breaking news
Bhadradri District Latest News
-
పోటెత్తిన నామినేషన్లు
● తొలివిడతలో 159 సర్పంచ్ స్థానాలకు 813 సెట్లు దాఖలు.. ● 1,436 వార్డు స్థానాల్లో 3,485..చుంచుపల్లి: జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే 159 గ్రామపంచాయతీలు, 1,436 వార్డులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గత నెల 27 నుంచి 29 వరకు తొలిదశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. చివరి రోజైన శనివారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. తొలి విడతలో సర్పంచ్, వార్డులకు కలిపి 4,298 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 159 సర్పంచ్ స్థానాలకు 813 నామినేషన్లు రాగా, 1,436 వార్డులకు 3,485 నామినేషన్లు వేశారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 614 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు సైతం 3,020 నామినేషన్లు సమర్పించారు. అశ్వాపురం మండలంలో సర్పంచ్ స్థానాలకు 132, వార్డులకు 533, భద్రాచలంలో సర్పంచ్ స్థానానికి 11, వార్డు స్థానాలకు 98, బూర్గంపాడు మండలంలో సర్పంచ్ స్థానాలకు 114, వార్డు స్థానాలకు 483, చర్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు 134, వార్డు స్థానాలకు 485, దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు 153, వార్డు స్థానాలకు 648, కరకగూడెంలో సర్పంచ్ స్థానాలకు 67, వార్డులకు 278, మణుగూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 83, వార్డులకు 431, పినపాక మండలంలో సర్పంచ్ స్థానాలకు 119, వార్డులకు 529 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఇందులో భద్రాచలం సర్పంచ్ స్థానానికి అత్యల్పంగా 11 నామినేషన్లు రాగా, దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు అధికంగా 153 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు దుమ్ముగూడెంలో అత్యధికంగా 648 నామినేషన్లు రాగా, అత్యల్పంగా భద్రాచలంలో 98 నామినేషన్లు వేశారు. కొన్ని స్థానాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఏకగ్రీవం అనివార్యంగా మారింది. వీటిని ఈ నెల 3న అధికారికంగా ప్రకటించనున్నారు.రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీ స్థానాలకు ఆదివారం నుంచి అధికా రులు 49 కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 155 గ్రామపంచాయతీలు, 1384 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, తొలిరోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 25, వార్డులకు 47 నామినేషన్లు సమర్పించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వార్డులకు మాత్రం రెండు నామినేషన్లు వచ్చాయి. అశ్వారావుపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 8, వార్డు స్థానాలకు 11, చండ్రుగొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 4, వార్డులకు 15, చుంచుపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు ఒకటి, వార్డు స్థానాలకు 8, దమ్మపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 9, వార్డులకు 7, ములకలపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 2, వార్డు స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు కాగా, పాల్వంచ మండలంలో సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానానికి మరొకటి చొప్పున నామినేషన్లను సమర్పించారు. చుంచుపల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య, జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి పర్యవేక్షించారు. -
పోటీకి సై.. పైసలు నై
● పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుకు ఆశావహుల్లో జంకు ● గతం నేర్పిన పాఠంతో తర్జనభర్జన ● పలు చోట్ల అన్ని పార్టీలకూ అభ్యర్థుల కొరతబూర్గంపాడు/ఇల్లెందురూరల్: సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్న స్థానిక నాయకులు పోరులో నిలిచేందుకు ఉత్సాహ పడుతున్నా.. మరోవైపు ఎన్నికల ఖర్చు, గతానుభవాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖర్చు ఎలా భరించాలని తర్జనభర్జన పడుతున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయంలో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. 5 వేల కంటే అధికంగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు, 5 వేల కంటే తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షల వర కు ఖర్చు పెట్టవచ్చు. వార్డు సభ్యులైతే 5 వేల జనా భా కంటే అధికంగా ఉన్న వార్డుల్లో రూ.50 వేలు, అంతకంటే తక్కువ ఉన్న వార్డుల్లో రూ.30వేలు ఖర్చు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. గతం నేర్పిన పాఠంతో.. స్వరాష్ట్రంలో మొదటి దఫా సర్పంచ్గా ఎన్నికై న నేతలు ప్రారంభంలో సంతోషంగా పాలన సాగించారు. వార్డు సభ్యులు, అధికారులు కలిసి రావడం, ప్రభుత్వం నుంచి నిధులు క్రమం తప్పకుండా మంజూరు కావడం.. వెరసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ కాలర్ ఎగురవేశారు. కాలం గడిచే కొద్ది సర్పంచ్ పదవి ముళ్లకిరీటంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటిలాగా మంజూరవుతాయని భావించి పల్లె పాలన కోసం పలువురు సర్పంచ్లు అప్పులు చేశారు. నిధుల మంజూరు గాడి తప్పడంతో చేసిన అప్పులు భారంగా మారాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు సర్పంచ్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పదవీ కాలం గడువు దగ్గర పడుతున్న కొద్దీ పాలన కష్టంగా మారి కొందరు ప్రజల చేత చీత్కారాలకు కూడా గురయ్యారు. చివరకు అప్పుల భారం మెడలో వేసుకుని పదవీ బాధ్యతల నుంచి దిగిపోయారు. మరోసారి స్థానిక సమరం జరుగుతున్నా గత అనుభవాల దృష్ట్యా తాజా ఎన్నికల్లో ఆశావహులు జంకుతున్నారు. ఈ కారణంగానే ఎన్నికల వేళ పలు గ్రామపంచాయతీల్లో అధికార, ప్రతిపక్షాల సహా అన్ని పార్టీలూ అభ్యర్థులను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇళ్లు, భూములు తనఖాఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. సర్పంచ్ పీఠంపై ఆశతో ఇళ్లు, భూములు తనఖా పెడుతున్నారు. శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగియటంతో ప్రచారపర్వం మొదలుపెట్టారు. సుమారు 10 రోజుల పాటు ప్రచారంలో తిరిగే కేడర్కు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల నుంచి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఆయా నియోజకవర్గాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వటం లేదు. మరోవైపు ఎన్నికల సంఘం విఽధించిన పరిమితికి అనాధికారికంగా ఐదారు రెట్లు ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి ఉందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఇల్లెందు మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 274 వార్డులు ఉండగా, బరిలో ఉండే సర్పంచ్లు, వార్డు సభ్యులు 46,894 మంది ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు రాగా.. ప్రస్తుతం చిన్న గ్రామపంచాయితీలో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద గ్రామపంచాయతీల్లో రూ.5లక్షల నుంచి 10 లక్షల వరకు, పోటీ అధికంగా ఉంటే రూ.15 లక్షల వరకు ఖర్చు రావొచ్చని అంచనా వేస్తున్నారు. నామినేషన్ రోజు నుంచి పోలింగ్ రోజువరకు దాదాపు 15 రోజుల వ్యవధి ఉంది. ఈ క్రమంలో ప్రచారం కోసం కార్యకర్తలు వెంట తిరగడం, వారికి టీ, టిఫిన్, భోజనంతోపాటు మద్యం కోసం అధికంగా ఖర్చు కానుంది. పోలి ంగ్ ముందు రోజు ఈ ఖర్చు రెట్టింపు అవుతుందని నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. -
నేటి నుంచి కొత్త వైన్స్
● జిల్లాలో 88 మద్యం షాపులు, 13 బార్లు ఏర్పాటు ● పేట మున్సిపాలిటీలో నిబంధనలు సడలింపుఅశ్వారావుపేటరూరల్: జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభంకానున్నాయి. వ్యాపారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలు చేయనుంది. జిల్లాలో మొత్తం 88 మద్యం దుకాణాలు ఉండగా, గత అక్టోబర్ 27న లక్కీ డ్రా నిర్వహించారు. చాలాచోట్ల పాత షాప్ల్లోనే కొత్త వ్యాపారులు కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకుని, డిపోల నుంచి మద్యం స్టాక్ తెప్పించుకున్నారు. ఇక పాత వ్యాపారులు ఆదివారం రాత్రి వరకు అమ్మకాలు చేపట్టాక మిగిలిన స్టాక్ను తీసుకెళ్లారు. అశ్వారావుపేటలో నిబంధనల్లో మార్పు కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, ఎకై ్సజ్ నిబంధనల్లో కొద్ది మార్పులు జరిగాయి. గతంలో అశ్వారావుపేటకు మేజర్ పంచాయతీ హోదా ఉండగా, పట్టణంలోని ఖమ్మం, జంగారెడ్డిగూడెం మార్గాలు జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో నిబంధనల ప్రకారం ఆయా మార్గాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు కాలేదు. దీంతో అశ్వారావుపేటలో ఉన్న దుకాణాలన్నీ భద్రాచలం మార్గంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అశ్వారావుపేటకు మున్సిపాలిటీ హోదా దక్కింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి నిబంధనలు వర్తించని కారణంగా తాజాగా దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు పట్టణంలోని జంగారెడ్డిగూడెం, ఖమ్మం మార్గాల్లో షాపులు ఏర్పాటు చేస్తున్నారు. షాపులు దక్కినవారితో బేరసారాలు! పలువురు వ్యాపారులు సిండికేట్గా మారి పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేసినా, ఓ సిండికేట్కు ఒకే షాపు, మరో సిండికేట్గా మూడు షాపులు మాత్రమే దక్కాయి. దీంతోవారు షాపులు దక్కినవారితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా వ్యాపారులు సైతం ఉమ్మడి జిల్లా వ్యాపారులతో చేతులు కలిపి వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఆదిలోనే ధమాకా.. దుకాణాలు ప్రారంభించిన తొలినెలలో విక్రయాలు జోరుగా సాగే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఈనెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జీపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఆపై మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారానికి ఢోకా ఉండదనే భావనలో వ్యాపారులు ఉన్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. సర్కిల్ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో 11 దుకాణాలకు లైసెన్సులు జారీ చేశాం. అన్ని చోట్ల దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయి. ఎలాంటి అడ్డంకులు లేవు. –సాంబమూర్తి, ఎకై ్సజ్ సీఐ, అశ్వారావుపేట -
ఎర్త్ సైన్సెస్ ముస్తాబు..
కొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత జూలైలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, హ్యయర్ ఎడ్యుకేషన్ అధికారులు వర్సిటీని సందర్శించి కావాల్సిన సదుపాయాలపై ప్రభుత్వానికి నివేదించారు. అదే నెలలో సీఎం యూనివర్సిటీని ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నా.. ప్రోగ్రాం వాయిదా పడింది. ఇటీవల సీఎం పర్యటన ఖరారుకాగా, ఈ నెల 2న ప్రారంభోత్సవం జరగనుంది. పాత భవనాలకు మరమ్మతులు యూనివర్సిటీలో ప్రస్తుతం బీఎస్సీ జియోలాజిలో 14 మంది, ఎన్విరాన్మెంట్ సైన్స్లో 34 మంది, పీజీ ఎన్విరాన్మెంట్ సైన్స్లో 14, మొత్తం 62 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 8 మంది అధ్యాపకులను నియమించారు. అయితే తరగతులు, హాస్టల్ వసతికి పాత భవనాలనే వినియోగిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శిలాఫలకం ఏర్పాటు, భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు, ఆడిటోరియం పనులు, 120 విద్యార్థినులు, 80 మంది విద్యార్థులకు సరిపడే విధంగా వేర్వేరు హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. వీటితోపాటు రోడ్డు నిర్మాణ, విద్యుత్, వాటర్ సప్లై తదితర పనులు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు ఇంజనీరింగ్, రోడ్లు–భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యలు, నిర్వహణపై పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్రాజు పర్యవేక్షిస్తున్నారు. రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారికి సువర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలు మూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. సింగరేణిలో రాత పరీక్షరుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 10 జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగి సింది. 27 మంది మాత్రమే హాజరయ్యారు. జూనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ పోస్టులు 12 ఉండగా, పరీక్షకు 14 మంది హాజరయ్యారు. పరీక్షలను సింగరేణి విజిలెన్స్, రిక్రూట్మెంట్ సెల్ అధికారులు పర్యవేక్షించారు. భగవద్గీత పోటీల్లో బహుమతులుకొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. జిల్లా నుంచి పలువురు హాజరుకాగా నలుగురికి బహుమతులు దక్కాయి. ఈ మేరకు జిల్లా కార్యాలయ ప్రముఖ్ గోపిరెడ్డి భాస్కర్రెడ్డి వివరాలు వెల్లడించారు. బహుమతులు గెలుపొందిన వారిలో భద్రాచలానికి చెందిన ఊర్విక, పాల్వంచకు చెందిన శరణ్యప్రియ, త్రిపాఠి, కొత్తగూడేనికి గుణనిధి ఉన్నారు. విజేతలను విశ్వహిందూ పరిషత్ నాయకులు అభినందించారు. మద్దికొండ పంచాయతీ ఏకగ్రీవంఅశ్వారావుపేటరూరల్: మండలంలోని మద్దికొండ గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామస్తులు, రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుని ఏకగ్రీవంవైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ మద్దతు తెలిపిన, గ్రామానికి చెందిన తాటి రామకృష్ణను సర్పంచ్గా, పంచాయతీలోని ఎనిమిది వార్డులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో వార్డు సభ్యుడిగా బరిలో దిగిన నెర్సు శ్రీనును ఉప సర్పంచ్గా ఎన్నుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. రామకృష్ణ, శ్రీను ఆదివారం జమ్మిగూడెం కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల అనంతరం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
పంచాయతీ ఓటర్ల కోసం ‘టీ–పోల్ యాప్’
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ–పోల్ (టీఈ పీఓఎల్ఎల్) మొబైల్ యాప్ను రూపొందించింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటరు స్లిప్పులను కోసం, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ సాయపడుతుంది. గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ డౌలోడ్ చేసుకోవాలని అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి అజ్ఞాతవాసంపై ఆరా ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, ప్రస్తుత స్థానిక సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వల్లాల మంగమ్మ అజ్ఞాతవాసంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం రాత్రి రహస్యంగా సుభాష్నగర్లోని ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎన్నికల నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థి అజ్ఞాతవాసం ఘటన బీఆర్ఎస్ నేతల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి నేటికీ ఖరారు కాకపోవడంపై సందేహంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు తరచూ మంగమ్మ ఆచూకీ కోసం ఓ వైపు ఆరా తీస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం చర్చిస్తున్నారు. -
మార్కెట్ నిండా మక్కలు
● మబ్బులు చూసి భయపడుతున్న అధికారులు ● ఇష్టారాజ్యంగా గ్రామాల్లో వ్యాపారుల కొనుగోళ్లు ● అప్పుల కింద ఇబ్బడిముబ్బడిగా వడ్డీ వసూళ్లుఇల్లెందు: జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న పంట ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, బయ్యారం మండలాల్లో పండింది. పంట చేతికి వచ్చిన సమయాన కురిసిన వర్షానికి తడిచి మొలకెత్తింది. మార్క్ఫెడ్ నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేసి ఇల్లెందు, కొమరారంలో రెండు మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రైతులు హడావుడిగా తరలించి అమ్ముకున్నారు. క్రమంగా అప్పులు పెట్టిన వ్యాపారులు అడ్డం తిరగటంతో కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ఆగిపోయింది. దీంతో కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఇల్లెందు కొనుగోలు కేంద్రంలో 8 వేల మెట్రిక్ టన్నులు, కొమరారంలో 4 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇల్లెందు, కొమరారం కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న రాశులు, సంచులతో నిండిపోయాయి. నిర్వాహకుల్లో భయం రెండు రోజులుగా మబ్బులు పడుతున్న కారణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే చేన్ల మీద తడిచిన మొక్కజొన్న మొలకెత్తింతి. రైతులు తడిచిన మొక్కజొన్నను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. అయితే మొర్కెట్యార్డు, కొమరారంలో కొనుగోలు కేంద్రాల్లో నిండిపోయిన సరుకును వేగంగా కోదాడ స్టాక్ పాయింట్కు తరలించకపోతే తీవ్రమైన నష్టం చవిచూడాల్సి వస్తుందనే భయంతో వణికిపోతున్నారు. పల్లెల్లో వ్యాపారుల హవా.. ఇల్లెందు, కొమరారంలో పీఏసీఎస్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా క్వింటా మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. వ్యాపారులు క్వింటా రూ.1,650 నుంచి రూ.1,950 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇల్లెందు మండలంలో పలు గ్రామాలకు చెందిన వ్యాపారులు తాము రైతులకు పెట్టుబడి పెట్టామని, తమ పెట్టుబడులు రావాలంటే రైతుల వద్ద పంటలను తామే కొనుగోలు చేసుకుంటామని మార్కెఫెడ్ ద్వారా పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ను వివరణ కోరగా మొదట్లో కొనుగోలు కేంద్రాలకు భారీగా మొక్కజొన్న వచ్చిందని, క్రమంగా తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటి వరకు రెండు కొనుగోలు కేంద్రాల్లో సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వచ్చిందని చెప్పారు. ఇంతకు మూడింతల పంట పండిందని పేర్కొన్నారు. -
రూ.99.83 లక్షల విలువైన గంజాయి పట్టివేత
● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్లడించిన ఇల్లెందు డీఎస్పీ టేకులపల్లి : అక్రమంగా తరలిస్తున్న 199.673 కేజీల గంజాయిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇల్లెందు డీఎస్పీ ఎన్ చంద్రభాను ఆదివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన లాల్సింగ్ చౌహాన్ అలియాస్ లాక్సింగ్ 30 ఏళ్లుగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల గ్రామంలో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఏఓబీ(ఆంధ్ర ఒడిశా బోర్డర్) నుంచి రాజస్థాన్కు ఏపీ31 డీఏ 4554 నంబర్ గల మారుతీ సియాజ్ కారులో 199.673 కేజీల గంజాయిని 100 ప్యాకెట్లుగా చేసి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి మండలం సాయనపేట వద్ద ఎస్ఐ ఎ. రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. కాగా, పోలీసులను తప్పించబోయిన ముద్దాయి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టి దొరికిపోయాడు. కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్ నిమిత్తం ఇల్లెందుకు కోర్టుకు తరలించారు. కాగా, లాల్సింగ్పై ఏపీలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతడి తల్లి కన్కార్ దేవి, భార్య మాఫీ కన్వర్ కూడా గంజాయి తరలిస్తూ పట్టుబడగా ఏపీలోని ఎస్.రామవరం పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారని, లాల్సింగ్ సోదరుడు వీర్సింగ్ రాజస్థాన్ జైలులో ఉన్నాడని వివరించారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు
ఖమ్మంస్పోట్స్: జిల్లాస్థాయి ఖేలో ఇండియా ఆధ్వర్యాన బాలికల విభాగంలో నిర్వహించిన అస్మిత అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను ఖమ్మం రైల్వే సీఐ అంజలి ప్రారంభించారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్, డాక్టర్ సత్యనారాయణ, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ షఫిక్తో పాటు ఎం.సుధాకర్, డి.రవి, సీహెచ్ కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, ఎల్.రవి, జి.ముజాహిద్, అజ్రాఫాతిమా తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–14 బాలికల ట్రయథిలిన్ ఈవెంట్ గ్రూప్–ఏలో ఎండీ ఆఫ్రిన్, కె.సంజన, ఎస్కే హాసిని, సీహెచ్ స్వర్ణపుష్ప, గ్రూప్–బీ విభాగంలో బి.శ్రీలేఖ, ఎం.బిందు, ఆర్.గీతయామిని, గ్రూప్–సీలో ఎస్కే సనీయా, బి.నిఖిత, ఎస్.హర్షిత, పి.సోనఖాన్ వరుస స్థానాల్లో నిలిచారు. అండర్–16 60 మీటర్ల పరుగులో ఎ.మనుశ్రీ, ఎస్.సల్మామెహతాబ్, బి.పూజిత, బి.సంగీత, 600 మీటర్ల పరుగులో బి.దీక్ష, బి.సంగీత, ఎస్కే సల్మామెహతా, లాంగ్జంప్లో ఎ.మనుశ్రీ, బి.కావేరి, జి.మంజుషా, ఎస్డీ బాషారా, హైజంప్లో బి.మైథిలి, ఎస్.సమీరా, ఎ.ఇందిర, షాట్ఫుట్లో డి.పావని, బి.అఖిల, సీహెచ్.సుకీర్తి, ఈ.రమ్యశ్రీ, డిస్కస్త్రోలో డి.పావని, పి.తనుశ్రీ, బి.అఖిల, పి.కీర్తి, జావెలీన్త్రోలో ఎల్.అమ్ములు, పి.తనుశ్రీ, ఎస్.సాయివర్షిత విజేతలుగా నిలవడంతో పతకాలు అందజేశారు. -
రెండోస్థానంలో సింగరేణి జట్టు
● ముగిసిన కోలిండియాస్థాయి కబడ్డీ పోటీలు ● విజేతగా నిలిచిన వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ టీమ్ రుద్రంపూర్: కోలిండియాస్థాయి కబడ్డీ పోటీల్లో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ జట్టు విజేతగా నిలిచింది. సింగరేణి జట్టు రెండోస్థానం పొందింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో మూడు రోజులుగా జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్లో సింగరేణి జట్టుపై వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ జట్టు 44 పాయింట్ల అధిక్యతతో విజయం సాధించింది. కోలిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆతిథ్య సింగరేణి జట్టు రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ బొగ్గు ఉత్పత్తి సంస్థల కార్మికులు కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటారని అన్నారు. ఆటల్లో గెలుపు ఓటమిలు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, జీఎం శాలేంరాజు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం నాయకులు త్యాగరాజన్, సీఎంఓఏఐ ఈబీసీ నాయకులు బి. రాజ్గోపాల్, నరసింహారావు, జీఎంలు కిరణ్కుమార్, ఎం.సుబ్బారావు, కోటిరెడ్డి, సూర్యనారాయణ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆవిర్భావం
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసా.? దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం – సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రొఫెసర్ ఎస్కేడే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్రాయ్ నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. ఈ కమిటీ ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ.. మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను దేశంలో తొలుత రాజస్థాన్లోని నాగౌర్లో అక్టోబర్ 2న ప్రారంభించగా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు చట్టబద్ధత వచ్చింది. -
ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి
పాల్వంచరూరల్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్వీకరించే నామినేషన్ ఫారాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సంబంధింత ఆర్ఓలను ఆదేశించారు. మండల పరిధిలోని కోడిపుంజుల వాగులో నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. స్వీకరించిన నామినేషన్ల వివరాలను సంబంధింత ఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించాలని, నిర్దేశించిన సమయంలోగా నామినేషన్ ఫారం (5)ను అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవరావులు పాల్గొన్నారు. -
మహమ్మారి తగ్గుముఖం
భద్రాచలంఅర్బన్: సామాజిక చైతన్యం, అవగాహనతో పాటు అప్రమత్తత పెరగడంతో ఒకటి, రెండేళ్ల నుంచి జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పడుతోంది. రోగాన్ని అదుపులో ఉంచే మందులు అందుబాటులో ఉండటంతో రోగుల జీవితకాలం పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 3,150 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. సురక్షితంకాని లైంగిక సంబంధాలు, వైరస్ సోకినవారి రక్తం ఇతరులకు ఎక్కించటం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 2025లో 164 కొత్త కేసులు 2024లో 1,20,804 మందిని పరీక్షించగా 373 కేసులు నమోదయ్యాయి. 42,578 మంది గర్భిణులను పరీక్షించగా 15 గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. 2025 అక్టోబర్ నెలాఖరు వరకు 68,168 మందిని పరీక్షించగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. 21,895 మంది గర్భిణులను పరీక్షించగా 10 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.2016 పెన్షన్ ఇస్తోంది. జిల్లాలో 1,670 మంది బాధితులు పెన్షన్ పొందుతున్నారు. బిడ్డకు సంక్రమించకుండా.. సంతానానికి కూడా హెచ్ఐవి సోకే అవకాశం ఉండటంతో గతంలో బాధిత దంపతులు బిడ్డను కనేందుకు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం కాన్పు పొందగానే పసిబిడ్డకు నివిరాపిన్ టానిక్ ఇవ్వడం ద్వారా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రివే స్టన్ ఆఫ్ పేరెంట్ టు వైల్డ్ ట్రాన్స్మిషన్ (పీపీటీసీటీ) కేంద్రాలను పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. హెచ్ఐవీ సోకిన దంపతులు పీపీటీసీటీ కేంద్రాల్లో కాన్పు పొందితే పిల్లలకు హెచ్ఐవీ సోకకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోంది. పీహెచ్సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష, సలహా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఆరు నర్సింగ్హోమ్లు, భద్రాచలం, కొత్తగూడెంలలో సుఖవ్యాధుల చికిత్స కేంద్రాలు, భద్రాచలంలో ఏఆర్టీ సెంటర్, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో లింక్ ఏఆర్టీ సెంటర్లు, మోరంపల్లిబంజర్లో కేర్, సపోర్ట్ సెంటర్, భద్రాచలంలో హెచ్ఐవీ వైరల్ లోడ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి సేవలందిస్తోంది. సంవత్సరం బాధితులు 2020–21 249 2021–22 249 2022–23 318 2023–24 373 2024–25 164 జిల్లాలో 3,150 మంది ఎయిడ్స్ బాధితులు జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి అదుపులో ఉంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుండటంతో మెరుగైన ఫలితలు వస్తున్నాయి. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితిల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. –డాక్టర్ పుల్లారెడ్డి, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి -
విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
భద్రాచలంటౌన్ : ఉన్నతస్థాయికి, శాస్త్రవేత్తలుగా ఎదిగేలా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయులు, పీఈటీలకు జరుగుతున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. తొలుత 15 రోజులుగా శిక్షణ తీసుకున్న గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు, డీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు విద్యా, అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచుకునేందుకు, మెరుగైన బోధనకు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల్లో గణితం పట్ల భయం పోగొట్టాలని చెప్పారు. విద్యార్థుల్లో స్వతహాగా ఆలోచించే విధానాన్ని పెంపొందించాలని సూచించారు. అధికారులు అశోక్, వీరూ నాయక్, రమేష్, మోతిలాల్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
చూసి.. సహకరించండి..!
