Bhadradri District Latest News
-
రెక్కీ నిర్వహించి.. రూ.లక్ష కొట్టేశారు
నేలకొండపల్లి: వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ఓ రైతును వెంబడించిన దుండగులు ఆయన నుంచి రూ.లక్ష నగదు తస్కరించారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కాసాని తిరపయ్య వ్యవసాయం పెట్టుబడుల కోసం ఓ బ్యాంక్లో బంగారం తాకట్టు పెట్టి ఇటీవల రూ.లక్ష రుణం తీసుకున్నారు. విత్తనాల కొనుగోలుకు గురువారం రూ.లక్ష డ్రా చేయగా, ఆయనను వెన్నంటి గమనిస్తున్న దుండగులు కిరాణం షాప్ వద్ద రైతు నగదు ఉన్న సంచిని మోపెడ్కు తగిలించి వెళ్లడంతో కొట్టేశారు. తిరిగి వచ్చే సరికి రైతు బ్యాగ్ లేదని గుర్తించి బోరున విలపిస్తూ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిరాణం షాప్ వద్ద రైతు నుంచి బ్యాగ్ చోరీ -
డీ ఫిల్లరింగ్ చేపడితే 2 వేల టన్నుల ఉత్పత్తి
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గనిలో రానున్న ఆరు నెలల్లో డీ ఫిల్లరింగ్ పనులు చేపడితే రోజుకు 2 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్ రాసకట్ల రవికిరణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గనిలో అనుభవం ఉన్న అధికారుల సంఖ్య కంటే యువ అధికారుల సంఖ్య అధికంగా ఉందని, పనులపై పూర్తిగా అవగాహన లేని కారణంగా ఆశించిన ఉత్పత్తి రావటం లేదన్నారు. గనికి మరో 9 సంవత్సరాల జీవిత కాలం ఉందని తెలిపారు. గైర్హాజరు కార్మికులకు కుటుంబాలతో సహా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. భద్రాచలంవాసికి ప్రశంసా పత్రంభద్రాచలంటౌన్: కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో పట్టణానికి చెందిన పీఎస్వీ ప్రసాద్ బాబుకు ప్రశంస పత్రం లభించింది. యూజీసీ సహకారంతో జరిగిన సదస్సులో ‘ఎన్ఈపీ–2020 డిజిటల్ అసమానతల నివారణ –సాహిత్య బోధన’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. డిజిటల్ యుగంలో విద్యార్థులందరికీ సమాన విద్యావకాశాలు, సాంకేతిక వనరులు అందాలంటూ ఆయన చేసిన ప్రసంగం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సదస్సు డైరెక్టర్ డాక్టర్ ఆర్. మేఘన రావు, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలుజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవే టు విద్యాసంస్థలకు దీటుగా మారుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి విద్యార్థులతో పాలాభిషేకం చేయించి మాట్లాడారు. ప్రభుత్వం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉపాధ్యాయులు సురేష్, గోపాలకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తిరుమలాయపాలెం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని జూపెడకు గొల్ల పూడి చంటి(41) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భార్య శ్రీలతతో గొడవ పడిన ఆయన బుధవారం బచ్చోడు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కల్లూరురూరల్: కల్లూరులోని కప్పలబంధం రోడ్డు సట్టేరు కుంటకు ప్రాంతంలో సెంట్రింగ్ మేసీ్త్రగా పని చేస్తున్న షేక్ హబీబ్(55) మృతదేహాన్ని గురువారం గుర్తించారు. ఆయన రెండు రోజులుగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈమేరకు సట్టేరుకుంటలోని కల్వర్టు పక్కన మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఆయన కల్వర్టు పైనుంచి పడడంతో మృతి చెందాడా, ఇతర కారణాలు ఉన్నయా అన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. -
సొరంగం పనులు మళ్లీ మొదలు..
