breaking news
Bhadradri District Latest News
-
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం/భద్రాచలంటౌన్: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. నిత్యకల్యాణం ఘనంగా జరిపారు. స్వామివారిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు గోదావరి మాతకు నదీహారతి నిర్వహించారు. భద్రాచలం డీఎస్పీ ఎం.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెడీమేడ్ బట్టల షాపుల అసోసియేషన్ పూజా సామగ్రిని సమకూర్చారు. కాగా, హైదరాబాద్కు చెందిన భక్తులు శ్రీనివాసరావు, పద్మప్రియ దంపతులు అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళం అందించారు. కరీంనగర్కు చెందిన మంత్రాలయ ఫ్లోరింగ్స్, విరాజ్ మార్కెటింగ్ కంపెనీల నిర్వాహకులు దేవస్థానానికి రాతి, వెండి గిన్నెలను విరాళంగా అందించారు. -
రైతులను ముంచింది..
● గోదావరి వరదలకు దెబ్బతిన్న పత్తిచేలు ● ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టంబూర్గంపాడు: నిన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద నిండా ముంచింది. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో సుమారు ఐదువేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇందులో సుమారు 2400 ఎకరాల పత్తి చేలు, 1400 ఎకరాల వరి మాగాణులు, 800 ఎకరాలలో జామాయిల్, మిగతా 400 ఎకరాలలో ఇతర పంటలున్నాయి. వరి, జామాయిల్ పంటలకు గోదావరి వరదల వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఒక్కసారి నీటమునిగితే చచ్చిపోయే పత్తికి మాత్రం వరదతో తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం సాయంత్రం నుంచి నీటమునిగిన పత్తిచేలలోని వరదనీరు ఆదివారం తెల్లవారుజాము వరకు నిల్వ ఉంది. దీంతో పత్తిమొక్కల ఆకులపై ఒండ్రు పేరుకుపోయి మొక్కలు వడలిపోతున్నాయని, అవి ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టామని, మళ్లీ ఇప్పుడు పత్తి గింజలు వేసుకోవాలంటే పెట్టుబడులు పెరిగిపోతాయని వాపోతున్నారు. అప్పులు చేసి పత్తిగింజలు వేయాలనుకున్న అదును దాటిపోయిందని పేర్కొంటున్నారు. సస్యరక్షణ తరుణంలో.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పత్తిగింజలు రెండు, మూడు విడతలుగా వేసుకోవాల్సి వచ్చింది. పత్తిగింజలకే రైతులు ఎకరాకు రూ.6 వేల వరకు ఖర్చు చేశారు. వానలు సకాలంలో కురవకపోవటంతో మొక్కలు సరిగా మొలవక రైతులు ఇబ్బందులు పడ్డారు. మొలిచిన మొక్కలకు ఇటీవల కురిసిన తేలికపాటి వానలతో రైతులు తొలివిడత ఎరువులు వేసుకున్నారు. పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చిన గోదావరి వరద రైతులను నట్టేట ముంచింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. -
మద్యం విక్రయాలు ఫుల్!
పాల్వంచరూల్: జిల్లాలో ఆదివారం జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. పలుచోట్ల మద్యం కొరత నెలకొంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాల్లో బీర్లు దొరకలేదు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీర్లు, ఇతర మద్యం విక్రయాలు జోరుగా సాగినట్లు తెలుస్తోంది. రూ. 3 వేలకు పైగా ధర ఉన్న లిక్కర్ మాత్రమే ఉన్నట్లు, మిగతావి అన్ని విక్రయమైనట్లు సమాచారం. ఆదివారం జిల్లాలో ఏ మద్యం దుకాణం ముందు చూసినా సందడి వాతావరణం కనిపించింది. వైన్స్తోపాటు బెల్ట్షాపుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు మద్యంబాబులు పొరుగునే ఉన్న ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లి మద్యం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దసరా, నూతన సంవత్సర వేడుకల రోజు విక్రయాలు అధికంగా ఉంటాయని, ఈసారి స్నేహితుల దినోత్సవం రోజూ రెట్టింపు విక్రయాలు జరిగాయని ఓ వ్యాపారి తెలిపారు. నెలలో మొదటి ఆదివారం, ఫ్రెండ్షిప్ డే, పలుచోట్ల బోనాల పండుగ నిర్వహించడంతో అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా ఆదివారం సుమారు రూ. 6 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగినట్లు పాల్వంచ ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఎకై ్సజ్ శాఖకు ఒక్కరోజే రూ. 6 కోట్ల ఆదాయం -
గోదారి వరదతో మేత కరువు
బూర్గంపాడు: గోదావరి వరదలతో ప్రజలు మాత్రమే కాకుండా పశువులు, జీవాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. గోదావరి వరదలతో వాగులు, వంకలు నీటమునిగాయి. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె పట్టీనగర్, ఇరవెండి గ్రామాల్లో మేకలు, గొర్రెలు మేతకు బయటకు వెళ్లేందుకు వీలు లేని దుస్థితి ఎదురైంది. శనివారం గోదావరి వరద పెరగడంతో పెంపకందారులు మేకలు, గొర్రెలను మేతకు తోలలేదు. ఆదివారం వరద తగ్గినా గడ్డిపై బురద ఉండటంతో జీవాలు మేతకు అలమటించాయి. వారం రోజులపాటు దూరప్రాంతాలకు వెళ్తే తప్ప జీవాలకు మేత దొరకదని చెబుతున్నారు. ఆపదలో ఉన్న మిత్రుడికి చేయూత ● రూ.2.25 లక్షలు అందించిన పూర్వ విద్యార్థులు నేలకొండపల్లి/ఏన్కూరు: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంనకు చెందిన తాళ్లూరి గురుబ్రహ్మాచారికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయనతో కలిసి ఏన్కూరు గురుకులంలో చదువుకున్న 1992 బ్యాచ్ మిత్రులు.. రూ.2.25 లక్షలు సేకరించి స్నేహితుల దినోత్సవమైన ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో అర్పినేని కృష్ణ, తిరునగిరి అనిల్, వంగూరి మల్లేశ్, పగిడిపల్లి పుల్లయ్య, చిప్పలపల్లి వెంకన్న, వేల్పుల సురేశ్బాబు, గుడిపూడి కృష్ణయ్య, బండి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీహైవేపై రాకపోకలకు అనుమతి ఖమ్మం – దేవరపల్లి హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మలఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద ఆదివారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ లైట్లు అమర్చే పనులు జరుగుతుండడంతో భారీ వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవేపై కొంతదూరం ప్రయాణించి పరిశీలించారు. కాగా, హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించినా, ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమం మాత్రం ఉండదని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాక టోల్ఫీజు వసూలు మమొదలవుతుందని వెల్లడించారు. ఇన్నాళ్లు సోమవరం వద్ద... హైవే పనులు కొద్ది నెలల క్రితమే పూర్తయినా ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఆలస్యమైంది. దీంతో వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసలాపురం వద్ద బ్రిడ్జితో పాటు ఎగ్జిట్ నిర్మాణ పనులు, ఇతరత్రా అన్ని పూర్తవడంతో తల్లంపాడు ఎంట్రీ పాయింట్ నుంచి అనుమతిస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారికి దూరం, సమయం తగ్గనున్నాయి. వాగులోకి దిగిన కార్మికుడికి ఫిట్స్ గుండాల: బహిర్భూమికని కిన్నెరసాని వాగులో దిగిన ఓ కార్మికుడికి ఫిట్స్ రావడంతో మృతిచెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రామచంద్రయ్యగుంపు గ్రామానికి చెందిన తుమ్మ రాంబాబు (34) గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి మూర్చవ్యాధి ఉంది. శనివారం విధులు ముగించుకుని స్థానిక కిన్నెరసాని వాగు వద్దకు బహిర్భూమికని వెళ్లాడు. వాగులో దిగగానే ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాంబాబు ఇంటికి రాకపోవడంతో కటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. కిన్నెరసానివాగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం గుర్తించి, బోరున విలపించారు. కుటుంబ సభ్యుల పిర్యాధు మేరకు ఎస్ఐ సోమేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కాల్వలో పడి యువకుడు మృతి
పాల్వంచరూరల్: కిన్నెరసాని కెనాల్లో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. కిన్నెరసాని డ్యామ్ దిగువన గల కేటీపీఎస్కు నీరు సరఫరా జరిగే కాల్వ వద్దకు కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన, బార్బర్ పనిచేసే తంగళ్లపల్లి సంతోష్ (24), తంగళ్లపల్లి నవీన్, ప్రవీణ్కుమార్, రాజేశ్ వచ్చారు. కెనాల్ వద్దకు సంతోష్ వెళ్లగా జారి నీటిలో పడ్డాడు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాల్వలో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. సమీపంలోని కానిస్టేబుల్ రాంబాబు, డీర్ పార్కు వాచర్లు కల్యాణ్, ఇబ్ర హీం కాల్వలో దూకి సంతోష్ను బయటకు తీసుకొచ్చారు. కానీ, అప్పటికే మృతి చెందాడు. ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, స్నేహితుల దినోత్సవం నాడు మిత్రులతో కలిసి వెళ్లిన యువకుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్నేహితుల దినోత్సవం నాడు విషాదం -
శాంతించిన గోదావరి
● భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ ● నాలుగు గంటలపాటు గరిష్ట స్థాయిలోనే నిలకడగా ప్రవాహం ● రాకపోకల పునరుద్ధరణ.. ఊపిరి పీల్చుకున్న ముంపు గ్రామాల ప్రజలుభద్రాచలంటౌన్: రెండు రోజులపాటు ఉధృతంగా ప్రవహించిన గోదావరి నది శాంతించింది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు ఒక్కసారిగా పొంగిపొర్లాయి. ఉపనదుల నుంచి భారీగా వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు 56.1 అడుగుల స్థాయికి చేరిన వరద సమారు నాలుగు గంటలపాటు నిలకడగా కొనసాగింది. వేగంగా పెరిగిన వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ గోదావరి నీటిమట్టం శనివారం రాత్రి 11.16 గంటలకు 52.9 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం ఉదయం 7.45 గంటలకు 47.9 అడుగులకు, సాయంత్రం 5.12 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండో, మొదటి ప్రమాద హెచ్చరికలను కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రవాహం ప్రమాద స్థాయి కంటే కిందకు పడిపోవడంతో అధికారులు, ముంపు ప్రభావిత, ఏజెన్సీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై తగ్గిన నీరు వరద ఉధృతి తగ్గడంతో ప్రధాన రహదారులపై నుంచి వరద నీరు తొలగిపోయింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతర్గత రహదారులపై కొన్నిచోట్ల బురద పేరుకుపోయి ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. స్నానఘట్టాలపై పేరుకుపోయిన బురద వరద తగ్గినా భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, కల్యాణకట్టలపై బురద, వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్య పనులు పూర్తయి ఘాట్లు సాధారణ స్థితికి వచ్చే వరకు భక్తులు ఎవరూ నదీ తీరానికి రావొద్దని అధికారులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. గోదావరి నీటిమట్టం శనివారం రాత్రి ఒంటిగంటలకు 52 అడుగులకు తగ్గింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 49 అడుగులు, మధ్యాహ్నం 3 గంటలకు 44 అడుగులు, రాత్రి 11 గంటలకు 40.90 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. -
ఎరువులన్నీ యాప్ ద్వారానే..
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతో పాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం యాప్ను రూపొందించింది. అంతర్జాతీయ పరిణామాలతో ముడి పదార్థాల ధరలు పెరగగగా గత ఏడాది వానాకాలం సీజన్ నుంచి యూరియా కొరత ఏర్పడింది. ఈ ఏడాది డీఏపీ (డై అమ్మోనియం పాస్ఫేట్)కి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఎరువులను కేంద్రం సబ్సిడీపై సరఫరా చేస్తుండడం, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమాన గత యాసంగి సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీకి ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా కేంద్రం యూరియాతో పాటు అన్ని ఎరువులను డిజిటల్ విధానంలో బుకింగ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది. భూమి ధ్రువీకరణతో.. ఎరువుల కొనుగోలును సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’బుకింగ్ యాప్ను తీసుకొస్తోంది. రైతులు స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని, రైతు ఆధార్ నంబర్ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసి లాగిన్ అయ్యాక ఎరువులను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో.. కేంద్రం ఎరువుల కొనుగోళ్లకు నూతనంగా అమలు చేస్తున్న డిజిటల్ విధానాన్ని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేశారు. ఆపై మొదటి దశలో పది జిల్లాల నుంచి ఎంపిక చేయగా, ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నెల 6 నుంచి పది జిల్లాల్లో ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ మొదలవుతుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ వంటి అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఎరువుల బుకింగ్, కొనుగోలు సులభమవుతుందని ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. రైతులకు సందేహాలు ఉంటే అందుబాటులోని వ్యవసాయాధికారులు, డీలర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
వరదలు తగ్గాయి.. ఇంటికి పంపండి
భద్రాచలంఅర్బన్: వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తు చర్యగా గర్భిణులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేర్చగా.. గర్భిణుల అటెండెంట్లలో కొందరు ఇళ్లకు వెళ్లేందుకు సుముఖత చూపుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి పంపాలని పట్టుబడుతున్నారు. ఇందుకు ఆస్పత్రిలో అందిస్తున్న భోజనం బాగాలేదని కారణంగా చెబుతున్నారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు మాత్రం ఆస్పత్రి నుంచి కదలడం ఎంతమాత్రం సురక్షితం కాదని తేల్చిచెబుతున్నారు. వరదలు తగ్గినా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేమని, అకస్మాత్తుగా నొప్పులు వస్తే రవాణా అత్యంత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ మేరకు వారికి అవగాహన కల్పించారు. -
అమ్మపాలు.. అమృతం
భద్రాచలంఅర్బన్/అశ్వాపురం: నవజాత శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్ల లకు అవే అమృతమని, శిశువు జన్మించిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. తల్లిపాల ఆవశ్యకత తెలిపేలా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు రోగ నిరోధశ శక్తికి దోహదం.. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. బిడ్డకు తొలి అరగంటలోపే తాగిస్తే చాలా రోగాల నుంచి రక్షించుకోవచ్చు. ముర్రుపాలలో విటమిన్ ఏ, బీ, ఐరన్ ఉండటంతో పేగులకు బలాన్నిచ్చి, జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు, విరేచనాలు వంటి రుగ్మతల నుంచి కాపాడుతాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణనిస్తాయి. అలాగే, రాత్రుళ్లు పాలివ్వడం వల్ల తల్లి మెదడు నుంచి ప్రొలాక్టిన్ ఎక్కువగా స్రవిస్తుంది. కాగా, జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీల వారీగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2,061 అంగన్వాడీల్లో 7,274 మంది గర్భిణులు, 3,101 మంది బాలింతలు ఉన్నారు. తల్లికీ ఉపయోగం.. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్, అండాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. అయితే, కొందరు బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాల కంటే ఆవు పాలే పడతారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. 100 గ్రాముల ఆవు పాలల్లో ఉండే కేలరీలు, 100 గ్రాముల తల్లి పాలల్లో ఉండే కేలరీలతో సమానం. అంతకు మించి తల్లి పాలకు, ఆవు పాలకు సారూప్యత లేదు. 100 మిల్లీ లీటర్ల తల్లిపాలలో పోషకాలు 100 మిల్లీ లీటర్ల తల్లిపాలలో కొవ్వు 4.2 గ్రాములు, ప్రొటీన్లు 1.1 గ్రాములు, లాక్టోజ్ 7 గ్రాములు, ఒలిగో శాఖరైడ్ 0.5 గ్రాములు, కాల్షియం 0.3 గ్రాములు, ఫాస్పరస్ 0.014 గ్రాములు, సోడియం 0.015 గ్రాములు, పొటాషియం 0.055 గ్రాములు, క్లోరిన్ 0.043 గ్రాములు ఉంటాయి. మదర్ మిల్క్ బ్యాంక్.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ను అందుబాటులో తీసుకురానుండగా, మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఖమ్మంలో ఒక మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులో ఉంది.బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలివ్వాలి. రోజుకు 10 నుంచి 12 సార్లు బిడ్డకు పాలు ఇవ్వాలి. బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించవచ్చు. అవి ఎంతో ఆరోగ్యం. తల్లి పాలు ఇస్తే ఆరోగ్యం దెబ్బతింటుందనేది అపోహ మాత్రమే. –డాక్టర్ రాజశేఖర్రెడ్డి, సూపరింటెండెంట్, భద్రాచలం ఆస్పత్రిపుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు పట్టించాలి. 6 నెలల తరువాత తల్లిపాలతో పాటు ఇంట్లో తినే ఆహారం మాత్రమే ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ, ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. –స్వర్ణలత లేనినా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి -
కాన్పు కష్టం కావొద్దనీ..
భద్రాచలంఅర్బన్: ఏటా వరదల సమయంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు కార్యాచరణ చేపడుతోంది. గర్భిణులను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలు, వరద ప్రభావిత గ్రామాల్లో నివసించే గర్భిణుల వివరాలను వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ముందుగానే సేకరించడంతో పాటు ప్రసవ తేదీ సమీపంలో ఉన్న మహిళలను ప్రత్యేకంగా గుర్తించి, వరద ఉధృతి పెరగక ముందే సమీప ప్రభుత్వ ఆస్పత్రులు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి గర్భిణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రక్తపోటు, హిమోగ్లోబిన్, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన మందులు, పోషకాహారం అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం అందేలా 108 అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచడంతో పాటు, రహదారి మార్గాలు నిలిచిపోయే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను కూడా ముందుగానే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యులు, సిబ్బంది, ఆపరేషన్ థియేటర్లు, రక్త నిల్వలు, అత్యవసర మందులు, నవజాత శిశువులకు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచి 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. క్లిష్ట గర్భధారణ ఉన్న మహిళలను ఉన్నత వైద్య కేంద్రాలకు ముందుగానే రిఫర్ చేసి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తూ పురిటి నొప్పులు ప్రారంభమైన వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేయడం వల్ల వరదల సమయంలో కూడా గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఏటా చేపడుతున్న ఈ ముందస్తు చర్యలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలు తగ్గుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని కరకగూడెం, పినపాక, జానంపేట, మోరంపల్లి బంజర, నర్సాపురం, దుమ్ముగూడెం, చర్ల, మణుగూరు, అశ్వాపురం, పర్ణశాల, సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గర్భిణులను తొలి ప్రమాద హెచ్చరిక సమయానికి చేరుస్తున్నారు. సాధారణ ప్రసవం సాధ్యమవుతుందని భావించిన గర్భిణులను అక్కడే ఉంచుతున్నారు. వరదల సమయంలో 24 గంటల పీహెచ్సీతోపాటు సాధారణ పీహెచ్సీలు కూడా 24 గంటలూ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరగానే హైరిస్క్ గర్భిణులను భద్రాచలం, మణుగూరు ఏరియా వైద్యశాలలకు తరలిస్తున్నారు. వరదల వల్ల రాకపోకలు నిలిచిపోతాయేమో అనుకున్నాం. కానీ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రసవ తేదీ దగ్గర పడగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవం ద్వారా ఆడ శిశువు జన్మించగా ప్రకృతి అని పేరు పెట్టాలనుకుంటున్నాం. –పెనుబల్లి వసంత, చెరుపల్లి వరద నీరు పెరుగుతుండటంతో ప్రసవం ఎలా జరుగుతుందో తెలియక కుటుంబంతా ఆందోళనలో ఉన్న సమయంలో వైద్యాధికారులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు సాధారణ ప్రసవం చేయగా ఆడ శిశువు జన్మించింది. ముందస్తు చర్యలతో ప్రమాదం తప్పింది. –భవాని, పైడాకులమడుగు వరదల గురించి ఆలోచిస్తే భయమేసేది. వైద్యాధికారులు అవసరమైన సూచనలు ఇవ్వడంతో ఇప్పుడు ప్రసవంపై ఎలాంటి ఆందోళన లేదు. 4వ తేదీన వైద్యులు కాన్పు చేయనున్నారు. తల్లి కాబోతున్న ఆనందాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నా. భయం పోయింది. –సంకీర్తన, బూర్గంపాడు కలెక్టర్ అంకిత్, పీఓ రాహుల్ సూచనల మేరకు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రసవానికి రెండు నెలలు ఉన్న గర్భిణుల వివరాలు సేకరించి, సురక్షిత ప్రాంతాల్లోని ఏరియా ఆస్పత్రులకు తరలించాం. వారి ఆరోగ్య భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –సైదులు, ఏడీఎంహెచ్ఓ, భద్రాచలం నెల ప్రసవాలు హైరిస్క్ జూలై 216 51 ఆగస్ట్ 324 103 సెప్టెంబర్ 275 101నదీ పరీవాహ ప్రాంతాల్లోని పీహెచ్సీల పరిధిలో 900 మందికి పైగా గర్భిణులు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రసవించనున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. ఇందులో 250 మందికి పైగా హైరిస్క్ గర్భిణులు ఉండగా వీరిని భద్రాచలం, మణుగూరు ఏరియా ఆస్పత్రులకు తరలించగా.. కొందరు ప్రసవించారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో గర్భిణులు, జ్వరపీడితులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. 23 మంది గర్భిణులను తరలించగా వారిలో 8 మంది.. డివిజన్స్థాయిలో 18 మంది సురక్షితంగా ప్రసవించారని వైద్యాధికారులు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేడు గిరిజన దర్బార్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో... భద్రాచలంటౌన్: సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి రాతపరీక్షసూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణిలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్, టీఅండ్ఎస్ గ్రేడ్డీ పోస్టులను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. 19 ఖాళీ పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించగా, 196 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించారు. పరీక్షను జీఎం(పర్సనల్) ఈఈ అండ్ఆర్పీ ఏజేఎం మురళీధరరావు, ఏజీఎం(విజిలెన్స్) ఎస్వీ మురళీధరరాజు పర్యవేక్షించారు. కేయూ దూరవిద్యలో ప్రవేశాల గడువు పొడిగింపు ఖమ్మంసహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి సూచించారు. పూర్తి వివరాలకు 80088 11998 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. రేక్ పాయింట్కు 2,520 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆదివారం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,520 మెట్రిక్ టన్నుల యూరియా, 127.6 అమ్మోనియం సల్ఫేట్ చేరింది. యూరియాను ఖమ్మం జిల్లాకు 1,020 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఓఏ డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మె. టన్నుల యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేశామని వెల్లడించారు. -
చిరుతపులి కలకలం
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలుక అటవీ ప్రాంతంలో ఆదివారం గేదెలపై ఒక్కసారిగా అటవీ జంతువు దాడి చేసింది. ఓ గేదె స్వల్పంగా గాయపడటంతో కాపరి వెళ్లి చూడగా ఏదో జంతువు అడవిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులకు తెలిపాడు. అయితే వాగు ఒడ్డున కొన్ని చిరుత పులి అడుగుజాడలు ఉన్నట్లు అనుమానం రావడంతో అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులియేనా..? లేక ఇతర అటవీ జంతువా అనేది నిర్ధారించే పనిలో పడ్డారు. వదంతుల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాటింపు వేయిస్తున్నారు. బొటిక్ సెంటర్లో చోరీ జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం ప్రధాన రహదారి పక్కన ఉన్న స్ఫూర్తి బొటిక్ టైలరింగ్ సెంటర్లో ఆదివారం చోరీ జరిగింది. గుండ్లరేవు గ్రామానికి చెందిన భూక్యా రమేశ్, కవిత దంపతులు కొంతకాలంగా వెంగన్నపాలెంనకు చెందిన సాయిల గోపాలరత్నం ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ మొదటి అంతస్తులో స్ఫూర్తి బొటిక్ టైలరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆదివారం దంపతులు రమేశ్, కవితలు ఇంటి తలుపులకు తాళం వేసి, వినోభానగర్లోని చర్చికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాగా తలుపులు తీసి ఉండటాన్ని దంపతులు గమనించి, బీరువా తీసి చూడగా అందులో ఉన్న రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారు పుస్తె బిళ్లలు కన్పించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. బొటిక్ సెంటర్లో కొన్ని రోజులుగా పని చేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యకితోపాటు, మరొకరు కలిసి చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ భూక్యా రమేశ్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు. -
బోదకాలు.. తీవ్ర అవస్థలు
● జిల్లాలో వెలుగుచూస్తున్న వ్యాధి కేసులు ● ఫైలేరియా రహిత జిల్లాగా గుర్తింపునకు ఇంకా దూరమే ● త్వరలో 14 జిల్లాల జాబితాతో కేంద్ర ప్రభుత్వంప్రకటన ● జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి.. ప్రస్తుతం 3,577 కేసులు ఖమ్మంవైద్యవిభాగం: బోదకాలు రహితంగా జిల్లాను తీర్చిదిద్దాలని వైద్య, ఆరోగ్య శాఖ ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కడం లేదు. ఎక్కడో ఓ చోట కేసులు వెలుగు చూస్తుండడంతో పూర్తిస్థాయిలో నిర్మూలన అసాధ్యంగానే మారుతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన బోదకాలు (ఫైలేరియా) పలు జిల్లాల్లో పూర్తిస్థాయిలో నిర్మూలన దశకు చేరింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆరేళ్ల కాలంగా మూడుసార్లు ‘ట్రాన్స్మిషన్ ఎసెస్మెంట్ సర్వే’చేయగా ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆయా జిల్లాలను ఫైలేరియా రహితంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అయితే, ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చోటు కోసం ఇంకొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది. జిల్లాలో బిన్నమైన పరిస్థితులు ఫైలేరియా కేసులు పలు జిల్లాల్లో క్రమంగా తగ్గిపోతున్నా, ఖమ్మం జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఆరేళ్లు ఒక్క కేసు నమోదు కాకపోతే ఫైలేరియా రహిత జిల్లాగా ప్రకటిస్తారు. కానీ, జిల్లాలో అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 3,577 మంది ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. అందులో 1,396 మంది ప్రభుత్వం అందించే రూ.2,016 పింఛన్ తీసుకుంటున్నారు. సహజంగా ఫైలేరియా కేసులను వ్యాధి తీవ్రత ఆధారంగా మూడు గ్రేడ్లుగా విభజిస్తారు. మొదటి గ్రేడ్ బాధితులు జిల్లాలో 905 మంది ఉండగా, వీరికి వ్యాధి తీవ్రత నామమాత్రంగానే ఉంటుంది. దీంతో వీరికి పింఛన్ లభించదు. గ్రేడ్–2లో 1,302, గ్రేడ్–3లో 1,370 మంది ఉండగా.. పింఛన్ అందుతోంది. వీరిలో వృద్ధాప్య, వితంతువు పింఛన్లు తీసుకునే వారు ఉండడంతో 1,396 మంది మాత్రం ఫైలేరియా పింఛన్ పొందుతున్నారు. అందని కిట్లు జిల్లాలో గత రెండున్నరేళ్లలో ఆరు ఫైలేరియా కేసులు నమోదయ్యాయి. వాధి బాధితులకు గతంలో ఎంఎండీపీ ప్రోగ్రామ్ కింద కిట్లు ఇచ్చేవారు. అందులో బకెట్, మగ్గు, టవల్, సబ్బు, క్రీమ్ ఉండేవి. కానీ, చివరిసారి 2023లో 3,500 కిట్లు సరఫరా చేయగా.. ఆ తర్వాత ఊసే లేకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అవగాహనతోనే నిర్మూలన బోదకాలు(ఫైలేరియా) అనేది పరాన్నజీవి పురుగుల వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కారక జీవులు కలిగిన క్యూలెక్స్ దోమలు కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీరంలోని శోషరస వ్యవస్థను దెబ్బతీసి, చేతులు, కాళ్లు, వృషణాలు, ఇతర అవయవాల్లో వాపు కలిగిస్తుంది. తీవ్రమైన నొప్పి, కాళ్లు, చేతులు అసాధారణంగా పెద్దవిగా మారతాయి. తద్వారా కొందరిలో శాశ్వత వైకల్యం, నడవడం, పనిచేయడం కష్టంగా మారడమే కాక తరచూ ఇన్ఫెక్షన్లు వస్తాయి.జిల్లాలో ఫైలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నాం. 2024లో నాలుగు కేసులు, 2025లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ట్రాన్స్మిషన్ ఎసెస్మెంట్ సర్వే ద్వారా 3,150 మందికి పరీక్షలు చేయగా ఒక్క కేసూ రాలేదు. ఇలా వరుసగా ఆరేళ్ల పాటు ఒక్క కేసు నమోదు కాకపోతే జిల్లాను ఫైలేరియా రహితంగా ప్రకటిస్తారు. ఇది సాధించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. –వెంకట్లేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి -
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చెంగల నాగేశ్ తనకు దొరికిన సెల్ఫోన్, నగదును స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం అప్పగించాడు. నాగేశ్ కాకర్ల నుంచి గుండెపుడి మీదుగా తన ఆటో నడుపుకుంటూ జూలూరుపాడు వస్తుండగా మార్గ మధ్యలో వెంగన్నపాలెం శ్రీముత్యాలమ్మ గుడి సమీపంలో రోడ్డుపై సెల్ఫోన్ పడి ఉండటాన్ని గమనించాడు. ఆటో ఆపి సెల్ఫోన్ను పరిశీలించగా దాని పౌచ్లో రూ.1,500 నగదుఉన్నట్లు గుర్తించాడు. ఏమాత్రం ఆశపడకుడా జూలూరుపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి హెడ్కానిస్టేబుల్ రాజేశ్వరరావుకు సెల్ఫోన్, నగదును అప్పగించాడు. పోలీస్ సిబ్బంది విచారణ చేపట్టివెంగన్నపాలెంకు చెందిన దుద్దుకూరి నాగేశ్వరరావు ఫోన్గా గుర్తించి, ఆయనకు అందించారు. నిజాయితీని చాటిన ఆటోడ్రైవర్ను పోలీసులు అభినందించారు. -
శిశువులకు తల్లిపాలే పట్టించాలి
కొత్తగూడెంఅర్బన్: పుట్టిన శిశువులకు తల్లిపాలనే పట్టించాలని, ముర్రుపాలు బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయని ఐసీడీఎస్ పీడీ స్వర్ణలత లెనినా, కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి తెలిపా రు. శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్లో తల్లిపాల వారోత్సవాలను వారు ప్రారంభించి మాట్లాడారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివని, పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు ఎంతో ప్రధానమని తెలిపారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా, రోగ నిరోధక శక్తిని పొందాలన్నా తల్లిపాలు పట్టించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం సీడీపీఓ పద్మశ్రీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన సేవలుదుమ్ముగూడెం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించా లని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శనివారం మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానలు తనిఖీ చేశారు. రికా ర్డుల నిర్వహణను తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసవ తేదీలో సమీపంలో ఉన్న గర్భిణులను డెలివరీ వెయిటింగ్ హాల్కు తరలించాలని సూచంచా రు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పంచా యతీ సిబ్బందితో సమన్వయం చేసుకొని పారి శుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ రుక్మాకర్రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 95 మంది బాలకార్మికులకు విముక్తి సూపర్బజార్(కొత్తగూడెం): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేష న్ ముస్కాన్లో జిల్లావ్యాప్తంగా 95 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని, అన్ని శాఖల సమన్వయంతో ఇది సాధ్యమైందని ఎస్పీ రోహిత్రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం జిల్లాలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేశామని పేర్కొన్నారు. 95 మందిలో 89 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని, 48 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశామని, 38 మందికి నోటీసులు ఇచ్చామని వివరించారు. బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. తగ్గిన పామాయిల్ గెలల టన్ను ధర అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర తాజాగా రూ.295 తగ్గింది. శనివారం హైదరాబాద్లోని ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్బాషా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పామాయిల్ గెలల టన్ను ధరను రూ.23,488గా ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో టన్ను ధర రూ.23,783 ఉండగా, తాజా ధరతో పోల్చితే టన్నుకు రూ.295 తగ్గినట్లయింది. ఆర్టీసీ బస్టాండ్లో తల్లిపాలు ఇచ్చే గది షురూసూపర్బజార్(కొత్తగూడెం): బిడ్డ పుట్టిన మొద టి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆ తర్వాత మరో ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిదని జిల్లా సంక్షేమ అధికారి జె.స్వర్ణలతలెనినా అన్నారు. కొత్తగూడెం బస్టాండ్లో తల్లి పాలిచ్చే గదిని శనివారం ప్రారంభించి బాలింతలకు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రసవించిన మొదటి గంటలోపే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించాలని, ఆరు నెలల నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్ర మే పట్టించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం అర్బన్ సీడీపీఓ, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత జిల్లా బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, బాలింతలు పాల్గొన్నారు. -
ఎస్డీఆర్ఎఫ్ పహారా
భద్రాచలంటౌన్: ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భద్రాచలంలో 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. కరకట్ట, స్నాన ఘాట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పహారా కాస్తున్నారు. జిల్లాలోని ఆరు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 25 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. రెస్క్యూ పరికరాలు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, బోట్లు అందుబాటులో ఉంచారు. మూడు రోజులుగా గోదావరిలో స్నానాలకు వచ్చే భక్తులను నదిలోకి దిగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, భద్రాచలం ఫైర్ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. -
ఐదుగురు గర్భిణుల ప్రసవం
భద్రాచలంఅర్బన్: ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా తరలించిన 25 మంది హైరిస్క్ గర్భిణుల్లో ఐదుగురు శనివారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సాధారణ ప్రస వం పొందారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రమీలరాణి, పూజ తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రికి తరలించి, సకాలంలో వైద్య సేవలు అందించడంతో వైద్యాధికారులను పలువురు అభినందించారు. శనివారం ఐటీడీఏ పీఓ రాహుల్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సైదులు ఆస్పత్రిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి
మణుగూరుటౌన్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైతు సున్నం శ్రీను (43) మద్యానికి బానిసై ఇంట్లో ఖాళీగా ఉంటూ కూలీ పనులకు వెళ్లకుండా నిత్యం భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో కుటంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత జూలై 30న పురుగులమందు తాగాడు. కుటుంబీకులు మణుగూరు ఆస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉండగా, తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి హాట్స్పాట్లలో తనిఖీలుపాల్వంచ: పట్టణంలోని గంజా యి హాట్స్పాట్లలో పోలీసులు తనిఖీ లు నిర్వహించారు. కాంట్రాక్టర్స్కాలనీ, పాతపాల్వంచ, సీతారాంపట్నం తదితర ప్రాంతాల్లో శనివారం తనిఖీలు చేపట్టారు. స్థానికులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ టి.నాగరాజు, ఎస్ఐవిజయ, ఏఎస్ ఐ హరిబాబు, హెడ్ కానిస్టేబుల్ రఘురాంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాలలో కలకలం.. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు సూపర్బజార్(కొత్తగూడెం): రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసి కొట్టాడనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్యా తమన్తేజ్ను తెలుగు ఉపాధ్యాయుడు రాజేందర్రెడ్డి చితకబాదినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాల యాజమాన్యం కూడా ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వివరణ కోసం టూటౌన్ పోలీసులను సంప్రదించగా స్పందించ లేదు. -
సింగరేణికే కేటాయించాలి
మణుగూరు డీప్సైడ్ బ్లాక్ గన్ఫౌండ్రీ(హైదరాబాద్): మణుగూరులోని పీకేఓసీ–2 డీప్సైడ్ బొగ్గు బ్లాక్ను జెన్కోకు కాకుండా సింగరేణికే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు వెలికితీతకు కనీస పరిజ్ఞానం, యంత్రాలు కూడా లేని జెన్కో ఈ వేలంలో పాల్గొనడం వల్ల మణుగూరు ఏరియాకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ఈ నెల 3న జరగనున్న బొగ్గు బ్లాక్ వేలం నుంచి జెన్కో తప్పుకుని, డీప్సైడ్ బ్లాక్ను నేరుగా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ చూపాలన్నారు. బొగ్గు వెలికితీతల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ప్రైవేట్ సంస్థలే ముందుకు రాకున్నా ఏ మాత్రం పరిజ్ఞానం లేని జెన్కో టెండర్లో పాల్గొనడం వెనుక ఇంధన శాఖలోని కొందరు అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. మణుగూరు డీప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కకపోతే ఈ ఏరియాకు అన్యాయం జరగనున్నందున ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, నాయకుడు వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ -
స్నేహం.. సేవ
గుండాల: కలిసి చదువుకున్న స్నేహితులు ఏడాదికోసారి సమావేశం కావడం సాధారణమే. కానీ, సమాజ సేవచేస్తూ.. సమస్యలపై పోరాడుతున్న ఈ బృందం ఆదర్శంగా నిలుస్తోంది. గుండాలకు చెందిన ఆజాద్, వినోద్, వినయ్, సంతోష్, ప్రణయ్, శశి, శివ, ప్రసాద్, ఉదయ్, సతీశ్ 2009 – 10లో పదో తరగతి పూర్తిచేశారు. వీరు 2020లో నవచైతన్య యువజన సంఘంగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయాన పలువురి దహన సంస్కారాలు నిర్వహించారు. అలాగే, కరోనా బాధితులకు అవగాహన కల్పించి, మాస్క్లు, కిట్లు, నిత్యావసర సరుకులు అందించారు. ఇక 2024లో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించి పలువురికి ఆపరేషన్ చేయించారు. నిరుపేదలు చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు స్థానిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి పాటుపడుతున్నారు. పలుమార్లు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన యువజన సంఘం వీడియో కాన్ఫరెన్స్లో బృందం సభ్యులు పాల్గొన్నారు. -
42 ఏళ్లుగా కలిసిమెలసి..