భద్రాచలంఅర్బన్: చెవిటి వాళ్ల వాహనాల కోసం ఓ ప్రత్యేక స్టిక్కర్ రూపొందించిన రవాణా శాఖ అధికారులు.. దానిని చూసి మిగతా వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు. చెవిటి వాళ్ల వాహనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లను అందజేసింది. వినికిడి శక్తి లేని వారి వాహనానికి వీటిని అంటించనున్నారు. గమనించి జాగ్రత్తగా పక్క నుంచి వెళ్లాలని ఈ స్టిక్కర్ ఉద్దేశం. దీనిపై భద్రాచలం అదనపు ఎంవీఐ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ముందు వెళ్లే వాహనానికి ఈ స్టిక్కర్ అంటించి ఉంటే.. హారన్ వినబడదని అర్థం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచండి.. చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పి.లావణ్య అధికారులకు సూచించారు. మండలంలో ఆదివారం పర్యటించిన ఆమె చండ్రుగొండ, రావికంపాడు, దామరచర్ల, గానుగపాడు గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఎంపీఓ ఖాన్ పాల్గొన్నారు. కల్లాల్లో ధాన్యం.. కర్షకుల్లో కలవరం పాల్వంచరూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ ప్రభావంతో ఆదివారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు కలవరపడుతున్నారు. మండలంలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైంది. పంటపొలాల నుంచి వరి నూర్పిడి చేసుకుని కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం కోసం ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు అందోళన చెందుతున్నారు. మండలంలోని సోములగూడెం, రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రాల్లో వందలాది క్వింటాల ధాన్యాన్ని రైతులు ఆరబోసుకున్నారు. వర్షం ప్రభావం ఎన్నిరోజులు ఉంటుందోనని రైతులు దిగులు చెందుతున్నారు. సామాజిక సేవకురాలికి అవార్డు భద్రాచలంటౌన్: ఏజెన్సీవ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్న ధరణి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కనగాల చైతన్యకు అరుదైన గౌరవం లభించింది. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఐడియల్ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అవార్డు అందించారు. ‘మేమెంతో.. మాకంత’ఖమ్మంమామిళ్లగూడెం: మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఓ ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభలో వారు పాల్గొని మాట్లాడారు. అగ్రకుల ఆధిపత్యంతోనే నక్సలిజం పుట్టిందని, అందుకే మనకు రాజ్యాంగ ఫలాలు అందలేదని పేర్కొన్నారు. ఓసీల్లో పేదరికం 4 శాతం ఉంటే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ద్వారా రాజకీయ స్వరూపాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. సుంకర శ్రీనివాస్, సంగమేశ్వర్, తాటి వెంకటేశ్వర్లు, సంపత్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సమగ్ర ఏర్పాట్లు చేయాలి
● ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి ● రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఇందుకోసం సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన శిలాఫలకం ఏర్పాట్లను, యూనివర్సిటీ ప్రాంగణంలో పనుల పురోగతిని పరిశీలించారు. సభాస్థలిని సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతి, భద్రతా చర్యలు, ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతం చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాల్వంచలో కొత్త విద్యుత్ ప్లాంట్, రూ.420 కోట్లతో కొత్తగూడెం బైపాస్ రహదారి నిర్మిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ డిస్టిబ్య్రూటర్ కాల్వల నిర్మాణానికి అవసరమైన రూ.3,400 కోట్ల నిధులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. పినపాక, మారెళ్లపాడు, తుమ్మలచెరువు , సింగభూపాలెం, అశ్వారావుపేట, అన్నదైవంపాడు, మూకమామిడి అభివృద్ధి ప్రాజెక్ట్లను అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తగూడెం–ఇల్లెందు–హైదరాబాద్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, భద్రాచలం–మణుగూరు–ఏటూరునాగారం–చౌటాల రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. ఖమ్మం–భద్రాద్రి జిల్లాల అభివృద్ధికి రింగురోడ్లను కూడా ఆమోదించినట్లు చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలో సింగరేణి, పాల్వంచలో జెన్కో సహకారంతో కొత్తగా బస్టాండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రెండో విడత
● నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి ● డిసెంబర్ 2 వరకు గడువు ● రెండో దశలో 155 జీపీలు, 1,392 వార్డులు చుంచుపల్లి: డిసెంబర్ 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఆదివారం నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికల కోసం 1,392 పోలింగ్ కేంద్రాలు, 3,902 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విడతలో జిల్లాలోని 155 గ్రామ పంచాయతీలు, 1,384 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు 49 కేంద్రాలు.. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని 155 జీపీలు, 1,392 వార్డులకు రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లను స్వీకరణకు 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఆర్ఓ, ఏఆర్ఓ, ఒకరు అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని 10 పంచాయతీలు, 98 వార్డులకు సంబంధించి అన్నపురెడ్డిపల్లి, పెద్దిరెడ్డిగూడెం, నర్సాపురం కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అశ్వారావుపేట మండలంలోని 27 జీపీలు, 234 వార్డులకు నారంవారిగూడెం, జమ్మిగూడెం, ఉట్లపల్లి, అనంతారం, వినాయకపురం, తిరుమలకుంట, నందిపాడు, కన్నాయిగూడెం కేంద్రాల్లో, చండ్రుగొండ మండలంలోని 14 గ్రామపంచాయతీలు, 134 వార్డులకు చండ్రుగొండ, రావికంపాడు, గానుగపాడు, దామెరచర్లలో, చుంచుపల్లి మండలంలోని 18 పంచాయతీలు, 168 వార్డులకు రుద్రంపూర్, పెనగడప, 3 ఇంకై ్లన్, విద్యానగర్ కాలనీ, బాబు క్యాంప్ కేంద్రాల్లో, దమ్మపేట మండలంలోని 31 గ్రామపంచాయతీలు, 290 వార్డులకు అంకంపాలెం, పట్వారిగూడెం, నాగుపల్లి, గణేష్పాడు, అక్కినేపల్లి, ముష్టిబండ, మల్కారం, మందలపల్లి, దమ్మపేట, జమేదార్ బంజర్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ములకలపల్లి మండలంలోని 19 గ్రామ పంచాయతీలు, 178 వార్డులకు సంబంధించిన నామినేషన్లను తిమ్మంపేట, పొగళ్లపల్లి, సుబ్బనపల్లి, పాత గంగారం, చాపరాలపల్లి, జగన్నాధపురం, ములకలపల్లి కేంద్రాల్లో దాఖలు చేయొచ్చు. పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీలు, 282 వార్డులకు గాను దంతలబోర ఎస్సీ కాలనీ (స్కూల్), నాగారం, జగన్నాధపురం, కేశవాపురం, బసవతారక కాలనీ, కోడిపుంజులవాగు(స్కూల్), పాయకారియానంబైలు, పాండురంగాపురం, సూరారం, సత్యనారాయణపురం, బంజర (రైతు వేదిక), ఉల్వనూరు కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు డీపీఓ సుధీర్ తెలిపారు. -
.. పోరాటం స్ఫూర్తిదాయకం
ప్రత్యేక తెలంగాణ సాధనకు కేసీఆర్ చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.‘నేను ఊరి నుంచి వచ్చిన, నాకు ఊరి కథలే తెలుసు, నేను ఊరోడిలాగే ఉంటాను. ఊరి సినిమాలే తీస్తాను’, ‘ఏ బట్టలైనా కలర్ పోతాయ్ కదా బ్రో’, ఫ్యాంట్, షర్టుకు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఎందుకు బ్రో’.. అంటూ సాయిలు కాంపాటి చెప్పిన మాటలను ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబుల్లో చూస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ వారైతే ఖుల్లం ఖుల్లం ఉంటారని కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు.. ‘ఏజెన్సీ బిడ్డలు అంతే, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పరు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ‘మాది ఖమ్మం జిల్లానే, ఇల్లెందు మా పక్క ఊరే’ అంటూ ఈ జిల్లాతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఎటైనా వెళ్లాలంటే ఇప్పటికీ ర్యాపిడోనే ఉపయోగిస్తున్నానని సాయిలు చెప్పడం వంటి విషయాలు కూడా వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. -
రెండు గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేత
ములకలపల్లి/జూలూరుపాడు : జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు ములకపల్లి మండలం చాపరాలపల్లి గ్రామ పంచాయతీలకు రెండో విడతలో డిసెంబర్ 14న ఎన్నికలు జరగాల్సి ఉండగా, హైకోర్టు స్టేతో ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాపరాలపల్లి గిరిజన ప్రాంతం కాదని, గతంలో మధిర తాలూకాలో ఉండేదని గ్రామానికి చెందిన పర్వతనేని అమర్నాథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అక్టోబర్ 15న విచారణ చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నవంబర్ 28కి వాయిదా వేసింది. కాగా, ఈ జీపీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ (జనరల్)కు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణకూ ఏర్పాట్లు చేశారు. కాగా దీనిపై స్థానికులు మరోమారు హైకోర్టును ఆశ్రయించగా విచారణను జనవరి 19కి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎన్నిక ప్రక్రియ నిలపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక జూలూరుపాడుకు చెందిన తాళ్లూరి రామారావు.. ఈ పంచాయతీ మైదాన ప్రాంతమని, గతంలో మధిర తాలూకాలో ఉన్నందున ఏజెన్సీ జీపీగా ప్రకటించడం సరి కాదని పేర్కొన్నారు. దీంతో ఇక్కడ డిసెంబర్ 17న జరిగే పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు. హైకోర్టు తుది తీర్పు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పూరేటి అజయ్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలతో అధికారుల నిర్ణయం -
48 గంటల్లో 11 ప్రసవాలు
అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకత చాటుతోంది. అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక బృందం ఆధ్వర్యంలో 48 గంటల్లో 11 మందికి ప్రసవాలు చేశారు. వీటిలో 8 సాధారణ కాన్పులు కావడం విశేషం. మిగిలిన మూడింటిలో శస్త్రచికిత్స చేశారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారు. ఆస్పత్రిలో ఇదే ఏడాది సెప్టెంబర్ మాసంలో ఏకంగా 50 కాన్పులు చేసి రికార్డు నమోదు చేశారు. తాజాగా శుక్ర, శనివారాల్లో 11 ప్రసవాలు చేశారు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలతోపాటు వైద్య సేవలు అందుతున్నాయి. ఖరీదైన టిఫా స్కాన్, డయాలసిస్, రక్తనిధి కేంద్రాలు ఆస్పత్రిలోనే ఉన్నాయి. దీంతో ఆదరణ పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతో ఖరీదుతో కూడిన ప్రసావాలు, ఇతర సౌకర్యాలు ఏరియా ఆస్పత్రిల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలు అందడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో నెలలో 10లోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ సంఖ్య 50 దాటుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందించారు. వైద్యసేవలందించినవారిలో వైద్యులు ప్రకాష్, కృష్ణ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్లు మంగ తాయరమ్మ, సుజాత, వీరాకుమారి, సూపర్వైజర్ బండి సురేష్ ఉన్నారు. అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకత చాటుతోంది. అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక బృందం ఆధ్వర్యంలో 48 గంటల్లో 11 మందికి ప్రసవాలు చేశారు. వీటిలో 8 సాధారణ కాన్పులు కావడం విశేషం. మిగిలిన మూడింటిలో శస్త్రచికిత్స చేశారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారు. ఆస్పత్రిలో ఇదే ఏడాది సెప్టెంబర్ మాసంలో ఏకంగా 50 కాన్పులు చేసి రికార్డు నమోదు చేశారు. తాజాగా శుక్ర, శనివారాల్లో 11 ప్రసవాలు చేశారు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలతోపాటు వైద్య సేవలు అందుతున్నాయి. ఖరీదైన టిఫా స్కాన్, డయాలసిస్, రక్తనిధి కేంద్రాలు ఆస్పత్రిలోనే ఉన్నాయి. దీంతో ఆదరణ పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతో ఖరీదుతో కూడిన ప్రసావాలు, ఇతర సౌకర్యాలు ఏరియా ఆస్పత్రిల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలు అందడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో నెలలో 10లోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ సంఖ్య 50 దాటుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందించారు. వైద్యసేవలందించినవారిలో వైద్యులు ప్రకాష్, కృష్ణ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్లు మంగ తాయరమ్మ, సుజాత, వీరాకుమారి, సూపర్వైజర్ బండి సురేష్ ఉన్నారు. -
హోరాహోరీగా కోలిండియా పోటీలు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో కోలిండియా స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు శనివారం పోటీలను కార్పొరేట్ జీఎం పర్సనల్ (వెల్పేర్ అండ్ సీఎస్సార్) జీవీ కిరణ్కుమార్ ప్రారంభించారు. మొదటి మ్యాచ్లో బీసీసీఎల్జట్టుపై డబ్ల్యూసీఎల్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్లో ఎంసీఎల్పై ఈసీఎల్, మూడో మ్యాచ్లో ఎన్సీఎల్పై ఎస్ఈసీఎల్, నాలుగో మ్యాచ్లో సీసీఎల్పై బీసీసీఎల్ టీమ్, ఐదో మ్యాచ్లో సింగరేణిపై డబ్లుసీఎల్, ఆరో మ్యాచ్లో ఎంసీఎల్పై ఎన్సీఎల్ జట్టు గెలుపొ ందాయి. శుక్రవారం ప్రారంభమైన పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు ఎం.శాలేంరాజు, కోటిరెడ్డి, నారాయణరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్షసూపర్బజార్(కొత్తగూడెం): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ శనివారం సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏజెన్సీల విభాగాల అధికారులతో చర్చించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపట్టాల్సిన, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డీటీలు, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, జీసీసీ, డీసీఎంఎస్ శాఖల ప్రతినిధులు కార్యాచరణను వివరించారు. చికిత్స పొందుతున్న ఆర్టిజన్ మృతిపాల్వంచరూరల్: చికిత్స పొందుతున్న ఆర్టిజన్ కార్మికుడు శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పాండురంగాపురం తండాకు చెందిన ఆజ్మీరా జగ్చందర్(57) శనివారం డ్యూటీకి వెళ్తానంటూ చెప్పి వెళ్లి గడ్డి మందుతాగి వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు గమనించి ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనోవేదనతో గడి మందుతాగి మృతి చెందాడని మృతుడి కుమారుడి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. . కానిస్టేబుల్పై దాడిబూర్గంపాడు: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సారపాకలో విధుల నిర్వహిస్తున్న పోలీస్కానిస్టేబుల్పై సారపాకకు చెందిన గుగులోత్ సోమ్లా అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వద్ద విఽధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రామును మద్యం మత్తులో ఉన్న సోమ్లా అకారణంగా దూషిస్తు దాడికి పాల్పడ్డాడు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా స్ఫూర్తి చాటిన దివ్యాంగులు
సూపర్బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా స్థానిక ప్రగతి మైదానంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. షాట్పుట్లో సందీప్, అనిత, అఖిల్, సాయి కౌశిక్, రవి, జావెలిన్త్రోలో రవి, సావిత్రి, అఖిల్, మోక్షిత్, రన్నింగ్లో సందీప్, అనిత, అఖిల్, నాగరాజు, హేమంత్ చౌదరి, క్యారమ్స్లో శైలజ, సందీప్, ప్రవీణ్, రాజు ప్రథమ స్థానంలో గెలుపొందారు. కార్యక్రమంలో సీడీపీఓ పద్మశ్రీ, పీఈటీలు నరేష్, మంగీలాల్, మదన్, భావ్సింగ్, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలల నిర్వాహకులు ప్రసాద్, అరుణ, నాగలక్ష్మి, గౌతమి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్తోకంగా జరిపించారు. నిత్యకల్యాణంతో పాటు ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నేడు అంతర్గత రాత పరీక్షరుద్రంపూర్ : సింగరేణిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న అభ్యర్థులకు అర్హతల మేరకు యాజమాన్యం ఆదివారం అంతర్గత రాత పరీక్ష నిర్వహించనుంది. జూనియర్ శానిటరీ ఇన్స్పక్టర్ (టీ–ఎస్) గ్రేడ్ డీ 10 పోస్టులకు 28 మంది, జూనియర్ ఇన్స్పెక్టర్ (సెక్యూరిటీ )టీఅండ్ఎస్ గ్రేడ్ డీ 12 ఖాళీలకు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని యాజమాన్యం సూచించింది. ఆత్మవిశ్వాసం పెంచేందుకే మాక్ పరీక్షలుజిల్లా జడ్జి పాటిల్ వసంత్ సూపర్బజార్(కొత్తగూడెం): ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మాక్ పరీక్షలు ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఏపీపీ మోడల్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మాక్ టెస్టులు, అవేర్నెస్ క్లాసులు అభ్యర్థుల భవిష్యత్పై, ముఖ్యంగా న్యాయవాద వృత్తిపై నమ్మకాన్ని పెంపొందించడంలో కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ‘బార్’ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, ఉప్పు అరుణ్ ప్రసాద్, చిన్నికష్ణ, అడపాల పార్వతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి డీఎల్ఈడీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) ప్రథమ సంవత్సర పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ బి.నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 – 25 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 99890 27943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘తలసేమియా’పై అవగాహన కల్పించాలిఅశ్వారావుపేటరూరల్: తలసేమియా వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. శనివారం ఆయన అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, నారాయణపురంలోని రైతు వేదికల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో రక్తహీనత ఏర్పడి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని, ముందుగా గుర్తించి సరైన వైద్య సేవలు పొందితే కొంతమేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు, నారాయణపురం గ్రామస్తులకు తలసేమియా పరీక్షలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత, వైద్యులు వివేక్, పుణ్యశ్రీ, రాందాస్ నాయక్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జ్గా విజయచంద్రారెడ్డిచుంచుపల్లి: బీజేపీ జిల్లా ఇన్చార్జ్గా డాక్టర్ విజయచంద్రారెడ్డిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్వస్థలం హనుమకొండ కాగా, జిల్లాలో రాజకీయ వ్యవహారాలతో పాటు పార్టీ అభివృద్ధి తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని కే.రేగుబల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కె.గంగోలు, కొంగవాగు గుంపు జీపీఎస్ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్, పిల్లలకు వండిన ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రత పాటించాలని, ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే విద్యార్థినులకు భోజనం వడ్డించాలని అన్నారు. బాలికలు ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లొద్దని, ఖాళీ సమయాల్లో కెరీర్ గైడెన్స్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం జీపీఎస్ పాఠశాలలను సందర్శించి, ఉద్దీపకం వర్క్బుక్లోని అంశాలపై పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేగుబల్లి పాఠశాల హెచ్ఎం సావిత్రి, వార్డెన్ పార్వతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయండి
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని డిసెంబర్ 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఐడీఓసీ సమీపంలో ఏర్పాటుచేసిన హెలీపాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. వీవీఐపీల కోసం మినీ బస్సులు ఏర్పాటు చేయాలని పాల్వంచ తహసీల్దార్ను ఆదేశించారు. సింగరేణి మైనింగ్ కాలేజీ నుంచి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందేవరకు జరిగిన చారిత్రక ఘట్టాలు ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయాలని ప్రిన్సిపాల్కు సూచించారు. వీఐపీల స్వాగతం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. సీఎం కాన్వాయ్ ఆగే ప్రతి స్థలం, సభా ప్రాంగణం, శిలాఫలకం వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఆర్డీఓ మధుతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి. పాటిల్ -
అజ్ఞాతంలో అభ్యర్థి
ఇల్లెందు/ఇల్లెందురూరల్ : మండలంలోని సుభాష్నగర్కు చెందిన మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దుతుతో ఆమె సర్పంచ్గా ఎన్నికయ్యారు. తన హయాంలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా గ్రామాభివృద్ధికి కృషి చేశారు. కాగా, ప్రస్తుత ఎన్నికల్లోనూ తమ మద్దతుతో ఆమెనే బరిలోకి దింపుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. అయితే మంగమ్మను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు కూడా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. శుక్రవారం రాత్రి మంగమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, శనివారం సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియలేదని ఆమె భర్త నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా అనుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొనగా, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, మంగమ్మ అదృశ్యం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ నిర్వహించాలని కోరారు. ఆమె వెంట నాయకులు శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక, దాస్యం ప్రమోద్, గిన్నారపు రాజేష్ ఉన్నారు. ఏకగ్రీవం దిశగా అడుగులుచండ్రుగొండ : మండలంలోని మంగయ్యబంజర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ పంచాయతీలో పురుషులు 272, మహిళలు 275 మొత్తం 547 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, సర్పంచ్తో పాటు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని, నిర్మాణ దశలో ఉన్న ఆలయాభివృద్ధికి వారు కృషి చేయాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు సమాచారం. -
అభ ్యర్థులు పోటెత్తారు..
● ముగిసిన ‘తొలి’ నామినేషన్ల ప్రక్రియ ● బరిలో ఉండేవారి జాబితా 3న వెల్లడి చుంచుపల్లి : జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న 159 పంచాయతీలు, 1,436 వార్డులకు నామినేషన్లు పోటెత్తాయి. చివరి రోజు శనివారం మంచి ముహూర్తం కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు పోటీపడ్డారు. ఈనెల 27 నుంచి తొలి విడత నామినేషన్లను 47 కేంద్రాల ద్వారా స్వీకరించారు. తొలిరోజు కొంత మందకొడిగా నమోదైనా, రెండో రోజు నుంచి ఊపందుకున్నాయి. చివరి రోజున అటు సర్పంచ్, ఇటు వార్డు స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కొన్నిచోట్ల రాత్రి 9 గంటల తర్వాత కూడా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు క్యూలో వేచి ఉన్నారు. సాయంత్రం 5 గంటలలోపు ప్రాంగణంలోకి వచ్చిన వారందరినీ అధికారులు అనుమతించడంతో రాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు ప్రతీ కేంద్రంలో ఆర్ఓ, ఏఆర్ఓతో పాటు అదనంగా మరొకరు విధులు నిర్వర్తించారు. కాగా, జిల్లాలో తొలి విడత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. 3న తుది జాబితా.. నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ వంటి ప్రక్రియల అనంతరం డిసెంబర్ 3న బరిలో నిలిచే సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడత కంటే రెండో విడతలో పెద్ద గ్రామ పంచాయతీలు ఉండడంతో ఇక్కడ నామినేషన్లు భారీ ఎత్తున నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణ పోరాటం స్ఫూర్తిదాయకం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ నిర్వహించారు. మొదట ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రేణులతో కలిసి నివాళుర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలోఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణను ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ సమష్టి కృషితో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులను కొనుగోలు చేసే పనిలో కాంగ్రెస్ ఉందని, ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ సరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, కొట్టి వెంకటేశ్వర్లు, సంకుబాపన అనుదీప్, సింధు తపస్వి, రాజుగౌడ్, రావులపల్లి రాంప్రసాద్, తొగరు రాజశేఖర్, బత్తుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రేణులను ఉత్సాహపరిచిన నేతలు దీక్షా దివస్లో వేదికపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నృత్యం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. తెలంగాణ కళాకారులు పాటలు అలరించగా, వనమా తదితరులు చమత్కారాలు, ఛలోక్తులతో శ్రేణులను నవ్వించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర -
బ్యాంక్, పోలీస్ అధికారుల అప్రమత్తత
సూపర్బజార్(కొత్తగూడెం): బ్యాంక్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరం బారిన పడ్డ వ్యక్తి మరో రూ. 5 లక్షలు కోల్పోకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ యాప్లో రూ.10 వేలు, రూ. 20వేలు చొప్పున రెండుసార్లు పెట్టుబడి పెట్టాడు. సైబర్ నేరగాళ్లు బాధితుడిని నమ్మించేందుకు రూ. 40 వేలు బాధితుడి యాప్ అకౌంట్లో డిపాజిట్ చేసి, నగదు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో పూర్తిగా నమ్మిన బాధితుడు మళ్లీ రూ 3.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.7 లక్షలు వచ్చాయని, ఇంకో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మొత్తం రూ. 16 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. బాధితుడు ఇంట్లో బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగూడెం బ్రాంచ్లో తాకట్టుపెట్టి రూ. 5 లక్షలను సైబర్ నేరస్తులకు చెందిన రాజస్థాన్లోని బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేసేందుకు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. పెద్ద మొత్తంలో నగదు ఇతర రాష్ట్రానికి చెందిన అకౌంట్కు బదిలీ చేస్తుండడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ నరేందర్ కొత్తగూడెం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకుకు చేరుకున్న వారు బాధితుడి విచారించి, మోసాన్ని వివరించి రూ. 5 లక్షల నగదు డిపాజిట్ చేయకుండా అడ్డుకున్నారు. అంతకుముందే బాధితుడు సైబర్ నేరగాళ్లకు పంపిన రూ 3.85 లక్షలకు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందిని, మేనేజర్ నరేందర్ను శనివారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డీఎస్పీ బి.అశోక్, సీఐ ఎస్.జితేందర్లు సన్మానించారు. సైబర్ క్రైమ్ బాధితుడు రూ. 5 లక్షలు కోల్పోకుండా చర్యలు -
అవగాహన పెంచుకోవాలి
భద్రాచలంఅర్బన్: సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అధిక లాభాలు ఆశ చూపించి ఓ మహిళ ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు రూ. 1.48 కోట్ల పెట్టుబడి పెట్టించి మోసం చేసిందని తెలిపారు. బాధిత వ్యక్తి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సుమారు రూ. 7.58 లక్షలను హోల్డ్లో పెట్టినట్లు వివరించారు. జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికభద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన విద్యార్థి మడిపల్లి నిపుణ్ ఉమ్మడి జిల్లా అండర్–14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ ఎంపిక పోటీల్లో నిపుణ్ ప్రతిభ కనబరిచాడు. జిల్లా జట్టుకు ఎంపికై న నిపుణ్ను త్రివేణి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. మోడల్ ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేయండి చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మోడల్ ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ పీడీ ఆర్.రవీంద్రనాథ్ తెలిపారు. శుక్రవారం చండ్రుగొండలో పర్యటించిన ఆయన కార్యాలయాల ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 21 మండలాల్లో మోడల్ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. ఇల్లెందు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో అసంపూర్తిగా ఉన్నాయన్నారు. మోడల్ ఇళ్లను మండల హౌజింగ్ కార్యాలయాలుగా ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎంపీడీఓ బయ్యారపు అశోక్తో సమావేశమై మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. ‘ఎర్త్ సైన్సెస్’లో సంబరాలుకొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 2న యూనివర్సిటీని అధికారికంగా ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు స్వాగత సూచకంగా విద్యార్థులు సంబురాలు చేశారు. విద్యా సంవత్సరంలో తొలి అడుగు వేసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధాపకులతో కలిసి స్వాగత సభ నిర్వహించారు. రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి ఎగరేసి, భవిష్యత్తు ఆశయాలకు ప్రతీకగా నిలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీ జగనోహ్మన్రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఘనంగా చెకుముకి సంబురాలు కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం బాబూక్యాంపు జెడ్పీహెచ్ఎస్లో జిల్లాస్థాయి చెకుముకి సంబురాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి డీఈఓ నాగలక్ష్మి హాజరై మాట్లాడారు. చెకుముకి పోటీలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బి.బాలాజీ, జిల్లా సహాయ పరీక్షల కమిషనర్ మాధవరావు, హెచ్ఎం, డీసీఈబీ కార్యదర్శి బి.నీరజ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నేడు దీక్ష దివస్..సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్ష దివస్ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ప్రగతి మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి, 10.30 గంటలకు పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి.. 10.45 గంటలకు దీక్షదివస్ ఉంటుందని వివరించారు. -
‘ఏకగ్రీవ’ ప్రోత్సాహమేది?
● నజరానాలు ప్రకటించని రాష్ట్ర సర్కారు ● రూ.10 లక్షల హామీని అమలు చేయని గత ప్రభుత్వం ● ఈసారి ఏకగ్రీవ ఎన్నికపై ఆసక్తి చూపని గ్రామపంచాయతీలుచుంచుపల్లి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికల జరిగే సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అభ్యర్థులకు ప్రచార, ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ ఖర్చు ఉండదు. గ్రామ పంచాయతీ పాలనలో అవినీతి తక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది. గ్రామస్తులు సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవమైతే ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. పాలకవర్గాల గడువు ఐదేళ్లు, గడువు ముగిసి మరో రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఆ నిధులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవాలపై స్థానిక నాయకులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ నజరానాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకరిద్దరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం స్పష్టత లేదు. గత ప్రభుత్వాన్ని నమ్మి అనేక పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులు రాక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయామని మాజీ ప్రతిప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వమైనా ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించి, పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని పలువురు కోరుతున్నారు. ఎమ్మెల్యే హామీలూ అంతే.. 2019 జనవరిలో స్థానిక ఎన్నికలు జరగ్గా, 479 గ్రామ పంచాయతీల్లో 43 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సర్పంచులతోపాటు వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు రూ.4.30 కోట్ల నిధులు రావాల్సి ఉంది. గత పాలవకర్గ సభ్యులు పదవీకాలం అంతా నజరానాల కోసం ఎదురుచూసి నిరాశ చెందారు. ఏకగ్రీవ పంచాయతీలకు అప్పట్లో ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.5 లక్షలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నాం. గతంలో మాదిరిగా ఈసారి ఏకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. –సుధీర్, డీపీఓఅశ్వాపురం మండలం : నెల్లిపాక, చర్ల: పెద్దిపల్లి, కుర్నపల్లి, బోదనెల్లి, దుమ్ముగూడెం: కొత్తపల్లి, కోయనరసాపురం, అచ్చుతాపురం, పెద్ద కమలాపురం, దబ్బనూతల, మణుగూరు : బుగ్గ, ములకలపల్లి : రామచంద్రాపురం, పాత గుండాలపాడు, పాల్వంచ : బంజర, చంద్రాలగూడెం, సత్యనారాయణపురం, సోములగూడెం, బిక్కుతండా, చండ్రుగొండ: దామరచర్ల, చండ్రుగొండ, దమ్మపేట : అల్లిపల్లి, అకినేపల్లి, మందలపల్లి, పూసుకుంట, వడ్లగూడెం, గండుగులపల్లి, సీతారాంపురం, గణేష్పాడు, అశ్వారావుపేట : అచ్యుతాపురం, మొద్దులమాడ, పినపాక: భూపాలపట్నం, సీతంపేట, పాత రెడ్డిపాలెం, కరకగూడెం : కొత్తగూడెం, సమత్ మోతే, ఆళ్లపల్లి : దొంగతోగు, అడవి రామవరం, గుండాల : దామర తోగు, టేకులపల్లి : మద్రాస్తండా, సుక్కాల బోడు, యర్రగూడెం, పెట్రాంచెలక, లక్ష్మీదేవిపల్లి : గడ్డిగుట్ట, రేగళ్ల గ్రామ పంచాయతీలు -
బీఆర్ఎస్కు పలువురి రాజీనామా
అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం బీఆర్ఎస్ నాయకులు కొందరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి మెచ్చా నాగేశ్వరరావు వచ్చి చేరినప్పటి నుంచి టీడీపీలో తనతోపాటు పని చేసిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని.. చివరికి పార్టీ అధికారం కోల్పోయినా.. తీరు మారలేదని.. జిల్లా పార్టీ నాయకులకు చెప్పుకున్నా.. ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా ఆరోపణలు చేసినప్పటికీ.. అగ్రనాయకత్వం ఏమాత్రం జోక్యం చేసుకున్నట్లు లేదు. మండలంలోని దురదపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రాజును వినాయకపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఈనెల 26న జరిగిన పార్టీ సమావేశంలో ప్రతిపాదించారు. అందుకు ససేమిరా అన్న మాజీ టీడీపీ నాయకులు వేరే వ్యక్తిని ప్రతిపాదించారు. దీంతో రాజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వినాయకపురం, దురదపాడు, ఆసుపాక గ్రామాల్లో పట్టున్న బీసీ సామాజిక వర్గం నాయకులంతా శుక్రవారం బీఆర్ఎస్ను వీడారు. రాజీనామా చేసిన వారిలో బిర్రం వెంకటేశ్వరరావు, ఉప్పల ప్రసాద్, మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, మాజీ ఎంపీటీసీ మారుతి వసంతరావు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పల మురళి, లోకం సాంబశివరావు, మారుతి లక్ష్మణ్రావు తదితరులున్నారు. -
అభ్యర్థుల్లో ‘నోటా’ దడ..!
చుంచుపల్లి/అశ్వారావుపేటరూరల్: ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబో)ను ఏర్పాటు చేశారు. క్రమంగా అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. విజేతకు, ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ఏదైన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే అక్కడ ఆ గెలుపు చెల్లదు. అక్కడ తిరిగి ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవ్వరూ తమకు నచ్చకపోతే ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల కొన్నిసార్లు నిజమైన అభ్యర్థికి నష్టం జరిగే ఆవకాశం ఉంటుంది. అలాగే, సరికాని వ్యక్తి అందలం ఎక్కే ప్రమాదం పొంచి ఉంది. వీటన్నింటికీ సరైనదే నోటా (నమ్ ఆఫ్ ది ఎబో). 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటా అవకాశాన్ని ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 లక్షల ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ప్రాధాన్యం విస్తృతంగా పెరుగుతూ వచ్చింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఎక్కువగానే ఓట్లు పోలయ్యాయి. ఐదు నియోజకవర్గాల్లో ఏకంగా నోటాకు 6,785 ఓట్లు పడ్డాయి. భద్రాచలంలో అత్యధికంగా 1,672, కొత్తగూడెంలో 1,427, అశ్వారావుపేటలో 1,363, ఇల్లెందులో 1,418, పినపాకలో 905 చొప్పున ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019 పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి 2019 జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తొలిసారిగా నోటాకు స్థానం కల్పించింది. సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ (గులాబీ), వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ (తెలుపు) చివరలో ఈ నోటా గుర్తు ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎవరూ నచ్చకపోయినా ఓటర్లు నోటాకు ఓటు వేయవచ్చు. ఇందుకోసం సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల్లో ఇప్పటికే ఈ గుర్తును ముద్రించారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు బ్యాలెట్ పేపర్లో తమకు కేటాయించిన గుర్తుల అనంతరం చిట్టచివర గుర్తుగా నోటాను చేర్చారు. ఈవీఎం మిషన్లో మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోని బ్యాలెట్ పేపర్లో కూడా అభ్యర్థుల గుర్తుల జాబితా తర్వాత చివరగా నోటా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రతీ ఓటుకు అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఒక్కో ఓటును దక్కించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ పరిధిలో ఉన్న ఓటర్లు ఎంతమంది, ఎంత మంది తమకు ఓటేస్తే గెలుస్తామనే సమగ్రమైన నివేదికను రూపొందించుకుని అభ్యర్థులు బరిలో నిలుస్తారు. ఈ ఎన్నికల సందర్భంగా గ్రామాలకు దూరంగా ఉన్న ఓటర్లను కూడా ఓటేసేందుకు రప్పించుకుంటారు. ఇలాంటి సమయంలో బ్యాలెట్లోకి వచ్చిన నోటా దెబ్బతీసే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండు ఓట్లు కూడా చాలా మంది గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో నోటా వల్ల తాము నష్ట పోతామనే ఆందోళనలో పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులు ఉన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలను గావించారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అ భిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. అమ్మవారి సేవలో..పెద్దమ్మతల్లి ఆలయాన్ని కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓగా శ్రీధర్భద్రాచలంఅర్బన్: భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓగా శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చర్ల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతి కల్పించి భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓగా నియమించారు. బాధ్యతలు చేపట్టాక ఐటీడీఏ పీఓ రాహుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాస్థాయి ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాంప్రసాద్ (ఇల్లెందు సీఐ), ప్రధాన కార్యదర్శిగా ఎం.శేఖర్ (సత్తుపల్లి సీఐ), కోశాధికారిగా ఎం.ప్రసాద్ (పాల్వంచ సీఐ) ఉపాధ్యక్షులుగా ఎం.ప్రశాంతి (సింగరేణి సీఐ), అసోసియేట్ అధ్యక్షులుగా జె.రమేశ్ (కొత్తగూడెం ఎస్ఐ), జాయింట్ కార్యదర్శిగా ఎస్.రమేశ్ (నేలకొండపల్లి సీఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.వసంతలక్ష్మి (సింగరేణి ఎస్ఐ) ఎన్నికయ్యారు. అలాగే, ఈసీ మెంబర్లుగా షేక్ రెహమున్సీసా (కొత్తగూడెం ఎస్ఐ), ఎస్.జయశ్రీ(ఖమ్మం–1 ఎస్ఐ), ఎం.సాయిరాం (వైరా ఎస్ఐ)ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ బాధ్యులు ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు నాగేందర్రెడ్డి, జానయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, 2 సీఐలు కృష్ణ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీలు షురూ..
రుద్రంపూర్: కోలిండియాస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని ఎనిమిది బొగ్గు ఉత్పత్తి సంస్థల జట్లు హాజరయ్యాయి. కొత్తగూడెంలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో మూడురోజులపాటు పోటీలు జరగనున్నాయి. ఇంటర్ కంపెనీ టోర్నీని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. డబ్ల్యూసీఎల్, సీసీఎల్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, ఎస్ఈసీఎల్, ఈసీఎల్, ఎన్సీఎల్, ఎంసీఎల్ జట్ల క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. నేర్పుతో రాణించాలి క్రీడాకారులు నేర్పుతో ఆటలో రాణించాలని సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ సూచించారు. మొదటి రోజు పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు ప్రతీ రోజు గంటసేపు ఏదో ఒక ఆట ఆడాలని, తద్వారా చురుకుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈఅండ్ఎం) తిరుమలరావు, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలేంరాజు, కార్పొరేట్ వెల్ఫేర్ జీఎం జీవి కిరణ్కుమార్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, త్యాగరాజన్, ఎండీ రజాక్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు సింగరేణి హవా..మొత్తం 8 జట్లు హాజరుకాగా, నాలుగు టీమ్ల చొప్పున ఏ, బీ విభాగాలు విభజించి పోటీలు నిర్వహించారు. సింగరేణి జట్టు రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. మొదటి మ్యాచ్లో బీసీసీఎల్ జట్టుపై సింగరేణి జట్టు, రెండో మ్యాచ్లో ఈసీఎల్పై ఎస్ఈసీఎల్, మూడో మ్యాచ్లో సీసీఎల్పై డబ్ల్యూసీఎల్ జట్టు, నాలుగోమ్యాచ్లో ఈసీఎల్పై ఎన్సీఎల్, ఐదో మ్యాచ్లో సీసీఎల్పై సింగరేణి, ఆరో మ్యాచ్లో ఎంసీఎల్పై ఎస్ఈసీఎల్ జట్టు గెలిచాయి. -
అక్కడ ‘పంచాయతీ’ ప్రత్యేకం
ఇల్లెందురూరల్: స్థానిక సమరంలో చల్లసముద్రం గ్రామపంచాయతీది ప్రత్యేక స్థానం. ఇక్కడ స్థానిక పోరు పార్టీల మధ్య కాకుండా వర్గాల వైరంగా కొనసాగడం కొత్తేమీ కాదు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు అఖిల పక్ష ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే అనవాయితీ 18 ఏళ్ల తరువాత మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇన్నేళ్లు కాంగ్రెస్ జెండా మోసిన నేతలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొందరు నేతల మధ్య పొసగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పాత నేతలు, మరికొందరు కలిసి న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్ నేతలతో రెండు రోజులపాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ రెబల్స్ నిర్ణయానికి మద్దుతుగా నిలిచిన ఆయా పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిపేందుకు ముందుకొచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కాంగ్రెస్ అసమ్మతి నేతలు, బీఆర్ఎస్, న్యూడెమోక్రసీ నేతలు శుక్రవారం రాత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. 18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో అధికార పక్షంగా ఉన్న న్యూడెమోక్రసీకి వ్యతిరేకంగా అప్పటి కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై పంచాయతీ బరిలో నిలిచి, విజయం సాధించారు. మళ్లీ నేడు అధికార పార్టీ (కాంగ్రెస్) ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు, అధికార కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఒక్కటవడం చల్లసముద్రంలో చర్చనీయాంశంగా మారింది. రసవత్తరంగా చల్లసముద్రం రాజకీయం -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
బూర్గంపాడు/మణుగూరు రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాలను శుక్రవారం అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి జమలారెడ్డి, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య పరిశీలించారు. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, సారపాక, లక్ష్మీపురం, మోరంపల్లిబంజర గ్రామపంచాయతీలు, మణుగూరు మండలంలోని పలు నామినేషన్ల కేంద్రాలను వారు సందర్శంచారు. నిబఽంధనలకు అనుగుణంగా పత్రాలను సమర్పిస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయ వివరాలను పారదర్శకంగా, నిర్దిష్టంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీఓ బాలయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వసతి కల్పనకు చర్యలు తీసుకోండి..