‘సీతారామ’ కాల్వకు మోక్షం ● నెలల తర్వాత సొరంగం తవ్వకం ప్రారంభం ● ఏకకాలంలో నీటి తొలగింపు, సొరంగం తవ్వకంతిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం నుండి పోచారం వరకు ఎనిమిది కి.మీ. మేర చేపట్టాల్సిన సొరంగ మార్గం పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 4.1 కి.మీ. సొరంగ మార్గం తవ్వాక గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, భూగర్భ జలాలు ఉబికిరావడంతో దమ్మాయిగూడెంలో వద్ద టన్నెల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గత ఏడాది అక్టోబర్లో దమ్మాయిగూడెం వద్ద టన్నెల్ను పరిశీలించారు. అయితే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టు నిర్మాణ సంస్థ కొద్దినెలలుగా పనులను నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు రూ.32కోట్ల నిధులు విడుదల చేయడంతో కూసుమంచి మండలం పోచారం వైపు నుంచి సొరంగం తొలిచే పనులు మొదలుపెట్టారు. టన్నెల్లోని బండరాళ్లను బ్లాస్ట్ చేసేందుకు భారీ యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఇదే సమయాన టన్నెల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లు కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే 4.1 కి.మీ. మేర సొరంగ మార్గం పూర్తి కాగా ఇంకా 3.9 కి.మీ. మేర నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు జల వనరుల శాఖ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు
● భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ● తెల్లవారుజామున ఇసుక ర్యాంపుల పరిశీలన బూర్గంపాడు: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హెచ్చరించారు. గురువారం తెల్లవారు జామున సారపాక, పాత గొమ్మూరు వద్ద గోదావరి నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారిక ఇసుక ర్యాంపుల నుంచే మాత్రమే సరఫరా జరపాలన్నారు. సోంపల్లిలోని అధికారిక ఇసుక ర్యాంపులను కూడా తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, వే బిల్లులు లేకుండా జీరో దందా చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రాంతాల్లో కందకాలు తవ్వించాలని, వాహనాలు గోదావరిలోకి దిగకుండా కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంతంలో 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిల్వచేసిన ఇసుకను సీజ్చేయాలని సూచించారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సర్ కారణంగానే గత ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇంటికి పోయారని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం క్లబ్లో గురువారం జరిగిన నియోజకవర్గస్థాయి బీఎల్ఏల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడుతోందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించి అక్కడ ప్రభుత్వాలను చేతిలోకి తీసుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. ప్రతీ కార్యకర్త అవగాహన పెంచుకుని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీగా మారిందని, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటర్ల జాబితాను పరిశీలించి ఎవరి ఓటూ తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, దిండిగల రాజేందర్ వనమా రాఘవేంద్రరావు, కాపు సీతామహాలక్ష్మి, కార్పొరేటర్లు సింధూ తపస్వి, మధు చంద్, గుణచరిత్, రాంబాబు, సాగర్, వేల్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కండువా గులాబీ.. మద్దతు హస్తానికి బీఆర్ఎస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావులు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. ఓ మంత్రి నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయితే, కొందరు బీఆర్ఎస్ నేతలు వేడుకలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మరికొందరు నేతలు గులాబీ పార్టీలో ఉంటూ మంత్రి పొంగులేటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని ఇకపై ఉపేక్షించబోమన్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ పెట్టిన రోజు పార్టీలో పెద్ద నాయకులెవరు లేరని, మళ్లీ ఒంటరిగానైనా నిఖార్సైన కార్యకర్తలతో కలిసి నడక సాగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్తో కొట్లాడటం బీఆర్ఎస్కు పెద్ద విషయం కాదని, కానీ ప్రస్తుతం ఉన్నది కూటమి కాంగ్రెస్ అని, టీడీపీ వాళ్లు కాంగ్రెస్ ముసుగులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ను సమర్థంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. టీ కప్పులో తుపాను సర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మాజీ మంత్రి కుమారుడు వనమా రాఘవ కృషి చేయాలని, అయితే ఆయన తన పనితీరును మార్చుకోవాలని రవీందర్రావు పలుమార్లు సూచించారు. దీంతో రాఘవ నొచ్చుకోవడంతో ఆయన అభిమానులు రవీందర్రావు వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపగా, సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమని గులాబీ నాయకులు, కేడర్ ప్రతినబూనడంతో ‘సూచన’ వివాదం టీ కప్పులో తుపానులా ముగిసిపోయింది.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి -
సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్
చుంచుపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన 54 మంది ఏఎన్ఎంలకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యఅధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లలో పనిచేసే సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, శ్రీధర్, కళ్యాణి, మోహన్, శ్రీనివాస్, జానకి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
40 రకాల పూల మొక్కలతో బటర్ఫ్లై పార్క్
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా బటర్ఫ్లై పార్కు ఏర్పాటు చేయగా, గురువారం కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. వైల్డ్లైఫ్ చెక్ పోస్టు ఎదుట సుమారు రూ.5 లక్షలతో 40 రకాల పూల మొక్కలతో పార్కు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ వైల్డ్లైఫ్ విభాగం ఎఫ్డీఓ బాబు తెలిపారు. సీతాకోకచిలుకలను ఎక్కువగా ఆకర్షించే జటోపా, లేగిసోమియా, నందివర్ధనం, ఎగ్జరా, క్యాసిమ్, మందార, వింకరోజ్, పిటోనియా, లాంటినా, వర్జీనా, నైట్క్వీన్, అమలందా, గల్ఫెమియా, విష్ణుకాంత తదితర రకాల మొక్కలు తెప్పించామని పేర్కొన్నారు. -
రూ.750 కోట్లతో గోదాంల నిర్మాణం
నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.750 కోట్ల నిధులతో నూతనంగా గోదాంల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో గోదాంలను తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్ను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 25 కేంద్రాల్లో 2.50.లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలకు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, హైదరాబాద్లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీల కోసం రూ.70 కోట్లతో 23 ఎకరాల్లో గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వెంకటాయపాలెంలో మిర్చి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. గోదాంలు అందుబాటులోకి వస్తే రైతులు పండించిన పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని చెప్పారు. అయితే, రైతులు సంప్రదాయ పంటలకు బదులు పంట మార్పిడితో ప్రయోజనాలు పొందాలని సూచించారు. సదస్సులో డీఏఓ డి.పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, ఏడీఏ సతీష్ ప్రతినిధులు పాల్గొన్నారు. ●బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రులు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, అలా రాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, నల్లాని మల్లికార్జున్రావు, బొందయ్య, భద్రయ్య, కడియాల నరేష్ పాల్గొన్నారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు -
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా..