దుమ్ముగూడెం: ప్రైవేట్ బస్సు కండక్టర్లుగా మొదలైన వారి పరిచయం ప్రభుత్వ ఉద్యోగంలోనూ, తర్వా త వ్యాపార రంగంలోనూ కొనసాగుతోంది. మండలంలోని లక్ష్మీనగరానికి చెందిన వాకచర్ల గౌరీశంకర్, భద్రాచలానికి చెందిన సారథి రమేశ్ 1984లో ప్రైవేట్ బస్సులో కండక్టర్లుగా పనిచేస్తుండగా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. 1988లో ఆర్టీసీలో కండక్టర్లుగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. గౌరీశంకర్ 1999లో ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా రమేశ్ సైతం 2002లో ఉద్యోగాన్ని వీడి వ్యాపారంలో ప్రవేశించారు. 1984లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అంతే బలంగా కొనసాగుతోంది. -
అటు వెళ్లలేక.. ఇటు రాలేక
భద్రాచలం టౌన్: భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారిపై లారీలు, కార్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఏపీ నుంచి వస్తున్న వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాక నిలిచిపోయాయి. గోదావరి వరద నీరు భద్రాచలంలోకి రాకుండా ప్రధాన రహదారిపై అధికారులు అడ్డంగా మట్టికట్టను ఏర్పాటు చేశారు. వెనక్కి వెళ్దామంటే అప్పటికే వెనుక ఉన్న పురుషోత్తపట్నం వద్ద వరద నీరు రోడ్డును ముంచెత్తింది. అటు వెళ్లలేక ఇటు రాలేక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కలెక్టర్ చొరవతో మట్టికట్టను కొద్దిగా తొలగించి, లారీలు, కార్లను పొక్లెయినర్ సహాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. -
అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్రూం
సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. నిరంతరం సేవలు అందుతాయని, సోమవారం నుంచి మూడు షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వరిస్తారని పేర్కొన్నా రు. ఫిర్యాదులు, సమాచారం, వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను వెంటనే నమోదు చేసి సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతినడం, లోతట్టుప్రాంతా ల్లో నీరు నిల్వ ఉండటం, వాగులు, వంకలు పొంగి పొర్లడం వంటి పరిస్థితులు తలెత్తితే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు 08744–241950 నంబరులో సంప్రదించాలని కోరారు.పురాతన విగ్రహాలు లభ్యంఅశ్వారావుపేటరూరల్: మండలంలోని ఊట్లపల్లి సమీపంలో ఉన్న వెంకమ్మ చెరువు అలుగులో కాకతీయుల కాలం నాటి పురాతన విగ్రహాలు శనివా రం వెలుగు చూశాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువు అడుగంటింది. దీంతో అలుగు ప్రాంతంలో పురాతన కాలం నాటి రాతి నంది, వినాయక విగ్రహంతోపాటు శివలింగం బయటపడ్డాయి. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు. కాగా, గుప్త నిధుల తవ్వకాల్లో పురాతన కాలం నాటి విగ్రహాలు బయటపడి ఉంటాయా.? అక్రమార్కులు విగ్రహాలను తీసుకొచ్చి చెరువు నీళ్లలో వది లి వెళ్లారా..అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు.. రెండు వాహనాలు స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు కరకగూడెం: మండలంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను కరకగూడెం పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. విశ్వ సనీ య సమాచారంతో మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాలను తనిఖీ చేయగా అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 11 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని పాల్వంచ గోశాలకు తరలించామని ఎస్ఐ పీవీఎన్రావు తెలిపారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం వదినేపల్లి గ్రామానికి చెందిన బానోతు మొగిలి, బానోతు శ్రీకాంత్, అంగోతు విజేందర్, కాసుమంచి శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పేకాట స్థావరంపై దాడి జూలూరుపాడు(సుజాతనగర్):మండలంలోని సర్వా రం గ్రామ పంచాయతీ పరిధి గోపాతండా శివారు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట స్థావరంపై సీసీఎస్, సుజాతనగర్ పోలీసులు శనివారం దాడి చేశారు. సు జాతనగర్ ఎస్ఐరమాదేవి కథనం ప్రకారం.. సర్వా రం గ్రామపంచాయతీ గోపాతండా శివారు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,100 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. -
వైద్యుల పర్యవేక్షణ ఉందా?
భద్రాచలంఅర్బన్: ఆస్పత్రిలో వైద్యుల పర్యవేణ ఎలా ఉంది? పేషంట్ల వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారా? అంటూ భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆరాతీశారు. శనివారం ఆయ న ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణులను ఓ వార్డులో ఉంచాలని, జ్వర పీడితలను ఎన్ఆర్సీ వార్డు ఎదురుగా ఉన్న 10 బెడ్ల వార్డులో ఉంచి మెరుగైన వైద్యం అందించాలని, నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉండాలని, రోగులతో పాటు వచ్చిన అటెండర్లు, ఆశా కార్యకర్తలకు వసతి కల్పించడంతో పాటు ఆహారం అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్రెడ్డిని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బందిని విధుల్లో ఉంచాలని అడినల్ డీఎంహెచ్ఓ సైదులుకు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆరా తీసిన ఐటీడీఏ పీఓ రాహుల్ -
నెమ్మదించి..
56కు చేరుకుని..ఉదయం 11 గంటలకు 56.10 అడుగులుగా నమోదైన గోదావరి నీటిమట్టం రెండు గంటలు నిలకడగా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి రోడ్లపైకి వరద నీరు చేరి ఏజెన్సీ గ్రామాల్లో నిలిచిన రాకపోకలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు.. కరువైన మంత్రుల ప్రత్యక్ష పర్యవేక్షణగోదావరి వరద శనివారం ఉదయం 11 గంటలకు 56.10 అడుగులకు చేరుకుంది. అనంతరం 2 గంటలపాటు ప్రవాహం నిలకడగా కొనసాగి, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతోంది. సాయంత్రం 5 గంటలకు 55.50 అడుగులకు తగ్గింది. రాత్రి 11.16 గంటలకు 52.90 అడుగులకు తగ్గడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 12 గంటలకు...... అడుగులుగా నమోదైంది. స్నానఘట్టాలు, శివాలయం, ఆంజనేయస్వామి గుడి, కల్యాణ కట్టలు ఇంకా వరదలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ల వద్ద నీటిని తోడే యంత్రాలను అధికారులు పర్యవేక్షించారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిచటంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, గంగోలు ప్రధాన రోడ్డుపై, సున్నం బట్టి, బైరాగులపాడు గ్రామాల నడుమ, పర్ణశాల వద్ద రోడ్డుపైకి నీరు చేరటంతో శనివారం సైతం రాకపోకలు సాగలేదు. చర్ల మండలంలో కుదునూరు, దండుపేట గ్రామాల వద్ద రోడ్లపైకి వరద చేరటంతో చర్లకు రాకపోకలు ఆగిపోయాయి. కూనవరం వైపు నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట వైపు జాతీయ రహదారి ఎన్హెచ్ 30పైకి నీరు వస్తుండటంతో విజయవాడ–జగ్దల్పూర్ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతకు ముందు కొన్ని వాహనాలు వరదలో చిక్కుకుపోగా యంత్రాల ద్వారా బయటకు తరలించారు. కొత్తగా మూడు స్లూయిస్ నిర్మించగా, అందులో ఒకటి లీకవుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న జామాయిల్, పామాయిల్, ఇతర పంట పొలాలు నీట మునిగాయి. కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్రాజు భద్రాచలంలో ఉండి వరద ప్రాంతాలను పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు దుమ్ముగూడెం, బూర్గంపాడు మార్గాల్లో బారికేడింగ్ను పరిశీలించారు. శనివారం ఉదయం కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై వేసిన మట్టి అడ్డుకట్టను పరిశీలించారు. స్నానఘాట్లు, కరకట్ట, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన గోదావరి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు వేగంగా పెరిగిన వరద శనివారం ఉదయం నుంచి నెమ్మదించింది. మధ్యాహ్నం 56 అడుగులకు చేరుకున్న నదీ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శనివారం రాత్రి 11.16 గంటలకు 52.90 అడుగులకు తగ్గడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా, 14 గంటల వ్యవధిలోనే ఒకటి, రెండో, మూడో ప్రమాద హెచ్చరికలు జారీ కావడం ఇదే ప్రథమంగా ప్రజలు భావిస్తున్నారు. –భద్రాచలంసాధారణంగా ఉమ్మడి జిల్లా మంత్రులు గోదావరి వరదల సమయంలో అప్రమత్తంగా ఉంటారు. ఈసారి కూడా సీజన్ ఆరంభంలో తుమ్మల, పొంగులేటి భద్రాచలంలో పర్యటించి వరదల విషయంలో సూచనలు చేశారు. రెండు రోజులుగా హైదరాబాద్ నుంచే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సైతం వరద సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎంపీ బలరాంనాయక్ స్థానికంగా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
స్నేహంతో పాటు సమాజహితం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన పలు వృత్తుల్లో కొనసాగుతున్న స్నేహితులు 30 ఏళ్ల క్రితం శ్రీ స్తంభాద్రి సేవా సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా పరస్పర సహకారాలు అందించుకోవడమేకాక సమాజహితం కోసం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ, ఉన్నత చదువులకు వెళ్లే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే, బధిర విద్యార్థులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెం హైస్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పరీక్షల సామగ్రి, అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీటి ఫిల్టర్లు అందించారు. ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న హరిప్రసాద్ ఇద్దరు కూతుళ్ల చదువులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. గోశాలలకు దాణా, వరిగడ్డి కూడా అందిస్తున్నారు. ఈ బృందంలో తూములూరి లక్ష్మీనరసింహారావు, పల్లా లింగయ్య, సూరినేటి మల్లేశం, దేవరశెట్టి రామారావు, పెనుగొండ సాయికుమార్, మోతుకూరి భద్రయ్య, సుంకరి యల్లారావు, జి.సూర్యనారాయణ, జంగిలి రమణ, వంగవీటి నవీన్ తదితరులు ఉన్నారు. -
భక్తుల నిరాశ..
భద్రాచలంటౌన్: వారాంతం కావడంతో శనివారం పలు ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం తరలివచ్చారు. నదిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులు, పర్యాటకులను స్నాన ఘాట్ల వైపు వెళ్లకుండా పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నిలిపివేశారు. కనీసం కరకట్టపైకి అనుమతించకపోవడంతో ఉధృత గోదావరిని చూడలేకపోయామని పలువురు భక్తులు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరుగుముఖం పట్టారు. దెబ్బతింటున్న కరకట్ట భద్రాచలం: భద్రాచలంలోని వరదనీటితోపాటు మురుగు నీరును స్లూయిస్ల ద్వారా గోదావరిలోకి డంప్ చేస్తున్నారు. పైపులు కరకట్టపై వరకు మాత్రమే ఉంచారు. దీంతో నీటి ప్రవాహం ధాటికి కరకట్ట దెబ్బతింటోంది. పైపులు లీకవడంతో కట్టపై గుంతలు ఏర్పడుతున్నాయి. గతంలో సైతం ఇదే రీతిన చేయటంతో మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. -
●నిలిచిన రాకపోకలు
అశ్వాపురం: మండలంలో గోదావరి వరదతో శుక్రవారం గోదావరి పరీవాహక ప్రాంతాలైన రాంనగర్–బట్టీగుంపు, అమ్మగారిపల్లి–అమెర్ద, చింతిర్యాల–చింతిర్యాల కాలనీ, ఇరవెండి–నెల్లిపాక రహదారులపై వరదనీరు చేరి రాకపోకలు నిలిచాయి. తహసీల్దార్ సూర్యప్రకాష్, ఎంపీడీఓ ముత్యాలరావు, సీఐ ఎల్లయ్య గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు మిట్టగూడెం, సీతారాంపురం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలు, అశ్వాపురంలో ఎస్కేటీ, ఓం శక్తి పంక్షన్హాల్, బీసీ హాస్టల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
పాల్వంచరూరల్/భద్రాచలం టౌన్: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం అందించనుంది. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను, తద్వారా ఏర్పడే రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 443 రేషన్ దుకాణా ల పరిధిలో 3,26,606 రేషన్కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,05,511, అంత్యోదయ కార్డులు 2192, అన్నపూర్ణ కార్డులు 3 ఉన్నాయి. నెలకు 5,808 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనుండగా, మూడు నెలలకు కలిపి 17,425 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గోదాం నుంచి రేషన్ దుకా ణాలకు తరలించారు. కాగా, శనివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ చేయనున్నారు. వర్షాకాలంలో ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో రవా ణాకు అంతరాయం లేకుండా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి బియ్యం పంపణీ ప్రారంభమవుతుంది. వచ్చే నెల చివరి వారం వరకు బియ్యాన్ని తరలింపు కొనసాగే అవకాశం ఉంది. పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. –త్రినాథ్బాబు, ప్రేమ్కుమార్, పౌరసఫరాల శాఖ అధికారులునేటి నుంచి బియ్యం పంపిణీ చేయనున్న డీలర్లు -
●వరదలో చిక్కుకున్న 44 మంది డ్రైవర్లు, కూలీలు
చర్ల: వరద ఉధృతి పెరగడంతో మండలంలోని వీరాపురం ఇసుక ర్యాంపులో ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీల డ్రైవర్లు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది 44 మంది వరదనీటిలో చిక్కుకున్నారు. వీరాపురం సమీపంలో నది మధ్యలో ఇసుక డంపింగ్యార్డు ఉంది. గురువారం సాయంత్రం వచ్చిన లారీలన్నీ లోడింగ్ పాయింట్ వద్ద నిలిపి ఉంచారు. తెల్లవారుజామున మరో పక్కన ఉన్న పాయ నుంచి గోదావరి వరదనీరు వచ్చి చేరింది. దీంతో తెల్ల వారుజామున కొందరు లారీ డ్రైవర్లు ధైర్యం చేసి ఇసుక పాయలో నుంచి నడుచుకుంటూ బయటకు రాగా, మరి కొందరు అక్కడే ఉండిపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై, నర్సిరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తెప్పలపై వారి వద్దకు చేరుకుని, జేసీబీపై వారిని నది నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సీఐ వెళ్తున్న తెప్ప ఒక్కసారిగా తిరగబడడంతో ఆయన తెప్పను నీటిలోనే విడిచిపెట్టి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నీట మునిగిన రహదారులు మండలంలోని కుదునూరు దేవరాపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. ఆర్ కొత్తగూడెం నుంచి బోదనెల్లి, కొండెవాయి, పులిగుండాల మీదుగా సీతానగరం వైపు ట్రాఫిక్ మళ్లించారు. వీరాపురం, చింతకుంట, కొత్తపల్లి, దండుపేట, జీపీపల్లి తదితర గ్రామాలను వరదనీరు చుట్టుముట్టడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
●క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్ రాజు విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నాన ఘాట్లు, లోతట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. గోదావరి స్నాన ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలన్నారు. వరద తగ్గే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. డీడీఆర్ఎఫ్ బృందాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతీ పోలీసు వాహనంలో లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో పాటు విపత్తు నిర్వహణ పరికరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాల్లో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ సామగ్రి, యంత్రాలు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ శుక్రవారం రాత్రి దుమ్ముగూడెం మండలం తూరుబాక దగ్గర ప్రధాన రహదారి పైకి వరద చేరిన ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు ప్రాంతాల్లో.. గోదావరి వరద ముంపు ప్రాంతాలను శుక్రవారం రాత్రి కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. సారపాక–రెడ్డిపాలెం మధ్య రాష్ట్రీయ రహదారిపైకి నీరు చేరుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్డుపైకి నీరు చేరితే రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు సూ చించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తహసీలార్లు అశోక్కుమార్, కేఆర్కేవీ ప్రసా ద్, ఎంపీడీఓలు వివేక్రామ్,జమలారెడ్డి, భద్రాచలం డీఎస్పీ అరుణ్కుమార్, సీఐలు వెంకటప్పయ్య, నాగరాజు, శ్రీనివాస్, ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షం తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్ పాల్గొన్నారు. 17 లోగా ‘ఓపెన్’ పరీక్షల ఫీజు చెల్లించాలికొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ శుక్రవారం విడుదలైందని డీఈఓ, డి.వాసంతి, ఏసీజీఈ ఎస్.మాధవరావు, ఉమ్మ డి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అభ్యర్థులు సబ్జెక్ట్కు రూ.100, ఇంటర్ అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపుకరకగూడెం: జవహర్ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రత్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31తో గడువు ముగియగా, ఉన్నతాధికారులు పొడిగించారని పేర్కొన్నారు. ఓడి చెరువులో 20 కేజీల చేపఅశ్వారావుపేటరూరల్: మండలంలోని తిరుమలకుంట గ్రామ శివారు ఓడి చెరువులో శుక్రవారం మత్స్యకారులు చేపల వేట సాగించారు. దీంతో 20 కేజీల బరువు ఉన్న అరుదైన చేప వలకు చిక్కింది. కొనుగోలుకు పలువురు పోటీపడగా, చివరకు రూ.2500కు అమ్ముడైంది. యూడైస్ను పరిశీలించాలిజిల్లా విద్యాధికారి వాసంతి కొత్తగూడెంఅర్బన్: కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యూడైస్ వివరాలను పరిశీలించాలని జిల్లా విద్యాధికారి డి.వాసంతి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ఆనందఖని ఉన్నత పాఠశాలలోని జిల్లా ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆమె పీజీఐ ర్యాంకింగ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. గత సంవత్సరంలో జిల్లా ర్యాంకింగ్ చాలా తక్కువగా ఉందని, మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిని నమోదు చేయాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు మాధవరావు, సతీష్ కుమార్, జానకి, జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్కుమార్ పాల్గొన్నారు. బియ్యం నిల్వల పరిశీలనపాల్వంచరరూల్: గిరిజన సహకార సంస్థ బ్రాంచి కార్యాలయ సముదాయంలోని గోదా ముల్లో బియ్యం నిల్వలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలతోపాటు దొడ్డు బియ్యం నిల్వలను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. గోదాం ఇన్చార్జి రాము ఉన్నారు. -
●సీతమ్మ నారచీరల ప్రాంతంలోకి వరద
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల, కాశీనగరం, దుమ్ముగూడెం, సున్నంబట్టి గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య, తూరుబాక ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పర్ణశాల ప్రధాన రహదారిపైకి వరద చేరడంతోపాటు సీతమ్మ విగ్రహం పూర్తిగా నీట మునిగింది. నారచీరల ప్రాంతంలోని దుకాణాదారులు తమ సామగ్రిని బయటకు తరలించారు. మంగ్వాయిబాడ్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎంపీడీఓ వివేక్రామ్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీఓ వీరారెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
●నీట మునిగిన పంటలు
బూర్గంపాడు: అసలే వర్షాభావ పరిస్థితుల్లో ఆలస్యంగా పంటలు సాగు చేసుకున్నారు. ఇప్పుడు అవి కూడా వరదపాలయ్యాయి. గోదావరి వరద ఉధృతితో పరీవాహక ప్రాంతాల్లోని బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో పంటచేలు నీటమునిగాయి. బుధవారం 18 అడుగులు ఉన్న గోదావరి వరద శుక్రవారం రాత్రి 50 అడుగులకు చేరింది. కేవలం 36గంటల వ్యవధిలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పత్తి చేలు, వరి మాగాణులు, జామాయిల్ తోటల్లోకి వరదనీరు చేరింది. విద్యుత్ మోటార్లు, డీజిల్ ఇంజన్లు, వ్యవసాయ పనిముట్లు నీటమునిగాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో సుమారు 1800 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. వాగులు, వంకల్లోకి నీరు పొలాలకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. వరద పెరుగుతుండటంతో మేతకు వెళ్లిన పశువులు, జీవాలను కాపరులు శుక్రవారం మధ్యాహ్ననికే ఇంటిదారి పట్టించారు. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు పడవలు, వలలతో ఒడ్డుకు చేరుకున్నారు. బూర్గంపాడు–సారపాక రహదారిపైకి వరద నీరు బూర్గంపాడు–సారపాక రహదారిపైకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతానికి రాకపోకలు కొనసాగుతున్న మరో రెండు అడుగుల మేర వరద పెరిగితే రాకపోకలు నిలిచిపోనున్నాయి. వరద మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు సమీపిస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోడ్లపైకి నీరు చేరే ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
పెద్దమ్మతల్లి హుండీ ఆదాయం రూ.38.98 లక్షలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. 2026 మార్చి 21వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు నాలుగు నెలల పది రోజులకు హుండీ కానుకలను లెక్కించగా రూ.38,98,378 ఆదాయం లభించింది. అమెరికా డాలర్ నోట్లు 3, యూఏఈ 10 ధీరమ్స్, మిశ్రమ వెండి, బంగారం లభించగా వాటిని సీజ్చేసి తిరిగి హుండీలో వేశారు. దేవాదాయశాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకుడు కె.ఆనంద్, ఈఓ విజయ్కుమార్ పర్యవేక్షించారు. సువర్ణ పుష్పార్చనశ్రీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. -
తూర్పు వైపు నుంచే రామయ్య దర్శనం
● ఏకకాలంలో ఉత్తర, దక్షిణ, పడమర దిక్కుల్లో అభివృద్ధి పనులు ● విస్తా కాంప్లెక్స్ తొలగింపునకు ప్రణాళికలు భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారిని ఇకనుంచి తూర్పు వైపు నుంచే దర్శనం చేసుకోవాలి. ఇప్పటికే దక్షిణం, ఉత్తరం వైపు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దారులను మూసివేశారు. ఉత్తరం ద్వార దర్శన వేదిక, మెట్లను ఇప్పటికే పడగొట్టగా, ప్రాకారం సైతం కూల్చివేయనున్నారు. పడమర వైపు మెట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పడమర వైపు భక్తులు భద్రపర్చుకునే సెల్ఫోన్, చెప్పులు స్టాండ్లను తూర్పు వైపునకు మార్చనున్నారు. ఇందుకోసం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఉత్తరం, దక్షిణం, పడమర మూడు దిక్కుల్లో ఏకకాలంలో పనులు జరగనున్నాయి. చిత్రకూట మండపం తొలగింపు ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. మిథిలా స్టేడియంలో నిర్మిస్తున్న తాత్కాలిక నిత్యకల్యాణ వేదిక పనులు పూర్తి కావొస్తున్నాయి. విస్తా కాంప్లెక్స్ తొలగింపు పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విస్తా కాంప్లెక్స్ తొలగిస్తే తమ జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడతాయని గదులను వేలం పాట పాడుకున్న దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి తాత్కాలికంగా పరిసర ప్రాంతాల్లోనే దుకాణాలకు వెసులుబాటు కల్పించాలనే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్తో కలిసి గుంపెన, నర్సాపురం, బీమునిగూడెం, కొండాయిగూడెం, పెద్దిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించారు. రూ 2.77 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కల నిజం చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్రాజు, డీపీఓ అనూష, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ రాజేశ్వరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పర్సా వెంకటేశ్వరరావు, రమణ, శివ, నరేష్, లక్ష్మారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పెనగడప పీహెచ్సీలో తనిఖీచుంచుపల్లి: పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై ఆరోగ్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అధికారులు స్వర్ణలత, రమాదేవి, తోటమళ్ల ప్రతాప్, హరీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాల ఎత్తిపోత నిలిపివేతఅశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతను గురువారం రాత్రి నిలిపివేశారు. ఈ నెల 8న పంప్హౌస్ ఒక మోటారు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. 23 రోజులు పంప్హౌస్ ద్వారా సుమారు 3 టీఎంసీల నీరు విడుదల చేశారు. గోదావరికి గురువారం సాయంత్రం నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఎత్తిపోతలను నిలిపివేశారు. అంకితభావంతో పనిచేయాలిచుంచుపల్లి: అటవీశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. రామవరం రేంజ్ పరిధిలోని సత్యంపేట బీట్లో ఏర్పాటు చేసిన 15 హెక్టార్ల రైజింగ్ ప్లాంటేషన్ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాంటేషన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. రామవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. 17లోగా పరీక్ష ఫీజు చెల్లించండి ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1నుంచి 17వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ సదానందం, ఓపెన్స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు సూచించారు. పదో తరగతి అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టులకు రూ.100చొప్పున ఇంటర్ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో ఆగస్టు 18నుంచి 24వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఆగస్టు 25నుంచి 29వ తేదీ వరకు, తత్కాల్ స్కీమ్ ద్వారా సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా పదో తరగతి అభ్యర్థులు రూ.500, ఇంటర్ అభ్యర్థులైతే రూ.వేయి ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సెంటర్లో సంప్రదించి www. telanganaopenschool.org వెబ్సైట్లో లేదా టీఎస్ ఆన్లైన్ / మీ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. -
సీతమ్మకు సుగమం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణ పనులకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇప్పటికే టెక్నికల్ అప్రైజల్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బరాజ్ నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించాల్సి ఉంది. అనుమతులు లేకుండా పనులు ప్రారంభం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు గోదావరి జలాలు అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి పర్యావరణ, ఇతర అనుమతులు రాకుండానే 2018లో నిర్మాణ పనులు మొదలుపెట్టింది. బరాజ్ను మినహాయించి మిగిలిన పంపుహౌస్లు, ప్రధాన కాలువ, టన్నెల్స్ తదితర పనులు 2022 నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో దుమ్ముగూడెం– అశ్వాపురం మధ్య పాత కాటన్ ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఎన్జీటీలో కేసు నమోదుతో ఆగిన పనులు బరాజ్ ప్రతిపాదిత స్థలంలో నది వెడల్పు 1.50 కి.మీ. ఉండగా, ఇందులో కుడి వైపున 200 మీటర్ల మేరకు జల విద్యుత్ కేంద్రం కోసం కేటాయించారు. మిగిలిన 1.30 కి.మీ నదిని ఆరు బ్లాకులుగా విభజించారు. 2022లో నిర్మాణం ప్రారంభించారు. 2023 మే చివరి నాటికి ఒకటి నుంచి నాలుగు వరకు బ్లాకుల్లో పిల్లర్లు, స్పిల్వేల నిర్మాణం జరిగింది. ఐదు, ఆరు బ్లాకుల్లో క్రస్ట్ గేట్లు బిగించే స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి. ఈ సమయంలో పర్యావరణ అనుమతులు రాకుండా బరాజ్ పనులు సాగుతున్నాయంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ, చైన్నె)లో కేసు నమోదైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రూ.53 కోట్ల జరిమానా కూడా విధించింది. నిర్మాణ అంచనా వ్యయం పెరిగే అవకాశం సీతమ్మ సాగర్కు సంబంధించి బరాజ్, గైడ్వాల్స్, హెడ్ రెగ్యులేటరీ తదితర నిర్మాణాలను రూ.3,481 కోట్ల అంచనాలతో ప్రారంభించారు. మధ్యలో మూడేళ్లపాటు పనులు నిలిచిపోయాయి. దీంతో పనుల అంచనా వ్యయంలో భారీగా మార్పులు వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు కూడా జరగలేదు. మరోవైపు మూడేళ్లుగా ఎక్కడిపనులు అక్కడే ఆగిపోవడం వల్ల నిర్మాణ స్థలంలో నిలిపి ఉంచిన యంత్రాలు, నిర్మాణ సామగ్రి, వర్కింగ్ స్టాఫ్ క్వార్టర్స్ తదితర విషయాల్లోనూ కాంట్రాక్ట్ సంస్థ నష్టపోయినట్టు సమాచారం. వెరసి బరాజ్ నిర్మాణ పనులు మళ్లీ పట్టాలెక్కాలంటే ఆర్థికపరమైన అంశాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే సీతారామపై పెట్టిన వ్యయానికి వస్తున్న ప్రతిఫలంపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి భారీగా పెరగనున్న నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపైనే సీతమ్మ సాగర్ నిర్మాణ పనుల భవితవ్యం ఆధారపడి ఉంది.పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టిన ప్రాజెక్టులపై ఉన్న నిషేధం నుంచి సీతమ్మ సాగర్ బరాజ్కు సుప్రీం కోర్టు బుధవారం మినహాయింపు ఇవ్వడం సానుకూల అంశం. దీంతో నిర్మాణ పనుల ఆరంభం నుంచి ఎదురైన అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.53 కోట్ల జరిమానా అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఎన్జీటీ నుంచి అనుమతి వస్తే సీతమ్మ సాగర్కు అడ్డుగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. వానలు, గోదావరిలో వరద తగ్గిన తర్వాత బరాజ్ నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే మరో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. సీతమ్మ సాగర్ బరాజ్కు సుప్రీం కోర్టులో గ్రీన్ సిగ్నల్ -
అప్రమత్తంగా ఉండాలి
● మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ● కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా అధికారులతో గురువారం రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరి స్నాన ఘాట్లు, పర్యాటక ప్రాంతాలు, నది తీర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు నదిలోకి వెళ్లకుండా చూడాలన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 28.40 అడుగులుగా నమోదైందని, నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా ఆ సమయంలో సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
గోదావరి దోబూచులాట
● నదీ ప్రవాహంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు ● రాత్రి 11 గంటలకు నీటిమట్టం 29 అడుగులుగా నమోదు భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం గంటగంటకూ మారుతూ దోబూచులాడుతోంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు 29 అడుగులకు చేరుకుని కొంతసమయం నిలకడగా ఉంది. అనంతరం తగ్గుముఖం పట్టి 27 అడుగులకు చేరింది. సాయంత్రం నుంచి మళ్లీ ప్రవాహం పెరుగుతోంది. రాత్రి 8 గంటలకు 28.70 అడుగులు, 11 గంటలకు 29 అడుగులుగా నీటిమట్టం నమోదైంది. బుధవారం రాత్రి కేవలం 17 అడుగులుగా ఉన్న నీటిమట్టం, గురువారం మధ్యాహ్ననికి 29 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం ఉందని, శుక్రవారం ఉదయం వరకు 40 అడుగులకు పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు గోదావరిలో ఆచరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా స్నానాల ఘాట్ల వద్ద తాళ్లు కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. నదీ తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ● తాలిపేరుకు తగ్గిన వరద ఉధృతిచర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్కు వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 99,915 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అదే స్థాయిలో దిగువన గోదావరి నదిలోకి వరదనీటిని విడుదల చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం ఆధారంగా ఉదయం 9 గంటలకు 71,455 క్యూసెక్కులను విడుదల చేసిన అధికారులు రాత్రి 8 గంటలకు 15 గేట్లను రెండేసి అడుగుల మేర ఎత్తి ఉంచి 17,664 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లుకాగా, నీటిమట్టాన్ని 72.26 మీటర్లుగా కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు వద్ద 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ● పెరుగుతున్న కిన్నెరసాని నీటిమట్టంపాల్వంచరూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, గురువారం నీటిమట్టం 398.80 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్ నీటిమట్టం 404.30 అడుగులు ఉన్నట్లు డ్యామ్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. -
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓబీ వెలికితీత కూడా నిలిచిపోయింది. బుధవారం 24 వేల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా, 12 వేల టన్నులే తీశారు. గురువారం కూడా వర్షం కొనసాగడంతో మొదటి, రెండు షిఫ్టుల్లో ఓబీ వెలికితీతకు, బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. కాగా క్వారీల్లో నిలిచిన వరద నీటిని మళ్లించేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. 2న చెస్ ఎంపిక పోటీలుసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం మేదరబస్తీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐటీఐలో అండర్– 13, అండర్–10 చెస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ గోపికృష్ణ, ప్రెసిడెంట్ చల్లా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. సఖి సెంటర్కు ఛత్తీస్గఢ్ మహిళ ఇల్లెందురూరల్: మండలంలోని రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ గోపాలపురం గ్రామానికి రెండు రోజుల క్రితం ఓ మహిళ రాగా మతిస్థిమితం కోల్పోయి దారితప్పి వచ్చిందని గ్రామస్తులు అనుమానించారు. ఇదే సమయాన గ్రామంలోని అంగన్వాడీ టీచర్ ఆమెను చేరదీసి ఆశ్రయం కల్పించి సర్పంచ్ ఈసాల సురేష్, ఐసీడీఎస్ అధికారులకు సదరు మహిళ సమాచారాన్ని అందించింది. ఈమేరకు వారు పోలీసు శాఖ సహకారంతో గురువారం కొత్తగూడెం పట్టణంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఆమె మాటలను బట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినదిగా సఖి అధికారులు నిర్థారించగా.. స్వరాష్ట్రానికి క్షేమంగా చేర్చాలని సర్పంచ్ అధికారులను కోరారు. ఎన్ఎండీసీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలి పాల్వంచ: పాల్వంచలో ఉత్పత్తి నిలిచిపోయిన ఎన్ఎండీసీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ.జలీల్, పాల్వంచ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు, కార్పొరేటర్ బాలు నాయక్లు కోరారు. ఈమేరకు వారు ఢిల్లీలో వారం రోజులుగా మకాం వేసి తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, డీ.కే.శివకుమార్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఏఐసీసీ కేరళ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ మెంబర్ గురుదీప్ సప్పల్తో పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించారు. అదేవిధంగా కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి పీయుష్ గోయల్ను కలవనున్నారు. ఎన్ఎండీసీ కర్మాగారం తిరిగి ప్రారంభమైతే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయని, పాల్వంచ పారిశ్రామికంగా పూర్వవైభవం పొందే అవకాశం ఉందని వివరించారు. గోండి–కోయ భాష వర్క్షాప్ నిర్వహించాలిభద్రాచలంటౌన్: భద్రాచలంలో 12వ జాతీయ గోండి–కోయ భాష ప్రామాణికరణ వర్క్షాప్ను నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ గిరిజన ప్రతినిధుల బృందం గురువారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ను మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన 11వ జాతీయ వర్క్షాప్లో పాల్గొన్న భద్రాచలం ప్రతినిధులు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీఓను కలిశారు. ఈ సందర్భంగా గోండి–కోయ భాషకు అధికారిక గుర్తింపు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సిఫార్సు చేయాలని వారు కోరారు. దీనిపై పీఓ సానుకూలంగా స్పందిస్తూ కోయ భాష అభివృద్ధికి, పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఛత్తీస్గఢ్ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతినిధులకు ఆయన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మడివి నెహ్రూ, పీసోడి కన్నయ్య, పాయం వెంకటరత్నం, ఇర్ప రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాహనాల వేలం @ రూ.8.45 లక్షలు భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 8.45 లక్షల ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్ సీఐ రహిమున్నీ బేగం తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో వేలం వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎ. శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న మొత్తం 54 వాహనాలకు బహిరంగ వేలం వేయగా.. అందులో 53 వాహనాలు విక్రయమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని ద్వారా రూ. 8.45 లక్షల రాబడి వచ్చిందని వివరించారు. -
ఘాటెక్కుతున్న మిర్చి!