భద్రాచలం: మిథిలా స్టేడియంలోని ఆడిటోరియం కింది భాగంలో ఉన్న హాళ్లలో భక్తులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు వసతి కోసం ఆడిటోరియం కింద ఉన్న హాళ్లను వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్రావు, ఈఈ రవీందర్, ఏఈఓలు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, మిథిలా స్టేడియం కింది భాగంలో ఉన్న గదులు నిరుపయోగంగా ఉండటంపై సాక్షి గతంలోనే కథనం ప్రచురించింది. తలసేమియా రహిత జిల్లాగా మార్చాలి.. దుమ్ముగూడెం: తలసేమియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. శుక్రవారం బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్, సీసీఎంబీ (సీఎస్ఆర్ – సీసీఎంబీ), తపడియా డయాగ్నోస్టిక్స్, సోషల్ వెంచర్ పార్ట్నర్స్ ఇండియా (ఎస్వీపీ) సంస్థల నేతృత్వంలో మండలంలోని మరాయిగూడెంలో తలసేమియా శిబిరం నిర్వహించారు. 120 మందికి తలసేమియా క్యారియర్ స్క్రీనింగ్ నిర్వహించారు. నర్సాపురం రైతువేదికలో జరిగిన మరో కార్యక్రమంలో సికిల్సెల్ ఎనీమియాకు సంబంధించి ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. పలువురి నుంచి నమూనాలు సేకరించారు. అనంతరం మందులు అందించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెంను తలసేమియా రహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భవిష్యత్లో విద్యాసంస్థలు, గ్రామాల్లో మరిన్ని స్క్రీనింగ్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. కార్యక్రమంలో సౌరభ్శర్మ, రఘు, మంగరాజు, కృష్ణవంశీ, సందీప్ కవేటి, గిరిరాజ్చందక్, తుకారాంరాథోడ్, మధువరన్, వివేక్రామ్, తదితరులు పాల్గొన్నారు. ఆదాయ వనరులు పెంచుకోవాలి బూర్గంపాడు: సాగులో నూతన పద్ధతులు ఆవలంబించి ఆదాయ వనరులను పెంచుకోవాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. మోరంపల్లిబంజరలోని మోడల్ డెమో ఫామ్ హౌస్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహంపై దృష్టి సారించేందుకు రూపొందించిన ఈ మోడల్ డెమో ఫామ్ జిల్లాలో ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం పందిరి విధానంలో పూర్తిగా సేంద్రియ ఎరువులతో సాగు చేసిన సొరకాయ, బీరకాయ, కీరదోస పంటలను కలెక్టర్ పరిశీలించారు. పూతదశలో ఉన్న కాకర, టమాటా, బంతిపూల పంటను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఈజీఎస్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన డీసీసీ అధ్యక్షురాలు
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న శుక్రవారం హైదరాబాద్లో కలిసి సన్మానించారు. మహేష్గౌడ్ను కలిసిన వారిలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ ఉన్నారు. గాంధీపథం జిల్లా కన్వీనర్ చింతలచెర్వు గెర్షోము కూడా పీసీసీ అధ్యక్షుడిని కలిసి పార్టీ కోసం కష్టపడ్డవారికి పదవులు ఇవ్వాలని కోరారు. గాంధీపథం రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి పదవి ఇవ్వాలని పేర్కొన్నారు. విత్తన బిల్లుపై చర్చలో ఆదర్శ రైతులు..సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు–2025పై సంప్రదింపులు, చర్చల కోసం సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఇద్దరు ఆదర్శ రైతులు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చర్చల్లో పాల్గొన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్, ఆదర్శ రైతులు గొట్టిపాటి వెంకటేశ్వరరావు, గాదె నర్సిరెడ్డి తమ అభిప్రాయాలను తెలిపారు. ‘తానా’ బాలసాహిత్య భేరికి విద్యార్థిని ఎంపికఅశ్వారావుపేటరూరల్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక బాల సాహిత్యభేరికి అశ్వారావుపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కంభంపాటి శృతి ఎంపికై ంది. ఈ మేరకు హెచ్ఎం హరిత శుక్రవారం వివరాలు వెల్లడించారు. 9వ తరగతి విద్యార్థిని అంతర్జాతీయ బాల సాహిత్య సమ్మేళనానికి ఎంపికై ందని తెలిపారు. కథ, వచన కవిత్వం, గేయ, పద్య విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా, మూడు నిమిషాలపాటు గేయం వినిపించే అవకాశం శృతికి దక్కిందని అన్నారు. ఈ నెల 30న సాహిత్య భేరి జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, నిర్వాహకులు తోటకూర ప్రసాద్, సమన్వయకర్త శ్రీనివాస్, సీఆర్పీ ప్రభాకరాచార్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మానవులు విలువలతో జీవించాలి
● ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజలందరూ క్రీస్తు బాటలో పయనిస్తూ ప్రేమ,సేవ, నీతినిజాయితీ వంటి విలువలతో జీవించాలని ఖమ్మం పీఠాధిపతి బిషప్ సగిలి ప్రకాష్ సూచించారు. శుక్రవారం 11 విచారణలకు చెందిన వారంతా కొత్తగూడెంలోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో జూబ్లీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలైన సందర్భంగా జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత గురువులు అమృత్ రాజ్, జయానంద్, జయరాజు, మేడికొండ స్లీవప్ప తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా పండితాపురం సంతకు అక్రమంగా తరలిస్తున్న పశువులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దొంగల జగ్గారం నుంచి పండితాపురం సంతకు ఓ బొలేరో వాహనంలో ఒక ఆవు, 8 కోడె దూడలను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జిసెంటర్లోని చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. ఒకరిపై కేసు నమోదు చేశామని టౌన్ పోలీసులు తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి ● కేసు నమోదు.. దుమ్ముగూడెం: మండలంలోని పాతనారాయణరావుపేట గ్రామానికి చెందిన కూరం సమ్మయ్య (48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. సీఐ వెంకటప్పయ్య శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్లు విక్రయించిన డబ్బు కోసం.. సమ్మయ్య ఈ నెల 26వ తేదీన వ్యాపారి రామకృష్ణ వద్దకు వెళ్లాడు. అనంతరం గ్రామానికి చెందిన ఇర్ప నగేశ్తో కలిసి ద్విచక్రవాహనంపై సిరిగుండం వెళ్లి, కోడిని కొని, ఇంటికి వస్తున్నారు. సమ్మయ్య బాగా మద్యం సేవించి ఉండటంతో ఆయన్ను మధ్యలో వదిలేసి నగేశ్ ఇంటికి వచ్చాడు. సమ్మయ్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరాతీయగా ఎర్రకాలువలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటప్పయ్య తెలిపారు. చలిమంట అంటుకుని వృద్ధురాలు మృతి తల్లాడ: చలి నుంచి ఉపశమనం కోసం మంట వద్ద కూర్చున్న వృద్ధురాలికి చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందింది. మండలంంలోని రామానుజవరం గ్రామానికి చెందిన కిన్నెర వెంకమ్మ(85) ఈనెల 25వ తేదీ రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చలిమంట వేసింది. అక్కడ కూర్చున్న ఆమె చీరకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడగా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చోరీ కేసులో పలువురి అరెస్ట్..
సుజాతనగర్: చోరీ కేసులో దంపతులు, ఇతర నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మండలంలోని వేపలగడ్డలోని లింగం మాలకొండారెడ్డి ఇంట్లో మూడేళ్లుగా పనిచేస్తున్న సుజాతనగర్కు చెందిన కావేటి కృష్ణవేణి.. సుమారు 7,139 గ్రాముల వెండి వస్తువులు, 11.9 గ్రాముల బంగారు వస్తువులను చోరీ చేసింది. వాటిని భర్త కావేటి రాంబాబుతో కలిసి ఆమె కొత్తగూడెం చిన్నబజారులోని గాలిపెళ్లి మాధవాచారి, ఉప్పుల శోభన్చారి ద్వారా విజయదుర్గ జ్యుయలరీ, మారుతి, రశ్మిత, శ్రీరాజరాజేశ్వరి గోల్డ్ వర్క్ షాప్లలో విక్రయించారు. కొండారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, చోరీ చేసిన కృష్ణవేణి, ఆమె భర్త రాంబాబు, మాధవాచారి, శోభన్చారి, గోల్డ్ షాప్ యజమానులు కోటేపల్లి గురునాథ్, బసవపాత్రుని అమర్నాథ్, పొడిశెట్టి రాజేంద్రప్రసాద్, రౌతు సన్యాసిరావును చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.4,61,612 ఉంటుందని ఆయన వివరించారు. కాగా, కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమాదేవి, సిబ్బంది శోభన్ను డీఎస్పీ రెహమాన్ అధినందించారు. -
విద్యార్థులపై దృష్టి సారించాలి
దమ్మపేట : ప్రాథమిక స్థాయి విద్యలో వెనుకబడిన కొండరెడ్ల విద్యార్థులపై, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కొండరెడ్ల గ్రామం పూసుకుంటను ఆయన సందర్శించారు. గ్రామంలోని సోలార్ లైట్లు, పామాయిల్ తోటలను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పొందాలని సూచించారు. ఇటీవల కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. అనంతరం గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారి ఉదయ్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ -
ఆస్పత్రి ఎదుట ఆందోళన
పాల్వంచ: వైద్యురాలి నిర్లక్ష్యంతో ప్రసవం సమయంలో పసికందు మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని దమ్మపేటరోడ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి గర్భిణి కుంజా భవానీని తీసుకొచ్చారు. పురిటినొప్పులు ఎక్కువ అవుతున్నప్పటికీ వైద్యురాలు సకాలంలో రాకపోవడంతో ప్రసవ సమయంలో పసిపాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం డబ్బులు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందని, దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతో వారు సహాయం అందిస్తామని తెలపడంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని ఆరోపణ -
ఎన్నికల గుర్తులు ఇవే
భద్రాచలంఅర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎన్నికల అధికారులు వెల్లడించారు. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్క్, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణం, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. -
రెండో రోజు జోరుగా నామినేషన్లు
సర్పంచ్ స్థానాలకు 116, వార్డులకు 370.. చుంచుపల్లి: తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకుంది. జిల్లాలో శుక్రవారం రెండో రోజు ఎనిమిది మండలాల పరిధిలో 486 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 116 మంది, వార్డు స్థానాలకు 370 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో శనివారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా రెండు రోజులకు కలిపి సర్పంచ్, వార్డు స్థానాలకు 664 నామినేషన్లు వచ్చాయి. దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు 27 నామినేషన్లు, వార్డులకు 37 నామినేషన్లు, అశ్వాపురంలో సర్పంచ్కు 14, వార్డులకు 51 నామినేషన్లు, చర్లలో సర్పంచ్కు 21, వార్డులకు 29, భద్రాచలంలో వార్డులకు 16, బూర్గంపాడులో సర్పంచ్కు 15, వార్డులకు 38, కరకగూడెంలో సర్పంచ్కు 4, వార్డులకు 4, మణుగూరులో సర్పంచ్కు 14, వార్డులకు 72, పినపాకలో సర్పంచ్కు 21, వార్డులకు 123 నామినేషన్లు దాఖలయ్యాయి. -
కిన్నెరసానికి పర్ణశాల జింక
పాల్వంచరూరల్: దారితప్పి మేకల గుంపులో కలిసి వచ్చిన జింక పిల్లను కిన్నెరసాని డీర్ పార్కులో వదిలారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో మేకల కాపరి మేకలను మేతకోసం అడవికి తోలుకెళ్లగా, ఓ జింక పిల్ల మందలో కలిసి వచ్చింది. కాపరి రెండు రోజుల క్రితం తీసుకొచ్చి కిన్నెరసానిలోని వైల్డ్లైఫ్ సిబ్బందికి అప్పగించారు. జింక పిల్లను రెండురోజులపాటు ప్రత్యేక గదిలో ఉంచామని, గురువారం డీర్ పార్కులో వదిలామని ఎఫ్డీఓ బాబు తెలిపారు. పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముత్తయ్యపాల్వంచరూరల్: మండల పరిధిలోని యానంబైల్ గ్రామానికి చెందిన, మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య పెరిక సంఘం (పురిగిరి క్షత్రియ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులను గురువారం ఆయన కలిశారు. పెరిక కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మేడారానికి ప్రత్యేక బస్సులుచుంచుపల్లి: కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతీ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క–సారలమ్మ దేవతలను దర్శించుకునే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 30న ఉదయం 7 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి పాల్వంచ, మణుగూరు, ఏటూరు నాగారం, తాడ్వాయి మీదుగా మేడారానికి ఉదయం 11.15 చేరుకుంటుందని, తిరిగి మధ్యాహ్నం 12.30గంటలకు మేడారంలో తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ. 220, పిల్లలకు రూ.110 చెల్లించాలని తెలిపారు. వివరాలకు 9959225982 నంబర్లో సంప్రదించాలని కోరారు. నేడు, రేపు వైద్య శిబిరాలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో సికిల్సెల్, తలసేమియా బాధితులకు శుక్ర, శనివారాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శుక్రవారం దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం రైతువేదికలో, శనివారం అశ్వారావుపేట రైతువేదిక(నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన), చుంచుపల్లి మండలం రామవరం రైతు వేదికలో శిబిరాలు ఉంటాయని వివరించారు. హైదరాబాద్కు చెందిన వైద్యనిపుణులు హాజరై నిర్ధారణ, వైద్య సలహాలు, చికిత్స పద్ధతులు వివరిస్తారని తెలిపారు. మెడికల్ కార్డులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
బూర్గంపాడు: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు. బూర్గంపాడు మండలంలో నామినేషన్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల సెట్ను క్షుణ్ణంగా పరిశీలించాకే స్వీకరించాలని, ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య ఉన్నారు. ఐటీడీఏలో పరిశీలన.. భద్రాచలంటౌన్ : ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డి గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించాక మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. తొలుత ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ అశోక్ ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎస్ఓ ప్రభాకర్, చంద్రమోహన్, ఆదినారాయణ, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి, రాందాస్, పోశాలు, భాస్కర్ పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన అబ్జర్వర్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సర్వేశ్వర్రెడ్డి, లావణ్య కలెక్టర్ జితేష్ వి పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి కలెక్టర్ పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి -
పల్లెకు పైసలెలా వస్తాయంటే..
పంచాయతీలకు మూడు రకాలుగా ఆదాయం ● సొంతవనరులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆ నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన కరకగూడెం: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇందుకోసం గ్రామ పంచాయతీలు ప్రధానంగా సొంత వనరులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నుంచి నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్సార్ నిధులు కూడా మంజూరవుతాయి. సొంతవనరులు పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. గృహ పన్ను, నీటి పన్ను, వృత్తి (వ్యాపారాలు, వృత్తులపై) పన్ను, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ ద్వారా, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులుఅద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వ సాధారణ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీలు అమలుకు/ ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవిపారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్యం,ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. ఖర్చులు ఇలా.. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణకు, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ–గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రా మాభివృద్ధిలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. -
లెక్క తప్పితే వేటే..
● నామినేషన్లు దాఖలు నుంచే పరిగణనలోకి.. ● జనాభా ప్రాతిపదికన వ్యయ ఖర్చులు ● సర్పంచ్ అభ్యర్థి పరిమితి రూ.2.50 లక్షలు ● 2019 ఎన్నికల్లో 292 మందిపై అనర్హత వేటుచుంచుపల్లి/భ ద్రాచలం అర్బన్ : పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. గురువారం నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు నిబంధనలను విధించింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించింది. ఎన్నికల ప్రచారానికి పెట్టే ప్రతీ పైసకు కచ్చితంగా లెక్కలు సమర్పించాలని సూచించింది. ఈసీ ఇచ్చిన పుస్తకాల్లో అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలు నమోదు చేయాలి. పరిమితికి మించి ఖర్చు చేస్తే వేటు వేయనుంది. 2019 ఎన్నికల సందర్భంగా సకాలంలో లెక్కలు తెలపని 292 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపొందిన వారు 96 మంది ఉన్నారు. వారి పదువులు రద్దు కాగా, ఓడిపోయిన వారు మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా వేటు పడింది. ఈసీ నిర్ణయించిన ధరల ప్రకారమే.. గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుకు పోటీ చేసే అభ్యర్థుల తరఫున రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును కూడా వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఖర్చుపై ఎప్పటికప్పుడు సర్వైలెన్స్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, వీడియోలు, ఫొటోల ద్వారా లెక్కిస్తారు. ప్రచార సామగ్రికి ఎన్నికల సంఘం ముందుగానే ధరలు నిర్ణయించగా.. దాని ప్రకారమే అభ్యర్థుల ఖర్చులు చూపాల్సి ఉంటుంది. నామినేషన్ సమర్పణ నుంచి పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు విడతల్లో అధికారులు తనిఖీ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లోగా వ్యయ వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు రెండు రోజుల ముందే ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి దాని ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో వార్డు సభ్యులు రూ.30 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు పెట్టొచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉంటే వార్డు సభ్యులు రూ. 50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు వెచ్చించే అవకాశం ఉంది.పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఖర్చు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రతీ పైసా నమోదు చేసుకోవాలి. ఖర్చుల వివరాలను రెండు రోజులకోసారి ఎంపీడీఓ కార్యాలయంలో తెలియజేయాలి. లెక్కలు చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈసీ నిబంధనల మేరకు అనర్హత వేటు పడుతుంది. – కె.సంజీవరావు, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు -
ప్రశాంత ఎన్నికలకు చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 6 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు, 6 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు, 4 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. డ్యూటీ పాస్పోర్ట్ అందుకున్న వెంటనే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సిబ్బంది సంబంధిత ఇనన్చార్జ్ అధికారిని సంప్రదించాలని ఆదేశించారు. రిలీవర్ వచ్చే వరకు డ్యూటీ స్థలాన్ని విడిచి వెళ్లకూడదని తెలిపారు. తనిఖీ సమయంలో సమయం, వాహనం నంబర్, ప్రయాణ ఉద్దేశం, తీసుకున్న చర్యతో సహా రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నా రు. నగదు, మద్యం, బహుమతులు, బంగారం లేదా అనుమానాస్పద వస్తువులు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపించాలని పేర్కొన్నారు. తనిఖీ, స్వాధీనం చేసే మొబైల్తో వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వయం పాటిస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో జరిగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. ఎస్పీ రోహిత్రాజు -
అభివృద్ధికి తొలిమెట్టు.. సైన్స్ఫేర్
కొత్తగూడెంఅర్బన్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు అభివృద్ధి చెందేందుకు సైన్స్ఫేర్ తొలిమెట్టని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొత్తగూడెం సెయింట్ మెరీస్ పాఠశాలలో మూడు రోజులుగా సాగుతున్న సైన్స్ఫేర్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి, అవగాహన పెరగడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా చూడాలని, తాను కూడా స్కూల్లో చదివేటప్పుడు సైన్స్ఫేర్లో పాల్గొంటే బహుమతి రాలేదని, అయినా తాను బాధ పడలేదని అన్నారు. జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలిచేదాకా ప్రయత్నించ్చాలని సూచించారు. డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్, విజ్ఞానాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రయోగాలన్నీ పాఠశాల స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి సంపత్కుమార్ మాట్లాడుతూ ఏడు విభాగాలలో 649 ప్రాజెక్టులు, ఇన్స్పైర్ విభాగంలో 84.. మొత్తం 733 ప్రయోగాలు ప్రదర్శించామని వివరించారు. ఇందులో రాష్ట్రస్థాయి సైన్స్ఫేర్కు 26, ఇన్స్పైర్ పోటీలకు 9 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని చెప్పారు. కాగా, సైన్స్ఫేర్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెమెంటో, సర్టిఫికెట్లను, పాల్గొన్న ప్రతీ విద్యార్థి, గైడ్ టీచర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన అధికారులు నీరజ, నాగరాజశేఖర్, సైదులు, సతీష్, ఎంఈఓలు మధురవాణి, బాలాజీ, ఝుంకీలాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
తేమతోనే కొర్రీలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆరుగాలం కష్టించి రైతులు వ్యవసాయం చేస్తుండగా.. పంటలు అమ్ముకునే సమయంలో సరైన అవగాహన లేక ప్రతీసారి నష్టపోతున్నారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో అటు రైతు వేదికల ఇన్చార్జ్లు, ఇటు వ్యవసాయ అధికారులు నామ్కే వాస్తేగా మారుతున్నారే తప్ప వారికి ఎలాంటి సాయం చేయడం లేదు. దీంతో మద్దతు ధరలో సగానికి సగం రైతుల ఖాతాల్లో కాకుండా దళారుల జేబుల్లోకి చేరుతోంది. 12 శాతానికి మించితే.. పత్తి కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. అమ్మకానికి తెచ్చిన పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. 8 శాతం తేమ ఉంటే క్వింటా పత్తికి గరిష్టంగా రూ.8,100 చెల్లిస్తుండగా.. 12 శాతం ఉన్న పత్తికి కనిష్టంగా రూ.7,689 మద్దతు ధరగా నిర్ణయించింది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలుకు నిరాకరిస్తోంది. లేదా గంటల తరబడి వేచి చూసిన తర్వాత ‘ప్రత్యేక పరిస్థితి’లో ఆ పత్తి అమ్ముడవుతోంది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తికి ఫంగస్ సోకి, త్వరగా నల్లబడుతుంది. అంతేకాదు.. పక్కనున్న నాణ్యమైన పత్తిని సైతం పాడు చేసే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల దగ్గర 12 శాతానికి మించి తేమ ఉంటే అమ్మడం రైతుకు కత్తి మీద సామవుతోంది. అక్కడ తేమ చిక్కుల్లేవ్.. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు సమాంతరంగా జిల్లాలోని ప్రతీ మండల కేంద్రం, కీలకమైన కూడళ్లలో ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ఇక్కడ తేమ, గీమా అంటూ రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టరు.. తేమ కొలిచే పరికరాలతో పరీక్షలూ చేయరు.. కంటి చూపుతోనే అంచనా వేసి సదరు పత్తిని కొనుగోలు చేస్తారు. కానీ, ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర దగ్గరే రైతులకు సమస్య ఎదురవుతోంది. సీసీఐ సెంటర్లలో క్వింటా పత్తికి కనిష్టంగా రూ.7,689 నుంచి గరిష్టంగా రూ.8,100 మద్దతు ధర వస్తుంటే, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మాత్రం రూ.6,000 దాటడం గగనమే. సగటున క్వింటా రూ.5,500 చొప్పునే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని, దూరాభారాలు, వ్యయప్రయాసలు భరించి సీసీఐ కేంద్రాలకు వస్తే అక్కడ ఎదురయ్యే తేమ కొర్రీలను తట్టుకోవడం రైతులకు మరోసారి సాగు చేసినంత పని అవుతోంది. ఈ బాధలన్నీ పడలేక, వెంటనే డబ్బులు చెల్లించే ప్రైవేట్ వ్యాపారులకే పత్తిని అమ్ముకుంటున్నారు. అలా ఒక్కో క్వింటాకు సగటున రూ.1500 వరకు నష్టపోతున్నారు. అంటే ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి వచ్చినా.. ఒక సీజన్లో కనీసం రూ.10 వేల మేర కోల్పోవాల్సి వస్తోంది.క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైన సాయం చేసేందుకు మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటారు. అలాగే ప్రతీ 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక ఉండగా అక్కడ వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈఓ) విధులు నిర్వర్తిస్తుంటారు. పత్తిలో తేమ కొలిచే పరికరం ధర కనిష్టంగా రూ.2,000 నుంచి గరిష్టంగా రూ. 8,000 వరకు మార్కెట్లో లభిస్తోంది. ప్రతీ రైతు వేదిక దగ్గర వరి, పత్తి పంటల్లో తేమను కొలిచే యంత్రాన్ని అందుబాటులో ఉంచితే, రైతులు తమ పంటల్లో ఎంత తేమ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాల మేరకు తేమ వచ్చే వరకు ఎదురుచూసి.. ఆ తర్వాత మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. లేదంటే తేమ శాతానికి తగ్గట్టుగా ప్రైవేటు వ్యాపారుల దగ్గర ధర డిమాండ్ చేసే అవకాశం రైతుకు దక్కుతుంది. కానీ వ్యవసాయశాఖ నుంచి అలాంటి చొరవ లేకపోవడంతో ప్రతీ సీజన్లో రైతులు అమ్మకాల సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. -
తొలిరోజు 178 నామినేషన్లు
చుంచుపల్లి : తొలి విడతలో ఎన్నికలు జరిగే 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఇందుకోసం 47 కేంద్రాలను అందుబాటులో ఉంచగా ఎనిమిది మండలాల పరిధిలో 178 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 83 మంది, వార్డులకు 95 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్ స్థానాలకు 11, వార్డులకు 08, అశ్వాపురంలో సర్పంచ్ స్థానాలకు 13, వార్డులకు 16, చర్లలో సర్పంచ్కు 13, వార్డులకు 05, భద్రాచలంలో సర్పంచ్ 02, వార్డులకు 12, బూర్గంపాడులో సర్పంచ్ 09, వార్డులకు 10, కరకగూడెంలో సర్పంచ్ 10, వార్డులకు 01, మణుగూరులో సర్పంచ్ 10, వార్డులకు 24, పినపాక మండలంలో సర్పంచ్ స్థానాలకు 15, వార్డులకు 19 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సర్పంచ్ స్థానాలకు 83, వార్డులకు 95 -
నేటి నుంచి కోలిండియా పోటీలు
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో తొలిసారిగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కోలిండియాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.క్రీడాకారులకు గాయాలు కాకుండా సింథటిక్ కోర్టు , రాత్రి సమయంలో కూడా పోటీలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లను సమకూర్చారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మైదానంలో ఏర్పాట్లు, క్రీడాకారుల వసతి సౌకర్యాలపై ఆరాతీసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. కబడ్డీ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన జట్ల మేనేజర్లతో గురువారం రాత్రి జీఎం శాలేంరాజు సమావేశమయ్యారు. క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. టోర్నీలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎనిమిది జట్లకు చెందిన 114 మంది క్రీడాకారులు కొత్తగూడెం చేరుకున్నారని తెలిపారు. కాగా, టోర్నీని శుక్రవారం ఉదయం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలో ్లజీఎం(వెల్ఫేర్) జీవీ.కిరణ్కుమార్, అధికారులు కోటిరెడ్డి, రామకృష్ణ, మోహన్రావు, క్రిస్టోఫర్ పాల్గొన్నారు. గతంలో సింగరేణి జట్టుకు స్వర్ణ పతకం.. 1948 సంవత్స రం నుంచి సింగరేణి కోలిండియా పోటీల్లో పాల్గొంటోంది. 1960లో తొలిసారిగా కబడ్డీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత గోదావరిఖనిలో జరిగిన కోలిండియా కబడ్డీ పోటీల్లో సింగరేణి జట్టు స్వర్ణపతకం సాధించింది. ఆ తర్వాత బెల్లంపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో జరిగిన పోటీల్లో సింగరేణి జట్టు రెండో, మూడో స్థానంలో నిలిచింది. స్పోర్ట్స్ అధికారి లేకుండా కోలిండియా పోటీలు ఎలా..? సింగరేణిలో స్పోర్ట్స్ అధికారి లేకుండా కోలిండియా క్రీడలు ఎలా నిర్వహిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నా రు. ఏడెనిమిదేళ్లుగా యాజమాన్యం నియామకం చేపట్టడం లేదని పేర్కొంటున్నారు. క్రీడల్లో ప్రావీ ణ్యం లేని పర్సనల్ విభాగం అధికారులను హారీ నరీ సెక్రటరీలుగా నియమించి క్రీడలు ఆడిస్తున్నారని, దీనివల్ల క్రీడల్లో ఉద్యోగులు రాణించలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా క్రీడాకారులకు సరైన స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందించడం లేదని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం స్పందించి స్పోర్ట్స్ అధికారిని నియమించాలని కోరుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో మూడు రోజులపాటు కబడ్డీ టోర్నీ నిర్వహణనేను 30 ఏళ్లుగా కోలిండియా కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నాను. గతంలో మా జట్టు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. ఈసారి కూడా తప్పకుండా కప్ కొడతాం. –కై లాసం శ్రీనివాస్, ఆర్జీ–1 ఈపీ ఆపరేటర్ కొన్నేళ్లుగా కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నా. లాస్ట్ టైమ్ డబు్ల్య్సీఎల్ టీమ్తో పోరాడి కేవలం రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. –సాల్వంత్, సీసీఎల్ క్రీడాకారుడు గతంలో మాదిరి కాకుండా ఈసారి అడ్వాన్స్గా టోర్నమెంట్ ఎక్కడ జరిగినా గెలవాలని ప్రాక్టీస్ చేశాం. పక్కా వ్యూహంతో ఉన్నాం. 100 శాతం టోర్నీలో మేమే గెలుస్తాం. –సందీప్ చేతన్, బీసీసీఎల్ క్రీడారకారుడు -
రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు
● డిజిటల్ అరెస్ట్ పేరుతో వైద్యులకు బెదిరింపులు ● ఏపీకే ఫైల్స్ పంపుతూ నగదు కాజేసే ప్రయత్నాలు భద్రాచలంఅర్బన్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేనివారే కాదు విద్యావంతులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భద్రాచలం వైద్యులను టార్గెట్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు పట్టణానికి చెందిన డాక్టర్ సుబ్బరాజును, అతని కుటుంబ సభ్యులను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. ఇంట్లో కిటికీలు, తలుపులు మూసేసి విచారణలో పాల్గొనాలని భయపెట్టారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎన్ఎస్ఐ ఏజెంట్ అధికారాలమంటూ వీడియో కాల్స్ చేస్తూ ఏటీఎం కార్డును దుర్వినియోగం చేశారని, బ్యాంక్ ఖాతాల వివరాలు చెప్పకపోతే 90 రోజుల జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. వారు విషయం సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నష్టపోకుండా బయటపడ్డారు. భద్రాచలానికే చెందిన డాక్టర్ నారాయణకు కూడా ఈ ఏడాది జూలై 24న డిజిటల్ అరెస్టు పేరుతో సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరించారు. ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారని, బెంగళూరులో 17 కేసులు నమోదయ్యాయని, భయపెట్టారు. గతంలో భద్రాచలానికే చెందిన డాక్టర్ సుదర్శన్ను కూడా ఇదే తరహాలో బెదిరించారు. అపరిచిత వ్యక్తుల కాల్స్కు స్పందించినా, గుర్తుతెలియని లింక్స్ క్లిక్ చేసినా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. ఏపీకే ఫైళ్లు పంపి.. ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైళ్లను వాట్సాప్ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేయగానే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఆ ఫోన్లోని నంబర్లకు ఏపీకే ఫైళ్లు పంపిస్తున్నారు. దీంతో తెలిసిన వ్యక్తి నుంచే మేసేజ్ వచ్చిం దని భావిస్తూ వినియోగదారులు ఏపీకే ఫైళ్ల లింక్లు ఓపెన్ చేస్తున్నారు. విషయం తెలియక డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా సొమ్ము పంపితే పిన్ నంబర్ తెలుసుకుని నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ రివార్డ్స్ పేరిట లింక్ పంపుతూ మోసానికి పాల్పడుతున్నారు. అధిక లాభాల ఆశ చూపిస్తూ పెట్టుబడి పెట్టించి, ఆ తర్వాత బురిఢీ కొట్టిస్తున్న సంఘటనలు భద్రాచలంలో జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఏపీకే ఫైల్స్, ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే లింక్లను ఓపెన్ చేయొద్దు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్కు కాల్ చేయాలి. సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాల నిరోధంపై అవగాహన కల్పిస్తున్నాం. – విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ‘శ్రీరామ్’ ఇటుకలను తయారు చేసిన ఈఓ.. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులచే తయారు చేయించి విక్రయానికి పెట్టిన ‘జై శ్రీరామ్’ ఇటుకలను ఈఓ దామోదర్రావు గురువారం పరిశీ లించారు. తయారీవిధానాన్ని అడిగి తెలుసుకు ని తాను స్వయంగా ఇటుకలు తయారు చేశారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, మంత్రపుష్పం, హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేద పండితులు, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర కవితల పోటీలో ప్రథమ స్థానంభద్రాచలంటౌన్: భద్రాచలానికి ప్రముఖ న్యాయవాది, కవి పామరాజు తిరుమలరావు రచించిన ‘మాతృభాష వేదన’ కవిత అంతర్రాష్ట్ర పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచలో మరాఠీ – తెలుగు ద్విభాషా సేవా సమితి నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 310 మంది కవులు పాల్గొనగా, తిరుమలరావు కవితకు అగ్రస్థానం దక్కింది. ఈమేరకు నిర్వాహకులు మనోహర్ సలాస్కర్ గురవారం సమాచారం అందించారు. ఈ సందర్భంగా తిరుమలరావును పలువురు అభినందించారు. నేడు జిల్లా స్థాయి చెకుముకి సంబురాలుకొత్తగూడెంఅర్బన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సంబురాలు శుక్రవా రం కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, చంద్రమౌ ళి తెలిపారు. గురువారం కొత్తగూడెంలో వారు మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రథమ స్థా నం పొందిన విద్యార్థులు సంబురాలకు హాజరవుతారని, వారిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తామని తెలిపారు. వేడుకలకు వచ్చే విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే గుర్తింపు పత్రం, పెన్నులు, ఆధార్ కార్డు తీసుకురావాలని, తల్లిదండ్రులు లేదా సైన్స్ టీచర్లను తోడుగా తీసుకుని రావాలని సూచించారు. శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్, 11 నుంచి 12 గంటల వరకు రాత పరీక్ష, 12 30 నుంచి 1.30 వరకు క్విజ్ పోటీలు ఉంటాయని వివరించారు. 1.30 నుంచి 2.30 వరకు భోజన విరామం ఉంటుందని, తామే భోజన వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు. డీఈఓ బి.నాగలక్ష్మితో పాటు పలువురు అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో జేవీవీ నాయకులు కస్తూరి, వీరభద్రం, మోహన్రావు, తిరుపాలు పాల్గొన్నారు. -
స.హ. చట్టంతోనే పారదర్శక పాలన
సూప్బజార్(కొత్తగూడెం): సమాచార హక్కు చట్టంతోనే పారదర్శక పాలన సాధ్యమని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం స.హ. చట్టం అమలు, పెండింగ్ కేసుల పరిశీలన, పౌర సమాచార అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి శక్తినిచ్చే కీలక సాధనమని అన్నారు. అవినీతిని నిర్మూలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి చట్టంలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో పనిచేయాలని సూచించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అందించినప్పుడే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. గత రెండేళ్లుగా ఆర్టీఐ కమిషన్ నియామకం లేకపోవడంతో అనేక దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ కేసులన్నింటినీ వేగంగా పరిష్కరించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులపై పూర్తి వివరాలు సేకరించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాళ్ శ్రేష్ఠ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ శాఖ తమకు వచ్చిన స.హ.చట్టం దరఖాస్తులను సకాలంలో సమాచారం అందించాలని అన్నారు. అధికారులు తమ పరిధిలోని దరఖాస్తులు వివరాలను రిజిస్టర్లో పొందుపరచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి -
భళా.. తపాలా బిళ్ల!