పాల్వంచరూరల్: విదేశీ పర్యాటకులు వచ్చేలా కిన్నెరసానిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధి కిన్నెరసానిలో వైల్డ్లైఫ్ శాఖ బయోసాట్ నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన జంగల్ సఫారీ టూర్ మూడు వాహనాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లోని గుర్రంగూడ వనమహోత్సం నుంచి వర్చవల్గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అంకిత్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్లతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. డీర్ పార్కు వద్ద మొక్కలను నాటి బటర్ ఫ్లై పార్కు, ఫీడ్ స్టోరేజీ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫారీ రైడ్, బటర్ ఫ్లై పార్కు, ట్రెక్కింగ్ అందుబాటులోకి రావడంతో కిన్నెరసానికి వచ్చే పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కొత్తగూడెం క్రాస్ రోడ్డులోని హరిత హోటల్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. లక్నవరం తరహాలో కిన్నెరసానిలో కూడా తీగల వంతెన ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించాలి మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కిన్నెరసాని డీర్ పార్కులో ఆయన మొక్క నాటి మాట్లాడారు. పర్యావరణ సమత్యులతను కాపాడాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అనంతరం కలెక్టర్ పర్యావరణ కేంద్ర భవనాన్ని, బటర్ఫ్లై పార్కును కలెక్టర్ అంకిత్ సందర్శించారు. జంతువులను బొమ్మలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణాగౌడ్, విద్యాచందన, దారా ప్రసాద్, బి.బాబు, కిషన్, కొత్తగూడెం మేయర్ ఎం.గణేష్, కిన్నెరసాని సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, డి. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.మణుగూరు టౌన్: వరదల ప్రభావం అధికంగా ఉండే లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మణుగూరులో పర్యటించిన ఆయన తొలుత భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు కోసం మణుగూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్ట్ ద్వారా భూ రికార్డుల సమగ్రత, పారదర్శకత పెరుగుతుందన్నారు. అనంతరం గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే అన్నారం, కమలాపురం గ్రామాలతో పాటు కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పీకేఓసీ ఓపెన్కాస్ట్ గనుల నుంచి విడుదలయ్యే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే గాంధీనగర్, సుందరయ్యనగర్, కాళీమాత ఏరియాలను సందర్శించారు. వినాయక నగర్ తదితర ప్రాంతాల డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ పల్నాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
80 కిలోల గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీంద్రా రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్రకుమార్, కపిల్ దేవ్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. కపిల్దేవ్ రూ.50 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన ఇద్దరు ఒడిశా నుంచి కారులో సుమారు రూ.40 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరు తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ గుడి వద్ద మణుగూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు గుర్తించి వాహనంతోసహా స్వాధీనం చేసుకున్నారు. సురేంద్రసింగ్, ధర్మేంద్రకుమార్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అన్నపురెడ్డిపల్లిలో 88 కేజీలు..ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో రూ. 44 లక్షల విలువైన 88 కిలోల గంజాయిని స్థాని క, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులు, కేరళకు చెందిన మహమ్మద్ రిషాద్, డ్రైవర్ సిరాజ్ కుంజా విఠల్ను అరెస్ట్ చేశారు. చింతూరు నుంచి భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి మీదుగా కేరళకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రిషాద్, మరో గంజాయి స్మగ్లర్ హర్షద్ కలిసి బెంగళూరు జైలులో ఉన్నారు. ఇటీవల విడుదలైన రిషాద్... హర్షద్ ఆర్థిక సహకారంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని డీఎస్పీ తెలిపారు. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై విజయసింహా రెడ్డి పాల్గొన్నారు. -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువు దీరిన స్వామి వారికి విశ్వక్సేన పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. భద్రాచలం ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేస్తాండీసీహెచ్ఎస్ రవిబాబు నాయక్ భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రవిబాబు నాయక్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆస్పత్రిలో నెలకొన్న లోటుపాట్లను సరిదిద్దుతున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎంఓలతో కలిసివెళ్లి ఐటీడీఏ పీఓ రాహుల్కు ఆస్పత్రి సమస్యలు విన్నవించి, పరిష్కరించాలని కోరారు. ‘ఉద్దీపనం’తో గుణాత్మక విద్యఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించేందుకు ఉద్దీపనం మెటీరియల్ ఉపయోగపడుతోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏలో ఉద్దీపనం మెటీరియల్ ప్రణాళికా అంశాలను పరిశీలించి మాట్లాడారు. ఉద్దీపనం పుస్తకాలతో 3,4,5వ తరగతి విద్యార్థుల్లో బేసిక్ లెవల్ నైపుణ్యాలు మెరుగుపడ్డాయని వెల్లడించారు.1, 2 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం కలిపి ఉద్దీపనం పుస్తకం రూపొందిస్తున్నట్లు తెలిపారు. 