● రూ.23వేలు దాటిన ‘తేజా’ మిర్చి ధర ● తగ్గుతున్న నిల్వలతో పెరుగుతున్న డిమాండ్ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర ఘాటెక్కుతుంది. మూడు రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.350 పెరిగింది. గత వారం వరకు రూ.22 వేలు ఉన్న ‘తేజా’ మిర్చి ధర ప్రస్తుతం రూ.23 వేల మార్కును దాటింది. ఖమ్మం మార్కెట్లో సోమవారం రూ.22,700 పలికిన ధర మంగళవారం రూ.22,750, బుధవారం రూ.22,800కు చేరగా గురువారం ఏకంగా రూ. 23,050గా నమోదైంది. మిర్చి సీజన్ అయిన మార్చి, ఏప్రిల్ నెలల్లో సగటున రూ.18వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.5 వేలు పెరిగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.23,050, మోడల్ ధర రూ.22 వేలుగా, నాన్ ఏసీ మిర్చి గరిష్టంగా రూ.17,400, మోడల్ ధర రూ.16,500గా నమోదైంది. అలాగే, తాలు మిర్చి ధర రూ. 10 వేలుగా పలుకుతోంది. దేశ, విదేశాలకు ఆర్డర్లు తేజా రకం మిర్చికి దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. గత ఏడాది పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు లేకపోవడంతో ఆశించిన విధంగా మిర్చి నిల్వలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకుని మిరప సాగుపై రైతుల్లో ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా మిరప దిగుబడులు తగ్గే అవకాశముంది. ఇలా రకరకాల కారణాలతో మిర్చి నిల్వ లకు డిమాండ్ పెరుగుతుంది. దేశీయంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, థాయ్లాండ్ నుంచి మిర్చి ఆర్డర్లు వస్తుండడంతో వ్యాపారులు ధర పెంచుతున్నారని తెలుస్తోంది. కరిగిపోతున్న నిల్వలు మిర్చి నిల్వలు తగ్గుతున్న సమయాన డిమాండ్ పెరుగుతుంది. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 48 లక్షల బస్తాల మిర్చిని రైతులు, వ్యాపారులు సీజన్లో నిల్వ చేసినట్లు అంచనా. ప్రస్తుతం పంట పెట్టుబడుల కోసం రెండు నెలలుగా ఈ మిర్చిని విక్రయిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో కూడా నిల్వలు సగానికి చేరినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
3 పోస్టులు.. 304 మంది
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో మూడు ఫార్మసిస్టు పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా, గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే, మూడు పోస్టులకు గాను 304 మంది నిరుద్యోగులు హాజరుకావడం గమనార్హం. సూపరింటెండెంట్ చాంబర్ వద్ద వీరు బారులు దీరడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. ఆస్పత్రిలో కొంత కాలంగా ఫార్మసిస్ట్ల కొరత వేధిస్తుండగా.. ఆరుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఇటీవల ‘సాక్షిలో’ ‘గంటల కొద్దీ క్యూలైన్లోనే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, స్పందించిన అదనపు కలెక్టర్ శ్రీజ సూచనలతో ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ఉద్యోగం తాత్కాలికంగా నాలుగు నెలల పాటే ఉంటుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 2వేలకు పైగా ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా ఎప్పుడైనా ఫలితాలు వచ్చే అవకాశముంది. అందులో కొందరిని ఖమ్మం జీజీహెచ్కు కేటాయిస్తే ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునే వారే తప్పించనున్నారు. అయినా మూడు పోస్టులకు 304మంది హాజరు కావడంతో ఆస్పత్రి ఆవరణ కిటకిటలాడింది.ఖమ్మం జీజీహెచ్లో ఔట్ సోర్సింగ్ ఫార్మసిస్టు ఉద్యోగాలకు బారులు -
జామాయిల్కే మొగ్గు..
జిల్లాలో ఈ ఏడాది జామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. ఎల్నినో ప్రభావంతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యానవన పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. ఆ దిశగా రైతులు అసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా జామాయిల్ సాగుకే మొగ్గుచూపుతున్నారు. – బూర్గంపాడు ముందుగానే సిద్ధం. గత రెండేళ్లుగా పత్తి, వరి సాగులో వచ్చిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని రైతులు చాలామంది ముందుగానే జామాయిల్ సాగుకు పూనుకున్నారు. దీనికి తోడు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా జామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగేందుకు కారణమైంది. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 20వేల ఎకరాల వరకు జామాయిల్ సాగు కాగా ఇంకా 5వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశాలున్నాయి. గతంలో జిల్లాలో సుమారు 80వేల ఎకరాలకుపైగా సాగు కాగా రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రతికూల పరిస్థితులు.. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటల సాగుకు ఏటికేడు పెట్టుబడులు పెరుగుతుండడంతో పాటు కూలీల కొరత, ఎరువుల ధరలు, గత సీజన్ నుంచి వచ్చిన ఆన్లైన్లో యూరియా బుకింగ్, ధాన్యం అమ్మకాలు తదితరాల కోసం రైతులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులతో కొందరు రైతులు జామాయిల్ సాగు వైపు మళ్లారు. ఒకసారి మొక్కలు నాటి పైపాట్లు చేసుకుని.. ఏడాదికి ఒకట్రెండు సార్లు ఎరువులు వేసుకుంటే సరిపోతుంది కదా.. నీటి తడులు పెద్దగా అవసరం లేకపోగా మూడు, మూడున్నరేళ్లకు ఫలసాయమందుతుందని వీటి సాగుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక ఒకసారి ఎదిగిన పంటను నరికి విక్రయిస్తే మళ్లీ చిగురిస్తూ 12 ఏళ్ల వరకు ఫలసాయం పొందొచ్చు కదా, కూలీలు పెద్దగా అవసరముండదు అని చెబుతున్నారు. అయితే కర్ర నరికేటప్పుడు, కర్రను కొనుగోలు చేసిన వారే కూలీలకు నగదు చెల్లించుకుంటుండడంతో తక్కువ పెట్టుబడితో ఫలసాయమందే జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. పేపర్కు ముడిసరుకుగా.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పేపర్ పరిశ్రమ ఐటీసీ పీఎస్పీడీ సారపాకలో ఉంది. ఈ పరిశ్రమ నిర్వహణకు జామాయిల్ కర్రే అతి ముఖ్యమైన ముడిసరుకు కావడంతో ఐటీసీ పీఎస్పీడీకి వచ్చే కలపలో 95శాతం సరఫరా ఇక్కడే ఉంటుంది. ఈ పరిశ్రమతో జిల్లా రైతులకు మార్కెటింగ్ వసతులు మెరుగ్గా ఉండగా.. రైతులు నేరుగా తీసుకు రావడం లేదా ఐటీసీ పీఎస్పీడీ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు నేరుగా జామాయిల్ తోటలకు వచ్చి రైతులతో మాట్లాడి కర్రను ఐటీసీకి తరలిస్తారు. మార్కెటింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో కర్ర అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతున్నాయి. ఈ పరిస్థితులు రైతులను జామాయిల్ సాగువైపు నడిపిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం కూడా జిల్లాలో రైతులు విపరీతంగా జామాయిల్ సాగు చేశారు. అయితే ఐటీసీ పీఎస్పీడీ కర్ర ధరను తగ్గిస్తు వస్తుండటంతో రైతులు కూడా తోటలను తొలగిస్తూ వచ్చారు. గత ఐదారేళ్లుగా మళ్లీ జామాయిల్ కర్రకు ధరలు పెరగటం, ఐటీసీ పీఎస్పీడీతో పాటుగా ఫ్లైవుడ్ తయారీ కంపెనీలు కూడా కొనుగోలు చేస్తుండటంతో రైతులు మళ్లీ జామాయిల్ సాగు చేపడుతున్నారు.వ్యవసాయశాఖ అధికారులు పామాయిల్ సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నా.. వారు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సాగుకు ఆసక్తి చూపడం లేదు. పామాయిల్ గెలల ధరలు టన్నుకు రూ.23 వేల వరకు ఉన్నప్పటికీ తోటల నుంచి గెలల తరలింపు, మార్కెటింగ్ వసతులు సరిగా లేవని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే పామాయిల్ క్రషింగ్ మిల్లులు, మొక్కల నర్సరీలున్నాయి. పలువురు రైతులు పామాయిల్ సాగు చేయాలని ఆలోచన ఉన్నా.. మార్కెటింగ్, రవాణాకు సరైన వసతులు లేని కారణంగా వెనకడుగువేస్తున్నారు. జిల్లాలో పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలలో పామాయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి.ప్రత్యామ్నాయ పంటగా జామాయిల్ -
హెచ్ఆర్ఎస్ను సందర్శించిన ఏపీ రైతులు
అశ్వారావుపేటరూరల్: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి, బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతాలకు చెందిన రైతుల బృందం గురువారం అశ్వారావుపేటలోని హెచ్ఆర్ఎస్(ఉద్యాన పరిశోధనా స్థానం)ను సందర్శించారు. ఆయా జిల్లాలకు చెందిన రైతాంగం కొత్తగా ఆయిల్పాం పంటను సాగు చేసే నేపథ్యాన పంట సాగు విధానాలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై స్వయంగా తెలుసుకునేందుకు రాగా స్థానిక హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ వారికి అవగాహన కల్పించారు. అదే విధంగా పంట సాగు నుంచి దిగుబడి వరకు పాటించాల్సిన జాగ్రత్తలు, నాణ్యమైన మొక్కల ఎంపిక, ఎరువుల వినియోగంపై వివరించారు. కొత్తగా సాగు చేసే రైతులు తప్పనిసరిగా నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ సదుపాయాలపై సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. పంట సాగు చేసిన తొలి నాలుగేళ్లలో సాగు చేయాల్సిన అంతర పంటల వివరాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఉద్యాన అధికారిణి కె.దీపిక, కొల్లూరు ఉద్యాన అధికారి కల్యాణ్ చక్రవర్తి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అధ్యాపకుడిపై సమగ్ర విచారణ జరిపించాలి
రుద్రంపూర్: చుంచుపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యాన సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ లెక్చరర్ విద్యార్థుల నుంచి రూ. మూడు వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేశాడని, బుధవారం నిర్వహించాల్సిన ల్యాబ్ పరీక్షను కూడా నిలివేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై ఎవరికై నా ఫిర్యాదు చేస్తే వారి ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా అధికారులు విచారణ జరిపి, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నాణ్యతతో న్యూట్రిమిక్స్ తయారీ
భద్రాచలం: తృణధాన్యాల న్యూట్రి మిక్స్ ఆహార పదార్థాలను తగు నాణ్యతతో తయారు చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. గురువారం ఆయన భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శ్రీ దమ్మక్క జాయింట్ లియాబిలిటీ న్యూట్రిమిక్స్ యూనిట్ను ఉద్యానవన అధికారి ఉదయ్కుమార్, పీవీటీజీ అధికారి గన్యా నాయక్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు తృణధాన్యాల నాణ్యతను పరిశీలించాక వాటితో తయారు చేస్తున్న న్యూట్రిమిక్స్ ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఈమేరకు వారు నాణ్యతతో ఆహారపదార్థాలను తయారు చేయాలని, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మిల్లెట్ న్యూట్రిమోక్స్ సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసి నేరుగా భద్రగిరి మార్ట్కు ఎక్కువ శాతం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధితో రాణించటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ -
సీతారామతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
అశ్వాపురం: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పావనిగౌడ్ అన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్ను గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. స్థానిక రైతులకు కూడా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, నాయకులు కోడి అమరేందర్, మర్రి మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, గద్దల రామకృష్ణ, సర్పంచులు మర్రి సంధ్య, కోర్స అలివేలు, మండ్రు రామకృష్ణ. కోండ్రు సోమయ్య, మాజీ సర్పంచ్ కోడి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతి పొందిన దేవాదాయ శాఖ ఈఓలకు పోస్టింగ్లు
ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో గ్రేడ్–3 ఈఓ(కార్యనిర్వహణాధికారులు)లుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి గురువారం ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు ఆధ్వర్యాన కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగ్నోతి పొందిన ఐదుగురికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వీరిలో డి.శ్రీనివాసరెడ్డికి నేలకొండపల్లి మండలకేంద్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, పి.బేబీసరోజనకు ఖమ్మం ఇందిరానగర్లోని బాలగణపతి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం, డి.శ్రీనివాసరావుకు ఖమ్మం టేకులపల్లిలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయం గ్రేడ్–3 పోస్టింగ్ ఇచ్చారు. అలాగే, చుండూరు రామకోటేశ్వరరావును భద్రాద్రి జిల్లా ఇల్లెందు జేకే కాలనీలోని హరిహరక్షేత్రం, డి.విజయలక్ష్మిని పాత పాల్వంచలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఈఓగా నియమించారు. తొలుత ఐదుగురు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మేకల వీరస్వామిని కలిసి జాయినింగ్ రిపోర్టులు ఇవ్వగా, కొత్త స్థానాల్లో రెండు, మూడు రోజుల్లో చేరే అవకాశం ఉంది. -
దేవాదాయ శాఖలో ఐదుగురికి ఉద్యోగోన్నతి
ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు గ్రేడ్–3 ఈఓలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు గ్రేడ్–3 ఈఓలుగా దేవాదాయశాఖ ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లగూడెం పులిగుండాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి మారెమ్మ తల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బేబీ సరోజన, ఖమ్మం కాల్వొడ్డు ఆలయంలో నియమితులైన జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియమితులై, ఖమ్మం శ్రీగుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో మేనేజర్గా పనిచేస్తున్న చండూరు రామకోటేశ్వరరావు, భద్రాచలం అభయాంజనేయ స్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయలక్ష్మికి గ్రేడ్–3 ఈఓలుగా పదోన్నతి కల్పించారు. వీరికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.కౌన్సెలింగ్ ద్వారా కొద్ది రోజుల్లో పోస్టింగ్ -
‘దమ్మక్క’కు నీరాజనం
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● పూలు, పండ్లు సమర్పించిన గిరిజనులు ● వైభవంగా శోభాయాత్ర, నిత్యకల్యాణోత్సవం భద్రాచలం: రామయ్య స్వామికి ఆవాసం కల్పించి, కంచర్ల గోపన్న ద్వారా ఆలయ నిర్మాణానికి ఆద్యురాలుగా నిలిచిన దమ్మక్కకు భక్తులు నీరాజనం పలికారు. బుధవారం భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవా యాత్ర నిర్వహించారు. భక్తుల శ్రీరామనామస్మరణ, గిరిజనుల నృత్యాలు, సంప్రదాయ ఆట పాటల నడుమ వేడుక కనుల పండువగా సాగింది. జోరున వర్షం కురుస్తున్నా గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో 2014 నుంచి ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల నుంచి తరలి వచ్చిన గిరిజనులు అధికారులతో కలిసి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ సీతారామ ఆఫీసర్స్ క్లబ్ వద్ద నున్న దమ్మక్క విగ్రహం వద్ద పూజలు జరిపారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దమ్మక్కకు పూలు, పండ్లను సమర్పించారు. అనంతరం రామదాసు కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వామి వారి ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవం జరిపారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు రకాల పండ్లు, పూలను సమర్పించారు. గిరిజన పెద్దలకు ఈఓ దామోదర్రావు వస్త్రాలను అందజేసి సత్కరించారు. ఏఈఓలు శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ, గిరిజన పెద్దలు ముర్ల రమేష్, రమణయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, అర్చకులు, పండితులు, సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు పాల్గొన్నారు. -
తాలిపేరుకు పోటెత్తిన వరద
24 గేట్లను ఎత్తి 84,078 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చర్ల: ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరులోకి 79,821 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్కు 25 గేట్లు ఉండగా, 13 గేట్లను 2 అడుగుల ఎత్తు మేర, మరో 11 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచి 84,078 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.60 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు. స్థూల నిల్వ సామర్థ్యం 730 మిలియన్ క్యూబిక్ అడుగులు కాగా, ప్రస్తుతం 486 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు వద్ద 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పరిస్థితిని ప్రాజెక్ట్ డీఈ తిరుపతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా చండీహోమం పూజలుపాల్వంచరూరల్: గురుపౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో చండీ హోమం పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ గావించారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్త దంపతులకు అర్చకులు రమేష్ అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. నేడు హుండీ కానుకల లెక్కింపు పెద్దమ్మతల్లి ఆలయ హుండీ కానుకలను గురువారం ఉదయం 9 గంటల నుంచి లెక్కించినున్నట్లు ఈఓ విజయ్కుమార్ తెలిపారు. నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భద్రాద్రి జిలాల చంద్రుగొండ మండలంలోని మంగయ్య బంజర్, పోకలగూడెం, రవికంపాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, కాజ్వే పనులను ప్రారంభిస్తారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం కొత్తూరు, నర్సాపురం, ఊటుపల్లి, రంగపురం, ఎరగ్రుంట గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు మంత్రి హాజరవుతారు. అలాగే, భీమునిగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు కల్లూరులో జరిగే కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్రమత్తంగా ఉండాలిభద్రాచలంటౌన్: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గిరిజనులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లొద్దని, రహదారులపై నీరు ప్రవహిస్తున్నప్పుడు కల్వర్టులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల భద్రతపై హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులు, వసతి కేంద్రాలకు తరలించాలని వైద్యాధికారులకు సూచించారు. ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలోని వైటీసీ శిక్షణా కేంద్రంలో గిరిజన యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 33 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులకు జావా, పైథాన్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ లోగా వైటీసీ కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఇతర 79931 02529 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఆగస్టు 10వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని కోరారు. -
కాల్వ కనిపించదేమో..!
అశ్వాపురం: మండలంలోని సీతారామ కాల్వ పూడుకుపోనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ రోడ్లపై లారీలు ఇష్టారాజ్యంగా వెళ్తుండటం.. ఆ రోడ్డు దెబ్బతింటుండటం.. మరమ్మతుల పేరుతో మిగులుతున్న మట్టి, రాళ్లను కాల్వ లోకి నెడుతుండటంతో కాల్వ కనమరుగుకానుందని వారు పేర్కొంటున్నారు. మండలంలో బట్టీలగుంపు, రాంనగర్ వద్ద అధికారికంగా గోదావరి ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇసుక లారీలు అమ్మగారిపల్లి నుంచి గొల్లగూడెం వరకు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పక్కన ఉన్న రహదారులపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల వర్షాలు పడుతుండటంతో సీతారామ కెనాల్ కట్ట బురదమయం కావడంతో పాటు ఇసుక లారీల బరువుకు పూర్తిగా ధ్వసంమవుతున్నాయి. అప్పుడప్పుడూ ఇసుక లారీ లు దిగబడుతున్నాయి. ముందుకు కదిలే పరిస్థితి ఉండటం లేదు. ఛిద్రమైన రహదారి భాగాలకు మరమ్మతులు చేసే క్రమంలో మిగులుతున్న బురద, మట్టి, రాళ్లను పక్కనే ఉన్న సీతారామ కాల్వలోకి అడ్డదిడ్డంగా నెడుతున్నారు. దీంతో కాల్వ క్రమంగా పూడుకుపోయే ప్రమాదం ఏర్పడుతోంది. మరోవైపు కాల్వపై పలుచోట్ల డీఎల్ఆర్బీలను కట్టారు. ఇవి కేవలం సాధారణ వాహనాలు, ప్రజలు ప్రధాన కాల్వను దాటేందుకు కట్టినవి. రహదారులు బురదమయం కావడంతో లారీలన్నీ వీటి పైనుంచి వెళ్తున్నాయి. రోజుకు వందలాది లారీలు వాటిపై వెళ్తుండటం, అంతేకాకుండా అవి అధిక బరువు ఉంటుండంతో డీఎల్ఆర్బీలకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెనాల్లోకి నెడుతున్న మట్టి.. సీతారామ ప్రాజెక్టు కాల్వ కరకట్టలు భారీ యంత్రాలు, వాహనాల తాకిడితో ధ్వంసమవుతున్నాయి. తాత్కాలిక అనుమతులతో మొదలుపెట్టిన ఇసుక లారీల రవాణా వల్ల కెనాల్కు ఇరుపక్కలా పకడ్బందీగా నిర్మించిన కరకట్టలు ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ నిర్మాణాల విధ్వంసానికి కారకులెవరు? అనుమతులు ఇచ్చిన అధికారులెవ్వరు? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ కాల్వ కరకట్టలు ధ్వంసమై భారీ లోడుతో వెళ్తున్న లారీల టైర్లు మునిగే దాకా దిగబడుతున్నాయని, ఆ ప్రాంతంలో జేసీబీలు, భారీ యంత్రాల సాయంతో కెనాల్లోకి మట్టి, రాళ్లు నెట్టి పూడ్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అధికారులు నిత్యం పర్యవేక్షించటానికి నిర్మించిన రోడ్లపై లారీలు వెళ్లడంతో గుంతలమయంగా మారాయి. తమ కార్యాలయాల నుంచి ప్రాజెక్టు జీరో పాయింట్ వద్దకు చేరుకోలేని విధంగా ప్రస్తుతం ఆ రోడ్లు ధ్వంసమయ్యాయి. మరమ్మతులు చేసేందుకు కనీసం టూ వీలర్ కూడా అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. కాగా, ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలు తరలిస్తున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర సమస్య ఏర్పడితే మరమ్మతులు ఎలా చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్లను, కరకట్టను ధ్వంసం చేసిన వారిపై, ప్రాజెక్టు కెనాల్ను పూడ్చే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇసుక లారీల వల్ల రహదారులు, వంతెన, సీతారామ కెనాల్ కట్ట ధ్వంసమవుతోందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులే ఇసుక లారీలను అడ్డుకున్నారు. కరకట్టలను ఒక్కోచోట మీటర్ లోతు తవ్వి పైనఉన్న సిల్ట్ మొత్తాన్ని సీతారామ కెనాల్ వారిదే అన్నట్లు ప్రాజెక్టు కెనాల్లోకి నెడుతున్నారని ఇసుక రవాణాకు రాజమార్గాలు వేసుకుంటున్నారని, కెనాల్ను పూడ్చే అధికారం వారికి ఎవరిచ్చారని స్థానిక రైతులు అంటున్నారు. అధికారులు సీతారామ ప్రాజెక్టును కాపాడుతారో లేదా పూడ్చివేసే వారికి మద్దతు నిలుస్తారో తేల్చుకోవాలని వారి వల్ల కాని పక్షంలో ఈ ప్రాజెక్టుకు భూములు త్యాగం చేసిన తామే కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు. -
సేవలు బాగున్నాయి
● కొన్ని విభాగాల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది ● భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలనలో బీఎస్ఐ బృందం భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సేవలు బాగున్నాయి. అయితే కొన్ని విభాగాల భవనాలకు మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉందని బీఎస్ఐ బృందం అభిప్రాయపడింది. బుధవారం నలుగురు సభ్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రియాంక, శ్రీకాంత్, రాధలతో కూడిన బీఎస్ఐ (బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్) బృందం ఆస్పత్రిని సందర్శించింది. సభ్యులు అన్ని వార్డులు, ఔట్ పేషెంట్, అత్యవసర సేవలు, ఇన్ పేషెంట్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, లేబర్ రూమ్, స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్, ల్యాబ్, రక్తనిధి కేంద్రం, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. 10 విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నట్లు గుర్తించారు. పలు విభాగాల్లో సదుపాయాలు బాగున్నా భవనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత మరోసారి బీఎస్ఐ బృందం సందర్శించనున్నారు. మూడేళ్లపాటు మెరుగైన సేవలందిస్తే ఐఎస్ఐ సర్టిఫికెట్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత భవనంలో ఏర్పాటు చేసిన ల్యాబ్, ఓటీ, దోబీ, ఇతర విభాగాల భవనానికి మరమ్మతులు చేయాలని సభ్యులు సూచించారు. తొలుత సమావేశం నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు నాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక పోలీసు ఉద్యోగాల జాతర
ఖమ్మంక్రైం: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈక్రమాన ఒకేసారి భారీగా పోలీసు ఉద్యోగాల నియామకానికి బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 621 ఉద్యోగాలను కేటాయించారు. విభాగాల వారీగా... రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఖమ్మం జిల్లాకు సివిల్ కానిస్టేబుల్ 309, ఏఆర్ కానిస్టేబుళ్లు 23, అగ్నిమాపక శాఖలో 18 కానిస్టేబుల్ పోస్టులు కేటాయించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సివిల్ 139, ఏఆర్ 32 అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ పోస్టులు 25 కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇవికాక ఉమ్మడి జైళ్ల శాఖకు 75 పోస్టులతో పాటు స్పెషల్ పార్టీ, బెటాలియన్లకు సైతం పోస్టులు కేటాయించినట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
చుంచుపల్లి: జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారంరాథోడ్ వైద్యాధికారులకు సూచించారు. బుధవారం ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని, వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నోటీస్ బోర్డుపై ప్రదర్శించాల న్నారు. వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభు త్వ, ప్రైవేట్ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరా లు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయాలని, హాస్టల్ సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు తదితర లక్షణా లు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారికి సమా చారం అందించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
పెరుగుతున్న గోదావరి
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం బుధవారం 17 అడుగులకు చేరింది. ఈ నెల మొదటి వారం నుంచి ప్రవాహంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నీటిమట్టం మరో మూడు అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పాఠశాల అభివృద్ధిలో హెచ్ఎంలు కీలకం
కొత్తగూడెంఅర్బన్: పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా విద్యాధికారి బి.వాసంతి తెలిపారు. ప్రధానోపాధ్యాయుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కొత్తగూడెంలోని విద్యా శిక్షణా కేంద్రంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఎల్ఐపీ, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. రోజూ కనీసం ఇద్దరు ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి, లోటుపాట్లపై సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం ఫిజికల్ డైరెక్టర్ల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాధవరావు, ఎస్కే సైదులు, జుంకీలాల్, బాలాజీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి వాసంతి -
పులుల సంతతి పెరగాలి
పాల్వంచరూరల్: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులుల సంతతి పెరగాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా బుధవారం వైల్డ్లైఫ్ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ ఎఫ్డీఓ కార్యాలయం నుంచి కిన్నెరసాని డీర్పార్కు వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీర్ పార్కు వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పులులు సంచరించేలా జిల్లా అడవులను తయారు చేయాలన్నారు. కిన్నెరసాని పర్యాటక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కిన్నెరసానిలో లక్నవరంలో మాదిరిగా తీగల వంతన నిర్మించాలని అధికారులను కోరారు. గిరిజన డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. సీపీఎఫ్ డాక్టర్ భీమానాయక్ మాట్లాడుతూ ఇక్కడి అడవిని పులులకు సేఫ్ జోన్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అడవుల నరికివేత, పోడు సాగు, వన్యప్రాణుల వేట కారణంగా పులులు జిల్లా అడవిలో ఆవాసం ఉండలేకపోతున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎకో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఎఫ్డీఓలు బి.బాబు, కృష్ణప్రసాద్, గిరిజన గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, రేంజర్లు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఎమ్మెల్యే కూనంనేని -
నిధుల్లేక నిరుపయోగంగా..