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్(స్టాంపుల ప్రదర్శన) ఆకట్టుకుంటోంది. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ గురువారం మొదలుకాగా.. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు తాము సేకరించిన అరుదైన స్టాంపులను ప్రదర్శించారు. ఖమ్మం, హైదరాబాద్కు చెందిన నలుగురు 108 ఫ్రేముల్లో 3,456 స్టాంపులను ప్రదర్శించగా.. ఇందులో 1711వ సంవత్సరం విడుదలైన స్టాంపులు కూడా ఉండడం విశేషం. భారత్తో పాటు పోర్చుగీసు బ్రిటన్, థాయిలాండ్ ఇండోనేషియా, రుమేనియా, థైవాన్ తదితర దేశాలకు చెందిన స్టాంపులను సైతం ప్రదర్శించారు. కాగా, ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం కూడా కొనసాగుతుందని.. పాఠశాలల విద్యార్థులు, వ్యక్తులు రావొచ్చని అధికారులు సూచించారు. కాదేదీ అనర్హం ప్రకృతిలో ఉండే ప్రతీ దృశ్యంతో స్టాంపులను రూపొందించారు. వివిధ దేశాల్లోని ముఖ్య స్థలాలు, ఆయా దేశాల ప్రతినిధులు, ప్రముఖుల ఫొటోలతో స్టాంపులు రూపొందాయి. జంతువులు, పక్షులు, సముద్రపు జీవులు, క్రీడా వస్తువులు, ఖాదీ వస్త్రాలు, కలప, మెటల్స్, మెడిసిన్ వంటి రంగాలే కాక ఆహార పదార్థాల దృశ్యాలు కూడా స్టాంపులపై ముద్రితమయ్యాయి. ఎగ్జిబిషన్లో మహాత్మాగాంధీ ఖాదీ వస్త్రాలతో కూడిన తొలి స్టాంప్ను ప్రదర్శించగా.. పావు అణా మొదలు వివిధ ధరల్లో విడుదలైన స్టాంపులు ఆకట్టుకున్నాయి. ఖమ్మంకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఎన్కే.సాబూ వైద్యం చేస్తూనే స్టాంపుల సేకరణను హాబీగా మలుచుకున్నారు. తొలినాళ్లలో జైపూర్ కలెక్టర్గా పనిచేసిన సోడాను స్ఫూర్తిగా ఏడో తరగతి నుంచే స్టాంపుల సేకరణ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇండియా, పోర్చుగీసు, బిట్రన్, థాయ్లాండ్, రుమేనియా తదితర దేశాల స్టాంపులను సేకరించగా, ఎక్కడ ప్రదర్శన జరిగినా వెళ్తానని పేర్కొన్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫిలాటలిక్ ఎగ్జిబిషన్లకూ సైతం హాజరవుతున్నానని చెప్పారు. -
పెట్రోల్ బాటిల్తో నిరసన
అశ్వాపురం: రుణం ఇప్పిస్తామని వసూళ్లు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెట్రోల్ బాటిల్తో గురువారం బాధితులు నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన తాటి భూదేవమ్మ, పాయం ధనలక్ష్మి, బూర్గంపాడు మండలం ఇరవండి గ్రామానికి చెందిన కనితి లలిత, ట్రైకార్, దళితబంధు రుణాలు, పాల్వంచ మండలానికి చెందిన చల్ల రామచంద్రంకు ట్రాక్టర్ రుణం ఇప్పిస్తానని అశ్వాపురానికి చెందిన వ్యక్తి ఇంటి డబ్బులు వసూళ్లు చేశాడు. తమ వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని సదరు వ్యక్తి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్తో బైఠాయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఐ అశోక్ రెడ్డిని వివరణ కోరగా.. బాధితులకు నచ్చజెప్పి నిరసన విరమింప చేశామని, ఇరువర్గాలతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. పెట్రోల్ బాటిల్తో నిరసన తెలుపుతున్న బాధితులు -
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
కరకగూడెం: మండల పరిధిలోని మద్దులగూడెం, రేగళ్ల గ్రామాల మధ్య బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, రాగి వైరు అపహరించారు. గురువారం రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో విద్యత్ శాఖ ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్ వచ్చి పరిశీలించారు. సుమారు రూ.1.10 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. బాధిత రైతుతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బొగ్గు లారీలు నిలిపివేత బడ్డీకొట్టులోకి దూసుకెళ్లిన లారీ బస్సును ఢీకొట్టి వ్యాన్ బోల్తా సత్తుపల్లిరూరల్: వేగంగా వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వచ్చిన కళాశాల విద్యార్థుల బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న వ్యాన్ ఎదురుగా గంగారం వైపు నుంచి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో వస్తున్న బస్సును సత్తుపల్లి మండలం తమ్మిలేరు బ్రిడ్జిపై ఢీ కొట్టట్టింది. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వ్యాన్ తమ్మిలేరు బ్రిడ్జిపై రెయిలింగ్ ఢీకొట్టి బోల్తా పడడంతో స్వల్పంగా గాయపడిన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. -
ఏజెన్సీలో వైద్య సేవలు భేష్
పాల్వంచ: ఏజెన్సీ జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం తనుష్ ఫంక్షన్ హాల్లో ఏజెన్సీ ప్రాంతంలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్తో కలిసి ప్రశంసా పత్రాలను, మెమోంటోలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్ల, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ -
రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు
ఇల్లెందు: పట్టణంలోని నంబర్–2 బస్తీ జగదాంబా సెంటర్లో గల శ్రీరామాలయంలో మూడు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠ వేడుకలు బుధవారం ముగి శాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు నవగ్రహాలు, నందీశ్వరుడు, శ్రీ గణపతి, శ్రీ దుర్గామాత, దత్తాత్రేయుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటి రోజు ప్రత్యేక పూజలు, రెండో రోజు మహా అన్నదానం నిర్వహించగా.. చివరి రోజున ప్రతిష్ఠా వేడుకలతో పాటు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీఎస్పీ చంద్రభాను, మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ బోగ నందకిశోర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టరేట్లో రాజ్యాంగ ప్రతిజ్ఞసూపర్బజార్(కొత్తగూడెం): రాజ్యాంగ దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, ఉపాధి కల్పనాధికారి కే శ్రీరామ్, భూగర్భ జలశాఖాధికారి రమేష్, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన మెనూ అమలు చేయాలిపాల్వంచరూరల్: గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల్లో నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం దమ్మపేట డివిజన్ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, హా స్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. ఉద్దీపకం–2 కార్యక్రమంపై విద్యార్థుల ప్రగతి, అ భ్యాసన స్థితి వివరాలను ఎస్సీఆర్పీలను అడి గి తెలుసుకున్నారు. డిసెంబర్ చివరి వా రంలో ప్రథమ్ ఎన్జీఓ సహకారంతో ఉద్దీపకం ఫైనల్ టెస్టు నిర్వహించాలన్నారు. ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు. ఆలయాల్లో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది దేవాలయాల్లో 19 పోస్టుల భర్తీకి దేవాదాయ, ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. అర్చకులు, సహాయ అర్చకులు, వేదాపారాయణులు, డోలు, సన్నాయి, పరిచారిక, పాచక(వంట), సహాయకుల పోస్టులు ఇందులో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని ఆరు ఆలయాల్లో 13 పోస్టులకు, భద్రాద్రి జిల్లాలోని రెండు ఆలయాల్లో ఆరు పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులైన అభ్యర్థులు తగిన విద్యార్హతలు, వృత్తి అర్హతలు కలిగి ఉండడమే కాక 18 – 46 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఈఓలు తెలిపారు. దరఖాస్తుదారులకు రాష్ట్ర దేవాదా య శాఖ కమిషనర్ నియమించే ఎంపిక కమిటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖమ్మం జిల్లాలో వేంసూరు మండలం కందుకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఖమ్మం కాల్వొడ్డులోని శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయం, పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవాలయంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లి ఆలయం, అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పోస్టులు ఉండగా, ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం ఆలయ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. గంజాయి స్వాధీనం?ఇల్లెందు: టేకులపల్లి మండలం సిద్ధారం వద్ద బుధవారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్న ట్లు తెలిసింది. కొత్తగూడెం నుంచి సంపత్నగర్, గుండాల మీదుగా పస్రా వైపు వెళ్తున్న ఓ కా రును పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్న ముఠాను బోడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ఠాణాలో మూగ జంటకు పెళ్లి
బూర్గంపాడు: మూగజంటకు బూర్గంపాడు పోలీసులు బుధవారం పెళ్లి జరిపించారు. బూర్గంపాడు మండలానికి చెందిన మూగ అబ్బాయి, డోర్నకల్కు చెందిన మూగ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వధూవరులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో పోలీస్స్టేషన్లోనే వివాహం జరిపించారు. పీఆర్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా జ్యోతిచర్ల: పీఆర్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా తేగడ జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తుర్రం జ్యోతి నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర శాఖ నియామకం చేపట్టగా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.నరసయ్య, ప్రభాకర్, ఎస్ఎస్ఎస్ రవికుమార్, తుర్రం వీరభద్రం, ధనికొండ శ్రీనివాసరావు, కేవీ రమణ, చింతా రామ్మోహన్రావు, వేణు, బత్తుల శ్రీను, తోటమళ్ల సురేష్బాబు, బి.కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ సమీపంలో షార్ట్ సర్క్యూట్భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ ఔట్ గేట్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఓ విద్యుత్ ఐరన్ స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్తో కాలి పోయి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ ఏఈ రాజారావుకు సమాచారం ఇవ్వగా, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
హార్వెస్టర్ దగ్ధం
గుండాల: మొక్కజొన్న, వరి కోత యంత్రం (హార్వెస్టర్ ) ప్రమాదవశాత్తు బుధవారం దగ్ధమైంది. మండల కేంద్రానికి చెందిన ఊడుగుల యాకయ్య అనే వ్యక్తి హార్వెస్టర్ లీజుకు తెచ్చి మొక్కజొన్న, వరి పంటలను కోయిస్తున్నాడు. రోజూ లాగే మంగళవారం ముత్తాపురం– దొంగతోగు మధ్య మొక్కజొన్న కోశాక ఓ చేనులో యంత్రాన్ని నిలిపివేశాడు. యంత్రం కాలుతుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి యాకయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇల్లెందు నుంచి ఫైర్ ఇంజన్ రప్పించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే సగానికి పైగా కాలిపోయింది. వైరింగ్ సర్క్యూట్ జరిగి నిప్పు అంటుకున్నదా,? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని సీఐ రవీందర్ తెలిపారు. ముద్దాయికి ఆరు నెలల జైలుమణుగూరు టౌన్: చెక్కు బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. సమితిసింగారం గ్రా మానికి చెందిన మేకల రాజయ్య వద్ద సత్యనా రాయణ 2018, అక్టోబర్ 21న రూ. 2.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రతిగా చెక్కును అందజేశాడు. రాజయ్య చెక్కును బ్యాంకులో జమ చేయగా, సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్అయింది. దీంతో బాధితుడు న్యాయవాది ద్వారా నోటీసు పంపినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీ లించిన న్యాయమూర్తి పైవిధగా తీర్పు చెప్పారు. ఫిర్యాదుదారునికి రూ.2.50లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారు తరఫున న్యా యవాది నగేశ్కుమార్ వాదనలు వినిపించారు. టిప్పర్ ఢీకొని 8 మేకలు మృతి●రూ.1.50 లక్షల నష్టం సుజాతనగర్: మట్టి టిప్పర్ ఢీకొని బుధవారం 8 మేకలు మృతి చెందాయి. మంగపేట గ్రామానికి చెందిన గుగులోత్ హత్తీరాం తన మేకలను మేతకు తోలుకెళ్తుండగా ఆర్వోబీ సమీపంలో మేకలు రోడ్డు దాటుతున్నాయి. ఈ క్రమంలో సుజాతనగర్ వైపు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రాభివృద్ధి
మణుగూరుటౌన్: రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. బుధవారం మణుగూరులోని ఇల్లెందు అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం ప్రధాన రహదారి నిర్మాణం, నియోజకవర్గంలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల మంజూరు కాంగ్రెస్ ఘనతేనని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి హయాంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపా రు. వాజేడు,ఏటూరునాగారంల మధ్య వంతెన నిర్మా ణం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తుచేశారు. బీటీపీఎస్, సింగరేణి, హెవీవాటర్ ప్లాంట్ కార్మికుల కోసం మణుగూరులో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా, అనుమతి లభించిందన్నారు. కాకతీయ సూపర్ఫాస్ట్ మణుగూరుకు పొడిగింపుపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని అన్నారు. మరో 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని చెప్పారు. తొలుత ఆయన అన్నారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్ల సూర్యం కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆవుల సర్వేశ్వరరావు, పాలమూరిరాజు, బానోత్ లక్ష్మణ్, కుర్రం రవి, సుంకరపల్లి నాగరాజు, వాసంశెట్టి వెంకట్రావు, ఆరిఫ్, యూత్ నాయకుడు ఐతనబోయిన సతీష్, రహీం పాషా, తదితరులు ఉన్నారు. ఎంపీ బలరాం నాయక్ -
ప్రభుత్వ అలక్ష్యం
ప్రకృతి ప్రకోపం..● ఈ ఏడాది కౌలు రైతులకు మిగిలింది కన్నీరే.. ● అధిక వర్షాలతో పెరిగిన పెట్టుబడి, తగ్గిన దిగుబడి ● పత్తి, ధాన్యం విక్రయాలకు తప్పని ఇక్కట్లు బూర్గంపాడు: కౌలురైతుకు కన్నీరే మిగులుతోంది. నాలుగు నెలలపాటు కురిసిన వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. అరకొరగా చేతికొచ్చిన పంటను విక్రయించాలన్నా ఇబ్బంది ఎదురవుతోంది. నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ కొనుగోలు చేయటం లేదు. దీనికితోడు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా కౌలు రైతులు ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు తక్కువ ధరకు పత్తి విక్రయించాల్సి వస్తోంది. 2 లక్షల ఎకరాల్లో కౌలు రైతుల సాగు జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దాదాపు 50 వేల మంది కౌలు రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఎక్కు వ విస్తీర్ణంలో పత్తి, వరిని సాగు చేశారు. కౌలు ధర పత్తి సాగుకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ. 25 వేల వరకు, వరి సాగుకు రూ.18వేల నుంచి రూ. 22వేల వరకు పెరిగింది. కౌలు రైతులు అప్పులు చేసి భూముల కౌలు, పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటల్లో కలుపు పెరగడం, చీడపీడలు ఆశించటం, పురుగు, దోమ ఉధృతి ఎక్కువ కావడంతో సస్యరక్షణకు ఎక్కువసార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. గతంలో కంటే ఎకరాకు రూ. 6వేల వరకు పెట్టుబడి పెరిగింది. కొరత కారణంగా పంటకు సకాలంలో యూరియా వేయలేకపోయారు. దీంతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు తప్పక ఎక్కువ ధర ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సి వచ్చింది. పెట్టుబడి పెరిగినా దిగుబడి తగ్గడంతో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పట్టాదారు దయాదాక్షిణ్యాలపైనే.. పండించిన కొద్దిమేర పంటలను అమ్ముకునేందుకు కౌలు రైతులకు పాట్లు తప్పటం లేదు. పత్తి, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే పట్టాదారు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సివస్తోంది. సీసీఐలో పత్తి విక్రయాలకు కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేయాలి. దీనికి పట్టాదారు అనుమతితో ఏఈఓలతో సర్టిఫికేషన్, అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ధాన్యం అమ్ముకున్నప్పుడు పట్టాదారుతో ఓటీపీలు చెప్పించుకోవాలి. ఈ ప్రక్రియ ఇబ్బందికరంగా మారటంతో ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నిబంధనలను సడలించి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కౌలు రైతులు కోరుతున్నారు.ఈ ఏడాది ఎకరాకు రూ.22 వేల కౌలు చెల్లించి 18 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. యూరియా దొరకక పత్తికి కాంప్లెక్స్ ఎరువులు వేశాను. దీంతో పెట్టుబడి పెరిగింది. వర్షాలకు పత్తి దిగుబడి సగానికి సగం పడిపోయింది. పండిన పత్తిని అమ్మాలంటే సీసీఐలో కొనటంలేదు. పెట్టుబడి కూడా పూడని పరిస్థితి. –చెంచలపు రాములు, కౌలురైతు, నాగినేనిప్రోలు -
స్వరాష్ట్రంలో భద్రగిరికి తొలిసారిగా..
● మేజర్ పంచాయతీలో డిసెంబర్ 11న ఎన్నికలు ● హైకోర్టు కేసుతో గతంలో భద్రాచలంలో జరగని వైనంభద్రాచలం: తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో తొలిసారిగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీ పై కేసు హైకోర్టులో ఉన్నందున ఇక్కడ జరగలేదు. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 లో ఎన్నికలుజరగ్గా, భూక్యా శ్వేత సర్పంచ్గా పని చేశా రు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం, సారపాకలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆదివాసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో మూడు గ్రామపంచాయతీలుగా విభజించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మేజర్ గ్రామపంచాయతీగానే ప్రకటించింది. సర్పంచ్ స్థానం మళ్లీ ఎస్టీ జనరల్కే రిజర్వ్ అయింది. 20 వార్డుల్లో 10 వార్డులను ఎస్టీ జనరల్ మహిళలకు కేటాయించగా, మరో 5 వార్డులను జనరల్ విభాగంలోని మహిళలకు, మరో ఐదింటిని జనరల్కు రిజర్వేషన్ చేశారు. గురువారం నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. పోటీ రసవత్తరం మొదటి విడతలో డిసెంబర్ 11న భద్రాచలంలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనప్పటికీ ప్రధాన పార్టీల మద్దతు కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లంబాడా, కోయ వర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యల ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లంబాడా గిరి జనుల నుంచి హరిశ్చంద్రనాయక్, భూక్యా రంజిత్ నాయక్, భూక్యా శ్వేత పోటీ పడుతున్నారు. ఆది వాసీ గిరిజనుల నుంచి పలువురి పేర్లు వినిపించినా ఏకగ్రీవంగా ఒక్కరినే నామినేట్ చేయాలని ఆది వాసీ సంఘాల జేఏసీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. లంబాడాలకు మద్దతు ఇస్తే భవిష్యత్ ఎన్నికల్లో ప్రతిఘటన ఎదురవుతుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును ఆదివాసీ సంఘాలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సర్పంచ్ పోటీ రసవత్తరంగా మారింది. మానె రామకృష్ణకు బీఆర్ఎస్ మద్దతు ఆదివాసీ నాయకుడు మానె రామకృష్ణకు మద్దతిస్తున్నట్లు బుధవారం బీఆర్ఎస్ ప్రకటించింది. మానె రామకృష్ణ గతంలో ఎమ్మెల్యే బరిలో సైతం నిలిచా రు. తొలుత వైఎస్సార్ సీపీలో, అనంతరం బీఆర్ఎస్లో నియోజకవర్గ నాయకుడిగా పని చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నిరాకరించినా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్లు బుధవారం చర్చలు జరిపి ఒప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనేది ప్రకటించాల్సి ఉంది. కాగా అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తన కుటుంబం నుంచే సర్పంచ్ అభ్యర్థిని పోటీలో ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు, పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 46 ప్రైవేట్ ఆస్పత్రులకు శా శ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వైద్య సిబ్బందితోనే సేవలందించా లని అన్నారు. ప్రతీ ఆస్పత్రిని మూడు నెలలకోసారి తనిఖీ చేయాలని, లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో శాసీ్త్రయ వైద్యసేవలపై అవగాహన పెంచేందుకు ఆరోగ్య విభాగం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. చిన్నారులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం విద్య, గ్రామీణాభివద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవె న్యూ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రతీ మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం ఆధార్ కార్డుల సంఖ్య 10,57,427 ఉందని, మార్చిలోగా మిగిలిన వారందరికీ ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలలో మొదటివారంలో ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఆధార్ నమోదు చేయాలని, పాఠశాలల్లో ఆధార్ కార్డు లేని పిల్లల వివరాలను సేకరించి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అనంత రం ఆధార్ క్యాంపులను నిర్వహించాలని తెలి పా రు. జిల్లాలో కొందరికి రెండు ఆధార్ కార్డులు మంజూరయ్యాయని, ఆ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి, ఈడీఎం సైదేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ఇతర అధికారులు బి.ప్రసాద్, నాగలక్ష్మి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గుండాల: ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామానికి చెందిన జారా రమేష్(30) బైక్పై ఆళ్లపల్లి వస్తున్నాడు. అదే సమయంలో కొత్తగూడేనికి చెందిన కారు ఆళ్లపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో అనంతోగు గ్రామ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న రమేష్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎస్సై సోమేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విదుత్ స్తంభాలను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు●ప్రయాణికులకు తప్పిన ప్రమాదం పాల్వంచరూరల్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఢీకొట్టిన సంఘటన బుధవారం తెల్ల వారుజామున జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏఆర్ఎంటీ ప్రైవేట్ ట్రా వెల్స్ బస్సు హైదరాబా ద్ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్తోంది. బస్సులో 30మంది వరకు ప్రయాణికులు ఉన్నా రు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పాల్వంచ మండలం బస్వతారాకకాలనీ వద్ద బీసీఎం జాతీయ రహదారిపై స్టీరింగ్ స్టక్ అవడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. దీంతో రూ. 2 లక్షల విలువైన రెండు స్తంభాలు విరిగిపోయాయి. బస్సు ముందుభాగం దెబ్బతిన్నది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మండల ఏఈ శ్రీనివాస్ ఫిర్యాదుతో బస్సు డ్రైవర్ ఓంపాడే పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
వరదను పసిగట్టేలా..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన నూతన బ్రిడ్జిపై కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ‘ఎంట్రోపీ ఇమేజ్ ప్రాసెసింగ్ బేస్డ్ నాన్ కాంటాక్ట్ డిక్జార్జ్ మానిటరింగ్ టెక్నిక్’ యంత్రాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. ఇది నది ఉపరితల ప్రవాహ వేగాన్ని విశ్లేషించి కచ్చితమైన సమాచారం ఇస్తుంది. రాగల 24 గంటల్లో ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో అంచనా వేసి, దిగువ ప్రాంతాలకు ఎన్ని క్యూసెక్కుల నీరు వెళ్తుందన్నది ముందుగానే ఈ పరికరం ద్వారా శాసీ్త్రయంగా తెలుసుకోవచ్చు. తద్వారా లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయొచ్చు. ఉత్తరాఖాండ్లోని రూర్కీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి చెందిన డాక్టర్ రవీంద్ర విఠల్ కాలే, ప్రొఫెసర్ ముత్తయ్య పెరుమాళ్, భద్రాచలం కేంద్ర జల సంఘం (సీడబ్లూసీ) కార్యాలయ సబ్ డివిజన్ ఇంజనీర్ కె.పృథ్వీరాజ్ నేతృత్వంలో ఈ ఏడాది ఏప్రిల్లో భద్రాచలం గోదావరిని పరిశీలించి, యంత్రం అమర్చేందుకు ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉందని గుర్తించారు. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
నామినేషన్.. జాగ్రత్తలు
ఇల్లెందురూరల్/పాల్వంచరూరల్: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాల్వంచ, ఇల్లెందు ఎంపీడీఓలు కె.విజయభాస్కర్రెడ్డి, ధన్సింగ్ వివరించారు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత ఓటరు లిస్టులో ఓటరుగా నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. డిపాజిట్ సొమ్ము చెల్లించాలి. నేర చరిత్ర, చర, స్థిర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్ ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి ఇవ్వాలి. ఎన్నికల ఖర్చు విధిగా నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండాలి. నామినేషన్ పత్రం పార్ట్–1లో ప్రతిపాదకుని సంతకం, పార్ట్–2లో అభ్యర్థి సంతకం, పార్ట్–3లో కూడా అభ్యర్థి సంతకం, పార్ట్–4లో ఆర్వో సంతకం, పార్ట్–5 (రిజెక్టెడ్ నామినేషన్)లో కూడా ఆర్వో సంతకం ఉండాలి. పార్ట్–6(రిసీప్ట్)లో ఆర్వో సంతకం ఉండాలి. అఫిడవిట్లో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం ఉండాలి. ఖర్చు వివరాలకు సంబంధించిన డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. నామినేషన్ పత్రంతోపాటు స్వీయ ప్రకటన (అఫిడవిట్), అనుబంధం–5, డిపాజిట్ అమౌంట్, గ్రామపంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్, బ్యాంక్ నూతన ఖాతా పుస్తకం (గతంలో వినియోగించిన అకౌంట్ పుస్తకాన్నే జత చేస్తే సదరు అకౌంట్లో ఎటువంటి డబ్బు జమ అయినా ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు), ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్లను జత చేసి ఎన్నికల అధికారికి అందజేయాలి. -
అలరించిన సైన్స్ఫేర్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సెయింట్ మెరీస్ పాఠశాలలో బుధవారం కొనసాగిన జిల్లా స్థాయి సైన్స్ఫేర్లో విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించేందుకు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ● ఏడూళ్ల బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.జశ్వంత్ రూపొందించిన ‘స్మార్ట్ వ్యవసాయం’ ప్రాజెక్టు ఔరా అనిపించింది. వరి కోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని వేరు చేసి గడ్డిని కాల్చితే గాలి కాలుష్యం అవుతుందని, కాల్చకుండా రీసైక్లింగ్తో పశువులకు దాణాగా వినియోగించవచ్చనే ప్రాజెక్టు ఆలోచింపజేసింది. ● పాల్వంచ కేజీబీవీ విద్యార్థిని బి.ఎక్షిత ప్రదర్శించిన ‘బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్’ ప్రాజెక్టు ఆకట్టుకుంది. ● చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థిని బి.హెలన్మారస్ సీపీఆర్ ఎలా చేయడం, ఉపయోగాలు తెలుపుతూ ప్రాజెక్టు ప్రదర్శించింది. ● మణుగూరు సింగరేణి పాఠశాల విద్యార్థి ఎ.సంజయ్ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇంజనీర్లు బహుళ అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారనే అంశాలపై ప్రాజెక్టు రూపొందించాడు. ● కరకగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్కే.నక్షా, ఇర్ఫాన్ఖాన్ ఎక్స్లెంట్ లైటింగ్ సిస్టమ్ ప్రాజెక్టును రూపొందించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఇతర పార్కింగ్ స్థలాల్లో రాత్రంతా లైట్లు వెలిగే ఉంటాయి. అలా కాకుండా వాహనం వచ్చినప్పడే లైట్లు వెలగడం, మిగతా సమయంలో ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే సిస్టమ్తో విద్యుత్ ఆదా చేసుకోవచ్చని వివరించారు. ఇంకా ఇల్లెందు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎ.నిక్షిత్, ములకలపల్లి పీఎంశ్రీ పాఠశాల విద్యార్థిని ఎం.మానస తదితరులు కూడా అద్భుత ప్రదర్శనలు చేశారు. సైన్స్పై మక్కువ పెంచుకోవాలి విద్యార్థి దశ నుంచే సైన్స్పై మక్కువ పెంచుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సైన్స్ఫేర్ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయని, మిగిలిన విద్యార్థులు కూడా ఈ రంగంలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. సైన్స్ఫేర్లతో విద్యార్థుల్లో వైజ్ఞానిక పరిజ్ఞానం, తాత్విక ఆలోచనలు, సృజనాత్మక పెరుగుతాయని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖలోని వివిధ విభాగాల అధికారులు మాధవరావు, సతీష్, సైదులు, నాగరాజశేఖర్, నీరజ, ఎంఈఓలు మధురవాణి, బాలాజీ, ఝుంకీలాల్, కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉత్తమ ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థులకు నేడు బహుమతులు పంపిణీ చేయనున్నారు. జిల్లా స్థాయి సైన్స్ఫేర్లో పాల్గొనడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం డిటెక్టివ్ వార్నింగ్ వాయిస్ అనే ప్రాజెక్టు ప్రదర్శించాను. సైన్స్ ఫెయిర్లో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. వచ్చే ఏడాది కూడా జిల్లాలో ఎక్కడ పెట్టినా మరో నూతన ఆవిష్కరణ రూపొందించి పాల్గొంటా. – జి.కల్కి, పాల్వంచ సైన్స్ఫేర్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చాలామంది విద్యార్థులు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రదర్శించారు. వారందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మహిళలంతా రబ్బర్ బ్యాండ్లు ఉపయోగిస్తారు. అయితే సేఫ్టీ రబ్బర్ బ్యాండ్ను ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రాజెక్టు రూపొందించాను. – ఎం.తేజస్వి, టేకులపల్లి -
తొలి పోరుకు సిద్ధం
● నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ● 47 కేంద్రాలు ఏర్పాటు ● మొదటి విడతలో 159 జీపీలు, 1,436 వార్డు స్థానాలుచుంచుపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేటి నుంచి 29వ తేదీ వరకు, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్ 3న బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ బాధ్యతలను స్టేజ్–1, స్టేజ్–2 అధికారులకు అప్పగించారు. నామినేషన్ దాఖలు చేసే సర్పంచ్ అభ్యర్థులు జనరల్ స్థానానికి రూ. 2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాలకు రూ.1,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వార్డు స్థానాలకు జనరల్ రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో రూ.500గా నిర్ణయించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు తమ పూర్తి వివరాలు పొందుపర్చాలి. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించాక, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. 47 కేంద్రాల్లో నామినేషన్లు.. మొదటి విడతలో ఎన్నికలు జరిగే 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించేందుకు 47 కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం పంచాయతీ నామినేషన్లను మాత్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. బూర్గంపాడు మండలంలోని 18 గ్రామపంచాయతీల నామినేషన్లను ఇరవెండి, సారపాక, నాగినేనిప్రోలు, బూర్గంపాడు, ముసలిమడుగు, లక్ష్మీపురం, మోరంపల్లి బంజర, పినపాక పట్టీనగర్లో స్వీకరిస్తారు. చర్ల మండలంలోని 26 పంచాయతీలకు గాను సుబ్బంపేట, మొగళ్లపల్లి, చర్ల, తేగడ, పెద్ద మిడిసిలేరు, ఆర్ కొత్తగూడెం, దేవరపల్లిలో, అశ్వాపురం మండలంలోని 24 జీపీల నామినేషన్లను మిట్టగూడెం, అశ్వాపురం, ఆమెర్ద, గొల్లగూడెం, గొందిగూడెం, తుమ్మలచెరువు, మొండికుంటలో, దుమ్ముగూడెం మండలంలోని 37 పంచాయతీలకు నర్సాపురం, రామారావుపేట, లకీ్ష్మ్నగరం, పర్ణశాల, పెద్దనల్లబల్లి, ప్రగళ్లపల్లి, ఆర్లగూడెం, మారాయిగూడెంలో, కరకగూడెం మండలంలోని 16 జీపీలకు కరకగూడెం, సమత్ మోతేలో, పినపాకలోని 23 పంచాయతీలకు పినపాక, సీతంపేట, ఈ బయ్యారం, జగ్గారం, జానంపేట, దుగినేపల్లిలో, మణుగూరు మండలంలోని 14 పంచాయతీలకు పగిడేరు, సాంబాయిగూడెం, రామానుజవరం, లంకమల్లారం, తోగ్గూడెం, ఇప్పలసింగారం, కూనవరం, సమితిసింగారం కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఒక్కో కేంద్రంలో ఆర్ఓ, ఏఆర్ఓతో పాటు మరో సిబ్బంది విధుల్లో ఉంటారు. మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు ఎన్నికల సామగ్రిని తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారని, అభ్యర్థులు ఈసీ సూచించిన వివరాలన్నీ నామినేషన్ పత్రాల్లో పొందుపర్చాలని ఇన్చార్జ్ డీపీఓ సుధీర్ తెలిపారు. -
నరసింహదాసుకు స్మృత్యంజలి
● ఘనంగా జయంత్యుత్సవాలు ● అలరించిన గిరి ప్రదక్షిణ భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రామదాసు తర్వాత పరమ భక్తుడిగా, వాగ్గేయకారుడిగా పేరుగాంచిన శ్రీ తూము లక్ష్మీ నర్సింహదాసుకు దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నీరాజనాలు పలికారు. ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సంగీతోత్సవాలతో స్మృత్యంజలి ఘటించారు. తొలుత ఆస్థాన విద్వాంసుల కీర్తనలు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ నరసింహదాసు చిత్రపటంతో ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా భద్రగిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం విస్తా కాంప్లెక్షక్స్ వద్ద నున్న నరసింహదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలరించిన సంగీతోత్సవాలు.. సీతారాములకు సాయంత్రం వైభవంగా నిర్వహించే దర్బారు సేవ, పలు ప్రత్యేక పూజలను ప్రవేశపెట్టడంతో పాటు అనేక కీర్తనలు రచించి, ఆలపించిన లక్ష్మీ నర్సింహదాసుకు సంగీత, శాసీ్త్రయ నృత్య కార్యక్రమాలతో ఘనంగా నీరాజనం పలికారు. హైదారాబాద్కు చెందిన మహేందర్ కోలాట బృందం కళారూపాలతో పాటు స్థానాచార్యులు స్థలశాయి నర్సింహదాసు కీర్తనలు ఆలపించారు. ఆయా కార్యక్రమాల్లో లక్ష్మీనర్సింహదాసు వారసులు, ఆల య ఈఓ కొల్లు దామోదర్రావు, ఏఈఓ శ్రవణ్కుమార్, ప్రధాన అర్చకులు విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘శ్రీ రాజా తూము లక్ష్మీనర్సింహదాసు చరిత్ర’ పేరుతో రూపొందించిన గ్రంథాన్ని ఆలయ ఈఓ ఆవిష్కరించారు. రామయ్యకు స్నపన తిరుమంజనం. స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. ఆ తర్వాత బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశాక స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామయ్య సన్నిధిలో ఉన్నతాధికారులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని రాష్ట్ర విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ శాఖ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఎ.ఆర్. శ్రీనివాసరావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.వి.ఆనంద్ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం అనంతరం వారికి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచం చేశారు. తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. కాగా, సి.వి.ఆనంద్ కుమారుడు నిఖిల్కు భద్రాచలానికి చెందిన కాంగ్రెస్ నేత బోగాల శ్రీని వాసరెడ్డి కుమార్తె వాసంతితో బుధవారం వివాహం జరగగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడి సతీమణి మాధురి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ ్వర్లు ఆశీర్వదించారు. -
కపాస్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాగు సమయంలో వర్షాలు ఇబ్బంది పెడితే, కొనుగోల దశలో ప్రభుత్వ విధానాలు, సీసీఐ సిబ్బంది నిర్వాకంతో పత్తి రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. యాప్లో వివరాల నమోదుతో.. గతంలో జిన్నింగ్ మిల్లుల దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాలు ఉండేవి. తమ సమీపంలో ఉన్న మిల్లులోనే కాకుండా రాష్ట్రంలో ఏ మిల్లు దగ్గర గల కొనుగోలు కేంద్రంలోనైనా అనుకూల సమయంలో వెళ్లి రైతులు పత్తిని అమ్ముకునేవారు. కానీ, ఈసారి కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సీసీఐ చేపట్టింది. పత్తి అమ్మే రైతులు ఈ యాప్లో వివరాలు నమోదు చేస్తే.. ఏ రోజు, ఏ మిల్లు వద్ద పత్తి అమ్మాలనేది యాపే సూచిస్తుంది. ఉదాహరణకు ఇల్లెందు ప్రాంతానికి చెందిన రైతులు గతంలో సమీపంలోని కారేపల్లి జిన్నింగ్ మిల్లు లేదంటే వరంగల్ ఏనుమాముల మార్కెట్కు వెళ్లి విక్రయించేవారు. ఈసారి ఇల్లెందుకు చెందిన చాలా మంది రైతులకు సుజాతనగర్ సెంటర్ను కేటాయించారు. దీంతో ఇల్లెందు నుంచి కొత్తగూడెం మీదుగా సుజాతనగర్ వరకు పత్తిని తీసుకునిరావాల్సి వస్తోంది. తేమ చిక్కులు.. అమ్మకానికి తెచ్చిన పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే సీసీఐ సిబ్బంది కొనుగోలు చేస్తారు. 8 శాతం తేమ ఉంటే క్వింటా పత్తికి గరిష్టంగా రూ.8,100 చెల్లిస్తుండగా 12 శాతం తేమ ఉన్న పత్తికి కనిష్టంగా రూ.7,689 మద్దతు ధరగా నిర్ణయించారు. కపాస్ యాప్లో సూచించిన రోజున రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు. అక్కడి సీసీఐ సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలతో తేమ శాతాన్ని తనిఖీ చేస్తుండగా 12 శాతం కంటే ఎక్కువ ఉంటే తిరస్కరిస్తూ మరో రోజు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చేను నుంచి కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చేందుకు సగటున రూ.5000 పైగా ఖర్చవుతోంది. తేమ పేరుతో మరోసారి రావాలనే సీసీఐ సిబ్బంది సూచనలు రైతుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. మాది ఇల్లెందు మండలం. కపాస్ యాప్లో సుజాతనగర్ కొనుగోలు కేంద్రం పేరు వచ్చింది. 30 క్వింటాళ్ల పత్తిని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేందుకు కూలీలు, ట్రాలీ ఖర్చులు రూ.7500 అయ్యాయి. 9 శాతం తేమ ఉండటంతో ఆ మేరకు మద్దతు ధర లభించింది. కానీ నాతో పాటు వచ్చిన కొందరిని తేమ పేరుతో నిరాకరించగా వారు ఇబ్బంది పడ్డారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ మేరకు ధర నిర్ణయించి కొనుగోలు చేసే విషయాన్ని సీసీఐ పరిశీలించాలి. – వెంకటేశ్వర్లు, ఇల్లెందు చెట్టు నుంచి పత్తి తీసినప్పుడు 20 శాతానికి పైగా తేమ ఉంటుంది. దాన్ని ఆరబెట్టడం ద్వారా తేమ తగ్గుతుంది. ప్రస్తుతం 12 నుంచి 8 శాతం వరకు తేమ ఉన్న పత్తికి గరిష్ట మద్దతు ధర ఇస్తున్నట్టుగా 12 నుంచి 20 శాతం వరకు తేమ ఉన్న పత్తికి మరో రేటు నిర్ణయిస్తే రైతుల ఇబ్బందులు తొలగుతాయి. కానీ అలాంటి ఏర్పాట్లేవీ కొనుగోలు కేంద్రాల్లో లేవు. దూరాభారాలకు ఓర్చి, రవాణా ఖర్చులు భరించి గంటల తరబడి నిరీక్షించిన రైతులు, చివరకు తేమ శాతంతో ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. మరి కొన్ని సమయాల్లో మిల్లు వర్గాలే తేమ పేరుతో భారీగా కోత పెడుతూ పత్తిని కొంటున్నారు. ఈ రెండూ కాదంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో సగం మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి మద్దతు ధర పొందలేకపోతున్నారు. యాప్ విధానంతో పెరిగిన రవాణా భారం -
గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు హాస్పిటల్ బిల్లింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యాన హైదరాబాద్లోని కిమ్స్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇచ్చాక ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 – 26 ఏళ్ల వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, శిక్షణ సమయంలో మహిళలకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 29వ తేదీ ఉదయం 10గంటలకు ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో జరిగే ఇంటర్వ్యూలకు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని పీఓ సూచించారు. ‘తానా’ సమ్మేళనానికి ఆదివాసీ విద్యార్థినిభద్రాచలంటౌన్: ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన ఆదివాసీ విద్యార్థిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి బాల రచయితల సమ్మేళనంలో పాల్గొననుంది. భద్రాచలానికి చెందిన మడివి గురుత్వ సమందా సింగ్.. యజ్ఞజా స్కూల్లో చదువుతోంది. ఈనెల 30న 13 గంటల పాటు ‘బాలసాహిత్య భేరి‘ పేరుతో వర్చువల్గా జరిగే ఈ సమ్మేళనంలో 101 మంది పాల్గొననుండగా సమందా మూడు నిమిషాల పాటు కథ వినిపించనుంది. ఈ సందర్భంగా విద్యార్థిని యజ్ఞజా స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్.ఉషారాణి, ఉపాధ్యాయులు అభినందించగా.. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి, ఎంపీని కలిసిన డీసీసీ అధ్యక్షురాలుకొత్తగూడెంఅర్బన్: డీసీసీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తోట దేవీప్రసన్న బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ ఆమెను అభినందించారు. జిల్లాలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. ఆమె వెంట నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ ఉన్నారు. ఇన్చార్జ్ డీపీఓగా సుధీర్చుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారిగా భద్రాచలం డీఎల్పీఓ సుధీర్కు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం అదనపు బాధ్యతలు అప్పగించారు. డీపీఓ బి.అనూష శాఖాపరమైన శిక్షణకు వెళ్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓఈఆర్ 20.01 ప్రకారమే పామాయిల్ ధరఅశ్వారావుపేటరూరల్: ఓఈఆర్ 20.01శాతం, నట్(గింజలు)పై 10.08 శాతం ప్రకారమే పామాయిల్ టన్ను గెలల ధర చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయిల్ఫెడ్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఆయిల్ఫెడ్ కార్యాలయంలో ధర నిర్ణయంపై సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తాం
● సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ● జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి విడతలో మారుమూల, సమస్యాత్మక ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, నామినేషన్ల స్వీకరణకు 137 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అయితే మున్సిపాలిటీ ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల ను వెల్లడించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జిల్లా పర్యటన ఉంటుందా అని ప్రశ్నించగా మున్సిపాలిటీ లో కాబట్టి ఉంటుందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కండి.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. స్థానిక న్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని, పరస్పర సమన్వయంతో పోలింగ్ సాఫీగా సాగేలా కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీల హోర్డింగులు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని చెప్పారు. మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలపై నిఘా ఉంచాలని అన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ పాల్గొన్నారు. -
రాజ్యాంగం ఆవశ్యకత తెలుసుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం కూలీలైన్లో న్యాయ చైతన్య కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ హాజరై మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అందించిన హక్కులు, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హకు అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఉచిత న్యాయ సహాయం పొందేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ, రఘురామాచారి, సఖి అడ్మిన్ శుభశ్రీ, పారా లీగల్ వలంటీర్లు రాజమణి, భారతి, భాగ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ -
‘కూలీ’ కోసం కొట్లాట..