7,8, 9వ తరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొనేలా పుస్తకాన్ని రూపొందిస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు 60 రోజులుగా పుస్తకాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. అధికారులు చందన, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్య సేవలో ఆర్అండ్ఆర్ కమిషనర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గురువారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి అధికారులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు, డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అందరి దృష్టీ సర్ పైనే
అసలేం జరుగుతోంది..? శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026రాజకీయ పార్టీల్లో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రకంపనలు రేపుతోంది. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదనే భావన ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. నిన్నా మొన్నటి వరకు సర్ విషయంలో చూసీచూడనట్టుగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంజాగ్రత్త పడుతున్న పార్టీలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతోంది. అయితే, సదుద్దేశంతో చేపట్టిన ‘సర్’ ప్రక్రియను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తనకు అనుకూలంగా మార్చుకుని, సంప్రదాయంగా తమకు ఓటు బ్యాంకు లేని వర్గాల ఓట్లను తొలగిస్తోందనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల వెలువడిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పక్షాలను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేశాయి. తమిళనాడులో మళ్లీ అధికారం తమదే అనుకున్న డీఎంకేకు షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్, సీఎం హోదాలో పోటీ చేసిన స్టాలిన్ సైతం ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయత్వంలోని టీఎంసీ మట్టి కరిచింది. ఈ ఫలితాల తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లు అప్రమత్తమయ్యాయి. సర్ను తేలిగ్గా తీసుకునేందుకు వీలు లేదని, తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని రంగంలోకి దిగాయి. రూటు మార్చిన కాంగ్రెస్ సర్ కార్యక్రమంపై క్షేత్రస్థాయి నుంచి నియోజకర్గస్థాయి వరకు పార్టీ కేడర్కు అవగాహన కల్పించాలని కాంగ్రెస్ ఏప్రిల్ మొదటి వారంలో నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఇన్చార్జీలను కూడా నియమించింది. ఇటీవల వరకు వీరు మొక్కుబడి సమావేశాలకే పరిమితమైనా.. ప్రస్తుతం హస్తం పార్టీ యాక్షన్ ప్లాన్లో మార్పు వచ్చింది. దీంతో జూన్ 10న ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని కొత్తగూడెంలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి నిపుణులను తీసుకువచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ గురించి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఆఫీసర్లకు వివరించే ప్రయత్నం చేశారు. గేరు మార్చిన ‘కారు’ అధికారం కోల్పోయిన తర్వాత నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో సర్ కొత్త ఊపును తీసుకొచ్చి నట్టయ్యింది. జిల్లా ఇన్చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు సర్ విషయంలో కేడర్ను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. సర్లో కీలకమైన బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం పట్ల రవీందర్రావు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో మండలాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను స్వయంగా పరిచయం చేసుకున్నారు. అలసత్వం వహించొద్దని సూచించారు. ఈ క్రమంలో రవీందర్రావు స్థానిక నాయకులు, కేడర్ను ఉద్దేశించి కఠినంగా మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. అయినా పార్టీని బలోపేతం చేయాలంటే ముక్కుసూటిగా వ్యవహరించకతప్పదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పడం.. ‘సర్’ పట్ల బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎంత అలెర్ట్గా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆది నుంచి కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ–ఎంఎల్లకు జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా, బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు మిగిలిన రాజకీయ పార్టీల కంటే ముందువరుసలో ఉంటారు. కానీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి ‘సర్’ కార్యాచరణపై ప్రకటన రాకపోవడం గమనార్హం. సర్ మ్యాపింగ్ ప్రక్రియ 25 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ కేడర్ను అప్రమత్తం చేసే పనిని మొదలు పెట్టాయి. సర్ మీద ప్రజల్లో చైతన్యం పెరిగేలా చేయడంపై కమ్యూనిస్టులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యాశాఖను వదిలేశారా..?