పాల్వంచరరూరల్: మరమ్మతులు చేయక నిరుపయోగంగా ఉన్న తొట్లను బాగుచేస్తే మరో పది లక్షల చేప పిల్లలను పెంచుకునే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని కిన్నెరసానిలో గల చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో 20 లక్షల చేప పిల్లల పెంపకం కోసం మొత్తం 12 నీటి తొట్లు ఉన్నాయి. వీటి మరమ్మతుల కోసం 2017లో రూ.53 లక్షల నిధులను అప్పటి పశు సంవర్ధకశాఖ, మత్స్య, పాల ఉత్పత్తుల అభివృద్ధి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంజూరు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధుల ద్వారా 8 కొత్త తొట్లను నిర్మించి, మరో నాలుగు తొట్లకు మరమ్మతులు చేశారు. మొత్తం 12 తొట్ల మరమ్మతులకు మంజూరైన నిధులను ఖర్చుచేశారు. మిగిలిన, లీక్ అవుతున్న మరో నాలుగు తొట్లను నిధుల కొరత కారణంగా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో పది తొట్లలో ఏటా 10 లక్షల చేపపిల్లలను మాత్రమే పెంచుతున్నారు. ఇక్కడ పెంచిన చేప పిల్లలను పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు మండలాల్లో మత్స్యసహకార సొసైటీలకు పంపిణీ చేస్తుంటారు. ఉన్న నాలుగు తొట్లకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు నిర్వహిస్తే ఏటా మరో పది లక్షల చేపపిల్లలను పెంచే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం నిధులు మంజూరు చేయకుండా వదిలేశారు. స్పాన్ ద్వారా పిల్లల పెంపు కిన్నెరసానిలోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఇతర ప్రాంతం నుంచి చేపపిల్లల గుడ్లు (స్పాన్) తీసుకొచ్చి ఇక్కడి నీటితొట్లలో పోసి, రెండు నెలలపాటు 35 – 40 ఎంఎం సైజు వరకు పెంచిన తర్వాతా మూడు మండలాల్లోని 46 సొసైటీలకు పంపిణీ చేస్తారు. చేపపిల్లల పెంపుకోసం ఉన్న తొట్లు సరిపోవడం లేదంటే ఇందులో మరో రెండు తొట్లను గంబూజ్ చేపల పెంపు కోసం ఐటీడీఏకు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం పది తొట్లలో మాత్రమే నామమాత్రంగా చేపపిల్లలను పెంచి మత్స్య సొసైటీలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కిన్నెరసాని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి చేపపిల్లల ఉత్పత్తి సంఖ్యను పెంచాలని మత్స్య సొసైటీ సభ్యులు కోరుతున్నారు. మరమ్మతులకు గురైన చేపపిల్లల తొట్లను పునరుద్ధరించేందుకు గాాను రెండేళ్ల కిందట రూ.40 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. -
చికిత్స పొందుతున్న యువతి మృతి
పాల్వంచరూరల్: తల్లి మందలించిందనే మనస్తాపంతో పురుగులమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు జీపీ కొత్తూరు గ్రామానికి చెందిన కాలం బాబు, లక్ష్మి దంపతుల కుమార్తె కాలం రమ్య (20) నాలుగు రోజుల క్రితం పురుగులమందు తాగగా.. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలుఅశ్వాపురం: మండలంలో సీఐ ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలపై అనుమానిత ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, కిరాణా దుకాణాల్లో బుధవారం నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేశ్ మాట్లాడుతూ.. డాగ్ స్క్వాడ్ సాయంతో గంజాయిని ఎక్కడ దాచి ఉంచినా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయా లు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్ పాల్వంచరూరల్: గంజాయిని విక్రయించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కిన్నెరసానిలోని కేటీపీఎస్ కెనాల్ వద్ద బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ సురేశ్కు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద సుమారు రూ.40 వేల విలువ గల ఎండు గంజాయి దొరికింది. గంజాయిని విక్రయించేందుకు ములకలపల్లి మండలం వడ్డురామవరానికి చెందిన గుగులోతు వినోద్, కిన్నెరసానికి చెందిన ఎస్కే ఆఫ్రీద్ ఇక్కడికి వచ్చారని తేలగా.. వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
కార్యస్థానాలు వీడొద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కార్యస్థానాలను విడిచి వెళ్లొద్దని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం కలెక్టర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారులను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అంకిత్ లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ప్రభుత్వం మత్స్యకారులకు వాహనాలు మంజూరు చేసింది. ద్విచక్ర వాహనాలకు 274, త్రిచక్ర వాహనాలకు 26 దరఖాస్తులు రాగా, 51 ద్విచక్ర వాహనాలు, 12 మూడు చక్రాల వాహనాలు మంజూరయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారి జి.శివప్రసాద్ తెలిపారు. 95శాతం డిజిటలైజేషన్ పూర్తిజిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 95 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై బుధవారం కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరై జిల్లా స్థితిగతులను వివరించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పొరపాట్లకు తావులేకుండా ఈఆర్ఓలు, సూపర్వైజర్లు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు నాగలక్ష్మి, వి.బాబూరావు, కె.మహేశ్వరరావు, వి.రామిరెడ్డి, టి.భరత్, నాగేశ్వరరావు, వెంకటరమణ, తుకారాం రాథోడ్, అనూష , రంగా ప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 42 బ్లాక్ స్పాట్లలో భద్రతా చర్యలను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారుల వెంట ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని చెప్పారు. కాగా, జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 289 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు -
ఆశల జల్లులు!
బూర్గంపాడు: ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వరి సాగు ఆలస్యమైనా రెండు రోజులుగా కురుస్తున్న జల్లులు ఆశలు రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆలోచన చేస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో రైతులు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. కొందరు ధైర్యం చేసి వరిసాగుకు సమాయత్తమవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో.. జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ చెబుతోంది. కాగా, ఈ వర్షాలకు చెరువులు, కుంటలకు పెద్దగా నీరు చేరలేదు. రైతులు దమ్ము చేసుకునేందుకు సరిపడా మాగాణులలో నీరు చేరింది. ఈ నేపథ్యంలో రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరినారు ఎదిగి సిద్ధంగా ఉంది. దీంతో రైతులు మాగాణులను దమ్ము చేస్తున్నారు. మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల కింద వరినాట్లు వేస్తున్నారు. ఈ వర్షాలకు వరినాట్లు వేసుకుంటే మళ్లీ ఏదో ఒక తుపాను రాకపోతుందా అనే ఆశతో రైతులు ముందుకు వెళ్తున్నారు. సగం మేర కూడా నిండని చెరువులు ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం 50వేల ఎకరాల వరకు తగ్గుతుందని అధికారులు భావించినా.. ప్రస్తుత వర్షాలతో కనీసం 30వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కువ ఆయకట్టు ఉన్న తుమ్మలచెరువు, సింగభూపాలెం చెరువు, దోమలవాగు చెరువుల కింద వరినాట్లు ఇంకా మొదలుకాలేదు. 100 నుంచి 300 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుల కింద కూడా వరినాట్లు ప్రారంభం కాలేదు. ఒకటి, రెండు రోజులు వేచి చూసి చెరువుల్లోకి కనీసం సగానికి నీరు చేరితే నాట్లు ప్రారంభించాలని రైతులు యోచిస్తున్నారు.అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న తేలికపాటి వానలను నమ్ముకుని రైతులు వరిసాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా లేవని, వర్షాలు తక్కువగా ఉంటాయని, తొందరపడి వరిసాగు చేస్తే ఇబ్బందులు పడాల్సివస్తుందని సూచిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, కొన్నిచోట్ల బోర్లలో నీరు రావటం లేదని, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇబ్బందికర పరిస్థితులు రానున్నాయని, బోర్ల కింద కూడా వరిసాగు చేయకపోవటమే మేలని వివరిస్తున్నారు. రైతులు మాత్రం వరుణుడిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.రెండు రోజులుగా ఎడతెరిపిలేని వాన -
భద్రాచలంలో రష్మీ సందడి
భద్రాచలంటౌన్/భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో బుధవారం టాలీవుడ్ నటి రష్మీగౌతమ్ సందడి చేశారు. పట్టణంలోని కాసమ్ ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ నిర్వాహకులు టూరిజం హోటల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించి మా ట్లాడారు. కాసం ఫ్యాషన్స్ సంబంధించి 30 బ్రాంచ్లు ఉన్నాయని, తొలిసారిగా ప్రదర్శన నిర్వహిస్తున్నారని, తక్కువ ధరలకే దుస్తులను విక్రయిస్తున్నారన్నారు. తొలుత రష్మీగౌతమ్ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, కాసం నిర్వాహకులు నమఃశివాయ, యంసాని ప్రవీణ్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి నుంచి శిశుగృహకు శాన్వీ.. భద్రాచలంఅర్బన్: పాప పుట్టిందని తెలిస్తే కులపెద్దలు బషిష్కరిస్తారనే భయంతో ఈ నెల 22న భద్రాచలం పట్టణంలోని రాములోరి అన్నదాన సత్రం వద్ద వదిలేసిన 45 రోజుల వయసున్న పాప శాన్వీని ఆస్పత్రిలో చేర్పించగా.. కోలుకోవడంతో మంగళవారం రాత్రి శిశుగృహకు తరలించారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు చికిత్స అందించారు. వైద్యుడు విజయ్ పర్యవేక్షించగా.. పాప కోలుకుని, 400 గ్రాముల బరువు పెరిగిందని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో అధికారులు శాన్వీని బ్రిడ్జి సెంటర్లో గల శిశుగృహానికి తరలించారు. ర్యాకింగ్ సిస్టమ్ ప్రారంభంపాల్వంచ: సూపర్ క్రిటికల్ టెక్నాలజీ 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలోని స్టోరేజ్ షెడ్లో ర్యాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్లో నిత్యం అవసరమయ్యే స్పేర్ మెటీరియల్ను క్రమపద్ధతిలో ఉంచడటంతో పాటు అవసరానికి వినియోగించేందుకు లైట్, హెవీ.. రెండు వేర్వేరు స్టోరేజ్లను రూ.4.90 కోట్లతో ఏర్పాటు చేశారు. కాగా ఇందులో హేవీ స్టోరేజ్ షెడ్–1లో ర్యాకింగ్ సిస్టమ్ ను చీఫ్ ఇంజనీర్ బి.శివరామ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కర్మాగారంలో స్పేర్ పార్ట్స్ వినియోగాన్ని మరింత పటిష్టం చేయడానికి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఈలు యుగపతి, రాజ్కుమార్, కిరణ్కుమార్, హరిలాల్, జేఎస్ మల్లేశ్వరి, ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిటేకులపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి పాత తండా నుంచి రాంపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రాళ్లవాగుపై నిర్మిస్తున్న నూతన వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక దారి వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాంపురం గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డలో బుధవారం ఉదయం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టగా.. ఐదు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా ఆపి విచారించారు. వాటిలో రెండు ఖాళీ ట్రాక్టర్లను పక్కనే ఉన్న జామాయిల్ తోటలో వదిలిపెట్టి డ్రైవర్లు పారిపోతుండగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పట్టుబడిన ట్రాక్టర్లను, డ్రైవర్లను స్థానిక పోలీస్స్టేషన్కి తరలించి పోలీసులకు అప్పగించారు. టౌన్ పోలీసులు ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు ఓనర్లపై కేసు నమోదు చేశారు. -
పేరాయిగూడెం వాసికి సీఐడీ విభాగంలో ఉద్యోగం
అశ్వారావుపేటరూరల్: పోలీస్ శాఖలో కీలకమైన సీఐడీ విభాగంలోఅశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి పేరాయిగూడేనికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కుమారుడు డాక్టర్ జుజ్జురపు క్రాంతికుమార్ ఉద్యోగం సాధించాడు. సీఐడీ విభాగంలో ఫోరెన్సిక్ సైంటిస్టుగా ఎంపికై న ఆయన మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. డాక్టర్ క్రాంతికుమార్ పదో తరగతి వరకు ఇల్లెందులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, డిగ్రీ ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశాడు. కాకతీయ విశ్వ విద్యాలయంలో ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) నుంచి పీహెచ్డీ అందుకోగా, సీఐడీ విభాగంలో ఉద్యోగానికి ఎంపికై న క్రాంతిని స్థానికులు అభినందించారు. ఫోరెన్సిక్ సైంటిస్ట్గా ఎంపికై న క్రాంతి -
సత్వర విచారణతోనే కేసుల్లో పురోగతి
సూపర్బజార్(కొత్తగూడెం): సైబర్ నేరాలు, సెల్ఫోన్ల చోరీ కేసుల్లో సత్వర విచారణతోనే ఫలితం ఉంటుందని ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, పెండింగ్ కేసులు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదుపై ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశాక బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని తెలిపారు. అంతేకాక సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఫిర్యాదులపై తక్షణ స్పందన ద్వారా బాధితుల డబ్బు రికవరీ చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే, డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు విస్తృ త అవగాహన కల్పించాలని తెలిపారు. ఇదేసమయాన అన్ని విభాగాల ఉద్యోగులు డేటా భద్రత, అధికారిక సమాచారం గోప్యత, సైబర్ భద్రతా నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేయాని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
● అనారోగ్యంతో విద్యార్థిని మృతి ● పుట్టిన సమయంలోనే కవల సోదరి కన్నుమూత
పీఎంఈజీపీ రుణాల్లో భారీగా అక్రమాలు ఖమ్మంవైరారోడ్: జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) రుణాల్లో భారీగా అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఈ రుణాలతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలోని కొంద రు దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులు కలిసి పక్కదారి పట్టించారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా యూనిట్లు లేకుండానే రూ.10 కోట్లకు పైగా రుణ సబ్సిడీ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై కలెక్టర్ విజిలెన్స్ విచారణచేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలుగా అనర్హులను నియమించినందున విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల్రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. ఆ ఇల్లు బోసిపోయింది..ఖమ్మంరూరల్: ఓ విద్యార్థిని మర ణం ఆమె కుటుంబాన్నే కాదు... ఆ వీధి, పాఠశాల, స్థానికులను శోకసంద్రంలో ముంచెత్తింది. 14 ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంకొకరికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఇంకో కుమార్తె కూడా మృత్యువాత పడింది. ఇందుకు సంబంధించి వివరాలు.. ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్ – స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల కుమార్తెలు జన్మించారు. ఇందులో ఓ కుమార్తె పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందింది. అదే సమస్యతో బాధపడుతున్న ఇంకో కుమార్తె వైదికకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తూ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. హైదరాబాద్లో చికిత్స చేయిస్తుండగా వైదిక పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులందరినీ కంట తడి పెట్టించింది. చివరిచూపు కోసం... ఏదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైదిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాల స్నేహితులతోనే కాక స్థానికులతో కలివిడిగా ఉండేది. ఆమె మృతి చెందిన సమాచారం తెలియగానే స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక వైదిక అంతిమయాత్ర పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా స్నేహితురాలికి వీడ్కోలు పలికారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మాజీ ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య -
దరఖాస్తులు మస్తు !
● అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ ● 192 టీచర్ పోస్టులకు 4,648.. 1,011 ఆయా పోస్టులకు 1,725 ● సర్టిఫికెట్ల పరిశీలన, త్వరలోనే ఇంటర్వ్యూలు భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా టీచర్, ఆయా పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది పూర్తయ్యాక మైదాన ప్రాంతంలోని కేంద్రాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు అంగన్వాడీల్లో టీచర్ పోస్టులకు ఈ నెల 2న, ఆయా పోస్టులకు 20న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2,061 కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాలు 1,203 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, 1,203 పోస్టులకు గాను 6,373 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు టీచర్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా ఆయా పోస్టులకు వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరోమారు సర్టిఫికెట్లు పరిశీలించాక, జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అడిషనల్ కలెక్టర్, సబ్కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు. పోస్టులు దక్కించుకునేలా.. అంగన్వాడీ పోస్టులు దక్కించుకునేందుకు కొందరు తమ పలుకుబడి ఉపయోగించి పైరవీలకు తెర లేపినట్లు సమాచారం. అలాగే తమ వారికే పోస్టు కేటాయించాలని కొందరు రాజకీయ నాయకులు సైతం ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్లో 70 శాతం మార్కులు వచ్చినవారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. అంతేకాక వితంతువులకు ఐదు, దివ్యాంగులకు ఐదు, అనాథలకు 10 మార్కులు ఇస్తూ, ఇంటర్వ్యూలకు 10 మార్కులు కేటాయిస్తారు. కుల ధ్రువీకరణతో సమస్య ఏజెన్సీ ప్రాంతంలో అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొందరు తమ భర్త కులాన్ని పేర్కొంటూ అదే సర్టిఫికెట్ సమర్పించారు. అయితే, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రమే సమర్పించాలని, అధికారులు సూచిస్తున్నా స్పందన రావడం లేదని సమాచారం. అంతేకాక భర్త కులం తమకు ఎందుకు వర్తించదని వాదిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా పోస్టుల భర్తీ మాత్రం పారదర్శకంగా చేపట్టాలని, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి అందిన దరఖాస్తుల పరిశీలన చివరి దశకు చేరింది. ఈ క్రమాన అనర్హులు, సర్టిఫికెట్లు సరిగ్గా లేనివారి దరఖాస్తులను తిరస్కరించాం. ఇక ఆయా పోస్టులకు మాత్రం వచ్చేనెల 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. – స్వర్ణలత లెనీనా, జిల్లా, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారి -
రామయ్య బంగారు, వెండి ఆభరణాల తరలింపు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి, వాహనాలను మంగళవారం అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు ఆదేశాలతో ఆలయ పునరుద్ధరణ పనుల్లో వేగం పెరిగింది. ఇందులో భాగంగా భక్తులు సమర్పించిన, శ్రీరామదాసు చేయించిన నగలతో పాటుగా వెండి వాహనాలు, సామగ్రిని మ్యూజియం నుంచి పటిష్ట భద్రత నడుమ ఈఓ దామోదర్రావు ఆధ్వర్యాన రంగనాయకుల గుట్టపై స్ట్రాంగ్ రూంకు తరలించారు. మరోపక్క చిత్రకూట మండపం ఎదుట ఉన్న గోశాల తొలగింపు పూర్తయింది. చిత్రకూట మండపంలోని స్తంభాల తరలింపు పనులు పూర్తికాగానే పడమర మెట్లను తొలగిస్తారు. ఇంకోపక్క మిథిలా స్టేడియంలో నిత్యకల్యాణ వేదిక నిర్మాణం కొనసాగుతోంది. నేడు దమ్మక్క శోభాయాత్ర, కల్యాణోత్సవం భద్రగిరిలో బుధవారం దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గత 12ఏళ్లుగా జరుగుతున్న ఈ యాత్ర వేదికను పనుల నేపథ్యాన మార్చారు. ఉదయం 6–30గంటలకు దమ్మక్క చిత్రపటంతో శోభాయాత్ర, దమ్మక్క విగ్రహం వద్ద పూజలు, అనంతరం తానీషా కల్యాణ మండపం వెనకాల మారుతి సదనంలో ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ గ్రామాల గిరిజనులు చేరుకోగా, ఆలయంలో దర్శనం చేయించి పూజలు ముగిశాక అన్నప్రసాదం అందజేసి తిరిగి గ్రామాలకు బస్సుల ద్వారా పంపిస్తారు. -
అడవిని మింగేస్తున్న మాఫియా
● సరిహద్దుల్లో అక్రమ కలప దందా.. ● భద్రాచలం కేంద్రంగా కోతలు, రవాణా ● చెక్పోస్టులకు చిక్కకుండా గోదావరి మార్గంలో తరలింపుభద్రాచలంటౌన్: ఒకప్పుడు అడవి అంటే భయం.. అన్నల(మావోలు) భయంతో అటవీ సంపద జోలికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేది. కానీ ఇప్పుడు అన్నలు లేకపోగా అధికారులు సైతం సహకరిస్తుండడంతో అక్రమార్కులు పండుగ చేసుకుంటున్నారు. ఫలితంగా ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విలువైన టేకు సంపద కనుమరుగవుతోంది. అడవుల్లో భారీ టేకు వృక్షాలను విచక్షణారహితంగా నరికి, అత్యాధునిక మిషన్లతో అక్కడికక్కడే దిమ్మెలుగా కోసి భద్రాచలం డివిజన్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. తనిఖీలతో అక్రమార్కులను అడ్డుకోవాల్సిన భద్రాచలం సరిహద్దు చెక్ పోస్టు సిబ్బంది మామూళ్ల మత్తులో తూలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి మీదుగా.. భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రేంజ్లకు ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని అడవుల్లో నరికిన భారీ టేకు వక్షాలను ఆధునిక రంపపు మిషన్ల సాయంతో అక్కడికక్కడే దిమ్మెలుగా మార్చి.. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా గోదావరి తీరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. అనంతరం పడవలు, మోటార్ బోట్లలో నదిని దాటించి లారీలు, ఇతర వాహనాల ద్వారా కావాల్సిన చోట్లకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు చెక్పోస్టుల్లో తనిఖీలను తప్పించుకోవడానికి గోదావరి నదిని మార్గంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ మార్గంలో పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో రవాణా నిరాటంకంగా సాగుతోందని సమాచారం. తక్కువకు కొనుగోలు.. లాభాలతో విక్రయం ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద మొత్తంలో టేకు కలప లభిస్తుండడంతో అక్రమ వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మార్కెట్లో అధిక ధరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక పటిష్టమైన నెట్వర్క్ ఉందని తెలుస్తోంది. ఇటీవల అటవీ శాఖ అధికారులు పలు చోట్ల టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అయితే పట్టుబడుతున్నది స్వల్పమేనని... రోజూ పెద్ద మొత్తంలో కలప సరిహద్దులు దాటుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలప అక్రమ రవాణాను అరికట్టేలా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ బలోపేతం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయంపై ఆధారాలతో ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరికై కా వృక్షాల నరికివేత, అక్రమ కలప రవాణా వివరాలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జస్వత్ ప్రసాద్, ఎఫ్ఆర్ఓ, భద్రాచలందశాబ్దాలుగా పెరిగిన విలువైన టేకు వృక్షాలను నరికేస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. అటవీ సంపద క్షీణిస్తుండడంతో జీవవైవిధ్యం, వర్షపాతం, భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే దందా కొనసాగుతోందన్న ప్రచారం ఉంది. అక్రమ రవాణా మార్గాలు, నిల్వ కేంద్రాలపై సమాచారం ఉన్నా కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడు లెక్కల కోసమే కేసులు పెడుతున్నారనే సమాచారం. ఛత్తీస్గఢ్–తెలంగాణ అటవీ శాఖలు, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తే తప్ప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం కానరావడం లేదు. అంతేకాక గోదావరి తీరాన రాత్రివేళ గస్తీ పెంచడం, పడవల తనిఖీలతో ఫలితం ఉంటుందని చెబుతున్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేసుకోవాలి
పాల్వంచరూరల్: ఎల్నినో కారణంగా వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలు సాగు చేయా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూ రావు సూచించారు. పాల్వంచ మండలం జగన్నాథపురం రైతువేదికలో మంగళవారం జరిగిన విత్తనమేళాలో ఆయన రైతులకు ఆరుతడి పంటల విత్తనాలను అందజేసి మాట్లాడారు. కందులు, మినుములు, పెసర, జొన్న, సజ్జ, ఆముదం విత్తనాలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏఓ పి.శంకర్, హెచ్ఈఓ శంకర్ రావు, ఏఈఓలు విశాల, పవన్, నరేశ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎస్ఏఎస్ఎస్ఏ కార్యవర్గం ఎన్నికఅశ్వాపురం: మండలంలోని మణుగూరు భారజల కర్మాగారం సైంటిఫిక్ అసిస్టెంట్ల సూపర్వైజర్ స్టాఫ్ అసోసియేషన్ (ఎస్ఏఎస్ఎస్ఏ) కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 25 తో నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణ గడువు ముగిసింది. ఆఫీస్ బేరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవులకు ఒక్కో నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోహన్బాబు, రన్ను హుస్సేన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.శ్రీనివాసులు, ఎం.నాగేంద్రకుమార్, సంయుక్త కార్యదర్శిగా డి.నవీన్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంకట ప్రసాద్, వెల్ఫేర్ సెక్రటరీగా ఎం.పాండు, ఆఫీస్ సెక్రటరీగా బీ.ఎం.వీ.నాగవేంద్రరావు, కోశాధికారిగా జయశంకర్ ఎన్నికయ్యారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.డీ.జైసన్, సీహెచ్వీ.రమణ, జి.దిలీప్కుమార్, సముద్రాల శ్రీనివాస్ ఎన్నికయ్యా రని ఎన్నికల అధికారి అనిల్కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవానికి సహకరించిన అన్ని యూని యన్ల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కార్యవర్గ బాధ్యులు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధిక ధరలకు గ్యాస్ సిలిండర్ల విక్రయం 87 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కామేపల్లి: నిబంధనలు ఉల్లంఘించి గ్యాస్ సిలిండర్లను అధికధరలకు విక్రయిస్తున్నట్లు సివి ల్ సప్లయీస్ అధికారులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లోగుర్తించారు. మండలంలోని పాత లింగాలలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మల్లి కార్జున్రావు నేతృత్వాన తనిఖీ చేయగా ఒక్కో సిలిండర్పై రూ.100 అదనంగా వసూ లు చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించి 52, తేజస్విని గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి 35 సిలిండర్లను సీజ్ చేసి కామేపల్లి సాయి తిరుమల గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నిల్వ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక ఏజెన్సీలపై చర్యల నిమిత్తం భద్రాద్రి అదనపు కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు డీఎస్ఓ తెలిపారు. ప్రధానితో ముఖాముఖిలో ఎస్బీఐటీ విద్యార్థులుఖమ్మంసహకారనగర్: వికసిత్ భారత్–2047లో భాగంగా ప్రధానమంత్రి మోదీ మై భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎస్బీఐటీ విద్యార్థులు 10 మందికి ప్రధా ని మోదీతో మాట్లాడే అవకాశం దక్కిందని కళా శాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రధాని మోదీతో సంభాషించే అరుదైన అవకాశం తమ విద్యార్థులకు దక్కగా, దేశ నిర్మాణంలో యువ త పాత్ర, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు, దేశాభివృద్ధి దిశగా ఆలోచనలను పంచుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులను కలెక్టర్ దివాకర టీ.ఎస్., కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ జి. ధాత్రి, వైస్ చైర్మన్ కె.శ్రీచైతన్య, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ అభినందించారు. -
కేఎంసీలో ‘డీజిల్’ దందా..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ)లో పారిశుద్ధ్య వాహనాలకు సంబంధించి డీజిల్ వినియోగం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇంధన చోరీని అరికట్టడం, పారదర్శకత కోసం అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. డీజిల్ కూపన్ల జారీలో సిబ్బంది తీరుకు తోడు అధికారుల అలసత్వంతో అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. ఈక్రమాన డీజిల్ కుంభకోణం వెనుక కేఎంసీలోని ఓ ఉన్నతాధికారి హస్తం ఉందనే ప్రచారం చర్చనీయాంశం కాగా.. కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఫోన్ కాల్తో పక్కదారి.. కొంతకాలంగా డీజిల్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూపన్లు ఇవ్వకుండానే పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాహనం నంబర్ చెప్పి ఇంధనం కొట్టాలని సూచించేవాడు. రెండు రోజుల తర్వాత వాహనాల నంబర్లతో కూపన్లు రాసి పంపించేవారని తెలుస్తోంది. ఫలితంగా ఒక వాహనానికి డీజిల్ కొట్టించి, మరో వాహనం పేరిట కూపన్లు సృష్టించి కేఎంసీ సొమ్మును పక్కదారి పట్టించినట్లు సమాచారం. అయితే, గతంలో కేఎంసీ పారిశుద్ధ్య వాహనాలకు రామన్నపేట సబ్జైలు వద్ద ఉన్న జైలు బంక్లో ఇంధనం కొట్టించగా.. అక్కడ నిబంధనలు కచ్చితంగా అమలయ్యాయి. ఆతర్వాత బైపాస్ రోడ్డు రాపర్తినగర్లోని ఒక ప్రైవేట్ బంక్కు మార్చాక అక్రమాలు జోరందుకున్నాయి. డబ్బాల్లో డీజిల్ వాహనాల ట్యాంకుల్లో నింపాల్సిన డీజిల్ను డబ్బాల్లో పోస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 22న స్వీపింగ్ మిషన్కు డీజిల్ కొట్టించేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ ట్యాంక్లో కొంత ఇంధనం పోయించి, మరికొంత డీజిల్ క్యాన్లలో పట్టించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ పి.శంకర్ ఫిర్యాదు చేయగా ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం ఔట్ సోర్సింగ్ డ్రైవర్ కె.ప్రకాశ్పై కేసు నమోదు చేశారు. దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేయించిన కమిషనర్.. కూపన్లు పంపకుండా ఫోన్ కాల్లో డీజిల్ కొట్టించిన ఉద్యోగి హేమంత్ సాయిని సస్పెండ్ చేశారు. ఇదే సమయాన లోపాలకు బాధ్యుడిగా అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇక డీజిల్ విభాగంలో కూపన్లు రాసే బాధ్యతను సీనియర్ అసిస్టెంట్ సునీల్కు అప్పగించినట్లు సమాచారం. కాగా, అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నా పట్టించుకోకుండా తమను బలిపశువులను చేస్తున్నారని డ్రైవర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. -
పులిరాజా..నీ జాడేది?!
