపించింది. కొన్ని స్కూళ్లు శిథిల భవనాల్లోనే.. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు నూతన భవనాలు నిర్మించినా.. కొన్ని స్కూళ్లు మాత్రం ఇంకా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినందున అలాంటి స్కూళ్లకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల ఎప్పడో తరాల నాటిది. తరగతి గదులు, ఆఫీసు రూములన్నీ శిథిలావస్థకు చేరి ఉన్నాయి. పాఠశాల చరిత్ర గొప్పగా ఉన్నప్పటీకి సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య ప్రతీ ఏడాది తగ్గిపోతోంది. ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత పాఠశాలల కమిటీలపై ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక చాలా పాఠశాలల్లో వంట షెడ్లు లేకపోవడంతో ఆవరణలోని చెట్ల కింద, నీడ ఉన్న చోటే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇలా ఎండా, వానలకు భోజన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు.. ఇలాంటి సమస్యలు కూడా పరిష్కరిస్తే ఎక్కువ మంది పిల్లలు చేరే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పండుగ వాతావరణంలో ప్రారంభించాలి పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలి. విద్యార్థులు బడికి రాగానే ఆహ్లాదం కలిగేలా ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలి. మొదటి రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తున్నాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వరాచారి, డీఈఓనేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం స్కూళ్లకు చేరిన పుస్తకాలు, యూనిఫామ్ ఏర్పాట్లు సిద్ధం చేసిన ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో ప్రారంభించాలని ఆదేశాలు -
సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడి
కూసుమంచి: రైతులు వ్యవసాయంలో సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తే అధిక దిగుబడులు పొందొచ్చని భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.పద్మావతి తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంండలోని భగవత్వీడులో రైతులకు బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఖరీఫ్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి నూతన వంగడాలు, వాటితో ఉపయోగాలను వివరించడమే కాక కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్త అక్షిత్, ప్రోగ్రాం అసిస్టెంట్ నరేష్, ఏఓ వాణి పాల్గొన్నారు. -
బంక్లోకి దూసుకెళ్లిన లారీ
అశ్వారావుపేటరూరల్: డ్రైవర్ నిర్లక్ష్యంతో బుధవారం ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికు ల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద గల భారత్ పెట్రోల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనదారుడిపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన ద్విచక్రవాహనదారుడు బత్తుల కృష్ణ బైక్ను అక్కడే వదిలేసి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కృష్ణది ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి కాగా, వినాయకపురంలో జేసీబీలను అద్దెకు తిప్పుతున్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు కాగా, బంక్ లోపలికి దూసుకెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు గిరిజనుల అరెస్ట్దుమ్ముగూడెం: మండలంలోని గడ్డోరగట్ట గ్రామ అటవీప్రాంతంలో ట్రంచ్ కొడుతుండగా అడ్డుకున్న ఇద్దరుగిరిజనులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టులో రిమాండ్ చేశారు. పోడుభూముల్లో అటవీశాఖ సిబ్బంది వేసిన ప్లాంటేషన్ను గడ్డోరగట్ట గ్రామానికి చెందిన గిరిజనులు నరికివేశారు. దీనిపై హైకోర్టులో కేసునడుస్తోంది. కాగా బుధవారం ఎఫ్డీఓ సుజాత ఆధ్వర్యంలో ట్రంచ్ కొట్టేందుకు వెళ్లిన సిబ్బందిని అడ్డగించి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్టు రేంజర్కమల తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో శోభన్, ఎఫ్ ఎస్ఓ నందా, బీట్ అధికారి వీరేందర్ పాల్గొన్నారు. ఇద్దరికి పాము కాటుగుండాల: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని పాముకాటు వేసిన సంఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం జరిగింది. సింగారం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు చేను పనికి వెళ్లగా పాముకాటు వేసింది. అడవిరామారం గ్రామానికి చెందిన పాయం సువర్ణ కూడా చేను పనికి వెళ్లగా పాము కరిచింది. బాధితులను ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. వ్యక్తి ఆత్మహత్యటేకులపల్లి: మండలంలోని చింతోనిచెలక తండాకు చెందిన బానోత్ హత్తీరాం (50) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఇరానీ పుట్టింటికి వెళ్లిది. మంగళవారం మధ్యాహ్నం హత్తీరాం కూడా వెళ్లి ఇంటికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమార్తె ఉష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బోడు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి టేకులపల్లి: చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిపై బుధవారం పోలీసులు కేసు నమో దుచేశారు. బోడు ఎస్ఐ పి. శ్రీకాంత్ కథనం ప్రకారం.. బర్లగూడెం గ్రామానికి చెం దిన పూనెం జోగయ్య(49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య, కూతురు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. దీంతో మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 31న పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శిథిల భవనాలతో ప్రమాదం!
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు సిద్ధం.. 8లోజిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1,618 పాఠశాలలు ఉండగా వాటిలో 84,817 మంది బాలురు, 83,928 మంది బాలికలు.. మొత్తం 1,68,745 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్ కోసం జిల్లాకు 2.56 లక్షల మీటర్ల క్లాత్ రాగా ఇప్పటికే కుట్టడం పూర్తయి పాఠశాలలకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో(డీఈఓ పరిధి) చదివే 62,532 మంది విద్యార్థులకు గురువారం పాఠశాలలు ప్రారంభం కాగానే ఒక్కో జత చొప్పున యూనిఫామ్ అందించనున్నారు. ఇక జిల్లాకు 5,08,400 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,46,374 గోదాంలకు చేరాయి. ఇందులో 4,32,576 పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు. -
భద్రాద్రి రామయ్యకు వైభవంగా జ్యేష్ఠాభిషేకం
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున దేవస్థానంలో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చిన అర్చకులు.. బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాల్లో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. స్వామివారికి మొదట పంచామృతంతో, ఆ తర్వాత 81 కలశాల్లో అవాహన చేసిన నదీ జలాలతో జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. అనంతరం హోమశాలలో యాగం నిర్వహించారు. దేశంలో వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, తద్వారా దేశం పాడి పంటలతో సుభిక్షంగా వర్థిల్లాలని కోరుతూ పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారికి హారతి సమర్పించారు. కాగా, జ్యేష్ఠాభిషేకం సందర్భంగా బుధవారం రద్దు చేసిన రామయ్య నిత్య కల్యాణం గురువారం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు. -
విద్యుత్ మోటార్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
సుజాతనగర్: వ్యవసాయ విద్యుత్ మోటార్ను చోరీ చేసిన ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింహాసాగర్ గ్రామానికి చెందిన లావుడ్యా తులసీరాం పొలంలోని విద్యుత్ మోటార్ గత నెల 8న చోరీకి గురైంది. బాధిత రైతు గత నెల 26న ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం ఎస్ఐ రమాదేవి, సిబ్బందితో కలిసి నర్సింహాసాగర్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టగా గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించారు. దీంతో విద్యుత్ మోటార్ను చోరీ చేసి, సుజాతనగర్ గ్రామ శివారులో ఉన్న స్క్రాప్ దుకాణ యజమాని కోమారి అప్పారావుకు రూ.3 వేలకు విక్రయించినట్లు తెలిపారు. దీంతో వారితోపాటు మోటార్ను కొనుగోలు చేసిన అప్పారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. -
ప్రజారోగ్యంపై దృష్టి పెట్టండి
కొత్తగూడెంఅర్బన్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ప్రొఫెసర్ డాక్టర్ శివకామి ముత్తుస్వామి, హైదరాబాద్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి పాల్గొని గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల గురించి వివరించారు. రోటోసిల్ వ్యాక్సిన్ ప్రారంభం.. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పీహెచ్సీలో రోటోసిల్ వ్యాక్సిన్ను డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల్లో విరేచనాల నివారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ను తగిన మోతాదులో షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు తేజశ్రీ, స్వప్న, జి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ -
అన్నయ్య సైకిలెక్కి వెళ్లేవాడిని..
ఇల్లెందు: మా అన్నయ్య, అక్కయ్య తోడుగా ఉండడంతో పాశాలలకు వెళ్లడానికి భయపడే పరిస్థితి రాలేదు. స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో 1 – 10వ తరగతి వరకు చదివా. నాన్న సాయిలు అటెండర్, అమ్మ సుశీల గృహిణి. అక్క జయ, అన్న విజయ్కుమార్తో కలిసి స్కూల్కు వెళ్లేవాడిని. మా అన్నయ్య సైకిల్పై తీసుకెళ్లేవాడు. మూడో తరగతి తర్వాత స్నేహితులు, టీచర్లు గుర్తు ఉన్నారు. మా స్కూల్ రోజుల్లో విరామ సమయాన సత్తుపిండి పెట్టేవాళ్లు. టెన్త్ వరకు యూనిఫాం, షూ లేవు. పాఠశాలల్లోనూ విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లు ఉండేవి కావు. ఇప్పుడు పాఠశాలల్లో సకల సదుపాయాలు ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చు. నేను డిగ్రీ వరంగల్లో చదవగా ఓ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఉపన్యాసంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఓయూలో పీజీ పూర్తి చేశాక 2009లో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతూ తొలుత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగానికి ఎంపికయ్యా. 2012లో మళ్లీ గ్రూప్ – 2 రాసి మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. – సీహెచ్ శ్రీకాంత్ , ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ -
శిథిల భవనాలతో ప్రమాదం!
● వర్షాకాలంలో కూలిపోయి నష్టం జరిగే అవకాశం ● కొత్తగూడెంలో 42 భవనాలకు నోటీసులు జారీ ● పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో ఇంకా గుర్తింపు దశలోనే.. కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం ప్రారంభంమవుతున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు ప్రమాదం పొంచి ఉంది. మున్సిపాలిటీ పరిధిల్లోనే ఇలాంటి భవనాలు ఎక్కువగా ఉన్నాయి. భారీవర్షాలు ఎడతెరపి లేకుండా కురిస్తే వర్షపు నీటికి నాటి కూలే పోయే అవకాశం ఉంది. ఎలాంటి నష్ట మూ జరగకుండా ఉండాలంటే మున్సిపల్ అధికారులు, భవనాల యజమానులు అప్రమత్తమై మరమ్మతులు చేయించుకోవడం, ప్రమాదకరంగా భవనాలను పూర్తిగా తొలగించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లో కొత్తగూడెం పట్టణంలో మాత్రమే శిథి లావస్థలోని భవనాల యజమానులకు టౌన్ ప్లానింగ్ అధి కారులు నోటీసులు జారీ చేశారు. కార్పొరేషన్లోని పాల్వంచతో పాటు ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సి పాలిటీల్లో సంబంధిత అధికారుల్లో ఇప్పటివరకు చలనంలేదు. కొత్తగూడెంలో 42 భవనాలకు నోటీసులు.. జిల్లా కేంద్రంలో నేతాజీ మార్కెట్, సూపర్బజార్ ఏరియా, మేదరబస్తీ ఏరియా, పాత కొత్తగూడెంలోని ఎస్సీ కాలనీలలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులు ఇటీవల 42 భవనాలను గుర్తించి, యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా భవనాలకు మరమ్మతులు చేయించుకోకపోయినా, కూల్చివేయకపోయినా మున్సిపల్ అధికారులు వాటిని తొలగించే అవకాశం ఉంది. పాతకొత్తగూడెంలోని ఎస్పీ కాలనీలో ఏటా వర్షాకాలంలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వానలు కురిసే సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. కాగా ఇళ్ల యజమానులు వాటిని తొలగించకపోవడంతో ఎప్పుడో ఏం జరుగుతుందో తెలియన ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఈ ఏడాది వర్షాలకు పాతకొత్తగూడెం, నేతాజీ మార్కెట్లోని ఇళ్లు కూలే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కొత్తగూడెం పాత మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరగా, ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. రైటర్బస్తీలోని ఎకై ్సజ్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరింది. ఇల్లెందు మున్సిపాలిటీలో శిథిలావస్థలో ఉన్న భవనాలను, ఇళ్లను అధికారులు గుర్తిస్తున్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో పోలీసు క్వార్టర్స్లో కొన్ని శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించారు. ఆయా భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో కూడా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వర్షాకాలానికి ముందే గుర్తించాల్సి ఉన్నా.. అధికారులు శిథిల భవనాలను వర్షాకాలానికి ముందే గుర్తించి కూల్చివేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం నెల ముందుగానే నోటీసులు జారీ చేయసి, అప్పటికీ యజమానులు స్పందించకపోతే తొలగింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో కొత్తగూడెంలో తప్ప ఎక్కడ కూడా ఇప్పటివరకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయలేదు. క్రమంగా వర్షాలు పెరిగి ప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తినష్టం కూ డా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికై న మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మరమ్మతు చేయించుకోవాలి కొత్తగూడెం, పాల్వంచలో పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవాలి. వర్షాలు మొదలయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యజమానులు పట్టించుకోకపోతే మున్సిపల్ నిబంధనల ప్రకారం సిబ్బంది భవనాలను తొలగిస్తారు. –సుజాత, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ -
కేంద్ర పథకాలు గిరిజనులకు అందేలా కృషి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి ఆ శాఖ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ రాష్ట్రంలోని డీడీ, డీటీడీఓలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు. గిరిజన కుటుంబాలకు ధర్తీ అభ, జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ జిల్లాలో 20 మండలాల్లోని 130 గ్రామాల్లో ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామసభలు ఏర్పాటు చేస్తామని, పీవీటీజీ గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అన్ని గుర్తింపు కార్డులు ప్రతి కుటుంబంలో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
నవజాత శిశువుకు చికిత్స
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బరువు తక్కువగా ఉన్న నవజాత శిశువుకు చికిత్స అందించారు. గత ఏప్రిల్ 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరా జు జిల్లా కూనవరం మండలం పందరాజపల్లికి చెందిన శాంతకుమారికి తక్కువబరువుతో బిడ్డ జన్మించింది. దీంతో ఎస్ఎన్సీయూలో చేర్పించి వైద్యం 40 రోజులపాటు వైద్యం అందించారు. ఆస్పత్రిలో చేరినప్పుడు శిశువు కేవలం 900 గ్రాములు మాత్రమే ఉండగా, చికిత్స పొందా క బరువు 1400 గ్రాములకు చేరింది. దీంతో తల్లిండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇదే చికిత్సకు ప్రైవే టు ఆస్పత్రిలో అయితే రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. 126 మందికి జరిమానాసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కోర్టులో బుధవారం 126 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజ మల్లు తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్, టూ, త్రీటౌన్, ట్రాఫిక్, సుజాతనగర్, పాల్వంచ, చండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టి మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో మొత్తం 126 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. విద్యలో మేటి.. మాంటిస్సోరి మణుగూరు టౌన్: ఏజెన్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరులోని శ్రీ సత్యభాస్కర హైస్కూల్, మాంటిస్సోరి ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, డిజిటల్ ల్యాబ్, అధునాతన తరగతి గదులతో బోధన సాగుతోందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల స్థాయి మొదటి, రెండు ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. నర్సింగ్ విద్యకు కేరాఫ్.. అరోరా పాల్వంచ: అందరికీ అందుబాటులో ఉండేలా నర్సింగ్ విద్యను అందుబాటులో తీసుకొచ్చామని అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల చైర్మన్ తాళ్లూరి హరిబాబు తెలిపారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని, ఆరోగ్య సంరక్షణ రంగంలో ముఖ్యపాత్రపోషించే నర్సింగ్ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అత్యాధునిక ల్యాబ్లతో జీఎన్ఎం(జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ) కోర్సు అందిస్తున్నామని తెలిపారు. తమ సేవలకు ఫలితంగా ఇటీవల డాక్టరేట్ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. విద్యాకుసుమం.. లిటిల్ ఫ్లవర్స్ భద్రాచలంటౌన్: విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేలా లిటిల్ ఫ్లవర్స్ స్కూల్, కళాశాలలు పట్టుగొమ్మల్లా నిలుస్తున్నాయని విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి శ్రీనివాస వరప్రసాద్, మాగంటి రమేష్బాబు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో 46 ఏళ్లుగా ఉత్తమ విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఏటా ఎన్నో రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని, ఉత్తమ బోధన అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. -
‘అంగన్బడి’కి అడుగులు
● అడ్మిషన్ల ప్రక్రియ షురూ.. ● ప్రారంభమైన అమ్మ మాట – అంగన్వాడీ బాట ● రెండున్నరేళ్లు పైబడిన చిన్నారులను చేర్చడమే లక్ష్యం ● ఈనెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు భద్రాచలంఅర్బన్ : చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకం. వారు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పి ఆటపాటలతో కూడిన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం నుంచి ఈనెల 17 వరకు ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 30 నెలలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 17వ తేదీన సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా ఆటలు, పాటలు, కథల ద్వారా చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. వారిని ఆకట్టుకునేలా సిలబస్ రూపొందించారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు గతేడాది నుంచి ప్రభుత్వం యూనిఫామ్ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. బడిబాట పట్టేలా.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,654 మంది, 3 – 6 ఏళ్ల మధ్య వారు 26,635 మంది ఉన్నారు. వీరితో పాటు 6,429 మంది గర్భిణులు, 5,825 మంది బాలింతలు ఉన్నారు. ఐదేళ్లు నిండిన వారిని పాఠశాలల్లో చేర్చిస్తే ఈ సెంటర్లలో చిన్నారుల సంఖ్య తగ్గుతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సెంటర్లలో చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు అందజేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు. మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులను బడిబాట పట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా భావించే వారు. పిల్లలకు పాఠశాల వాతావరణం అలవాటు చేయడంతో పాటు పౌష్టికాహారం అందించి, ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టే కేంద్రాలు అనుకునేవారు. అయితే గతేడాది నుంచి పౌష్టికాహారం, ఆటపాటలతో పాటు చిన్నారులకు విజ్ఞానం అందించేందుకు వర్క్బుక్లు ఇస్తూ హోం వర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం నిపుణ్ బారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్నారు. 17 వరకు కార్యక్రమాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 17 వరకు ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడమే కార్యక్రమ లక్ష్యం. విజయవంతానికి ప్రతీ అంగన్వాడీ టీచర్, ఆయా కృషి చేయాలి. – జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ చిన్నారులను చేర్పించేలా.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు దాటిన చిన్నారులను చేర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడంతో పాటు వారికి అందించే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. – స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారి భద్రాచలంలో అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఉద్యోగులుఖాళీలతో సతమతం జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 192 టీచర్, 961 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పక్క కేంద్రాలకు చెందిన టీచర్లు, ఆయాలతోనే నిర్వహిస్తుండగా రెండు కేంద్రాల పర్యవేక్షణ వారికి భారంగా మారుతోంది. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ఖాళీలను కూడా భర్తీ చేస్తే చిన్నారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. -
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంఅర్బన్: రాష్ట్రంలోని రెండు గిరిజన గురుకుల జూనియర్(పీవీటీజీ ఆదిమ గిరిజన తెగలు) కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. హైదరాబాద్ హయత్నగర్లో పీవీటీజీ–సీఓఈ(బాలురు, బాలికలు) గురుకులాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొండరెడ్డి, చెంచు, కొలం, తోటి, కోలావర్ తెగకు చెంది 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీటు లభించిన వారికి ఉచిత బోధన, భోజనంతో పాటు పాఠ్య, నోట్పుస్తకాలు, యూనిఫామ్, నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు, షూస్తో పాటు కాస్మోటిక్ చార్జీలు చెల్లిస్తారని పేర్కొన్నారు. అంతేకాక జేఈఈ మొయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎప్సెట్, లాసెట్, సీయూ సెట్శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఖమ్మం రీజియన్ ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో ఈనెల 16లోగా దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 99497 23291, 94403 98993, 83099 31449 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. 1.92 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేతకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన దివాకర్ రాజు నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ టీం మంగళవారం అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో 1.92 క్వింటాళ్ల నల్లబెల్లం, ఐదు కేజీల పటిక పట్టుకున్నామని ఎకై ్సజ్ ఎస్ఈ కరమ్చంద్ తెలిపారు. దివాకర్రాజు కొంతకాలంగా నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడని, ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. తనిఖీల్లో డీటీఎఫ్ ఎస్సై గౌతమ్, సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, గురవయ్య, వెంకటనారాయణ, శ్రావణి, పార్థసారధి పాల్గొన్నారు. సింగరేణి కళాశాలలో మూడు కొత్తకోర్సులుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు సింగరేణి ఎడ్యుకేషన్ సోసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), బీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల కుమార్తెలు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా కళాశాలలో అద్భుతమైన భోదన, పూర్తి సెక్యూరిటీతో హాస్టల్ నిర్వహణ ఉండడమే కాక నేటి డేటా ఆధారిత ప్రపంచంలో విశ్లేషణాత్మక నైపుణ్యాలు,సమస్య పరిష్కార సామర్థ్యాలు, కేరీర్ అవశాశాలు మెరుగు పడతాయని వెల్లడించారు. కుమారుడి కళ్లెదుటే తండ్రి మృతినేలకొండపల్లి: ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునగగా కుమారుడి కళ్లెదుటే మృతి చెందాడు. మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన రెడ్డబోయిన హరికృష్ణ(32) తనకుమారుడు శివరామ్ ను తీసుకుని మంగళవారం గ్రామంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. తొలుత హరికృష్ణ బావిలో దూకగా, కుమారుడిని కూడా రమ్మన్నాడు. కానీ కుమారుడు భయంతో గట్టుపైనే ఉండగా ఈత కొడుతు న్న హరికృష్ణ కాసేపటికి నీటమునిగి మృతిచెందాడు. శివరామ్ ఇచ్చిన సమాచారంతో కుటుంబీకులు, స్థానికులు చేరుకుని ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతిజూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ పంచాయతీ రాచబండ్ల కోయగూడెం గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందింది. గ్రామంలోని వర్సా చంద్రయ్య అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు మేత కోసం పొలాలకు వెళ్లగా అక్కడున్న ట్రాన్స్ఫార్మర్కు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దాని విలువ రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని చంద్రయ్య విజ్ఞప్తి చేశాడు. -
యథేచ్ఛగా మట్టి తరలింపు
దమ్మపేట: ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీతో అక్రమంగా మట్టి తవ్విన దళారులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మండలంలోని మల్లా రం గ్రామ శివారులో సోమవారం రాత్రి ఇలా తరలించిన దళారులు.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తామే చూసుకుంటామని హామీ ఇచ్చి, ఇటుకబట్టీలకు తరలించినట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఇలా అడ్డూ అదుపు లేకుండా మట్టి తరలిస్తున్నారని, ట్రాక్టర్ల అతివేగంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ భగవాన్ రెడ్డిని వివరణ కోరగా.. అక్రమ మైనింగ్కు పాల్పడిన ప్రాంతానికి ఆర్ఐని పంపి విచారణ చేయిస్తామని చెప్పారు. -
పండుగ వాతావరణంలో బడులు ప్రారంభించాలి
చుంచుపల్లి: ఈనెల 12న పండుగ వాతావరణంలో బడులు ప్రారంభించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యా చందన ఆన్నారు. మంగళవారం ఆమె డీఆర్డీఏ కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నందున సుందరంగా తీర్చిదిద్దాలని, మామిడి తోరణాలతో అలంకరించాలని సూచించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని చెప్పారు. బడిబాట షెడ్యూల్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన వంటి విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీఈఓ వెంకటేశ్వరా చారి మాట్లాడుతూ.. పాఠశాలలు 12న ప్రారంభమవుతున్న సందర్భంగా ఆవరణలోని పిచ్చి మొక్కలు, పొదలు శుభ్రం చేసి విషపురుగులు లేకుండా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్ల సహకారంతో ఐదేళ్లు నిండిన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు. వీసీలో అడిషనల్ డీఆర్డీఓ (సెర్ప్) నీలేష్, జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్లు ఎస్కే సైదులు, ఎన్.సతీష్కుమార్, డీపీఎంలు రంగారావు, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విద్యాచందన -
సీహెచ్సీనా... డెంటల్ ఆస్పత్రా !