మణుగూరుటౌన్: తమ ఊరి సమీపాన నడుస్తున్న ఇసుక క్వారీలో తమకే అవకాశం కల్పించాలని కొంతమంది మహిళలు పాత కూలీలతో వాగ్వాదానికి దిగి కొట్లాడుకున్న సంఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీలో కొత్తకొండాపురం, కొమ్ముగూడెం ఇతర ప్రాంతాలకు చెందిన వారు పట్టా కట్టడం వంటి కూలీ పనులను ఏడాదికి పైగా చేస్తున్నారు. ఈక్రమంలో అన్నారం గ్రామస్తులు తమ ఊరి ఇసుక క్వారీలో తమకే అవకాశం కల్పించాలని ప్రస్తుతం పనిచేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక రోజు తమకి కల్పించి.. రెండు రోజులు పాతవారిని చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేయగా.. మంగళవారం వారి మధ్య వివాదం చేసుకుంది. ఈ అంశం మణుగూరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. ఈ విషయమై సీఐ నాగబాబును వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాధానమిచ్చారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత పాల్వంచరూరల్: మండల పరిధిలోని మామిడిగూడెం నుంచి పాల్వంచవైపుఅక్రమంగా తరలిస్తున్న ఇసుకట్రాక్టర్ను మంగళవారం ఎస్ఐసురేష్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండడంతో ట్రాక్టర్ యజమాని వజ్జ సత్యం, డ్రైవర్ పూనెం లవకుమార్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లారీ సీజ్.. దమ్మపేట: మండలంలోని మందలపల్లి క్రాస్రోడ్డు వద్ద ఓ ఇసుక లారీని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్ఐ సాయికిశోర్రెడ్డి ఆధ్వర్యాన తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ రాష్ట్రంలోని కొవ్వూరునుంచి తెలంగాణలోకి వస్తున్న ఇసుకలారీ పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. అన్నారం ఇసుక క్వారీ వద్ద గ్రామస్తుల వాగ్వాదం -
‘మైన్స్’లో పరిశోధనలు..
ఇల్లెందు: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్తగూడెం డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్థులు తొలిసారిగా ఇల్లెందు జేకే–5 ఓసీని సందర్శించారు. మంగళవారం యూ నివర్సిటీ ఫస్టియర్కు చెందిన 48 మంది (19 మంది బాలురు, 29 బాలికలు) బీఎస్సీ ఫిజికల్ సైన్స్(ఎన్విరాన్మెంటల్, జియాలజీ) విద్యార్థులు ఆ విభాగ ఇన్చార్జ్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యాన ము గ్గురు ఫ్యాకల్టీతో కలిసి మూతపడిన ఓసీలో పర్యటించారు. యూనివర్సిటీ ప్రారంభమైన తొలి విద్యా సంవత్సరంలోనే గత నెల రోజులుగా మూతబడిన ఇల్లెందు జేకే ఓసీ–5తో పాటు సమీపాన ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టును సందర్శించి పరి శీలించారు. ఈసందర్భంగా ఇన్చార్జ్ రాజ్యలక్ష్మి మా ట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో పాటు భూమి పొరల్లో లభించే బొగ్గు, ఇతర ఖనిజ సంపద వల్ల దేశానికి ఒనగూరే లాభం, తర్వాత మళ్లీ అదే భూమిని పరిరక్షించాల్సిన విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. -
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ములకలపల్లి: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకు ల బాలకల పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థినిగొడ్ల అంజు శ్రీ సబ్ జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. హర్యానాలో రేపటి నుంచి జరిగే కబడ్డీ పోటీల్లో అంజుశ్రీ పాల్గొననుంది. అలాగే 10వ తరగతి విద్యార్థిని అక్విల సాయిశ్రీ ఎస్ జీఎఫ్ అండర్–19 విభాగంలో ఖో–ఖో క్రీడలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనుండగా.. వీరిని మంగళవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ సునీత, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం అభినందించారు. దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి కొర్సా నాగేంద్రబాబు అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం నర్సింహారావు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో పెద్దపల్లిలో జరిగే పోటీల్లో నాగేంద్రబాబు పాల్గొననుండగా.. మంగళవారం పాఠశాలలో విద్యార్థిని హెచ్ఎంతో పాటు పీడీ హరికృష్ణ, పీఈటీ గంగరాజు తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికలు సూపర్బజార్(కొత్తగూడెం): రాజన్న సిరిసిల్ల లో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల వాలీబాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను స్థానిక ప్రకాశం స్టేడియంలో మంగళవారం నిర్వహించారు. తొలుత రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. డీవైఎస్ఓ పరంధామరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ యుగంధర్రెడ్డి, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు వై.వెంకటేశ్వరరావు, కాంతారావు, కొండం వెంకన్న, జగన్మోహనాచారి, రాంబాబు, నాగేంద్ర త్రివేది, భద్రం, రామారావు, ఉస్మాన్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్టు అశ్వారావుపేటరూరల్: భూ వివాదంలో కత్తులతో దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను హత్యాయత్నం కేసులో మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడెం కాలనీ పరిధిలోని 75 సెంట్ల వ్యవసాయ భూమి విషయంలో మంగా గణేష్, మంగా వెంకటేష్లపై కత్తులతో దాడి చేసిన అదే గ్రామానికి చెందిన గేదల విష్ణుమూర్తి, గేదల సురేష్, గేదల వినయ్ అనే నిందితులను అరెస్టు చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచారు. దీంతో ముగ్గురిపై రిమాండ్ విధించడంతో సత్తుపల్లి సబ్జైల్కు తరలించారు. నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ఇల్లెందురూరల్: నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగాపోలీసుశాఖ ఆధ్వర్యాన పలు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ చంద్రబాను అన్నారు. మండలంలోని కొమరారం గ్రామపంచాయతీ ఇంద్లాతండా లో మంగళవా రం కార్డన్ సెర్చ్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. తొలుత ఇంటింటికి వెళ్లి వాహనాలను పరిశీలించడంతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. సీఐలు రవి, ఎస్సై నాగుల్మీరా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మో‘గని’ రైలు కూత..
మణుగూరు టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీటీపీఎస్కు నిత్యం సుమారు 14వేల టన్నుల బొగ్గును తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైల్వే ట్రాక్ నిర్మించాలని అధికారులు ప్రతి పాదించగా.. పనుల జాప్యంతో ఒక అడుగు ముందుకు రెండుఅడుగులు వెనక్కు అన్న చందంగా ఏళ్లతరబడి కొనసా..గుతూనే ఉన్నాయి. పనులు ప్రా రంభమైన ఏడాదిలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ తమకు నేటికీ సరైన పరిహారం అందలేదంటూ భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించడంతో బీటీపీఎస్ కు రైలు కూత పెట్టేలా లేదు. దీంతో బీటీపీఎస్ కు కావాల్సిన బొగ్గును నిత్యం లారీలతో తరలిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నా యి. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేసినా.. జాప్యం చేయడంతో మరింత జఠిలంగా మారింది. దీంతో ట్రాక్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నేటికీ సాగుతున్న పనులు 2021లో రూ.150 కోట్లతో సుమారు 16 కిలోమీటర్ల మేర మణుగూరు ఏరియా సింగరేణి నుంచి విప్పలసింగారం, పైలట్కాలనీ, రామానుజవరం మీదుగా బీటీపీఎస్కు రైల్వే ట్రాక్ ఎస్సీఆర్, టీఎస్ఆర్ కంపెనీలు పనులు చేపట్టాయి. ఈ పనులు ప్రారంభించిన నాడు భూ సేకరణ పూర్తయిన ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కొందరు రైతులు తమ వద్ద తీసుకున్న భూమికి సరిపడా పరిహారం అందించలేదని, మరికొందరు తమకు ఉద్యోగం కావా లని కోర్టును ఆశ్రయించడంతో సుమారు తొమ్మిది కిలోమీటర్లు ట్రాక్ పనులు చివరిదశకు రాగా, కోర్టులో ఉన్న సుమారు 40 కేసుల వల్ల ప్రస్తుతం ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇంకా ఏడు కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉంది. స్థల సేకరణలో వచ్చిన అవాంతరాలను జిల్లా అధికారులు, రెవెన్యూ అధి కారులు పరిష్కరించి స్థలాన్ని సదరు కంపెనీలకు అప్పగించాల్సి ఉన్నా.... అడపాదడపా మాత్రమే అధికారులు ఆ అంశంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో నిర్మాణ భారం పెరగడంతో పాటు ట్రాక్ పనుల్లో నిస్తేజం నెలకొంటోంది. బీటీపీఎస్కు రోజుకు 14–16 వేల టన్నుల బొగ్గు అవసరం ఉండగా, ట్రాక్పనులు పూర్తి కాకపోవడంతో వందల టిప్పర్ల ద్వారా బొగ్గును తరలిస్తున్నారు. దీంతో అవగాహన లేని డ్రైవర్లు, ఫిట్నెస్ లేని లారీలతో నిత్యం ప్రమాదాలకు మణుగూరు–బీటీపీఎస్ రోడ్డు కేంద్రంగా మారుతోంది. అధిక లోడ్ల రాకపోకలతో రోడ్డు ఛిద్రమవడంతో పాటు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయి, వందల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ట్రాక్ పనుల్లో వేగం పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఆగిన బీటీపీఎస్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు -
మహిళా సాధికారతకు చేయూత
సూపర్బజార్(కొత్తగూడెం): వడ్డీలేని రుణాలు మహిళా సాధికారతకు చేయూత అవుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం నిర్వహించిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తే వ్యాపార దక్షత పెరుగుతుందని, పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ ప్లాంట్ల వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని అన్నారు. జిల్లాకు మొత్తం రూ.10.74 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి రూ 2.70 కోట్లు, భద్రాచలానికి రూ.1.51 కోట్లు, కొత్తగూడేనికి రూ.1.97 కోట్లు, పినపాకకు రూ. 2.66 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గానికి రూ.1.38 కోట్లు కేటాయించామని, మొత్తం 11,423 మహిళా సంఘాలకు లబ్ధి చేకూరిందని వివరించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు మండే హనుమంతరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, అదనపు డీఆర్డీఓ నీలేష్ పాల్గొన్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చండ్రుగొండ: భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని, ఈ దిశగా బయోచార్ నిర్మాణాలకు రైతులు ముందడుగు వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. మండలంలోని దామరచర్ల, పోకలగూడెం గ్రామాల్లో మంగళవారం ఆయన బయోచార్(వాటర్ రీచార్జ్ పిట్)లను పరిశీలించారు. గతంలో ఇంకుడు గుంతల నిర్మాణాల్లో జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఫలితంగా జిల్లాకు అవార్డు దక్కిందని గుర్తు చేశారు. ఇంకుడుగుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలి కొత్తగూడెంఅర్బన్: పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటైన 24 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య పటిష్టంగా అందితేనే భవిష్యత్లో వారు ఉన్నత విద్యావంతులుగా తయారవుతారని చెప్పారు. డీఈఓ బి.నాగలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పిల్లల అభివృద్ధికి ఉపయోగించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో అధికారులు నాగరాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్, స్వరూప్కుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి
కొత్తగూడెంఅర్బన్ : జిల్లా స్థాయి సైన్స్ఫేర్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం పూర్తయింది. విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను బుధవారం ప్రదర్శించనుండగా విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ మేరకు కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, విద్యార్థులు, గైడ్ టీచర్లు మంగళవారమే పాఠశాలకు చేరుకుని పేర్లు, ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించుకున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కాకుండా మూడు రోజుల పాటు ప్రాజెక్టుల ప్రదర్శన, బహుమతుల ప్రదానం కార్యక్రమాలు నిర్వహించగా, ఈ ఏడాది ఒకరోజు తగ్గించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన దూర ప్రాంత విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం పాత కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్, సింగరేణి మహిళా కళాశాల ఎదుట ఉన్న హాస్టల్లో వసతి ఏర్పాటు చేశారు. దగ్గరగా ఉన్నవారు ఇంటికి వెళ్లి బుధవారం మళ్లీ రానున్నారు. సర్వం సిద్ధం చేశాం.. కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించనున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు సిద్ధం చేశామని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. పాఠశాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత సైన్స్ఫేర్లో జరిగిన తప్పులు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సైన్స్ఫేర్ను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. భోజనాలు, తాగునీటి సౌకర్యం, దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారికి వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి ప్రాజెక్టులు తయారుచేశారని చెప్పారు. ప్రదర్శన సమయంలో న్యాయ నిర్ణేతలు అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు. బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ వేడుకలకు మంత్రులు, ఎంపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సంపత్కుమార్, డీసీఈబీ కార్యదర్శి నీరజ, జిల్లా మానిటరింగ్ అధికారులు నాగ రాజశేఖర్, సతీష్, సైదులు, కొత్తగూడెం ఎంఈఓలు మధురవాణి, బాలాజీ, జుంకీలాల్, సెయింట్ మేరీస్ పాఠశాల హెచ్ఎం రూబీ తదితరులు పాల్గొన్నారు.జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు నేడు ప్రదర్శించాల్సి ఉండగా వారికి కేటాయించిన గదుల్లో మంగళవారమే సెట్ చేసి పెట్టుకున్నారు. సుస్థిర వ్యవసాయం విభాగంలో 105 ప్రాజెక్టులు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో 85, హరిత శక్తి – పునరుత్పాదక శక్తి విభాగంలో 78, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత విభాగంలో 136, వినోద భరితమైన గణిత నమూనా విభాగంలో 61, ఆరోగ్యం, పరిశుభ్రత విభాగంలో 101, నీటి సంరక్షణ, నిర్వహణ విభాగంలో 74.. ఇలా మొత్తం 733 మంది విద్యార్థులు తమ పేర్లు, ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
పల్లె పోరుకు నగారా!
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. మొదటి విడత ఎన్నికలకు ఈనెల 27 నుంచి 29 వరకు, రెండో విడత పోలింగ్కు సంబంధించి ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు. సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులకు స్వతంత్ర గుర్తులను కేటాయిస్తారు. జిల్లాలో 471 గ్రామపంచాయతీల పరిధిలో 4,168 వార్డులు ఉన్నాయి. – చుంచుపల్లిగ్రామపంచాయతీలు 471 గ్రామీణ ఓటర్లు 6,69,048 పోలింగ్ కేంద్రాలు 4,242 ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే 90 శాతం పనులను అధికారులు పూర్తి చేశారు. ఓటరు జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తయ్యాయి. ఆర్ఓలు, ఏఆర్ఓలకు, పీఓలు, ఏపీఓలకు రెండు విడుతలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. 471 పంచాయతీలకు గాను ఎస్టీలకు 460, ఎస్సీలకు 2, జనరల్ అభ్యర్థులకు 9 స్థానాలు, 4,168 వార్డులకు గాను ఎస్టీలకు 2,648, ఎస్సీలకు 18, బీసీలకు 17, జనరల్ అభ్యర్థులకు 1,485 కేటాయించారు. విడతల వారీగా వివరాలిలా.. తొలివిడతలో అశ్వాపురం మండలంలో 24 జీపీలు, బూర్గంపాడులో 18, భద్రాచలంలో 01, దుమ్ముగూడెంలో 37, చర్లలో 26, కరకగూడెంలో 16, మణుగూరులో 14, పినపాక మండలంలో 23 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 పంచాయతీలు, అశ్వారావుపేటలో 27, చండ్రుగొండలో 14, చుంచుపల్లిలో 18, దమ్మపేటలో 31, ములకలపల్లిలో 20, పాల్వంచ మండలంలోని 36 జీపీలకు పోలింగ్ ఉంటుంది. మూడో విడతలో ఆళ్లపల్లి మండలంలోని 12, గుండాలలో 11, జూలూరుపాడులో 24, లక్ష్మీదేవిపల్లిలో 31, సుజాతనగర్లో 13, టేకులపల్లిలో 36, ఇల్లెందు మండలంలో 29 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 4,242 పోలింగ్ కేంద్రాలు, 10,223 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మో‘గని’ రైలు కూత.. బీటీపీఎస్కు నిత్యం సుమారు 14వేల టన్నుల సింగరేణి బొగ్గును తరలించే రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విడత జీపీలు వార్డులు మొదటి 159 1,436 రెండో 156 1,392 మూడో 156 1,340 -
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీసీ రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి నాటకమాడారని విమర్శించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ జాతీయపార్టీల కంటే ప్రాంతీయ పార్టీల్లోనే క్రమశిక్షణ, నిబద్ధత ఎక్కువగా ఉంటుందని అన్నారు. పార్టీలో గ్రూపులేమీ లేవని, అందరిదీ కేసీఆర్ గ్రూపేనని వ్యాఖ్యానించారు. రాబోయే అన్ని ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, నాయకులు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరో సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదవులు తనకు కొత్త కాదని వ్యాఖ్యానించారు. దీక్షా దివస్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
స్వామివారి వస్త్రాల పేరుతో టోకరా
● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న రామాలయ సిబ్బంది ● కాంట్రాక్టర్కు నోటీసు జారీ చేశామన్న ఈఓ భద్రాచలం : భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, వారికి టోకరా వేస్తూ దేవుడి పేరుతో దొంగ వస్త్రాల అమ్ముతున్న కాంట్రాక్టర్ వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న వస్త్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కాంట్రాక్టర్కు నోటీసు జారీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి. వెలుగు చూసిందిలా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రామయ్యకు వస్త్రాలు సమర్పిస్తుంటారు. వీటిని మూలమూర్తుల పాదాల చెంతన ఉంచి పూజలు చేస్తారు. పట్టు వస్త్రాలను ముఖ్యమైన ఉత్సవాల సమయంలో స్వామి, అమ్మవార్లకు అలంకరింపజేస్తారు. ఇతర వస్త్రాలను సంబంధిత కాంట్రాక్టర్కు అప్పగించి, దేవస్థానం నిర్ణయించిన ధరల ప్రకారం ఆంజనేయస్వామి ఉపాలయం పక్కనున్న కౌంటర్లో విక్రయిస్తుంటారు. అయితే మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో కౌంటర్ వద్ద కొబ్బరికాయల లైసెన్సుదారుడి తరఫున పని చేస్తున్న ఓ మహిళ.. కవరులో కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి భక్తులు సమర్పించారని చెబుతూ నకిలీ ఫోన్ నంబర్లుతో అందులో పనిచేసే తాతారావు అనే వ్యక్తికి అప్పగించింది. ఈ సమాచారం అందుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ ఏఈఓ, పర్యవేక్షకులు వాటిని తనిఖీ చేశారు. దీంతో బార్కోడ్ చేయని 8 ధోవతులు, 4 పంచెలు, 3 చీరలు లభ్యమయ్యాయి. నకిలీ వస్త్రాలను సిబ్బంది పట్టుకున్న మాట వాస్తవమే. దీనిపై ఏఈఓలతో కూడిన బృందం విచారణ జరిపింది. సదరు కాంట్రాక్టర్ వివరణ కోసం నోటీసు జారీ చేశాను. నిజనిర్ధారణ అనంతరం చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – దామోదర్రావు, ఈఓ గతంలో స్వామి వారి వస్త్రాలను ఇష్టారీతి ధరలతో అమ్మడంతో పాటు బయట వస్త్రాలను స్వామి వారి పేర్లతో అమ్ముతున్నట్లుగా నాటి ఈఓ రమాదేవి గుర్తించారు. దీనిపై ఆమె అప్పటికప్పుడే సదరు ఆలయ సిబ్బందితోనే అమ్మకాలు జరిపించారు. పారదర్శకంగా ఉండేందుకు బార్కోడ్ను ఏర్పాటు చేసి నిర్ణయించిన ధరలకే విక్రయించారు. తదనంతర కాలంలో మరో వ్యక్తి ఈ కాంట్రాక్ట్ పొందారు. రెండు నెలల క్రితం అన్యమత ప్రచారంతో కూడిన కవర్లను భక్తులకు అందించడం, వారు కాంట్రాక్టర్పై ఈఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ ఘటన చోటుచేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకొని భక్తుల నమ్మకం వమ్ము కాకుండా దేవస్థానం వర్గాలతోనే విక్రయాలు చేపట్టాలని, తద్వారా రామయ్యకు సైతం ఆదాయం లభిస్తుందని అంటున్నారు. -
కొత్త ప్లాంట్కు మరో ముందడుగు
పాల్వంచ: పాల్వంచలో నూతన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో రామగుండం థర్మల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని, పాల్వంచ, మక్తల్ ప్రాంతాల్లోనూ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్వే నివేదిక సానుకూలం.. కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో 720 మెగావాట్ల సామర్థ్యం గల ఓఅండ్ఎం(పాత ప్లాంట్) కాలం చెల్లడంతో దాన్ని కూల్చేశారు. కాగా ఇక్కడి భౌగోళిక వనరులన్నీ మరో రెండు ప్లాంట్లకు అనుకూలంగా ఉండడంతో కొత్త ప్లాంట్లు నిర్మించాలనే డిమాండ్ వ్యక్తమైంది. అభివృద్ది కుంటిపడకుండా, అతి తక్కువ ఖర్చుతోనే మరో ప్లాంట్ నిర్మించేందుకు అవకాశం ఉండగా కేంద్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో డిజైన్ కంపెనీ సైతం ఇటీవల సర్వే చేసి సానుకూలంగా నివేదిక అందించింది. ఈ క్రమంలో పాల్వంచలో ప్లాంట్ నిర్మాణానికి అనుకూలతపై తగు నివేదిక అందించాలని సీఎం కోరడం విశేషం. ఇక్కడ ఒక ప్లాంట్ కాకుండా రెండు 800 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలుమార్లు సీఎంను కోరారు. ఎట్టకేలకు సర్కారు నిర్ణయంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
బైక్ ఢీకొని మహిళ మృతి
దుమ్ముగూడెం: వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బైరాగులపాడు గ్రామానికి చెందిన కొప్పుల రాజేశ్వరి (40 ) ఆదివారం సాయంత్రం రోడ్డు దాటుతోంది. అదేసమయంలో బైక్పై వస్తున్న చిన్న నల్లబెల్లి గ్రామానికి చెందిన పూసం రాజేష్ ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలుకాగా ఆమెను భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. బైక్ కల్వర్టులో పడి.. మండలంలోని బుర్రవేములా గ్రామ శివారు నందులచెలక గ్రామానికి చెందిన సోయం రాజాబాబు(26) పని నిమిత్తం లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంక్కు వస్తున్నా డు. ఈ క్రమంలో వస్తుండగా బుర్రవేములా శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టులో పడింది. దీంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రాజాబాబు భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మెకా నిక్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమాదాలపై సీఐ వెంకటప్పయ్య, ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలుఅశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన ఘటన సోమవారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పేరాయిగూడెం సమీపంలో ద్విచక్రవాహనం, స్కూటీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నా యి. ఈ ఘటనలో పట్టణంలోని ఫైర్ కాలనీకి చెందిన మేకా అమర్నాథ్కు తీవ్ర గాయాలు కాగా, ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురిపై కేసు నమోదుపాల్వంచరూరల్: దాడి ఘటనలో నలుగురిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన పల్ల పు సరోజ తన భర్త హరిబాబు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ స్టేషన్కు పిలిపించి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా హరి బాబు, అతని సోదరి పేవళ్ల ఏలిశమ్మలపై భార్య తరఫు బంధువులు కిన్నెరసాని సెంటర్లో అడ్డగించి దాడి చేశారని హరిబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడిచేసిన గండికోట అచ్చయ్య, బాలకృష్ణ, మల్లయ్య, దన్నళ్ల వెంకన్నలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఆటో డ్రైవర్పై..ఇల్లెందురూరల్: ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిలో కొమరారం ఎస్సై నాగుల్మీరా సోమవారం వాహన తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో ఇల్లెందు నుంచి గుండాల వైపుగా 20 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న ఆటోను నిలిపి డ్రైవర్ ఆంగోత్ చంద్రుపై కేసు నమోదు చేశారు. డ్రైవర్తోపాటు, ప్రయాణికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. పేకాట స్థావరంపై దాడులుజూలూరుపాడు: జూలూరుపాడు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పేకాటస్థావరంపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. అన్నారుపాడు గ్రామానికి చెందిన ముగ్గురు పేకట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.2,000నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ దయానంద్ తెలిపారు. -
భూవివాదంలో ఘర్షణ
● కత్తులతో దాడి, ఇద్దరి పరిస్థితి విషమం ● మరో ఇద్దరికి స్వల్ప గాయాలుఅశ్వారావుపేటరూరల్: భూ వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందినవారు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన మంగా గణేష్, మంగా వెంకటేష్, మణికంఠ, గోవింద్ కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన గేదల విష్ణుమూర్తి, గేదల సురేష్, వినయ్ కుటుంబీకుల మధ్య కొద్ది నెలలుగా సర్వే నంబరు 1228లో ఉన్న 75 సెంట్ల వ్యవసాయ భూమి విషయంలో వివాదం జరుగుతోంది. ఆ భూమిలో గణేష్ కుటుంబీకులు అరటి తోటను సాగు చేస్తుండగా, 10 రోజుల క్రితం అరటి చెట్లను నరికివేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు గేదల విష్ణుమూర్తి కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆభూమి తమదేనంటూ గేదల విష్ణుమూర్తి, తనయుడు సురేష్, మనవడు వినయ్ కలిసి కర్రలు, కత్తులతో విచక్షరహితంగా దాడి చేశారు. దీంతో మంగా గణేష్, వెంకటేష్లకు తీవ్రగాయాలయ్యా యి. మరో ఇద్దరు మంగా మణికంఠ, గోవింద్ స్వ ల్పంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గణేష్, వెంకటేష్ పరిిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడు మంగా మణికంఠ ఫిర్యాదుతో గేదల విష్ణుమూర్తి, సురేష్, వినయ్పై హత్యాయత్నాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలి
దుమ్ముగూడెం: ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేసేవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని పర్ణశాల క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై ఇసుక లారీల ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు స్వాహాచేస్తూ ఏజెన్సీ లోని ప్రధాన రహదారి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. లారీల రాకపోకలతో దుమ్ము, ధూళి లేచి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని అనానరు. అభివృద్ధి చేస్తానని చెప్పి పార్టీ మారి న ఎమ్మెల్యే వ్యక్తిగత అభివృద్ధే చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, సాగి శ్రీని వాసరాజు, కణితి రాముడు, జానీ పాషా, రేసు లక్ష్మి, జోగా వెంకటరమణ, కొత్తూరు సీతా రామారావు, బొల్లి వెంకట్రావు, భూక్యాచందు, సోడి జ్యోతి పాల్గొన్నారు. జమేదార్ల శిక్షణ ప్రారంభంకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని సింగరేణి ఎస్అండ్ పీసీ ట్రైనింగ్ సెంటర్లో 14వ బ్యాచ్ జమేదార్ల శిక్షణా తరగతులు సోమవారం ప్రా రంభమయ్యాయి. సెక్యూరిటీ విభాగం మేనేజర్ జీఎం జాకీర్ హుస్సేన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రా రంభించి మాట్లాడారు. జమేదార్లు ఫ్రంట్లైన్ సూపర్ వైజర్గా కీలకపాత్ర పోషిస్తారని అన్నా రు. మెరుగైన వృత్తి నైపుణ్యం, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, సింగరేణి ఆస్తులను పరి రక్షించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ట్రైనింగ్ ఇన్స్పెపెక్టర్ డి.నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నికమణుగూరు టౌన్: సీఐటీయూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. మణుగూరులోని కిన్నెర కల్యాణ మండపంలో 4వ జిల్లా మహాసభలు రెండు రోజులపాటు నిర్వహించారు. సోమవా రం 45 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కొలగాని బ్రహ్మాచారి, కార్యదర్శిగా ఏజే రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా జీలకర్ర పద్మ, పిట్టల అర్జున్, గద్దల శ్రీనివాస్రావు, నబీ, దొడ్డ రవికుమార్, వెంకటరాజు, ఈసావెంకటమ్మ,సహాయ కార్యదర్శు లుగా సత్య, ధనలక్ష్మితోపాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఇటీవల తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలిపాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల కోసం తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న కోచింగ్ క్యాంప్ను సద్వి నియోగం చేసుకోవాలని ఏటీడీఓ చంద్రమోహన్ అన్నారు. మండల పరిధి కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో సోమవారం శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వచ్చే నెల 3,4,5వతేదీల్లో ఏటూరునాగారంలోజరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ క్రీడలకు సంబంధించి 124 మంది ఎంపికయ్యారని తెలిపారు. వారికి డిసెంబర్ 2వ తేదీ వరకు శిక్షణ ఇస్తామని తెలి పారు. క్రీడల అధికారి బొల్లి గోపాల్రావు, ఏ ఎస్ఓ కొమరం వెంకటనారాయణ, సోయం నాగేశ్వరరావు, పీడీ బాలసుబ్రమణ్యం, హెచ్ఎం చందు, శిక్షకులు వెంకన్న, రాంబాబు, గోపాల్రావు, మోతీలాల్, ఎస్.వీరభద్రం, బాబురావు, డి.అంజివాసు, మండల్ సతీష్ పాల్గొన్నారు. -
29 ఆలయాలకే డీడీఎన్
ఖమ్మంగాంధీచౌక్: కనీస ఆదాయం లేని దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు సాఫీగా జరిగేలా ప్రవేశపెట్టిన డీడీఎన్ పథకం అమలుపై అర్చకులు పెదవి విరుస్తున్నారు. ఈ పథకం ద్వారా అర్చకుల నియామకం, ధూపదీపాలు, నైవేద్యం కోసం ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయి. తొలుత నెలకు రూ.6 వేలు చొప్పున అందించినా ఆతర్వాత రూ.10 వేలకు పెంచారు. ఇందులో అర్చకుడి గౌరవ వేతనం రూ.6వేలు, ఆలయంలో నైవేద్యానికి రూ.4 వేల చొప్పున కేటాయించారు. ఇటీవల డీడీఎన్ పథకానికి ఆలయాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 250 ఆలయాలకు మాత్రమే అవకాశం కల్పించడం గమనార్హం. ఖమ్మం నియోజకవర్గానికి స్థానమే లేదు... డీడీఎన్ పథకం అమలుకోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. ఖమ్మం జిల్లా నుంచి 165, భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి 65 కలిపి 230 దరఖాస్తులు అందితే ప్రభుత్వం కేవలం 29 ఆలయాలకే అవకాశం కల్పించింది. ఖమ్మం జిల్లాకు 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే ఆలయానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచి 14, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఎనిమిది, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మూడేసి ఆలయాలు ఉండగా, రాష్ట్ర మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో ఏ ఆలయానికి అవకాశం దక్కలేదు. ఇక భద్రాద్రి జిల్లాలో కేవలం ఒక ఆలయానికి చోటు కల్పించారు. బూర్గంపాడు మండలం టేకులచెరువు సీతారామాంజనేయ స్వామి ఆలయానికి పథకం వర్తింపచేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ జిల్లాలో దాదాపు 300 ఆలయాలు ఉండగా, డీడీఎన్ పథకం కేవలం 120 ఆలయాలకే వర్తిస్తోంది. మరి న్ని ఆలయాలకు వర్తింపచేయాలని దరఖాస్తులు సమర్పిస్తే అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ప్రజానిధులు చొరవ చూపి జాబితాలో మరిన్ని ఆలయాలకు చోటు కల్పించాలని భక్తులు, అర్చకులు కోరుతున్నారు. దరఖాస్తులు 230.. అనుమతి 29 -
ఎగ్ బిర్యానీ వడ్డించరా..?