జిల్లా అడవిలో పెద్దపులి జాడ కనిపించడం లేదు. అప్పుడప్పుడూ అతిథిలా వచ్చివెళ్తున్న పులి స్థిరనివాసం మాత్రం ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లాలో కిన్నెరసాని అభయారణ్యంతో పాటు దట్టమైన అడవులు ఉండగా, వేలాదిగా వన్యప్రాణులు నివసిస్తున్నాయి. అయినా పులి మాత్రం ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. గతేడాది కాలంగా ఏపీ నుంచి అశ్వారావుపేట రేంజ్లోకి, ఛత్తీస్గఢ్ నుంచి ఏటూరునాగారం మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చివెళ్లిన దాఖలాలు ఉన్నాయి. పెద్దపులి స్థిరని వాసానికి అనువైన పరిస్థితులు ఉన్నా ఇక్కడే ఎందుకు ఉండడం లేదనేది తేలడంలేదు. – పాల్వంచ రూరల్నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం కిన్నెరసాని అభయారణ్యంలోని మర్కోడు, రంగాపురం, అనంతోగు, మల్లేపల్లితోగు ప్రాంతాల్లోని దట్టమైన అడవిలో పెద్దపులుల సంచారం కొన్నేళ్ల క్రితం ఉండేది. ఎప్పుడైతే జిల్లా అటవీ ప్రాంతంలోకి ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వలస వచ్చారో ఆనాటి పరిస్థితిలో మార్పు వచ్చింది. అడవిలో 2 లక్షల ఎకరాలకు పైగా పోడు సాగు చేయడం, దట్టమైన అడవిలో చెట్లను నరికివేయడం, ఇంకొంత ఆక్రమణలకు గురవడంతో దట్టమైన అడవి కాస్తా పలుచబడింది. ఫలితంగా పులులు ఇక్కడ నివాసం ఉండలేక వలసబాట పట్టాయి. 2018లో జరిగిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచారం నమోదు కాలేదు. మళ్లీ 2020 డిసెంబర్, 2021 జనవరిలో పెద్దపులి సంచారం కనిపించినా ఆవాసం ఏర్పాటు చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయింది. ఇక 2025 ఫిబ్రవరిలో జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఆరు నెలలుగా ఇక్కడే సంచరించిందని అటవీ శాఖ అధికారులు గుర్తించి జిల్లా పేరు కలిసొచ్చేలా ‘భద్ర’అని నామకరణం చేశారు. అయితే, ప్రస్తుతం దాని జాడ కూడా లేదు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం పూర్తిచేశారు. మంగళవారం సందర్భంగా అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన జరిపారు. దమ్మక్క యాత్రకు ప్రత్యేక బస్సులు భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన బుధవారం దమ్మక్క సేవాయాత్ర జరగనుంది. ఇందులో పాల్గొనేలా వివిధ ప్రాంతాల గిరిజన భక్తులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఈమేరకు తొమ్మిది ప్రత్యేక బస్సులను మంగళవారం భద్రాచలం బస్టాండ్లో డిపో మేనేజర్ జంగయ్య ప్రారంభించారు. ఈ బస్సులు గిరిజన గ్రామాలకు వెళ్లి భక్తులను ఉచితంగా భద్రాచలం తీసుకురానున్నాయి. యాత్రకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం, ఆర్టీసీ సమన్వయంతో ఏర్పాట్లుచేసినట్లు డీఎం తెలిపారు. గిరిజన భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమ్మె నోటీసుపై వచ్చేనెల 6న ఆర్ఎల్సీతో చర్చలు రుద్రంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహణ, ఇతర సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్లోని కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డాక్టర్ సరస్వతి సమక్షాన యాజమాన్యంతో రెండో విడత చర్చలు జరిగాయి. ఇంకో విడత చర్చలు ఆగస్టు 6వ తేదీన జరగనుండగా, అప్పుడు కూడా ఫలితం రాకపోతే 16వ తేదీ నుంచి అన్ని సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఇప్పటికే ఓసారి మెడికల్ బోర్డ్ నిర్వహించినట్లు యాజమాన్యం చెప్పగా.. పారదర్శకంగా జరగలేదన్న తమ వాదనకు స్పందించిన ఆర్ఎల్సీ మరోమారు నిర్వహణకు పరిశీలించాలని ఆదేశించిందని వెల్లడించారు. మిగతా అంశాలపై యాజమాన్యం, ఏఐటీయూసీ చర్చించి వచ్చేనెల 6న జరిగితే సమావేశంలో నివేదిక ఇవ్వాలని ఆర్ఎల్సీ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(పర్సనల్) బి.రాజగోపాల్, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారని సీతారామయ్య తెలిపారు. నాణ్యమైన బోధనతో విద్యార్థులకు భవిష్యత్ ఇల్లెందు: నాణ్యమైన బోధన అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్కు పటిష్టమైన పునాది వేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాక యూడైస్ వివరాలు సకాలంలో నమోదు చేసి బోధన, ప్రాక్టికల్స్పై దృష్టి సారించాలని తెలిపారు. అంతిమంగా అత్యుత్తమ ఫలితాల సాధనే అందరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భానుప్రసాద్, అధ్యాపకులు ప్రసాదరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఫిజికల్ డైరెక్టర్ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ చింతలపూడి యుగంధర్ (55) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. కాకర్ల హైస్కూల్లో విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామమైన సుజాతనగర్ వెళ్తుండగా డేగలమడుగు సమీప బంక్ వద్ద గుండెపోటు రావడంతో కిందపడ్డారు. ఈ విషయాన్ని వెనకాల ఆటోలో వస్తున్న ఉపాధ్యాయురాలు కల్యాణి, బంధువు కృష్ణ, స్థానికులు గుర్తించి యుగంధర్కు సీపీఆర్ చేసి 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పీడీ సోదరుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో సుజాతనగర్ ఎస్ఐ ఎం.రమాదేవి కేసు నమోదు చేశారు. కాగా, యుగంధర్ మృతిపై జూలూరుపాడు ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కాకర్ల హైస్కూల్ హెచ్ఎం పి.సంజీవరావు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు.. పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి వచ్చి మృత్యువాత పినపాక: బతుకుదెరువు కోసం వచ్చిన ఆ యువకుడిని విద్యుత్షాక్ బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న క్రమంలో ఊహించని ప్రమాదం దెబ్బతీసింది. మండలంలోని ఈ–బయ్యారం క్రాస్రోడ్డు వారపు సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజస్థాన్కు చెందిన ముగ్గురు యువకులు పొట్టకూటి కోసం స్వ గ్రామాన్ని వదిలి మణుగూరులో నివాసముంటూ బాదంపాలు, ఐస్క్రీమ్స్ అమ్ము కుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవా రం కూడా బయ్యారం క్రాస్రోడ్డులోని వారపు సంతకు టాటా ఏస్ వాహనంలో ఐస్క్రీమ్స్, బాదంపాలు తీసుకొచ్చా రు. జనరేటర్కు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా.. ఒక్కసారిగా షాక్ కొట్టి శ్యామ్లాల్ (23) అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు సీపీఆర్ చేసి, 108లో మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గోదావరిలో పడి వ్యక్తి .. అశ్వాపురం: మండలంలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్టమల్లయ్య గుంపు గ్రామానికి చెందిన కలేటి వెంకటేశ్వర్లు (54) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం పొలం పనులకు వెళ్లిన వెంకటేశ్వర్లు సాయంత్రం సయయాన బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడ్డాడు. ఒడ్డున చెప్పులు ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మంగళవారం గాలించడంతో ఆయన మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె రమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూర్యారావు తెలిపారు. రుణం ఆశ చూపి.. ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి..మహిళ నుంచి రూ.6.90 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు బూర్గంపాడు: తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి బూర్గంపాడులోని గౌతమీపురానికి చెందిన ఓ మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు స్వాహా చేశారు. ఆమె ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్కార్డు వివరాలు తీసుకున్న నేరగాళ్లు ఆ తర్వాత ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ చేశారు. అడిగినంత నగదు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించడంతో బాధితురాలు సైబర్ నేరగాళ్ల అకౌంట్కు పలు ధపాలుగా రూ 6.90 లక్షలు పంపించింది. అయినా ఇంకా డబ్బు పంపించాలని ఒత్తిడి చేస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదుతో ఎస్ఐ మేడ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేయడమే కాక, సైబర్ నేరగాళ్ల అకౌంట్లో ఉన్న రూ.3.30లక్షలను హోల్డ్ చేయించారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వొద్దని ఎస్ఐ సూచించారు. కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన లారీభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం ఉదయం ఓ ఇసుక లారీ ప్రమాదవశాత్తు కోడిగుడ్లు తరలిస్తున్న రిక్షాను ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రిక్షాలో కోడిగుడ్లు తరలిస్తుండగా అంబేడ్కర్ సెంటర్లో ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో అతడికి స్వల్పగాయాలు కాగా, రిక్షా ధ్వంసమైంది. కోడిగుడ్లు మొత్తం పగిలిపోయాయి. లారీ ఇంకాస్త వేగంగా ఉండి ఉంటే రిక్షాను తొక్కుకుంటూ వెళ్లి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇసుక లారీల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆరుతడి పంటలే మేలు
● రైతులకు విస్తృతంగా అవగాహన ● మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ అంకిత్జూలూరుపాడు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూలూరుపాడు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నందున రైతులు వరికి బదులు మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయాలతోపాటు, ఇతర ఆరుతడి సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు. అంతేకాక ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతీ పొలంలో పంట కుంట, ప్రతీ ఊరిలో ఊట కుంట, కమ్యూనిటీ కుంటలు నిర్మించేలా పర్యవేక్షించాలని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 99 ఫారం పాండ్లు నిర్మించడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించామని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. మండల ప్రత్యేక అధికారి శ్రీలత, ఎంపీడీఓ తాళ్లూరి రవి, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఏఓ దీపక్ ఆనంద్, పీహెచ్సీ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఎంఈఓ బి.జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూసమస్యలను కేటగిరీల వారీగా వర్గీకరించి, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను ముందుగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగుపల్లి, లచ్చగూడెం, పాల్వంచ, ఉప్పుసాక, కరకగూడెం ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న భూ సమస్యలను జాయింట్ సర్వే ద్వారా త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే, తాగునీటి సమస్య దృష్ట్యా బోర్లు, మిషన్ భగీరథ, తాగునీటి పథకాల అనుమతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయాలని తెలిపారు. ఇప్పటికే గృహాలు ఉండి అదే స్థలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టేవారికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని, కొత్తగా మాత్రం ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో రహదారి, ఇతర వసతుల కల్పన, సింగరేణి ఓసీల విస్తరణ అనుమతులపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆర్ఓఎఫ్ఆర్కు దరఖాస్తులు, ఇతర అంశాలపై మాట్లాడగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, అధికారులు పాల్గొన్నారు.ములకలపల్లి: అన్నదాతల సందేహాలు నివృత్తి చేయడం, సాగులో మెళకువలు వివరించేందుకు ‘రైతు నేస్తం’ చక్కటి అవకాశమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ములకలపల్లి మండలం పూసుగూడెం రైతువేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ వందో ఎపిసోడ్ను వీక్షించిన ఆయన మాట్లాడారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. అనంతరం రైతునేస్తం కార్యక్రమాలకు క్రమం తప్పక హాజరైన రైతులు, ఏఈఓలను కలెక్టర్ సన్మానించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ భరత్, ఎంఏఓ అరుణ్బాబు, సర్పంచ్లు ధర్మ, రవి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
దమ్మక్క సేవా యాత్రకు రారండి
● గిరిజనులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు దేవస్థానం నుంచి ఆహ్వానం ● రేపు భద్రాచలంలో శోభాయాత్ర, మారుతి సదనంలో పుష్పాంజలిభద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో సీతారాముల విగ్రహాలకు నీడ కల్పించి, పూజించిన అపర భక్తురాలు దమ్మక్క సేవా యాత్రకు దేవస్థానం అధికారులు ఆహ్వానం పలుకుతున్నారు. 2014 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, గిరిజనులు, భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆషాఢ పూర్ణిమ రోజు పోకల దమ్మక్కను స్మరిస్తూ యాత్ర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో వేడుకలు జరుపుతారు. ఈ నెల 29న దమ్మక్క యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. దేవస్థాన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సేవా యాత్రలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రచార రథంలో స్వా మివారి ఉత్సవ మూర్తులను ఉంచి శోభాయాత్ర జరపనున్నారు. ఏటా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణోత్సవం, పుష్పాంజలి వేడుకలను తానీషా కల్యాణ మండపం ప్రాంగణంలోని మారుతి సదనానికి మార్చారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తరలింపు దమ్మక్క సేవా యాత్రకు 9 ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో సుమారు 700 మంది గిరిజనులను భద్రాచలం తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇల్లెందు, అశ్వారావుపేట రూట్లలో రెండు చొప్పున, జూలూరుపాడు రూట్లో 3, వాజేడు, కూనవరం రూట్లో ఒక్కో బస్సును కేటాయించారు. ఆర్టీసీ బస్సులు వెళ్లలేని రూట్లలో ప్రైవేట్ వాహనా ల ద్వారా వచ్చినవారి రవాణా చార్జీలనూ దేవస్థానం భరించనుంది. మంగళవారం సాయంత్రానికి వీరిని తరలించనుండగా, ఇందుకోసం తొమ్మి ది మంది సిబ్బందికి విధులు కేటాయించారు. రెండు రోజులపాటు ఉచిత బస, భోజన వసతి కల్పించనున్నారు. కాగా, ఈఓగా రమాదేవి ఉన్న కాలంలో గిరిజన గ్రామంలో రామయ్య ప్రచార రథంతో శోభాయాత్ర, నిత్యకల్యాణం జరిపి, స్వామివారిని గిరిజనుల చెంతకే చేర్చేవారు. ఈఏడాది దేవస్థానం అధికారులు దీనికి ‘మంగళం’పాడారు. కాగా ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీర య్య, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులకు సోమవా రం వేడుకల ఆహ్వాన పత్రాలను అందించినట్లు ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ తెలిపారు. -
గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
భద్రాచలం: గిరిజనుల ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. పరి శీలించి సంబంధిత అధికారులకు అప్పగించా రు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభు త్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికా రులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్, ఇతర అధికారులు ఆనంద్ కుమార్, చందన, అరుణకుమారి, మధుకర్, సైదులు, సున్నం రాంబాబు, గన్యా నాయక్, నారా యణరావు, సమ్మయ్య, మణిధర్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలిభద్రాచలంటౌన్: గిరిజన మహిళలు స్వశక్తితో చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ’ఓం శక్తి జాయింట్ లయబిలిటీ గ్రూప్’ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ను సోమవారం సందర్శించారు. మహిళలు ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూ, బర్ఫీ, నూనెతో పాటు రాగి, జొన్న జావలు, పచ్చళ్లు వంటి పోషకాహార ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. ప్రతీ వారం జరిగే గిరిజన దర్బార్లో ఈ ఉత్పత్తులను అధికారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ మధుకర్ పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
ప్రజావాణికి తగ్గిన జనం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరి ష్కారం కోసం సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి ఈసారి జనం తగ్గారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందనతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. భూ వివాదాలు, రెవె న్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అందజేశారు. దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలిలా.. ● 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఇల్లు, స్థలానికి పట్టా మంజూరు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన లక్ష్మి అర్జీ అందించగా, కొత్తగూడెం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ● తన భర్త మృతి చెందాడని, ఆయన పేరు మీద ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టా తన పేరు మీద మార్చాలని ఇల్లెందు మండలం వేపలగడ్డ గ్రామ పంచాయతీ బొచ్చాయిగూడేనికి చెందిన బుగ్గ పద్మ ఫిర్యాదు చేశారు. ● ఇందిరమ్మ పథకంలో ఎల్–3లో ఉన్న పేరును ఎల్–1లోకి మార్చాలని అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి రత్నకుమారి వినతిపత్రం ఇవ్వగా, దరఖాస్తును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. ● ఆసుపాక రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 191/6లో ఉన్న 4 ఎకరాల 20 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన బేతి వెంకాయమ్మ అర్జీ పెట్టుకోగా, అశ్వారావుపేట తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. సకాలంలో వైద్య సేవలు అందించాలిచుంచుపల్లి: ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు సకా లంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని సూచించారు. ఓపీ, పది రోజులుగా నమోదైన జ్వర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగీ, హెచ్ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న రక్త పరీక్షల వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. మందుల నిల్వ గదిని సందర్శించారు. యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్ల లభ్యత వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుష్ క్లినిక్ను సందర్శించి సేవలు, ఔషధాల వివరాలను తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తతంగా ఉండాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో జ్వరాల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తహసీల్దార్ శిరీష, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
చెరువు నిండక!
చినుకు రాలక..పాల్వంచరూరల్: వానాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో వర్షాలు మొహం చాటేశాయి. చెరువులు అడుగంటి వెలవెలబోతున్నాయి. జలాశయాలు వట్టిపోతున్నాయి. ఎల్నినో ప్రభా వంతో పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి సాగుకు అనుకూలంగా లేవు. మెట్ట పంటలు కూడా వడలిపోతున్నాయి. మరోవైపు వరినా రు ముదిరిపోయే పరిస్థితి నెలకొనగా, రైతులు కిన్నెరసాని, మొర్రేడువాగు, బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. వచ్చే నెలలోనైనా వర్షాలు కురుస్తాయేమోనని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ● గతేడాది ఇదే నెలలో చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో కళకళలాడాయి. కొన్ని అలుగు కూడా పోశాయి. కానీ ఈ ఏడాది మాత్రం చెరువుల్లో నీరు చేరలేదు. తాలిపేరు మినహా ఏ ప్రాజెక్ట్ నుంచీ దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో రైతులతోపాటు మత్స్యకారులు కూడా కలవరం చెందుతున్నారు. ● పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 397.06 అడుగులకు చేరింది. ఆయకట్టు పదివేల ఎకరాలు ఉంది.● అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం అడుగంటింది. ఆయకట్టు 16వేల ఎకరాలు. ఇందులో 2,360 ఎకరాలు తెలంగాణలో ఉండగా, మిగతాది ఆంధ్రాలో ఉంది. 2024లో ప్రాజెక్ట్కు గండి పడటంతో రెండేళ్లుగా నీరు నిల్వ ఉండటంలేదు. ● చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 73.65 మీటర్ల గరిష్ట స్థాయికి చేరడంతో, 15 గేట్లను ఎత్తివేసి నీటిని 22న దిగువకు విడుదల చేశారు. దీనికింద ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది. ● ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం అడుగంటింది. ఆయకట్టు 3,250 ఎకరాలుగా ఉంది. సమయం సాధారణ నమోదు లోటు/ వర్షపాతం అధిక శాతం ఈ సీజన్లో.. 401 278.3 –31 గతేడాది జూన్ 169 134 –26 ఈ ఏడాది జూన్ 161 151 –6 గతేడాది జూలై 313 379 +17 ఈ నెలలో 23నాటికి 232 135 –71జిల్లాలో చెరువులు కుంటలు 2,384 ఉన్నాయి. వీటిల్లో 1,796, చెరువులు 25 శాతం మేర నిండాయి. 25 నుంచి 50శాతం నీరు చేరిన చెరువులు 557, 50 నుంచి 75 శాతం నీరు చేరినవి 5 ఉన్నాయి. రెండు చెరువులు మాత్రమే అలుగు పోశాయి. దీంతో చెరువుల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ సమాయానికి జిల్లాలోని జలాశయాలు నిండాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవడంలేదు. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరలేదు. ఆగస్టులో అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురిస్తే అన్ని నిండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే మేలు. –శ్రీనివాసరెడ్డి, జలవనరులశాఖ సీఈ వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి భూగర్భ జలాలు 10.32 మీటర్ల లోతు కు పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 6.79 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాది కంటే 3.5 మీటర్ల లోతుకు అధికంగా పడిపోయాయి. వచ్చే నెలలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే భూగర్భ జలాలు 11.20 అడుగుల లోతుకు పడిపోయే ప్రమాదం ఉంది. –ఎం.రమేష్, ఏడీ, భూగర్భ జలాల శాఖ -
20 రోజుల్లో 2.6 టీఎంసీలు..
పాల్వంచరూరల్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గత 20 రోజులుగా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు ఫేస్–1 పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను 110 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవహిస్తున్నాయి. ఈ నెల 8న సోమవారం వరకు 20 రోజుల్లో బీజీ కొత్తూరు పంప్హౌస్ నుంచి 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇందుకోసం మొదటి పంపుహౌస్ వద్ద 25 మెగావాట్లు, రెండో పంప్హౌస్ వద్ద 40 మెగావాట్లు, మూడో పంప్హౌస్ వద్ద 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లను వినియోగిస్తున్నారు. రోజుకు రూ.1.02 కోట్ల విద్యుత్ బిల్లు గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాకు విడుదల చేస్తున్న నీటి సరఫరాకు భారీగా విద్యుత్ బిల్లు వస్తున్నట్లు సమాచారం. రోజుకు రూ.1.02 కోట్ల చొప్పున అవుతుందని, 20 రోజులకు సుమారు రూ. 22 కోట్ల బిల్లు వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే జలవనరుల శాఖపై మరింత విద్యుత్ భారం పడుతుందనే చర్చ సాగుతోంది. -
రామయ్య కల్యాణం.. రమణీయం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి నిత్యకల్యా ణం రమణీయంగా జరిగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నేడు కేంద్ర బృందం పర్యటనభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియాఆస్పత్రి లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, నిర్వహణలో క్వాలిటీ, వైద్యులు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. మొక్కలు నాటి పరిరక్షించాలికొత్తగూడెంఅర్బన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు పెంచి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని, వేడిని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అనంత రం మొక్కల రాజశేఖర్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు సూరేపల్లి లలిత కుమారి, మణిమృదుల, సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాలను నిరోధించాలి ఎస్పీ రోహిత్ రాజుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మాదకద్రవ్యాలను నిరోధించాలని ఎస్పీ రోహిత్రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, చార్జిషీట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై సమగ్ర ఆర్థిక దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, బాధితులను డీ అడిక్షన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు బాధ్యతతో పనిచేయాలని, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, మల్లయ్య స్వామి, అరుణ్ కుమార్, సీఐలు పాల్గొన్నారు. సమాజ సేవ చేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ అవగాహన పోస్టర్ను సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు, సభ్యులు రాజేష్, జుబ్బు, రాజయ్య పాల్గొన్నారు. -
మెరిసిన మిర్చి ధర
● తేజా రకం క్వింటాకు రూ.22,700 ● క్వింటాకు రూ.700 అ‘ధనం’ఖమ్మంవ్యవసాయ: మిర్చి ధరకు రెక్కలొచ్చాయి. విదేశీ రకంగా పేరు గడించిన ‘తేజా’ రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం తీసుకొచ్చిన మిర్చి క్వింటాకు జెండాపాటలో గరిష్టంగా రూ.22,700లు పలికింది. కొద్దిరోజులుగా రూ. 22 వేలు ఉన్న ధర రూ. 700 పెరగగా.. మోడల్ మిర్చి ధర రూ.21,800గా నమోదైంది. నాన్ ఏసీ మిర్చి ధర రూ.16వేల నుంచి 17 వేల వరకు పలుకుతుండగా, రూ.17,400కు చేరింది. ఇక రూ.9 వేలుగా ఉన్న తాలు మిర్చి ధర గరిష్టంగా రూ.10 వేలు, మోడల్ ధర రూ. 9.500లుగా పలికింది. ఖమ్మం మార్కెట్కు నిత్యం ఏసీ, నాన్ఏసీ మిర్చి కలిపి 10 వేల నుంచి 15 వేల బస్తాల వరకు విక్రయానికి వస్తోంది. జిల్లాలోని 48 కోల్డ్స్టోరేజీల్లో దాదాపు 30 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ సరుకంతా వ్యాపారులదేనని తెలుస్తోంది. సీజన్లో రైతుల నుంచి రూ.17 వేల నుంచి రూ.18 వేల చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేయగా, ఇప్పుడు ధర పెరుగుతుండడంతో లబ్ధి పొందనున్నారు. ఎగుమతుల ప్రభావం ఖమ్మం మార్కెట్లో డిమాండ ఉన్న ‘తేజా’ రకం మిర్చిని చైనాకు ఎగుమతి చేస్తారు. కానీ గత రెండు సీజన్లుగా చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక డిమాండ్ లభించడం లేదు. చైనాలో ఈ రకం పంట సాగు పెరగడం, నిల్వలు ఉండడం తదితర కారణాలతో ఎగుమతులు పడిపోయాయి. ఇదే సమయాన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కొన్నాళ్లుగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో మిర్చిధర పుంజుకుంటున్న వేళ విక్రయాలు పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు కూడా.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొలకొనగా, మిర్చి సాగు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024–25లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండగా గరిష్టంగా రూ. 15 వేలకు మించి ధర పలకలేదు. దీంతో 2025–26లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. జిల్లాలో కేవలం 33వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సీజన్లో మిర్చి ధర రూ.18 వేల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.22,700గా పలుకుతోంది. అయినా వర్షాభావ పరిస్థితుల్లో మిర్చి సాగు పడిపోతుందనే అంచనాతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకొస్తుండగా డిమాండ్ పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. -
ముక్కోటిలోగా ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలి
భద్రాచలం: భద్రాచలంలో డిసెంబర్లో జరిగే ముక్కోటిలోగా ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ, అభివృద్ది పనులపై సోమవారం హైదరాబాద్లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర ద్వారం వైపు పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఉత్తర, పడమర మెట్లు తొలగించాం ఇప్పటికే ఉత్తరం ద్వారం, ఫుట్ బ్రిడ్జిలను తొలగించామని, మంగళవారం నుంచి ఉత్తరం, పడమర వైపు మెట్లను తొలగించే ప్రక్రియ చేపడతామని ఆలయ ఈఓ దామోదర్రావు సెక్రటరీకి వివరించారు. మూజియంలో ఉన్న, రోజువారి పూజా కార్యక్రమాల్లో వినియోగించే స్వామివారి బంగారు ఆభరణాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, ఆ తరువాత ప్రాకారాల తొలగింపు పనులు చేపడతామని వివరించారు. యాగశాల తొలగింపు దేవస్థానంలో జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలను పూర్తిగా తొలగించారు. భద్రుని గుడి వెనుక ఉన్న యాగశాల, స్వామి వారికి ప్రసాదాలను తయారు చేసే వంటశాలలు ఉన్నాయి. యాగశాలను పూర్తిగా తరలించగా, వంటశాలను సైతం తొలగించేందుకు అందులో ఉన్న సామగ్రిని తరలించారు. భద్రుని శిల మినహా ఆలయ నిర్మాణం పూర్తిగా కూల్చనున్నారు. భద్రుని శిలకు భక్తులు పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న గ్రిల్స్, క్యూలైన్లను ఇప్పటికే తొలగించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
టేకులపల్లి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా వ్యవసాయాధికారి బాబూ రావు సూచించారు. సోమవారం మండలంలోని కోయగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించారు. రైతులకు కంది, పెసర, వివిధ రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. వర్షాధార ప్రాంతాలతోపాటు బోరుబావుల కింద సాగు చేసే రైతులు కూడా తక్కువ నీటితో మెరుగైన దిగుబడినిచ్చే కంది, పెసర, మినుము, శనగ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను వేయాలన్నారు. అధిక నీటి వినియోగం వల్ల భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్కు కావలసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అధికారులు కిషోర్, భరత్, లాల్ చాంద్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
తోగ్గూడెంలో అక్రమ మైనింగ్పై విచారణ జరపాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ గత జూన్ 29న ఇదే అంశంపై కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తోగ్గూడెం అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. సహజ వనరులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. మైనింగ్ శాఖ అధికారులు తోగ్గూడెం ప్రాంతంలోని క్వారీలను మూడుసార్లు సీజ్ చేశారని, ప్రతీ సారి కొద్దిరోజులపాటు మాత్రమే సీజ్ చేసి తిరిగి తవ్వకాలు కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. తవ్వకాల పరిమాణాన్ని నమోదు చేయకుండా తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని తగ్గిస్తున్నారని అన్నారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలకు వాస్తవాలను దాచిపెట్టి అన్ని క్వారీలకు అనుమతులు ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లావుడ్యా వెంకటేష్, బోడ రమేష్, బానోత్ నాగరాజు, బాదావత్ సురేష్ నాయక్, జర్పుల లాలు, బట్టు హుస్సేన్, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సేవాలాల్సేన ధర్నా -
నీట్ రద్దు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తున్న నీట్ను తక్షణమే రద్దు చేయాల ని, వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీతో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు ప్లకార్డులతో ర్యాలీ జరిపారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువజనులు అసమాన పోరాట పటిమ ప్రదర్శించారని అన్నారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, ఎస్కే ఫహీమ్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, ఎండి యూసుఫ్ పాల్గొన్నారు. విద్యార్థులకు నివాళి కొత్తగూడెంఅర్బన్: మృతి చెందిన విద్యార్థులకు పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల శివకుమార్ , అల్లి శంకర్ , గుండా రమేష్, పి సురేందర్, భూపతి అశోక్, మచ్చ పృథ్వీరాజ్, రాజేశ్వరరావు , సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని -
హరిహర క్షేత్రంలో అక్రమాలు!
ఇల్లెందు: పట్టణంలోని శ్రీ హరిహర క్షేత్రంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉండగా, బినామీగా పూజా, కొబ్బరి కాయల దుకాణం నడుపుకునే ఉద్యోగి పెత్తనం పెరిగిపోయిందని, పూజారులపై పెత్తనం చేస్తూ, వారి నివాస గదులను ఆక్రమించాడని ఆరోపణలు వస్తున్నాయి. విషయం ఇటీవల ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి వెళ్లగా.. ఆయన ఆలయ ఈఓ సూర్యప్రకాష్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆ గదిని మాత్రం ఖాళీ చేయలేదు. కాగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి వేలం పాట ఆగస్టు 1న ఆలయంలో నిర్వహించనున్నట్లు ఈఓ బి.సూర్యప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు. బినామీ పేరుతో టెండర్ పొందిన ఉద్యోగి విషయంలో చర్యలపై ప్రశ్నించగా.. స్కేల్ పోస్టు కాదని, అందుకే వదిలేశామని తెలిపారు. ఏఆర్ కానిస్టేబుళ్ల ఆర్థికసాయంసూపర్బజార్(కొత్తగూడెం): టేకులపల్లి మండలం కుంటల గ్రామనివాసి తోలం నాగేశ్వరావు జిల్లా డిస్ట్రిక్ట్ ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. స్పందించిన 2007 బ్యాచ్ తోటి సిబ్బంది మృతుడి కుటుంబానికి రూ.1,49,000 ఆర్థికసాయం సోమవారం అందించారు. ఎం.చంద్ర శేఖర్, శ్యామ్, లక్ష్మణ్ స్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్, గోపాల్, శేఖర్, సూర్యాపేట జిల్లా నుండి కె నాగరాజు, టి మధు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
30న అథ్లెటిక్స్ ఎంపికలు
సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 30న భద్రాచలంలోని శిశుమందిర్ స్కూల్ ఎదురుగా ఉన్న క్రికెట్ గ్రౌండ్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ఆగస్టు 7, 8 తేదీలలో హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 30న భద్రాచలం తరలిరావాలని కోరారు. వీఓఏలను ఉద్యోగులుగా గుర్తించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ డిమాండ్ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్లు, నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు కె.సత్య, భూక్య రమేష్, అరుణ, రేష్మ, కృష్ణవేణి, నాగరాజు, అనురాధ, మీనా, ధనలక్ష్మి, నాగేంద్రమ్మ, శ్యామ్, కొమరయ్య పాల్గొన్నారు. యోగా పోటీల్లో ప్రతిభజూలూరుపాడు: కొత్తగూడెం హనుమాన్ బస్తీలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడుకు చెందిన ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు ప్రతిభ చాటా రు. తాళ్లూరి నవీన్, వేముల నాగేశ్వరరావు, వేల్పుల బోసు, పెండ్యాల నరేష్ బహుమతులను గెలుచుకున్నారు. తాళ్లూరి నవీన్ జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించగా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కౌన్సెలింగ్ ద్వారా గురుకులాల్లో సీట్ల భర్తీభద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధి గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నామని రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) అరుణ కుమారి తెలిపారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలిక పాఠశాలలో సోమవారం 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్ను ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న 336 సీట్లను ప్రవేశపరీక్షలోని మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడ సీటు లభించినా విద్యార్థులు చేరాలని సూచించారు. వివిధ గురుకులాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు మాధవీలత, చైతన్య, హరికృష్ణ, భద్రయ్య, ఉపాధ్యాయులు, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికభద్రాచలంటౌన్: పట్టణంలోని సీటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు మోడెమ్ వంశీ హైదరాబాద్లో ఇటీవల యాదవ్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి స్ట్రాంగ్మెన్ టైటిల్ను కై వసం చేసుకున్నారు. ప్రథమ స్థానంలో నిలవడంతో రూ.1.25లక్షల నగదు బహుమతిని అందించా రు. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు వి. మల్లేష్, బోగాల శ్రీనివాస్రెడ్డి, జీవీ రామి రెడ్డి, శివరామకృష్ణ ప్రసాద్, భవానీ శంకర్, వెంకటకృష్ణాజీ తదితరులు విజేతను అభినందించారు. చేపల వేటకు వెళ్లి గల్లంతు?అశ్వాపురం: మండల పరిధిలోని బట్టీలగుంపు గ్రామపంచాయతీ పరిధి బట్ట మల్లయ్య గుంపు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి గోదావరిలో గల్లంతైనట్లు తెలిసింది. చేపల వేటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అటవీ’ ఆటంకం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి (ఎన్హెచ్ 30) నుంచి కేవలం 3 కి.మీల దూరంలో చింతకుంట గ్రామం ఉంది. అత్యవసర పరిస్థితి ఎదురైతే గ్రామస్తులు సమీపంలోని సారపాకకు చేరుకునేందుకు సరైన రోడ్డు లేదు. సోమవారం ఈ గ్రా మానికి చెందిన ఓ గర్భిణి 108లోనే ప్రసవం పొందడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లుగా ఈ తరహా సమస్యలను జిల్లాలో అనేక గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. అడవుల సంరక్షణ పేరుతో అటవీశాఖ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సమస్యల పరిష్కారానికి కనీసస్థాయిలో చొరవ కూడా లేదు. ఫలితంగా ఏటా వానాకాలంలో అనా రోగ్యంబారిన పడినవారు సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. యాక్షన్ ప్లాన్ ఏదీ? దండకారణ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల ప్రభావంతో భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఛత్తీస్ గఢ్ నుంచి వలసలు పెరిగాయి. అప్పటికే ఉన్న ఏజెన్సీ గ్రామాలకు, వలస ఆదివాసీ గూడేలు జత కలవడంతో అడవులపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి తగ్గించేందుకు వలస ఆదివాసీ గూడేలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో తెలంగాణ అటవీశాఖ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నా యి. ఇటీవల వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లకు కేంద్రం దండిగా నిధులు సమకూర్చింది. ఆ సమయంలో అడవులపై పడిన ఒత్తిడిని నివారించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కేవలం అనుమతుల పేరుతో అడ్డుకోవడంతోనే ఫారె స్టుశాఖ సంతృప్తి చెందుతోంది. సమస్య మూ లాల్లోకి వెళ్లి పరిష్కారాలు వెతకడంలేదు. మావోయిస్టు ప్రభావిత నిధులు వచ్చేనా..? గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల కోటాలో ఆళ్లపల్లి –మామకన్ను మధ్య కిన్నెరసాని వాగుపై రూ.9 కోట్లతో 2019లో వంతెన పనులు చేపట్టారు. వంతెన పిల్లర్ ఒకటి అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీశాఖ పనులను ఆపేసింది. ఇదే మండలంలో వీరాపురం క్రాస్రోడ్ నుంచి రేగళ్ల మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు వరకు రోడ్డుకు రూ. 4 కోట్లు కేటాయించారు. పాల్వంచ మండలంలో మొండికట్ట–కారెగట్టు రోడ్డుకు రూ.6కోట్లు మూడేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఫారెస్టు శాఖ అభ్యంతరాలతో ఆ పనులన్నీ మధ్యలో ఆగిపోగా, నిధులు వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో ఆ కోటాలో మళ్లీ నిధులు వచ్చేది అనుమానమే. కొండరెడ్ల తరహాలో.. ఇటీవల దమ్మపేట మండలం పుసుకుపల్లి విషయంలో జిల్లా యంత్రాంగం ఒక్కతాటిపై నడిచి ఫారెస్టు అభ్యంతరాలను పరిష్కరించాయి. దీంతో అక్కడి కొండరెడ్లకు రోడ్లు, వంతెనలతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేరువయ్యాయి. ఏజెన్సీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరోసారి అదే స్ఫూర్తి చాటాలని జిల్లా వాసులు కోరుతున్నారు.అటవీ శాఖ అభ్యంతరాలతో జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్ల నిర్మాణాలు జరగలేదు. అశ్వారావుపేట మండలంలో గాండ్లగూడెం–చెన్నాపురం రోడ్డు, ములకలపల్లి మండలం తిమ్మంపేట–గుండాలపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలో బెండాలపాడు–బ్రాహ్మలకుంట, ఇల్లెందు మండలం మొండితోగు–ధర్మాపురం తదితర రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అభ్యంతరాలతో పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. నిలిచిపోయిన వంతెనలు, కల్వర్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. -
భద్రగిరిలో భారీ వినాయకుడు..