స్పెషలిస్టులు లేరు.. బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, గైనకాలజిస్ట్, అనస్తీషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వంటి నిపుణులైన వైద్యులు ఉండాలి. కానీ ఇక్కడ కనీసం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా లేరు. 30 పడకల ఈ ఆస్పత్రికి ఏ జబ్బు చేసిన వారొచ్చినా డెంటిస్ట్లే దిక్కు. అసలే అరకొర వసతులు.. దానికి తోడు వైద్యులు లేకపోవడంతో పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులకే చికిత్స అందుతోంది. కలెక్టర్ ఆదేశించినా.. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇటీవల ఈ ఆస్పత్రిని తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్సీలో ప్రసవాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. డెలివరీలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అయితే ఇక్కడ గైనకాలజిస్ట్, అనస్తీషియన్ లేకపోవడంతో ప్రసవాలు చేయడం సాధ్యం కాదనే చర్చ సాగుతోంది. ఆపరేషన్ థియేటర్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇటీవలే కొన్ని వసతులు సమకూర్చారు. గతంలో ఇక్కడున్న దంతవైద్య పరికరాలు, పడకలను ఇతర ఆస్పత్రులకు తరలించారనే ఆరోపణలున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ కూడా పని చేయడం లేదు. కలెక్టర్ తనిఖీ అనంతరం ఇక్కడున్న నలుగురు డెంటిస్ట్ల్లో ఒకరిని జూలూరుపాడుకు పంపించి ఆ స్థానంలో ఓ ఎంబీబీఎస్ను డిప్యూటేషన్పై నియమించారు. ఇక్కడ వసతులతో పాటు వైద్య నిపుణులను నియమిస్తే సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయి. రూ 2.70 కోట్లతో నూతన భవనాలను నిర్మిస్తుండగా ఆరు నెలల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ఈ సీహెచ్సీకి బూర్గంపాడు, ములకలపల్లి మండలాలతో పాటు ఏపీలో విలీనమైన పలు గ్రామాలు, కుక్కునూరు మండలం నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి వైద్య నిపుణులను నియమించి సేవలు మెరుగుపడేలా చూడాలని పలువురు కోరుతున్నారు. వైద్య సేవలు మెరుగుపరుస్తాం బూర్గంపాడు సీహెచ్సీలో వైద్యసేవలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే ఓ ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చారు. మరికొందరు నిపుణులను కూడా నియమించేలా వైద్య విధాన పరిషత్ చర్యలు తీసుకుంటోంది. నూతన భవనాలు అందుబాటులోకి వచ్చేసరికి డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్నిత్యం 100 మందికి పైగా ఔట్ పేషెంట్లు, సుమారు 30 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్న బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైతే పేషెంట్ల సంఖ్య రెట్టింపవుతుంది. వాస్తవానికి ఈ సీహెచ్సీలో 13 మంది డాక్టర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేరు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పిల్లల వైద్య నిపుణులు కాగా, మిగితా నలుగురు డెంటిస్ట్లు. వీరంతా డిప్యూటేషన్పై ఇక్కడ పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇక ‘నలుగురు డెంటిస్ట్లు ఉన్నారు.. ఇక్కడ దంత వైద్య సేవలు బాగా అందుతాయి’ అనుకుంటే పొరపాటే. ఈ ఆస్పత్రిలో అలాంటి చికిత్సలే లేకపోగా నిత్యం వచ్చే ఇన్, ఔట్ పేషెంట్లకు వీరే జనరల్ వైద్య సేవలు అందిస్తున్నారు. – బూర్గంపాడు2020లో అప్గ్రేడ్.. గతంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధీనంలో ఉన్న బూర్గంపాడు సివిల్ ఆస్పత్రిని 2020లో వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చారు. 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఆ సమయంలో డిప్యుటేషన్పై గైనకాలజిస్ట్, అనస్తీషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్యులను నియమించారు. మూడు నెలలు తిరగకుండానే వీరంతా డిప్యుటేషన్ రద్దు చేయించుకున్నారు. అప్పటి నుంచి డెంటిస్ట్లతోనే నెట్టుకొస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి వచ్చినా కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా నియమించ లేదనే విమర్శలున్నాయి. సీహెచ్సీగా ఆప్గ్రేడ్ అయ్యాక పేషెంట్లకు భోజన వసతి మాత్రం కల్పిస్తున్నారు. ఈ సీహెచ్సీలో 12 మంది స్టాఫ్ నర్సులకు గాను ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. 24 గంటలూ నిరంతర వైద్య సేవలు అందించాల్సి ఉండగా వైద్యుల కొరతతో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. -
జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బుధవారం జరగనున్న జ్యేష్ఠాభిషేకానికి మంగళవారం అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గోదావరి నుంచి అర్చకులు తీర్థబిందె తీసుకొచ్చారు. జ్యేష్ఠ పౌర్ణమి (ఏరువాక పౌర్ణమి)ని పురస్కరించుకుని రామాలయంలో ప్రతీ ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. బేడా మండపంలో 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేస్తామని, ఈ సందర్భంగా నిత్యకల్యాణం రద్దు చేశామని వివరించారు. ఆరో బెటాలియన్ను సందర్శించిన ఎస్పీకొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆరో బెటాలియన్ను ఎస్పీ రోహిత్రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్లోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారి ఆధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు ఎదురైనా ఎస్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందించి ప్రజలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ మొక్కల పంపిణీఅశ్వారావుపేటరూరల్: మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ డివిజన్ నర్సరీ నుంచి రైతులకు మంగళవారం అయిల్పామ్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్ఫెడ్ డివిజనల్ మేనేజర్ నాయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి 9,500 ఎకరాలకు సరిపడా మొక్కలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా, అంతకు మించి 9,556 ఎకరాలకు పంపిణీ చేశామని తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో 11,500 ఎకరాలకు మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 500 ఎకరాలకు అందించామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
రైతులకు భరోసా కల్పించేందుకే ‘భూ భారతి’
కరకగూడెం: దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు రైతులకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన కరకగూడెం మండలం మోతెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అంతేకాక గతంలో రిజిస్ట్రేషన్ లేని సాదా బైనామాలను క్రమబద్ధీకరించడం, వారసత్వ భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భూ రికార్డుల్లో తప్పుల సవరణ, మ్యుటేషన్ సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము 60 ఏళ్లుగా అసైన్డ్ భూములు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించాలని గ్రామస్తులు కోరగా.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ వట్టం కాంతయ్య, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం పినపాక: ఇందిరమ్మ ఇళ్లు పేదల పాలిట వరమని, ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన పినపాక మండలంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, అవకతవకలు, అక్రమాలకు తావు ఉండదని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, ఏఈ వినీత, ఎంపీడీఓ సునీల్ కుమార్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
భద్రాచలంఅర్బన్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. 50 ఆశ్రమ పాఠశాలలు, 14 వసతి గృహాలు, 22 పీఎంహెచ్ హాస్టళ్లకు కూరగాయలు, పండ్లు, చికెన్, కోడిగుడ్లు సరఫరా చేసే ఏజన్సీల సమక్షంలో ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం టెండర్ బాక్స్లు తెరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 40 మంది ఏజన్సీదారులు టెండర్లు దాఖలు చేశారని, తక్కువ ధర కోట్ చేసిన వారినే ఆమోదించామని తెలిపారు. అనంతరం టెండర్దారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ ప్రకారమే సరుకులు సరఫరా చేయాలని, వారం మొత్తానికి ఒకేసారి కాకుండా మూడుసార్లు అందించాలని సూచించారు. వారానికి ఐదు రోజులు అరటి పండ్లు, రెండు రోజులు ఇతర పండ్లు పంపిణీ చేయాలన్నారు. నాసిరకమైన సరుకులు సరఫరా చేసినట్లు ఫిర్యాదు అందితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోని విద్యాసంస్థల్లో మూడేళ్ల పాటు టెండర్ దాఖలు చేయకుండా బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఈఈ హరీష్, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓలు అశోక్ కుమార్, రాధమ్మ, హెచ్ఎంలు నరసింహారావు, సావిత్రి, వార్డెన్లు లక్ష్మి, నాగరాజు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి -
ప్రశ్నించే కమ్యూనిస్టులపై కేంద్రం కక్ష కట్టింది..
● మోడీ నియంత పాలనకు ఆపరేషన్ కగారే నిదర్శనం ● నంబాల మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పాల్వంచరూరల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా నియంత పాలన సాగిస్తూ ప్రశ్నించే కమ్యూనిస్టులపై కక్షకట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని అన్నారు. మండల పరిధిలోని పాండురంగాపురంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కేంద్రం ముందుకు రాకుంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఎన్కౌంటర్లు చేయడం సమంజసం కాదన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా పట్టించుకోకుండా ఉద్దేశ పూర్వకంగానే ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మావోయిస్టులు కూడా తమ లైన్ మార్చుకోవాలని, ప్రజల మద్దతు లేకుండా ఎన్ని త్యాగాలు చేసినా వృథానేనని అన్నారు. 1952లో తాము కూడా అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేశామని, ఆ తర్వాత పంథా మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నామని వివరించారు. కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉంటే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎర్రజెండా ఒక్కటే భరోసా అన్నారు. కాగా, తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఓటమి పాలైన కొందరు కుట్ర పన్నినా.. అంతిమంగా న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్పాషా, నాయకులు నిమ్మల రాంబాబు, అప్పారావు, నాగరాజు, ముత్యాల విశ్వనాధం, పూర్ణచందర్రావు, బండి నాగేశ్వరరావు, అడుసుమల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ట్రాక్ పనులు అడ్డగింత
మణుగూరు టౌన్: ఒకవైపు సింగరేణి గుట్టలు, మరోవైపు బీటీపీఎస్ బొగ్గు తరలించేందుకు రైల్వే ట్రాక్ మధ్యలో తామెలా ఉండాలంటూ గాంధీనగర్ వాసులు మంగళవారం రైల్వే ట్రాక్ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గతేడాది వచ్చిన వరదతో ఆర్థికంగా నష్టపోయామని, సింగరేణి నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు రైల్వే లైన్ కట్ట నిర్మిస్తే వర్షాలు కురియగానే ఊరు మునిగి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ప్రభుత్వం స్పందించి తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అద్దంకి నరేష్ అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి కలెక్టర్కు నివేదిస్తామని తెలి పారు. అనంతరం తహసీల్దార్కు గాంధీనగర్ వాసులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు నగేశ్, మల్లికాంబ, నక్కా వెంకటేశ్వర్లు, కుమారస్వామి, కారం వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
తొలకరి పలకరించే వేళ..
● పులకించనున్న పుడమితల్లి ● రైతు మోమున వెల్లివిరియనున్న ఆనందం ● సాగుకు అన్నదాత సన్నద్ధం ● నేడు ఏరువాక పౌర్ణమి ఇల్లెందురూరల్: తొలకరి పలకరింపుతో రైతులు వ్యవసాయ పనులకు ముందడుగు వేస్తున్నారు. ఆధునికత ఎంత పెరిగినా తొలకరి వేళ నాగళ్లతోనే దున్నేందుకు ఆసక్తి చూపుతారు. జిల్లా వ్యాప్తంగా సాగుకు సన్నద్ధమైన రైతులు.. బుధవారం ఏరువాకపౌర్ణమి పండుగను సంప్రదాయ పద్ధతులతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంప్రదాయ వేడుక.. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే తొలిసారి పొలం దున్నడమని అర్థం. వ్యవసాయ పనుల ప్రారంభానికి సూచికగా రైతులు ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజున మొదట నాగలితో దుక్కిదున్ని భూమి పూజ చేస్తారు. తద్వారా పంటలు బాగా పండుతాయని, తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని రైతుల విశ్వాసం. సమష్టి సాగుకు దిక్సూచి.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం వచ్చాక చిరుజల్లులు కురుస్తుంటాయి. భూమి కొంత మేర పదును ఎక్కాక నాగలితో దున్నేందుకు అనువుగా ఉంటుంది. అందుకే రైతులంతా సమష్టిగా వ్యవసాయ పనుల ప్రారంభానికి ఏరువాక పౌర్ణమిని ఎంచుకుంటారు. కొంతమంది అంతకుముందే మొదలుపెట్టినా.. అలా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయని ఎక్కువ మంది రైతులు నమ్ముతుంటారు. పనిముట్లు, పశుసంపదకు పూజ.. ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనిముట్లను కడిగి శుభ్రం చేసుకుంటారు. పశువులకు కూడా శభ్రంగా స్నానం చేయించి వస్తువులకు, ఎద్దులకు పసుపు, కుంకుమ చల్లుతారు. కాళ్లకు గజ్జలు అలంకరించి హారతులిస్తారు. మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. తమ ఇష్ట దైవాలకు సైతం పూజలు చేశాక పొలానికి వెళ్లి దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు. పండుగను విస్మరిస్తున్నారు.. తొలకరి పలకరించిన వేళ వ్యవసాయం సంబురంగా సాగాల ని రెతులు జరుపుకునే పండుగే ఏరువాక పౌర్ణమి. తరతరాల సంప్రదాయాన్ని ప్రోత్సహించాల్సిన పాలకులు సైతం ఆ వేడుకను విస్మరిస్తున్నారు. రైతులకు కనీసం అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉంది. – చింత రామ్మూర్తి,అన్నారం, ఇల్లెందు మండలం సంప్రదాయం కనుమరుగవుతోంది వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులు భూ మిపూజ చేయడం, సాగుకు అవసరమైన ఎద్దులు, పని ముట్లను పూజించడం అనాది గా వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుత రోజుల్లో వర్షం కురిసిన వేళ విత్తనాలు వేయడం మినహా రైతులు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటించడం లేదు. –ధనియాకుల బాబు,చల్లసముద్రం,ఇల్లెందుమండలం -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇల్లెందురూరల్ : వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాస్కర్నాయక్ సూచించారు. మండలంలోని రొంపేడు పీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలను పరిశీలించి రోజువారీ ఓపీ, ఐపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులను క్రమం తప్పకుండా పరీక్షించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, రొంపేడు పీహెచ్సీ వైద్యాధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ -
అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు
● కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరిక ● రూ. 1.09 లక్షల విలువైన మిర్చి విత్తనాల పట్టివేతజూలూరుపాడు: ప్రభుత్వ అనుమతి లేకుండా మిర్చి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలూరుపాడు మండలం అనంతారంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రైతులకు మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నట్లు స్థానిక వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్కు సమాచారం అందిందని, దీంతో ఆయనతో పాటు కాకర్ల ఏఈఓ జె.వి.డి ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుతో కూడిన బృందం ఆ గ్రామానికి వెళ్లి తనిఖీ నిర్వహించిందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఓ రైతుకు మిర్చి విత్తనాలు అమ్ముతుండగా పట్టుకున్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ. 1.09 లక్షల విలువైన 115 విత్తన ప్యాకెట్లు, క్రేటా కారు, రూ.13,000, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి చెందిన నున్నా మహేష్ ఏపీలోని గుటూరు జిల్లాలో జనతా సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్నాడని, మరో వ్యక్తి ఏన్కూర్మండలం జన్నారం గ్రామానికి చెందిన పల్లపు తిరుపతిరావుగా విచారణలో తెలిసిందని వెల్లడించారు. వారిద్దరూ గుంటూరు జిల్లాలో జనతా సీడ్స్ షాపు వద్ద ప్రజ్వల్ సీడ్స్, కావ్య సీడ్స్ మిర్చి విత్తనాలను ఒక ప్యాకెట్ ధర రూ 600 చొప్పున కొనుగోలు చేసి రైతులకు రూ. 950 చొప్పున విక్రయిస్తున్నారని చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేయగా నేరం అంగీకరించారని, రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బందితోపాటు, వ్యవసాయ అధికారులను డీఎస్పీ అభినందించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు, మందులను లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్ద మాత్రమే కొనుగోలు చేచాలని, తప్పని సరిగా రసీదులు తీసుకోవాలని అన్నారు. -
కనిపించని మావోయిస్టుల బంద్ ప్రభావం
దుమ్ముగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం దుమ్మగూడెం, చర్ల మండలాల్లో కనిపించలేదు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడిచాయి. ఆటోలు, బస్సులు మామూలుగానే నడిచాయి. పోలీసులు మాత్రం అప్రమత్తమై ప్రధాన రహదారుల వెంట ముమ్మర తనిఖీలు చేపట్టారు. చర్ల మండలంలో ముందస్తుగా కట్టడి చేసి బంద్లో ఎవరూ పాల్గొనకుండా చర్యలు చేపట్టారు. దుమ్ముగూడెంలో సీఐ అశోక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలను అడిగి వదిలేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అట్రాసిటీ కేసు నమోదుఇల్లెందు: పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఓ యువతి.. శివకృష్ణ అనే ఆటోడ్రైవర్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శివకృష్ణతో పాటు ఆయన తల్లి జ్యోతి, మేనమామ వెంకన్నపై ఇల్లెందు పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరిపెడ బంగ్లాకు చెందిన శివకృష్ణ ఇల్లెందులో ఆటో నడుపుకుంటూ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కట్నం కోసం వదిలేశాడు. బాధితురాలి పిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేశారు. దాడి ఘటనపై..ఇల్లెందు: పట్టణంలోని 14 నంబర్ బస్తీకి చెందిన సాయి కిరణ్ అనే యువకుడిని అదే బస్తీకి చెందిన దినకరన్ అనే యువకుడు ఓసీ సమీపంలో దాడి చేసి గాయపర్చిన ఘటనపై ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేశారు. 14 నెంబర్ బస్తీలో ఓ ఫంక్షన్ వద్ద మంగళవారం ఘర్షణ జరిగింది. దీంతో సాయి కిరణ్ను దినకరణ్ తన బైక్పై హమాలీ బస్తీ ఓసీ సమీపంలోకి తీసుకెళ్లి దాడి చేశాడు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధురాలి మెడలో గొలుసు చోరీచండ్రుగొండ: వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన మంగళవారం తెల్లవారుజామున మండలంలోని బెండాలపాడులో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బండి జోగయ్య, రాధమ్మ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రాధమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లాడు. దంపతులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెదికినా అప్పటికే దుండగుడు పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహెమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శివరామకృష్ణ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సంచలనం సృష్టించిన కణితి సతీష్ హత్య కేసులో నిందితుడు గుంజ సాయిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీష్ అనే ఆటో డ్రైవర్ను పాత కక్షలతో గుంజ సాయి మరికొందరితో కలిసి దారుణంగా హతమార్చాడు. దీనిపై సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, మూడు బృందాలుగా ఏర్పడి గాలించామని, సతీష్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న గుంజ సాయిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ ముందు హాజరు పరుచనున్నామని తెలిపారు. కాగా పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. -
వలస కూలీ ఆత్మహత్య
జూలూరుపాడు: మండలంలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆయిల్ పామ్ క్షేత్రంలో పని చేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ రాజేశ్వరరావు తెలిపిన వివరాలిల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ రఘువంశీ(21), ఆల్ఫా రఘువంశీ దంపతులు కూలీ పనుల కోసం పది రోజుల క్రితం పడమట నర్సాపురానికి వచ్చారు. రైతు చలపతిరావు ఆయిల్ పామ్ తోటలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి నీరజ్ అతిగా మద్యం తాగి ఇంటికి రాగా, భార్య ప్రశ్నించడంతో ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా, మనస్తాపానికి గురైన నీరజ్ చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉద యం భార్య ఇంటికి వచ్చేసరికి నీరజ్ ఫ్యాన్కు వేలాడుతుండగా చుట్టు పక్కల వారి సాయంతో మృతదేహాన్ని కిందకు దింపింది. ఆల్ఫా రఘువంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజేశ్వరరావు తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి..చండ్రుగొండ: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటియాతండాకు చెందిన మధుసూదన్రావు(28)కు ఓ యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి మధుసూదన్రావు మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి రామచంద్రు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. కడుపు నొప్పి తాళలేక వృద్ధురాలు.. టేకులపల్లి: కడుపునొప్పి తాళలేక వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని దాసుతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాసుతండాకు చెందిన గుగులోత్ శాంతి(74) ఆరు నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది. కుమారుడు ఆమెకు పలుమార్లు వైద్యం చేయించినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో సోమవారం కడుపు నొప్పి విపరీతంగా రావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగింది. కుటుంబసభ్యులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. శాంతి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరిలో మృతదేహం లభ్యంమణుగూరు టౌన్: పాత మణుగూరు పరిధిలోని మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికు ల కథనం ప్రకారం.. పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన మైపా యేసోబు(42)కు చెందిన ద్విచక్ర వాహనాన్ని రెండు రోజుల క్రితం నది సమీపంలో గుర్తించారు. బైక్ను ఎవరైనా అపహరించి అక్కడికి తీసుకొచ్చారని భావించారు. అయితే మంగళవారం ఉదయం గోదావరిలో మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీయగా యేసోబుగా గుర్తించారు. మృతుడు పినపాకలో చర్చి పాస్టర్గా, జీఎస్ఎస్ క్రైస్తవ సంస్థ ఏర్పాటు చేసిన ఓ సెంటర్కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. యేసోబుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యేసోబు మృతికి గల కారణాలు తెలియరాలేదు. -
పేదలకు అండగా ప్రభుత్వం
● అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: రాష్ట్రప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సి పాలిటీలో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో రూ.94లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. అలాగే, పోలేపల్లి –రాజీవ్గృహకల్ప కాలనీ ఎన్నె స్పీ లాక్ల వరకు రూ.2.86కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, తెల్దారుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇదే సమయాన కొత్తగా ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి బోనస్, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయానం, ఇంది రమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాలు మొదలు పెట్టామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ బి.హరినాధ్బాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో జీపీ కార్యదర్శి మృతి
పెనుబల్లి/రఘునాథపాలెం: స్కూటీపై విధులకు బయలుదేరిన పంచాయతీ కార్యదర్శిని వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో అదే లారీ టైరు కింద పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పెనుబల్లి మండలం వీఎం బంజర్లో సోమవారం జరిగిన ఈ క్రమం వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన బానోతు సోనాలి(32) పెనుబల్లి మండలం రామచందర్రావు బంజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సంపత్ కల్లూరు మండలం లక్ష్మాతండా కాగా వీరికి ఏడాది, నాలుగేళ్ల వయస్సు పిల్లలు ఉన్నారు. కల్లూరు నుంచి రాకపోకలు సాగించే ఆమె రోజులాగే సోమవారం తన స్కూటీపై వెళ్తుండగా అదే మార్గంలో ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న లారీ వీఎం బంజర్ ప్రాథమిక పాఠశాల సమీపాన ఢీకొట్టింది. దీంతో సోనాలి అదుపుతప్పి రోడ్డుపై పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. సోనాలి మృతిపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సంతాపం తెలపగా, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఎంపీఈఓ ఉపేంద్రయ్య, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. బూడిదంపాడులో అంత్యక్రియలు గ్రామపంచాయతీ బానోత్ సోనాలి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆమె స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈసందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ నివాళులర్పించారు. కాగా, పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ కార్యదర్శులపై పనిభారం పెరగడంతో ఆ ఒత్తిడితో వెళ్తున్న ఆమె ప్రమాదం బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాలి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే, పంచాయతీ కార్యదర్శులకు నిర్దిష్ట పనివేళలు, స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, యర్రా రమేష్, కరణ్సింగ్, రుక్మారావు, ఫజల్, వినోద్, గాంధీ, ఉపేందర్, అనిత, సుష్మిత, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విధులకు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఘటన -
వినియోగదారులు చేజారకుండా..
● నాణ్యమైన బొగ్గు సరఫరాకు సింగరేణి యాజమాన్యం చర్యలు ● హై గ్రేడ్, లో గ్రేడ్ కలిపి జి–13 బొగ్గు రవాణాకు నిర్ణయం ● ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లు సింగరేణి(కొత్తగూడెం): ిసంగరేణి ఉత్పత్తి చేస్తున్న జి–15 గ్రేడ్ బొగ్గు స్వీకరణకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా రోజుకు 8 రేకుల(సుమారు 32 వేల టన్నుల) బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రతీ రోజు 42 రేకులకు బదులు 34 రేకులే రవాణా అవుతున్నాయి. మరోవైపు నిల్వ ఉన్న బొగ్గు కోల్బెల్ట్ ప్రాంతంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలతో అంటుకుని దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సంస్థ ఉత్పతి చేస్తున్న జీ–10, జీ–11, జీ–13, జీ–14, జీ–15లతోపాటు మరికొన్ని గ్రేడ్లను కలిపి, జీ–13 గ్రేడ్గా మార్చి వినియోగదారులకు సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొంతనష్టం వచ్చినా వినియోగదారుడిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని సీహెచ్పీల్లో అన్ని గ్రేడ్లను కలిపి జీ–13 బొగ్గు సరఫరా చేయాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది. కోల్వాషరీల ద్వారా 60శాతమే చేతికి.. సింగరేణి సంస్థ రోజుకు సుమారు 2.10 లక్షల టన్ను ల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇందులో 80 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేస్తుండగా, మిగిలిన 20శాతం మాత్రం విద్యుత్తేతర పరిశ్రమలకు రవాణా చేస్తోంది. 20 శాతం కొనుగోలు చేస్తున్న సంస్థలతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ 80శాతం కొనుగోలు చేస్తున్న పరిశ్రమలే కొర్రీలు పెడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కొన్ని ప్రైవేట్ సంస్థలు సింగరేణి కంటే నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకే రవాణా చేస్తున్నాయి. దీంతో విద్యుత్ కంపెనీలు అటువైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులనుకాపాడుకునేందుకు కంపెనీ జీ–13 బొగ్గును రవాణా చేయాల ని సింగరేణి నిర్ణయించింది. కోల్ వాషరీ ద్వారా నా ణ్యమైన బొగ్గు అందించే అవకాశం ఉన్నా.. వాషరీలో సుమారు 40 శాతం బొగ్గు వృథాగా పోతోంది. మిగి లిన 60 శాతం మాత్రమే చేతికి వస్తుంది. ఈ నేపథ్యంలో జీ–13రకం బొగ్గురవాణా తప్పనిసరైందని అధికా రులు పేర్కొంటున్నారు. రానున్న వర్షాకాలం విద్యుత్ వినియోగం తగ్గి బొగ్గుడిమాండ్ లేకపోయినా.. నాణ్య మైన బొగ్గు సరఫరా చేస్తే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకునే అవకాశం ఉందని సింగరేణి అధికారులు భావిస్తున్నారు. -
అక్రమ కట్టడం తొలగింపు
భద్రాచలంటౌన్: ఐడీటీఏ రోడ్లోని రాజీవ్ నగర్కాలనీలో ఉన్న శ్రీ కుసుమ హరినాథ్బాబా దేవస్థానం భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని పాలకమండలి ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. సర్వే నంబర్ 91/1లో ఆలయానికి చెందిన పట్టా భూమి 3–57 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణానికి సెంట్రింగ్ పెట్టగా పాలక మండలి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు తంబళ్ల కృష్ణార్జున రావు, సీత, ఆలయ ఈఓ జి. సుదర్శన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డులకు పరుగు పందెంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ఖాళీగా ఉన్న 10 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకానికి సోమవారం పరుగు పందెం నిర్వహించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగి న ఈ పరుగు పందెంలో 240 మంది పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ చూపిన 10 మందిని ఎంపిక చేశారు. వీరికి మెడికల్ చెకప్ నిర్వహించి, సర్టిఫికెట్లు పరిశీలించాక నియామకాలు చేపట్టనున్నారు. 80 మందికి జరిమానాకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో 80 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమ ల్లు సోమవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో వాహన చోదకులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తేలడంతో కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధించారు. కరోనా మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియోసింగరేణి(కొత్తగూడెం): కోవిడ్–19లో సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా రైటర్బస్తీలో కరోనా బారిన పడి సివి ల్ విభాగం కాంట్రాక్ట్ కార్మికుడు కొదురుపాక శ్రీనివాస్ మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యులు కొదురుపాక రాజకుమారి తదితరులకు సోమవారం సివిల్ కార్యాలయం వద్ద సివిల్ డీజీఎం పి.రాజశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్వీ రమణమూర్తి, ఉపాధ్యక్షులు క్రిష్టాఫర్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడి గేదె మృతిపాల్వంచరూరల్: మేతకు వెళ్లిన పాడి గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో సోమవారం ఈ సంఘటన జరిగింది. రూ.లక్ష నష్టం వాటిలినట్లు బాధిత రైతు జక్కుల వెంకటయ్య తెలిపాడు. మట్టి లారీ స్వాధీనంపాల్వంచరూరల్: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న లారీని, జేసీబీని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్ కథనం ప్రకారం... మండల పరిధిలోని భోజ్యాతండా సమీపంలో మొర్రేడు వాగు చెక్కు డ్యామ్ వద్ద నుంచి మట్టిని తరలిస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాలతో ఆదివారం రాత్రి రూరల్ ఆర్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి లారీని, జేసీబీని పట్టుకున్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి కారేపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఉమాకర్(35) భార్య కొన్నేళ్ల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిస కాగా, ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన తండ్రి, తమ్ముడు ఖమ్మంలో నివసిస్తున్నారు. ఈనెల 8వ తేదీన ఉమాకర్ పురుగుల మందు తాగగా గమనించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా, ఆయన తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బైకర్ మెడలో నుంచి..