● విద్యాసంవత్సర ప్రారంభం కావడంతో హడావిడి ● సెలవుపై వెళ్లిన ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీఈఓ ● నలుగురు కోఆర్డినేటర్లలో ముగ్గురు మాతృస్థానాల్లోకి.. ● ప్రస్తుతం ఒక కోఆర్డినేటర్, ఏడీతో నెట్టుకొస్తున్న వైనం కొత్తగూడెంఅర్బన్: కొత్త విద్యాసంవత్సరంలో కూడా జిల్లా విద్యాశాఖలో మార్పులు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 2న డీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాసంతి మరుసటి రోజే సెలవుపై వెళ్లారు. ఈ నెల 25వ తేదీ వరకు చైల్డ్ కేర్ సెలవులో ఉండనున్నారు. ఇన్చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు. 2026–27 విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభంకాగా, నెలరోజుల పాటు హడావిడి వాతావరణం ఉండనుంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, కొత్త అడ్మిషన్లు, రాగి జావ, మధ్యాహ్నభోజన పథకం, మెనూ ప్రకారం వంటలు తదితర విషయాలను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా జరగకపోతే తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి కీలక సమయంలో జిల్లా విద్యాశాఖలో అధికారుల కొరత ఏర్పడింది. డీఈఓ సెలవులో ఉండగా, పదవీ కాలం ముగియడంతో గతంలో ఉన్న నలుగురు కో ఆర్డినేటర్లలో ముగ్గురు తమ మాతృస్థానాలకు వెళ్లారు. మిగిలింది ఒక్కరే. మరో అధికారి ఏడీ శంభూప్రసాద్ ఉన్నారు. అన్ని బాధ్యతలు వీరిద్దరే చూడాల్సి రావడంతో పనిభారం పెరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల యూనిఫాం, భవిత కేంద్రాల పని తీరు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాలు.. ఇలా అన్నింటిలోనూ విద్యాశాఖలో వెనుకబాటు కనిపిస్తోంది. వెరసి గత విద్యా సంవత్సరం మాదిరిగానే పాలన కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో వెనుకబాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కోఆర్డినేటర్లు కీలకంగా వ్యవహరిస్తారు. పదవీ కాలం ముగిసినా కొత్త వారు వచ్చే వరకు వారిని తాత్కాలికంగా కొనసాగించవచ్చని డీఎస్ఈ నుంచి ఆదేశాలున్నాయి. అయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదు. గతంలో ఏఎంఓ, సీఎంఓ, జీఈసీఓ ఉండేవారు. ప్రస్తుతం ప్లానింగ్ కోఆర్డినేటర్ ఒక్కరే ఉన్నారు. జిల్లా విద్యాశాఖకు విడుదల అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, పథకాలు, అమలు చేయాల్సిన విధివిధానాలను అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా డీఈఓతోపాటు కోఆర్డినేటర్ల బాధ్యతలు నిర్వర్తించేవారు. జిల్లాలో ఉన్న 23 మంది ఎంఈఓలతో పాటు 90 మంది కాంప్లెక్స్ హెచ్ఎంలకు డీఎస్ఈ నుంచి వచ్చే ఆదేశాలను చేరవేసి, అమలు చేసేలా చర్యలు తీసుకునే వారు. జూన్ నెల అంతా తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ప్రస్తుతం కోఆర్డినేటర్ ఒక్కరే కావడంతో సమాచారం అందించేందుకు కూడా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని ఎంఈఓలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే పాలన గాడితప్పి ఫలితాలు గతేడాది కంటే తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అసలేం జరుగుతోంది..?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఆర్కిటెక్ట్, ఇతర ఉన్నతాధికారులకు తప్ప భక్తులకు ప్లాన్ గురించి తెలియదు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ముందు చేపట్టిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కాళేశ్వరం ఆలయానికి సైతం ఇదే రీతిన మాస్టర్ ప్లాన్ను ప్రకటించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. ఏళ్ల తర్వాత ఆమోదించిన భద్రాచలం మాస్టర్ ప్లాన్ను మాత్రం బహిర్గతం చేయడంలేదు. ఎట్టకేలకు మూడు విడతల్లో రూ. 351 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినా.. కేవలం పగలు, రాత్రి వేళల్లో అభివృద్ధి అనంతరం ఆలయ నమూనాల విడుదల తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ఇంతవరకు భక్తులకు, ప్రజలకు తెలియదు. నూతన ఆలయాలు, ఇతర వసతుల కల్పనపై స్పష్టత లేదు. అసలేమి పనులు చేపట్టనున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. మూడు నెలలైనా ముందుకు సాగని పనులు రామాలయ అభివృద్ధి బాలరిష్టాలను దాటి ముందుకెళ్లలేకపోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అదిగో..ఇదిగో రూ. 