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవిధంగా కొన్నేళ్లుగా మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. భద్రాచలంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన పవర్ బోయ్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో 20 అడుగుల విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ తరహాలో వేదిక వద్దనే భారీ వినాయకుడిని రూపొందిస్తున్నారు. 9 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ కోల్కతా కళాకారులతో విగ్రహం తయారీకి ఒప్పందం చేసుకున్నారు. టన్ను బరువు గల విగ్రహాన్ని రూ.2.5 లక్షలతో సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా, పూర్తిగా పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండే వెదురు బొంగులు, కర్రలు, బంక మట్టి, వరి పొట్టు వినియోగిస్తున్నారు. ఐదుగురు కళాకారులు ప్రస్తుతం మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత రంగులను అద్దనున్నారు. సెప్టెంబర్ 27న వినాయక చవితి రోజున భారీ విగ్రహాన్ని కొలువుదీర్చనున్నారు. ప్రజల సహకారంతో 60 మందితో సభ్యుల కమిటీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తోందని అధ్యక్ష, కార్యదర్శులు, వల్లూపు ప్రేమ్చంద్, ఎప్పు సత్యకాంత్, కోశాధికారి రేగా సందీప్ తెలిపారు. 20 అడుగుల మట్టి విగ్రహం తయారీ.. -
జానకి సదనం సత్రానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్మించే జానకి సద నం సత్రంలో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. ఏపీలోని విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కులను ఆది వారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. వేధిస్తున్న వ్యక్తిపై కేసు పాల్వంచ: మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై పాల్వంచ పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బస్టాండ్ సెంటర్లో బేకరి షాపు నడుపుకుంటున్న ఓ మహిళకు కొత్తగూడెంనకు చెందిన బొమ్మిడి రమాకాంత్తో పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో సదరు మహిళకు తన స్నేహితుడు సాయి వద్ద నుంచి రూ.60 వేలు రమాకాంత్ ఇప్పించాడు. షూరిటీగా ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకుని తీసుకున్నాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మార్చి 2024లో రూ.8.50 లక్షలకు చెక్ బౌన్స్ కేసు పెట్టి లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాను తీసుకున్నది కేవలం రూ.60 వేలు మాత్రమేనని వేడుకుంది. ఇప్పుడు రూ.16 లక్షలు చెల్లించాలని బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా 2025 డిసెంబర్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ చేయడం, అసభ్యకరమైన వీడియో కాల్స్, న్యూడ్ ఫోటోలు పంపిస్తున్నాడని, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
57 లీటర్ల నాటుసారా స్వాధీనం
చర్ల: మండలంలోని కలివేరు, భద్రాచలం పట్టణంలో ఆదివారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టి.. 57 లీటర్ల నాటుసారా, ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని కలివేరు సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 40 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో 17 లీటర్ల నాటుసారాతో పాటు ముగ్గురు వ్యక్తుల (ఇద్దరు మహిళలు)ను అదుపులోకి తీసుకుని, వీరిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్నకుమార్, తిరుపతి, ఉపేందర్ పాల్గొన్నారు. -
● ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు ● ప్రత్యామ్నాయంపై రైతుల ప్రత్యేక దృష్టి ● ముందుగానే సాగు మొదలుపెట్టిన పలువురు..
ఖమ్మంవ్యవసాయం/ఇల్లెందు రూరల్: ఎల్నినో పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జలాశయాల్లోకి నీరు చేరకపోగా.. భూగర్భ జలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వరికి బదులు ఇతర పంటలు ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, వినూత్న పంటల సాగులో ముందు నిలిచే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు పలువురు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడంలోనూ ఓ అడుగు ముందే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి వనరు సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. బావులు, బోర్ల ఆధారంగా వరి సాగు చేసినా కీలకమైన సమయాన ఇబ్బంది అవుతుందనే ఆలోచన రైతుల్లో నెలకొంది. దీంతో పలువురు ‘ప్రత్యామ్నాయ’ బాట పట్టారు. చెరకుకు చెక్ చెరకు సాగుకు నీటి వినియోగం ఎక్కువ. ప్రస్తుతం ఆ పంటను సాగు చేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన ఏన్కూరు మండలం హిమామ్నగర్కు చెందిన కల్యాణ్ క్యాబేజీ ఎంచుకున్నారు. ఆరెకరాలకు గాను ఇప్పటికే మూడెకరాల్లో ఆయిల్పామ్ నాటాడు. మిగిలిన భూమిలో వరికి బదులు క్యాబేజీ సాగు చేస్తున్నాడు. దీని పంట కాలం రెండు నెలలె కాగా నీటి తడులు తక్కువగా అవసరమవుతాయి. ఆ నీరు కూడా డ్రిప్తో అందిస్తున్నాడు. ఆరుతడితోనే అధిక లాభాలు ఆరుతడి పంటలకు నీటి అవసరం అంతగా ఉండకపోగా పెట్టుబడీ తక్కువే. కేవలం 90 రోజుల్లోనే పంటలు చేతికందుతాయి. ఎకరా విస్తీర్ణంలో కంది సాగుకు రూ.5వేలకు మించి ఖర్చు ఉండదు. ఎకరానికి 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తే క్వింటాకు రూ.6,500 వరకు ధర పలుకుతుంది. సోయాబీన్ యూరియా అవసరం లేని పంట. సాగు కాలం మొత్తంలో డీఏపీ, 20–20 ఒక్కో కట్టను ఎకరం విస్తీర్ణంలో మొక్కలకు అందించాలి. మొత్తంగా ఎకరానికి రూ.10వేల నుంచి 12వేల వరకు ఖర్చు చేస్తే.. 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.8వేల ధర పలుకుతుంది. నువ్వు సాగు ఎకరాకు మొత్తంగా రూ.5వేల నుంచి 6వేలకు మించి ఖర్చు ఉండదు. దిగుబడి ఎకరానికి 2 – 3 క్వింటాళ్లు కాగా ధర క్వింటా రూ.25వేల ఉంటుంది.ఇప్పటివరకు వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలే సాగు చేశాను. వర్షపాతం తక్కువగా ఉంటుందన్న అధికారుల హెచ్చరికలు ఆలోచింపజేశాయి. తొలిసారి సోయాబీన్ నాలుగెకరాల్లో సాగు చేస్తున్నా. మొక్కలు మంచిగా ఎదుగుతున్నాయి. – సలీం, మొండితోగు, ఇల్లెందు మండలంమార్కెట్లో మంచి ధర ఉండడం, తక్కువ పెట్టుబడి, నీటి తడులే అవసరం కావడంతో కంది వైపు మొగ్గుచూపా. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న వేయగా, ఈ సారి నాలుగెకరాల్లో కంది సాగు ప్రారంభించాను. పంట ఆశాజనకంగా ఉంది. – లకన్లాల్పాసి, పూసపల్లి, ఇల్లెందు మండలంఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏటా వ్యవసాయం చేస్తుంటాను. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యమిచ్చాను. ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేయాలనే భావనతో ఈసారి ఐదెకరాల్లో పెసర సాగు ప్రారంభించాను. – అజ్మీరా మోహన్, మస్సివాగు, ఇల్లెందు మండలం -
‘మల్టీపర్పస్’ విధానం రద్దు చేయాల్సిందే..
రఘునాథపాలెం: గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీకి కారణమైన జీఓ 51ను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్స్ వ్యవస్థను తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రఘునాథపాలెంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (ఏఐటీయూసీ) మూడో రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత యూనియన్ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం కేవలం రూ.8,500 చెల్లించడం సరికాదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.16 వేల వేతనం ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. త్వరలో అసంఘటిత రంగ కార్మికులను సమన్వయం చేసి కనీస వేతనాల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేపడతామని తెలి పారు. కొన్ని పెద్ద పంచాయతీల్లో కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నా వాటిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షు డు ఎండీ యూసఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులకు ప్రతీనెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, కొత్తగూడెం మేయర్ మూడు గణేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, నాయకులు బీజీ క్లెమెంట్, వెంకటరాజం, రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయు లు, సీహెచ్ సీతామహాలక్ష్మి, నిమ్మటూరి రామకృష్ణ, మల్లికార్జున్, వాసిరెడ్డి మురళి, పిట్టల మల్లయ్య పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్లో చేరికలు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్లో పనిచేస్తున్న ఓవర్ మెన్లు, ఐదుగురు కార్మికులు ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వీరికి రవిచంద్ర కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించి, మాట్లాడా రు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఓవర్మెన్లుగా ఉద్యోగాలు ఇచ్చారని, కారుణ్య నియమకాలు చేపట్టటంతో పాటు సింగరేణి కార్మికులకు అనేక సదుపాయాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో కాపు కృష్ణ, గడప రాజ య్య, వసికర్ల కిరణ్, బోరింగ్ శంకర్, ఈశ్వర్, వెంకటేశ్, సూరజ్, అశోక్, రాము లు, అన్వర్, వల్లాల రాయలింగు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఖమ్మంస్పోర్ట్స్: హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా భీమనాథుల అశోక్రెడ్డి, వరికేటి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన ఎన్నికలకు పలు మండలాల బాధ్యు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా వివరాలను ఎన్నికల అధికారి అరుణ్కుమార్ ప్రకటించా రు. అధ్యక్ష, కార్యదర్శులుగా అశోక్రెడ్డి, మోహన్తో పాటు ఉపాధ్యక్షులుగా ఇందుర్తి బ్రహ్మానందరెడ్డి, కోడిశెల అనిల్, బందెల్ల భాస్కర్రావు, సంయుక్త కార్యదర్శులుగా ఇనుపనూరి రాంమాంజనేయులు, జెట్టి రామకృష్ణ, లింగాల బాలరాజు, సండ్ర నితిన్ ఎన్నికయ్యా రు. ఎన్నికలను రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేష న్ ప్రతినిధి కనపర్తి రమేశ్, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్య దర్శి కె.క్రిస్టోఫర్బాబు పర్యవేక్షించారు. ‘వైబ్రంట్ విలేజ్’కు హాజరుసూపర్బజార్(కొత్తగూడెం): యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ నిర్వహించిన వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం–2026లో పాల్గొన్న యువతతో ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో సంభాషించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మంది మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి పలువురు యువకులు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మేరా యువ భారత్ నోడల్ అధికా రి కమరతపు భానుచందర్ పాల్గొన్నారు. కలప తరలిస్తున్న వాహనం పట్టివేత తరలించినవారి వివరాలు చెప్పని అధికారులు పాల్వంచరూరల్: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్డీఓ బాబు కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు టీఎస్ 28 టీఏ 3524 ట్రాలీ వాహనాన్ని బేస్ క్యాంప్ సిబ్బంది తనిఖీ చేయగా అందులో రూ.18,945 విలువ గల బిల్లుడు జాతికి చెందిన కలపను పట్టుకున్నారు. రేంజర్ కవిత మాదురి అర్ధరాత్రి చెక్పోస్టు వద్దకు వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్డీఓ తెలిపారు. కానీ, కలపను తరలిస్తున్నవారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇంతకు వారు వాహనంతోపాటు దొరికారా? దొరికిన తర్వాత పారిపోయారా? లేదా వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజర్ను పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు యత్నించినప్పటికీ స్పందించలేదు. ఎఫ్డీఓ బాబును వివరణ కోరగా కలపను తరలించే వ్యక్తుల వివరాలు తనకు కూడా రేంజర్ చెప్పలేదని పేర్కొన్నారు. -
● కేబుల్ తవ్వకాలతో గుంతలమయంగా మారిన భద్రగిరి రోడ్లు ● ఇసుక లారీలతో దెబ్బతింటున్న ప్రధాన రహదారులు ● ప్రమాదాలకు గురై గాయపడుతున్న వాహనదారులు ● నిర్లక్ష్యం వీడని కాంట్రాక్టర్, సంబంధిత శాఖ అధికారులు
రోడ్లు ఛిద్రం!భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి పుణ్యక్షేత్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయి. భక్తులు, పట్టణవాసులు రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేబుల్ తవ్వకాలతో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. పట్టణంలో కొద్ది నెలలుగా అండర్గ్రౌండ్ కేబుల్ లైన్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. రహదారులను అడ్డదిడ్డంగా తవ్వి కేబుల్ పనులను పూర్తి చేసుకున్నారు. అనంతరం గుంతలను పూడ్చకుండా వదిలేశారు. కొన్ని చోట్ల నడుం లోతు గోతులు, మరికొన్ని చోట్ల మట్టి , రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి. మూడు రోజుల క్రితం యూబీ రోడ్డులో ఓ వాహనం రాళ్ల కుప్ప వల్ల పక్కకు దూసుకురావడంతో ఓ దుకాణం అద్దాలు ధ్వంసమయ్యా యి. వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం రోడ్ల డ్యామేజీ ఖర్చులను గ్రామపంచాయతీకి జమ చేయాలి. పంచాయతీ అనుమతితో రోడ్లను తవ్వి కేబుల్ పనులు పూర్తయ్యాక సదరు కాంట్రాక్టర్ గోతులను పూడ్చి వేయాలి. కానీ కాంట్రాక్టర్ ఇవేమీ పాటించడంలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కేబుల్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాక రహదారుల పునరుద్ధరణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోతులను పూడ్చాలని ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా, పూడ్చనని చెబుతున్నాడని స్థానికులు, దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. మచ్చ తెస్తున్న అధికారుల తీరు దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భద్రాచలం తరలివస్తుండగా, వారికి గుంతలు స్వాగతం పలుకుతుండటంతో భద్రగిరి క్షేత్రానికి అప్రతిష్ట వస్తోంది. సదరు శాఖల అధికారుల తీరు కూడా మచ్చ తెస్తోంది. ప్రాణ నష్టం, ఇతర ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి కేబుల్ తవ్వకాల గుంతలను పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, ఇసుక లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి నుంచి ఇసుక రవాణా చేసే భారీ లారీల రాకపోకలు ప్రధాన రహదారులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలా ల్లోని ర్యాంపుల నుంచి రాత్రింబవళ్లు ఇసుక లారీలు భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. అధిక లోడ్తో ప్రయాణిస్తుండటంతో రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పట్టణ ప్రధాన రహదారులు, అంబేద్కర్ సెంటర్లో భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు కిందపడుతూ గాయాల పాలవుతున్నారు. వర్షం కురిసిన సమయంలో గుంతలు నీటితో నిండిపోవడంతో లోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆల య అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నదీహారతి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదా వరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ లు చేశారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన, శాంతి మంత్రా ల పఠనం నిర్వహించారు. పురోహితులు రామ వజ్జల రవికుమార్, సత్య ప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రామాచార్యులు, వీరభద్ర శర్మ, సుబ్రహ్మణ్యం చార్యులు, తిరుపతిరావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, రామకష్ణ, తేజ శర్మ, అశోక్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. -
జానకమ్మకు స్వర నీరాజనం..
భద్రాచలంటౌన్: దక్షిణ భారత గానకోకిల, దివంగత గాయని ఎస్.జానకికి నివాళిగా భద్రాచలంలో ‘జానకమ్మకు స్వర నీరాజనం’పేరిట నిర్వహించిన సంగీత విభావరి వైభవంగా సాగింది. పట్టణంలోని కాకతీయ గ్రాండ్ (కమ్మ సత్రం) వేదికగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, మాట్లాడారు. సినిమా సంగీత ప్రపంచంలో ఎస్.జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె పాటలు తరాలు మారినా శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయని కొనియాడారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాన్ స్టాప్గా సాగిన ఈ కార్యక్రమంలో 25 మంది గాయనీగాయకులు పాల్గొన్నారు. జానకమ్మ ఆలపించిన ఎన్నో సూపర్ హిట్, భక్తిరస, మెలోడీ గీతాలను వారు తమ పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అలరించిన సంగీత విభావరి -
‘రిజిస్ట్రేషన్’కు కార్పొరేట్ లుక్ !
కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేలా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం చేపడుతోంది. వాతావరణ ం జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒకటి, రెండు జల్లులు కురిసే అవకాశం ఉంది. సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026చెప్పకముందే.. చేసేశారు!ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోటు ప్రసాద్ ఏటా ఖరీఫ్లో ఆరెకరాల్లో వరి సాగు చేస్తాడు. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులను గుర్తించి వరి స్థానంలో పెసర సాగు చేశాడు. ప్రస్తుతం పెసర పైరు పూత దశకు చేరింది. ‘అధికారులు వర్షాభావ పరిస్థితులపై ముందు నుంచే చెబుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా వరి వేసినా నీటి ఎద్దడికి గురై నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయం పెసర మంచిదని భావించి సాగు చేస్తున్నా’ అని ప్రసాద్ వివరించాడు. -
●సోయాబీన్ పరిచయం
ఇల్లెందు మండలంలో అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న.. ఆ తర్వాత పత్తి, వరి సాగు చేస్తారు. కూరగాయలు, మిర్చి కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. ఎల్నినో కారణంగా ఈసారి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలంగా వరి,మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసిన రైతులు ఈ దఫా కంది, పెసర, నువ్వుల సాగుతోపాటు తొలిసారి సోయాబీన్ సాగునుమండలానికి పరిచయం చేశారు. ఏకంగా ఈ పంట వంద ఎకరాలకు విస్తరించడం రైతుల చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.నాగేశ్వరరావు సాగు చేస్తున్న బంతి తోట -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలివ్వాలి
బూర్గంపాడు: వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ.19 వేలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కె ట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటాల సోమ న్న డిమాండ్ చేశారు. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 1,200 మంది సెక్యూరిటీ గార్డులు 30 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని అన్నారు. రూ 5లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ ల సాంబయ్య, నాయకులు సదానందం, వెంకట నారాయణ, సారిక రాము, ఎండీ మస్తాన్, రామాంజనేయులు, ఎస్ రమేష్, వెంకటేశ్, మహేందర్రెడ్డి, శోభారాణి, దుర్గా, మహమూద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్న -
బస్సును ఢీకొట్టిన లారీ
పలువురికి గాయాలు దమ్మపేట: స్టాప్ పాయింట్ వద్ద ఆగిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులకథనం ప్రకా రం.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న క్రమంలో మండలంలోని ముష్టిబండ గ్రామంలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. సత్తుపల్లి నుంచి అతివేగంతో వస్తున్న లారీ, ఆగి ఉన్న బస్సు ను కుడి పక్కన వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. ఇస్లావత్ లక్ష్మి, అసిమ్ సిద్ధిక్ తీవ్రంగా గాయపడగా.. దుర్గ, సందీప్, సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఇస్లావత్ లక్ష్మి, అసిమ్ సిద్ధిక్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగుల మారేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, దర్యా ప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యంటేకులపల్లి: భార్య, ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. ఈ ఘటన మండలంలోని తొమ్మిదోమైలు తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తండాకు చెందిన భూక్యా మంగీలాల్ భార్య విజయ (30), వారి పిల్లలు భూక్య అనుశ్రీ (9)), భూక్య మోక్షిత్ (6) ఈ నెల 16వ తేదీన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో భర్త మంగీలాల్ ఈ నెల 20న టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడే తన భార్యాపిల్లలను తీసుకెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఆదివారం విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ తిరుపతిని వివరణ కోరగా భూక్య మంగీలాల్ తన భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.వ్యక్తి అదృశ్యంపై కేసుదమ్మపేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. దమ్మపేట అర్బన్కాలనీకి చెందిన జొన్నకూటి వెంకటేశ్వరరావు(40) తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. ఇసుక లారీలకు అడ్డుకట్టఅశ్వాపురం: మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో ఇసుక లారీలను ఆదివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. రాంనగర్ ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లారీలు గ్రామంలోని వంతెనపై రావడం వల్ల బ్రిడ్జి ధ్వంసం అవుతోందని గ్రామస్తులు వంతెనపై లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల రాకపోకల వల్ల సీతారామ కెనాల్ కట్ట అస్తవ్యస్తంగా మారిందని, పొలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్ట పూర్తిగా ధ్వంసమవుతోందని కాల్వపై ఉన్న సిల్ట్ను కాల్వలోకి నెడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు ఆపిన లారీల్లో ఓ లారీకి డీడీ లేనట్టు సమాచారం. ఎస్ఐ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవడంతో తీవ్రగాయాలు నేలకొండపల్లి: మతిస్థిమితం లేని ఓ యువకుడు విద్యుత్ ట్రాన్సఫార్మర్ను పట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మంగాపురంతండాకు చెందిన నాగేశ్వరరావుకు మతిస్థిమితం తప్పింది. ఆయన ఆదివారం గ్రామంలో పరుగులు తీస్తూ ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. ఈ క్రమాన షాక్కు గురై కేకలు వేస్తుండడంతో స్థానికులు ఆయనను కర్రల సాయంతో విడదీశారు. అప్పటికే చేతులు కాలి రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో ఖమ్మం తరలించారు. -
రుగ్మతలు లేని సమాజ స్థాపనకు కృషి
ఖమ్మంగాంధీచౌక్: రుగ్మతలు లేని సమాజ స్థాపన కోసం విద్యావంతులు కృషి చేయాలని కవి, రచయిత, విశ్రాంత ఐఏఎస్ అధికారి అంగలకుర్తి విద్యాసాగర్ సూచించారు. నిబద్ధతతో ఎవరి పని వారు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పాటుపడాలని తెలిపారు. ఈ అంశాలే ప్రాతిపదికన కోమాకుల సీతారాములు ‘హాస్టల్ కతలు‘పుస్తకం రాశారని తెలిపారు. కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం అధ్యక్షతన ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యాన సీతారాములు రచించిన పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. ‘హాస్టల్ కతలు‘పుస్తకంలో సీతారాములు జీవితంలోని అను భవాలు యదార్థ ఘటనలే కాక సమాజ స్థితిగతులను పొందుపర్చారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భంగ్యా మాట్లాడుతూ.. హాస్టళ్లలో చదివిన అందరి జీవితాల్లోని ఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తున్నాయని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రసేన్, టీజీవోస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, రాచమల్ల ఉపేందర్ మాట్లాడారు. అనంతరం సినీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను సత్కరించగా.. ఆయన మాట్లాడారు. తన కు తెలుగు భాష నేర్పిన గురువు సీతారాములు ఎందరో గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆ తర్వాత సీతారాములు– సావిత్రి దంపతుల 70వసంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సహకార శాఖ జిల్లా రిటైర్డ్ అధికారి సయ్యద్ ఖుర్షీద్తో పాటు లెనిన్ శ్రీనివాస్, మద్దెర్ల రమేశ్, పంజాల ఐలయ్య, కె.రమేశ్, కె.రామారావు, అరుణకుమారి, వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, మొగిలి గుణక ర్, లింగాల రవికుమార్, కొమిరె వెంకన్న, జి.వీరన్న, కార్డియాలజిస్ట్ సీతారాం, సుబ్బారావు, పిచ్చిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లేశం గోపాల్రావు పాల్గొన్నారు.‘హాస్టల్ కతలు’పుస్తకావిష్కరణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి విద్యాసాగర్ -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని..
పాల్వంచ: వైఎస్సార్ సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని పాల్వంచకు చెందిన అభిమానులు ఖలీల్ పాషా, దాసరి కిరణ్ కుమార్ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. సుజాతనగర్ నుంచి భద్రాచలం వరకు ఆదివారం సుమారు 60 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లారు. మార్గమధ్యలో పాల్వంచలో వారి స్నేహితులు, వైఎస్ జగన్ అభిమానులు కలిసి అభినందించారు. జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఖలీల్, కిరణ్ మాట్లాడుతూ 2029లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పి.వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు. సుజాతనగర్ నుంచి భద్రాచలం వరకు అభిమానుల పాదయాత్ర -
చిన్నపాపకు పెద్ద కష్టం
తిరుమలాయపాలెం: అభంశుభం తెలియని ఆ చిన్నారికి అంతపెద్ద జబ్బు ఉందని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. ఆటపాటలతో ఆడుకునే వయస్సులో పసిపాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు జన్యు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తేల్చారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప పాపప్రాణాలు కాపాడే పరిస్థితి లేదని, ఇందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఈ మేరకు దాతలు చేయూతనిచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కన్నీటి పర్యంతం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన కాంపాటి రవీందర్ – సృజన దంపతుల ఐదేళ్ల కుమార్తె కశ్విక అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతింటుండగా శ్వాస తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. ఆమెను పరీక్షించిన వైద్యులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మాత్రమే మార్గమని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలోని అంకుర ఆస్పత్రిలో కశ్విక చికిత్స పొందుతుండగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించాల్సిన చికిత్సకు సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని సమాచారం. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ – సృజన దంపతులు తమ బిడ్డను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 70950 21080, 62815 31963 నంబర్లను సంప్రదించి ఫోన్పే ద్వారా నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రాక్టర్ బోల్తా
డ్రైవర్ మృతి దమ్మపేట: ట్రాక్టర్ ఇంజన్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన శ్రీరాంపురం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకా రం.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన బెజవాడ ప్రేమ్కుమార్ (38) ట్రాక్టర్ ఇంజన్ను నడుపుతూ, మండలంలోని గండుగులపల్లి నుంచి బుగ్గపాడు వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ శ్రీరాంపురం సమీపంలోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తాపడింది. తలకు తీవ్రగాయలు కావడంతో ప్రేమ్కుమార్అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మందలించాడని తనయుడి ఆత్మహత్య దమ్మపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో తనయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన చిలకా వెంకన్నబాబు (19) ఏ పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. అతడిని తండ్రినాగ రాజు శనివారం మందలించాడు. దీంతో అదేరోజు రాత్రి యువకుడు సీలింగ్ ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల దాడులుభద్రాచలంఅర్బన్: పట్టణంలోని చర్ల రోడ్డులో గల పాత మార్కెట్లోని మాంసాహార విక్రయ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారి సుభాష్ ఆదివారం దాడు లు నిర్వహించారు. ఆయా వ్యాపారు లు వినియోగిస్తున్న కాటాలను తనిఖీ చేశారు. కాగా, తూకంలో వినియోగదారులను మోసం చేస్తున్న పది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పలు రకాల కాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు
కార్పొరేట్ లుక్!ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నవి కొన్ని, అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో కొపాగుతున్నవి ఇంకొన్ని.. ఇలా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో సమస్యల నడుమ అటు అధికారులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతుండగా వీటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన వసతులు, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 48 సబ్ రిజిస్ట్రార్, మూడు జిల్లా రిజిస్ట్రార్, రెండు డీఐజీ కార్యాలయాల నిర్మాణాలకు రూ.97 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ఖమ్మం ఆర్ఓ కార్యాలయంతో పాటు మరో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. దశాబ్దాలుగా అద్దె భవనాల్లో.. ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆదాయం తీసుకొస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు చాలీచాలని ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో సర్దుకుంటూనే రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్ఓ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం నూతన భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడంతో ఆర్ఓ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త కళ రానుంది. ఎక్కడెక్కడ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ఆరు కీలక కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. ఇందులో ఖమ్మం ఆర్ఓ కార్యాలయానికి నూతన భవనం మంజూరైంది. ఇందులోనే రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. ఇక ఖమ్మంరూరల్, కూసుమంచి, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం ఆర్ఓ కార్యాలయానికి రూ.2 కోట్లు కేటాయించే అవకాశముండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థలాల వేటలో యంత్రాంగం నూతన భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో స్థలాలను కేటాయించినా, వాటిని పక్కన పెట్టి కొత్త స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు నూతన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా, ప్రధాన రహదారికి సమీపాన ఉండే స్థలాల కోసం అన్వేషిస్తుండగా, వారంలో ఇది ఓ కొలిక్కి రానుందని సమాచారం. హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో.. భవనాల నిర్మాణ బాధ్యతలతో పాటు పర్యవేక్షణను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించారు. ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా సువిశాలమైన వెయిటింగ్ హాళ్లు, కార్పొరేట్ మోడల్ కౌంటర్లు, తాగునీటి వసతే కాక విస్తారమైన పార్కింగ్ వసతులతో ఈ భవనాలను నిర్మించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరు కార్యాలయాల నిర్మాణం స్థలాలను పరిశీలన చేస్తున్నాం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆర్ఓ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మం ఆర్ఓతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన స్థలాల పరిశీలన వారంలోగా ఓ కొలిక్కిరానుంది. –ఎ.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం -
విద్యార్థులకు నవోదయం
● ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య ● జవహర్ నవోదయ విద్యాలయాల్లో మెరుగైన వసతులు ● 2027–28లో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల 31 ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై విద్యార్థులకు పూర్తిస్థాయి పట్టు సాధించేలా బోధన ఉంటుంది. పుస్తక విజ్ఞానంతోపాటు క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, సంగీతంలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, చక్కటి మెనూతో భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ విద్య అందిస్తారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్తగా నవోదయ పాఠశాలను మంజూరు చేసింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో 30 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవన నిర్మాణం చేపడుతున్నారు. భవనం పూర్తయ్యేవరకు కరకగూడెం జెడ్పీ పాఠశాలలో తాత్కాలికంగా విద్యాలయ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా ఆరో తరగతిలో 40 సీట్ల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31లోగా https:// navodaya. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయ స్వాగతం పలుకుతోంది. 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. విలువలు, దేశభక్తి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలను సమ్మిళితం చేస్తూ బోధన సాగిస్తున్నారు. – కరకగూడెంనవోదయ విద్యాలయలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రవేశ పరీ క్షలో 100 మార్కులకు గాను 80ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉం టాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని ఉన్నత విద్యకు బలమైన పునాది వేసుకోవ చ్చు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులు ఎంపికవుతారు. –రత్నయ్య, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ -
ఎల్నినో ఎఫెక్ట్..