పాల్వంచ: O»ñæMŠSOò³ Ððlâ¶æ$¢¯]l² Ð]lÅMìS¢ Ððl$yýl-ÌZ ¯]l$…_ Ð]l¬VýS$YÆý‡$ Ð]lÅMýS$¢-Ë$ º…V>Æý‡$ VöË$çÜ$ ÌêMýS$P° Eyé-Ƈ$$…^éÆý‡$. Ý린MýS$ÌS MýS£ýl¯]l… {ç³M>Æý‡….. ç³rt׿…-ÌZ° MöÐ]l¬Ã-VýS*-yðl… HÇĶæ*-ÌZ K A´ë-ÆŠ‡t-Ððl$…sŒæ-ÌZ °ÐéçÜ… E…yól ¯]lÐ]l-¿êÆý‡™Œæ ÇOsñæÆŠ‡z E§øÅW A{ºçßæ… ï³rÆŠḥæMìSÆ>×ê §ýl$M>×ê°MìS O»ñæMŠSOò³ ÐðlâŸÏ-çÜ$¢-¯é²yýl$. D {MýSÐ]l$…-ÌZ Jyýl$z-VýS*-yðl… ÆøyŠæ-ÌZ Ð]l¬VýS$YÆý‡$ Ķæ¬Ð]l-MýS$-Ë$ Ð]l$Æø O»ñæMŠSOò³ A™èl-°² Ððl…ºyìl…^éÆý‡$. Æøyýl$zOò³ GÐ]lÆý‡* Ìôæ°¨ VýSÐ]l$-°…_ A{ºçßæ… Ððl$yýl-ÌZ E¯]l² çÜ$Ð]l*Æý‡$ Æð‡…yýl$-¯]l²Æý‡ ™èl$ÌêÌS º…V>Æý‡$ O^ðl¯ŒS¯]l$ ÌêMýS$P° Eyé-Ƈ$$…^éÆý‡$. VöË$çÜ$ ÌêVýS-yýl…-™ø A{ºçßæ… Ððl$yýlMýS$ V>Ķæ$… M>Ð]l-yýl…-™ø´ër$ Ððl*sêÆŠ‡ OòÜMìS-ÌŒæOò³ ¯]l$…_ MìS…§ýl ç³yìl-´ù-Ķæ*yýl$. ïÜI çÜ¡‹Ù, G‹ÜI çÜ$Ð]l$¯ŒS-Ë$ çÜ…çœ$-r¯é çܦÌê°² çÜ…§ýl-ÇØ…_, ïÜïÜ çœ#sôæ-iÌS¯]l$ ç³ÇÖÍ…_ ÑÐ]l-Æ>Ë$ õÜMýS-Ç…-^éÆý‡$. »ê«¨™èl$yìl íœÆ>ŧýl$™ø MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ ^ólç³sêtÆý‡$.బంగారు గొలుసు లాక్కుని ఉడాయించిన యువకులు -
రాజీవ్ యువ విలాపం!
చుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మే నెలలోగా లబ్ధి దారులను ఎంపిక చేసి ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని భావించింది. అనంతరం ఈ నెల 5న మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో యువతీయవకులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు వెల్లువలా రావడం, దరఖాస్తుల పరిశీలన ఓ కొలిక్కి రాకపోవడంతో అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. సబ్సిడీ ఇలా.. పథకంలో రూ.50వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందించనుంది. ఈ నాలుగు కేటగిరీల్లో రూ. 50వేలు, రూ.లక్ష యూనిట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘సిబిల్’కే బ్యాంకర్ల ప్రాధాన్యం.. యువ వికాసం దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు. తొలుత మండల కమిటీల ఆమోదం తర్వాత జిల్లా కమిటీలకు జాబితా చేరుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం మంజూరు చేస్తా రు. గతంలో ఏదైనా కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారా?, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నారా? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు సిబిల్ స్కోర్ను పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించినా బ్యాంకర్లు మాత్రం దాటికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 38,230 యూనిట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి 1,60,207 మంది యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు 38,230 యూ నిట్లను పంపిణీ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఖమ్మంజిల్లాకు 20,181యూనిట్లు, భద్రాది జిల్లాకు 18,049 యూనిట్లు కేటాయించింది. మొదటి విడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2లో రూ. లక్ష వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఈనెల 15లోపు శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. అయితే అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం జాబితాలో స్థానం కల్పిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈనెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా యువ వికాసంపై ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో పథకం అమలు మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యువ వికాసం పథకం అమలులో జాప్యం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులు ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు 1.60 లక్షలు కేటాయించిన మొత్తం యూనిట్లు 38,230ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు కార్పొరేషన్ ఖమ్మం భద్రాద్రి బీసీ 39,616 20,602 ఎస్సీ 29,742 12,488 ఎస్టీ 14,416 27,792 మైనారిటీ 7,412 2,844 ఈబీసీ 4,022 1,049 క్రిస్టియన్ 117 107ఆదేశాలు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. –బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ, Æ>iÐŒæ Ķæ¬Ð]l ÑM>çÜ… hÌêÏ MøBÇz¯ólrÆŠḥఅర్హుల ఎంపికలో పొరపొట్లు.. రాష్ట్రఆవిర్భావం దినోత్సవం రోజు పథకాన్ని ప్రా రంభించాలని భావించినా పెద్ద సంఖ్యలో దరఖా స్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం భావించి కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎప్పుటికప్పుడు వాయిదా పడుతుండటంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. కాగా పథకం అమలుకు మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన తేదీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
పేదల సంక్షేమమే మా అజెండా
ఖమ్మంవన్టౌన్/రఘునాథపాలెం: పదేళ్లు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం కొనసాగగా.. తాము అధికారంలోకి రాగానే నెమ్మదిగా సరిచేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి టీ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన పూర్తి చేసి, అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోటి కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర తెలంగాణకే దక్కుతుందని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, రూ.500కే సిలిండర్, రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అయితే, పదేళ్ల పాటు దోపిడీ చేసిన ధనంతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని గౌడ సంఘం హాల్ నిర్మాణం చేపట్టడమే కాక ఆయన విగ్రహం ఏర్పాటు చేసి కోచింగ్ సెంటర్ కూడా నిర్మించాలని కోరారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తన సహకారం ఉంటుందని భట్టి తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యం.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి పలుమార్లు వచ్చానని తెలిపారు. ఖమ్మం అంటేనే ధైర్యమని, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. గౌడ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల నిధులతో కూడిన ప్రత్యేక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. విద్యను ప్రోత్సహించేలా కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని వెల్లడించారు. కార్యకర్తలు దేవుళ్లని, పార్టీ కార్యాలయం ఆలయమని వెల్లడించిన ఆయన.. కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడిన ఖమ్మం జిల్లాకు ప్రభుత్వంలోనూ ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందన్నారు. కాగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని, రాబోయే పదేళ్లు కూడా అధికారంలో ఉంటామని మహేష్కుమార్ వెల్లడించారు. గౌడ హాల్ పేదలకు ఉపయోగపడేలా, సమాజానికి సేవ చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్గౌడ్తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్గౌడ్, ఏలూరి రవి, చింతల పుష్ప, భవాని, ప్రతిభారెడ్డి, బిచ్చాల తిరుమలరావు, డాక్టర్ రాజశేఖర్, బొల్లికొండ శ్రీనివాసరావు, కత్తి నెహ్రూగౌడ్, బోయనపల్లి లక్ష్మణ్, బండి నాగేశ్వరరావు, బండి వెంకన్న, వత్సవాయి రవి, బొర్రా రాజశేఖర్, పోతగాని వెంకటేశ్వర్లు, రాహుల్, కృష్ట, సాయన్న తదితరులు పాల్గొన్నారు. వచ్చే పదేళ్లూ మేమే అధికారంలో ఉంటాం పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలందరికీ పదవులు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జూలూరుపాడు: భూ భారతి సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని కాకర్ల రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు అందించిన దరఖాస్తులను తక్షణమే ఆన్లైన్ చేయాలని, వివరాల నమోదులో తప్పులకు తావు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదు అందించాలని, రిజిష్టర్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డుల్లో పేర్ల తప్పులు, భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ పుస్తకం లేకపోవడం, సాదాబైనామా కేసులు తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. అనంతరం భేతాళపాడులోనూ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ టి. శ్రీనివాస్, ఆర్ఐ సీహెచ్.ఆదినారాయణ, ఏఎస్ఓ నరసింహారావు, సీనియర్ అసిస్టెంట్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ.. సూపర్బజార్(కొత్తగూడెం): జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈనెల 30వ తేదీ వరకు ఒకేసారి పంపిణీ చేస్తున్నామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 58 వేల యూనిఫామ్ల తయారీ పూర్తి.. కొత్తగూడెంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 58 వేల యూనిఫామ్ తయారు చేసి పాఠశాలలకు అందించామని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంక్ నిర్వహణకు రామవరంలో 12 కుంటల భూమి గుర్తించామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ వెంకటేశ్వరా చారి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
పత్తి సాగుకే సై
● తెల్లబంగారం వైపే మొగ్గుచూపుతున్న రైతులు ● మద్దతు ధర పెరగటంతో ఆసక్తి ● జిల్లాలో పెరగనున్న పంట సాగు ● సీసీఐ కొనుగోళ్లతో మార్కెటింగ్ సౌలభ్యం బూర్గంపాడు: జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు మరింతగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.589 మద్దతు ధర పెంచగా రూ. 8,110కి చేరింది. దీంతో సాగు విస్తీర్ణం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పత్తిని సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా రైతులకు మార్కెటింగ్ సౌలభ్యం కూడా ఉంది. దీనికి తోడు గత రెండేళ్లుగా మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడి తగ్గడం, మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి కారణాలతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ భూముల్లోనూ ఈసారి పత్తి సాగయ్యే అవకాశం ఉంది. ఆది నుంచీ ఇటు వైపే.. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంటగా పత్తికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధర లభించకపోయినా రైతులు ఈ పంట సాగును వదలడం లేదు. గత రెండేళ్లుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి ఆశించిన దిగుబడి రాలేదు. ఎకరాకు సగటున 6, 7 క్వింటాళ్లు మాత్రమే పండింది. ప్రైవేట్ వ్యాపారులు గిట్టుబాటు ధర పెట్టలేదు. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు జిన్నింగ్ మిల్లుల వద్దనే పత్తి కొనుగోలు చేయగా.. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రవాణా, హమాలీ చార్జీలు వారే భరించాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది జిల్లాలో మరో రెండు జిన్నింగ్ మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో గతంలో ఒక జిన్నింగ్ మిల్లు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది మరో రెండు జిన్నింగ్ మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. పత్తికి మద్దతు ధర పెరగడం, జిన్నింగ్ మిల్లులు అదనంగా అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు. తగ్గనున్న మిర్చి సాగు.. జిల్లాలో గతేడాది మిర్చిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే నల్లి, తామర వంటి చీడపీడలతో పాటు ఆశించిన ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పప్పు గింజలకు డిమాండ్ ఉంది. గత ఐదారేళ్లుగా కంది, మినుము, పెసర, శనగ, బొబ్బెర వంటి పప్పు గింజల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పప్పు గింజల ధర క్వింటాకు రూ.10వేల వరకు ఉంది. అయినా పప్పు ధాన్యాల సాగుకు రైతులు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య పంటల సాగుకు అలవాటు పడిన రైతులు సంప్రదాయ అపరాల సాగుకు విముఖత చూపుతున్నారు. పత్తే వేస్తున్నాం గత రెండేళ్లుగా మిర్చి వేసి నష్టపోయాను. ఈ ఏడాది మిర్చికి బదులు పత్తి వేస్తున్నా. పత్తికి మార్కెట్లో ధర తక్కువగా ఉన్నా.. సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర అందిస్తోంది. మిర్చి అమ్ముకోవాలంటే గుంటూరు లేదా జగదల్పూర్ వెళ్లాల్సి వస్తోంది. మిర్చి నిల్వ చేద్దామంటే జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు పత్తిసాగుకే మొగ్గు చూపుతున్నారు. – తెల్లం భాస్కర్, రైతు, గుండాల2లక్షల ఎకరాలకు పైగా.. గతంలో జిల్లాలో సుమారు 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది అది 2.20 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. ఇందులో 95శాతం మేర వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. నీటి పారుదల అవకాశాలున్న భూముల్లో వరి, కూరగాయలు, ఆయిల్పామ్, మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. మెట్టభూముల్లో మాత్రం అగ్రభాగం పత్తిదే. -
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్: పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని, విరివిగా మొక్కలు నాటాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరా చారి సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో పని చేస్తున్న స్వచ్ఛ మిత్రలకు జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయని, మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు. అనంతరం వారికి యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ సతీష్కుమార్, జిల్లా కో ఆర్డినేటర్లు నాగ రాజశేఖర్, సైదులు, శంకర్, డీఆర్పీ రాజేష్ పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి కోసమే దరఖాస్తు చేయాలి
భద్రాచలం: గిరిజన దర్బార్లో స్వయం ఉపాధి పథకాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్వీకరించబోమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి యూనిట్ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన దర్బార్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి, ఇతర సమస్యలపై మాత్రమే దరఖాస్తులు అందించాలని, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పాఠశాల, కళాశాలల్లో సీట్లు నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తామని వెల్లడించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు అన్ని వసతులతో స్వాగతం పలకాలని సూచించారు. విద్యార్థినికి ఆర్థిక సాయం.. అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని వైశాలిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో బీఏలో సీటు సాధించగా.. మొదటి, రెండో సంవత్సరాలకు ఐటీడీఏ ద్వారానే ఆర్థిక సాయం అందజేశారు. కాగా ఇతర కోర్సు, హాస్టల్ ఫీజు నిమిత్తం సోమవారం ఆమెకు రూ.19,280 చెక్కును పీఓ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఈఈ హరీష్, ఎస్ఓ భాస్కరన్, ఏఓ సున్నం రాంబాబు, ఏపీఓ వేణు, అధికారులు లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, మనిధర్, ఆదినారాయణ పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీసుజాతనగర్: స్థానిక ప్రభుత్వాస్పత్రిని జిల్లా వైద్యాధికారి ఎల్.బాస్కర్ నాయక్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయంటూ పేషెంట్లను ఆరా తీశారు. రికార్డులను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, శిశు మరణాలు తగ్గించాలని ఆదేశించారు. గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య సూచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన ఐసెట్సుజాతనగర్: స్థానిక అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఐసెట్ రెండో రోజైన సోమవారంతో ముగిసింది. మొత్తం 130 మందికి గాను 119 మంది విద్యార్థులు హాజరయ్యారని, 11 మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. -
కూనంనేనికి ఊరట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున కూనంనేనిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఏడాదిన్నర పాటు ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి. గెలిచిన వెంటనే.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. అయితే నామినేషన్ దాఖలు సమయంలో ఫామ్–26 అఫిడవిట్లో కూనంనేని సమగ్ర వివరాలు వెల్లడించలేదంటూ కొత్తగూడేనికి చెందిన నందూలాల్ అగర్వాల్ 2024 జనవరి 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూనంనేని తన భార్య పేరును అఫిడవిట్లో పేర్కొనలేదని, లైసెన్స్డ్ నోటరీతో అఫిడవిట్ చేయించలేదనే అభ్యంతరాలను నందూలాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరింత సమాచారం కోసం గతేడాది డిసెంబర్లో హైకోర్టు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కూనంనేని సాంబశివరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నందూలాల్ అగర్వాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు. అయితే హైకోర్టులో వాదనలు పూర్తి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూనంనేని పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. దీంతో అనర్హత కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి గడిచిన ఆరు నెలలుగా కొనసాగింది. తుది తీర్పు వచ్చాక.. ఏడాదిన్నర వ్యవధిలో ఇటు కమిషన్, అటు హై కోర్టులో 20 సార్లకు పైగా ఇరు వర్గాల నడుమ వాదనలు జరిగాయి. చివరకు ఈ కేసులో తీర్పును ఈనెల 9కి రిజర్వ్ చేసినట్టు 7వ తేదీన హైకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ఈ కేసులో తీర్పు ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రెండు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. సీపీఐతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్ ఈ తీర్పుపై ఆసక్తి చూపించింది. అయితే నందూలాల్ అగర్వాల్ లేవనెత్తిన అభియోగాల్లో మెరిట్స్ లేనందున ఆయన దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు సోమవారం హైకోర్టు వెల్లడించింది. కూనంనేనికి అనుకూలంగా తీర్పు రావడంతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో సీపీఐ కార్యకర్తలు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. రెండు పట్టణాల్లోనూ ర్యాలీలు తీశారు. గతంలో వనమాపై.. ఎన్నికల అఫిడివిట్లో వివరాలు, అనర్హత అంశంపై కొత్తగూడెం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయన పూర్తి వివరాలు పేర్కొనలేదంటూ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జలగం వెంకట్రావ్ 2020లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్లకు పైగా విచారణ తర్వాత వనమా ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 జూలైలో తీర్పు వెలువడగా.. వనమా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ విచారణ దశలో ఉండగానే 2023 నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వనమా ఓడిపోగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఫలితా లు వెలువడిన మరుసటి నెలలో కూనంనేని ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఇక్కడి రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు 2024 జనవరిలో దాఖలైన పిటిషన్ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయస్థానం 20సార్లకు పైగా కొనసాగిన వాదనలు సీపీఐ శ్రేణుల సంబరాలు..కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ/సుజాతనగర్ : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనర్హత పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం పట్ల కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లో సీపీఐ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెంలో సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నుంచి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సెంటర్లలో బాణ సంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొంతమంది దురుద్దేశంతో కూనంనేనిపై అనర్హత పిటిషన్ వేశారని, అయినా న్యాయం తమ వెంటే ఉందని అన్నారు. ఇది ప్రజల విజయమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ముత్యాల విశ్వానాధం, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, సాయిబాబా, రాహుల్, రెహమాన్, దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, భూక్యా దస్రు, కొమారి హనుమంతరావు, జక్కుల రాములు, వీర్ల మల్లేష్, తాళ్లూరి ధర్మారావు, బొడ్డు కేశరావు మూడు గణేష్, మహ్మద్ యూసఫ్, ఎస్కే ఫహీమ్, శ్రీనివాస్, సత్యనారాయణ చారి, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
కొత్తగూడెంఅర్బన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికమని కొత్తగూడెంలోని జర్నలిస్టులు, ప్రజా, సంక్షేమ సంఘాల నాయకులు అన్నారు. శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తూ సోమవారం రాత్రి కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష గట్టి సాక్షి దినపత్రిక, న్యూస్ చానల్పై దాడులు చేస్తోందని, అక్రమ అరెస్టులు చేయడం జర్నలిజంపై గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ప్రజలకు – ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా, వారి మాటలను తప్పబడుతూ, అధికారం ఉందనే అహంకారంతో అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. సాక్షిలో పనిచేసే ముఖ్యులను టార్గెట్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేధావులు, సమాజంలోని అన్ని వర్గాల వారు ముందుకు రావాలని కోరారు. అక్రమ అరెస్టులతో ఇబ్బంది పెడుతున్న పచ్చ ప్రభుత్వం భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ, ప్రజాజ్యోతి పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు తాండ్ర కృష్ణగోవింద్, రాజేందర్, వెంకన్న, అశోక్, జర్నలిస్టులు భాస్కర్రెడ్డి, జునుమాల రమేష్, వీరు, రేశ్వంత్, తారక్, ఈశ్వర్, వాసాల శేఖర్, కృష్ణారావు, సాయి ప్రసాద్ రెడ్డి, రాము, గాంధీపథం జిల్లా కన్వీనర్ చింతలచెర్వు గెర్షోము తదితరులు పాల్గొన్నారు. -
‘కరెంట్’కే కష్టాలు!
వాతావరణ ం జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతంగా మారుతుంది. సాయంత్రం వరకు అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. ● జిల్లా విద్యుత్శాఖలో పేరుకుపోయిన మొండి బకాయిలు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెండింగ్ కరెంట్ బిల్లులు ● హెచ్టీ బకాయిలు రూ.404 కోట్లు, ఎల్టీలో రూ. 62 కోట్లు ● ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్న అధికారులు భారంసూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ శాఖలో బకాయిలు పేరుకుపోతున్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్శాఖకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. వాటి నుంచి గట్టెక్కేందుకు బ్యాంకు రుణాలవైపు చూస్తోంది. బకాయిలు చెల్లించాల్సిన జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో గత ఏప్రిల్ వరకు హెచ్టీ(హై టెన్షన్) కనెక్షన్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.404.58 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎల్టీ(లో టెన్షన్) కనెక్షన్లకు సంబంధించి రూ.62.06 కోట్ల వరకు బకాయి ఉండటం గమనార్హం. అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ శాఖ నుంచి 25 సర్వీసులకు రూ. 310.72 కోట్ల బకాయి ఉంది. మున్సిపల్ (డబ్ల్యూడబ్ల్యూ) శాఖలో 7 కనెక్షన్ల నుంచి రూ.23.87 కోట్లు, ఇరిగేషన్ శాఖలో 28 సర్వీసులకు సంబంధించి రూ.45.22 కోట్ల బకాయిలు ఉన్నాయి.బకాయిల ఎల్టీ కనెక్షన్ల బకాయిల వివరాలు ఇలా.. డిపార్ట్మెంట్ సర్వీసుల బకాయి సంఖ్య (రూ.లక్షల్లో) సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ బ్యాంకులు 15 1.86 ఆర్డబ్ల్యూఎస్ 11 67.56 పోస్టల్ 9 0.21 ఎఫ్సీఐ 2 0.20 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ బకాయి ఉన్నవి మైనర్ పంచాయతీ (డబ్ల్యూడబ్ల్యూ) 1,475 1935.62 మైనర్ పంచాయత్ (ఎస్టీఎల్) 2,574 1452.36 మేజర్(డబ్ల్యూడబ్ల్యూ) 104 185.63 మేజర్(ఎస్టీఎల్) 422 130.06 మున్సిపల్(ఎస్టీఎల్) 563 290.01 మున్సిపల్(డబ్ల్యూబ్ల్యూ) 137 242.25 ఎడ్యుకేషన్ 204 212.44 ఫిషరీస్ 85 162.68 సోషల్ వెల్ఫేర్ 718 415.47 -
ధాన్యం సేకరణ55,245 మెట్రిక్ టన్నులు
ఇంకా జమకాని బోనస్ క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగిలో కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యం 36,951 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 18,293 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. సన్నాలకు రూ.18.48 కోట్ల బోనస్చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. 2.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి.. జిల్లాలో యాసంగిలో రైతులు 77వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 2.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసిది. ఇందులో 66,928 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. పీఏసీఎస్, జీసీసీ, డీఆర్డీఏ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 145 కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. 8,222 మంది రైతుల నుంచి రూ.127.80 కోట్ల విలువైన 55,245 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. లక్ష్యానికి ఇంకా 11,683 మెట్రిక్ టన్నుల సేకరణ తగ్గింది. రూ.125.31 కోట్లను రైతులకు చెల్లించారు. అంతకుముందు యాసంగి సీజన్లో 67,970 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకుని, 2,302 మంది రైతుల నుంచి 13,708 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. కేంద్రాలను ఏప్రిల్ 4 నుంచి జూన్ 6 వరకు కొనసాగించినా ఈసారి కొనుగోలు ప్రక్రియ మాత్రం ఆలస్యంగా మొదలైంది. దీనికితోడు అకాల వర్షాలు కురవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించారు. కాగా ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్కు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 చొప్పున చెల్లించింది. పొలాల వద్దే కొన్న వ్యాపారులు ప్రైవేటు వ్యాపారులు కల్లాలు, ఇళ్ల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనల కారణంగా కొందరు ప్రైవేటు వైపు మొగ్గు చూపారు. తేమశాతం 17 లోపు ఉండాలని, తాలు గింజలు, వ్యర్థాలు లేకుండా శుభ్రపరిచి తేవాలని నిబంధనలు విధించారు. తాలు, వ్యర్థాల పేరుతో క్వింటాల్కు ఐదు కేజీల చొప్పున తూకం ఎక్కువ వేశారు. దీంతో పచ్చి వడ్లనే ప్రైవేటులో విక్రయించడం మేలని రైతులు భావించారు. అయితే గతం కంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ భారీగా పెరిగింది. లక్ష్యం స్వల్పంగా తగ్గింది ఈ ఏడాది యాసంగిలో రూ.127.80 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం. నిర్దేశిత లక్ష్యంలో స్వల్పంగానే తగ్గింది. మార్కెట్లో ధాన్యానికి అధిక ధర ఉండటం, ప్రభుత్వం నిర్దేశించినట్లు గ్రేడింగ్ చేయలేని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకున్నారు. సీడ్ వ్యాపారులతో ఒప్పందం చేసుకున్న కొందరు ఏపీలో అమ్మకాలు జరిపారు. –త్రినాథ్బాబు, పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎంజిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. గత శనివారంతో కేంద్రాలను ఎత్తివేశారు. ఈ సీజన్లో లక్ష్యంలో సుమారు 82 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడం, వాతావరణ మార్పులతో అకాల వర్షాల కారణంగా కొందరు రైతులు మాత్రం వడ్లను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. దీంతో పౌరసరఫరాలశాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ జరగలేదు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క రైతు ఖాతాలో కూడా నగదు జమ కాలేదు. – పాల్వంచరూరల్ -
ఘనంగా అర్ధ శతాబ్దపు వేడుకలు
మధిర: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్ధ శతాబ్దపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జూనియర్ కళాశాలను స్థాపించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాశాల ఆవరణను మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో అలంకరించి, అతిథుల రాక కోసం రెడ్కార్పెట్ వేశారు. ప్రత్యేక సెట్టింగ్లతో బ్యాచ్లవారీగా గ్యాలరీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. 1970 – 1972 మొట్టమొదటి బ్యాచ్ నుంచి 2025 వరకు బ్యాచ్లవారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల పేర్లను నమోదు చేయించుకున్నారు. నాటి గురువులు, పూర్వ విద్యార్థులు వృద్ధాప్యంలోకి చేరడంతో పాటు వీఐపీల రాకతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 55 ఏళ్ల పూర్వ విద్యార్థులు ఒకేవేదిక పైకి చేరుకున్నారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువులతో పాటు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వేలాదిమంది తరలిరావడంతో కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. -
రామయ్య సేవలో పాలకుర్తి ఎమ్మెల్యే
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని పాలకుర్తి ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి ఆదివారం సందర్శించారు. వేదపండితులు స్వాగతం పలకగా, ఆమె కు టుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్ఓ సాయిబాబ, వేదపండితు లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెరిగిన భక్తుల సంఖ్య భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఈ ఏడాది మేలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గత ఏడాది 2,48,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది 2,88,103 మంది దర్శించుకున్నట్లు ఆయల ఈఓ ఎల్.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఘర్షణఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రిక్కాబజార్కు చెందిన ప్రేమజంట వివామం చేసుకొని రక్షణ కోసం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారు మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అయితే వెళ్లిపోయిన ప్రేమజంట పోలీస్ స్టేషన్కు వచ్చారని తెలుసుకొని ఇరువర్గాల వారు భారీగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఒకరినొకరు తిట్టుకుంటూ తోసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో సీఐ కరుణాకర్ అధ్వర్యంలో పోలీసులు వారిని చెదరగొట్టారు. బోనమెత్తిన గువ్వలగూడెం.. నేలకొండపల్లి: మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో గంగమ్మ దేవాలయం పునఃప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జాతర నిర్వహించగా.. ఆదివారం ముగింపు రోజు కావడంతో మహిళలు బోనమెత్తి గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోరట్లగూడెం, పైనంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు రమేష్, భద్రయ్య, జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, వెంకన్న, కడియాల నరేష్, చెరువు స్వర్ణ, కొమ్మినేని విజయ్బాబు, అడపాల రామారావు, మార్తి కోటి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిముదిగొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం బాణాపురం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండవకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనుముల అనిల్రెడ్డి స్కూటీపై బాణాపురం వస్తుండగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సర్గం శరత్కుమార్(35) బుల్లెట్పై వస్తూ ఢీకొట్టాడు. దీంతో బుల్లెట్ పైనుంచి కిందపడిన శరత్కుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్రెడ్డి తలకు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. కారుడ్రైవర్పై కేసు పాల్వంచరూరల్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఖమ్మం చర్చికాంపౌండ్కు చెందిన ఇమ్మడి లలిత ఈ నెల 5వ తేదీన మండలంలోని బస్వతారకకాలనీలోని వాసుమల్ల మోసు ఇంటికి వచ్చింది. రోడ్డు దాటుతుండగా పాల్వంచ వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. మోసు ఫిర్యాదు మేరకు కారుడ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అంతరాలయంలో అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు అన్నప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదుపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్ శర్మ పాల్గొన్నారు.నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో గిరిజనులు సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు. తొలిరోజు ఐసెట్ ప్రశాంతంసుజాతనగర్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిరోజు ఆదివారం అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఐఎస్ట్ ప్రశాంతంగా ముగిసింది. మొదటి షిఫ్ట్లో 118 మంది, రెండో షిఫ్ట్లోనూ 118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. తుమ్మల చెరువులో పర్యాటకుల పాట్లుఅశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు వద్ద బోటింగ్ వద్ద తగిన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వద్ద రెండు చిన్న బోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో జలవిహారం చేసేందుకు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది. వసతి, తాగునీటి, చిన్న పిల్లలకు స్నాక్స్ వంటి సౌకర్యాలు కూడా లేవు. తుమ్మలచెరువు వరకు రహదారి కూడా సక్రమంగా లేదు. అధికారులు స్పందించి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, పార్క్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆదాయం అంతంతే..