భద్రాచలంఅర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో గత జూన్లో ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకాన్ని అమలు చేయడంలేదు. కొరవడిన సౌకర్యాలు, నిధుల లేమితో ఎగ్ బిర్యాని సొంత ఖర్చులతో భరించలేమని టీచర్లు చేతులెత్తేయడంతో పథకం ఒక్కరోజుతోనే ముగిసిపోయింది. ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా గత జూన్ 11న ఎగ్ బిర్యాన్నీ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ప్రారంభానికి ఉత్సాహం చూపిన అధికారులు ఆ తర్వాత అమలుపై దృష్టి పెట్టలేదు. జిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటి పరిధిలో 8,068 మంది గర్భిణులు, 3,567 మంది బాలింతలు, 3 ఏళ్లలోపు పిల్లలు 33,954 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 27,622 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. కేంద్రాల్లో వచ్చే పిల్లల సంఖ్య పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎగ్ బిర్యానీ పథకం ప్రారంభించారు. కేంద్రంలో ఉండే బియ్యం, ఆహార పదార్థాలతో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసి ఐదు నెలలు దాటింది. కానీ అదనపు నిధులు కేటాయించలేదు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు కూడా చెల్లించడంలేదని, ఇంకా ఎగ్ బిర్యానీ తయారీకి డబ్బులు ఎక్కడి నుంచి తేవా లని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అల్పాహారం సైతం అందిస్తామని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. స్పష్టత కూడా లేదు... పథకాన్ని ప్రారంభించాక ఐసీడీఎస్ అధికారుల సూచనలతో జిల్లాలో కొందరు అంగన్వాడీ టీచర్లు ఎగ్ బిర్యానీ తయారు చేసి వడ్డించారు. ఆ తర్వాత నిధులు విడుదలో జాప్యం జరగడంతో మానేశారు. బిర్యానీ తయారీకి మసాలా దినుసులను ప్రభుత్వం సరఫరా చేస్తుందా,? టీచర్లే కొనుగోలు చేసి బిల్లులు పెట్టాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీచర్లు ముందుకు రావడం లేదు. సంబంధింత అధికారులు స్పందించి ఎగ్ బిర్యాన్నీ పథకాన్ని అమలు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
గ్రావెల్ ట్రాక్టర్లు సీజ్
భద్రాచలంటౌన్: అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్చేశారు. పట్టణ శివా రు ప్రాంతాల్లో కొందరు అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండగా తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనమతులు లేకపోవడంతో మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, జరిమానా విధించారు. నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షసూపర్బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: పోక్సో కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు 1,000 రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇన్చార్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా.. బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్కు చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన కల్తీ వెంకటేశ్వర్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020 డిసెంబర్ 12న ఫిర్యాదు అందగా, పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. 10 మంది సాక్షులను విచారించగా, నిందితుడు కల్తీ వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించగా, ఎస్సై డి.రాఘవయ్య, లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి మహమ్మద్ అక్రమ్ సహకరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ..దమ్మపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు నాలుగు రోజుల జైలుశిక్షను విధిస్తూ దమ్మపేట కోర్టు జడ్జి భవాని సోమవారం తీర్పునిచ్చారు. అదే కేసులో మరో 8మంది వ్యక్తులకు నాలుగు రోజులపాటు కమ్యూనిటీ సర్వీస్ను శిక్షగా విధించారు. -
అభివృద్ధి పనుల పేరుతో ఇసుక రవాణా
బూర్గంపాడు: మండల పరిధిలోని పాత గొమ్మూరు వద్ద గోదావరి నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సోమవారం నాగినేనిప్రోలు గ్రామస్తులు అడ్డుకున్నారు. సారపాకలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు(సీసీ రోడ్డు) పనులకు ఇసుక సరఫరా చేస్తున్నామని ట్రాక్టర్ల యజమానులు పేర్కొనగా, అనుమతి పత్రాలేవంటూ గ్రామస్తులు నిలదీశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు అక్కడకు చేరుకుని ఇసుక రవాణాకు కూపన్లు ఇవ్వలేదని తెలిపారు. సీసీరోడ్ల నిర్మాణాలకు కాంట్రా క్టర్లు రాయల్టీ చెల్లించి ఇసుక కొనుగోలు చేయాలని, అలా కాకుండా అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో ఇసుకను అధికారికంగా తీయాలంటే మైనింగ్ శాఖ అనుమతులుండాలని పేర్కొన్నారు. రెవెన్యూ అధి కారులు చెప్పారని ఇసుకను తరలించటం అక్రమమేనని స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. దీంతో అధికారులు ఏడు ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి ఇసుకను అక్కడ అన్లోడ్ చేయించారు. కాగా కూపన్లు ఇచ్చాకే ఇసుక రవాణా చేయాలని అధికారులు సూచించారు.అనుమతుల్లేకపోవడంతో అడ్డుకున్న గ్రామస్తులు -
డిజిటల్ అరెస్ట్ పేరుతో వైద్యుడికి బెదిరింపులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ సుబ్బరాజును.. సీబీఐ అధికా రులమంటూ డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించారు. సుబ్బరాజు స్థానికంగా నీలా నర్సింగ్ హోమ్ పేరుతో ఆస్పత్రి నడుపుతున్నారు. ఆయనకు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎన్ఎస్ఐ ఏజెంట్ అధికారాలమంటూ శుక్రవారం నుంచి ఆదివారం వరకు గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్స్ చేశారు. ముంబైలో ‘మీ ఏటిఎం కార్డు దుర్వి నియోగం చేస్తూ రూ.20లక్షలు వాడుకున్నారని, మీ బ్యాంకులకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పకుంటే 90 రోజుల జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో భయపడిన వైద్యు డు తనతో పాటు అతడి భార్యకు సంబంధించిన బ్యాంక్ వివరాలన్నీ చెప్పారు. అతడి కోడలు హేమ చంద్రప్రభ ఫోన్ను సైతం పూర్తిగా హ్యాక్ చేశారు. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ ‘మీ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మేం అడిగిన వివరాలు ఇవ్వకుంటే ముంబై కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలు చెబితే హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది’ అని చెప్పారు. ప్రస్తుతం మిమల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, మీరు ఇంట్లో కిటికీలు, తలుపులు మూసేసి విచారణలో పాల్గొనాలని బెదిరించారు. ఈ క్రమంలో ధైర్యం చేసిన వైద్యుడి కోడలు తమ ఆస్పత్రిలో పని చేస్తున్న మధు అనే వ్యక్తికి వివరాలు చెప్పగా ఆయన జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అశోక్కు సమాచారం అందించారు. సోమవారం డీఎస్పీ నర్సింగ్హోమ్కు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దీనిపై సుబ్బరాజు మాట్లాడుతూ.. డిజిటల్ ఆరెస్ట్ అంటూ నేరగాళ్లు వేధింపులకు ప్పాడిన విష యం వాస్తమేనని, మూడు రోజుల పాటు భయాందోళనకు గురయ్యామని చెప్పారు. కాగా మధు అనే వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తనతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఉన్న నగదు నష్టపోకుండా బయటపడ్డామని తెలిపారు. కాగా, భద్రాచలంలో గతంలోనూ ఇద్దరు వైద్యులకు ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర డిగ్రీ, జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈమేరకు స్పెషల్ ఆఫీసర్ ఎస్కే. బురాన్ సోమవారం వివరాలు వెల్లడించా రు. అండర్–19 విభాగంలో హ్యాండ్బాల్లో ఎం. యశ్వంత్, వాలీబాల్లో టి.సాయిరాం, అండర్–17 విభాగంలో సాఫ్ట్బాల్లో జే. ప్రజ్ఞాన్, బి. హరీష్, ఖోఖోలో ఏ. వీరభద్ర, హ్యాండ్బాల్లో టీ.విష్ణు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలి పారు. సోమవారం కళాశాలలో విజేతలను స్పెషలాఫీసర్తోపాటు పీడీ డాక్టర్ రఘువరన్, ఏపీటీ శ్రీకాంత్, డిప్యూటీ వార్డెన్ మధు తదితరులు అభినందించారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలికరకగూడెం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ సూచించారు. సోమవారం మండల పరిధి లోని మధ్యలగూడెం, పడిగాపురం, రేగళ్ల, వీరాపు రం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. లోపాలు ఉంటే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేవించారు. ఆయన ఏఈ వినీత, ఎంపీఓ మారుతి యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ -
జనసేవాదళ్ శిక్షణ ప్రారంభం
సూపర్బజార్(కొత్తగూడెం): ీసపీఐ అనుబంధ జనసేవాదళ్ వలంటీర్ల శిక్షణ రామవరం సాధన క్రీడా మైదానంలో సోమవారం ప్రారంభమైంది. కొత్తగూడెం టౌన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల వలంటీర్లు శిక్షణకు హాజరవుతున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. ప్రజారక్షణ దళంగా యువతను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆపద, విపత్తుల సమయాల్లో ప్రజలకు సహాయం చేసేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభ, కవాతు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకోసం మూడు వేల మందిని జనసేవాదళ్ దళంగా తయారుచేస్తున్నామని తెలిపారు. ఎల్డీఆర్ఎఫ్, మిలిటరీ, ఆర్మీ దళాల శైలిలోనే కఠినమైన శిక్షణా విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. శిక్షకులు మురళి, భూక్యా శ్రీనివాస్ శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, ఏకే ఫహీమ్, భూక్య శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, కె.రత్నకుమారి, మహేష్, మునిగడప పద్మ, మంద నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజావాణిలో 20 దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 20 దరఖాస్తులు అందజేయగా ఆర్డీఓ మధు స్వీకరించారు. ప్రధానంగా భూసమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయని ఆర్డీఓ తెలిపారు. కొత్తగూడెం నుంచి 2, లక్ష్మీదేవిపల్లి 3, సుజాతనగర్ 2, పాల్వంచ 2, చుంచుపల్లి 3, చండ్రుగొండ 2, ఇల్లెందు 2, ములకలపల్లి 2, అశ్వారావుపేట నుంచి 2 దరఖాస్తులు అందాయని వివరించారు. మెడికల్ బోర్డుకు 128 మంది హాజరుసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో సోమవారం మెడికల్ బోర్డు నిర్వహించారు. తొలిరోజు ప్రీ మెడికల్ బోర్డుకు 129 మందికి కాల్ లెటర్లు పంపించగా 128 మంది హాజరయ్యారు. వారికి యాజమాన్యం వివిధ రకాల వైద్య పరీక్షలు చేసింది. వీటి ఆధారంగా మంగళవారం బోర్డు అధికారులు రోగ నిర్ధారణను బట్టి (ఇన్వాలిడేషన్) చేయనున్నారు. విద్యుత్ శాఖలో ఆరుగురికి పదోన్నతిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆరుగురు విద్యుత్ ఏఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చండ్రుగొండ ఏఈ ఎం.ఎల్. నరసింహారావును భద్రాచలం ఏడీఈగా, టెక్నికల్ ఏఈ ఆర్.మానసను ఏడీఈ(ప్రొటెక్షన్)గా, లక్ష్మీదేవిపల్లి ఏఈ రఘురామయ్యను అక్కడే ఏడీఈగా, కొత్తగూడెం ఏఈ(కన్స్స్ట్రక్షన్) ఆర్.రాజేష్ను తాడ్వాయి ఏడీఈగా, పాల్వంచ టౌన్ ఏఈ పి.మఽఽధుబాబును ఏటూరునాగారం ఏడీఈగా, మణుగూరు ఏఈ బి.ఉమారావును ఎన్వీ పురం ఏడీఈగా బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి పదోన్నతిపై ముగ్గురు ఏఈలు ఏడీఈలుగా జల్లాకు వస్తున్నారు. కల్లూరు ఏఈ ఎస్.రామిరెడ్డి ఏడీఈ(విజిలెన్స్)గా, ఖమ్మం హెచ్టీ ఏఈ డి. ఉమామహేశ్వరరావు మణుగూరు ఏడీఈగా, నేలకొండపల్లి ఏఈ కె.రామారావు ఇల్లెందు ఏడీఈగా పదోన్నతి పొందారు. జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపికపాల్వంచ: వచ్చే జనవరి 5న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని పి.రోడా గ్రేస్ ఎంపికై ంది. ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజిత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, డీవైఎస్ఓ పరంధామరెడ్డి అభినందించారు. -
వాహనాలు కండిషన్లో ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఇతర అధికారుల వాహనాలు కండిషన్లో ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ వాహనాల రవాణా ధికారి ఆర్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఆయన వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో డ్రైవర్లుగా పనిచేసే వారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతీ డ్రైవర్కు తమ వాహన పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐ ఎంటీఓ సుధాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్ రాజు -
ఆతిథ్యంతో ఆదాయం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెం నగర నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగా గల ట్రాన్సిట్ గెస్ట్హౌస్లో 28 గదులు ఉన్నాయి. దీన్ని మరమ్మతుల పేరుతో జూలై 1 నుంచి మూసి ఉంచారు. ఐదు నెలలు కావస్తున్నా ఈ గెస్ట్హౌస్ తెరుచుకోక ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది. ట్రాన్సిట్ తరహాలోనే సింగరేణిలో అనేక గెస్ట్హౌస్లు, క్లబ్బులు సంస్థకు భారంగా మారుతున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వీటి నిర్వహణలో మార్పులు తేవాలని సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలు కోరుతున్నారు. హోం స్టే ఆఫర్.. పర్యాటక ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వారు తమ ఇళ్లలోని కొంత ప్రాంతం/గదులను పర్యాటకులకు అద్దెకు ఇవ్వడమే హోంస్టే విధానం. దేశవ్యాప్తంగా హోంస్టే విధానానికి ప్రాచుర్యం పెరుగుతోంది. జిల్లాకు పొరుగున ఉన్న మారేడుమిల్లి, అరకు ఏరియాల్లో ప్రకృతి ప్రేమికుల కోసం ఈ విధానం అమల్లో ఉంది. వేములవాడ, మేడారం వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. హోం స్టే పాలసీని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆసక్తి గల వారు పర్యాటకులు/భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే అంశాలను పేర్కొంటే, వాటిని పరిశీలించి సిల్వర్, గోల్డ్ రేటింగ్లను పర్యాటక శాఖ కేటాయిస్తుంది. ఈ రేటింగ్లను తెలుపుతూ ఆన్లైన్లో హోం స్టే వివరాలు ఉంచడం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆతిథ్య రంగంలో జిల్లాలోని భద్రాచలం క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ముక్కోటి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో అయితే భద్రాచలంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు హోటళ్లలో గదులన్నీ ముందుగానే బుక్ అవుతాయి. అక్కడ వసతి దొరకని వారు సమీపంలోని కొత్తగూడెం, పాల్వంచపైఽ ఆధారపడుతున్నారు. అంతేకాదు.. పాపికొండలు, మారేడుమిల్లి వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా జిల్లా గేట్ వేగా ఉంది. ఇవి కాకుండా కిన్నెరసాని, చండ్రుగొండ మండలంలోని కనకగిరి గుట్టలు, మణుగూరు రథంగుట్టలు, ఇల్లెందు కోరగుట్ట దగ్గర సైతం జలపాతాలు, రోప్వే వంటి అడ్వెంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, ఆర్గానికి ఫామింగ్ విషయంలో జాతీయ స్థాయి ఎక్స్లెన్స్ సెంటర్లు రానున్నాయి. భవిష్యత్లో ఆతిథ్య రంగంలో జిల్లాకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. అక్టోపస్లా విస్తరిస్తున్న సంస్థ.. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి సంస్థ ఇప్పుడు అక్టోపస్లా అష్టదిక్కుల్లో విస్తరిస్తోంది. థర్మల్, సోలార్, పంప్డ్హైడల్, బ్యాటరీ స్టోర్డ్ ఎనర్జీ రంగంలోనూ విజయాలు సాధిస్తోంది. కొత్తగా బంగారం, కాపర్ మైనింగ్లకు అనుమతులు పొందింది. రేపటి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఎర్త్ మినరల్స్పై పరిశోదనలు చేస్తోంది. ఇక్కడితో ఆగిపోకుండా సింగరేణి గనులున్న ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ ప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించింది. పెట్రోల్ బంకులు ఏర్పాటుకూ ప్రణాళిక సిద్ధమైంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తోంది. ఇలా లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్రతీ రంగంలో సింగరేణి విస్తరిస్తోంది. ఇదే కోవలో పర్యాటక రంగంలోనూ సింగరేణి అడుగుపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏరియాల వారీగా సింగరేణి సంస్థకు వేల సంఖ్యలో క్వార్టర్లు, పదుల సంఖ్యలో గెస్ట్హౌస్లు ఉన్నాయి. అధికారుల కోసం ఫైవ్స్టార్ రేటింగ్ స్థాయిలో ఆఫీసర్స్ క్లబ్లు (ఇల్లెందు క్లబ్), కార్మికుల కోసం సీఈఆర్ క్లబ్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగూడెంలో బంగ్లోస్, ట్రాన్సిట్ హౌస్ పేరుతో వసతి సముదాయాలు ఉన్నాయి. ఈ క్లబ్బులు, గెస్ట్హౌస్ల నిర్వహణకు సంస్థ ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. సగటున ఏడాదిలో 200 రోజులు ఈ గెస్ట్హౌస్లు, క్లబ్బుల్లోని గదులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. వీటిని హోం స్టే విధానంలోకి మార్చితే సంస్థకు ఆదాయంతో పాటు పర్యాటకులకు మంచి వసతి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే యాంత్రీకరణ పెరిగిపోవడంతో బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. సింగరేణి హోం స్టేలోకి రావడం వల్ల పర్యాటక రంగం పుంజుకుని స్థానికులకు ఉపాధి అవకాశాలు సైతం మెరుగయ్యే ఆస్కారం ఉంది.హోం స్టేకు అవకాశమిస్తే అదనపు రాబడి -
ప్రభావిత గ్రామాల్లో సౌకర్యాలు కల్పించండి
అశ్వాపురం : భారజల కర్మాగారం రక్షణ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్లాంట్ అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్థానిక గౌతమీనగర్ కాలనీ గెస్ట్హౌస్లో సోమవారం ఆయన భారజల కర్మాగారం ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ సబ్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. కర్మాగారం పరిధిలోని గ్రామాల్లో చేపడుతున్న రక్షణ, భద్రత చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా కలెక్టర్ సంతృప్తి చెందారు. అనంతరం మాట్లాడుతూ.. కర్మాగారం నుంచి విష వాయువు విడుదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగ్గారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాక్డ్రిల్ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. దీనిపై పరిసర గ్రామాల ప్రజలకు అవగాహన అవసరమని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగితే కర్మాగార, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు, డీజీఎంలు జగన్నాధ శర్మ, తిరుమలరావు, రఫీక్, సీఏఓ వేణు, తహసీల్దార్ మణిధర్, సీఐ అశోక్రెడ్డి, ఎంపీఓ ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డు పొందిన కలెక్టర్ను అధికారులు ఘనంగా సత్కరించారు. కార్మికుల భద్రతే లక్ష్యంసూపర్బజార్(కొత్తగూడెం): కార్మికుల భద్రతను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం కార్మికుల బీమా పెంపు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ మరణం బీమా రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు, ప్రమాద మరణ బీమా రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో రాష్ట్రంలో 16.50 లక్షల మంది కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వివరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారి షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వడ్డీలేని రుణాలు పంపిణీ చేయాలి.. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసేందుకు మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశంపై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు రుణాల పంపిణీని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని చెప్పారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తక్షణమే పూర్తిచేయాలని, ప్రతీ గ్రామానికి చీరలు చేరేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. సమష్టి కృషితోనే జాతీయ అవార్డు ‘జల్ సంచయ్–జన్ భాగీధారీ’ జాతీయ స్థాయి అవార్డు రావడం సమష్టి కృషి ఫలితమని కలెక్టర్ పాటిల్ అన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణలో జిల్లా సాధించిన చిత్రాలు, గణాంకాలు జాతీయ స్థాయి వేదికపై చూసినపుడు గర్వంగా అనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల బహుమతితో కూలీలకు తవ్వకం భారం తగ్గించేలా యంత్ర పరికరాల కొనుగోళ్లకు వినియోగిస్తామన్నారు. జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ సిబ్బంది, వ్యవసాయ, పోలీస్, వైద్య, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కేంద్ర జల సంఘం సభ్యుడు పృఽథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. భారజల కర్మాగారం అధికారులకు కలెక్టర్ సూచన -
నేటి నుంచి సైన్స్ఫేర్
● మూడు రోజుల పాటు జరుగనున్న వైజ్ఞానిక ప్రదర్శన ● ఏర్పాట్లు నామమాత్రమే.. కార్యక్రమాల కుదింపునకు యత్నంకొత్తగూడెంఅర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కొత్తగూడెంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సైన్స్ఫేర్ నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, అన్ని స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తిలకించే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారు. సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాట్లు కూడా అంతంతగానే చేస్తున్నారు. గతంలో మొదటి రోజు నుంచే విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు ప్రదర్శనలు ఉండేవి. కానీ ఇప్పుడు తొలిరోజు రిజిస్ట్రేషన్లు మాత్రమే ఉంటాయని అధికారులు వెల్లడించారు. రెండో రోజు వైజ్ఞానిక ప్రదర్శనలు, మూడో రోజు బహుమతుల ప్రదానం ఉంటాయని తెలిపారు. సైన్స్ఫేర్ నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి రూ.50 వేలు మాత్రమే విడుదలవుతాయని, మిగతావి జిల్లా విద్యాశాఖ అధికారులే భరించాల్సి రావడంతో కార్యక్రమాలను కుదించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. సైన్స్ఫేర్ నిర్వహించే పాఠశాలలో సోమవారం సాయంత్రం వరకు షామీయానాకు సంబంధించిన పైపులు మాత్రమే ఏర్పాటుచేశారు. మంగళవారం గైడ్ టీచర్ ఒక్కరే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించి, వెళ్లనున్నారు. సైన్స్ఫేర్లో అంశాలిలా.. ఈనెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ‘అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి భారతదేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ గణితం’ అనే ప్రధానాంశంతో పాటు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ – ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి /పునరుత్పాదక శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోద భరితమైన గణిత నమూనాలు, ఆరోగ్య– పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణ వంటి ఉప అంశాల ఆవిష్కరణల్లో విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుంది. 26వ తేదీన ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తారు. కాగా, సైన్స్ఫేర్కు ఎంపికై న 114 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.10వేల చొప్పున జమైనందున ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, గైడ్ టీచర్ ఆయా విద్యార్థులను తీసుకుని రావాలని అధికారులు ఆదేశించారు. గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సైన్స్ఫేర్ విజయవంతానికి కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కూడిన 150 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో సైన్స్ఫేర్కు హాజరైన విద్యార్థులకు వసతి, భోజన ఏర్పాట్లు చేసే వారు. ఈసారి అవి కూడా ప్రశ్నార్థకమేననే చర్చ జరుగుతోంది. -
సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి చెందాలి
భద్రాచలం: భుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి చెందాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన గిరిజనుల చెంతకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. వారు సమర్పించిన వినతులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి చేయాలని, 100 శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ అశోక్, ఈఈ మధుకర్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఏఓ రాంబాబు, ఏడీఎంహెచ్ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, ఎస్ఓ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘రాజు వెడ్స్ రాంబాయి’ని ఆదరించండి
ఇల్లెందు: పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ప్రేమాయణం ఇతి వృత్తంగా నిర్మించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ఆదరించాలని చిత్ర యూనిట్ వేడుకుంది. సోమవారం ఇల్లెందులోని శ్రీ సీతారామా టాకీస్ను సందర్శించి చిత్ర ఇతివృత్తాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు, ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన కాంపాటి సాయిలు(జగదీష్) మాట్లాడుతూ ఇల్లెందు, కొమరారంతో పాటు గుండాల మండలం కాచనపల్లిలో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హీరో అఖిల్రాజ్, హీరోయిన్ తేజస్విని, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్, చైతు జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు మొండి చేయి !
● తాజా రిజర్వేషన్లలో దక్కని చోటు ● జిల్లాలో 460 సర్పంచ్ స్థానాలు గిరిజనులకే.. ● జనరల్ సీట్లకు పెరగనున్న పోటీ సర్పంచ్ స్థానాలు వార్డులకు ఎస్టీలకు 460 2,648ఎస్సీలకు 02 18బీసీలకు 00 17జనరల్ 09 1,485మొత్తం 471 4,168చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామపంచాయతీల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఇటీవల సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేశారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో ఎీస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా తేడా లేకపోయినా బీసీ స్థానాలు మాత్రం పూర్తిగా మాయమయ్యాయి. ఆ మేరకు జనరల్ సీట్లు పెరిగాయి. గత సెప్టెంబర్లో ప్రకటించిన జాబితాలో జిల్లాలో ఆరు సర్పంచ్ స్థానాలు బీసీలకు(నాలుగు జనరల్, రెండు మహిళలకు) కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్లలో అవన్నీ గల్లంతయ్యాయి. ఇక జనరల్ స్థానాలు మూడు నుంచి తొమ్మిదికి చేరాయి. దీంతో బీసీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే జనరల్ స్థానాల్లో సర్పంచ్ పదవులకు పోటీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యధికం గిరిజనులకే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేషన్ కమిషన్ గతంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పగా గత సెప్టెంబరులో ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఖరారు చేశారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు సాధ్యం కానందున జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో అత్యధికంగా 460 పంచాయతీల సర్పంచ్ స్థానాలు(95శాతం) గిరిజనులకే దక్కాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 226, ఎస్టీ జనరల్కు 234 స్థానాలు కేటాయించారు. ఇక గతంలో కేటాయించిన ఎస్సీ జనరల్ సర్పంచ్ స్థానాలు రెండూ అలాగే ఉన్నాయి. సెప్టెంబర్ నాటి రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు అశ్వాపురం మండలంలో 2, అశ్వారావుపేటలో 1, బూర్గంపాడులో 1, దమ్మపేట మండలంలో రెండు సర్పంచ్ స్థానాలకు అవకాశం దక్కగా ఇప్పుడవన్నీ జనరల్కు కేటాయించారు. ఇక జిల్లాలోని 4,168 వార్డులకు గాను 2,648 వార్డులు గిరిజనులకే దక్కాయి. ఇందులో ఎస్టీ జనరల్కు 1,420, మహిళలకు 1,228 స్థానాల్లో అవకాశం దక్కింది. ఎస్సీలకు 16 వార్డులను కేటాయించారు. బీసీలకు మొదట 42 వార్డులు ఖరారు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 17కు తగ్గింది. జనరల్ అభ్యర్థులకు మొదట 1,455 వార్డులు కేటాయించగా, ప్రస్తుతం 1,485కు పెరిగాయి. -
పామేడులో ఐదుగురు మావోయిస్టుల అరెస్టు
చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వివరాలిలా.. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సందర్భంలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు మావోయిస్టు పార్టీ సభ్యులమని అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి మూడు మందుపాతరలు, కార్డెక్స్ వైరు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొని వారిని బీజాపూర్ జిల్లా కోర్టుకు తరలించారు. -
ఏదీ నాటి ‘తేజ’స్సు?
ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట సాగు నుంచి రైతులు దూరమవుతున్నారు. మూడేళ్లుగా మిరప సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. ధర, దిగుబడి లేకపోవడంతో సాగుకు విముఖత చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటి. వరి, పత్తి తర్వాత ఈ పంటే అధికంగా సాగయ్యేది. మూడేళ్ల క్రితం వరకు జిల్లాలో మిర్చి సాగు లక్ష ఎకరాలు ఉండగా ప్రస్తుతం వేల ఎకరాలకు పడిపోయింది. జిల్లాలో సాగు చేసే ‘తేజా’ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండేది. ప్రధానంగా చైనాలో ఈ రకం మిర్చిని ఆయిల్ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆర్డర్ల ద్వారా వ్యాపారులు తేజా మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా ఈ మిర్చికి డిమాండ్ క్రమంగా క్షీణిస్తోంది. భారీగా తగ్గిన ధరలు.. మిర్చి ధర మూడేళ్ల క్రితం ఓ దశలో క్వింటా రూ. 25 వేలు పలికింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం రూ.15 వేల లోపే ఉంది. విదేశీ ఆర్డర్లపైనే ధర ఆధారపడి ఉంటుండగా ఇప్పుడు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. చైనాలో మిర్చి సాగు పెరగడంతో ఇక్కడి మిర్చికి ఆర్డర్లు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఈ పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు కూడా బాగా పెరిగాయి. ఎకరం విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. దుక్కి దున్నడం, నారు పెంచటం లేదా కొనటం, నాటడం, పాట్లు చేయడం, ఎరువులు వేయడం వంటి పెట్టుబడులతో పాటు తెగుళ్ల నియంత్రణకు పురుగుమందుల అవసరం ఎక్కువగా ఉంటోంది. నాలుగేళ్లుగా మిర్చిని తామర పురుగు వేధిస్తోంది. ఈ పురుగు ఆశిస్తే పూత, కాత దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కొందరు రైతులు ఈ పురుగును నియంత్రించలేక తోటలను మధ్యలోనే దున్నిన సందర్భాలూ ఉన్నాయి. పంట బాగా పండితే ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ గతేడాది 10 నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. ధర, దిగుబడి రెండూ తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రైతులు పంట సాగుకు దూరమవుతున్నారు. కరోనా కాలం నుంచి.. 2020లో ఖమ్మం జిల్లాలో మిర్చి ధర క్వింటా రూ.25 వేల వరకు వచ్చింది. దీంతో ఆ తర్వాత సంవత్సరం జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ఆ సమయంలోనే కరోనా విపత్తు సంభవించి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇక అప్పటి నుంచి మిర్చికి ప్రతికూల పరిస్థితులే చోటుచేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. జిల్లాలోని పలు మండలాల్లో వేల ఎకరాల్లో ఉండే సాగు వందల నుంచి పదుల ఎకరాలకు పడిపోయింది. 2023లో జిల్లాలో 55,601 మంది రైతులు 92,274.72 ఎకరాల్లో మిరప సాగు చేయగా, 2024లో 37,681 మంది రైతులు 59,205.23 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 21,940 మంది రైతులు 31,749.15 ఎకరాల్లోనే మిర్చి సాగు చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలో ఏటేటా తగ్గుతున్న పంట సాగు మిర్చి సాగులో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో రైతులు పత్తి, మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా తేజా రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఈ డిమాండ్ తగ్గడంతో ధర తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ధర అనుకూలంగా ఉంటే మళ్లీ ఈ పంటను ఆదరించే అవకాశం ఉంది. – ఎం.వి.మధుసూదన్, జిల్లా ఉద్యానాధికారిమిర్చి సాగుపై ఆసక్తి తగ్గుతోంది. పంటకు ధర లేక రైతులు సాగుకు దూరమవుతున్నారు. తెగుళ్ల ప్రభావంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా ధర పడిపోతోంది. గతంలో పదెకరాల్లో మిర్చి సాగు చేశాను. ప్రస్తుతం మూడెకరాల్లోనే వేశా. – బానోత్ దీను, రేపల్లెవాడ, కామేపల్లి మండలంనాలుగేళ్ల క్రితం 25 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. అప్పుడు ధర బాగుండడంతో పంట సాగుపై ఆసక్తి ఉండేది. ఆ తర్వాత ధర క్షీణించడంతో 15 ఎకరాలకు తగ్గించా. పెట్టుబడి ఖర్చులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలే వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది పదెకారాల్లోనే సాగు చేస్తున్నా. – రామిశెట్టి రాము, బ్రాహ్మణపల్లి, బోనకల్ మండలం -
సరిహద్దు గ్రామాల్లో పోలీసుల మోహరింపు
చర్ల: నవంబర్ 23న నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యాన మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెండ్ మడవి హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా మా వోయిస్టులు విధ్వంసాలకు పాల్పడకుండా శని వా రం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు పోలీ సులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా చర్ల సీఐ రాజువర్మ నేతృత్వాన ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్లు సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సరిహద్దు గ్రామాలైన కుర్నపల్లి, తిప్పాపురం, ఉంజుపల్లి రోడ్లతో పాటు పలు ప్రధాన సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమాన మండల కేంద్రంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద గస్తీ నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించి నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. -
గత మూడేళ్లుగా కొన్ని మండలాల్లో మిర్చి సాగు (ఎకరాల్లో)
మండలం 2023 2024 2025 కామేపల్లి 9,760.16 8,647.00 5,344.16 రఘునాథపాలెం 11,305.36 10,954.33 4,414.22 తిరుమలాయపాలెం 9,871.12 2,708.13 3,816.20 బోనకల్ 3,108.31 1,418.25 741.38 మధిర 6,284.08 3,250.17 2,604.02 తల్లాడ 6,819.02 3,434.30 1,961.37 వేంసూరు 145.36 83.26 6.34 ఏన్కూరు 9,245.32 3,944.05 2,414.35 కొణిజర్ల 2,235.23 1,905.28 496.06 -
ఎటాక్.. బ్లాక్!