● వరి తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు ● తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ● రైతులకు వ్యవసాయశాఖ సూచనలు ● ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై సందిగ్ధం చర్ల: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే జిల్లాలో వర్షాలు ఆలస్యమవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ప్రత్యేకించి అధికనీరు అవసరమయ్యే వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయాలని సూచిస్తున్నారు. దీంతో సాగు వ్యయం తగ్గి, మంచి ఆదాయం వస్తుందని చెబుతుండగా వరిసాగు చేసే రైతాంగం సందిగ్ధంలో పడింది. తగ్గిన వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జిల్లాలో సాధారణ వర్షపాతం సుమారు 1,100 మి.మీ నుంచి 1,200 మి.మీ. వరకు నమోదవుతుంది. ఎన్నినో ప్రభావంతో ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కురవలేదు. మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్లో కూడా ఆశించిన మేర వర్షాలు కురిసే పరిస్థితులు లేవని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, సాధారణంగా వరికి 1,200 – 1,500 మి.మీ. వరకు నీటి అవసరం ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలను సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవా లని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల వైపు మొగ్గు జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో సాగవుతాయి. మార్కెట్లో డిమాండ్ పెరు గుతుండటంతో రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. పెసర, మినుము, కంది వంటి పప్పు ధాన్యాలకు కూడా నీటి అవసరం, సాగు ఖర్చు తక్కువ. నేలలో నత్రజని నిల్వలను పెంచి భూసారాన్ని పెంపొందిస్తాయి. నువ్వులు, వేరుశనగ వంటి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. వర్షాలు తక్కువగా ఉన్నా, దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. రైతులకు కలిగే ప్రయోజనాలు.. ● తక్కువ సాగునీటితో పంటల సాగు. ● విద్యుత్ వినియోగం, సాగు వ్యయం తగ్గుతుంది. ● వర్షాభావ పరిస్థితులను తట్టుకునే అవకాశం. ● పంటల వైవిధ్యంతో ఆదాయం పెరుగుతుంది. ● నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయ శాఖ సూచనలు ... ● స్థానిక వర్షపాతాన్ని బట్టి పంటలను ఎంచుకోవాలి. ● ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించాలి. ● నేల పరీక్షలు చేయించి ఎరువులు వాడాలి. ● వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసే చర్యలు చేపట్టాలి. ● డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించాలి. పంట పంట కాలం నీటి అవసరం ప్రధాన ప్రయోజనం మొక్కజొన్న 100–110 రోజులు తక్కువ మంచి మార్కెట్ ధర జొన్న 95–110 రోజులు చాలా తక్కువ ఎండను తట్టుకుంటుంది సజ్జ 70–85 రోజులు చాలా తక్కువ త్వరగా దిగుబడి రాగులు 95–110 రోజులు తక్కువ పోషక విలువలు అధికం పెసర 65–75 రోజులు చాలా తక్కువ త్వరగా ఆదాయం మినుములు 70–80 రోజులు తక్కువ మంచి ధర కందులు 150–180 రోజులు తక్కువ దీర్ఘకాలిక లాభం నువ్వులు 80–90 రోజులు తక్కువ నూనెగింజలకు మంచి డిమాండ్ వేరుశనగ 100–120 రోజులు మోస్తరు మంచి ఆదాయం పత్తి 160–180 రోజులు మోస్తరు మార్కెట్లో మంచి డిమాండ్ రైతులు ఇప్పటికే వరిసాగు కోసం రూ.వేలు ఖర్చు చేశారు. విత్తనాలు కొని నార్లు పోశారు. రైతులకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించి నష్టపోకుండా చూడాలి. తక్కువ నీటితో పండే పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. – వై.పుల్లారెడ్డి, రైతు, గొమ్ముగూడెం వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలంటూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పెసర, మినుము, కందులు, మొక్కజొన్న, సోయాబీన్ వంటివి సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని వివరిస్తున్నాం. అవసరమైన విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నాం. – బాబూరావు, డీఏఓ -
ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
చుంచుపల్లి: ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశా రు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యానగర్ కమ్మ సత్రంలో శనివారం వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. నిర్మించడం, నిలబెట్టడం కాకుండా కూల్చివేయడం, పడగొట్ట డం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించా రు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, దిండిగాల రాజేందర్, సలిగంటి శ్రీనివాస్, కాపు సీతామహాలక్ష్మి, అబ్రహం, మండవ సుబ్బారావు, శంకర్రెడ్డి, భూపతి శ్రీనివాసరావు, గోపాల్రావు, మసూద్, అవుటుపల్లి రాంబాబు, బండి విజయభాస్కర్, పూల రవీందర్, అనుదీప్, అజిత్, వీరభద్రం, బొమ్మిడి రమాకాంత్, సర్పంచులు బాదావత్ శ్రీకాంత్, బలరామ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
విద్యార్థికి విజ్ఞానం
● ‘వీవీఎం’ పేరుతో ప్రతిభా అన్వేషణ పరీక్ష ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు ● జాతీయస్థాయిలో సత్తా చాటితే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్ కూడా.. ఖమ్మంసహకారనగర్: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం), విజ్ఞాన భారతి సంయుక్త ఆధ్వర్యాన ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంపొందించడం, పరిశోధనలపై ఆసక్తి పెంచడమే ఈ పరీక్ష ప్రధాన లక్ష్యం. విజేతలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో బహుమతులు అందించడమే కాక మెరుగైన ప్రతిభ చాటిన వారికి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంటర్న్షిప్నకు అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ‘వీవీఎం’ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యాన ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తే మేలు జరగనుంది. ఎవరెవరు అర్హులు దేశవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారు. తద్వారా ఇంటి నుంచే మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా పరీక్ష రాయొచ్చు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో ఉంటుంది. సైన్స్పై ఆసక్తి పెంపే లక్ష్యం విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడం, భారతీయ శాస్త్రవేత్తల కృషిని పరిచయం చేయడమే ఈ పరీక్ష లక్ష్యం. అంతేకాక ఉన్నత విద్యకు మార్గనిర్దేశం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేలా పరీక్ష నిర్వహిస్తున్నారు. పరిశోధనా సంస్థలతో పరిచయం కల్పించే లక్ష్యంతో సాగుతున్నారు. పరీక్ష విధానం లెవల్ – 1 (స్కూల్ స్థాయి) పరీక్ష 100 ప్రశ్నలతో 90 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి విభాగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి, త్రిశక్తి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలపై 40 ప్రశ్నల పరీక్ష 30 నిమిషాలు ఉంటుంది. రెండో విభాగంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, రీజనింగ్ అంశాలపై 60 ప్రశ్నలతో 60 నిమిషాలు ఉంటుంది. ఇప్పటికే మొదటి విభాగానికి సంబంధించి సిద్ధమయ్యేందుకు కావాల్సిన స్టడీ మెటీరియల్ వీవీఎం వెబ్సైట్లో పొందుపరిచారు. లెవల్ – 1 తర్వాత రాష్ట్రస్థాయిలో లెవల్ – 2 పరీక్ష 45 నిమిషాల వ్యవధితో 50 మార్కులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత జాతీయస్థాయి పరీక్ష ఉంటుంది. ఆకర్షణీయమైన పురస్కారాలు పాఠశాల, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, మెమెంటోలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతి లభిస్తుంది. జాతీయస్థాయిలో మొదటి ముగ్గురికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతే కాక సర్టిఫికెట్లు అందించనున్నారు. విద్యార్థులు వీవీఎం పరీక్ష రాయడం భవిష్యత్కు ఉపయోగపడుతుంది. ఈ మేరకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి. స్కూల్, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిస్తే నగదు ప్రోత్సాహకాలతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు అందుతాయి. జిల్లా విద్యార్థులు అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. –ఎనుముల వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి, ఖమ్మం విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. చివరి తేదీ: సెప్టెంబర్ 30 పరీక్ష ఫీజు: రూ.200 పరీక్ష తేదీలు: 6, 7వ తరగతులు: నవంబర్ 16 లేదా 19 8, 9వ తరగతులు: నవంబర్ 17 లేదా 20 10, 11వ తరగతులు: నవంబర్ 20 లేదా 21 పరీక్ష సమయం: 90 నిమిషాల పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యార్థులకు అనుకూలమైన సమయాన రాయొచ్చు. రాష్ట్రస్థాయి పరీక్ష: 2027 జనవరి 3,10, 17 జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DRDO, CSIR, ISRO, IICT, IISER, IIT, NIN, NGRI, BARC తదితర ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్షిప్నకు అవకాశం దక్కుతుంది. ఇది సంస్థల ఆధారంగా ఒకటి నుంచి మూడు వారాల పాటు ఉంటుంది. అంతేకాక జాతీయస్థాయి విజేతలకు ‘భాస్కర స్కాలర్షిప్’ పథకం ద్వారా ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. -
అటవీ సిబ్బందికి రక్షణ కల్పించాలి
అశ్వాపురం: అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ నెల 17న అశ్వాపురం మండలం మనుబోతులగూడెంగ్రామ పంచాయతీ వేములూరు గ్రామంలో విధి నిర్వహణలో ఆటంకపరిచి ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరగకుండా చట్టపరమైన రక్షణ చర్యలు చేపట్టాలని విన్నవించారు. బీట్ ఆఫీసర్పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, జిల్లాలోని అన్ని డివిజన్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు గోవిందు, బాగ్య, నరేష్, వెంకన్న, ఎర్రయ్య, అనూష, బాబూరావు, భీమ్చంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజుకు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వినతి -
ఎరువుల దడ!
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓ వైపు ఎకరాకు ఇచ్చే రెండు బస్తాల యూరియా సరిపోవటంలేదు. మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధర అమాంతం పెంచేశారు. గతేడాది వానాకాలం సీజన్ ధరతో పోల్చితే బస్తాకు రూ. 800 వరకు పెంచారు. దీంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులపై ఆర్థిక భారం ఇరాన్, అమెరికా దేశాల మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎరువుల కంపెనీలు అమాంతంగా ధరలను పెంచేశాయి. ఏడాది కాలవ్యవధిలోనే మూడుసార్లు కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెరిగాయి. గతంలో బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు మాత్రమే ధరలు పెరిగేవి. ఏడాది కాలంగా ఎరువుల బస్తా ధరలు ఒకేసారి బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు పెరుగుతున్నాయి. గతేడాది వానాకాలం సీజన్లో రూ.1350 ఉన్న 20:20:00:13 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర ప్రస్తుతం రూ.2150 చేరింది. ఏడాది కాలంలోనే బస్తా రూ.800 పెరిగింది. 14:35:14 ఎరువు, 10:26:26 ఎరువు, 16:16:16 వంటి ఇతర కాంప్లెక్స్ ఎరువులు, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పోటాష్) ధరలు కూడా అధికంగా పెరిగాయి. ఎకరాకు సగటున 4 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతుండటంతో పెరిగిన ధరలతో రైతులపై అధికభారం పడుతోంది. ప్రస్తుతం రైతులకు డీఏపీ(డై అమ్మోనియా ఫాస్పేట్) మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీ ఇస్తుండటంతో డీఏపీ ఎరువు ధర అధికారికంగా పెరగలేదు. కానీ ప్రస్తుతం డీఏపీ సరఫరా సక్రమంగా లేదు. డీలర్ల వద్ద అందుబాటులో లేదు. ఒకవేళ డీలర్ వద్ద ఉన్నా డీఏపీ కొనాలంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులు, న్యూట్రియంట్స్, నానో డీఏపీ వంటి వాటిని అంటగడుతున్నా రు. డీఏపీ కొరతను అవకాశంగా తీసుకుని కొందరు డీలర్లు అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు వేసే ముందు దుక్కిలో డీఏపీ చల్లుతారు. లేకుంటే మొదటి విడతగా రైతులు పంటలకు డీఏపీని వేసుకుంటారు. ప్రస్తుతం డీఏపీ దొరకక పోవటంతో అధిక ధరకు కాంప్లెక్స్ ఎరువులు కొనా ల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యూ రియా మాదిరిగానే డీఏపీని కూడా ఫర్టిలైజర్ యాప్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.డీఏపీ దొరకటం లేదు. మిగతా ఎరువులు ధర భారీగా పెంచారు. గతేడాది రూ.1350కు కొన్నటువంటి 20:20 బస్తా ధర ఇప్పుడు రూ. 2150కు పెంచారు. గతేడాదితో పోల్చుకుంటే ఎకరాకు రూ.3వేలకు పైగా ఖర్చు పెరుగుతుంది. – గాదె ప్రభాకర్రెడ్డి, రైతుఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెంచారు. బస్తాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. డీఏపీకి ధర పెంచలేదని చెబుతున్నా, అది దొరకట్లే. యూరియా లాగే డీఏపీని కూడా ఆన్లైన్ బుకింగ్తో అందిస్తే కొంత భారం తగ్గుతుంది. – దౌపాటి శ్రీనివాసరావు, రైతు -
మిథిలా స్టేడియంలో..
నిత్యకల్యాణ వేదిక భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో భక్తుల ఆర్జిత సేవలకు, దర్శనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇతర చోట్ల జరుగుతున్న దేవస్థానం అభివృద్ధిలో బాలాలయంలో మూలమూర్తులను తరలించి నిర్మాణ పనులు చేస్తుండటంతో భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకావడంలేదు. భద్రగిరి క్షేత్రంలో భక్త రామదాసు నిర్మించిన అంతరాలయాన్ని, మూలమూర్తులను అదే రీతిన ఉంచి నిర్మాణం జరపాలని భావించటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని ఆళ్వార్లు, ఉపాలయాల మూలమూర్తులను అంతరాలయంలో ఉంచటంతో, అంతరాలయంలో జరిగే పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. వెండి వాకిలి వద్దనే ఇతర పూజలు జరుగుతున్నాయి. పనులు ముమ్మరమైతే వీటిని సైతం త్వరలో నిలిపివేసే పరిస్థితి నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే నిత్యకల్యాణ వేదికను సైతం మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా.. సదరు కాంట్రాక్టర్ ప్రారంభించటంలో అలసత్వం వహించారు. రెండు రోజుల క్రితం భద్రాచలంలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కాంట్రాక్టర్, ఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యకల్యాణాలను మిథిలా స్టేడియంలో ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆ పనులను ఎట్టకేలకు కాంట్రాక్టర్ ప్రారంభించారు. స్టేడియంలో కల్యాణ వేదిక ఎదురుగా మట్టి తీసే పనులు నడుస్తున్నాయి. ఇక్కడే తాత్కాలిక నిత్యకల్యాణ వేదిక ఏర్పాటు కానుంది. ఇందుకు సుమారు రూ. 15 లక్షల వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ ద్వారం నుంచి వచ్చి.. ఉత్తర ద్వారం నుంచి వెళ్లేలా.. ఉత్తరం, దక్షణ దిక్కులలో కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక ఆలయ ప్రాంగణంలో ఇతర పనులను ప్రారంభించనున్నారు. దీంతో భక్తుల రాకపోకలకు, దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లడ్డూ కౌంటర్లు ఉన్న తూర్పు మెట్లను దర్శనం అనంతరం బయటికి వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. మూడు వైపులా పనులను ప్రారంభించిన నేపథ్యంలో తూర్పు మెట్లనే దర్శనానికి ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అంతరాలయానికి దక్షిణ ద్వారం గుండా వచ్చి స్వామి వారి దర్శనం అనంతరం ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చి తూర్పు మెట్ల మీదుగా బయటికి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులను సైతం త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో ప్రారంభించి, వేగంగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా లడ్డూ కౌంటర్లు ప్రస్తుతానికి యథా స్థానంలోనే ఉండనున్నాయి. చిత్రకూట మండపంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు పరిస్థితులు పోవాలని దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శ్రీరామాత్మక వరుణ యాగం జరి పారు. ఈ సందర్భంగా బేడా మండపంలో కొలువై ఉన్న నిత్య కల్యాణ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో ఆలయంలో, గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. ‘పోలీస్ అక్క’ విధులపై అవగాహనకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో అమలు చేయనున్న ‘పోలీస్ అక్క’విధులపై మహిళా పోలీసు సిబ్బందికి ఎస్పీ రోహిత్రాజు అవగాహన కల్పించారు. శనివా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు పోలీస్ అక్కగా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, ఈవ్ టీజింగ్, బాల్య వివా హాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని కల్పించాలని సూ చించారు. పోలీస్ అక్క కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షీటీం ఎస్హెచ్ఓ రమాదేవి పాల్గొన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహంఏపీఓ డేవిడ్ రాజ్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని భద్రగిరి మార్ట్ ద్వారా సేంద్రియ (ఆర్గానిక్), అటవీ ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేసి ప్రోత్సహిస్తామని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్ తెలిపారు. ఏపీలోని ఎటపాక మండలం కొత్తూరు నారాయణపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సాగు చేస్తున్న బ్లాక్ రైస్ (నల్ల బియ్యం) పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రగిరి మార్ట్లో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబా టులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే రైతులు, మహిళా సంఘాల నుంచి నేరుగా బ్లాక్ రైస్తో పాటు ఇతర ఆర్గానిక్ ధా న్యాలు, స్వచ్ఛమైన పాలు, నెయ్యి, తేనె, నిల్వ పచ్చళ్లు, మిల్లెట్ ఉత్పత్తులను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఏపీఓ భాస్కరరావు, జీసీసీ మేనేజర్ జయరాజ్, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఇంటింటా తొలి ఏకాదశి
పాల్వంచరూరల్: ఇంటింటా తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుని ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు తరలివెళ్లారు. తులసీ దళాలు, కొబ్బరికాయలు, పూలతో దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామాల్లో రైతులు ప్రత్యేకంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఆలయాలను దర్శించుకుని వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కజొన్న పేలాలతో పిండిని తయారు చేసి ప్రసాదంగా స్వీకరించారు. అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కలశాభిషేకం, స్వామివారికి వరుణయాగ పూజలు నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అర్చకులు అష్టోత్తర కలశ పూజలు చేశారు. శివాలయంలో శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి ఘటాభిషేకం (వరుణయాగం) పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ విజయ్కుమార్, అర్చకుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు. -
సర్పంచ్ మృతిపై నిరసన
భద్రాచలంఅర్బన్: మహిళా సర్పంచ్ మృతికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేసిన వైద్యం వికటించడమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ (36) శుక్రవారం మృతి చెందగా మృతదేహాన్ని అంబులెన్స్లో భద్రాచలం తీసుకుని వచ్చి సదరు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగిన విషయం విదితమే. కాగా, శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. కాగా, ఆస్పత్రి వైద్యులు మృతురాలి బంధువులకు సమాధానం చెప్పకపోగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని.. మృతురాలి బంధువులతో పాటు సీపీఐ నాయకులు మండిపడ్డారు. వెంటనే వైద్యుడు బయటకు రావాలని, బాధితురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి, మృతురాలి పిల్లలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. డాక్టర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో మృతురాలి భర్త ప్రేమ్కుమార్ ఆస్పత్రి వెనుక వైపు నుంచి లోపలికి చొచ్చుకుని వెళ్లి రెసెప్షన్ కౌంటర్పై పెట్రోల్ ప్యా కెట్లు విసిరి లైటర్తో నిప్పు అంటించాడు. అక్కడే ఉన్న ఆస్పత్రి నిర్వాహకులు, సిబ్బంది ప్రేమ్కుమార్ను బయటకు పంపించారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం మార్చురీలో ఉన్న సోడే వెంకటరమణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు పాల్వంచకు తరలించారు. పెట్రోల్ ప్యాకెట్లు విసిరి, నిప్పంటించిన మృతురాలి భర్త -
సౌర వనరులను సద్వినియోగం చేసుకుందాం
బోనకల్: అపరిమితంగా ఉన్న సౌర వనరు లను సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యత అని రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ముషార్రఫ్ ఫరూఖీ అన్నారు. మోడల్ సోలార్ ప్రాజెక్టు పనులను బోనకల్లో శనివారం ఆయన టీజీ ఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి పరిశీలించారు. మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాల్లోని ఇళ్లు, పొలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లను పరిశీలించాక బోనకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముషార్రఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 81 గ్రామాల్లో రూ.వేయి కోట్ల వ్యయంతో మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరరగడం, విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తున్న బొగ్గు వనరులు పరిమితమైనందున పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇళ్లు, పొలాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని కోరారు. దీంతో కుటుంబాలు విద్యుత్ అవసరాలు తీరడమే కాక అదనపు విద్యుత్ను గ్రిడ్కు అందించి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశంతో ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయగా.. మోడల్గా ఎంపిక చేసిన అన్ని గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి పనులు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు రాజుచౌహాన్, మల్లికార్జున్, ఈ.శ్రీనివాసాచారి, బండి శ్రీనివాసరావు, వై.వీ ఆనంద్కుమార్, మనోహర్ పాల్గొన్నారు. ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం సీఎండీ, రెడ్ కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ దివాకర స్వాగతం పలకగా.. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ, మౌలిక సదుపాయాల బలోపేతం, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. పాల్వంచ: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టి.. డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఒకరు గాయపడ్డారు. స్థానిక బీసీఎంరోడ్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఎదురుగా వస్తున్న టీవీఎస్ మోపెడ్ను కంకరలోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టి, డ్రెయినేజీలోకి దూసుకెళ్లి ఆగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి గాయపడగా.. మోటార్ సైకిల్ లారీ టైర్ల కిందపడి నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుడిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఆటో బోల్తా.. ఒకరికి గాయాలుటేకులపల్లి: ఆటో బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. సింగరేణి మండలం నుంచి టేకులపల్లి వారసంతకు కూరగాయలు విక్రయించేందుకు కొందరు వ్యాపారులు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో మండలంలో ని తొమ్మిదోమైలుతండా పంచాయతీ సాయన్నపేట మూలమలుపు వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురు ప్రయాణికు ల్లో అజ్మీర పద్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 ద్వారా ఇల్లెందు ఏరి యా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక చికిత్స అందించిన 108 సిబ్బంది సునీత, నాగేశ్వరరావును స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు. -
బొగ్గు రవాణా పెంచేలా ప్రణాళిక
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సీహెచ్పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తుండగా, దీన్ని మరింత పెంచేలా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ ట్రాఫిక్) అబ్దుల్ రెహమాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐఆర్టీఎస్ ఈడీ బి.వెంకన్న, ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్తో కలిసి సీహెచ్పీలోని సైలోబంకర్, రైల్వే లోడింగ్ పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించి సామర్థ్యం పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు డి.నరేంద్రవర్మ, ఎన్వీఆర్.ప్రహ్లాద్, కె.సోమశేఖరరావు, బొల్లం శ్రీనివాస్, సాయినాధ, ఎ.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలో శనివారం భారీగా గంజాయి పట్టుబడింది. కూనవరం రోడ్డు లోని వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలను ఖమ్మం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి వెల్లడించారు. జిల్లా డిప్యూటీ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికా రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా, వేగంగా వెళ్తున్న కారు (జేఏ03 ఏఆర్5892)ను ఆపి తనిఖీ చేశారు. ఆరు బ్యాగుల్లో 101 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన సత్తిపాపా, హర్బజ్ హుస్సేన్, గుల్జార్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజేంద్రప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.50.50 లక్షల విలువైన గంజాయి, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని కమిషనర్ వివరించారు. తనిఖీల్లో సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీం, సీతారాం, సిబ్బంది భద్రం, రాకేశ్, రవికుమార్ పాల్గొన్నారు. పాల్వంచలో.. పాల్వంచ: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని వనమాకాలనీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాదాస్పదంగా వె వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో 3.100 కేజీల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలంగాణానగర్కు చెందిన ముగితి హేమంత్, సానబోయిన శ్రావణ్కుమార్గా గుర్తించారు. మోటార్ సైకిల్తో పాటు సెల్ఫోన్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేశారు. నలుగురి అరెస్ట్ -
●వీరయ్యా... అదిరిందయ్యా!
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం నాగారం వాసి తిర్లకుండ వీరయ్య కుటుంబ వారసత్వంగా కుండలు చేసినా ఆదరణ లేక అమ్మకాలు జరగక పూట గడవడం కష్టమైంది. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి సారించిన ఆయన అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు! వీరయ్యకు ద్విచక్రవాహనం ఉండగా.. రెండు చక్రాలతో తోపుడుబండి మాదిరిగా చేయించి ట్రాక్టర్ ట్రక్ తరహాలో దానికి అమర్చాడు. దీనిపై కట్టెల పొయ్యి పెట్టి పాత్రలో స్వీట్ కార్న్, కంకులు ఉడకబెడుతూ ఊరు రా తిరిగి విక్రయిన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి కంకులు విక్రయిస్తే ఖర్చులు పోగా రోజుకు రూ.500 నుంచి రూ.600 మిగులుతున్నాయని వీరయ్య తెలిపారు. -
విద్యుత్పైనా ఎల్నినో ప్రభావం
● అప్రమత్తతతో డిమాండ్ను అధిగమించడం భేష్ ● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మణుగూరుటౌన్/రుద్రంపూర్: ‘రాష్ట్రంలో వానాకాలం 11 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం సర్వసాధారణం. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వేసవి మాదిరిగా అది 16 వేల మెగావాట్ల డిమాండ్ నమోదవుతోంది. ఆశించిన స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి లేకున్నా సింగరేణి, జెన్కో సంస్థలు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా డిమాండ్ను అధిగమించడం అభినందనీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, కలెక్టర్ అంకిత్, పినపాక, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్నాయక్తో కలిసి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ల పనితీరును ఆయన పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణా లు, నిర్వహణ వ్యవస్థలపై ఆరా తీశారు. అంతకుముందు కొత్తగూడెంలో సింగరేణి, జెన్కో అధికారులతో భట్టి సమావేశమై మాట్లాడారు. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పదేళ్ల క్రితమే బొగ్గు గనుల ఏర్పాటుకు సిద్ధం కావాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ఫలితంగా ఇప్పు డు బొగ్గు అందుబాటులో లేక ఒత్తిడి వస్తోందని తెలిపారు. అయితే, విద్యుత్ శాఖ, సింగరేణి సమన్వయంతో ముందుకు సాగుతుండడంతో సమస్య రాలేదన్నారు. ఈ మేరకు రానున్న 20 ఏళ్లలో బొగ్గు లోటు లేకుండా సింగరేణి అదనంగా కోల్ బ్లాక్లు తెచ్చుకోవడంతో పాటు దేశంలో ఎక్కడ వేలం పెట్టినా పాల్గొనాలని ఆదేశించామని భట్టి తెలిపారు. సింగరేణి ప్రయోజనాలకే ప్రాధాన్యత రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నుముకలా నిలుస్తున్న సింగరేణి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మణుగూరులోని పీకేఓసీ–2ను సింగరేణి, జెన్కో సీఎండీలు బుద్ధప్రకాశ్ జ్యోతి, హరీశ్, కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 1976లో ప్రారంభమైన గని చరిత్ర, బొగ్గు వివరాలను జీఎం దుర్గం రాంచందర్ వివరించారు. మణుగూరు మనుగడ దృష్ట్యా పీకేఓసీ డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించేలా చొరవచూపాలని అధికారులు కోరా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లోని అన్ని బ్లాకులు సింగరేణికి రావాలనేదే ప్రభు త్వ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, అజయ్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, కార్పొరేట్ జీఎం వెంకటరమణ, అధికారులు వెంకట రామారావు, రమేశ్, రాంబాబు, మదన్నాయక్, శ్రీనివాసచారి, దయాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నిరసన ●మణుగూరుటౌన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీకేఓసీ వ్యూ పాయింట్ వద్ద డీప్సైడ్ బ్లాక్ ఆవశ్యకతను వివరించేందుకు రెండు రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు వేచి ఉండగా, మధ్యాహ్నం 3.30 గంటల సమయాన తొలుత వ్యూ పాయింట్ వద్దకు వెళ్తున్న కాన్వాయ్ను వెనక్కి మళ్లించిన అధికారులు కోల్ బెంచ్ వద్దకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా కార్మిక సంఘాలను కలవకుండానే వెనుదిరిగారు. దీంతో ఇరు యూనియన్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీతో పాటు ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణికే మణుగూరు ఓసీ డిప్ సైడ్ బ్లాక్ కేటాయించాలని నినాదాలు చేయడం విశేషం. పినపాక: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క బీటీపీఎస్ టౌన్షిప్లోని డీఏవీ హైస్కూ ల్ను శుక్రవారం ఉదయం ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నాయకులు, విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకోగా.. ఐదు గంటల ఆలస్యంతో మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుని ప్రారంభించి వెళ్లిపోయా రు. ఐదు గంటలు నిరీక్షిస్తే పది నిమిషాల్లో పర్యటన ముగించుకుని వెళ్లడం గమనార్హం. కాగా, స్కూల్ను ప్రారంభించాక చిన్నారులతో భట్టి మాట్లాడారు. -
పంటల్లో యాజమాన్య పద్ధతులే కీలకం
బోనకల్: ఎల్నినో దృష్ట్యా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యాన రైతులు పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నాగస్వాతి సూచించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలువురు రైతుల పంటలను పరిశీలించి సూచనలు చేశారు. రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును ఈ నెలాఖరు వరకు పోసుకోవచ్చని, నాట్లు వేసే వారం ముందు ఎకరాకు సరిపోయే వరి మడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలని తెలిపారు. అలాగే, పత్తికి రసం పీల్చే పురుగు, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పిండినల్లి ఆశిస్తున్నందున ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిట్రోనిల్ 1.5 మి.లీ.ను లీటర్ నీటికి కలపడంతో పాటు 19 –19–19.. 5 గ్రా. లేదా యూరియా 2 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, రాగి, నూనె గింజలు సాగు చేస్తే వాతావరణ పరిస్థితులను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో మెరుగైన ఫలితం
జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రతీ రైతు భూసార పరీక్ష చేయించి వచ్చే నివేదిక ఆధారంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని హైదరాబాద్లోని భారతీయ వరి పరి శోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కవిరాజు, హైదరా బాద్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) నిపుణురాలు అరుంధతి సూచించారు. జూలూరుపాడు, చండ్రుగొండ మండలం గానుగపాడులో శుక్రవా రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు పలువురు రైతుల భూమిలో పరీక్షలు చేసి లోపాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతేకాక రైతులకు ఉచితంగా మట్టి నమూనాల పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. కాగా, వరి సాగుచేసే రైతులు కరివేద విధానం పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందొచ్చని చెప్పా రు. ఈకార్యక్రమాల్లో సొసైటీల చైర్మన్లు కొమ్మినేని పాండురంగారావు, చెవుల చందర్రావు, సీఈఓలు శివ, లంకా నర్సింహారావు, డైరెక్టర్లు రెడ్డిబోయిన రాము, లకావత్ హేమ్లా, భూక్యా జవహర్లాల్, శీరంశెట్టి రామారావు, పాపిన్ని వెంకయ్య, మనుబోలు తిరువెంగళరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఎల్నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీసీకి అదనపు కలెక్టర్ విద్యాచందన హాజరుకాగా.. ఆ ఆతర్వాత ఆమె అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ)పై స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈ నళిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు -
ముగిసిన జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు
అశ్వాపురం: మండల కేంద్రంలోని భారజల కర్మాగారం అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయమైన గౌతమీనగర్ కాలనీలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. భారజల కర్మాగారంలోని ఒడిశాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో ఏర్పడిన ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు పూజలు చేశాక గుండి చాగర్ నుంచి ఉత్కల్ పతాగర్ మండపానికి రథంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తుల జగన్నాథ నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో భారజల కర్మాగారం ఉద్యోగులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రంగు రంగుల సర్పం జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు సమీపాన అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ వింత సర్పా న్ని గుర్తించారు. భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధి పంతులు తండాకు చెందిన రైతు ఆంగోత్ సూంకల్యా పొలానికి వెళ్లగా, మధ్యాహ్నం వేళ నీటి కోసం గుట్టపై ఉన్న శ్రీసోమన్న స్వామి ఆలయం వద్ద సెల యేరుకు బయలుదేరారు. ఈ క్రమాన మార్గమధ్యలో రంగుల్లో ఉన్న పాము కనిపించగా ఫోన్ లో ఫొటో తీశారు. సుమారు రెండు అడుగుల పొడవైన ఈ పామును గతంలో ఎన్నడూ చూడలేదని సదరు రైతు వెల్లడించాడు. ఆర్సీఓపై చర్యలు తీసుకోవాలి ఖమ్మంసహకారనగర్: జ్యోతిబాపూలే గురుకులాల ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్సీఓ తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ, ఉపాధ్యాయులను వేధిస్తుండడమే కాక ప్రిన్సిపాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినందున విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు బానోతు రాందాస్, ధర్మసోత్ నాగేశ్వరరావు, ఉద్దండ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఖమ్మం విద్యార్థిని ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: నగరంలోని బల్లేపల్లికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. బల్లేపల్లికి చెందిన యామ మానస (20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ఆమె శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి స్వరూపారాణి బల్లేపల్లిలో గ్రామదీపికగా పనిచేస్తుండగా, తండ్రి ఖాసీం ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మానస మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
మా రామయ్య.. బంగారం!
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. మూలమూర్తులను దాతలు సమర్పించిన స్వర్ణకవచాలతో ప్రతీ శుక్రవారం అలంకరిస్తారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి కి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతంతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్కు అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ రాఘవచార్యుల దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే, జగన్నాథపురం గ్రామానికి చెందిన బానోతు కోట్యి – సాలి దంపతులు అమ్మవారి అలంకరణ కోసం రూ.98వేల విలువైన బంగారు ముక్కెరను ఈఓకు అందజేశారు. కాలేజీలో ప్రవేశాలు, హాజరుపై దృష్టిదుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రవేశాలు పెంచడమే కాక విద్యార్థులంతా హాజరయ్యేలా అధ్యాపకులు దృష్టి సారించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హెచ్.వెంకటేశ్వరరావు సూచించారు. దుమ్ముగూడెం కాలేజీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు. కాలేజీల్లో నాణ్యమైన బోధనతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుపై ప్రచారం చేస్తూ ప్రవేశాలు పెంచాలని తెలిపారు. అంతేకాక చేరిన ప్రతీ విద్యార్థి వివరాలు యూ డైస్లో నమోదు చేసి క్రమం తప్ప క హాజరయ్యేలా చూడాలని చెప్పారు. ఆతర్వా త విద్యార్థులతో మాట్లాడిన డీఐఈఓ క్రమం తప్పకుండా కళాశాలకు వస్తూ పాఠ్యాంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపాల్ సీహెచ్.కృష్ణవేణి, అధ్యాపకులు వరరాజు,పవన్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెన్సింగ్ నార్కే పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇచ్చే టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారానికి సాహస క్రీడారంగంలో ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో సాహస క్రీడల రంగంలో విశేష ప్రతిభ చూపిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో https: awards. gov. in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పర్వతారోహణ, రాక్ క్లైంంబింగ్, ట్రెక్కింగ్, నదీ, సముద్ర సాహస క్రీడలు, పారా గ్లైౖడింగ్, స్కైడైవింగ్ తదితర సాహస క్రీడల్లో విశేష విజయాలు సాధించిన వారు అర్హులని డీవైఎస్ఓ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. -
హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే..