● జిల్లాలో జోరుగా జీరో దందా ● మార్కెటింగ్ శాఖ ఆదాయానికి గండి ● పటిష్ట చర్యలు చేపట్టని అధికారులు ఇల్లెందు: జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్లు ఉన్నా జీరో దందా జోరుగా సాగుతోంది. అనుమతులున్న వ్యాపారులు కూడా క్రయవిక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయకుండా మార్కెట్ ఫీజుకు ఎగనామం పెడుతున్నారు. రైతుల పేరుతో రశీదులు సృష్టించి దర్జాగా ఎగుమతులు చేస్తున్నారు. పంట పండినట్లు వ్యవసాయశాఖ, భూమి ఉన్నట్లు రెవెన్యూ శాఖ రశీదులు ఇస్తున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతోంది. జీరో దందాకు చెక్ పెడితే మార్కెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకోసం చెక్ పోస్టులు పటిష్టం, నిరంతర తనిఖీలు, క్రయవిక్రయాల ఆన్లైన్, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెక్ పోస్టులతోనే ఆదాయం.. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లలోనూ ఏడాది పొడవున క్రయవిక్రయాలు సాగడంలేదు. కేవలం సీజనల్గా మాత్రమే వ్యాపారం జరుగుతోంది. దీంతో ఆదాయం కోసం చెక్ పోస్టులపైనే ఆధార పడాల్సివస్తోంది. జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్యార్డులు ఉండగా, 2025–26 సంవత్సరానికి రూ. 22.65 కోట్లుగా లక్ష్యం నిర్దేశించారు. గతేడాది లక్ష్యం రూ.21.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. కోటి అదనంగా లక్ష్యం పెంచారు. ఉపయోగపడని గోదాంలు క్రయవిక్రయాలు లేక మార్కెట్ యార్డుల్లో ధర్మ కాంటాలు ఖాళీగానే ఉంటున్నాయి. ఇక్కడి గోదాంలను సివిల్ సప్లై, పీఏసీఎస్, మార్కెఫెడ్లకు స్టాక్ పాయింట్లుగా మారుతున్నాయి. సరైన ధర లభించనప్పుడు రైతులు పంటలు నిల్వ చేసుకునేందుకు మార్కెట్లలో నిర్మించిన గోదాంలు ఇతర శాఖలకు ఉపయోగపడుతున్నాయి. ఇక రూ. కోట్లలో వ్యాపారం చేసే వ్యాపారులు మార్కెట్కు రాకపోగా, అధికారులే వారి ఇళ్లకు వెళ్లి ధాన్యం తోలకం పర్మిట్లను ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మార్కెటింగ్ అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యం సాధిస్తాం ఈ ఏడాది జిల్లాలో మార్కెట్ ఆదాయం లక్ష్యం సాధించే దిఽశగా చర్యలు చేపట్టాం. మార్కెట్ల పరిధిలో చెక్ పోస్టులను పటిష్టం చేసి వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. –జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి..
కల్లూరురూరల్: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఏపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పసుమర్తి చందర్రావు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో కూడా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రఅధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా చందర్రావుతోపాటు ప్రధాన కార్యదర్శులుగా గోళ్ల రాధాకృష్ణ, వనమా కిరణ్, ఉపాధ్యక్షుడుగా వీరదల్లి రాజేశ్, నూకల శ్రీనివాసరావు, కోశాధికారిగా పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా కొప్పరపు బలరాం, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంగిశెట్టి జగదీశ్కుమార్, నాగుబండి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలిగా దోసపాటి సంధ్యారాణి, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా పసుమర్తి రాంబాబు, ప్రమాణ స్వీకారం చేశారు. -
నేడు డిఫ్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. 3గంటలకు ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభ అనంతరం 6 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడెం వెళ్తారు. పొంగులేటి పర్యటన.. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు కూసుమంచి మండలం పోచారం చేరుకుంటారు. 11.15 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.45 గంటలకు తెల్దారుపల్లిలో సీసీ రోడ్లకు, 12.15 గంటలకు కస్నాతండాలో సీసీ, బీటీ రోడ్లకు, 12.45 గంటలకు పోలేపల్లిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. -
కలవరపెడుతున్న గ్యాంగ్వార్
భద్రాచలం: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రంలో హత్యలు జరుగుతున్నాయి. పర్యాటకులకు, భక్తులకు మరుపురాని అనుభూతులను అందించే భద్రగిరిలో ఇటీవలి కాలంలో యువతలో హింసాప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలవుతున్న యువత.. హింస, గొడవలను ఫ్యాషన్గా భావిస్తూ హత్యలకు సైతం తెగబడుతున్నారు. కట్టడి చేయాల్సిన రక్షణ శాఖ విఫలమవ్వటంతో పాటుగా అవినీతి ఆరోపణలతో కూరుకుపోతోంది. పెరుగుతున్న గొడవలు.. జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గ్యాంగ్వార్ల విష సంస్కృతి భద్రాచలానికి పాకింది. గతంలో కేవలం గొడవలకే పరిమితమైన ఈ వార్లు ప్రస్తుతం హత్యలకు సైతం దారి తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది హోలీ రోజున భద్రాచలానికి చెందిన యువకుడిని ఏపీలోని వెంకటరెడ్డిపేటలో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. రెండు రోజుల కిందట పట్టణంలోని జగదీశ్కాలనీకి చెందిన సతీశ్ ను చంపారు. ఇంట్లో ఉండగానే, కుటుంబ సభ్యు లు అడ్డుకుంటున్నా అందరి ముందే హత్య చేయటం యువకుల్లో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం. ఫ్యాషన్గా మారుతున్న క్రైం సినిమాలు, టీవీలు, ఓటీటీ కంటెంట్లో చూపిస్తున్న మత్తు పదార్థాలు, మద్యం వాడకం యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. హింస కంటెంట్గా వస్తున్న సినిమాలతో పాటుగా యువతలో నానాటికీ లోపిస్తున్న మానవతా విలువలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, బెల్ట్షాపుల్లో నిరంతరం లభిస్తున్న మద్యంతో యువత చెడుమార్గం పడుతుండగా.. కొందరు ప్రముఖుల, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ గ్యాంగ్లను పోషిస్తున్నారనే అపవాదు సైతం ఉంది. వీరి అండదండలు, ప్రోత్సాహంతో యువత సైతం తల్లిదండ్రుల లక్ష్యాలను, భవిష్యత్ను పక్కకు పెట్టి హింసవైపు పరుగులు తీస్తున్నారు. పోలీస్ శాఖ విఫలం.. భద్రాచలంలో పెట్రేగిపోతున్న హింస, గొడవలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందనే ఆరోపణలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలంలో వీటిపై మాత్రమే దృష్టి సారించిన రక్షణ శాఖ పెరుగుతున్న గంజాయి వాడకం, గొడవలను అరికట్టడంలో వెనుకబడ్డారని విమర్శలు వస్తున్నాయి. అవినీతి సొమ్ముకు ఆశపడిఏడాది కాలంలోనే భద్రాచలంపోలీస్శాఖలో ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులుపట్టుబడటం సైతం పోలీసులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఇసుక, మైనింగ్ మాఫియాకు అండగా ఉంటూ ప్రధాన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు పెట్రోలింగ్ను పెంచి, గొడవలకు దిగుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇస్తూ చెడు వ్యవసనాలకు బానిసకాకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న హింసాప్రవృత్తి హత్యలను ఫ్యాషన్గా భావిస్తున్న యువత కట్టడి చేయటంలో పోలీస్ శాఖ విఫలం -
ఇంకుడు గుంతల పరిశీలన
జూలూరుపాడు: మండలంలో పలు గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఇంకుడు గుంతలు, కందకాలను ఆదివారం సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి పృథ్వీరాజ్ పరిశీలించారు. జూలూరుపాడు, కొత్తూరు, పాపకొల్లు, అన్నారుపాడు, భేతాళపాడు, కరివారిగూడెం, కొమ్ముగూడెం, మాచినేనిపేట, మాచినేనిపేటతండా, పడమటనర్సాపురం, సాయిరాంతండా, కాకర్ల, శంభునిగూడెం, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇంటి ప్రాంగణాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారుల పక్కన నిర్మించిన ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. పడమటనర్సాపురం సమీపంలో గుట్ట చుట్టూ చేపట్టిన కందకం పనులను సందర్శించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఈసీ రాజు, ఈజీఎస్ ఏపీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కె ట్ జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. మోడల్ మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత నిర్మాణా లను తొలగిస్తున్నారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి అమ్మకాలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రసిద్ధి కావడంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంగనర్, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల సైతం అమ్మకాలకు ఇక్కడకు వస్తుంటారు. దీంతో మిర్చి సీజన్లో నిత్యం లక్ష నుంచి 2 లక్షల బస్తాల వరకు పంట విక్రయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో యార్డులు సరిపోవడం లేదని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధునాతన మార్కెట్ నిర్మాణాలకు రూ. 155.30 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం మిర్చి సీజన్ ముగియడం, వేసవి సెలవులు ప్రకటించడంతో పాత నిర్మాణాలను సమూలంగా తొలగిస్తూ నూతన నిర్మాణ పనులను చకచకా చేయిస్తున్నారు. 75 ఏళ్ల నాటి గుర్తులు.. బ్రిటీష్ కాలం 1937లో నలుగురైదుగురు వ్యాపారులు కలిసి పరిసరప్రాంతాల రైతుల సౌకర్యార్థం గాంధీచౌక్లో బీట్బజార్ ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా జిల్లాలో నీటి వనరులు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో మార్కెట్ ఆవశ్యకత పెరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్గా గుట్టల బజార్లో ఏర్పాటైంది. అయితే 1969 నుంచి ప్రభుత్వం మార్కెట్ చట్టాన్ని అమలు చేయగా.. క్రమక్రమంగా దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంగా రూపుదిద్దుకుని పంటల కొనుగోళ్లలో గుర్తింపు సాధించింది. తొలుత అపరాలు, ఆపై పత్తి, మిర్చి పంటల సాగు పెరగడంతో ఖమ్మం మార్కెట్ అభివృద్ధి సాధించింది. అపరాల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యార్డు ప్రస్తుతం మిర్చి యార్డుగా మారింది. ఈ యార్డులో 22 షెడ్లు, భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్ కార్యాలయం ఉన్నాయి. దీంతో పాటు ఈ యార్డుకు పక్కనే మిర్చికి ప్రత్యేకంగా నిర్మించి.. మరో షెడ్, గోదాములు, జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయం, కార్మికుల కార్యాలయాలను కూడా తొలగించడంతో ఆనాటి గుర్తులన్నీ కనుమరుగయ్యాయి. పాత నిర్మాణాలపై భావోద్వేగం మార్కెట్ పాత నిర్మాణాలు కనుమరుగవుతుండడంతో ఇక్కడ పనిచేసే వ్యాపారులు, కార్మికులు భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు మార్కె ట్ తొలగిస్తున్న వీడియోలు తీసి పాటలు జోడించి సోషల్ మీడియాలో పెడుతుండగా.. మరికొందరు యార్డులో వ్యాపారులకు కేటాయించిన స్థానాలు, నిత్యం పనిచేసే ప్రాంతాలు, భోజనం చేసే ప్రాంతాలు, చెట్ల తొలగింపు చూసి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ మార్కెట్లో సుమారు 600 మంది వ్యాపారులు, 3 వేల మంది కార్మికులు పని చేస్తుండగా.. పరోక్షంగా నగరంలోని త్రీటౌన్ ప్రజలు వివిధ రకాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం రైతుల ప్రయోజనం కోసం ఖమ్మం మార్కెట్ను అభివృద్ధిలో భాగంగా పాత నిర్మాణాలను తొలగించి మోడల్ మార్కెట్గా రూపురేఖలు మార్చుతోంది. 7 అధునాతన షెడ్లతో పాటు ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు శ్రీకారం చట్టారు. మార్చి నుంచి మార్కెట్లోని ఓ భాగంలో ప్రారంభించిన పనులను ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పూర్తిస్థాయిలో పనులను చేపట్టారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.10 కోట్లతో నిర్మించిన షెడ్లను కూడా తొలగించి 15.39 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టారు. అజిలిటి భూమి కంపెనీ ఈ నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. 2026 జూన్ నాటికిపనులను పూర్తయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది. బీట్బజార్ నుంచి ఎదిగిన ఖమ్మం మార్కెట్ తొలుత గ్రెయిన్ మార్కెట్గా పేరు.. మోడల్ మార్కెట్ పేరుతో పాత నిర్మాణాల తొలగింపు రూ.155.30 కోట్లతో మారుతున్న రూపురేఖలు -
గాలి వాన బీభత్సం
జూలూరుపాడు/టేకులపల్లి: జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం, సాయిరాంతండా, వీరభద్రాపురం, సురారం, గుండెపుడి, నల్లబండబోడు, వినోభానగర్, జడలచింత, పాపకొల్లు, భోజ్యాతండా, కొత్తూరు, పెద్దహరిజనవాడ, అన్నారుపాడు, గుండ్లరేవు, భేతాళపాడు, టేకులపల్లి మండలంలోని సులానగర్తోపాటు పలు గ్రామాల్లో గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో రహదారిపై అడ్డంగా పడిపోయిన చెట్లను తొలిగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. వీరభద్రాపురం గ్రామానికి చెందిన పద్దం సావిత్రి, గుండ్లరేవుకు చెందిన చిరంజీవి సులానగర్కు చెందిన బాణోతు బుచ్చి ఇంటి పైకప్పు (రేకులు)లు గాలికి ఎగిరిపోయాయి. -
మానసిక స్థైర్యం కల్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధితో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, వారితో పాటు తల్లిదండ్రుల్లోనూ మానసిక స్థైర్యం కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్ వైద్యాధికారి గిరిసింహారావు అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియాతో ప్రమాదం లేకున్నా ఆ వ్యాధిని తలుచుకుని బాధ పడడం వల్లనే మరింత అనారోగ్యాలకు గురవుతారని చెప్పారు. చిన్నారులు సాధారణ జీవితం గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రమం తప్పకుండా రక్తం ఎక్కించుకుంటూ, మందులు వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు అండగా ఉండేందుకు సంకల్ప సంస్థతో కలిసి నడుస్తామని అన్నారు. చిన్నారుల కోసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో సంకల్ప సంస్థ ఫౌండర్ పి.అనిత, ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచందర్, ఉదయ్భాస్కర్, వంశీకిరీటి, ఉపేందర్, మధు, ప్రముఖ మీడియా ప్రతినిధి అడప నాగేందర్, డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియాతో చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం లేదు టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్ వైద్యాధికారి గిరిసింహారావు -
రాత పరీక్ష ఎప్పుడో..?
● సింగరేణిలో మార్చి 2024లో ఇంటర్నల్ నోటిఫికేషన్ ● పరీక్ష కోసం 15 నెలలుగా ఎదురుచూస్తున్న కార్మికులు సింగరేణి(కొత్తగూడెం): నోటిఫికేషన్ విడుదల చేసి 15 నెలలు గడిచినా సింగరేణిలో ఇంటర్నల్ క్లరికల్ రాత పరీక్ష నిర్వహించడంలేదు. 360 క్లరికల్ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం 2024 మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సంస్థవ్యాప్తంగా 7 వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. 15 నెలలైనా పరీక్ష నిర్వహించకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 360 పోస్టులు ఉండగా, ప్రతి నెలా కొందరు కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య ఇంకా పెరిగిందని, ప్రస్తుతం సుమారు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల డిపెండెంట్ ఉద్యోగాలకు ఎక్కువ మంది విద్యావంతులు ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం వారిని బదిలీ వర్కర్గా నియమించిన యాజమాన్యం.. వారితో క్లరికల్ విధులు నిర్వహింపజేస్తోంది. బదిలీ వర్కర్ వేతనం పొందుతూ క్లరికల్ పనులు చేయాల్సివస్తోందని వారు వాపోతున్నారు. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు ఏవీ..? 2024 సంస్థ 327 క్లరికల్ పోస్టుల భర్తీకి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సింగరేణి సీఎండీగా ఎన్.బలరామ్ బాధ్యతలు చేపట్టాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చినా నోటిఫికేషన్కు సంబంధించిన పరీక్షా నిర్వహించలేదు. ఇక రిక్రూట్మెంట్ సెల్ జీఓం పోస్టులో ఇటీవల కాలంలో ముగ్గురు అధికారులు మారారు. ఈ పోస్టులో ఏ ఒక్క అధికారి పూర్తిస్థాయిలో పనిచేయని కారణంగా నోటిఫికేషన్లు జాప్యమవుతున్నాయని కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే 2024 మార్చి నోటిఫికేషన్ రాత పరీక్ష నిర్వహించాలని, ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. -
అడవులను రక్షించుకుందాం
చండ్రుగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను రక్షించుకుందామని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. మండలంలోని బెండాలపాడు శివారు కనకగిరి అటవీ ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. గుట్టలపైభాగంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. అనంతరం పర్యాటకుల కోసం గుట్టలపైభాగంలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ను పరిశీలించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్ను సందర్శించారు. వెదురు ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అడవులను, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అందుకోసం పోలీసుశాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఫారెస్టు రేంజర్ ఎల్లయ్య పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు -
మాజీ ఎమ్మెల్యేకు ప్రముఖుల నివాళి
రఘునాథపాలెం: బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆదివారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడిలో దశదిన ఖర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మదన్లాల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఐఏఎస్ అధికారిగా ఉన్న బానోత్ మృగేంద్రలాల్ను పలువురు పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావుతోపాటు గుండాల కృష్ణ, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, అజ్మీరా వీరూనాయక్ తదితరులు ఉన్నారు. -
పుణ్యస్నానాల కోసం వచ్చి..
భద్రాచలంఅర్బన్: గోదావరి పుణ్యస్నానాల కోసం వచ్చి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గపరిధి రామాంతపూర్ నుంచి 13 మంది భక్తులు పట్టణంలోని భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చారు. ఈనేపథ్యాన శుక్రవారం గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా.. అఖిల్(7) అనే బాలుడు సైతం అందరితో పాటు స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు. ఈక్రమంలో బాలుడు కనిపించకపోవడంతో అతడి తల్లి స్వప్న ఒక్కసారిగా అరుస్తుండడంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు అందులోకి దిగి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 15 నిమిషాల తర్వాత అఖిల్ ఆచూకీ లభ్యమవడంతో గత ఈతగాడు ప్రసాద్ స్థానికుల సాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రి తీసుకెళ్లాడు. కాగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుమారుడు మృతదేహాన్ని ఒళ్లో పడుకోబెట్టుకొని గుండెలవిసేలా ఏడుస్తున్న హృదయవిదారకర సంఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అఖిల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడికి తల్లితో పాటు తండ్రి ధనంజి, అన్నయ్య ఉన్నాడు. కాగా, గోదావరిలో అధికారులు నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ను దాటి వెళ్తుండడంతో ఇటువంటి ఘటనలు జరుగున్నాయని స్థానిక గజ ఈతగాళ్లు చెబుతున్నారు.గోదావరిలో మునిగి మృతిచెందిన బాలుడు -
కేసు నమోదు
పాల్వంచరూరల్: వేగంగా అతి నిర్లక్ష్యంగా బుల్లెట్ వాహనాన్ని నడుపుతూ మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘనటలో ఇద్దరిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రుసుము అశోక్రెడ్డి, అఖి దంపతులు శుక్రవారం రాత్రిపాల్వంచ నుంచి ఇంటికి వెళ్తున్నారు.ఈక్రమంలో రంగాపురం వద్దకురాగానే పాల్వంచ వైపు నుంచి వస్తున్నబుల్లెట్ వాహనం ఢీకొట్టడంతో భార్యాభర్తలు కిందపడి గాయపడ్డారు. చికిత్సనిమిత్తం ఖమ్మానికి తరలించగా.. క్షతగాత్రుల బంధువైన రామకోటిరెడ్డిఫిర్యాదు మేరకు బుల్లెట్ నడుపుతున్నగడ్డం సంతోష్, వి.సంతోష్లపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై.. సూపర్బజార్(కొత్తగూడెం): వ్యక్తి అదృశ్యంపై రామవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. రామవరం సీఆర్పీ క్యాంపునకు చెందిన ఎస్కె.యూసుఫ్ (62) గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించగా.. నెల రోజులైనా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో యూసుఫ్ కుమారుడు పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బార్ షాపు గుమస్తాపై నలుగురు దాడి..
పాల్వంచ: మద్యం సేవించేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు బార్ షాపు గుమస్తా, మరో కస్టమర్పై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద నవోదయ బార్ షాపునకు శనివారం సాయంత్రం మద్యం సేవించేందుకు వెళ్లిన చింతా వంశీ డబ్బులు ఇవ్వకుండా బీర్ బాటిల్ తీసుకున్నాడు. అనంతరం మరో బాటిల్ ఇవ్వాలని అక్కడి గుమస్తా వడ్డె నర్సింహారావును అడిగితే.. డబ్బులు ఇస్తేనే ఇస్తాననడంతో తాను లోకల్ అని, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వవా అంటు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. చింతా వంశీ అతడి స్నేహితులు కిషోర్, రఘు వరణ్, మణిశంకర్లు కలిసి వడ్డె నర్సింహారావుతో పాటు అక్కడి మరో కస్టమర్ అయిన కిరణ్రెడ్డిపై దాడికి పాల్ప డ్డారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరార్ అయ్యారు. నర్సింహారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం కోసం వెళ్లిన వ్యక్తి మృతిచుంచుపల్లి: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన ప్రత్తిపాటి కోటేశ్వరరావు (55) వారం రోజుల క్రితం బీపీ ఎక్కువ కావడంతో విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం మళ్లీ తీవ్ర సమస్య తలెత్తడంతో వైద్యులు ఖమ్మానికి రిఫర్ చేయగా అంబులెన్స్లో తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈమేరకు మృతుడి కుమారుడు శ్రీనివాసరావు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 50 పశువుల పట్టివేత.. ● గోశాలకు తరలింపుఇల్లెందు: పట్టణంలోని స్టేషన్ బస్తీ పెంకు ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 పశువులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి స్టేషన్ బస్తీ నుంచి ఓ లారీలో తరలించేందుకు ఎక్కిస్తుండగా.. హిందూ ఐక్య వేదిక నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యాన దాడి చేసి లారీ డ్రైవర్తో పాటు పశువులు తరలిస్తున్న మోబిన్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆతర్వాత పశువులను గోశాలకు తరలించారు. కాగా, పశువులు తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. ముగ్గురు విలేకరులపై కేసు ఖమ్మంక్రైం: ఖమ్మంకు చెందిన ముగ్గురు విలేకరులపై టూటౌన్ పోలీస్స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. కారు పార్కింగ్ విషయమై ముగ్గురు విలేకరులు తనతో దౌర్జన్యంగా ప్రవర్తించారని ద్వారకానగర్కు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే, వెంకటకృష్ణ, ఆయన కుటుంబీకులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విలేకరులు ఫిర్యాదు చేయగా ఇంకో కేసు నమోదు చేశామని సీఐ బాలకృష్ణ తెలిపారు. -
గాలి, వాన బీభత్సం..