వాలీబాల్ క్రీడలో గిరిపుత్రుల ప్రతిభ పాల్వంచరూరల్: మారుమూల ఏజెన్సీ గ్రామాల విద్యార్థులు క్రీడాప్రతిభ చాటుతున్నారు. వాలీబాల్ పోటీల్లో సత్తా చూపుతూ స్వర్ణ పతకాలు కై వసం చేసుకుంటున్నారు. కిన్నెరసాని క్రీడాపాఠశాలకు జాతీయస్థాయిలో కీర్తి తెచ్చి పెడుతున్నారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని మోడల్ క్రీడా పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 30 మంది గిరిజన విద్యార్థులు వాలీబాల్ పట్ల మక్కువ చూపుతుండగా, గమనించిన ఐటీడీఏ పీఓ 2023లో ప్రత్యేకంగా వాలీబాల్ కోచ్ను నియమించారు. అప్పటినుంచి విద్యార్థులు శిక్షణ పొందుతూ పతకాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 22 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇద్దరు విద్యార్థులు రుషీవర్మ, వెంకన్నబాబు అండర్–14,15 విభాగాల్లో జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యారు. వాలీబాల్ క్రీడలో ఇక్కడి విద్యార్థులు ఎటాకర్ (ఔట్సైడ్ హిట్టర్), మిడిల్ బ్లాకర్, సెట్టర్గా రాణిస్తున్నారని కోచ్ తెలిపారు. 2024లో గోదావరిఖనిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో గోల్డ్మెడల్ సాధించారు. అదేసంవత్సరం నవంబర్ 16 నుంచి 18 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మరో బంగారు పతకం గెలుచుకున్నారు. 2024 డిసెంబర్లో మంచిర్యాలలో జరిగిన పోటీల్లో గోల్డ్మెడల్, ఉట్నూరులో నవంబర్ 5 నుంచి 7 వరకు జరిగిన రాష్ట్రస్థాయి ట్రైబల్ మీట్లో గోల్డ్ మెడల్ సాధించారు. అండర్ 17 విభాగంలో సిల్వర్ మెడల్, కిన్నెరసానిలో 2023లో జరిగిన టోర్నమెంట్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో కూడా స్వర్ణ పతకాలు సాధించారు. 2023లో ఇంటర్ సొసైటీ మీట్ చాంపియన్షిప్తోపాటు గోల్డ్మెడల్ గెలుచుకున్నారు. అదే ఏడాది అక్టోబర్ 16నుంచి 18 వరకు హైదరాబాద్లోని పటాన్చెరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్ సాధించారు. ఖమ్మంలో 2023 అక్టోబర్ 10న జరిగిన టోర్నమెంట్లో గోల్డ్మెడల్, ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో 2024 డిసెంబర్ 10నుంచి 14 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు రిషీ వర్మ, వెంకన్నబాబు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 18,19 తేదీల్లో కిన్నెరసానిలో జరిగిన జోనల్స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి మెడల్స్ సాధించారు. -
2న ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని డిసెంబర్ 2న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని యూనివర్సిటీ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేదిక, స్టేజ్, శిలాఫలకం, అతిథుల వసతి, మీడియా సెంటర్, పార్కింగ్, రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా లోపం లేకుండా అన్ని శాఖలు పోలీసు విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై శాఖలవారీగా వివరించారు. అరుదైన ఖనిజాల లభ్యతతో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ స్థాపనకు కొత్తగూడెం ఎంపికై ందని, ఆర్థిక సవాళ్లు ఉన్నా భవిష్యత్ తరాల కోసం యూనివర్సిటీ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా పాలన చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2న యూనివర్సిటీ ప్రారంభం, అనంతరం బహిరంగ సభ ఉంటుందని వివరించారు. ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కె.సుజాత, పాల్వంచ డీఎస్పీ కె.సతీష్ పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. రేపు బహిరంగ వేలంపాటశ్రీకనకదుర్గ ఆలయంలో 1, 2, 3 నంబర్ వ్యాపార దుకాణాలు, పాతకాంప్లెక్స్లోని 3, 4 నంబర్ దుకాణాలు, భక్తులు సమర్పించిన చీరలు పోగుచేసుకునేందుకు, ఫొటోలు తీసుకునేందుకు ఈ నెల 25న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలంపాటు వస్తువులు, స్టేషనరీ సామగ్రి సరఫరాకు సీల్డు టెండర్లను అదేరోజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్లో వేయాలని కోరారు. పర్ణశాలలో న్యాయమూర్తులు..దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని జిల్లా అడిషనల్ జడ్జి సరిత, జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ దంపతులు, మణుగూరు కోర్టు న్యాయమూర్తి సూరిరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించారు. జాతీయస్థాయిలో విద్యార్థుల ప్రతిభ చండ్రుగొండ/టేకులపల్లి : జిల్లాలోని ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ఈఎంఆర్ఎస్ నేషనల్ మీట్స్–2025 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టేకులపల్లి మండలం మొక్కంపాడుకు చెందిన కుంజా దీపిక కబడ్డీలో, చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెం గ్రామానికి చెందిన కోండ్రు సాయిచరణ్ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపారు. వీరిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు అభినందించారు. వ్యవసాయ క్షేత్రం పరిశీలనసుజాతనగర్: ఇండియా హౌస్ బృందం ఆదివారం సుజాతనగర్లోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది. విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్ రూపొందించేందుకు శాసీ్త్రయ, వాస్తవ సమాచారం కోసం మూడు రోజులుగా జిల్లాలో ఇండియా హౌస్ బృందం పర్యటిస్తోంది. ట్రైనీ కలెక్టర్ మురళి, బృందం సభ్యులు వ్యవసాయక్షేత్రంలోని పరిశోధకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మారిన సమయంలో నూతన వంగడాల తయారీ విధానంపై నిర్వాహకులను అడిగి సమాచారం సేకరించారు. -
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.గోశాల నిర్వహణకు విరాళందేవస్థానంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న భవాని రామకృష్ణ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా గోశాల నిర్వహణకు రూ.51,116 వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా, ఆలయ అధికారులు ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏవీ కమ్యూనిటీ హాళ్లు..?
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామాన్య ప్రజలు పెళ్లిళ్లు, శుభాకార్యాలు నిర్వహించాలంటే జంకుతున్నారు. ఇళ్లలో స్థలాలు సరిపడక, భారీ మొత్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్ల అద్దె చెల్లించలేక అవస్థపడుతున్నారు. ఇరుకుగా ఉన్న ఇళ్ల వద్దే ఫంక్షన్లు నిర్వహించుకుంటున్నారు. కొత్తగూడెంలో రెండు ఎంపవర్మెంట్ సెంటర్లు ఉండగా, ఒకటి శుభాకార్యాలకు వినియోగిస్తున్నారు. మరొకటి మున్సిపల్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఉపపయోగిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కమ్యూనిటీ హాళ్లు లేవు. గతంలో ఉన్న కమ్యూనిటీ హాళ్ల కొన్ని కబ్జాకు గురైతే, మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. కొన్ని వినియోగంలో ఉండగా మెప్మా అధికారులు మహిళా సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అద్దెలు రూ.లక్షల్లో... ప్రస్తుతం శుభముహూర్తాల సమయం కావడంతో పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. దీంతో ఫంక్షన్ హాళ్లు, క్లబ్లు, హోటళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అదేస్థాయిలో అద్దె కూడా వసూళ్లు చేస్తున్నారు. సామాన్యులు రూ. వేలు, లక్షల్లో అద్దె చెల్లించలేకపోతున్నారు. మరోవైపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫంక్షన్ హాళ్లు లేవు. ప్రస్తుతం కొత్తగూడెంలోని పాత పది వార్డుల్లో రూ. 30 లక్షల నుంచి రూ.50లక్షల డీఎంఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం జరుగుతోంది. పనులు పూర్తయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను నగరవాసులు కోరుతున్నారు. నామినల్ రెంట్తో ఉర్దూఘర్ ఒక్కటే... ప్రస్తుతం కొత్తగూడెంలో ఉర్దూఘర్ మాత్రమే నామినల్ రెంట్తో వివిధ రకాల ఫంక్షన్లు నిర్వహించేందుకు అవకాశం ఉంది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న షాదీఖానా, టీటీడీ కల్యాణ మండపాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తే సామాన్యులకు భారం తగ్గుతుంది. అయితే టీటీడీ కల్యాణ మండపం శిథిలావస్థలో ఉండగా, మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా టీటీడీ నుంచి నిధులు మంజూరు కావడంలేదు. ప్రతీ డివిజన్లో నిర్మించాలి.. ప్రతీ డివిజన్లో శుభాకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లకు రూ.వేలు, రూ. లక్షల్లో అద్దె కట్టులేకపోతున్నామని పేర్కొంటున్నారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. దీనిపై కమిషనర్ సుజాతను వివరణ కోరగా.. నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాళ్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కార్పొరేట్ల కోసమే లేబర్ కోడ్లు
మణుగూరు టౌన్: కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు. ఆదివారం సీఐటీయూ నాలుగో జిల్లా మహాసభలు కిన్నెర కల్యాణ మండపంలో కొలగాని బ్రహ్మాచారి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. తొలుత జెండా ఆవిష్కరించి అమరవీరులు కూకట్ల శంకర్, ఎర్ర శ్రీకాంత్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులు హరిస్తోందని ఆరోపించారు. 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, జే.రమేశ్, నెల్లూరి నాగేశ్వరరావు, రుద్ర నాగరాజు, చిట్టిబాబు, పద్మ, అప్పారావు, పిట్టల అర్జున్, గద్దల శ్రీనివాసరావు, ఈసం వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు -
బాబా మార్గాన్ని ఆచరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): శ్రీసత్య సాయిబాబా చూపిన సేవా మార్గంలో ప్రజలంతా సేవ చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లో బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం, విద్య, తాగునీరు అందించడం ద్వారా సత్యసాయిబాబా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, డీవైఎస్ఓ పరంధామరెడ్డి, శ్రీసత్యసాయి బాబా ట్రస్ట్ సెక్రటరీ కేవీ సుబ్బారావు, ప్రకాష్ , రాము, ఈశ్వర్, శకుంతల, రాజేశ్వరి, ప్రియాంక, అనురాధ, కలెక్టరేట్ ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో కూడా బాబా జయంతి వేడుకలు నిర్వహించారు. ఐటీడీఏలో...భద్రాచలంటౌన్: ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆదివారం సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు. బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు మాట్లాడుతూ బాబా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి సేవా కార్యక్రమాలు చేట్టారని గుర్తుచేశారు. మేనేజర్ ఆదినారాయణ, సిబ్బంది లక్ష్మయ్య, శ్రీనివాస్, రామ్ కుమార్, సాయి చందు, పవన్, జానీ, వీరయ్య, తులసి, సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ..
పాల్వంచ: ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆదివారం పట్టణ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్ దాటిన తర్వాత కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ముందు వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్వేశాడు. దీంతో వరుసగా వెనుక వేగంతో వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని నాలుగు కార్లకు సంబంధించిన ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. రెండు కార్లు భారీగా దెబ్బ తిన్నగా.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ప్రమాదంతో రోడ్డు పక్కన చాలా సేపు వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాగర్ కాల్వలో యువకుడు గల్లంతుఏన్కూరు: సరదాగా ఈత కొట్టేందుకు సాగర్ ప్రధాన కాల్వలోకి దిగి యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తిమ్మరావుపేట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ (28) ఈత కొట్టేందుకు సాగర్ ప్రధాన కాల్వలో దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. -
‘వెంకమ్మ’కు జలకళ.!
మండల పరిధిలోని ఊట్లపల్లి సమీపంలో గల వెంకమ్మ చెరువుకు జలకళ సంతరించుకుంది. దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండి చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా ఈ చెరువు కింద రెండు పంట లను సాగు చేస్తుండగా.. ఈ రబీ సీజన్కు సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఆయకట్టు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చెరువు అందాలను చూసేందుకు స్థానికులు, చుట్టూ పక్కల వారు వస్తుండడంతో సందడి నెలకొంది. – అశ్వారావుపేటరూరల్ -
దేవీప్రసన్నకు ఘన సన్మానం
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవీప్రసన్నను పలువురు నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధేయత, సీనియారిటీ కలబోతే ప్రామాణికంగా దేవీప్రసన్నకు ఈ పదవి దక్క డం సంతోషంగా ఉందన్నారు. సత్కరించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, చీకటి కార్తీక్, పెదబాబు, పూణేం శ్రీనివాస్, గౌస్ పాషా, బండ వెంకటేశ్వర్లు, అఫ్సర్ ఖాన్, అంతడపుల కృష్ణ, లక్ష్మణ్, ముద్ధంగుల శేఖర్, ఉయ్యూరు శ్రీని వాస్ తదితరులు ఉన్నారు. కాగా, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా దేవీప్రసన్నకు శుభా కాంక్షలు తెలిపి సన్మానించారు. ఆయన వెంటవా సు, మందా హనుమంతు, బానోత్ కృష్ణ తదితరులు ఉన్నారు. అలాగే రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు దేవీప్రసన్నను సన్మానించగా.. కొండం వెంకన్నగౌడ్, చింతలపూడి రాజశేఖర్, అర్జునరావు, వెంకటేశ్వరరావు, వెంకటాచారి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేగళ్ల పీహెచ్సీ సందర్శన చుంచుపల్లి: మండలంలోని రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరి శీలించారు. అనంతరం కాన్పుల గదిని సందర్శించి కాన్పుల సంఖ్యను పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధి కారులకు సూచించారు. మందులు, వ్యాక్సిన్ నిల్వల విధానాలు, నిర్వహణ పద్ధతులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఓ సోమ్ల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్కు దోహదం..
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం నగరంలోని రెజొనెన్స్ జూని యర్ కళాశాలలో ‘సాక్షి’మీడియా ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాస్థాయిలో ఆదివారం నిర్వహించిన సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రెజొనెన్స్ డైరెక్టర్ ఆర్ వీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తొలుత పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించగా.. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లాస్థాయిలో పరీక్షలను నిర్వహించారని, ఆతర్వాత రీజినల్, రాష్ట్రస్థాయికి పరీక్షలకు వెళ్తారన్నారు. ఈ పరీక్షల్లో ఖమ్మం నగరంలోని సర్వజ్ఞ, హార్వెస్ట్స్ప్రింగ్ లీఫ్, న్యూ విజన్, విన్ఫీల్డ్, బీబీఎం, క్రియేటివ్, షైన్ ఇండియా, త్రివేణి, ఆక్స్ఫర్డ్, రెజొనెన్స్, ఎస్వీఎం, నిర్మల్హృదయ్, శ్రీ చైతన్య, బోనకల్లోని షైన్ స్కూల్, మధిరలోని భరత్, శ్రీనిధి, నారాయణ స్కూల్స్, సత్తుపల్లిలోని సీఎస్ఆర్ ఆదిత్య స్కూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సెయింట్ పాల్స్ లూథెరియ న్ పాఠశాలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూప్, మెయిన్ స్పాన్సర్గా డ్యూక్ వ్యాపీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్–రాజమండ్రిలు వ్యవహరించారు. పరీక్షలను సాక్షి బ్రాంచ్ మేనేజర్ మోహన్కృష్ణ పర్యవేక్షించగా.. సిబ్బంది వేణు, ఏ.వీ.రామారావు, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి మీడియా ఆధ్వర్యాన నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు వల్ల విద్యార్థుల భవిష్యత్కు ఎంతగానో దోహదపడతాయి. పరీక్షలు ఏలా రాయాలో కూడా అవగాహన వచ్చింది. సబ్జెక్ట్పై మరింత పట్టు పెరిగింది. – సాయిశ్రీ సాత్విక్, 8వ తరగతి, సెయింట్ పాల్స్ లూథరెన్ స్కూల్, భద్రాచలం -
హైదరాబాద్లో భద్రాద్రి రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ వేడుక హైదరాబాద్ నగరంలో కన్నుల పండువగా జరిగింది. ఈస్ట్ మారేడుపల్లి లోని ఒక కల్యాణ మండపంలో ఆదివారం భద్రాచలంలో జరిగే కల్యాణాన్ని తలపించేలా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రాల మధ్య కల్యాణ మహోత్సవాన్ని జరిపారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి భక్తులు భక్తి పారవశ్యంతో జై శ్రీరామ్ నినాదాలు చేశా రు. సీతారాముల ఉత్సవమూర్తులను అలంకరించి పచ్చని పందిరిలో సుముహూర్తాన మాంగళ్యధారణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని వీక్షించి తరించారు. జూలూరుపాడు వాసికి గోల్డ్ మెడల్జూలూరుపాడు: హైదరాబాద్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్– 17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాపియన్షిప్ పోటీల్లో జులూరుపాడు మండలం జడలచింతకు చెందిన గంధంగంధం బాలరాజు, సుజాత దంపతుల కుమార్తె హారిక గోల్డ్ మెడల్ సాధించింది. ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై గెలిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రముఖ రెజ్లింగ్ కోచ్ కాశీ హుస్సేన్ వద్ద హారిక శిక్షణ ఇప్పించారు. దేశం తరఫున ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని హారిక తెలిపింది. ఈమేరకు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్–వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది మహమ్మద్ సాధిక్ పాషాతో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. -
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన కల్యాణ కట్ట వద్ద ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కరకట్ట ప్రాంతంలో గల కల్యాణ కట్ట వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సమాచారంతో సుమారు 65 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తెల్లని జుట్టు, గడ్డంతో బక్కగా పింక్ రంగు చొక్కా ధరించి, నలుపు, ఎరుపు, తెలుపు రంగు పట్టీగల దుప్పటి కప్పుకొని ఉన్నాడని, అతని వద్ద ఎటువంటి లగేజీ బ్యాగ్ లేదని పేర్కొంటూ మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు 87126 86160, 87126 82106లకు సమాచారం అందించాలని కోరారు. కాగా, స్థానికులు సమాచారం మేరకు సదరు వ్యక్తి గడిచిన కొంత కాలంగా దేవస్థానానికి చెందిన కల్యాణ కట్ట వద్ద భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని, ఇటీవల కాలంలో ఆహారం సరిగ్గా తినక అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. -
అటవీ కార్యాలయంలో ‘వనజీవి’ చిత్రీకరణ
ఖమ్మంగాంధీచౌక్: పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా చిత్రీకరణ శనివారం ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో కొనసాగింది. అటవీ సంరక్షణకు రామయ్య చేసిన కృషిని అందరికీ తెలిపేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈమేరకు రామయ్య పాత్రను నటుడు బ్రహ్మాజీ పోషిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ కార్యాలయంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించగా చిత్రబృందాన్ని ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అభినందించి మాట్లాడారు. సినిమా పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళం.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన సూరిబాబు–నాగలక్ష్మి దంపతులు రూ.1.49 లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ పీఆర్ఓ సాయిబాబు తదతరులు పాల్గొన్నారు. 24, 25వ తేదీల్లో మెడికల్ బోర్డుకొత్తగూడెంఅర్బన్ : ఈనెల 24, 25వ తేదీల్లో సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించనున్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం వైద్య పరీక్షలు చేస్తారు. ఆ కార్మికులు పని చేయగలరా లేదా అనే అంశాలను మంగళవానం నిర్ధారణ చేయనున్నారు. పగిడేరు వాసికి డాక్టరేట్మణుగూరు రూరల్ : మండలంలోని మారుమూల పగిడేరు గ్రామపంచాయతీ శాంతినగర్కు చెందిన పత్తి విజయ్బాబు డాక్టరేట్ సాధించారు. నిరుపేదలైన పత్తి రాములు – మంగమ్మ దంపతుల కుమారుడు విజయ్బాబు ఉపాధ్యాయుల సహకారంతో కష్టపడి చదివి చివరకు డాక్టరేట్ సాధించి పగిడేరుకు కీర్తి తెచ్చాడని పలువురు అభినందించారు. న్యూఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, ఐఐసీబీ సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ వైస్ చాన్సలర్ చేతుల మీదుగా శనివారం పట్టా అందుకున్నారు. తమ కుమారుడు డాక్టరేట్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుజిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ సుజాతనగర్/జూలూరుపాడు : తూకాలు, కొలతల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ హెచ్చరించారు. సుజాతనగర్లోని పలు పత్తి కాంటాలను, జూలూరుపాడులోని వే బ్రిడ్జీలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాపారులు నిబంధనలు పాటించాలని, సాధారణ కాంటాలను మూడేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకుండా కాంటాలను నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. తూకాల్లో ఏవైనా తేడాలు ఎదురైతే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. వే బ్రిడ్జీల నిర్వాహకులు కూడా తూనికల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్రషర్ మిల్లు వే బ్రిడ్జి కాంటాలో తేడా రావడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
బీఆర్ఎస్లో పంచాయితీ
పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారత రాష్ట్ర సమితి పార్టీలో వర్గపోరు మరింతగా రాజుకుంటోంది. నియోజకవర్గ ఇన్చార్జీలు వర్సెస్ జిల్లా అధ్యక్షుడు.. మండల అధ్యక్షుడు వర్సెస్ నియోజవర్గ ఇన్చార్జీలు అన్నట్టుగా పగలు సెగలు రగులుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీ గెలుపునకు నాయకులు ఏ మేరకు సమన్వయంతో పని చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంబీఆర్ఎస్లో స్తబ్దత తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఏడాది పాటు పార్టీ నేతలంతా స్తబ్దుగా ఉండిపోయారు. సీతారామ ప్రాజెక్టు ఫలాలు భద్రాద్రి జిల్లాకు అందించాలనే డిమాండ్తో పాటు దెబ్బ తిన్న రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు వంటి కొన్ని అంశాలపైనే నిరసన, ఆందోళన కార్యక్రమాలకు పరిమితమయ్యారు తప్పితే.. జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్లో జోష్ తెచ్చే కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. మరోవైపు గడిచిన రెండేళ్లుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయంలో పెద్ద వివాదమే జరిగింది. దీనిపై పినపాక నియోజకవర్గంలో తప్పితే జిల్లాలో మిగిలిన చోట్ల బీఆర్ఎస్ నుంచి పెద్దగా నిరసన కార్యక్రమాలేమీ నిర్వహించలేదు. మార్పు కోసం పంచాయతీ ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై ఒత్తిడి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఆయన నడుం బిగించారు. ఈ క్రమంలో మండల అధ్యక్షుల నియామక కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. అయితే, తమ అనుమతి లేకుండానే మండల అధ్యక్షులను నియమించడమేంటని నియోజకవర్గ ఇన్చార్జీలు జిల్లా అధ్యక్షుడు రేగాపై గరం అవుతున్నారు. ముఖ్యంగా ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. రేగా కొత్తగా నియమించిన మండల అధ్యక్షులు గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థులకు మద్దతుగా నిలిచారని, అలాంటి వారికి ఎలా అవకాశం కల్పిస్తారని వనమా వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. రేగా చర్యలతో క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం జరుగుతోందని వనమా వర్గం వాదిస్తోంది. మరోవైపు ఇల్లెందు నియోజకవర్గంలో తన మాటే ఫైనల్ అన్నట్టుగా హరిప్రియ వ్యవహరిస్తున్నారు. దీంతో ‘కారు’లో నేతల రాజకీయ ప్రయాణం సాఫీగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ దళంలో వర్గపోరు -
ప్రమాదం ఓ చోట.. మృతదేహం మరోచోట!
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ట్రాక్టర్ పైనుంచి పడి కూలీ మృతిచెందగా, మృతదేహం ఘటనా ప్రదేఽశానికి సుమారు కిలోమీటరు దూరంలో లభించింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధి లోని కట్టుగూడెం హెచ్ కాలనీకి చెందిన పప్పుల నాగరాజు (35) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం అబ్బుగూడెం శివారులోని ఓ వ్యక్తికి చెందిన జామాయిల్ తోట నరికేందుకు వెళ్లాడు. సాయంత్రానికి ట్రాక్టర్లో జామాయిల్ లోడు చేశాడు. సదరు వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా, అదే ట్రాక్టర్పై యర్రగుంట వైపు బయలుదేరాడు. కాగా నాగరాజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ట్రాక్టర్ యజమానిని విచారించినా ఫలితం కానరాలేదు. శనివారం ఉదయం గ్రామశివారులో నాగరాజు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై విజయ సింహారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కట్టుగూడెం హైవే సమీపంలోనే నాగరాజు ట్రాక్టర్ పైనుంచి పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. కానీ ట్రాక్టర్ యజమాని గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించి, గ్రామ శివారులో పడేసి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఎస్సై విజయ సింహారెడ్డిని వివరణ కోరగా.. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. కట్టుగూడెం హైవే సమీపంలో ప్రమాదం జరిగిందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి కూలీ మృతి -
‘చలమల’ సేవలు మరువలేనివి
ఎఫ్డీఓ కోటేశ్వరరావు చండ్రుగొండ: దివంగత రేంజర్ చలమల శ్రీనివాసరావు అటవీ రక్షణ కోసం చేసిన సేవలు మరిచిపోలేమని ఎఫ్డీఓ కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామ శివారు కనకగిరి అటవీప్రాంతంలో చలమల స్మృతి వనంలో శనివారం శ్రీనివాసరావు వర్ధంతి నిర్వహించారు. పలువురు అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ అటవీ రక్షణకు ప్రాణాలను అర్పించిన ఘనత చలమల దక్కించుకున్నారన్నారు. అనంతరం సమీపంలో నివాసం ఉంటున్న గొత్తికోయ గూడేన్ని సందర్శించి కొత్తగా పోడు పేరిట అడవిని నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చండ్రుగొండ, కొత్తగూడెం, టేకులపల్లి, రామవరం ఎఫ్ఆర్ఓలు ఎల్లయ్య, శ్రీనివాసరావు, ముఖ్తార్పాష, పద్మజ, డీఆర్ఓలు, సెక్షన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25న కొత్తగూడెంలో వాలీబాల్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: జూనియర్స్ విభాగంలో ఉమ్మ డి జిల్లాస్థాయి బాలబాలికల వాలీబాల్ జట్లను ఈనెల 25న ఎంపిక చేయనున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి తెలిపారు. ఈ ఎంపిక పోటీలు కొత్తగూడెంలోని ప్రకాష్ స్టేడియంలో జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రవీకరణపత్రాలు, ఆరు పాస్పోర్ట్సైజ్ ఫొటోలతోపాటు ఆధార్ కార్డుతో ఉదయం 9–30 గంటలకు రావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు సిరిసిల్లలో ఈనెల 29నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆదివాసీలు అభివృద్ధి పథంలోకి రావాలి బూర్గంపాడు: ఆదివాసీ సమాజానికి బిర్సా ముండా మార్గదర్శకంగా నిలిచారని, ఆయన ప్రేరణతో ఆదివాసీలు మరింత అభివృద్ధిపథంలోకి రావాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవినాయక్ అన్నారు. జిల్లా స్థాయిలో బిర్సా ముండా జయంతి ఉత్సవా లను శనివారం సారపాకలోని సత్యనారాయణస్వామి ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పినపాక, భద్రాచలం ప్రాంతాల ఆదివాసీ నాయకులను ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, నాయకులు రంగా కిరణ్, పొడియం బాలరాజు, కుంజా సంతోష్కుమార్, సైలాల్, విశాల్నాయక్, ధర్మా, వెంకటరెడ్డి, భిక్షపతి, సాయిశ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జట్ల ఎంపికపాల్వంచరూరల్: అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లను శనివారం ఎంపిక చేశారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో జరిగిన ఎంపిక పోటీలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 64మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 12మంది చొప్పున క్రీడాకారులతో బాలుర, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావు తెలిపారు. ఈ జట్లు 26వ తేదీ నుంచి పెద్దపల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి నరేష్, ఏటీడీఓ చంద్రమోహన్, ఏఎస్ఓ వెంకటనారాయణ, పీడీ, పీఈటీలు బాలసుబ్రహ్మణ్యం, రాంబాబు, కృష్ణ, వీరభద్రం, వెంకటేశ్వర్లు, అంజయ్య, కవిత, హెచ్ఎం శంకర్ పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంములకలపల్లి: మండలంలోని కొబ్బరిపాడు గ్రామానికి చెందిన ఇరపా వీరస్వామి ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎద్దులచెరువు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామం వచ్చిన ఆయన ఈ నెల 12న తిరిగివెళ్లాడు. విజయవాడ చేరుకున్నట్లు సమాచారం అందించాడు. ఆ తర్వాత సెల్ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. వీరస్వామి కుమారుడు రవీంద్రకుమార్ శనివారం ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. -
ఇద్దరు రిమాండ్
అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెంలో దుప్పిని వేటాడి విక్రయించిన కేసులో శనివారం ఇద్దరికి కొత్తగూడెం జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజు ల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పిమాంసం పట్టుకున్న కేసులో అరెస్ట్ చేశా రు. శనివారం కొత్తగూడెం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించగా, భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ధనలక్ష్మి, బీట్ ఆఫీసర్లు సునీల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఇసుక లారీలు సీజ్దమ్మపేట: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు శని వారం తెల్లవారుజా మున సీజ్ చేశారు. పోలీసుల కథ నం ప్రకారం... మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అశ్వారావుపేట వైపు నుంచి వస్తున్న మూ డు ఇసుక లారీలను ఆపి తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా ఏపీలోని కొవ్వూరు నుంచి తెలంగా ణ లోని ఖమ్మానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టుగా నిర్ధారించారు. మూడు లారీలను స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు స్వాధీనంపాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై శనివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. మొ ర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో దమ్మపేట సెంటర్ రోడ్లో నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఆటో డ్రైవర్పై కేసు నమోదుఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శనివారం రాత్రి అజాగ్రత్తగా, అతివేగంతో ఆటోనడిపిన డ్రైవర్ చింతా శివకృష్ణపై కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్సై నాగుల్మీరా తెలిపారు. కారేపల్లి మండలానికి చెందిన శివకృష్ణ గుండాల నుంచి ఇల్లెందుకు ఆటోను వేగంగా నడుపుకుంటూ వస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. బెదిరింపుల ఘటనలో..ఇల్లెందురూరల్: తల్లిదండ్రులు, సోదరుడు తనను వేధించడంతోపాటు చంపుతామని బెదిరిస్తున్నారని మండలంలోని బొంబాయితండాకు చెందిన భూక్య రమేష్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు కొమరారం ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
క్రమబద్ధీకరణ ఊసేది..?