కామేపల్లి: సైద్ధాంతిక పునాదులపై పనిచేసే కమ్యూనిస్టులే ప్రజల సంక్షేమం, హక్కుల కోసం పోరాడుతున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కామేపల్లి, కారేపల్లి మండలాల సీపీఐ సభ్యుల శిక్షణా తరగతులు శుక్రవారం ఊట్కూరులో నిర్వహించగా ఆయన మాట్లాడారు. పార్టీ సభ్యులు నిరంతరం రాజకీయ, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపట్టాలని సూచించారు. ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్న పాలకుల తీరును ఎండగట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినందున వారి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమైందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సీపీఐ జిల్లా, మండల కార్యదర్శులు దండి సురేశ్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పాపినేని సత్యనారాయణ, నాయకులు ఏపూరి లతాదేవి, ఏపూరి వెంకటేశ్వరరావు, హన్మంతరావు, సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రామాలయ ఉద్యోగి మృతి
సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొట్టడంతో ఘటన భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం రికార్డ్ అసిస్టెంట్ కటకాల రామిరెడ్డి (47) శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని ఎటపాక మండలం నెల్లి పాక జంక్షన్ వద్ద రామిరెడ్డి ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతుండగా సీఆర్పీఎఫ్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కింద పడి స్పృహ కోల్పోయిన ఆయనను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఏపీలోని పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలం కొట్టారుగొమ్ము గ్రామానికి చెందిన రామిరెడ్డి 2013లో భద్రాచలం దేవస్థానంలో ఉద్యోగిగా చేరాడు. అప్పటి నుంచి భద్రాచలంలో నివాసం ఉంటున్నా ఏడాది క్రితం పోలవరం ప్యాకేజీ వస్తుందనే సమాచారంతో ఎటపాక మండలం రామగోపాలపురంలో ఉంటూభద్రాచలానికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమా న శుక్రవారం కూడా వచ్చి తిరిగివెళ్తూ మృత్యువాత పడ్డాడు. ఆయన మృతిపై ఆలయ ఈఓ కె.దామోదర్రావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం తెలిసి కుటుంబీకులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ..ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటీఐ కళాశాల వద్ద శుక్రవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగు నరేశ్ (45) మృతి చెందాడు. ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నరేశ్ను వెనుకగా వేగంగా వచ్చిన లారీ నేరుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని సీఐ సురేశ్ సందర్శించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతున్న సర్పంచ్ మృతిమృతదేహంతో భద్రాచలంలో ఆందోళన పాల్వంచరూరల్/భద్రాచలం అర్బన్: కుడి కాలికి వాపు రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన మహిళా సర్పంచ్ పరిస్థితి విషమించి మృతిచెందింది. సర్పంచ్ భర్త ప్రేమ్కుమార్ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్రావు ఆస్పత్రిలో చేర్పించారు. ఇన్ఫెక్షన్ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్కుమార్.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు. -
రామయ్య భూములకు రక్షణ!
● ఇళ్ల నిర్మాణాలు, విక్రయాల కట్టడిపై దృష్టి ● తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటనలో చర్చభద్రాచలం: ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం భూముల రక్షణ కోసం త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తుంది. ఈ అంశాన్ని గురువారం భద్రాచలం వచ్చిన శాఖ కమిషనర్ హన్మంతరావు సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో కమిటీలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోగా... దేవస్థానం భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అంతటితో ఆగకుండా అక్రమ నిర్మాణదారులు వాటిని విక్రయానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యాన మరో కమిటీ వేసి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించారు. పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఇటీవల పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు జోరందుకుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు సైతం కొద్ది రోజుల క్రితం సర్వే నిర్వహించారు. కొత్తగా 80కు పైగా నిర్మాణాలను జరిగాయని గుర్తించారు. వీరితో పాటుగా గతంలో ఉన్న వారికి సైతం దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ఆ భూముల్లో నిర్మించిన ఓ ఇంటినివిక్రయానికి పెట్టడం, అందుకు సంబంధించి ప్రకటన దినపత్రికలో ఇవ్వడం చర్చకు దారి తీసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాక అమ్ముతుండడం దేవస్థానం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని కమిషనర్ హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఈఓను ఆదేశించారు. పేపర్ ప్రకటన ఆధారంగా క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సూచించారు. ఇదిలాగే కొనసాగితే పురుషోత్తపట్నంలో రామయ్య భూములు వదులుకోవాల్సిన పరిస్థితి రానున్నందున దేవాదాయ శాఖ అలసత్వం విడనాడాలని భక్తులు కోరుతున్నారు. కమిటీల ఏర్పాటుతో కాలక్షేపమే దేవస్థానం తెలంగాణలో ఉండడం, రామయ్య భూములు ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో అంతరాష్ట్ర సమస్యగా మారింది. దీనికి తోడు భూముల తమవంటే తమవని ఇటు దేవస్థానం, ఆటు రైతులు వాదిస్తుండడంతో ఎటూ తెగడం లేదు. ఈక్రమాన తెలంగాణ, ఏపీకు చెందిన పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి రెండేళ్లు దాటినా ముందడుగు పడలేదు. ఇటీవల అక్రమ నిర్మాణాలను గుర్తించిన దేవస్థానం అధికారులు వాటిని తొలగించేందుకు ఏపీకి చెందిన రెవెన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారాలను కోరారు. దీంతో వారు దేవస్థానం అధికారులను బుజ్జగించి ఏపీ తరఫున కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ కమిటీతో కూడా ఫలితం లేదు. ఇలా కమిటీల ఏర్పాటు చేస్తుండగానే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీ అధికారుల సహకారం లేకుండా తెలంగాణ దేవాదాయ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. స్నేహపూర్వకంగానే.. రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపితేనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయ శాఖ, రెవిన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు బృందంగా ఏపీలో పర్యటిస్తామని వెల్లడించినందున మరోమారు ఆశలు చిగురిస్తున్నాయి.పురుషోత్తపట్నంలో రామాలయ భూముల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. ఏపీకు చెందిన వివిధ శాఖల అధికారుల సహకారం కోరాం. అయితే, వారి నుంచి స్పందన రాలేదు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణాలు చేపట్టిన, విక్రయాలకు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలకు ఫిర్యాదు చేయనున్నాం. – దామోదర్రావు, ఈఓ, రామాలయం -
‘రెమిడియేషన్’ భరోసా..
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో కనీస నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కింద ‘రెమిడియేషన్’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మరింత పటిష్ఠంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. వెనుకబడిన విద్యార్థులకు చేయూత.. తరగతి గదిలో అందరు పిల్లల గ్రహణ శక్తి ఒకేలా ఉండదు. కొందరు ఇంటి వద్ద సరైన ప్రోత్సాహం లేక, హాజరుశాతం తక్కువగా ఉండడం లేదా గతంలో చెప్పిన పాఠాలు అర్థం కాకో చదువులో వెనుకబడుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించి ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడమే ఈ ‘రెమిడియేషన్’ ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల లోపాలను ప్రారంభ దశలోనే సరిదిద్దేందుకు ఉపా ధ్యాయులు ప్రతి రోజూ ఒక గంట సమయం కేటాయించి, వ్యక్తిగత శ్రద్ధతో లక్ష్యాధారిత బోధన సాగించనున్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ‘బేస్లైన్’ పరీక్ష ఆధారంగా కూడా వెనుకబడిన విద్యార్థులను గుర్తించనున్నారు. రోజుకొక సబ్జెక్టు విద్యార్థులపై నేర్చుకునే వేగం విషయంలో ఎలాంటి ఒత్తిడి పడకుండా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఓ ప్రత్యేక విద్యా క్యాలెండర్ రూపొందించింది. దీని ప్రకారం సాధారణ బోధనతో పాటు, ప్రత్యేకంగా కేటాయించిన సమయంలో వారంవారీగా ప్రణాళిక అమలు చేస్తారు. సోమ, మంగళవారాల్లో తెలుగు భాషపై, బుధ, గురువారాల్లో గణితంపై, శుక్ర, శనివారాల్లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ప్రతి చిన్నారీ తమ నైపుణ్యం అనుగుణంగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తారు. చివరి దశకు చేరిన శిక్షణ ఈ బృహత్తర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీగా ఉపాధ్యాయులకు, సీఆర్పీలకు దశలవారీగా శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లోని టీజీఐఈఆర్డీలో ఈ నెల 6, 7, 8వ తేదీల్లో, జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో మొత్తం 90 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. ఆపై 21 నుంచి 23వ తేదీ వరకు మొదటి విడతలో కొన్ని మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తికాగా.. 24 నుంచి 26వ తేదీ వరకు రెండో విడతలో మిగతా మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగతోంది.బడి పిల్లల భవితకు కార్యక్రమం జిల్లాలోని ఏ ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడకూడదనేదే విద్యాశాఖ ప్రధాన లక్ష్యం. గ్రామీణ నేపథ్యాల వల్ల కొందరు విద్యార్థుల్లో వెనుకబాటుతనం కనిపిస్తోంది. దాన్ని అధిగమించేందుకే ఈ రెమిడియేషన్ విధానం. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రతి రోజూ కేటాయించిన ఒక గంట సమయంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి పంపించడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. –టి.మాధవరావు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి -
ఆ ఒక్కటీ అడక్కు..
కొండలా బకాయిలు టీజీ జెన్కో ఆధ్వర్యాన కేటీపీఎస్ (కొత్తగూడెం), బీటీపీఎస్ (మణుగూరు), కేటీపీపీ (భూపాలపల్లి), వైటీపీసీ (నల్లగొండ, దామరచర్ల) వంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఏటా ఈ కేంద్రాలకు లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. కానీ, ఇందుకు సంబంధించిన బిల్లులను సకాలంలో జెన్కో చెల్లించడం లేదు. ఫలితంగా గతేడాది డిసెంబర్ నాటికే బకాయిలు రూ.18,828 కోట్లకు చేరాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్ను టీజీపీసీసీకు అమ్ముతోంది. ఇక్కడి నుంచి కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో మొత్తం బకాయిలు రూ.27,328 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.46,206 కోట్లకు చేరుకున్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఏడు నెలలుగా.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఈ ఏడాది జనవరి చివరి వారంలో కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీజీపీసీసీ, టీజీజెన్కో నుంచి రావాల్సిన బకాయిలు తొందరగా వసూలు చేసుకోవాలని, ఇందుకోసం కొంత సడలింపు ఇచ్చయినా ఏకమొత్తంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత బకాయిల అంశంపై సింగరేణిలో యాక్టివ్గా ఉన్న కార్మిక సంఘాలు ఏప్రిల్ 28న హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ఎదుట ధర్నా నిర్వహించాయి. జూన్లో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్రావు సింగరేణిలోని ప్రతీ ఏరియాలో పర్యటించిన సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన జెన్కో – సింగరేణి ఉన్నతాధికారుల సంయుక్త సమీక్షలో బకాయిల అంశానికి ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం కార్మిక లోకంలో ఏర్పడింది. రెండు శాఖలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వర్తిస్తుండడంతో ఫలితం ఆశాజనకంగా ఉంటుందని భావించారు. అదొక్కటి మినహాయించి పనితీరు మెరుగు పర్చుకోకపోతే బీఎస్ఎన్ఎల్ తరహాలో సింగరేణి చిక్కుల్లో పడుతుందని అధికారుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాబోయే కాలానికి తగ్గట్టుగా బొగ్గుతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలని.. హైడల్, బ్యాటరీ స్టోరేజీ పవర్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపనపై దృష్టి సారించాలని తెలిపారు. ఇలా అనేక విషయాలపై కార్యాచరణ సిద్ధం చేసినా కీలకమైన బకాయిల అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్టు సమాచారం. సింగరేణికి జెన్కో చెల్లించాల్సిన బకాయిల విషయంపై అటు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీ జెన్కో సీఎండీ హరీశ్ కానీ ఇటు సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు, ఇతర డైరెక్టర్లు చర్చకు తీసుకురానట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రెస్నోట్లోనూ ఈ అంశంపై కనీస ప్రస్తావన లేదా వివరణ కానీ లేకపోవడం గమనార్హం. పంప్డ్ స్టోరేజీ హైడల్, రాజస్థాన్లో సోలార్ పవర్, జైపూర్లో పవర్ ప్లాంట్ విస్తరణ, బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలో ఇప్పటికే సింగరేణి తరఫున డీపీఆర్లు సిద్ధమయ్యాయి. బొగ్గు సరఫరాలో నాణ్యత పెంచాలంటే ముఖ్యమైన గనుల వద్ద కోల్ వాషరీ ప్లాంట్లు స్థాపించాల్సి ఉంటుంది. వీటికి కనీసం రూ.12కోట్ల వరకు వ్యయం అవుతుంది. కానీ, సరిపడా నిధులు లేకపోవడం, బకాయిలు వసూలు కాకపోవడంతో గతంలో ఆమోదించిన పనులు ముందుకు సాగడం లేదనేది సంస్థలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఫలితంగా ఇప్పుడు సూచించిన కొత్త పనులు ఎలా తలకెత్తుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తెలంగాణకు సింగరేణి ఆత్మ వంటిందని చెబుతూనే.. ఆ ఆత్మకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి గనులను పరిశీలించడమేకాక సింగరేణి, టీజీ జెన్కో ఉన్నతాధికారులతో సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బొగ్గు ఉత్పత్తి పెంపు, నాణ్యత, పోటీ నేపథ్యాన మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు చేసినా.. బకాయిల అంశానికి కనీస స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం ఈ సందేహాలకు బలాన్ని ఇస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు
● నీటి ఎద్దడిని తట్టుకునే రకాల ఎంపిక మేలు ● ఖమ్మం ఇన్చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ ఖమ్మంవ్యవసాయం: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందుకోసం అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, తక్కువ నీటి వినియోగం, సాగు ఖర్చు తక్కువ కలిగి నీటి ఎద్దడి తట్టుకునే కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు మంచిదని జిల్లా ఇన్చార్జ్ ఉద్యాన అధికారి అనితశ్రీ వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆమె వెల్లడించిన వివరాలు.. రైతులు తీసుకోవాల్సిన చర్యలు వర్షాలు స్థిరంగా వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలి. తక్కువ కాలంలో పండే, కరువును తట్టుకునే పంటలు ఎంచుకోవాలి. పత్తి, మొక్కజొన్నతో పాటు కంది, పెసర, మినుము, కొర్ర, సజ్జ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. అలాగే, అంతర పంటలు సాగు చేస్తూ, కలుపు నివారణ, మల్చింగ్ ద్వారా నేల తేమను సంరక్షించాలి. వర్షపు నీటి నిల్వలకు ఫామ్ పాండ్లు తవ్వించాలి. యాజమాన్య చర్యలు నల్ల రేగడి నేలల్లో తేమ సంరక్షణ కోసం 120 సెం.మీ. వెడల్పుతో బోదెలు, 60 సెం.మీ. వెడల్పు, 30 సెం.మీ. లోతు కాల్వలు ఏర్పాటు చేయాలి. మధ్యస్థ లేదా తేలికపాటి నేలల్లో బోదెలు, కాల్వల పద్ధతులు అనుసరించాలి. కలుపు నియంత్రణ, నేల తేమ సంరక్షణ కోసం తరచూ అంతర దుక్కులు చేయాలి. వర్షాల సమయాన సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేయాలి. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో 2 లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 2–3 సార్లు పిచికారీ చేయాలి. వర్షాభావంలో కూరగాయల సాగు వర్షాభావ పరిస్థితులలో కూరగాయ పంటలు సాగుచేయడం మేలు. టమాటా, వంగ, బెండ, చిక్కుళ్లు, పాలకూర, తోటకూర, మునగ, బీర, సొర, కాకర, దోస, పచ్చి మిర్చి వంటి రకాలు ఈ పరిస్థితిని తట్టుకుంటాయి. ఉద్యానశాఖ రాయితీలు ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నీటిని పొదుపు చేసుకోవచ్చు. ఉద్యాన శాఖ ఎకరాకు రూ.8 వేల సబ్సిడీతో కూడిన మల్చింగ్ అందిస్తోంది. కూరగాయ పందిర్ల సాగుకు 50 శాతం రాయితీపై ఎకరానికి రూ.10 వేల వరకు అందిస్తోంది. డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. అధిక దిగుబడినిచ్చే పండ్ల తోటల రకాల విస్తీర్ణం పెంపకంలో భాగంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ లాంటి తోటలకు 40 శాతం రాయితీ కల్పిస్తోంది. -
భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా బాల
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగార ఉద్యో గ సంఘం అధ్యక్షుడిగా టీఎన్టీయూసీ కూటమికి చెందిన సీహెచ్.బాల ఎన్నికయ్యారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘం ఎన్నికల పోలింగ్ గురువారం జరగగా, శుక్రవారం ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఎన్టీ యూసీ – బీఎంఎస్ కూటమి, టీఆర్టీయూ – సీఐ టీయూ కూటమి, ఐఎన్టీయూసీ ఒంటరిగా పోటీ చేశాయి. టీఎన్టీయూసీ కూటమి నుంచి గౌరవ అధ్యక్షుడిగా మధమంచి వెంకటేశ్, అధ్యక్షుడిగా సీహెచ్.బాల విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా రామ్చంద్ర జైస్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పన్నాలాల్ కుమావత్, కార్యాలయ కార్యదర్శిగా షేక్ హుస్సేన్అలీ, కోశాధికారిగా రాజ య్య ఎన్నికయ్యారు. ఇక సీఐటీయూ – టీఆర్టీయూ కూటమి నుంచి ఉపాధ్యక్షుడిగా యన్నా సుధీర్, సంక్షేమ కార్యదర్శిగా గాదె ఊహశ్రీ విజ యం సాధించారు. ఇక 11 ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను ఎనిమిది టీఎన్టీయూసీ కూటమి, రెండు సీఐటీయూ కూటమి, ఒకటి ఐఎన్టీయూసీ దక్కించుకున్నాయి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని విజేతలు తెలిపారు. -
●బాబా.. ‘వేల’ వందనాలు!
గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ఖమ్మం గాంధీచౌక్లోని వరప్రదాత షిర్డీ సాయి మందిర్లో సాయిబాబాను శుక్రవారం కరెన్సీ నోట్ల మాలలతో అలంకరించారు. తొలుత బాబాకు అన్నాభిషేకం చేశాక అలంకరించగా.. మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన చంఢీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే, రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీకృష్ణసాయి ఆశ్రమంలో గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా చైర్మన్ లగడపాటి రామారావు ఆధ్వర్యంలో చంఢీహోమం నిర్వహించారు. సాయినాథుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం, పుష్పాభిషేకం చేశాక భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. – ఖమ్మంగాంధీచౌక్ -
ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
చుంచుపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు, బాలింతల విషయమై నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేసి పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, ఉద్యోగులతో సమావేశమైన కలెక్టర్.. రోజువారీ ఓపీ, ప్రసవాలు, మందుల లభ్యతపై చర్చించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసమే రీసర్వే పాల్వంచ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం భూముల రీసర్వే చేయిస్తోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచ పరిధి కరకవాగులోని సర్వే నంబర్ 727లో చేపట్టిన సర్వేను గురువారం ఆయన పరిశీలించి సర్వే విధానం, భూముల హద్దుల నిర్ధారణపై అధికారులతో చర్చించారు. ప్రతిరోజూ 40 నుంచి 50 ఎకరాల మేర భూములకు సర్వే చేస్తుండగా, ఇప్పటి వరకు 580 ఎకరాల్లో పూర్తయిందని ఉద్యోగులు తెలిపారు. అయితే, కచ్చితత్వం, పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించిన కలెక్టర్.. రైతులు సహకరించాలని తెలిపారు. తహసీల్దార్ దారా ప్రసాద్, సర్వేయర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు సూపర్బజార్(కొత్తగూడెం): యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ అంకిత్ అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా ఎసైంటియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లాలోని 25 ఎన్సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని సమకూర్చింది. ఇందులో డమ్మీ తుపాకులు తదితర సామగ్రి ఉండగా కలెక్టరేట్లో కలెక్టర్ అందజేసి మాట్లాడారు. ఎన్సీసీ తీర్చిదిద్దిన యువత భవిష్యత్లో పలు రంగాల్లో రాణించడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11వ తెలంగాణ బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
ఎంతో ఊహించా.. ఇంతేనా?!
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, పునర్ధురణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఊహించుకుని వస్తే ఇక్కడ ఆ పరిస్థితి లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు పేర్కొన్నారు. భద్రాచలానికి గురువారం వచ్చిన ఆయన చిత్రకూట మండపంతో పాటు కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులను పరిశీలించారు. మొదలుపెట్టి నెల దాటినా కనీసం పనులు జరగకపోవడంపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నందున, ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నాటికి ఉత్తర దిక్కున పనులు చేపట్టి వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక పుష్కరాల నాటికి మొత్తం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇక నిత్యకల్యాణ వేదిక మార్చాలని సూచించినా తాత్కాలిక వేదిక పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నందున యంత్రాల సంఖ్య పెంచి రాత్రింబవళ్లు పూర్తి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ భద్రాచలంలో అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు కమిషనర్ హన్మంతరావు ఈ సందర్భంగా విలేకరులకు వెల్లడించారు. వారం రోజులకోసారి ఈఓ ఆధ్వర్యాన పునరుద్ధరణ కమిటీ సమావేశం, 15 రోజులకోసారి కమిషనర్ స్థాయిలో, నెలకోమారు మంత్రుల స్థాయిలో సమీక్ష ఉంటుందని తెలిపారు. అంతేకాక పనులు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చనుండగా, హైదరాబాద్ నుంచి పర్యవేక్షణ సులభతరమవుతుందని చెప్పారు. పనుల్లో అప్పటికప్పుడు కొన్ని మార్పులు సహజమేనని, అన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. రూ.270 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేపడుతామని వెల్లడించారు. అలాగే, పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణదారులు, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యేలా ఫిర్యాదు చేయాలని ఈఓకు సూచించారు. అంతేకాక త్వరలో ఆ భూములను ఏపీ సర్కారు సహకారంతో పరిశీలిస్తామని వెల్లడించారు. రామాలయ పునరుద్ధరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్పై అధికారుల్లో ఉన్న అయోమయం గురువారం మరోమారు బయటపడింది. ఉత్తర ద్వారం వేదికతో పాటుగా ప్రాకారాలు, చిత్రకూట మండపం తరలింపుపై ఇప్పటికీ పూర్తి స్థాయి ప్లాన్ తనకు అందించలేదని కాంట్రాక్టర్ చెప్పగా.. వెంటనే మార్పులను పూర్తి చేసి వెంటనే అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా, మాస్టర్ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించాలని మీడియా ప్రతినిధులు పేర్కొనగా, అందరికీ వివరించాలని అధికారులకు సూచించారు. కాగా మాస్టర్ ప్లాన్లో అస్పష్టతపై ఇప్పటికే ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. తొలుత భద్రాచలం వచ్చిన కమిషనర్ రామాలయంలో ప్రత్యేక పూజలు చేయగా పండితులు వేదాశీర్వచనం, ఈఓ దామోదర్రావు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్కిటెక్, ఆర్అండ్బీ, దేవస్థానం ఇంజనీర్లు పాల్గొన్నారు. -
దారిపొడవునా లారీలు, టిప్పర్లు
మణుగూరుటౌన్: మండలంలోని రాజుపేట మీదుగా రాకపోకలు సాగించే ఇసుక లారీలు, బొగ్గు టిప్పర్లను డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. గురువారం అలాగే నిలిపివేయడంతో కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. లారీ కాంటా నుంచి రాజుపేట వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మిగతా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలలకు వెళ్లాల్సిన బస్సులు సైతం అరగంటకు పైగా నిలిచిపోయాయి. ఇసుక రీచ్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా లారీలకు అనుమతిస్తుండడంతో తరచూ ఈ పరిస్థితి ఎదురవుతున్నందున పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
వేగంగా, కచ్చితంగా పరీక్షలు
రుద్రంపూర్: సింగరేణి గనుల్లో తవ్వకాల సందర్భంగా వెలువడే ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబోరేటరీని కొత్తగూడెం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్లో అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణకు చేసే పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ వేగంగా పూర్తికావడమే కాక కచ్చితమైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సింగరేణిలో శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం, గనుల్లో ఆధునికత కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు, సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు నాగా సీతారాములు తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై వినతులు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఇనపనూరి నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 25 ఏళ్లుగా దాదాపు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నందున కోలిండియా మాదిరి హైపవర్ వేతనాలు చెల్లించాలని లేదా జీఓ 22 అమలు చేయాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. అలాగే, కొత్తగూడెం వెళ్లే క్రమాన భట్టి రామవరంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్కూరి ధర్మారావు ఇంటికి వచ్చారు. ఆయనకు ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా మొక్క అందజేయగా భట్టి అభినందించారు. కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, మార్కెట్ చైర్మన్ లాల్సింగ్, నాయకులు మోత్కూరి లక్ష్మి ఝాన్సీరాణి, కుసుమ శ్రీనివాసరావు, దశరథ్ రజువా తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
చర్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. చర్ల మండలం దేవరపల్లి, ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా దేవరపల్లి, సత్యనారాయణపురం, దానవాయిపేటలోని పాఠశాలల్లో మొక్కలు నాటిన ఆమె ఆర్.కొత్తగూడెంలో ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో సీఈఓ గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. అంతేకాక ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతల ఏర్పాటు, మొక్కలు నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సర్పంచ్లు తెల్లం సుజాత, తుర్రం రవికుమార్, చిక్కాల గౌతమి ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ మూర్తి, ఉద్యోగులు లక్ష్మీదుర్గ, సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
ముగిసిన ఉద్యోగ సంఘం ఎన్నికలు
అశ్వాపురం: మండల పరిధిలోని మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం ముగిశాయి. కర్మాగారంలోని క్యాంటీన్–1లో పోలింగ్ నిర్వహించగా, 412 మంది ఉద్యోగులకు గాను 364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, 14 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల అధికారిగా భారజల కర్మాగారం సైంటిఫిక్ అధికారి మయాంక్చౌదరి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులను అభినందించిన ఎస్ఈ సూపర్బజార్(కొత్తగూడెం): ట్రాన్స్కో – డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నీ ఇటీవల హనుమకొండలో జరగగా ఉమ్మడి జిల్లా జట్టు వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్గా వ్యవహరించిన ఉద్యోగి ఆర్.శ్రీనివాసరాజు తదితరులను విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ గురువారం కొత్తగూడెంలో అభినందించారు. జట్టు సభ్యులు జి.వెంకటేశ్వరరావు, ఎన్.సతీశ్, పి.శివ, కె.రామ్కుమార్, ఎస్.భాస్కర్, జి.శివాజీతో పాటు డీఈలు పీఎస్వీఎస్ నందయ్య, కె.జీవన్కుమార్, జి.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, అనాథ అభ్యర్థులకు గ్రూప్–1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్ నియామక పరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. హాజరుశాతం ఆధారంగా స్టైఫండ్ కూడా మంజూరవుతుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని.. డిగ్రీ మార్కులు, రిజర్వేషన్లు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. అయితే, రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, గతంలో స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అనర్హులని తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు www. tgbcstudycircle. cgg. gov. in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 18 జాబితా ప్రకటించి, 20న సర్టిఫికెట్లు పరిశీలించాక 25వ తేదీ శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో లేదా 08742–227427, 94419 31359, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ భద్రాచలంటౌన్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరుగుతున్న జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. టోర్నీలో తెలంగాణ రాష్ట్రం క్లాసిక్ విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా, బృందంలో జిల్లా క్రీడాకారులే అత్యధిక పతకాలు సాధించారని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మల్లేశ్ నాలుగు స్వర్ణ పతకాలు, డీవీ శంకరరావు, ఎండీ అబ్బాస్ ఎనిమిది చొప్పున రజత పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే శేషు కాంస్య పతకం సాధించగా, కరుణాకుమార్ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్రెడ్డితో పాటు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మహంతి వెంకటకృష్ణాజీ, శోభన్నాయక్ తదితరులు అభినందించారు. ఉత్సాహంగా... ఉల్లాసంగా కొనసాగుతున్న యోగా పోటీలు కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రీజినల్ స్థాయి యోగా పోటీలు గురువారం రెండో రోజుకు చేరాయి. ఈ పోటీలకు రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది విద్యార్థులు హాజరు కాగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు యోగా విన్యాసాలతో ప్రతిభ చాటుతున్నారు. పోటీలను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, యోగాసన భారత్ జాతీయ సహాయ కార్యదర్శి నందనం కృపాకర్, ప్రసన్నకుమార్, రామిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన టిప్పర్
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లి సమీపాన జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొగ్గు టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్, చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన ఎస్.కె.ఖలీల్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో వీఎం బంజర పోలీసులు చేరుకుని స్థానికుల సహకారంతో అరగంట పాటు శ్రమించి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు లోడింగ్ కోసం వెళ్తున్న సమయాన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురు మహిళలకు జైలు శిక్ష.. భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఓ జ్యూయలరీ దుకాణంలో 2025 జూలై 7న ముగ్గురు మహిళలు రూ.30 వేలు విలువ గల వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనలో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ గురువారం తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి. భూక్యా కేల, గుగులోతు మీరా, భూక్యా వసంత జ్యూయలరీ దుకాణంలో చోరీ చేయగా.. బర్ల నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
36 పోస్టులు.. 750 దరఖాస్తులు!
పాల్వంచరూరల్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 36 ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. అనూహ్యంగా 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి గురువారం పాల్వంచలోని గురుకుల బాలుర కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా 450 మంది హాజరయ్యారు. ఈ మేరకు టెంట్, కుర్చీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారి పేర్లతో జాబితాను ఇంటర్ నోడల్ అధికారి, డీఈఓలకు పంపించామని గురుకులాల జోనల్, సమన్వయ అధికారులు అపర్ణ, కె.వెంకటేశ్వర్లు తెలిపారు. -
భూవివాదం.. నిరసన పర్వం
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధి హనుమంతులపాడులో రెండు కుటుంబాల మధ్య భూవివాదం సుదీర్ఘకాలంగా సాగుతోంది. తహసీల్, పోలీస్స్టేషన్లను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. గ్రామానికి చెందిన గడబోయిన సత్యం తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో 34 గుంటలు తనఖా పెట్టి రావుల సత్యమ్మ నుంచి రూ.45 వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే, తనఖా పెట్టలేదని తనకు విక్రయించారని సత్తెమ్మ వాదిస్తోంది. ఈ క్రమాన సత్తెమ్మ చేను దున్నుతుండగా, అడ్డుకున్న సత్యం కుటుంబ సభ్యులు పొలంలోనే గుడారం వేసుకుని ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమాన సత్తెమ్మ కూడా అదే భూమిలో బైఠాయించింది. ఐదు రోజులుగా సాగుతున్న ఈ వివాదంపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు అందినా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పొలంలోనే ఐదు రోజులుగా బైఠాయింపు -
సాగర్ ప్రధాన కాల్వకు మరమ్మతులు
● రూ.కోటి వ్యయంతో అంచనాలు సిద్ధం ● డిజైన్కు విరుద్ధంగా నీటి ప్రవాహమే కారణం? ఖమ్మంఅర్బన్: భద్రాద్రి జిల్ల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ల నుంచి మోటార్ల ద్వారా ఏన్కూరు రాజీవ్ లింక్ కెనాల్ నుంచి నాగార్జునసాగర్ ప్రధాన కాల్వలోకి గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ క్రమాన పలు సమస్యలను జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు. సాగర్ ప్రధాన కాల్వలో పలుచోట్ల నీరు.. కట్టను ఆనుకుని ప్రవహిస్తుండడంతో ముందస్తు మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు సాగర్ ప్రధాన కాల్వ ద్వారా సుమారు 1,500 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్ చేస్తుండగా ఖమ్మం చేరే వరకు 200 క్యూసెక్కుల మేర చేరుతోందని చెబుతు న్నారు. అయితే, నీటి ప్రవాహం ఒత్తిడితో కొన్ని ప్రాంతాల్లో కాల్వ కట్టలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. సాగర్ కాల్వల డిజైన్కు భిన్నంగా షట్టర్ల వద్ద నీటిని నిల్వ చేసి ఎగువకు ప్రవహింపజేస్తుండడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తించినట్లు సమాచారం. ఏన్కూరు నుంచి తిమ్మరావుపేట వరకు, వి.వెంకటాయపాలెం సమీపాన ప్రధానంగా సమస్య ఏర్పడిందని.. బ్యాంకింగ్ ఉన్న ప్రాంతాల్లో కట్టలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిసింది. ఏదిఏమైనా ప్రమాదాలు జరగకముందే సమస్యాత్మక ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు 12 కి.మీ. మేర కాల్వ కట్టలకు మరమ్మతులు అవసరమని గుర్తించగా.. రూ.కోటితో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే ఒకటి, రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశముందని సమాచారం. -
రూ.1.24కోట్ల విలువైన బియ్యం మాయం
● విజిలెన్స్ తనిఖీల్లో బయటపడిన అక్రమాలు ● అరుణాచలం మిల్లు యజమాని అరెస్ట్, రిమాండ్ నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం శివ రైస్మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల తనిఖీ సందర్భంగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ మేరకు మిల్లు యజమాని కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచలం శివ రైస్మిల్లులో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం డీఎస్పీ ఆధ్వర్యాన సోదాలు చేపట్టింది. సీఎంఆర్ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యాన రికార్డుల ఆధారంగా ధాన్యం స్టాక్ ఉందా, లేదా పరిశీలిస్తూ లాట్లను లెక్కించారు. ఈక్రమాన 442 మె.టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు తేల్చారు. దీని విలువ దాదాపు రూ.1,23,96,160 కావడం, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు గుర్తించి బుధవారం రాత్రే మిల్లు యజమాని ఓరుగంటి కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి ఫిర్యాదుతో గురువారం నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, వైద్యపరీక్షల అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు. అయితే, రూ.కోట్ల విలువైన అక్రమాలు జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు ఇన్నాళ్లు గుర్తించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