జూలూరుపాడు: మండలంలో శనివారం గాలి, వాన భీభత్సాన్ని సృష్టించింది. బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం సుమారు గంటకు పైగా కురిసింది. దీంతో చెట్లు విరిగపడగా, ఇళ్ల పై కప్పు ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ●జూలూరుపాడు న్యూకాలనీలో చెట్లు విరిగిపడడంతో మూడు విద్యుత్ స్తంభాలు విరగగా.. మందా కమలాకర్ ఇంటిపై ఓ స్తంభం ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది సుమారు నాలుగు గంటలకు పైగా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ●స్థానిక పోలీస్స్టేషన్ సమీపాన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు వాటిని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ●సురారం గ్రామానికి చెందిన మాళోత్ సురేష్కు చెందిన కోళ్ల ఫారమ్ షెడ్ కుప్పకూలడంతో సుమారు 4 వేల కోడి పిల్లలు చనిపోయాయి. దీంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. ●అదే గ్రామానికి చెందిన బానోత్ నాగరాజు, తాటి వీరయ్య, పుట్టి లాలయ్య రేకుల ఇళ్ల పైకప్పు గాలికి ఎగిరిపోయింది. ●వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆశాకార్యకర్త కల్తి గోపారత్నం, శ్రీను దంపతుల రేకుల ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని 5 క్వింటాళ్ల బియ్యం, వంట పాత్రలు, బట్టలు తడిసి ముద్దయ్యాయి. అంతేకాక రెండు టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతినడంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. ●వెంగన్నపాలెం, గుండెపుడి, నల్లబండబోడు, తదితర గ్రామాల్లో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు చెట్లు విరిగిపడడంతో విద్యుత్తీగలు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విరిగిపడ్డ చెట్లు.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు -
మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన
కల్లూరు: విధినిర్వహణలో ఉన్న కల్లూరు ఎస్ఐ డి.హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ రఘు వెల్లడించారు. కల్లూరు పోలీసుస్టేషన్లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద తల్లాడకు చెంది న రాయల రామారావు తదితరులు శుక్రవారం సాయంత్రం మధ్యం మత్తులో గొడవ చేస్తున్నారని యాజమాని మాగంటి బోసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయానికి వెళ్లిపోయిన రామారావు తిరిగి పలువురితో వచ్చి హోటల్ సిబ్బంది, యాజమానిని బెదిరించాడు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే హోటల్ను నడవనిచ్చేది లేదని హెచ్చరిస్తుండగా ఎస్ఐ హరిత, సిబ్బందితో వచ్చా రు. మద్యం మత్తులో ఉన్న రామారావు, ఆయన అనుచరులను పంపించే ప్రయత్నంలో ఎస్సై, సిబ్బంది విధులను ఆటంకపరుస్తూ దాడి చేశారు. ఈమేరకు ఎస్ఐ ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు కాగా, ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, రామారావుపై గతంలోనూ తల్లాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం, కల్లూరు, పెనుబల్లి ఎస్ఐలు డి.హరిత, వెంకటేష్ పాల్గొన్నారు.పురుగుమందు తాగి వృద్ధురాలు ఆత్మహత్యబూర్గంపాడు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన బోయిన రాంబాయమ్మ(69) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి ఖమ్మంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు -
కడతేర్చిన పాతకక్షలు..
భద్రాచలంలో యువకుడి దారుణహత్య.. ● పాత గొడవల కారణంగా కత్తులతో దాడి ● మృతిచెందాడని నిర్థారించుకున్నాకే వెళ్లిన వైనం ● పోలుసులకు లొంగిపోయిన నిందితుడుభద్రాచలంఅర్బన్: పాతకక్షల నెపంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్లి ఒక్కసారిగా దాడి చేసి కత్తులతో అతికిరాతకంగా పొడిచి మృతిచెందాడని నిర్థారించుకున్నాకే తిరిగి వెళ్లిన ఘటన ఇది. ఇంతటి ఉదాంతమైన సంఘటన శనివారం ఉదయం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీష్ (25)కు జగదీష్కాలనీకి చెందిన గుంజా సాయిరామ్కు మధ్య గడిచిన కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి వారిద్దరు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మరోమారు గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై అదేరోజు రాత్రి చర్లరోడ్డులో గల భద్రాచలం సరిహద్దున ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ఇరువర్గాలకు చెందిన 40 మంది కొట్లాటకు దిగే సమయాన పోలీసులు వస్తున్నారనే సమాచారంతో అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అక్కడ వదిలేసి వెళ్లిన మూడు ద్విచక్ర వాహనాలను స్టేషన్ కు తరలించి పరిశీలించగా.. ఓ స్కూటీలో రెండు కత్తులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. గొడవను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న సాయిరామ్ శనివారం ఉదయం దాదాపు 15 మందిని తీసుకుని సతీష్ ఇంటి వెళ్లి తలుపు కొట్టి ఒక్కసారిగా అందరూ దాడికి దిగారు. ముందుగా అతడి కడుపులో కత్తితో పొడిచాక తర్వాత పీకమీద కిరాతకంగా పొడిచారు. కాగా, సతీష్ మృతి చెందాడని నిర్థారించుకునే వరకు అతడిపై 15 మంది దాడి చేసినట్లు సమాచారం. సతీష్ మృతి చెందాడని తెలుసుకున్నాక ఘటనా స్థలం నుంచి అందరూ వెళ్లిపోగా సాయిరామ్ మాత్రం స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. అనంతరం సతీష్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సతీష్ వృతిరీత్యా భద్రాచలంలో ఆటో నడుపుతుండగా.. పాత కక్షలతోనే హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 15 మందిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ నాగరాజు తెలిపారు. కాగా, భద్రాచలం అర్ధరాత్రి సమయాన పోలీస్ పెట్రోలింగ్ పెంచి, పాత నేరస్తులపై నిఘా పెంచితే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని రామయ్య మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజ లు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భ గుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణా న్ని శాస్త్రో కంగా జరిపారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో గత ఏప్రిల్లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ మద్దినేని పాపారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 654 మంది హాజరు కాగా 203 మంది ఉత్తీర్ణులయ్యారని, 31.04 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. ఇంటర్లో 758మంది పరీక్ష రాయగా, 388 మంది పాసయ్యారని, 51.19 శాతం ఉత్తీర్ణత నమోదయిందని తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 12 నుంచి 18వ తేదీ లోగా వెబ్సైట్, మీసేవ సెంటర్లలో ఫీజుచెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్ట్కు ఇంటర్మీడియట్లో రూ.400, పదో తరగతిలో రూ.350, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్కు ఇంటర్, పదోతరగతిలో రూ.1200 చెల్లించా లని వివరించారు. 11న చండీహోమంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఈ నెల 11న చండీహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్. రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 2,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవా లని కోరారు. పూజలో సంప్రదాయ దుస్తులు మగవారు ధోతి, కండువా, మహిళలు చీర ధరించాలని సూచించారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని కోరారు. రేపటి నుంచి డీసెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: బీఈడీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీజీడీఈఈ సీఈటీ – డీ సెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. ఖమ్మం డైట్ కళాశాలలో ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇందు కోసం నాలుగు బృందాలను నియమించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ సూచించారు. -
నిరుద్యోగులకు వరం
ఏజెన్సీలో ఆధునిక గ్రంథాలయం.. భద్రాచలం: ఏజెన్సీ నిరుద్యోగులకు అధునాతన గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. ఐటీడీఏ అధికారులు కావాల్సినంత మెటీరియల్, చల్లదనం కోసం కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ప్రశాంతంగా సిద్ధమయ్యే అవకాశం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన విద్యార్థులు భద్రాచలంలో ఉంటూ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, టీటీసీ, బీఈడీ వంటి కోర్సులు చదువుతుంటారు. కోర్సుల అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాధన చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి ఇక్కడి ఐటీడీఏ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో పురాతన భవనంలో, చాలీ చాలని వసతులతోనే ప్రిపరేషన్ను నెట్టుకొచ్చే వారు. లైబ్రేరియన్గా ఎస్కే జానీ బాధ్యతలు చేపట్టాక స్థానిక దాతల సహకరాలతో బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, కొంత మెటీరియల్ చేకూర్చారు. వీటిని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు పోలీసు, టీచర్, గ్రూపు పరీక్షల్లో సుమారు 30 మంది ఉద్యోగాలు సాధించారు. ఐటీడీఏ పీఓ చొరవతో.. ఏజెన్సీ నిరుద్యోగులను ప్రోత్సహించేలా భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ గ్రంథాలయ అభివృద్ధికి మరింత చొరవ తీసుకున్నారు. ఐటీడీఏ నుంచి రూ. 28 లక్షల నిధులు కేటాయించడంతో గ్రంథాలయ ప్రాంగణంలో సుమారు ఎకరం స్థలంలో విశాలమైన గది, ప్రత్యేక తరహా షెడ్, మరుగుదొడ్లు నిర్మించారు. కేవలం మూడు నెలల సమయంలోనే నిర్మాణ పనులు పూర్తికాగా, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రారంభించారు. గ్రామపంచాయతీ నిధులతో కుర్చీలు, ప్యాడ్లు, ఫ్యాన్లు, కూలర్లు ఇతరత్రా వసతులు కల్పించారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఇల్లెందు, టేకులపల్లి, ములకలపల్లి, మండలాల విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన చింతూరు, కూనవరం, వీఆర్పురం తదితర మండలాల నిరుద్యోగులు భద్రాచలంలో గదులను అద్దెకు తీసుకుని ఉంటూ గ్రంథాలయంలో 24 గంటలు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటైతే.. మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీని డిజిటలైజేషన్ చేయాలని, కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, నోట్ ప్యాడ్లను అందుబాటులోకి తేవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీంతో దేశంలో ఉన్న అన్ని స్టడీ సెంటర్ల మెటీరియల్ అందుబాటులోకి వచ్చి ప్రిపరేషన్ సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పీఓ ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని హంగులతో భద్రాచలంలో లైబ్రరీ రూ.28 లక్షలతో అదనపు హాల్ నిర్మాణం, మెటీరియల్ కొనుగోలు పోటీ పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులుడిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి పోటీ పరీక్షలు, వివిధ సెట్లకు సిద్ధమయ్యేందుకు లైబ్రరీ అనుకూలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు డిజిటల్ లైబ్రరీగా మార్చితే మరింత ఉపయోగం జరుగుతుంది. గ్రూప్స్, సివిల్స్ ప్రిపరేషన్ తేలికవుతుంది. పీఓ సారు దృష్టి సారించాలి. –శిల్ప, భద్రాచలంప్రశాంతంగా ప్రిపరేషన్ మాది ఇల్లెందు. కేవలం ప్రిపరేషన్ కోసమే భద్రాచలంలో గది తీసుకుని ఉంటున్నా. అప్పుడు ఆరు బయట, అరకొర వసతుల మధ్య చదువుకునేవాళ్లం. ప్రస్తుతం అన్ని హంగులతో లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడే 24 గంటలు చదువుకుంటున్నా. –గుగులోత్ మంగీలాల్, ఇల్లెందు -
● పండుగ.. త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీక ● కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సూపర్బజార్(కొత్తగూడెం): ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశం వినిపించారు. జిల్లా కేంద్రంలో భక్తులతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. పేదలకు ఖుర్బానీ పంపిణీ చేశారు. ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, అశ్వారావుపేట, భద్రాచలం తదితర ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా జరిపారు. కొత్తగూడెంలోని బోడగుట్ట ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ప్రజాస్వామ్య భారతదేశ గొప్పతనమని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ముస్లిం వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ముస్లిం మైనారిటీలను ముప్పుతిప్పలు పెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, మైనార్టీ సంఘాల నాయకులు డాక్టర్ నయీం ఖురేషి, సీపీఐ, ముస్లిం మైనార్టీ నాయకులు వాసిరెడ్డి మురళి, అన్వర్ అలీ, అమీర్ ఖాద్రీ, అయూబ్, ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ రబ్, అబీద్ హుస్సేన్, కరీం పాషా, జావెద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎం పోస్టులు భర్తీ చేయాలి
చర్ల: వేసవి సెలవులు ముగిసే లోగా ఖాళీగా ఉన్న 700 హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. శనివారం చర్లలో టీఎస్ యూటీఎఫ్ నాయకుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఐదు డీఏలకు ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెడుతోందని ఆరోపించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. పీఆర్సీ ఇప్పటికే 23 నెలలు ఆలస్యమైనందున వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ బడిబాట ముగిసే వరకు ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలని, మెమో 1267ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.మురళీమోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు నంది కృష్ణ, జిల్లా కార్యదర్శి సోడె విజయ్ కుమార్, గిరిజన సంక్షేమ విభాగం కన్వీనర్ తేజావత్ బాలు, మండల ప్రధాన కార్యదర్శి ఉయిక బాలకృష్ణ, ఎం.యాడమరాజు, హిమగిరిబాబు, శ్యామల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
రక్షణతో.. సులువుగా..
మణుగూరు టౌన్: సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే రోజు, నెల వారీ లక్ష్యాలు, వార్షిక లక్ష్యాల సాధనకు బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. సంస్థ ఉన్నాధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, గనులను సందర్శిస్తూ ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తున్నారు. ఇకపై కార్యాలయం నుంచి కూడా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సంస్థవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మెయింటెనెన్స్లో ఉన్న యంత్రాల వద్దకు తక్షణమే డంపర్లు పంపడం సులువు కానుంది. గనులు, డిపార్ట్మెంట్లలో చోరీలను కూడా నివారించవచ్చు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణతో ప్రమాదాలను అరికట్టడం, యంత్ర విరామ సమయం తగ్గించడం వంటి చర్యలతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సునాయాసంగా సాధించే అవకాశం ఉంది. ఉత్పత్తి పెంచే దిశగా... బొగ్గు ఉత్పత్తిలో ఏటా అగ్రగామిగా నిలుస్తున్న మణుగూరు ఏరియాలో వానాకాలం అతివృష్టి అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫలితంగా వర్షాకాలంలో ఒక్కోసారి క్వారీల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో అవకాశం ఉన్న రోజుల్లో ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మణుగూరులోని గనులు, డిపార్ట్మెంట్లలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పటిష్ట రక్షణ చర్యలు పాటించేలా, యంత్రాల విరామ సమయం తగ్గించేలా, డంపర్ల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను నిరోధించేలా సీసీ కెమెరాలతో పర్య వేక్షించనున్నారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన.. పూర్తిస్థాయిలో యంత్రాలు వినియోగించేలా అధికారుల చర్యలు సింగరేణిలో పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటుసీసీ కెమెరాల తోడ్పాటుతో... సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా చోరీలతోపాటు మైన్ను పూర్తిస్థాయి పర్యవేక్షణ చేసే వీలు కలుగుతుంది. యంత్రాల విరామం తగ్గించుకునే చర్యలతోపాటు పెంచిన పనిగంటలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి లక్ష్యాన్ని సునాయాసంగా చేరేందుకు దోహదపడుతుంది. మారుతున్న సాంకేతికత, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గనుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. – లక్ష్మీపతిగౌడ్, ఇన్చార్జి జీఎం, మణుగూరు ఏరియా సూపర్వైజర్స్థాయి అధికారి పర్యవేక్షణలో.. గని సైట్ కార్యాలయంలోని ఓ గదిలో పెద్ద డిస్ప్లేను ఏర్పాటు చేసి క్వారీలోని బెంచీల్లో జరిగే ఉత్పత్తి, ఓబీ వెలికితీత ప్రక్రియను నిత్యం ఓ సూపర్వైజర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. గనుల్లో ఉత్పత్తి యంత్రాలు, రవాణా వాహనాలు మరమ్మతులకు గురైనపుడు సీసీ కెమెరాల ద్వారా గమనించి తక్షణమే అక్కడికి ఇతర యంత్రాలు, వాహనాలను పంపించే అవకాశం ఉంటుంది. హాల్ రోడ్లపై సాంకేతిక లోపంతో నిలిచిన డంపర్లను వెనక్కి రప్పించే వెసులుబాటు ఏర్పడనుంది. యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ, ఒక బెంచ్ నుంచి మరో బెంచ్కి డంపర్లు ఖాళీగా తిరగకుండా, సమయం వృథా కాకుండా చర్యలు చేపట్టి ట్రిప్పులు పెంచే అవకాశం ఉంటుంది. డంపర్ల వేగ నియంత్రణ, ఎదురెదురుగా వచ్చే డంపర్లు, ఒక దాని తర్వాత మరొకటి వెళ్తున్న డంపర్లు నిబంధనల ప్రకారం వెళ్తున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. దీంతో వానాకాలం వచ్చే ఉత్పత్తి లోటును తగ్గించుకునే అవకాశం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. ఉత్పత్తి లక్ష్యం సునాయాసంగా సాధించే వీలు కలుగుతుందని అధికార వర్గాలు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. పర్ణశాల హుండీ లెక్కింపుదుమ్ముగూడెం: పర్ణశాల శ్రీ సీతారామ ఆలయ దేవస్థానంలో శుక్రవారం హుండీ కానుకలు లెక్కించారు. నెల రోజులకు గాను రూ. 7,35,728 ఆదాయం సమకూరిందని ఈఓ రమాదేవి తెలిపారు. చివరిసారిగా గత నెల 7న ఆలయ హుండీ కానుకలు లెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భవాని రామకృష్ణ, వెంకటేశ్వరరావు, అనిల్ కుమార్, స్వచ్ఛంద సంస్థ సేవకులు, స్టేట్బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజ, కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పాల్గొన్నారు. లాసెట్ ప్రశాంతంసుజాతనగర్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ పరీక్ష అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించగా, మొదటి షిఫ్ట్లో 103, రెండో షిఫ్ట్లో 112, మూడో షిఫ్ట్లో 109మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి● ఎస్పీ రోహిత్రాజు సూపర్బజార్(కొత్తగూడెం): పరస్పరం మతాలను గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పర్వదినం కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మున్సిపల్, వెటర్నటీ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముస్లింలు భారీ సంఖ్యలో హాజరయ్యే సామూహిక ప్రార్థనా సమయాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పాడి ఆవులను, లేగ దూడలను విక్రయించొద్దని సూచించారు. -
ప్రణాళిక కావాలి
పద్దులో పెట్టారు.. బడ్జెట్లో ప్రత్యేక పద్దు కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండల పరిధిలో ఏడు గ్రామపంచాయితీలను ఏకం చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు బిల్లును గత మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఆ సమావేశాల్లోనే కొత్తగా కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ అయిన మంచిర్యాల, మహబూబ్నగర్లతోపాటు కొత్తగూడెం నగరాభివృద్ధితోపాటు వివిధ పద్దుల కింద రమారమీ రూ.1,000 కోట్ల నిధుల కేటాయించారు. అయితే శాసనసభ, తర్వాత శాసన మండలి, అనంతరం గవర్నర్ ఆమోదం పొంది కార్పొరేషన్ గెజిట్ విడుదలయ్యే సరికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. మరోవైపు బడ్జెట్ అమల్లోకి వచ్చాక తొలి త్రైమాసికం పూర్తి కావొస్తుంది. రెండో త్రైమాసికం నాటికై నా కొత్తగూడెం నగర పాలిక అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైతే ఆ తర్వాత దశల్లో పనులను పట్టాలెక్కించేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే బడ్జెట్ కేటాయింపు ఫలాలు పూర్తి స్థాయిలో దక్కేది సందేహాస్పదం అవుతుంది. ప్రతిపాదనలు సిద్ధం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఇప్పటికే పాల్వంచ , కొత్తగూడెం మున్సిపాలిటీలకు వేర్వేరుగా రూ. 40 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు ఈ రెండు పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పుడు రెండు పట్టణాలు, సుజాతనగర్లు కలిసి నగర పాలికగా మారినందున మూడు ప్రాంతాల ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం–పాల్వంచ పట్టణాల ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 450 కోట్లతో కొత్తగూడెం రింగ్రోడ్డు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులు త్వరితగతిన పట్టాలెక్కేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. చాన్నాళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఖమ్మం – తిరువూరు – పాల్వంచ రోడ్లను కలిపే బైపాస్ రోడ్డుకు సంబంధించి రామవరం దగ్గర గోధుమ వాగుపై వంతెన నిర్మాణ పనులపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. రూ. 124 కోట్లతో చేపట్టిన అమృత్ తాగునీటి పథకం పనుల్లో వేగం పెంచడం, అసంపూర్తిగా మిగి లిన సుజాతనగర్ దగ్గర సింగభూపాలెం, పాల్వంచ పట్టణంలో చింతల చెరువు సుందరీకరణ పనులు చక్కబెట్టాల్సి ఉంది. వీటితో ప్రగతి మైదాన్లో ఇండోర్ స్టేడియం, కార్పొరేషన్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అథారిటీ కూడా వస్తే.. నగరపాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు పాలక మండలిని ప్రకటించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నిధులు సమీకరించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన బాధ్యత కుడాపై ఉంటుంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్, ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్, ఆర్టీసీ బస్ స్టేషన్ పునర్ నిర్మాణం, జూపార్క్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్పొరేషన్, కుడాల ఆధ్వర్యంలో ఈ పనులపై ఫోకస్ చేయాలి. రాష్ట్ర బడ్జెట్లో కొత్తగూడెం కార్పొరేషన్కు నిధులు పూర్తి కావొస్తున్న తొలి త్రైమాసికం.. ఇటీవల గెజిట్ విడుదల అభివృద్ధి ప్రణాళికతో పద్దులో నిధులు వినియోగించుకునే అవకాశం కమిషనర్గా ఐఏఎస్ అధికారి కావాలంటున్న ప్రజలుకార్పొరేషన్గా పేర్కొంటూ బోర్డుల ఏర్పాటు, డివిజన్ల పునర్విభజనపైనే అధికారులు దృష్టి సారించారు. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో కొత్తగూడెం కార్పొరేషన్కు కేటాయించిన నిధులను నగర అభివృద్ధికి ఉపయోగించేందుకు వీలుగా త్వరితగతిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఐఏఎస్ను నియమిస్తే మేలు సాధారణంగా కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లకు కనీసం గ్రేడ్–1 లేదా స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్లను కమిషనర్లుగా నియమించాల్సి ఉంది. లేదంటే అడిషనల్ కలెక్టర్, ఆపై స్థాయి అధికారులు కమిషనర్లుగా రావాల్సి ఉంది. కమిషనర్ హోదాలో ఉన్న అధికారే (కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)కుడాకు వైస్ చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేడ్–2 ఆఫీసర్గా ఉన్న సుజాతను కొత్తగూడెం కార్పొరేషన్కు కమిషనర్గా నియమించడం పట్ల నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మారిన రూపురేఖలు, పెరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించడం, అవి వేగంగా అమలయ్యేలా వివిధ విభాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. దీంతో ఐఏఎస్ లేదా గ్రూప్ వన్ అధికారులకు కొత్తగూడెం నగర పాలనబాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
ప్రాణాలు తీస్తున్నాయ్..