100 కోట్ల అభివృద్ధి అంటూ పదేళ్లపాటు కాలయాపన చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు జాప్యం చేసింది. గత మార్చి చివరలో రూ.351 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించింది. మే 1 నాటికి టెండర్ పూర్తి చేయాలని, శిథిలాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలు గడిచినా టెండర్ ఖరారు చేయలేదు. భవనాల శిథిలాల తొలగింపు పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చేసింది. దీంతో మరో మూడు నెలలు పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. అప్పటికే ఆరు నెలలు ముగిసిపోనుండగా, అనంతరం మరో ఆరు నెలలకు గోదావరి పుష్కరాలు వస్తాయి. మధ్యలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. వీటిన్నంటి మధ్య అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం భద్రాచలం రామాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని, పనులను త్వరగా పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని భక్తులు కోరుతున్నారు. మాస్టర్ప్లాన్లో లెక్కా పత్రం లేకుండా మార్పులు జరుగుతున్నాయి. తొలి ఫేస్లో గోదావరి ఒడ్డున రూ.75కోట్లతో గోదావరి ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్కు సుదర్శన చక్ర స్నాన తీర్థంగా పేరు పెట్టారు. ఆ తర్వాత మంత్రుల సలహాలు, సూచనలతో పూర్తిగా సుదర్శన చక్రం నిర్మాణామే తొలగించారు. తొలుత రూ.75 కోట్లను ప్రకటించగా, అనంతరం రూ.46 కోట్లకు కుదించారు. తొలత ప్రతిపాదించిన ప్లాన్లోని టాయిలెట్ బ్లాక్, కల్యాణ కట్ట, పిండ ప్రధాన మండపాన్ని పూర్తిగా తొలగించారు. ఇక్కడి రూ.29 కోట్లను ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పనులకు మళ్లించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్లాన్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మాస్టర్ప్లాన్ను బయటకు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం -
గాలివానతో కూలిన చెట్లు, ఇళ్లు
అశ్వాపురం: మండలంలో బుధవారం గాలివాన బీభత్సం స్పష్టించింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. అలాగే, మండల కేంద్రంలోని బుడుగుబజార్లో బైరోజు కాంతయ్య రేకుల ఇల్లు పూర్తిగా నేలమట్టమై గృహోపకరణా లు, సామగ్రి దెబ్బతిన్నాయి. ముందే అప్రమత్తమై కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే, జగ్గారంతండాలో మోతుకూరి సురేశ్ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరాయి. కాగా, ఇళ్లు ధ్వంసమైన బుడుగుబజార్లోని బైరోజు కాంతయ్య, సీతారాంపురంలో నూప వెంకన్న కుటుంబాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఫోన్లో సమాచారం ఇవ్వగా, ఆయన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామ సర్పంచ్ సబ్క పిచ్చయ్యతో పాటు కందుల లక్ష్మణ్, అలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) ప్రత్యేకంగా ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణను వేగంగా చేపట్టడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. – ఖమ్మంవ్యవసాయం● భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యాన అప్రమత్తంగా ఎన్పీడీసీఎల్ ● అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు ఆరు అంచెల వ్యూహం విద్యుత్ స్తంభించిన వెంటనే సత్వర పునరుద్ధరణ కోసం ఆరు అంచెల విధానం రూపొందించారు. ప్రధాన కార్యాలయంలోని 24 గంటల కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి బాధ్యతలు కేటాయిస్తారు. ప్రధాన ప్రాంతాల్లో అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది మరమ్మతు సామగ్రితో అంతరాయం ఎదురైన ప్రాంతానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తారు. తద్వారా త్వరగా విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుంది. ముందే గుర్తింపు ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను కృత్రిమ మేధస్సుతో అనుసంధానించారు. దీంతో ఫీడర్లలో వచ్చే సాంకేతిక లోపాలను 7 – 21 రోజుల ముందే గుర్తించవచ్చు. వాతావరణం ఆధారంగా విద్యుత్ డిమాండ్ను అంచనా వేసి సరఫరా నిర్వహిస్తారు. అంతేకాక అటవీ ప్రాంతాలు, ఇరుకై న ప్రదేశాల్లో లైన్ల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించనున్నారు. ఎమర్జెన్సీ వాహనాలు విద్యుత్ అత్యవసర పునరుద్ధరణ కోసం జీపీఆర్ఎస్ బృందాల వాహనాలు అందుబాటులో ఉంచారు. వీటిలో మరమ్మతులకు కావాల్సిన అన్ని పరికరాలు ఉంటాయి. జీపీఆర్ఎస్ ట్రాకింగ్తో కంట్రోల్ రూమ్ నుంచి వాహన స్థానాన్ని గుర్తించిసిబ్బందిని త్వరగా పంపించి పనులు చేపడుతారు. ‘హైపర్’ యాక్షన్ ప్లాన్తో వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశముంది. తద్వారా నియోగదారులకు నిరంతర విద్యుత్ అందుతుంది. ఈ యాక్షన్ ప్లాన్ను జిల్లాలో అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. –ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
భద్రాచలంలో గంజాయి స్వాధీనం