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మారినా క్రమబద్ధీకరణ పట్టాలకు మోక్షం లభించడం లేదు. 2023 ఎన్నికల ముందు నిలిచిపోయిన పట్టాల క్రమబద్ధీకరణ ఇప్పటివరకు ప్రారంభంకాలేదు. 1200 దరఖాస్తులకు సర్వే పూర్తి చేసి పంపిణీ దశలో ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా రెండేళ్లుగా ఇళ్ల క్రయవిక్రయాలు లేక లబ్ధిదా రుల ఆందోళన చెందుతున్నారు. కనీసం బ్యాంకు రుణం కూడా పొందలేకపోతున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాలని.. కార్పొరేషన్ పరిధిలోని కార్మిక ప్రాంతమైన రామవరంలో క్రమబద్ధీకరణ దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంలేదు. సొంత ఇళ్లు నిర్మించుకున్న తమకు క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కార్పొరేషన్లో ఇంటి నంబర్లలో పేరు మార్పిడి కూడా జరగడంలేదు. వచ్చే నెలలో కొత్తగూడెంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. గతంలో పంపిణీ చేసిన పట్టా ల్లో చోటుచేసుకున్న తప్పులను సరిచేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా.. 2014 కట్ ఆఫ్ తేదీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తులు తీసుకున్నారు. 2023 ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకోలేకపోయినవారి కోసం 2020 కట్ ఆఫ్ తేదీగా పెంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ సమయంలో 2,500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఎలక్షన్లకు సంబంధించి తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికల శిక్షణ, గృహలక్ష్మి పథకం తది తర పనుల నేపథ్యంలో సర్వే నెమ్మదించింది. చివరి దశకు చేరకునేలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రి య పూర్తిగా నిలిచిపోయింది. ఎన్నికలు జరిగి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు గడుస్తున్నా క్రమద్ధీకరణ ఊసే ఎత్తడం లేదు. వైఎస్సార్ హయాంలో 4,600 పట్టాలు పూర్వకొత్తగూడెం మున్సిపాలిటీలోని ఇళ్లకు యాజ మాన్య హక్కు కల్పించేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి 2008లో 373 జీఓ తెచ్చారు. దీంతో 11 వేల మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, 4,600 మందికి పట్టాలు మంజూరు చేశారు. మిగిలిన 6,400 మందికి వివిధ కారణాలతో పట్టాలు రాలేదు. కొందరికి వచ్చినా వారు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఆ పట్టాలకు విలువ లేకుండాపోయింది. మిగిలిపోయినవారి కోసం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చొరవతో ప్రభుత్వం 76 జీఓ తెచ్చింది. మొదటి విడతలో 6,146 మంది దరఖాస్తు చేసుకోగా, 3,500 మందికి గతేడాది పట్టాలు మంజూరయ్యాయి. ఇంకా మిగిలిన వారి కోసం 2022 జూలైలో చివరి అవకాశం ఇవ్వగా 1,531 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా క్రమంగా పట్టాల పంపిణీ ప్రక్రియపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1,531 మందికి సంబంధించి సర్వే 2022 నవంబర్లో నిర్వహించారు. కేవలం 530 మందికి మాత్రమే పట్టాలు మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా దాదాపు 1200 మందికి పట్టాలు రావాల్సి ఉంది. కొందరు సింగరేణి క్వార్టర్లకు, ప్రభుత్వ స్థలంలో అప్పటికప్పడు గదుల నిర్మాణాలు చేసి పట్టాలు పొందడం, ఒకే స్థలానికి రెండు పట్టాలు మంజూరు కావడం, స్థలం ఆక్రమించుకుని ఇళ్లనిర్మాణం చేసిన వారికి పట్టాలు ఇవ్వడం వంటి ఘటనలు జరిగాయి. కగా క్రమబద్ధీకరణ పట్టాలపై కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్యను వివరణ కోరగా.. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని, కదలిక ఉంటే తెలియజేస్తామని వివరించారు. -
రామరాజ్యం పేరుతో రాక్షస పాలన
భద్రాచలంఅర్బన్: రామరాజ్యం పేరుతో దేశంలో బీజేపీ రాక్షన పాలన సాగిస్తోందని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీపీఐ శతవసంతోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ప్రచార జాతా శనివారం భద్రాచలంలో ముగిసింది. పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన సభలో వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కులాలు, మతా ల పేరుతో గందరగోళ వాతావరణం సృష్టిస్తోందని మండిపడ్డారు. హిందుత్వ ఎజెండాను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అయోధ్యలో రూ.కోట్లు వెచ్చించి రామమందిరం నిర్మించిన మోడీ ప్రభుత్వం భద్రాచలం రామాలయాన్ని విస్మరించిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వూర్తయితే భద్రాచలం రామాలయం ము నిగిపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారని, ఈ విషయంపై దృష్టి సారించకుండా చోద్యం చూడటం సరైంది కాదని హితవు పలికారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని, గోదావరి కరకట్టలను పటిష్ట పరిచి వరద ముప్పు నుంచి ఈ ప్రాంత వా సులను రక్షించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవా లన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలి వేన శంకర్, ఎం.బాలనర్సింహ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ బూటకమని, ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను వట్టుకుని చిత్రహింసలకు గురి చేసి హతమారుస్తున్నారని ఆరోపించారు. ఎన్కౌంటర్ ఘటనలను సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. మా వోయిస్టులను చంపేందుకు డెడ్లైన్ పెట్టిన కేంద్రం వారితో శాంతి చర్చలకు ఎందుకు ముందుకు రావ డం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ పార్టీ శతవసంత ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని, 45 దేశాల నుంచి ప్రతినిధులు, కవులు, కళా కారులు హాజరువుతారని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లె నర్సింహ, నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, ముత్యా ల విశ్వనాధం, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, నలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర, కమటం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదల పక్షాన పోరాటాలే అజెండా.. బూర్గంపాడు: పేదల పక్షాన పోరాటాలే తమ అజెండా అని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రచారజాతాలో భాగంగా సారపాకలో జరిగిన సభలో ఆయన మా ట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఐ చురుకై న పాత్ర పోషించిందన్నారు. ఏనాడూ అధికారంకోసం పాకులాడకుండా ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించిన ఘనమైన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయరామిరెడ్డి, ఏఐ ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాశిరెడ్డి మణికంఠారెడ్డి, డీహెచ్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో ముగిసిన సీపీఐ ప్రచార జాతా -
మహిళల అభ్యున్నతికి సహకారం
● కలెక్టర్ జితేష్ వి పాటిల్ ● ఎమ్మెల్యేతో కలిసి చీరల పంపిణీ ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): గ్రామీణ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ద్వారా ఏర్పాటు చేసిన యూనిట్లను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ఆయన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలపడితే వారి కుటుంబాలు ఉన్నత స్థితికి చేరుకుంటాయని చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి. తహసీల్థార్ గంటా ప్రతాప్, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంఈఓ ఉండేటి ఆనంద్కుమార్, ఎంపీఓ షబ్నా, నాయకులు పర్సా వెంకట్, వేముల రమణ తదితరులు పాల్గొన్నారు. మహిళలను శక్తివంతులను చేయడమే లక్ష్యం చండ్రుగొండ : మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. మండలంలోని తుంగారం పంచాయితీలో శనివారం ఆయన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి గృహప్రవేశం చేయించారు. అనంతరం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ మహిళ డ్వాక్రా పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, నాయకులు భోజ్యానాయక్, కృష్ణారెడ్డి, బొర్రా సురేష్, ఫజల్, ఇమ్రాన్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్ జింఖానా స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్లో కొత్తగూడెంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులు సీహెచ్.వేదశ్రీ, బి.సంజన అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈనెల 26 నుంచి డిసెంబర్ 31 వరకు హరియాణాలో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు వీరిద్దరూ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాతీయ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ క్రీడాకారులను అభినందించారు. జాతీయస్థాయిలో కూడా పతకాలు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఈటీ అరుణకుమారి, కోచ్లు డి. మల్లికార్జునరావు, సుష్మాబాయి తదితరులు పాల్గొన్నారు. ‘ఏకలవ్య’ విద్యార్థులకు సీఎం ప్రశంసలుటేకులపల్లి : మండలంలోని ఏకలవ్య పాఠశాల పీఈటీతో పాటు వివిధ అంశాల్లో సత్తా చాటిన విద్యార్థులను సీఎం రేవంత్రెడ్డి ప్రశంసించారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఒడిశాలో జరిగిన ఏకలవ్య (ఈఎంఆర్ఎస్) జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున మండలంలోని ఏకలవ్య విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో అనిల్, అభిషేక్, జూడోలో చరణ్, రఘు, స్విమ్మింగ్లో పాల్తియా కిరణ్, తైక్వాండోలో సాయిచరణ్ సత్తా చాటి ప్రథమ బహుమతి సాధించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుడు మహేష్ను సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డుతో అభినందించారని ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ శనివారం వెల్లడించారు. -
ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరిస్తా
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. శనివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారం రోజుల క్రితం ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా పలు సమస్యలు ఆయన దృష్టికి రావడంతో పరిష్కరించాలని పీఓను ఆదేశించారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం సాక్షిలో ‘ఇల్లెందు ప్రభుత్వాస్పత్రిలో సమస్యల తిష్ట’ శీర్షికన సమస్యలను వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీంతో పీఓ రాహుల్ శనివారం ఆస్పత్రికి వచ్చి సమస్యలపై డీసీహెచ్ఎస్ జి.రవిబాబుతో చర్చించారు. 30 పడకల జనరల్ వార్డు నిర్మాణం, బర్త్ వెయిటింగ్ రూంల రెనోవేషన్, అంబులెన్సు ఏర్పాటు లాంటి సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు రాంనివాస్, శేఖర్, బన్సీలాల్, సూపర్వైజర్ జగదీష్ పాల్గొన్నారు. -
గిరిజన సంస్కృతి పరిరక్షణ భేష్
భద్రాచలంటౌన్ : గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా అరుదైన కళాఖండాలను సేకరించి, వాటిని మ్యూజియం రూపంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ కృషి అభినందనీయమని ఇండియా హౌస్ బృందం సభ్యులు అన్నారు. విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్పై పనిచేస్తున్న ఇండియా హౌస్ బృందం సభ్యులు జాహ్నవి, పీడీసీ డిప్యూటీ కలెక్టర్ మురళి, సోనాలి గాడ్గే శనివారం భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియాన్ని సందర్శించారు. జిల్లాలోని గిరిజన కుటుంబాల జీవన విధానాలపై పరిశోధన చేసేందుకే తాము వచ్చామని చెప్పారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలను నేటితరానికి పరిచయం చేసేలా కళాఖండాలను ఏర్పాటు చేయడం, వాటి చరిత్రను తెలుగు, ఆంగ్ల భాషల్లో ముద్రించడంతో పర్యాటకులకు పూర్తిస్థాయిలో అవగాహన కలుగుతుందని అన్నారు. గిరిజన వంటకాలైన ఇప్పపువ్వు లడ్డూలు, మిల్లెట్ బిస్కెట్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ రాంబాబు, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బృందం సభ్యులు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను పరిశీలించగా.. గిరిజనులకు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని, ముఖ్యంగా కొండరెడ్ల గిరిజనుల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతున్నామని పీఓ వారికి వివరించారు. దుమ్ముగూడెంలో.. దుమ్ముగూడెం : మండలంలోని సున్నంబట్టి, బొజ్జికుప్ప గ్రామాలను ఇండియా హౌస్ బృందం సభ్యులు శనివారం పరిశీలించారు. సహజ వనరులు, పర్యావరణం, అటవీ సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. సున్నంబట్టి వద్ద గోదావరిని పరిశీలించి ముంపునకు గురయ్యే రహదారిని తనిఖీ చేశారు. బొజ్జికుప్పలో ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన సభ్యులు.. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల వంటకాలను రుచి చూశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్రామ్, ఎంపీఓ వీరారెడ్డి, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వరరావు, ఏపీఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా హౌస్ బృందం సభ్యుల అభినందన -
దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
సూపర్బజార్(కొత్తగూడెం): గిరిజన జనాభా దామాషా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లను అమలు చేయాలని జీఎల్ఎస్ జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం క్లబ్లో భట్టు జుంకీలాల్ అధ్యక్షతన శనివారం జరిగిన గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 80 శాతం గిరిజన జనాభా ఉంటే జీఓ 33 ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కేన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, జిల్లాలోని ప్రతీ ఎకరాకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు అందించాలని కోరారు. అనంతరం పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు. -
25 నుంచి జిల్లా స్థాయి సైన్స్ఫేర్
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు కొత్తగూడెంలోని సెయింట్ మేరీస్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. సైన్స్ఫేర్ విజయవంతానికి గాను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో శనివారం పలు కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిటీలకు చైర్మన్గా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, కన్వీనర్గా తాను, కో కన్వీనర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్కుమార్, ప్రభుత్వ పరీక్షల అధికారి ఎస్.మాధవరావు, డీసీఈబీ అధికారి బి.నీరజ, జిల్లా మానిటరింగ్ అధికారులు నాగ రాజశేఖర్, అన్నామణి, సతీష్, సైదులు, కిరణ్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే సైన్స్ఫేర్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలనీ కమిటీల బాధ్యులకు సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులు అర్హులని, పాల్గొనేవారు ప్రధాన, ఉప అంశాల్లో ప్రదర్శనలు చేయాలని సూచించారు. 26వ తేదీన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమయ్యాయని, సంబంధిత ప్రదానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు శ్రద్ద వహించి, ప్రతీ విద్యార్థి హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. మార్షల్ ఆర్ట్స్ కోచ్లకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హత, నైపుణ్యం కలిగిన కోచ్ల నుంచి ఈనెల 25 నుంచి 28 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా కోచ్లకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన మహిళలు లేకుంటే పురుషులను తీసుకుంటామని పేర్కొన్నారు.డీఈఓ నాగలక్ష్మి వెల్లడి -
గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలి
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ‘ఉపాధ్యాయ సామర్థ్య అభివృద్ధి, హెచ్ఎం, విద్యార్థులతో సమన్వయం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి ఈ శిక్షణ దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవడేలా కృషి చేయాలన్నారు. జీపీఎస్, ప్రైమరీ పాఠశాలల్లో ‘ఉద్దీపకం వర్క్బుక్–2’ ను ప్రవేశపెట్టామని, ప్రతి ఎస్జీటీ తప్పకుండా ఈ వర్క్బుక్లోని గణితం, ఇంగ్లిష్, తెలుగు పదాలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్, ఏసీఎంఓ రమేష్, జీసీడీఓ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి అక్షర ప్రగతికి శిక్షణ దోహదపడాలి ఇల్లెందురూరల్: ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహించిన శిక్షణ.. గిరిజన విద్యార్థుల అక్షర ప్రగతికి దోహదపడాలని రాహుల్ సూచించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులకు వైటీసీలో నిర్వహిస్తున్న శిక్షణ శనివారం ముగియగా.. పీఓ రాహుల్ హాజరై మాట్లాడారు. గిరిజన చిన్నారులకు చదువుపై ఇష్టం పెంచి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చైతన్యం కల్పించాలని అన్నారు. ఆటపాటలు, ప్రయోగాత్మక విద్యాభోదనతో విద్యార్థులను ఆకట్టుకోవాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉద్దీపకం వర్క్బుక్లోని అంశాలు సరిగా భోదించడం లేదన్నారు. రాయడం, చదవడంలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు విజయలక్ష్మి, సూర్ణపాక రాధమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షురాలిగా దేవీప్రసన్న
● తొలిసారి మహిళకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ ● 2003 నుంచి పార్టీలో కొనసాగుతున్న ‘తోట’కొత్తగూడెంఅర్బన్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కొత్తగూడేనికి చెందిన తోట దేవీప్రసన్న నియమితులయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాకు తొలిసారి ఓ మహిళా నేతకు అవకాశం ఇవ్వడం విశేషం. దేవీప్రసన్న కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా ఆమె కూడా 2003 నుంచి పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న దేవీప్రసన్న భర్త జగన్ ప్రోత్సాహంతో 2005లో కొత్తగూడెంలో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలో మరింత ఉత్సాహంతో పని చేశారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో వివిధ కేడర్లలో, జిల్లా విభ జన తర్వాత మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ప్రజలకు సేవలందించారు. డీసీసీ అధ్యక్షురాలిగా మహిళను ఎంపిక చేయడంతో మహిళల గౌరవం పెరిగిందని పలువురు అంటున్నారు. డీసీసీకి 25 దరఖాస్తులు.. డీసీసీ అధ్యక్ష పదవికి గత నెలలో నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా నుంచి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఆరు అప్లికేషన్లను పరిశీలించిన నాయకత్వం.. ఆ తర్వాత మూడు పేర్లను ఫైనల్ చేసింది. వాటిలో చివరకు దేవీప్రసన్నకు అవకాశం దక్కింది. 20 ఏళ్లకు పైగా ఆమె కాంగ్రెస్లో విధేయురాలిగా పని చేయడం, గతంలో ఎంతో మంది అధికార బీఆర్ఎస్లోకి వెళ్లినా.. దేవీప్రసన్న కాంగ్రెస్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడారు. ఇలా ఆమె సేవలను గుర్తించిన అధిష్టానం డీసీసీ అధ్యక్షరాలిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా దేవీప్రసన్నకు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
దారి కోసం డివైడర్ కూల్చివేత
అశ్వాపురం: మండల కేంద్రంలోని మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి కూల్చివేశారు. షాపులోకి వచ్చేందుకు దారి కోసం డివైడర్ను గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో పెద్ద పెద్ద సుత్తులతో కూల్చి వేసినట్లు సమాచారం. గ్రామపంచాయతీ, ఆర్అండ్బీ అధికారుల అనుమతులు తీసుకోలేదు. కాగా కూల్చివేత కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ డీఈ సతీష్ను వివరణ కోరగా.. తమ దృష్టికి వచ్చిందని పరిశీలించామని, కూల్చి వేసిన వ్యక్తులు ఎవరో తెలియదని తెలిపారు. -
విద్యార్థులకు రిఫరెన్స్ పుస్తకాల పంపిణీ
భద్రాచలంటౌన్: ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ గురువారం రాత్రి పంపిణీ చేశారు. ఇటీవల కళాశాలను సందర్శించిన సబ్కలెక్టర్ మ్రిణాళి శ్రేష్ఠను విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్, హోటల్ మేనేజ్మెంట్ లాంటి పరీక్షలకు ఉపయోగపడే రిఫరెన్స్ పుస్తకాలు కావాలని కోరగా.. స్పందించిన సబ్కలెక్టర్ పుస్తకాలను ఏర్పాటు చేయించారు. ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ తో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫారంపాండ్లతో రైతులకు ఉపయోగంచండ్రుగొండ: ఫారంపాండ్లు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మండంలోని పోకలగూడెంలో శుక్రవారం ఆమె పర్యటించారు. రామకృష్ణ వ్యవ సాయ క్షేత్రంలో ఉపాధి పథకం ద్వారా నిర్మించిన మినీ ఫారంపాండ్లను పరిశీలించాక మా ట్లాడారు. పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేసుకునేందుకు భూమి లేని రైతులు మినీ ఫారంపాండ్లను నిర్మించుకోవాలని, వర్షాకాలంలో ఇంకు డు గుంతలుగా వాడాలన్నారు. వేసవిలో వ్యవసాయ వ్యర్థాలను అందులో వేసి కాల్చాలని, తర్వాత వర్మీకంపోస్టుగా వినియోగించు కోవ చ్చని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీఓ అశోక్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన ఎంపీహెచ్డబ్ల్యూ(మహిళ) ట్రైనింగ్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. 2025–2027 రెండేళ్ల కాలానికిగాను ప్రవేశాలు కల్పించనున్న ట్లు వెల్లడించారు. ఎస్సెస్సీ, ఇంటర్ ఉత్తీర్ణత కలి గి 17 ఏళ్లు నిండిన అవివాహిత, వితంతు, విడాకులు పొందిన గిరిజన మహిళా అభ్యర్థులు అర్హు లని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు http:// chfw. Telangana. gov. in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని ఈనెల ఈనెల 25వ తేదీ సాయంత్రం వరకు భద్రాచలంలోని ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ స్కూల్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు 94903 70905, 99633 15323 సంప్రదించాలని పీఓ తెలిపారు. వస్తువుల సరఫరాకు టెండర్లు..భద్రాచలంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరంలో అవసరమైన ఆహార వస్తువులు, అలంకరణ సామగ్రి సరఫరాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి షార్ట్ టెండర్లు స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దాఖలు చేసే యజమానులు ఈ నెల 22 నుంచి 26 వరకు భద్రాచలం జీసీసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రేపు ఎంపికలుభద్రాచలంటౌన్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 23న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ వెస్ట్ జోన్ అబ్జర్వర్ జి.వీరేశ్గౌడ్, జిల్లా బాధ్యులు కె.శరణ్తేజ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.అండర్–23,30 విభాగాల క్రికెటర్ల ఎం పికలు జరుగుతాయని, క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు రిపోర్ట్ చేయాలని సూచించారచు. వివరాలకు 96526 27452, 81426 27452 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. ట్రాక్టర్ పైనుంచి పడి కూలి మృతిపినపాక: పత్తి ట్రాక్టర్ పైనుంచి పడి వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని జానంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామానికి చెందిన కారం శివయ్య (48) మరో ముగ్గురు పత్తిలోడు పనికి జానంపేట వెళ్లాడు. పత్తిని ట్రాక్టర్లో లోడ్ చేసుకొని ప్రధాన రహదారిపైకి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ ట్రక్ ఒక్కసారిగా పైకి లేవడంతో పత్తి బస్తాలు, పైన ఉన్న కూలీలు కింద జారిపడ్డారు. కూలీ శివయ్య కిందకు పడడంతో తలకు బలమైన గాయమై అకస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆయన్ను వెంటనే పినపాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సామాన్యులు వీక్షించేలా...
భద్రాచలం: భద్రగిరి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం సులువుగా వీక్షించేందుకు మిథిలా స్టేడియాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. నాడు కేవలం శ్రీరామనవమి రోజున జరిగే కల్యాణం కోసమే నిర్మించినా క్రమంగా ముక్కోటి, హనుమాన్ జయంతి, దమ్మక్క సేవా యాత్ర, శబరి యాత్రలతోపాటు గోదావరి పుష్కరాలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వీటన్నింటి దృష్ట్యా స్టేడియాన్ని పునర్నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. శాశ్వత వేదిక నిర్మిస్తే ఎంతో ఉపయోగం భద్రాచలంలో శ్రీరామనవమి తర్వాత ముక్కోటి పండుగకు విశిష్టత ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున జరిగే ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల రాక పెరుగుతోంది. ముక్కోటి రోజు కూడా మిథిలా స్టేడియాన్ని వీవీఐపీ, వీఐపీ సెక్టార్లుగా విభజిస్తున్నారు. అవి వీఐపీలతో నిండిపోతుండగా సామాన్య భక్తులకు ముక్కోటి దర్శన ఫలం దక్కటం లేదు. సెక్టార్లను పెంచే వీలు లేక టికెట్లను సైతం కుదించి విక్రయాలు జరుపుతున్నారు. ఫలితంగా ఆలయ ఆదాయం తగ్గిపోతోంది. ఇక 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి తగినట్లు మిథిలా స్టేడియాన్ని వెయిటింగ్ సెక్టార్లుగా విభజించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాశ్వత వేదికను పునర్నిర్మించాలని, దీంతో ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సమయాల్లో కూడా భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ తరహాలో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధి పనులు మొదలుకాగా స్థపతి, అధికారులు మాస్టర్ ప్లాన్ను రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యారు. మిథిలా స్టేడియం పునర్నిర్మాణాన్ని కూడా మాస్టర్ ప్లాన్లో చేర్చాలని భక్తులు కోరుతున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్/ యాంఫీ థియేటర్ తరహాలో నిర్మించాలని పేర్కొంటున్నారు. శ్రీరామనవమి రోజున మాత్రమే మిథిలా స్టేడియం వినియోగిస్తున్నారు. అనంతరం అది ఖాళీగా ఉంటోంది. మాస్టర్ ప్లాన్లో చేర్చి, స్టేడియాన్ని పునర్నిర్మించాలి. భద్రాచలంలో జరిగే అన్ని ఉత్సవాలకు ఉపయోగపడేలా మార్పులు చేయాలి. భక్తుల రద్దీకి తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టాలి. – చిరుతాని జోగారావు, భద్రాచలంశ్రీరామనవమి వేడుకలను తొలుత ఆలయంలో, ఆ తర్వాత చిత్రకూట మండపంలో జరిపేవారు. భక్తుల ఆదరణ విశేషంగా పెరగడంతో 1964లో మిథిలా స్టేడియం ఉన్న ప్రదేశంలో వేదిక నిర్మించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో 1988లో కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలు నిర్మించగా, అప్పటి నుంచి మిథిలా స్టేడియంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాలంలో భక్తులు పెరిగినా మార్పులు జరగలేదు. ప్రస్తుతం కల్యాణం జరుగుతున్న వేదిక ముందే సీఎం, వీఐపీ, వీవీఐపీ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వెనుకవైపు, చుట్టు పక్కల ఉండే సామాన్య భక్తులకు కల్యాణం సరిగ్గా కనిపించడంలేదు. ఇటీవల సెక్టార్లపై శాశ్వత షెడ్ నిర్మించడంతో పైభాగంలో ఉన్న గ్యాలరీలో భక్తులకు మరింత ఇబ్బందులు ఏర్పడనున్నాయి. -
పల్లె పోరుకు సిద్ధం!
స్థానిక సంస్థలకు అక్టోబర్లోనే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న షెడ్యూల్ సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కొన్ని అడ్డంకులు రావడంతో కోర్టు స్టే విధించగా, ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమైంది. ఈసారి మొదటి విడతలో పంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోసారి ఓటరు జాబితా సవరణ.. డిసెంబర్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరోసారి ఓటరు జాబితా సవరణ చేపట్టాలని ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23 వరకు ఓటరు జాబితాల్లో సవరణలు, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులను పూర్తి చేసి ప్రకటించాలని ఆదేశించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో జనాభా ఆధారంగా మరోసారి సర్పంచులకు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పూర్తిగా ఏజెన్సీ కావడంతో పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేసినా అంతగా ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ను వర్తింపజేయనున్నారు. 471 జీపీలు.., 4,168 వార్డులు జిల్లాలో 471 గ్రామ పంచాయతీల పరిధిలో 4,168 వార్డులు విస్తరించి ఉన్నాయి. వీటికి డిసెంబర్ రెండో వారంలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలు 1,436 వార్డులకు, రెండో విడతలో 158 గ్రామపంచాయతీలు, 1,392 వార్డులకు, మూడో విడతలో 156 పంచాయతీలు 1,340 వార్డుల చొప్పున గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల బీసీలకు 42 శాతం ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం జిల్లాలోని 471 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయగా, ఎస్టీ జనరల్కు 235 స్థానాలు, ఎస్టీ మహిళలకు 225 స్థానాలను కేటాయించారు. ఎస్సీ జనరల్కు రెండు స్థానాలు, బీసీ జనరల్కు నాలుగు స్థానాలు, బీసీ మహిళకు రెండు, జనరల్కు మూడు చొప్పున రిజర్వేషన్లను ఖరారు చేశారు. వార్డుల్లో.. 4,168 వార్డుల పరిధిలో ఎస్టీ జనరల్కు 1,396, ఎస్టీ మహిళలకు 1,257, ఎస్సీ జనరల్కు 11 స్థానాలు, ఎస్సీ మహిళలకు 7, బీసీ జనరల్కు 19, బీసీ మహిళలకు 23, జనరల్ స్థానాలు 789, జనరల్ మహిళలకు 666 చొప్పున వార్డులను రిజర్వేషన్ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో 50 శాతానికి లోబడి డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేసినా ఒకటి, రెండు స్థానాలు తప్ప పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ మీద పార్టీ గుర్తులు ఉండవు. స్వతంత్ర గుర్తులతోనే అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల పరిధిలో తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న అధికారులు ప్రకటించిన ప్రకారం 6,69,048 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, పోలింగ్ సామగ్రిని అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని కేటాయించి రెండు విడతలుగా శిక్షణ సైతం పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. బీసీ రిజ్వరేషన్ ఏ విధంగా అమలు చేసినా జిల్లా పూర్తిగా ఏజెన్సీ కావడంతో పెద్దగా ప్రభావం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. –చుంచుపల్లి471 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు -
సాగుపై మరిన్ని పరిశోధనలు అవసరం
అశ్వారావుపేటరూరల్: పంటల సాగుపై మరిన్ని పరిశోధనలు అవసరమని, అలాగే వాతావరణ అనూకూల వ్యవసాయ పద్ధతులపై రైతాంగానికి అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ మురళి అన్నారు. శుక్రవారం ఢిల్లీ, ముంబై నుంచి స్థానిక వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన సోనల్, జాన్వి బృందంతో కలిసి ట్రెయినీ కలెక్టర్ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పుట్టగొడుగుల పెంపకం, జీవ నియంత్రణ ఎరువుల పరిశోధన కేంద్రం, కొబ్బరి, ఆయిల్పాం తోటలో సాగు చేస్తున్న పలు రకాల అంతర పంటలను పరిశీలించి వాటి వివరాలను కళాశాల ఏడీ డాక్టర్ హేమంత్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్, అధ్యయన బృందం బాధ్యులు మాట్లాడుతూ.. స్థానిక వ్యవసాయ కళాశాలలో పీజీ కళాశాలను ఏర్పాటు చేసి మరిన్ని కొత్త పద్ధతులు, సాగు విధానాలపై పరిశోధనలు చేస్తే రైతాంగానికి, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, వ్యవసాయశాఖ ఏడీఏ రవికుమార్, ఇన్చార్జ్ ఏఓ చంద్రశేఖర్రెడ్డి, ఆయిల్ఫెడ్ డీఓ రాధాకృష్ణ, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాబ్మేళాలో 41మంది ఎంపిక
పాల్వంచరూరల్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ (అటాన్మస్ ) కళాశాలలో శుక్రవారం జిల్లా ఉపాధి కల్పన శాఖ, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. మేళాకు 115 మంది అభ్యర్థులు హాజరుకాగా మారుతి అగ్రోటెక్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 41 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ తెలిపారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.అరుణకుమారి, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వే పారదర్శకంగా ఉండాలి
పినపాక: జనగణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలని జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పినపాక గ్రామ రైతు వేదికలో జనగణన ఎన్యుమరేటర్ల, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. సర్వే ప్రక్రియలో సవాళ్లు, సమస్యలను గుర్తించేందుకు ప్రీ టెస్ట్ జనగణన సర్వే నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా డిజిటల్ రూపంలో జరుగుతోందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టాలని సూచించారు. వారి ఇష్టం మేరకు, వారిచ్చిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందుపరచాలన్నారు. అంతకుముందు గడ్డంపల్లిలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఇంటి సభ్యులతో మాట్లాడి సర్వేతో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలను ప్రజలకు వివరించి సమాచారం సేకరించాలని అన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ, సూపర్వైజర్లు పాల్గొన్నారు.జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి -
సహజ వనరులపై అధ్యయనం
● విపత్తు కార్యాచరణ ప్రణాళికకు సమాచార సేకరణ ● పలు ప్రాంతాల్లో పర్యటించిన ‘ఇండియా హౌస్’ బృందం సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్ను శాసీ్త్రయ ఆధారాలతో, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించిన నేపథ్యంలో ఇండియా హౌస్ ప్రతినిధి బృందం శుక్రవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. జాహ్నవి, సోనల్ ఘోడ్గే, మురళి (డిప్యూటీ కలెక్టర్)లతో కూడిన బృందం సహజ వనరులు, పర్యావరణ వ్యవస్థ, అడవి సంరక్షణ, పరిశ్రమల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తూ సమాచారం సేకరించింది. మొదట సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలను సందర్శించింది. గనుల తవ్వకాల వల్ల కోల్పోయిన అడవులను పునరుద్ధరించేందుకు చేపడుతున్న చర్యలు, శాసీ్త్రయ పద్ధతుల్లో పెంచుతున్న వివిధ జాతుల మొక్కలు, పునరావాస ప్రాంతాల్లో జీవవైవిధ్యం, సంరక్షణ కార్యక్రమాలపై అధికారులు ఇచ్చిన వివరాలను సమగ్రంగా పరిశీలించింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో సింగరేణి సంస్థ చేపడుతున్న నాణ్యతా ప్రమాణాలను కూడా బృందం అధ్యయనం చేసింది. కిన్నెరసానిలో బోటు షికారు బృందం కిన్నెరసాని అభయారణ్యం, కిన్నెరసాని డ్యామ్ను సందర్శించింది. అభయారణ్యంలో అరుదైన వృక్షజాతులు, జంతువులు, అడవి సంరక్షణ పథకాలు, అడవుల నరికివేత వల్ల వాతావరణ మార్పులపై పడుతున్న ప్రభావం వంటి అంశాలను అటవీ అధికారులు వివరించారు. కిన్నెరసాని డ్యామ్ వద్ద నీటి నిల్వలు, వరద నియంత్రణ వ్యవస్థ, జలవనరుల నిర్వహణ విధానాలు, డ్యామ్ భద్రతా ప్రమాణాలను బృందం సమీక్షించింది. అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో అడవుల ప్రస్తుత స్థితి, అక్రమ వృక్ష నరికివేత, నియంత్రణ చర్యలు, వాతావరణ మార్పులతో సంభవించే సహజ విపత్తుల ప్రభావం, వరదలు, నేల ధూపాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కిన్నెరసానిలో బోటు షికారు చేశారు. వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు, రేంజర్ కవిత మాధురి పాల్గొన్నారు. మాధారం గ్రామంలో.. ములకలపల్లి మండలం మాధారం గ్రామంలోని నాయకపోడు మాస్క్ తయారీ కేంద్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. మాస్క్ తయారీలో వినియోగించే చెక్క మూలాలు, వాటి వల్ల అడవులపై పడే ప్రభావం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల అమలుపై ఆరా తీశారు. అనంతరం దమ్మపేటలోని ఆయిల్ పామ్ పరిశ్రమను సందర్శించి, ఉత్పత్తి విధానాలు, పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులు అందించిన వివరాలను అధ్యయనం చేశారు. ఈ సమాచారం మొత్తం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మార్గదర్శకంలో రూపుదిద్దుకుంటున్న జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్ తయారీలో ప్రధాన ఆధారాలుగా ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.భద్రాచలంటౌన్: ఇండియా హౌస్ బృందం శనివారం భద్రాచలంలో పర్యటించనుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని, ఐటీడీఏలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను, బూర్గంపాడులోని ఐటీసీ ప్లాంట్ను, దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి వద్ద గోదావరి వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తారని వివరించారు. ఆ తర్వాత బొజ్జిగుప్ప గ్రామంలోని ఎస్హెచ్జీ మహిళలతోపాటు గిరిజన ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి వెండి హారతులు.. భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారికి తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు శుక్రవారం వెండి హారతులను వితరణ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన నాగవెంకట సుబ్బా సురేష్ వర్మ–సౌమ్య దంపతులు 790 గ్రాముల వెండి కుంభ హారతిని స్వామివారికి అందజేశారు. విశాఖపట్నానికి చెందిన సాయి అఖిల్– కృష్ణ ప్రియ దంపతులు 1.470 కేజీల వెండి ద్వాదశ హారతి సమర్పించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పృథ్వీ రాజు–శారద స్వప్న దంపతులు కిలో 15 గ్రాముల వెండి ద్వయ హారతిని వితరణ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.4,50,000 ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతో పాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదనపు ఎస్పీగా అవినాష్ కుమార్కొత్తగూడెంటౌన్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన పోలీస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్స్) జి.నరేందర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ జిల్లాలో భైంసా ఏఎస్పీగా పనిచేస్తున్న అవినాష్ కుమార్ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. కాగా నరేందర్ను నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. టీ హబ్ను సందర్శించిన డీఎంహెచ్ఓచుంచుపల్లి: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని టీ–హబ్ను డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ శుక్రవారం సందర్శించారు. సమయపాలనకు ప్రాముఖ్యత ఇవ్వాలని, రోగులకు రక్త పరీక్షల వివరాలను పారదర్శకంగా అందజేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశీలించి శుభ్రత, నిర్వహణ, సేవలపై పలు సూచనలు చేశారు. వైద్యాధికారులు సీతారామ్, పుల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్, నిజాముద్దీన్ పాల్గొన్నారు. -
బంగారుతీగ తినలేమా?
● ఈ ఏడాది ఆ రకం చేపలు కరువే.. ● చేపపిల్లల విత్తనం దొరకని దుస్థితి.. ● జాప్యం వల్లనే కొరత పాల్వంచరూరల్: మత్స్యకారుల జీనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీలో జరిగిన జాప్యం కారణంగా జిల్లాలో బంగారు తీగ చేపపిల్లల (విత్తనం) కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది బంగారు తీగ చేపలు దొరకడం కష్టమే. జిల్లాలో ఈ ఏడాది 650 చెరువుల్లో 1.76. కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. అందులో బంగారు తీగ, బొచ్చ, రవ్వ రకాలను పంపిణీ చేయా లని మత్స్యశాఖ నిర్ణయించింది. గత అక్టోబర్ 31న సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇల్లెందు మండలంలో కాంట్రాక్టర్ పంపిణీ చేసిన చేపపిల్లలు నిర్దేశించిన పరిమాణంలో లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య వాటిని తిరస్కరించారు. అవి నిర్దేశించిన 80 నుంచి 100మి.మీ సైజు ఉండాల్సి ఉండగా.. 35నుంచి 40మి.మీ. సైజు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద సైజు పిల్లలను తీసుకొచ్చి చెరువులో వదిలారు. అయితే, అందులో మూడు రకాల చేపపిల్లలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్కు బంగారు తీగ రకం చేపిపల్లలు (సీడ్) రాష్ట్రంలోగానీ, ఏపీలోగానీ దొరకడం లేదు. దీంతో కాంట్రాక్టర్ కేవలం జిల్లాలో రవ్వ, బొచ్చ రకాలకు చెందిన చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అదును దాటాక.. ప్రతి సంవత్సరం వానాకాలంలో అంటే ఆగస్టులో చేపపిల్లలను చెరువులో పోసినట్లయితే అవి పెరిగి మత్స్యకారులకు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడేవి. గతేడాది నుంచి ఈ ఏడాది వరకు కూడా చేపపిల్లల పంపిణీ ప్రక్రియ అదను దాటిన తర్వాతనే జరుగుతోంది. ఈసారి ఇంకా చేపపిల్లల పంపిణీ ప్రక్రయ జిల్లాలో పూర్తి కాలేదు. దీనికితోడు మూడురకాల చేప పిల్లల్లో ఒక రకం బంగారుతీగ దొరక్క పోవడంతో కేవలం రెండు రకాలను పంపిణీ చేస్తున్నారు. వాటిని కూడా నవంబర్ నెల కూడా పూర్తికావొస్తున్నా నేటికీ పంపిణీ చేయడం పూర్తి కాలేదు. అయితే, చేపపిల్లలను అదను దాటిన తర్వాత చెరువుల్లో వదిలినా ఉపయోగం లేదని అవి ఎదగవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో పంపిణీ ప్రక్రియకు అనువైన సమయం అని, ఆ నెల దాటిన తర్వాత పోసే చేపపిల్లల ఎదుగుదల ఉండదని, దీంతో నష్టం వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. తేడాలు ఏమిటంటే.. బంగారుతీగ, బొచ్చ రకం చేపల్లో తక్కువ ముళ్లు ఉండటంతో వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అదే రవ్వ చేపకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బంగారుతీగ, బొచ్చ రకం చేపలు నీటిలో పోసిన తర్వాత 6 నుంచి 8నెలల వ్యవధిలో బరువు పెరుగుతాయి. త్వరితగతిన అరకేజీ నంచి కేజీ వరకు ఎదుగుతాయి. అదే రవ్వచేప మాత్రం 8 నుంచి 10నెలల సమయంలో కేజీ, కేజీన్నర పెరుగుతుంది. ఏడాది దాటితే మాత్రం ఈచేప రెండు, మూడు కేజీలకు పెరుగుతుంది. కాగా, జిల్లాలో 650 చెరువుల్లో 1.76కోట్ల చేపపిల్లలను పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు సమారు 15 లక్షలకుపైగా మాత్రమే పంపిణీ చేశారు. అది కూడా 52 చెరువుల్లో మాత్రమే పోశారు. నాణ్యమైన చేపపిల్లలను వదిలితేనే నిర్దేశించిన గడువులో మత్స్యకారులకు దిగుబడి లభిస్తుంది. కాంట్రాక్టర్ పోస్తున్న చేపపిల్లలపై అధికారుల పర్యవేక్షణ లేకపోతే మత్స్యకారుల ఆదాయానికి గండిపడినట్లే. నాణ్యమైన చేపలను సరఫరా చేసేలా చూడాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు. జిల్లాలో 650 చెరువుల్లో ఈ ఏడాది 1.76 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపినీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం. అయితే, ఇప్పటివరకు 52 చెరువుల్లో వదిలేందుకు 15 లక్షలకుపైగా చేపపిల్లలను పంపిణీ చేశాం. డిసెంబర్లోగా ఈ ప్రక్రియను పూర్తీ చేస్తాం. బంగారుతీగ సీడ్ కొరత నిజమే. –ఎండీ ఇంతియాజ్ఖాన్, మత్స్యశాఖాధికారి