వీధి కుక్కలు.. వానర మూకలు● కుక్కకాటుతో ఇద్దరు చిన్నారుల మృతి ● కోతుల దాడిలో గాయపడ్డ ట్యాక్సీ డ్రైవర్ ● చికిత్స పొందేందుకు భారీగా ఖర్చు ● నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు జిల్లా కేంద్రంలో సమస్య తీవ్రం.. జిల్లావ్యాప్తంగా కోతులు, కుక్కలు బీభత్సం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వివిధ పనులకు నిమిత్తం బయటకు వెళ్లివచ్చేవారి పై కుక్కలు ఎగబడి దాడి చేస్తున్నాయి. ద్విచక్రవా హనాలపై వెళ్లే వారిని కూడా తరమడంతో కిందపడి గాయపడుతున్నారు. ఇక తలుపు తెరచి ఉంటే చాలు కన్నుమూసి తెరిచేలోపు ఇంట్లో ఆహార పదా ర్థాలను కోతులు ఎత్తుకుపోతున్నాయి. వెళ్లగొడుతుంటే ఎగబడుతున్నాయి. రక్షించుకునే క్రమంలో పలువురు కిందపడి గాయపడుతున్నారు. ఈ సమస్య పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా ఉంది. జిల్లా కేంద్రంలోని రామవరం తదితర ప్రాంతాల్లో మరింత తీవ్రంగా ఉంది. -
విశ్వాసానికి ప్రతీక బక్రీద్
ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్ ఒకటి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలోని జుల్ హజ్ మాసంలో పదో రోజున వస్తుంది. త్యాగానికి, భక్తికి, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ... అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చూపిన అంకితభావాన్ని, విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. నేడు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలకు విద్యుత్ దీపాలతో అలంకరించి సిద్ధం చేశారు.కరకగూడెం/జూలూరుపాడు: బక్రీద్ పండుగ మూలం ఖురాన్ మరియు ఇస్లాం సంప్రదాయాలలో ప్రవక్త ఇబ్రహీం కథతో ముడిపడి ఉంది. దేవుడు ఇబ్రహీం విశ్వాసాన్ని పరీక్షించడానికి తన కుమారుడు ఇస్మాయిల్ను బలిదానం చేయమని ఆదేశిస్తాడు. దేవుని ఆజ్ఞకు పాటించేందుకు సిద్ధపడ్డాడు ఇబ్రహీం. అయితే అతని త్యాగ, విధేయతను చూసిన దేవుడు.. ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను బలిదానం చేయమని ఆదేశించాడు. ఈ సంఘటన దేవుని పట్ల అపరిమితమైన విశ్వాసం, విధేయత, త్యాగ భావనను సూచిస్తుంది బక్రీద్ పండుగ. దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ముస్లింలు తమ విశ్వాసాన్ని దేవుని పట్ల భక్తిని చాటే అవకాశం అందిస్తుంది. ఈ పండుగ సామాజిక సమానత్వం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో బలిదానం చేసిన జంతుమాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబం, బంధువులు, పేదవారికి పంచుతారు. హజ్ యాత్రతో పాపాల విముక్తి.. హజ్ యాత్ర ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒకటి మరియు బక్రీద్ పండుగతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ప్రతీ ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా చేయవలసిన పవిత్ర యాత్ర. హజ్ యాత్ర మక్కా నగరంలోని కాబా ఆలయం చుట్టూ జరుగుతుంది. ఇది ఇస్లామీయా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన స్థలం. ఈ యాత్రలో పలు ఆచారాలు ఉన్నాయి, కాబా చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణ), సఫా మరియు మర్వా కొండల మధ్య సాయి (నడక), అరాఫాత్ రోజున ప్రార్థనలు మరియు మినా వద్ద రాళ్లు రువ్వడం వంటివి ఉన్నాయి. ఈ ఆచారాలు ఇబ్రహీం, అతని భార్య హాజర్ మరియు వారి కుమారుడు ఇస్మాయిల్ జీవితంలోని సంఘటనలను స్మరించుకునేలా రూపొందించబడ్డాయి. ఈ యాత్ర పూర్తి చేసినవారు తన పాపాల నుంచి విముక్తి పొంది, ఆధ్యాత్మికంగా శుద్ధి అవుతారని ముస్లింల నమ్మకం. హజ్ యాత్ర సమయంలో అందరూ ఒకే రకమైన దుస్తులు (ఇహ్రామ్) ధరిస్తారు. ఇది సామాజిక తేడాలను తొలగించి, అందరినీ దేవుని ముందు సమానులుగా చూపిస్తుంది. త్యాగానికి పరమార్థం ఖుర్బానీ.. ఖుర్బానీ ఇబ్రహీం త్యాగ భావనను స్మరించే ఆచా రం. ఈ సందర్భంగా ముస్లింలు గొర్రె, మేక, ఆవు లేదా ఒంటె జంతువును బలిదానం చేస్తారు. మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబం, బంధువులు, పేదవారికి పంచుతారు. దీని పరమార్థం కేవలం జంతు బలిదానం మాత్రమే కాదు.. స్వార్థ ఆలోచనలను త్యజించి, సమాజంలోని నిరుపేదలు మరియు అవసరమైన వారి పట్ల దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నేడు ముస్లింల పవిత్ర పండుగ హజ్ యాత్ర, ఖుర్బానీకి పరమార్థం జిల్లాలో ముస్తాబైన మసీదులు, ఈద్గాలువిశ్వాసానికి ప్రతీక.. బక్రీద్ పండుగ కేవలం జంతు బలి గురించి కాదు. ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడటం ద్వారా అల్లాహ్ పట్ల ఆయనకున్న అపారమైన విధేయతను చాటుకున్నారు. ఆ త్యాగ స్ఫూర్తిని గుర్తుచేసుకోవడమే విశ్వాసారికి ప్రతీక. ఖుర్బానీ ద్వారా అహంకారం, దురాశ, స్వార్థాన్ని వదిలేయాలి. – మొహమ్మద్ ఫిరోజ్, కరకగూడెం దానధర్మాలను నేర్పుతుంది.. బక్రీద్ అంటే సెలవు దినం కాదు. ఇది మా కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపే సమయం. పెద్దలు చెప్పే కథలు వినడం, కొత్త బట్టలు వేసుకోవడం, నమాజ్, పేదలకు సాయం చేయడం వంటివి చేయాలి. ఖుర్బానీ మాంసాన్ని పేదలకు పంచేటప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఇది దానధర్మాలను నేర్పుతుంది. – మొహమ్మద్ సద్దాం, పాల్వంచ -
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
చర్ల: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేసే సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని, గర్భిణులు ప్రభుత్వాస్పత్రుల్లోనే సాధారణ ప్రసవాలు పొందేలా చూడాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శుక్రవారం ఆశా డే సందర్భంగా మండలంలోని కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో గిరిజనులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపై, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోకుండా వివరించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, డాక్టర్లు, సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, డాక్టర్ హారిక, డాక్టర్ స్పందన, డాక్టర్ సచిన్, సూపర్వైజర్లు ప్రసాద్, దుర్గ, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
అశ్వాపురం/కరకగూడెం: భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్లు, రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బైక్పై వెళ్లి మిట్టగూడెం గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డును సందర్శించారు. పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులకు బయోచార్పై అవగాహన కల్పించారు. గ్రామంలోని కొర్రమీను చేపల పెంపకం యూనిట్ను సందర్శించి, నిర్వాహకులు కొర్సా సోని, దుర్గారావు దంపతులను అభినందించారు. ఆ తర్వాత ఉపాధి హమీలో నిర్మించిన ఫామ్పాండ్ను పరిశీలించారు. అనంతరం కరకగూడెం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో జరుగుతున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. అక్షర జ్ఞానంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరకగూడెం నుంచి తిరిగొస్తున్న క్రమంలో బంగారుగూడెంలో రహదారిపై ఆరబోసిన ఇప్పగింజలను కలెక్టర్ పరిశీలించారు. గిరిజన మహిళలతో ముచ్చటించారు. చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ వెంకటేశ్వరాచారి, నాగరాజశేఖర్, తహసీల్దార్లు రాజారావు, వట్టం కాంతయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీఓ ముత్యాలరావు, ఏపీఓ సీతారామయ్య, ఏపీఎం సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
కోతుల దాడిలో గాయాలు.. వైద్యానికి రూ.4 లక్షలు
గత ఏప్రిల్ 4న రామవరానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ అబ్దుల్ సలీం ఇంట్లో కోతుల నానారభస సృష్టించాయి. కుటుంబ సభ్యులపై దాడిచేశాయి. ఇంటి యజమాని కర్ర పట్టుకుని కో తులను బెదరగొట్టే ప్రయత్నం చేయగా, మూకుమ్మడిగా తిరగబడ్డాయి. దీంతో భయపడి ఇంట్లోకి పరుగెత్తుతుండగా గడప తాకి కిందపడ్డాడు. తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా, ఖమ్మంలో చికిత్స పొందాడు. తలకు ఆపరేషన్ చేసి 53 కుట్లు వేశారు. ఇందుకోసం రూ. 4లక్షల వరకు ఖర్చయిందని కుటుంబీకులు తెలిపారు. కొద్దిరోజుల తర్వాత మరో ఆపరేషన్ చేయాలని, ఇందుకోసం ఇంకా రూ. లక్షలు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నట్లు బాధితుడు చెప్పాడు. కారు నడుపుతూ జీవనం సాగించే సలీం రెండు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కారు నడిపే వీలులేకపోవడంతో కుటుంబం అప్పులపాలవుతోంది. -
రామవరంలో 12 ఏళ్ల బాలుడు
కొత్తగూడెం రామవరంలో 12ఏళ్ల బాలుడు ఆడుకుంటుండగా కొంత కాలం క్రితం వీధికుక్క కరిచింది. తల్లిదండ్రులకు భయపడి బాలుడు ఇంట్లో చెప్పలేదు. ఫిబ్రవరిలో వర్షాలు కురిశాక బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీ యగా కుక్క కరిచిన విషయం చెప్పాడు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. స్థానిక ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. కుక్క కరవడంతో బాలుడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. కా గా రామవరంలోనే కాంట్రాక్టు కార్మికులుగా విధు లు నిర్వహించే ఒకే కుటుంబానికి చెందిన బాబా యి, కూతురు కూడా కుక్కకాటుకు గురయ్యారు. -
103 శాతం బొగ్గు ఉత్పత్తి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మే నెలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని 19 ఓ పెన్కాస్ట్ గనులకు, 21భూగర్భ గనులకు 56.50 మిలి యన్ లక్షలటన్నుల లక్ష్యానికి 58.22 లక్షల టన్ను లు 103 శాతం మాత్రమే సాధించినట్లు సింగరేణి తన గణాంకాల్లో తెలిపింది. కాగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని భూగర్భగనుల్లో 4.90లక్షల టన్నుల లక్ష్యానికి 3.50లక్షల టన్నులు 72శాతం ఉత్పత్తి చేయగా, ఓపెన్ కాస్ట్ గనుల్లో 51.60 లక్షల టన్నులకు గాను 54.72 లక్షల టన్నులు 106 శాతం సాధించింది. ఓవరాల్గా 56.50 లక్షల టన్నుల లక్ష్యానికి 58.22లక్షల టన్నులు 103శాతం ఉత్పత్తి జరిగింది. మే మాసంలో మెరుగైన ఉత్పత్తి... గడచిన ఏప్రిల్లో సాధించిన ఉత్పత్తి (95శాతం) కంటే మే లో 103 శాతం అంటే 8 శాతం (నెలవారీ ఉత్పత్తి) అదనంగా ఉత్పత్తి జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్లో మణుగూరు ఏరియా 10.88 లక్షల టన్నులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, ఆర్జీ–2 ఏరియా 4.99 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో 5 ఏరియాలు (కొత్తగూడెం 107 శాతం, మణుగూరు 119 శాతం, శ్రీరాంపూర్ 100 శాతం, ఆర్జీ–2 133 శాతం, ఆర్జీ–3 100 శాతం,) 100 శాతం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల్లో 49.90 లక్షల టన్నులు 95 శాతం సాధించగా, మే లో 10.81 లక్షల టన్నులు 99శాతం అంటే గతంలో కంటే మరో 4శాతం అదనంగా సాధించింది. తీరు మార్చుకోని ఆరు ఏరియాలు.. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మే మాసంలో ఐదు ఏరియాలు మాత్రమే 100 శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నాయి. అయితే సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు ఏరియాలలోని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులకు నిర్దేశించిన నెలవారి, వార్షిక లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని రివ్యూ మీటింగ్లలో పలుమార్లు చెప్పినప్పటికీ అధికారుల పనీతీరులో మార్పు రాలేదు. కొత్తగూడెం ముందంజ... మే మాసంలో కొత్తగూడెం ఏరియా 107శాతం, వార్షిక లక్ష్యం 100శాతం సాధించగా, మణుగూరు ఏరియా మే నెలలో 119శాతం, వార్షిక లక్ష్యంలో 118శాతం సాధించినప్పటికీ ఓవరాల్గా కొత్తగూడెం ఏరియా 13.96 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యం 26.04 లక్షల టన్నులు సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉండగా, మణుగూరు ఏరియా మేలో 11.74 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యంలో 22.63 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచాయి. కంపెనీ రెండు నెలలో 108 లక్షల్లో కొత్తగూడెం రీజియన్ 53 లక్షలు సాధించటం విశేషం. అయితే మిగతా రెండు రీజియన్లు 55 లక్షల టన్నులు సాధించటం గమనార్హం. కాగా, ఆర్జీ–2 ఏరియా మే నెలలో 133 శాతం, రెండు నెలలో 159 శాతం సాధించి మూడు స్థానంలో ఉంది. ఐదు ఏరియాల్లో 100 శాతంఉన్నతాధికారులు సమీక్షించాలి.. ప్రతీ మంగళ, శనివారం సింగరేణిభవన్ నుంచి సీఎండీ వివి ధ విభాగాల డైరెక్టర్లు, జీఎంలతో బొగ్గు ఉత్పత్తిపై చర్చిస్తున్నారు. అయితే వాటి అమలుపై ఉన్నతాధికారులు సమీక్షించాలి. ఏ నెలలో ఏ గనిలో ఉత్పత్తి తగ్గిందో కారణాలు తెలుసుకోవాలి. సమస్యలను పరిష్కరిస్తే ఉత్పత్తి మెరుగవుతుంది. – రియాజ్ అహ్మద్, హెచ్ ఎంఎస్ జనరల్ సెక్రటరీపనిగంటలు పెంచితే లక్ష్యం సాధించవచ్చు.. ఓపెన్ కాస్ట్ గనుల్లో 66 శవల్స్ రోజుకు 19 గంటలు నడువా ల్సింది 12 గంటలు అంటే 74 శాతం మాత్రమే నడుస్తున్నాయి. 425 డంపర్లు 18 గంటలు పనిచేయాల్సి ఉండగా, 8 గంటలు మాత్ర మే పనిచేస్తున్నాయి. 48డ్రిల్స్ 20 గంటలకు 5 గంట లే పనిచేస్తున్నాయి. ఇది మారితే లక్ష్యంసాధించవచ్చు. – వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్, ప్లానింగ్ డైరెక్టర్ -
పెద్దమ్మతల్లి ఆలయ ఉద్యోగి మృతి
పాల్వంచరూరల్: లారీ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం.. కేశవాపురం గ్రామానికి చెందిన పెద్దమ్మతల్లి ఆలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న కుంచాల సూర్యనారాయణ (48) శుక్రవారం విధులు ముగించుకుని పాల్వంచకు వెళ్తున్నాడు. ఇందిరానగర్ కాలనీ వద్ద బీసీఎం రహదారిపై పాల్వంచ వస్తున్న లారీ.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. 108 ద్వారా ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ టైర్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలుకరకగూడెం: మండల కేంద్రానికి చెందిన టప్ప సతీష్ టైర్ పంక్చర్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఓ ట్రాక్టర్ ట్రక్కు టైర్కు పంక్చర్ వేసి, గాలి నింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టైర్ పేలిపోయింది. ఈ క్రమంలో డిస్క్ సతీష్ తలకు, కుడి చేతికి బలంగా తాకింది. కుడి చేయి విరిగి, తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు సతీష్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం 108లో మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. 132 కేజీల గంజాయి పట్టివేతఅశ్వాపురం: గొల్లగూడెం వద్ద అశ్వాపురం పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. వివరాలు.. ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా గొల్లగూడెం సీ తారామ కెనాల్ వంతెన వద్ద కారులో వెనుక సీట్లో అక్రమంగా తరలిస్తున్న 132కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చింతూరు నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు తరలిస్తున్న సిద్ధిపేటకు జిల్లాకు చెందిన పల్లెపు పరుశురాములును పోలీసులు రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్టేకులపల్లి: వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సులానగర్ ప్రాథమిక వైద్యశాల ఆవరణలో జరిగిన ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమలు పుట్టకుండా ఉండడానికి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడం, ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే స్వచ్ఛందంగా నిర్వహించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. నూతన దంపతులకు తాత్కాలిక కుటుంబ పద్ధతులపై సురక్షిత గర్భస్రావాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని వీటిని ప్రోత్సహించిన వారు మరియు సహకరించిన వారు శిక్షార్హులని వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మానసికంగా, బలహీనంగా ఉండి ఒత్తిడిలో ఉన్నవారు, నిరాధరణకు గురై ఒంటరిగా ఉన్నవారు, ప్రేమ మరియు చదువుల్లో విఫలమైనవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని నిరోధించడానికి, మానసిక ధైర్యం కల్పించడానికి తెలంగాణ టెలీ మానస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 14416 నంబర్పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధు వరుణ్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లు పాయం శ్రీను, గన్యా, ఇల్లెందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, ఎన్సీడీ కోఆర్డినేటర్ హరి కిషన్, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు, గుజ్జా విజయ, కౌశల్య సింగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్కు తీవ్ర గాయాలు
అశ్వారావుపేటరూరల్: వేగంగా వస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్థానిక ఎస్సై యయాతిరాజు కథ నం ప్రకారం.. శుక్రవారం హై దారాబాద్ నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి సరుకుల లోడుతో వెళ్తున్న లారీ, ఏపీలోని రాజమండ్రి నుంచి సూర్యాపేట వస్తున్న మరో లారీ.. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తాడేపల్లిగూడేనికి చెందిన లారీ డ్రైవర్ నాగమల్లేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తా పడిన లారీతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరా యం ఏర్పడింది. జేసీబీల సాయంతో లారీని పక్కకు తొలగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిమానాసూపర్బజార్(కొత్తగూడెం): అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులలో శుక్రవారం కొత్తగూడెం కోర్టులో 26 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్టౌన్ ఎస్ఐ తుంగ రాజేష్ తెలిపిన వివరాలు.. ట్రాఫిక్ ఎస్ఐ కె.నరేష్ పర్యవేక్షణలో వాహనాల తనఖీలు నిర్వహిస్తుండగా పది మంది, పాల్వంచ టౌన్ ఎస్హెచ్ఓకు సుమన్ వాహన తనఖీలు చేస్తుండగా ఒకరు, కొత్తగూడెం టూటౌన్ ఎస్హెచ్ఓ టి.రమేష్కుమార్, ఎస్ఐలు మహ్మద్ కేఎం ఆలీ ఖాన్, బి.కిషోర్ అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఎం.సెల్వరాజ్ తమ బృందంతో వాహ న తనిఖీలు నిర్వహిస్తుండగా.. 15మంది మొత్తం 26 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులు కోర్టులో రుజువు కావడంతో జరిమానా విధించారు. వీరంతా జరిమానా చెల్లించారు. అర్ధరాత్రి అపరిచితుడి సంచారంఅశ్వారావుపేటరూరల్: వినాయకపురం కాలనీ గ్రామంలో గురువారం అర్ధరాత్రి సంచరిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడిని దొంగ అనే అనుమానంతో గ్రామస్తులు పట్టుకున్నారు. వృద్ధుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన స్థానిక అదనపు ఎస్సై రామ్మూర్తి, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. కాగా, మతిస్థిమితం లేని వృద్ధుడిగా గుర్తించి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లు
కొత్తగూడెంఅర్బన్: దేశానికి రెండో రక్షణ దళంగా, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు చదువులలో రాణిస్తున్న జిల్లాలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలోని దాదాపు 55 ఎన్సీసీ విద్యార్థులకు ఎన్సీసీ అకడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. 11 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆఫీస్ ఖమ్మంలో జరిగిన సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో విద్యార్థులు కమాండింగ్ ఆఫీసర్ ఎస్కే భద్ర నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈమేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పద్మ, డాక్టర్ శారద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణచంద్రరావు, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ శ్రీలత, డాక్టర్ జి.మధు అభినందించారు. బొగ్గు నాణ్యత పెంపునకు కార్యాచరణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో జి–15 గ్రేడ్ బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాల వారు తీసుకోవడం లేదని, అన్ని ఏరియాలలో జీ–13 గ్రేడ్ బొగ్గును సిద్ధం చేసి రవాణా చేయాలని, ఇది శనివారం నుంచి అమల్లోకి తేవాలని సంస్థ డైరెక్టర్లు వివిధ ఏరియాల జీఎంలకు, ఇతర అధికారులకు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ పీపీ అండ్(పా) కే.వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు. ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం... ఒప్పకున్న గ్రేడ్ బొగ్గును ఇవ్వకుంటే నష్ట పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విత్తన షాపుల తనిఖీఇల్లెందు: పట్టణంలోని విత్తన దుకాణాలను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖాధికారి బాబూరావు తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రైతుకు కొనుగోలు రశీదు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లా టెక్నికల్ ఏఓ సాయినారాయణ, మండల వ్యవసాయశాఖ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాపితంగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం వల్ల పనిదినాలు తగ్గిపోయాయని, వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశాలలో సంఘం కార్యకర్తలు విస్తృత పర్యటనలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సమస్యలు తెలిసినట్లు చెప్పారు. తాగునీరు, టెంట్, మెడికల్ కిట్లు, రవాణా చార్జీలు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో ఉపాధి కూలీలు పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, శెట్టి వినోద మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో అడవుల్లో, చెరువులలో పనులు చేస్తున్న కూలీల గురించి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పట్టాలిచ్చిన పోడు భూముల్లో పనులను అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గ్రామీణాభివృద్ధి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ధర్నా వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రేపాకుల శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, నిమ్ల వెంకన్న, మర్మం చంద్రయ్య, అలేటి కిరణ్, ఈసం నరసింహారావు, గండమాల భాస్కర్, నాగరత్నమ్మ, పిట్టల నాగమణి పాల్గొన్నారు. -
‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?
అశ్వారావుపేటరూరల్: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే దబ్బతోగు ప్రాజెక్టు అధ్వాన్న స్థితికి చేరింది. ప్రాజెక్ట్ నిర్మించి పాతికేళ్లు కాగా, పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిలమై, తుప్పుపట్టిన షట్లర్ల కారణంగా పంటలకు అందాల్సిన సాగునీరు లీకులై వృథాగా పోతోంది. దీంతో సాగునీరు అందక ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతోంది. 25 ఏళ్ల క్రితం నిర్మాణం అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామంలో 2000వ సంవత్సరంలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మించారు. దీంతో దబ్బతోగు, దబ్బతోగు కాలనీ, వినాయకపురం కాలనీ, మల్లాయిగూడెం, నారాయణపురం కాలనీ గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలకు సాగునీరు అందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం పూడిక తీసే పనులు, అలుగుకు మరమ్మతులు చేసి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ మరమ్మతులు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో కూడా ఈ ప్రాజెక్ట్ను ఎంపిక చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుప్పు పట్టిన షట్టర్లు.. నీటి లీకేజీ దబ్బతోగు ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల షట్టర్లు తుప్పు పట్టి శిథిలావస్థలో ఉన్నాయి. షట్టర్లు లీకై నిల్వ ఉన్న సాగునీరు వృథాగా పోతోంది. తక్షణం మరమ్మతులు చేపట్టకపోతే వర్షాకాలంలో అడ్డుకట్ట వేయడం కూడా సాధ్యం కాదని రైతులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే లీకేజీలతో సాగునీరు మొత్తం వృథాగా పోతుందని చెబుతున్నారు. షట్టర్ల కోసం నిర్మించిన కాంక్రీట్ గోడలకు సైతం బీటలు ఏర్పడ్డాయి. మరో వైపు ప్రాజెక్ట్లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. ధ్వంసమైన గైడ్ వాల్ గతేడాది జూలై 18వ తేదీ నుంచి కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దబ్బతోగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రాజెక్ట్లోకి వరదనీరు పోటెత్తడంతో అలుగు ఉధృతంగా పొంగి దిగువన ఉన్న గైడ్ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. అలుగు దిగువన భారీగా మట్టి కోతకు గురి కాగా, ఐదు అడుగుల మేర భారీ గంతలు పడ్డాయి. ఈ ఏడాది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ఆనకట్టపై చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. 25 ఏళ్ల క్రితం సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం దెబ్బతిన్న తూములు, షట్టర్లు, గైడ్వాల్ పూడిక పేరుకుపోయి నీటి నిల్వ తగ్గిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపాం దబ్బతోగు ప్రాజెక్ట్కు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. కానీ ఇంకా నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. అలుగు గైడ్ వాల్ మరమ్మతులు వచ్చే ఏడాది చేస్తాం. –కృష్ణ, డీఈఈ, అశ్వారావుపేట -
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇటీవల మంజూరైన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మొదటిది సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో మొదలై యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (కాకతీయ)గా అప్గ్రేడ్ చెందిన కేఎస్ఎం ప్రస్థానంలో మరో ఎత్తుకు చేరుకుంది. ఇటీవల ఈ కాలేజీని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పుడీ కాలేజీకి ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరును పెట్టింది. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. అందించే కోర్సులు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కావడంతో దేశ విదేశాల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు ఇక్కడకు వచ్చే అవకాశముంది. కాలేజీ రాకతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతోపాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకూలతలే.. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవేకు సమీపంలో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం సమీపంలో మినీ స్టీల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్, ఫెర్రో అల్లాయిస్, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉండగా, ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు, రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. దీనివల్ల భవిష్యత్లో నీటి ఇబ్బందులు ఉండవు. ఇలా కొత్తగూడేనికి ఉన్న అనుకూలతలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంజూరు చేయించేందుకు మంత్రి తుమ్మల నిర్విరామంగా కృషి చేశారు. ఇప్పుడు మన్మోహన్సింగ్ పేరు పెట్టడంతో వర్సిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది.కళకళలాడనున్న క్యాంపస్ గ్రాడ్యుయేషన్లో జియోలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జియోలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో కెమిస్ట్రీ అందుబాటులోకి తేనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు పీహెచ్డీ చేయొచ్చు. ఇప్పటికే క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్, కంప్యూటర్సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతీ కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉండగా ఎర్త్ సైన్సెస్ సబ్జెక్టులు రావడంతో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. -
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది. మార్గమధ్యలో ఇల్లెందు మండలంలోని రాజీవ్నగర్తండా శివారులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోవడంతో టాటాఏస్ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పోలెబోయిన సుభద్ర, దొడ్ల నర్సమ్మ, రమేష్, పోలెబోయిన వెంకటనర్సు, పోలెబోయిన లక్ష్మి, డ్రైవర్ పూనెం కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన సుభద్ర, నర్సమ్మ, వెంకటనర్సులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫారసు చేశారు. మిగిలిన నలుగురికి ఆస్పత్రిలో వైద్యసాయం అందించారు. ఆరుగురికి తీవ్ర గాయాలు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బూర్గంపాడు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఐటీసీ పీఎస్పీడీలో కార్మికులు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ పీఎస్పీడీ ఆధ్వర్యాన అడవుల పెంపకం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ ఉన్నతాధికారులు శ్యామ్కిరణ్, చెంగలరావు, కార్మిక సంఘాల నాయకులు కనకమేడల హరిప్రసాద్, గాదె రామకోటిరెడ్డి, యారం పిచ్చిరెడ్డి, గొనె రామారావు, సానికొమ్ము శంకర్రెడ్డి, బిజ్జం అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ కోర్టు పూర్తయ్యేనా..?