ఒకరి అరెస్ట్, పరారీలో మరొకరు.. భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యా హ్నం 8.580 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ అరుణ్కుమార్ కథనం ప్రకారం.. బుధవారం మధ్యా హ్నం కూనవరం రోడ్డులో టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ బైక్పై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా ఆపారు. వారి వివరాలు అడుగుతుండగా ఒకరు పరారయ్యారు. మరో వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగులో 8.580 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ రూ.4,29,000 ఉంటుందని, పట్టుబడిన వ్యక్తి భద్రాచలంలోని సుందరయ్యనగర్కాలనీకి చెందిన నాగేశ్వరరావుగా తేలిందని, అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని డీఎస్పీ అరుణ్కుమార్ వెల్లడించారు. పారిపోయిన వ్యక్తిని సుతారి మేస్త్రి మడకం ముత్తుగా గుర్తించామని, త్వరలో పట్టుకుంటామని ఆయన వివరించారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్, ఏఎస్ఐ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యములకలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మధుప్రసాద్ కథనంమేరకు.. గుండాలపాడు గ్రామపంచాయతీ చలమన్ననగర్కు చెందిన పర్సిక రాజుకు భార్యలు వీరమ్మ, రమాదేవి ఉన్నారు. వీరి మధ్య సఖ్యత లేక తరచూ గొడవలు కావడంతో గతంలోనే పలుమార్లు గ్రామపెద్దలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తనవల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని మనస్తాపానికి గురైన రమాదేవి(22) మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి ఎట్టి కన్నమ్మ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రక్షణ సూత్రాలు, పనిగంటల పెంపు కీలకం
మణుగూరుటౌన్: ప్రతీ ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటించడమే కాక యంత్రాల పనిగంటలు పెంచడం ద్వారా బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించొచ్చ ని సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరులో బుధవారం జరిగిన త్రైపాక్షిక రక్షణ సమావేశంలో వారు పాల్గొన్నారు. తొలుత రక్షణ ప్రతిజ్ఞ చేయగా, డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతీ గనిలో రక్షణపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మరో డైరెక్టర్ వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ.. కోల్ ఇండియాతో పోలిస్తే ఎక్కువగా ఉన్న సింగరేణి బొగ్గు ధర తగ్గించేలా యంత్రా ల పనిగంటలను పెంచితే ఉత్పత్తి వ్యయం నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యమైన 65 మిలియన్ టన్నులు సాధించేందుకు ఉద్యోగులందరూ సమష్టి కృషి చేయాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు హరిప్రసాద్, నాగుల్ మీరా, బొల్లు సుధీర్కుమార్తో పాటు జీఎం(సేఫ్టీ) కార్పొరేట్ సాయిబాబు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడగా, పలు విభాగాల అధికారులు కృష్ణగోపాల్తివారీ, మదన్నాయక్, రామారావు, ఎస్.రమేశ్, రాంబాబు, శ్రీనివాసాచారి, శ్రీనివాస్, రామన్ పాఠక్, శివ ప్రసాద్, శ్రీకాంత్, దయాకర్, రమేశ్బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వేటకు యత్నించిన వారి అరెస్టు
దమ్మపేట: మండలంలోని గండుగులపల్లి అటవీ బీట్ పరిధిలో వన్యప్రాణుల వేటకు యత్నించిన నలుగురు వ్యక్తులపై ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు బుధవారం కేసు నమోదు చేశారు. ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని గండుగులపల్లి అటవీ బీట్లో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక నాటు తుపాకీ, ఐదు తూటాలు, ఒక బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. కేసును చేధించిన వారిలో డీఆర్ఓ జయరాం, బీట్ ఆఫీసర్ భవాని, నాగరాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్షఅశ్వారావుపేటరూరల్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించగా, మరో నలుగురికి జరిమానా విధించారు. ఎస్ఐ టి.యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని రింగ్రోడ్ సెంటర్లో గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తిరుమలకుంట గ్రామానికి చెందిన కుర్సా వీరయ్య, ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన పంపారపు గంగాధరరావు అతిగా మద్యం సేవించి పట్టుబడ్డారు. కాగా, బుధవారం దమ్మపేట కోర్టులో న్యాయమూర్తి భవాని ఎదుట హాజరు పర్చగా వారిద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మరో నలుగురు వ్యక్తులకు ఒకొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
ఏన్కూరు: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఏన్కూ రు కేంద్రంగా రెండు, మూడేళ్ల నుంచి నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ‘సాక్షి’లో బుధవారం ‘జోరుగా నకిలీ విత్తనాల విక్రయం?’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. గత ఏడాది మండలంలో నకిలీ విత్తనాలు లభ్యమైన వారి ఇళ్లలో తనిఖీ చేసి ప్రస్తుత కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారబోయిన సంధ్య, వ్యవసాయాధి కారి నర్సింహారావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయ సమాచారం ఎవరికై నా తెలిస్తే తమకు తెలపాలని సూచించారు. వ్యాపారులు కూడా ప్రభు త్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలే విక్రయించాలని తెలిపారు. -
వైద్యులు కావలెను...