● కిన్నెరసానిలో అసంపూర్తిగా నిలిచిన భవనం ● పర్యాటకులకు అల్పాహారం కూడా దొరకని దుస్థితి పాల్వంచరూరల్: పర్యాటకుల కోసం కిన్నెరసాని డ్యామ్ పక్కన చేపట్టిన ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కిన్నెరసానిలో 9 కాటేజీలు, అద్దాలమేడ, ఫుడ్ కోర్టు నిర్మాణంకోసం 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10.77 కోట్లు మంజూరు చేశారు. ఆపసోపాలతో కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణ పనులు పూర్తిచేసిన అధికారులు ఫుడ్ కోర్టును మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు. గతంలో చెక్కతో ఫుడ్ కోర్టు నిర్మించారు. దానిని కూల్చివేసి రెండు అంతస్తుల భవనం నిర్మించాలని పనులు ప్రారంభించారు. నిధులేమితో అర్ధంతరంగా నిలిపివేశారు. మరోవైపు డ్యామ్పైకి వచ్చిన పర్యాటకులకు టీ, అల్పాహారం కూడా దొరకడంలేదు. ఇప్పటికై నా టూరిజం శాఖ అధికారులు స్పందించి ఫుడ్ కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. కాగా నిధులలేమి కారణంగా ఫుడ్ కోర్టు నిర్మాణ పనులను నిలిపివేయాల్సి వచ్చిందని టూరిజంశాఖ డీఈ రవీందర్ తెలిపారు. -
సొంతింటి కల.. నెరవేరేలా!
ఇల్లెందు: గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే పేదలు తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. కానీ చాలామంది కలలు తీరకుండానే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆతర్వాత అధికారంలోకి కొలువుదీరిన కాంగ్రెస్ పేదల సొంతింటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని 24 వార్డుల్లో తొలి విడతగా 357 మంది ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, తొలుత నిర్మించుకోవాల్సి ఉండడం.. ఆతర్వాత ప్రభుత్వం దఫాలుగా రూ.5లక్షల మేర బిల్లులు ఇస్తామని చెప్పడంతో నిరుపేదలు ఆలోచనలో పడ్డారు. పెట్టుబడి ఎలా అనే ఆవేదనలో ఉన్న నేపథ్యాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు సమాలోచనలు చేసి ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ను సంప్రదించగా మూకుమ్మడిగా ఇళ్ల నిర్మాణానికి అంగీకరించాడు. రూపాయి పెట్టకుండానే... గత రెండు నెలలుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు.. ఇళ్ల నిర్మాణం విషయమై ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్తో సమాలోచనలు చేశారు. దీంతో లబ్ధిదారులు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే తానే ఇంటి నిర్మాణం చేపడతానని.. ప్రభుత్వం నుంచి దశల వారీగా వచ్చే బిల్లులు తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాక ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా డిజైన్ సిద్ధం చేయించారు. ఆ కొలతల ప్రకారం ఇల్లెందు పట్టణంలో తొలి దఫా మంజూరైన 357 మంది ఇళ్లు నిర్మించాలనే నిర్ణయానికి ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయి. అవగాహన.. ఒప్పందం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్కు ముందుకొచ్చిన నేపథ్యాన రెండు రోజులుగా పట్టణ, మండల వ్యాప్తంగా లబ్ధిదారులను ఓ చోటుకు చేర్చి ప్రొజెక్టర్ ద్వారా ఇంటి నిర్మాణ డిజైన్.. అందుకు ఉపయోగించే సామగ్రి వివరాలపై అవగాహన కల్పించారు. దీంతో ఇల్లు మంజూరైనా చేతిలో చిల్లిగవ్వ లేక ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొన్న పేదలు సంతోషం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్ ప్రకటించిన డిజైన్.. ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాకే తీసుకుంటానన్న మాటతో అంతా ఆనందంగా అంగీకరించారు. మాకూ పని ఇవ్వండి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాగా అవసరమైన మేసీ్త్రలను తానే సమకూర్చుకునే అవకాశముంది. కేవలం కూలీలను మాత్రమే స్థానికులను తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. దీంతో తాము ఉపాధి కోల్పోతామని స్థానిక మేసీ్త్రలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాంట్రాక్టర్తో చర్చించినట్లు తెలిసింది. చివరకు స్థానిక మేసీ్త్రలు కొందరికై నా అవకాశం ఇచ్చేలా చర్చలు జరుపుతుండగా.. నిర్ణయం వెలువడాల్సి ఉంది. మూకుమ్మడిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక ఇల్లెందులో కట్టడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్ పనుల అప్పగింతకు 357 మంది లబ్ధిదారుల నిర్ణయం ఎలా సాధ్యం? ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు ఒక్కొక్కరుగా నిర్మించుకునేందుకు సామగ్రి కొనుగోలు చేస్తే భారం పడే అవకాశముంది. అదే కాంట్రాక్టర్ 357 ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడంతో సిమెంట్, ఐరన్తో పాటు విద్యుత్ సామగ్రి, దర్వాజాలు, తలుపులు, కిటికీలు ఇలాంటివన్ని మూకుమ్మడిగా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే అవకాశముంది. తద్వారా ధర తగ్గి కాంట్రాక్టర్ ప్రతీ ఇంటి ఉంచి కొంత మొత్తం మిగిలే అవకాశముంది. ఇక రూ.5లక్షలకు మించి వెచ్చించగలిగే స్థోమత ఎవరికై నా ఉంటే డిజైన్లో మార్పులు, ఉపయోగించే సామగ్రిలో మార్పులు చేసి అందుకు అయ్యే అదనపు నగదు తీసుకునేలా అంగీకారం కుదుర్చుకోనున్నారు. కాగా, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో 7,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సొంత స్థలం ఉన్నవారు, స్థలం లేని వారు.. ఇలా రకరకాలుగా వర్గీకరించి 1,900 మందితో జాబితా రూపొందించారు. ఇందులో తొలి దశలో 357 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అత్యధికంగా కొన్ని వార్లుల్లో 30మంది, తక్కువగా ఇంకొన్ని వార్డుల్లో ఐదుగురు చొప్పున లబ్ధిదారులు ఉన్నారు. మాలాంటి వారికి మేలు ఇల్లు మంజూరైనా నిర్మాణానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణం చేసి ఇస్తామనే చర్చలు జరిగాయి. ఇదే జరిగితే మా కల నెరవేరినట్లే. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లు కాంట్రాక్టర్కే ఇస్తాం. వేగంగా ఇల్లు కట్టించి ఇస్తే చాలు. – స్వప్నబాయి పాసీ, కొత్త కాలనీ, ఇల్లెందుసద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు నిర్మించుకోలేకపోతే రద్ద య్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం అదే నిధులతో ఇల్లు పూర్తి చేయించాలనే ఆలోచనకు వచ్చాం. ఈ అవకాశాపికప సద్విని యోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – కోరం కనకయ్య, ఎమ్మెల్యే, ఇల్లెందు -
చెట్లు నరికితే కఠిన చర్యలు
● పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి/పాల్వంచరూరల్: చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మండలం బస్వతారాకకాలనీ పంచాయతీ అర్బన్ పార్కులో, కొత్తగూడెంలోని అటవీశాఖ వన విహార్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా అటవీశాఖాధికారి జి.కిష్టాగౌడ్తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కొత్తగూడెంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సెంట్రల్ పార్క్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమంలో, ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లను నరుకుతూ పోతే భవిష్యత్లో ఎలాంటి ఫలసాయం అందుబాటులో ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేయాలన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ కొత్తగూడెం డివిజన్ కార్యాలయంలో సీజీఎం వీవీ రెడ్డి, డీఎంలు చంద్రమోహన్, కవిత తదితరులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి, కోటేశ్వరరావు, పర్యావరణ ఇంజనీర్ బి.రవీందర్, కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాసబాబు, ప్రభాకర్రావు, రేంజర్లు సురేష్, రవికిరణ్, ఏ.కరుణాకరాచారి, డిప్యూటీ రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్అధికారులు, సింగరేణి ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి మణుగూరు రూరల్: ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్పి, పా) కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. బంగ్లాస్ ఏరియాలో మొక్కలు నాటారు. అనంతరం ఏరియా అధికారులతో కలిసి ఓసీ–2 వ్యూపాయింట్కు చేరుకుని బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో, నివాస స్థలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచాలనన్నారు. ఏరియా జీఎం కార్యాలయ ఆవరణంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇన్చార్జ్ జీఎం లక్ష్మీపతిగౌడ్ మొక్కలు నాటారు. అనంతరం వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు జ్ఞాపికలు, జూట్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమాలల్లో ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్ మొహియుద్దీన్, జీఎంలు డి.వెంకటేశ్వర్లు, తిరుమలరావు, ఇతర అధికారులు శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, కేశవరావు, వెంకట్రావు, అనురాధ, మదన్నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..
●ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ●ఒక మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు దమ్మపేట: పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఓ మహిళ మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకుంది. మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపాన రాష్ట్రీయ రహదారిపై గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను పోలీసుల ఇలా తెలిపారు. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన నలుగురు మహిళలు, ఒక పురుషుడు మూడు చక్రాల ట్రాలీ ఆటోలో కూలీ పని నిమిత్తం సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు గురువారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని మందలపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే.. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా.. అద్దంకి పద్మ (35) అక్కడికక్కడే మృతి చెందగా.. ముంగి గోపమ్మ, ముంగి మారేశ్వరిలకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. గోపమ్మ, మారేశ్వరిలను ఖమ్మం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. -
గిరిజన వంటకాలు రుచి చూపించాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని గిరిజన మ్యూజియానికి వచ్చే సందర్శకులు గిరిజన వంటకాల రుచి చూపించాలని, సరసమైన ధరలకు విక్రయించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. ఆర్.కొత్తగూడెం శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్, గిరిజన గ్రూప్ మహిళలు తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డూతోపాటు ఇతర ఆహార పదార్థాలను గురువారం ఆయన తన చాంబర్లో రుచి చూశారు. తయారు చేసే ప్రతీ వస్తువు నాణ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, ముత్యాలమ్మ లియాబిలిటీ గ్రూప్ మహిళలు సున్నం సమ్మక్క, సున్నం శిరీష, సోడే మున్ని, వేల్పుల దేవి, సున్నం స్వాతి, రమాదేవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అర్హులైన గిరిజన విద్యార్థులకు 3, 5, 8వ తరగతులలో 2025– 26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతికి 38, 5వ తరగతికి 20, 8వ తరగతికి 19 సీట్లు.. మొత్తం 77 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, 20న ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపికలు నిర్వహిస్తామని వివరించారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారుఎన్సీసీ పరీక్షలో నూరుశాతం ఉత్తీర్ణతఅశ్వారావుపేటరూరల్: మండలంలోని పెదవాగు ప్రాజెక్ట్ గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల(దమ్మపేట)లోఎన్సీసీ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో 33 మంది విద్యార్థినులు ఉండగా, జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో అందరూ ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వి. స్పందన గురువారం వివరాలు వెల్లడించారు. కొణిజర్ల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు ఖమ్మం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ కె.సింధు శ్రీ, సీటీఓ ఆఫీసర్ ఎం.అరుణ, సిబ్బంది భువన, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డితో కలిసి గురువారం దర్శించుకున్నారు. శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ అందజేశారు. -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గతకొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో బుధవారం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆయన గురువారం ఉదయం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోగల పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టపై విగతజీవిగా మారాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.కాగా, మృతుడు మూడు నెలల క్రితమే సొంతింటిని నిర్మించుకోగా.. అప్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్లినిక్ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు
భద్రాచలం అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న నేపథ్యంలో గత నెల 26న ప్రచురితమైన ‘దేవుడా ఇదేం పరీక్ష’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ.. భద్రాచలం అర్బన్: భద్రాచలం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈమేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ నర్సింగ్హోమ్కు రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాక మరికొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్నాయక్ హెచ్చరించారు. కాగా, ఈ తనిఖీ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సీజ్ చేయాల్సిన సదరు ఆస్పత్రిని ఓ రాజకీయ నాయకుడి అండతో అధికారులు జరిమానాతో సరిపుచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్కు రివార్డు అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మహేశ్ ఇటీవల అమలాపురం డ్యూటీకి వెళ్లి వస్తున్న క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడి మర్చిపోయిన రూ.లక్షను అదేరోజు డిపోలో అందించాడు. ఈ మేరకు మహేశ్ నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ అధికారులు గురువారం హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ చేతులమీదుగా రాష్ట్ర ఆర్టీసీ సేవా రివార్డ్ను అందజేసి ఘనంగా సన్మానించారు. ఏబీడీసీ డ్రైవ్లు నిర్వహించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఏబీడీసీ డ్రైవ్లు నిర్వహించాలని కలెక్టరేట్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏబీడీసీ డ్రైవ్, భూభారతి రెవెన్యూ సదస్సులు, బక్రీద్ పండుగ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా, బడిబాట గ్రామసభల నిర్వహణ, వనమహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రైవ్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నానరు. అజోల్లా పెంపకం, బయోచార్, కంపోస్టింగ్, డిగ్గింగ్ సోక్ పిట్, పామ్ పౌండ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మేడేపల్లి పంచాయతీకి పురస్కారం ముదిగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలపరిధిలోని మేడేపల్లి గ్రామపంచాయతీ రాణించడంతో రాష్ట్రస్థాయి అవార్డు ఎంపికై ంది. పర్యావరణం పరిరక్షణకు అమలు చేసిన విధానాలు, సేంద్రియ ఎరువు తయారి, తడి,పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలను అమలు చేసినందుకు గాను ఎంపికై ంది. ఈమేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని టీజీపీసీబీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ చేతులమీదుగా పంచాయతీ కార్యదర్శి రమ్య గురువారం పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో మండల అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండిఖమ్మంసహకారనగర్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, రూ.100 వెరిఫికేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
ఉద్యోగాల గని.. సింగరేణి..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 1998లో నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పునరుద్ధరించింది. ఏడేళ్లలో 18 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించింది. సుమారు 6 వేల మందికి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధి కల్పించింది. రోస్టర్ విధానం అమలులో భాగంగా 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం సింగరేణివ్యాప్తంగా 19 ఓపెన్కాస్ట్ గనులు, 23 భూగర్భ గనుల్లో 40 వేల మంది పర్మనెంట్ కార్మికులు, 2,400 మంది అధికారులు, 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బొగ్గు ద్వారా తెలంగాణతోపాటు మరో 7 రాష్ట్రాల్లో సుమారు 2 వేల పరిశ్రమల్లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. డిపెండెంట్ల ద్వారా 18 వేలు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 6 వేల ఉద్యోగాలు అంకితభావంతో పనిచేయాలి.. కొత్తగూడెం ఏరియాలో ఇప్ప టి వరకు 669 మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాం. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి. సంస్థ అభివృద్ధికి కృషిచేయాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో సగం మంది విధులకుగైర్హాజరవుతున్నారు. వీరు పద్ధతి మార్చుకోవాలి. –శాలేంరాజు, ఏరియా జీఎం సింగరేణిలో సౌకర్యాలు ఎక్కువ.. దేశంలో ఏ ఇతర బొగ్గు పరిశ్రమల్లో లేని సౌకర్యాలు సింగరేణిలోనే ఉన్నాయి. ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ 13 రకాల సదుపాయాలతోపాటు అనుకోని పరిస్థితుల్లో కార్మికుడు మృతి చెందితే రూ.కోటి ప్రమాద బీమాతోపాటు మ్యాచింగ్ గ్రాంట్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాం. –జీవీ కిరణ్కుమార్, జీఎం (కార్పొరేట్ వెల్ఫేర్) -
ముంచుకొస్తున్న ముప్పు..
● నానాటికీ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● వివిధ కారణాలతో తరుగుతున్న అడవులు ● వాతావరణ సమతుల్యతకు మరింత విఘాతం ● పర్యావరణ పరిరక్షణే మార్గమంటున్న నిపుణులు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం చుంచుపల్లి: మానవ మనుగడలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నేళ్లుగా మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. విలువైన సహజ సంపదను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తేనే భావితరాలు సాఫీగా సాగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరగడం, భూ, వాయు, జల కాలుష్యాలు పెరుగుతుండడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. అడవుల తగ్గుదలతో ఆందోళన అడవుల అభివృద్ధితోనే పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పలు రకాలైన జంతు, వృక్ష జాతులకు ఆశ్రయం కల్పించి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడతాయి. అడవులు భూసారాన్ని కాపాడమే కాకుండా నేల క్షీణతను నిరోధిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం. 2021 నుంచి 2023 వరకు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో 121.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023ను గతేడాది డిసెంబర్లో వెల్లడించింది. 2021–23 మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55 చ.కి.మీ. ఖమ్మం జిల్లాలో 25.76 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గిందని నివేదికలో పేర్కొంది. 2021 కాలంలో 2,957.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2023 చివరి నాటికి 2,861.66 చ.కి.మీ.కి తగ్గినట్లు తెలిపింది. ఇక ఖమ్మం జిల్లాలో 2021 కాలంలో 633.23 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా, 2023 ముగిసే నాటికి 607.47 చ.కి.మీ.గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (–115.50) తర్వాత భద్రాద్రి జిల్లా (–95,55) రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం మూడో స్థానంలో ఉందని వివరించింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు.. తదితర ఎనిమిది అటవీ డివిజన్లలో ఒక్క కిన్నెరసాని వైల్డ్లైఫ్లో తప్ప మిగతా వాటిలో అటవీ విస్తీర్ణం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అక్రమణలు, అగ్ని ప్రమాదా అందుకు కారణమని, అగ్ని ప్రమాదాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానంలో ఉన్నట్లు తేలింది. విస్మరిస్తే తీరని నష్టం రోజురోజుకూ వాతావరణంలో మార్పుల కారణంగా మానవ మనుగడ భవిష్యత్లో కష్టతరం కానుంది. అటు రుతువుల్లో వస్తున్న మార్పులతో రైతులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఇక వేసవి సీజన్లో భూగర్భజలాలు అమాంతం పడిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే తలెత్తే పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. –బి.రవీందర్, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి చాలా ప్రమా దం పొంచి ఉందనేది ఇప్పటికే తెలుస్తోంది. అటవీశాఖ అన్ని చోట్ల మొక్కలు నాటే ప్రక్రియ కు శ్రీకారం చుడుతోంది. ఏటా వనమహోత్సవం పేరుతో లక్షలాది మొక్కలను నాటి సంరక్షిస్తోంది. అటు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ముందుకు వచ్చి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. యువతీ, యువకులు ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. –కిష్టాగౌడ్, డీఎఫ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం (చ.కి.మీ.ల్లో) భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా అటవీ డివిజన్లు 06 02 దట్టమైన అడవులు 637.34 42.68 మధ్యస్థాయి అడవులు 1,502.70 261.44 ఓపెన్ అడవులు 721.60 303.30 -
యువకుడు అదృశ్యం
పాల్వంచరూరల్: తొమ్మిది రోజుల కిందట సుతారి పనికోసం వెళ్లిన యువకుడు కనిపించకుండాపోయిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన, సూతారి మేసీ్త్రగా పనిచేస్తున్న ధర్మసోత్ సంతోష్ గత నెల 27వ తేదీన పనిఉందని ఇంట్లో తల్లికి చెప్పివెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో యువకుడి తల్లి హచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.పట్వారిగూడెంలో మహిళ.. దమ్మపేట: వివాహిత కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని పట్వారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన వేముల వరలక్ష్మి తన కుమారుడితో కలిసి వేసవి సెలవులకు మండలంలోని పట్వారిగూడెంలోని పుట్టింటికి 20 రోజుల కిందట వచ్చింది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా, ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వరలక్ష్మి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు ముగ్గురికి తీవ్రగాయాలు తిరుమలాయపాలెం: రోడ్డుపై వెళ్తున్న వాహనంపై భారీ వృక్షం పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజీ సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పంటలపై నీడ పడుతోందని కొందరు రైతులు రహదారి పక్కన చెట్ల మొదళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇలాగే చేయడంతో చెట్టు ఒక్కసారిగా కూలగా అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో వాహనంపై వెళ్తున్న బీసురాజుపల్లితండాకు చెందిన బోడ సేవ్యా, పద్మ, సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరకుని జేసీబీతో చెట్టును తొలగించారు.విధులకు ఆటంకపర్చిన ఇద్దరిపై కేసు కారేపల్లి: అటవీ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధి గేటు రేలకాయలపల్లిలో ధర్మసోత్ సూర్యం, ఆయన కుమారుడు జేసీబీతో అటవీ భూమిలో దున్నుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఇమ్మడి వీరభద్రం, బీట్ ఆఫీసర్ రమాదేవి వెళ్లి అనుమతి పత్రాలు అడగగా సూర్యం, ఆయన కుమారుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉద్యోగులను గెంటేశారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. తిరంగా ర్యాలీ మధిర: ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాలకు వందనం చెబుతూ మధిరలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా దేశ సైనికుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రంమలో డాక్టర్ ఎ.కొండల్రావు, గల్లా సత్యనారాయణ, నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్.కే.మహమ్మద్ ముజాయిదీన్ మాట్లాడగా ఏలూరి నాగేశ్వరావు, చావా వేణు, చేకూరి కృష్ణారావు, రషీద్, గాలిమ్, కురువెళ్ల కృష్ణ, చెరుగుడ్ల నర్సింమారావు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించడం బాధ్యత
సింగరేణి(కొత్తగూడెం): కార్మికులకు మెరుగైన వైద్యం అందించటం సింగరేణి బాధ్యతని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావం తెలిపిన అనంతరం సింగరేణి డైరెక్టర్ (పీపీ అండ్ పా) కె.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్పడం వాస్తవదూరమని, కార్పొరేట్ వైద్యం పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కార్మికులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా దీక్షకు మద్దతు పలికారు. మిరియాల రాజీరెడ్డి, కాపు కృష్ణ, సీతాలక్ష్మి, వీరభద్రయ్య పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు మార్పు పాల్వంచ: ద్వితీయ శ్రేణి పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్లో కలిసి డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు కాస్తా కొత్తగూడెం కార్పొరేషన్ బోర్డుగా బుధవారం మార్చారు. ఇప్పటికే కార్పోరేషన్ పరిధిలో డివిజన్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతుండగా కార్యాలయ బోర్డు సైతం కార్పొరేషన్ బోర్డుగా ఏర్పాటు కావడం గమనార్హం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో సత్తాఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, 12 అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రాక్లీస్ చేస్తున్న డి.లోహిత, సీహెచ్.లాస్య అండర్–10 విభాగంలో, అండర్–12 బాలికల విభాగంలో ఎం.భవిత, బి.రుత్విక, బాలుర అండర్–12లో డి.ఉపేక్షిత్ ఈ.వరుణ్ బహుమతులు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసిఇయేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ బుధవారం అభినందించారు. -
కార్పొరేషన్ భూముల ఆక్రమణకు యత్నం
● వెదురు చెట్లను నరుకుతున్న గిరిజనులు ● అడ్డుకున్న అధికారులు.. ఇరువర్గాల మధ్య వాగ్వాదంఅశ్వారావుపేటరూరల్: ఫారెస్టు అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు చెందిన భూముల్లో ఉన్న వెదురు చెట్లను కొందరు గిరిజనులు నరుకుతుండగా బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అడ్డుకోగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజనులకు సర్వే నంబర్లు 30, 36, 39లో 573 ఎకరాలకు సంబంధించి 150 మందికి హక్కు పత్రాలు, పాత పట్టాలు ఉన్నాయి. కాగా, 30 ఏళ్ల కిందట తమ పెద్దలను ఆ నాటి అధికారులు మోసం చేసి అన్యాయంగా తమ భూముల్లో ఎఫ్డీసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో వెదురు, టేకు ప్లాంటేషన్లు వేసినట్లు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందటి నుంచి గ్రామస్తులంతా కలిసి వెదురు, ఇతర చెట్లను నరివేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎఫ్డీసీ డీఎం రమేశ్, డీఆర్ఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ చంద్రకళ, ఫారెస్టు రేంజర్ మురళి, సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి వెళ్లి గిరిజనులను అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే స్థానిక సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్ఐ యయాతి రాజు, ట్రైనీ ఎస్ఐ అఖిలతోపాటు సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గిరిజనులు తమ వద్ద ఉన్న ఆధారాలతోపాటు, 2011లో ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తమకు ఈ భూములను అప్పగించాలని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించిన వివరాలను సీఐకి చూపించారు. కాగా, ఆ నాటి నుంచి అధికారులు సర్వేల పేర్లతో తమను మోసం చేయడంతోపాటు, పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. ఇరువర్గాలు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అప్పటిదాకా చెట్లను ధ్వంసం చేయవద్దని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, వెదురు చెట్లను నరికిన నలుగురు గిరిజనులపై ఎఫ్డీసీ డీఆర్ఓ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చేపల కోసం చెరువు నీళ్లు వదిలారు...
వైరా: అన్నదాతలకు ఆదెరువుగా, మత్స్యకారులకు అండగా నిలుస్తున్న నిండా నీరు ఉండగా.. చేపలు పట్టడం సాధ్యం కావడం లేదని కాంట్రాక్టర్ నీరు విడుదల చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలోని నల్ల చెరువు నీటిని అనుమతి కాంట్రాక్టర్ చేపల వేట కోసం వదిలినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులో 3.5 అడుగుల మేర నీరు ఉంది. అయితే, నీరు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారుల అనుమతి అవసరం కాగా, అదేమీ లేకుండా మూడు రోజులుగా నీటిని వృథా గా విడుదల చేయడంతో చెరువు ఖాళీ అయ్యే స్థితికి చేరింది. మత్స్య సొసైటీ అధ్యక్షుడు, కాంట్రాక్టర్తో కుమ్మకై ్క ఈ ఘటనకు పాల్పడినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అలాగే, సుమారు 250 ఎకరాల మేర వరి నాట్లకు ఇబ్బంది ఏర్పడనుందని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఈ విషయమై ఐబీ డీఈ శ్రీనివాస్ను వివరణ కోరగా చెరువులో చేపల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు నీరు వదిలినట్లు ఆలస్యంగా తెలిసిందని, బాధ్యులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చెరువు వద్ద లష్కర్లతో పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
వెంగళరాయసాగర్ అలుగుకు మోక్షం
● రూ.33.55 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ● భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారె చండ్రుగొండ: మండలంలోని సీతాయిగూడెం శివారులో ఉన్న వెంగళరాయసాగర్ అలుగు నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అలుగు పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.33.55 కోట్లు మంజూరు చేసింది. సుమారు ఐదేళ్ల కిందట అలుగుకు పెద్ద ఎత్తున గండి పడింది. ఏడు గ్రామాల రైతులకు సంబంధించి 2,200 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ కింద ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అలుగు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చానని, రెండు నెలలల్లో పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తాను స్వయంగా కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించారన్నారు. అశ్వారావుపేటలోని పెద్దవాగు, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేశ్కుమార్, డీఈ కృష్ణశంకర్, ఏఈ నర్సింహారావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ అశోక్, పీఆర్ డీఈ సైదురెడ్డి, నాయకులు భోజ్యానాయక్, నల్లమోతు రమణ, సారేపల్లి శేఖర్, ఉప్పతల ఏడుకొండలు, ఫజల్, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలుభద్రాచలంటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ తెలిపారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయడంతో పాటు మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణలో భాగంగా ఐఆర్ఎస్ పిచికారీకి అవసరమైన ఏసీఎంలను జిల్లాలోని అన్ని పీహెచ్సీలకు అందజేశామని చెప్పారు. అనంరతం సిబ్బందికి మలేరియా కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య పాల్గొన్నారు. గర్భిణుల నమోదు తప్పనిసరి కొత్తగూడెంఅర్బన్ : గర్భిణుల వివరాలు ముందస్తుగా నమోదు చేయాలని, సకాలంలో ప్రసవాలు చేసేలా చూడాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ అన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నమోదుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.లక్ష్మి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల గర్భిణులను అంచనా వేసిన డెలివరీ తేదీల కంటే ముందుగానే అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అన్నారు. అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. సమావేశంలో వైద్యులు మధువరణ్, తేజశ్రీ, పుల్లారెడ్డి, భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పశువులకు వ్యాధి నివారణ టీకాలుపాల్వంచరూరల్ : వానాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు సంక్రమించే వ్యాధుల నివారణకు గత నెల 27 నుంచి ఈనెల 26 వరకు టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2.30 లక్షల ఆవులు, గేదెలకు గొంతువాపు, జబ్బవాపు, ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలు, 1.41 లక్షల గొర్రెలు, మేకలకు చిటుకు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణిలో 39 మంది అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో పర్సనల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న 39 మంది అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒక ఏజీఎం, ఏడుగురు డీజీఎంలు, 12 మంది డిప్యూటీ పీఎంలు, 17 మంది సీనియర్ పీఓలు, ఇద్దరు సంక్షేమాధికారులు ఉన్నారు. ముందస్తు వరద హెచ్చరిక పాల్వంచరూరల్: వర్షాలు కురుస్తున్నందున కిన్నెరసాని ప్రాజెక్టు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగితే గేట్లను ఇప్పటి నుంచి వర్షకాలం పూర్తయ్యే నవంబర్ వరకు ఎప్పుడైనా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని కిన్నెరసాని ప్రాజెక్టు సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ రామకృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతిని బట్టి గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎత్తి వాగులోకి వరద నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
స్వయం ఉపాధితో ఎదగాలి
భద్రాచలం : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని పీఈటీసీ కాంప్లెక్స్లో గల భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ న్యూట్రీ బిస్కెట్ కేంద్రాన్ని, వైటీసీలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిస్కెట్ల నాణ్యతతో తయారు చేసి ప్రజలకు అందించాలని సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని, మరి కొందరికి సైతం కుట్టు శిక్షణ అందించాలని అన్నారు. బ్లౌజ్, స్కర్ట్ ,యూనిఫామ్, పంజాబీ డ్రెస్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్ చుడీదార్ వంటివి కుట్టడంలో పరిణతి చెందితే రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడరీ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేసి, బ్యాంకు ద్వారా ముద్ర రుణాల కింద కుట్టు మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత గిరిజన యువతకు శిక్షణ అందిస్తున్న హాస్టళ్లు, గదులను పరిశీలించారు. యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం పీఎంఆర్సీ భవనంలో రెండో విడత ఉద్దీపకం బుక్లెట్స్ డాటా వివరాలను డీడీ మణెమ్మను అడిగి తెలుసుకొన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మిస్తున్న షటిల్ కోర్టు, ఇండోర్ క్రీడా స్థలం పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏసీఎంఓ రమేష్, జేడీఎం హరికృష్ణ, క్రీడల అధికారి గోపాల్రావు, ఎంఎస్ఎంఈ యూనిట్ మహిళలు లలిత, నీలవేణి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఐటీడీఏ పీఓ సూచన -
విభజన అశాసీ్త్రయం
● పాత వార్డులనే కలిపి చూపించారు.. ● క్షేత్రస్థాయి సందర్శన లేకుండానే జాబితాలు.. ● అధికారుల పర్యవేక్షణ లోపం.. బిల్ కలెక్టర్ల ఇష్టారాజ్యం‘గూడెం’లోనూ అదే తీరు.. కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన ముసాయిదా విడుదలైంది. అయితే ఏర్పాటు ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగా లేదనే వాదనలు వెల్లువెత్తున్నాయి. డివిజన్ల విభజన కాదు.. పాత వార్డుల్లో కమ్యూనిటీల విభజన చేసినట్టు ఉందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో ఎన్నికై న వార్డు ప్రస్తుతం వారి డివిజన్లో కలిసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటర్లయితే తాము ఏ డివిజన్లోనికి వెళ్లాం, అది ఏ ఏరియా అని తెలియక గందరగోళంలో ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయ నోటీసు బోర్డులో ఏర్పాటు చేసిన ముసాయిదా డ్రాఫ్ట్ను చెక్ చేసుకుంటున్నారు. అయితే డివిజన్ల విభజనపై అసంతృప్తిగా ఉన్నవారు అభ్యంతరాలను ఈ నెల 11 వరకు ఇవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పాల్వంచ నుంచి మొదలు.. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం 60 డివిజన్లుగా విభజించారు. కొత్తగూడెం 29 డివిజన్లు, పాల్వంచ 27, సుజాతనగర్ 4 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లో మొత్తం 1,34,011 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెం పరిధిలో 63,750 మంది, పాల్వంచకు సంబంధించి 61,240, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో 9,021 మంది ఉన్నారు. 1 నుంచి 27వ డివిజన్ వరకు పాల్వంచ ఉండగా, 28 నుంచి 38 వరకు కొత్తగూడెం, మళ్లీ 39 నుంచి 42వ డివిజన్ వరకు సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం నుంచి నర్సింహాసాగర్ వరకు, ఆ తర్వాత 43 నుంచి 60వ డివిజన్ వరకు కొత్తగూడెం బాబుక్యాంపు నుంచి కూలీలైన్ వరకు ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈనెల 11 వరకు సమర్పించాలని అధికారులు కోరారు. అశ్వారావుపేట : ‘తాళి కట్టించా.. తన్నుకు చావండి..’ అన్న చందంగా మారింది అశ్వారావుపేట మున్సిపాలిటీలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ. మున్సిపాలిటీలో వార్డులు, డివిజన్ల ఏర్పాటు/ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ముందే సిద్ధం కావాల్సిన మున్సిపల్ సిబ్బంది.. ఆదాయ మార్గాలైన ఎల్ఆర్ఎస్, గృహ నిర్మాణ అనుమతుల వంటి ఆర్థిక లావాదేవీల్లో నిమగ్నమై వార్డుల విభజనను భ్రష్టు పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతా గందరగోళం.. అశ్వారావుపేట మున్సిపాలిటీని 22 డివిజన్లుగా విభజించారు. ఇందులో అశ్వారావుపేట మేజర్ పంచాయతీలోని పాత 16 వార్డులను ప్రస్తుతం 1 నుంచి 8 వార్డులకు కేటాయించారు. 9, 10 వార్డుల్లో పేరాయిగూడెం పంచాయతీలోని ఏఎస్ఆర్ కాలనీ, బీసీ కాలనీ, మోడల్ కాలనీ, ఫైర్ కాలనీలు ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ రహదారికి ఉత్తరం వైపున ఉన్న అశ్వారావుపేట సరిహద్దు బండి పుల్లారావు రోడ్డు నుంచి లక్కీ ఆపార్ట్మెంట్ వరకు 11వ వార్డు, అక్కడ కట్ చేస్తే.. వ్యవసాయ క్షేత్రాల ఆవల ఉన్న మారుతీనగర్, గుర్రాల చెరువు ప్రాంతాన్ని 12వ వార్డులో, దొంతికుంట చెరువుకు ఆనుకుని ఉన్న భవనాలు, భద్రాచలం రోడ్కు పడమర భాగాన్ని 13వ వార్డులో, సంతమార్కెట్ నుంచి తూర్పు బజార్ వరకు 14 వార్డుగా, వెలమబజార్ నుంచి భూపతి మాస్టార్ ఇంటి మీదుగా పాలడుగుల రంగమణి ఇంటి వరకు 15వ వార్డు, రామాలయం బజార్, మున్సిపాలిటీ వెనుక భాగం, జవహర్ కాన్వెంట్ నుంచి చెక్పోస్టు వరకు 16వ వార్డు, మళ్లీ కట్ చేస్తే పూర్వ పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీ, బీసీ కాలనీలలో కొంత భాగం 17వ వార్డు, ఆ తర్వాత పేరాయిగూడెం, నెహ్రూనగర్, ఫైర్ కాలనీల్లో కొంత భాగాన్ని 18వ వార్డు, ఆ తర్వాత జాతీయ రహదారి దాటి షిరిడీ సాయి నగర్ను 19 వవార్డు, బస్టాండ్కు తూర్పు భాగపు ప్రాంతాన్ని 20వ వార్డు, ఇందిరాకాలనీ, బీఎస్ఆర్ నగర్లో కొంత భాగం 21వ వార్డు, తిరిగి ఫైర్ కాలనీ, మోడల్ కాలనీల్లో కొంత భాగంతో 22వ వార్డుగా విభజించారు. మొక్కుబడిగా ప్రక్రియ.. నిబంధనల ప్రకారం వార్డులు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండాలి. పూర్వ జనగణన ఆధారంగా వార్డులను విభజించి సరిహద్దులు గుర్తించాలి. జాబితా లపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మ్యా ప్ రూపొందించాలి. కానీ పేరాయిగూడెం పంచాయతీలోని అన్ని ఆవాసాలను విభజించి రెండు, మూడు వార్డుల్లో పొందు పరిచారు. పాత ఓటరు జాబితా, వార్డుల జాబితాలను కాపీ, పేస్ట్ చేసినట్లుగా ఉంది తప్పితే మున్సిపల్ సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని పలువురు అంటున్నారు. మొక్కుబడి విభజనతో ఎన్నికల్లో పోటీ చేసే వారితో పాటు, సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి డీలిమిటేషన్లో అనుభవం ఉన్న అధికారులతో వార్డుల విభజన చేయించాలని స్థానికులు కోరుతున్నారు. డివిజన్ల ముసాదాయి డ్రాఫ్ట్ విడుదల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ అసంతృప్తిలో మాజీలు, ప్రజాప్రతినిధులు -
ఆయిల్పామ్తో అదనపు ఆదాయం
అశ్వారావుపేటరూరల్: దీర్ఘకాలిక పంటగా పేరున్న ఆయిల్పామ్లో అంతర పంటల సాగు, కుటీర పరిశ్రమల ఏర్పాటుతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కొంతకాలంగా ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 75, 049 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉండగా అందులో 63 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండడం విశేషం. సాగునీరు, శ్రమ ఆదా.. ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటల సాగుతో అధిక ఆదాయం వస్తుంది. ఎకరం తోటలో 59 పామాయిల్ మొక్కలు నాటితే వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థలంలో తొలి నాలుగేళ్ల పాటు మొక్కజొన్న, వేరుశనగ, పుచ్చ, బొబ్బర్లు, పత్తి, అరటితో పాటు బీర, దోస, చిక్కుడు, సొరకాయ, బెండ వంటి కూరగాయలు, బంతి, చామంతి వంటి పూలసాగు కూడా చేస్తూ ఆదాయం గడించవచ్చు. దీంతో ఎరువుల ఖర్చు కలిసొస్తుంది. డ్రిప్ ద్వారా ఏక కాలంలో ఆయిల్పామ్, అంతర పంటలకు సాగునీరు అందించడం ద్వారా నీరు, శ్రమ కూడా తగ్గుతాయి. ఐదేళ్లకు పామాయిల్ మొక్కలు పెరిగాక కూడా అంతర పంటలుగా కోకో, వక్క, జాజికాయ పంటలు సాగు చేయొచ్చు. పెట్టుబడి ఖర్చులన్నీ మొదటి నాలుగేళ్లలోనే వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలకూ చాన్స్.. ఆయిల్పామ్ గెలల దిగుబడి వచ్చిన తర్వాత కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం, ఫారం కోళ్ల షెడ్లు, వర్మి కంపోస్టు తయారీ యూనిట్ల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. అంతర పంటలు సాగు చేయండి ఆయిల్పామ్ తోటల్లో తొలి నాలుగేళ్లు, ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత కూడా అంతర పంటలు సాగు చేయొచ్చు. ఆయా ప్రాంతాల్లో పండే ఏ రకం పంటలైనా వేసుకోవచ్చు. ఈ అదనపు ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నందున అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. – జంగా కిషోర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అంతర పంటల సాగుకు అనేక అవకాశాలు కుటీర పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చు నాలుగేళ్లలోనే తీరనున్న పెట్టుబడి ఖర్చులు -
మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నాం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ముందుగానే పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణీ దేవి తెలిపారు. జిల్లాలోని పలు రేషన్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్డుదారులకు అవసరమైన 17,287 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు దఫాల వారీగా తరలిస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలోని 443 రేషన్ షాపుల్లో ఇప్పటివరకు 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నారని వివరించారు. -
నేతల్లో నైరాశ్యం
పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలని హస్తం పార్టీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. అందుకు తగ్గట్టే పార్టీలో పై స్థాయి నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయి నాయకత్వంలో మాత్రం అంతగా జోష్ కనిపించడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅసంతృప్తిలో నేతలు సంప్రదాయ కాంగ్రెస్ వాదులు, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉధృతిని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకుని పార్టీ కోసం పని చేసిన తమకు ప్రస్తుతం తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన వారిలో నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే, మరికొందరు వ్యక్తిగత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పని చేస్తున్నా పదవులు దక్కడం లేదని అసంతృప్తి ● నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంపై ఆందోళన ● కష్టపడినా గుర్తింపు లేదంటున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు ● పార్టీ కార్యక్రమాలకు దూరంగా పలువురు.. బీఆర్ఎస్ హవాను తట్టుకుని.. తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ హవా కనిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకర్గాల నుంచి అనేక మంది ఆశావహులు ముందుకొచ్చారు. పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు నుంచే నియోజకర్గ స్థాయిలో శ్రమించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు వంటి వారు ఆసక్తి చూపించగా పినపాక నుంచి బట్టా విజయ్గాంధీ, చందా సంతోష్, పోలెబోయిన శ్రీవాణి, అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి టికెట్ ఆశించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇందులో చివరి నిమిషం వరకు శంకర్నాయక్, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లు తదితర నేతలు టికెట్ రేసులో మిగిలారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో గ్రామ, మండల స్థాయిల్లో తమకంటూ అనుచరగణం ఏర్పాటు చేసుకుని పని చేశారు. ‘నామినేటెడ్’ భర్తీ ఎప్పుడో ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఇక ఆ తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పార్టీ కోసం చెమటోడ్చిన తమను ఇంకెప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 18 నెలలుగా ఎలాంటి పదవులు దక్కలేదని, తమను నమ్ముకున్న వారికి కనీస స్థాయిలో సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కింది స్థాయి కేడర్లో ఉత్సాహం నింపేలా, గతంలో టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ కోసం ఓపికగా పని చేసుకుంటూ వెళితే సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి.. ఎన్నికల సమీకరణలు, వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి కేటాయించగా, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణకు అవకాశం దక్కింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ, మరో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలంలో పొదెం వీరయ్య ఓడిపోయారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని టికెట్ దక్కని ఆ పార్టీ నేతలు ఆశించారు. -
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్తగూడెంఅర్బన్ : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సమస్యలు ఉన్నవారు సదస్సుల్లో దరఖాస్తు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు తదితర సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. వాటి పరిశీలనకు భూ భారతి చట్ట ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారని, నిర్దేశిత గడువు లోగా సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్ను అదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. జయరాజు స్ఫూర్తి ఆదర్శం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయరాజు అందించిన స్ఫూర్తి ముందు తరాలకు ఆదర్శమని కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జయరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు జయరాజుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొత్తగూడెం ప్రకృతి అశ్రమ సభ్యులు రాజేంద్రప్రసాద్, సుగుణారావు, నాగ సీతారాములు, వెంకటముత్యం, సురేష్, వరలక్ష్మి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ.. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రానీయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్లు ఎండీ.ముజాహిద్, రంగాప్రసాద్, ఆయా పార్టీల నాయకులు నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు తదితరులు ఉన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
ములకలపల్లి: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ములకలపల్లి మండలంలో తొలిరోజు కమలాపురం, రాచన్నగూడెం గ్రా మాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఆయన మా ట్లాడారు. రైతులకు భూ సమస్యలు ఉంటే ఈ సదస్సుల్లో తప్పక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తలను పరిశీ లించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ భూక్యా గన్యా, నాయబ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆర్ఐలు సత్యావతి, భద్రు, మాజీ ఎంపీపీ మట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ చోరీ కామేపల్లి: మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు ఎత్తిపోతల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైతులు ఇచ్చిన సమాచారంతో ఇరిగేషన్ డీఈఈ శంకర్నాయక్, ఏఈఈ రమేశ్ మంగళవారం పరిశీలించారు. కాగా, విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేయించి ట్రాన్స్ఫార్మర్ను వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వల్లభనేని అప్పారావు కోరారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
మలేరియాను తరిమికొట్టాలి..
ఇల్లెందు: మలేరియా నివారణ కోసం ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించిన వారి వల్ల వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా మలేరియా వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించే సర్వే పూర్తి చేశారు. జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి పరీక్షించారు. గొత్తికోయగూడేల్లో ఉన్న వారే ఈ జ్వర పీడితులుగా తేలారు. వీరు తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి నుంచి మలేరియా సోకినట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వచ్చే నెల 16 నుంచి మలేరియా నివారణ కోసం మందు పిచికారీ చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడు మలేరియా సబ్ యూనిట్లు.. జిల్లాలో ఏడు మలేరియా సబ్ యూనిట్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్కు ఒక సబ్ యూనిట్ సూపర్వైజర్ పనిచేస్తున్నారు. జిల్లాలో మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ కార్యక్రమం రూపొందించి సబ్యూనిట్లకు చేరవేస్తారు. మలేరియా సబ్యూనిట్ సూపర్వైజర్ ద్వారా కిందిస్థాయిలోమలేరియా నివారణ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఇల్లెందు యూనిట్ పరిధిలోసులానగర్(టేకులపల్లి), ఆళ్లపల్లి, రొంపేడు(సుదిమళ్ల), గుండాల పీహెచ్సీలు ఉన్నాయి.కొత్తగూడెం సబ్ యూనిట్ పరిధిలో కొత్తగూడెం, పెనగడప, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు, ఎర్రగుంట, ఎంపీ బంజర సబ్ యూనిట్ పరిధిలో ఉల్వనూరు, ముల్కలపల్లి, పాల్వంచ, జగన్నాథపురం, ఎంపీ బంజర,అశ్వారావుపేట సబ్ యూనిట్ పరిధిలో వినాయకపురం, గుమ్మడివల్లి, దమ్మపేట, పట్వారీగూడెం, మణుగూరు సబ్ యూనిట్ పరిధిలోమణుగూరు, అశ్వాపురం, పినపాక, జానపేట, కరకగూడెం, భద్రాచటం సబ్ యూనిట్పరిధిలో భద్రాచలంటౌన్, నర్సాపురం,పర్ణశాల, దుమ్ముగూడెం, చర్ల పీహెచ్సీలు ఉండగా వీటి పరిధిలో 20 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 కేసుల గుర్తింపు రాకపోకల వల్లే వ్యాధి వ్యాప్తి ముందస్తు చర్యలతోనే నివారణమలేరియా నివారణకు చర్యలు.. జిల్లాలో మలేరియా నిర్మూలన కోసం ప్రణాళికాయుతంగా చర్యలు చేపడతున్నాం. ఇప్పటికే గ్రామస్థాయిలో రక్తపూత లు సేకరించి పరీక్షించగా 20 కేసులు నమోదయ్యాయి. వారందరికీ వైద్యం అంది స్తున్నాం. ప్రస్తుతం మలేరియా అదుపులో ఉంది. నివారణకు తగు చర్యలు ముమ్మరం చేశాం. –డాక్టర్ స్పందన, మలేరియా ప్రోగ్రాం అధికారి -
సాయి మందిరానికి రూ.లక్ష విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ జూని యర్ కళాశాల సెంటర్లోని శ్రీసాయిబాబా మందిర అన్నప్రసాద షెడ్డు నిర్మాణానికి ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించాడు. పట్టణానికి చెందిన దివంగత చెరుకూరి సత్యవాణి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఆలయ అధ్యక్షుడు కొమ్మనాపల్లి ఆదినారాయణకు మంగళవారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు కుటుంబసమేతంగా బాబావారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలకు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో చెరుకూరి మల్లికార్జునరావు, గొర్ల వెంకటేశ్వరరావు, శ్రీరామ్శర్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పునరావృతం కాకుండా చర్యలుభద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పరమత వ్యాఖ్యలతో ఉన్న కవర్లు రావడం చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు అన్నెం శ్రీనివాసరెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. వస్త్రాలు విక్రయించే కాంట్రాక్టర్ స్క్రాప్ కవర్లను విక్రయించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు కాంట్రాక్టర్ వివరణ ఇచ్చాడని తెలిపారు. సున్నితమైన అంశంపై విపరీతమైన ప్రచారం జరగడంతో ఆలయ ఉద్యోగులు, రామ భక్తులు విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్లో ఇలాంటి ఘటన లు జరగకుండా చూస్తామని వివరించారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయలో యంత్ర ప్రతిష్ఠ సింగరేణి(కొత్తగూడెం): రామవరంలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు పార్వతి సమేత రామలింగేశ్వర, పంచముఖ ఆంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర, నంది, ఉష్ణవాహన, శిఖర, నాగ, యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, పుణ్యావాచనం, పంచగ్రవ్య ప్రాశన, రక్షాబంధనం, రుత్వికరణం, దీక్షాధారణం, యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన నిర్వహించారు. సాయంత్రం పలు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. -
సర్వేకే పరిమితమైన డబ్లింగ్ లైన్
ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోనున్న పలువురు ● ఐదు నెలల క్రితమే సర్వే, ఆపై మార్కింగ్ ● ఇప్పటికీ పరిహారం ఊసెత్తని అధికారులు కారేపల్లి: డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా కొత్తగూడెం స్టేషన్ వరకు ఉన్న సింగిల్ ట్రాక్ను డబుల్ ట్రాక్గా నిర్మించేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కారేపల్లి మండలంలో కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో భూసేకరణ కోసం సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 54 ఎకరాలు అవసరమని గుర్తించగా, కారేపల్లి పరిధి సింగరేణి రెవెన్యూలో సుమారు 60 – 70 మంది నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాలని ఉంటుందని నిర్ధారించారు. అలాగే, కారేపల్లిలో స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్ ఫామ్, అదనంగా రెండు ట్రాక్ల నిర్మాణానికి 20 కుటుంబాల నుంచి ఇళ్లు సేకరించాల్సి ఉంటుంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, స్టేషన్ పరిధిలో 65మీటర్ల భూమితో పాటు ఇళ్లు సేకరించేలా మార్కింగ్ సైతం వేశారు. ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు భూనిర్వాసితులకు సమాచారం ఇచ్చారు. ఆపై గ్రామసభలు నిర్వహించినా, ఇప్పటివరకు పరిహారంపై ప్రకటన చేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు చేయాలా, వద్దా..? డబ్లింగ్ లైన్ నిర్మాణ భూసేకరణ కోసం సర్వే చేపట్టి ఐదు నెలలు కావొస్తుండగా, పరిహారంపై స్పష్టత కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలుకావడంతో రైల్వే అధికారులు మార్కింగ్ చేసిన భూముల్లో పంట సాగు చేయాలా, వద్ద మీమాంస నెలకొంది. సింగరేణి రెవెన్యూ పరిధి మైదాన ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి భూములకు మంచి ధర పలుకుతోంది. అయితే, వ్యవసాయి భూములు, ఇంటి స్థలాలకు మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇళ్లకు స్వభావం ఆధారంగా ధర నిర్ణయించి గ్రామసభలో తీర్మానం చేస్తారని సమాచారం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలియకున్నా పరిహారం స్పష్టత లేక, పంటల సాగుపై అవగాహన లేక నిర్వాసితులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
కరకగూడెం: నాటుసారా తయారు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. విప్పలగుంపులో ఓ ఇంట్లో సారా తయారీకి ఉపయోగించే సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. 9 మంది సారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ కాంతయ్య ఎదుట బైండోవర్ చేశారు. కార్యక్రమంలో హెచ్సీ అష్రఫ్, సిబ్బంది ఆంజనేయులు, ధనజ్యోతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు ఇల్లెందు: పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన సైదులుపై అదే గ్రామానికి చెందిన యాకూబ్పాషా, సోని దాడి చేసి గాయపర్చారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ హసీనా కేసు నమోదు చేశారు. విద్యార్థిని అదృశ్యంపాల్వంచరూరల్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బట్టలు, ల్యాప్ట్యాప్ను సర్దుకుని ఓ విద్యార్థిని వెళ్లిపోయింది. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన ఓపెన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని (19) మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయందని, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని తండ్రి శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామంలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంగళవారం ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేశారు. మాణిక్యారం గ్రామానికి చెందిన గడదాసు గణేశ్ బైక్పై పోలారం నుంచి మాణిక్యారం వెళ్తూ కొమరారంలో ఎదురుగా స్కూటీపై వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలు తీవ్రంగా గాయపడగా.. ఆయన కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.