భద్రాచలంఅర్బన్: నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఏళ్ల తరబడి వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మొత్తం 212 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 93 మందే పనిచేస్తున్నారు. ఇంకా 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, 63 డాక్టర్ పోస్టులు ఉండగా, కేవలం ఆరుగురు రెగ్యులర్, 13 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇంకా 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ పోస్టులు 53 ఉండగా, ఐదుగురు రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఇంకా 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అసలే కొరత.. అయినా డిప్యూటేషన్లు ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా, ఉన్న వారిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు డిప్యూటేన్పై పంపించారు. ఉన్న 19 మంది డాక్టర్లలో పలువురు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇతర విభాగాల్లోని సిబ్బంది కూడా డిప్యూటేషన్పై వెళ్లారు. ఇక భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందిలో చాలా మంది కూడా ఇతర ఆస్పత్రుల నుంచి డిప్యూటేషన్పై వచ్చిన వారే. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడంలేదు. పని భారం పెరగడంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసేందుకు కూడా వైద్యులు ముందుకు రావడం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత వల్ల సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తోంది. రూ. వేలకు వేలు బిల్లులు చెల్లించలేక అవస్థ పడుతున్నారు. సేవలు అంతంతే 200 పడకలు ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, అన్ని విభాగాలతో కూడిన వార్డులు, పక్కా భవనం ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పేదలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ స్పందించి ఖాళీపోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. భద్రాచలం ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల సమస్యను కలెక్టర్, ఐటీడీఏ పీఓల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం. త్వరలోనే అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. – డాక్టర్ రవిబాబు నాయక్, డీసీహెచ్ఎస్గుండాల మండలం శంభునిగూడెం నుంచి గర్భిణి దాట్ల వనజను గత ఆదివారం గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు గాను ఒకరే విధులు నిర్వర్తిస్తుండడంతో గర్భిణి తీసుకొచ్చిన సమయాన ఆ వైద్యుడు కూడా లేడు. దీంతో స్టాఫ్ నర్స్ వైద్యం చేయడంతో అపస్మారకస్థితికి చేరిన శిశువును ఇల్లెందుకు తీసుకెళ్లగా కన్నుమూసింది. ఆపై గర్భిణికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఖమ్మం తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయాన వైద్యుడు ఉంటే వనజ ఇంట్లో ఈపాటికి చిన్నారి అడుగిడిన సంబురం అంబరాన్ని అంటేది. కానీ అటు భార్య, కళ్లు తెరవని బిడ్డను కోల్పోయిన ఆమె భర్త, కుటుంబీకులు విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. -
జూలూరుపాడులో అరకొరగానే..
జూలూరుపాడు: జూలూరుపాడు పీహెచ్సీని వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. ఇటీవల పలువురు స్టాఫ్ నర్సులు బదిలీ కాగా, ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చిన వారు చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. స్టాఫ్ నర్సులు లేక ఏఎన్ఎంలే వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, ఫార్మసిస్టు, ఎల్టీ, ఏఎన్ఎంలు ఉన్నారు. ఇక్కడ నలుగురు వైద్యులు, ఒక హెడ్నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు పని చేయాల్సి ఉన్నా ఇద్దరు డాక్టర్లు డిప్యూటేషన్పై కొత్తగూడెం వెళ్లగా, హెడ్ నర్సు రెండేళ్ల క్రితం డిప్యూటేషన్పై ఖమ్మం వెళ్లారు. అంతేకాక నలుగురు స్టాఫ్ నర్సులు ఇటీవల బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లో కొత్తగా ఎవరినీ నియమించడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, పలు సబ్సెంటర్లలోనూ ఏఎన్ఎం పోస్టుల భర్తీ జరగలేదు. ఆస్పత్రి స్టాఫ్ నర్సులు లేక షిఫ్ట్ల వారీగా ఏఎన్ఎంలే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వైద్యులు కూడా ఇద్దరే నెట్టుకొస్తున్నారు. ఇక ఏడాదిన్నరగా డెంటల్ డాక్టర్ లేక ఆ విభాగమే మూతపడింది. గుండాల ఆస్పత్రిలో ఇక్కట్లు గుండాల: మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల 50 గ్రామాలకు గుండాల ప్రభుత్వ ఆస్పత్రే పెద్దదిక్కు. కానీ కొంత కాలంగా వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బంది కొరతతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇద్దరు వైద్యాధికారులకు ఒకరే ఉండడం.. ఆయన సమావేశాలు, శిబిరాలకు వెళ్లినా, సెలవు పెట్టినా ఆస్పత్రిలో ఓపీ చూసే వారుండరు. అత్యవసర సమయాల్లో మృత్యువుతో పోరాడుతూ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పేరుకు 24 గంటల ఆస్పత్రే అయినా వైద్యలు, సిబ్బంది నియామకంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఏజెన్సీ వాసులకు ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందడం లేదు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నా డాక్టర్ మనేష్రెడ్డి ఉన్నత చదువుల కోసం వెళ్లగా ఒకరే కొనసాగుతున్నారు. ఇక నలుగురు స్టాఫ్ నర్సులకు గాను ముగ్గురు బదిలీపై వెళ్లారు. అలాగే, ఫార్మసిస్ట్ కూడా లేరు. మరోపక్కసాయనపల్లి, ముత్తాపురం సబ్సెంటర్లకు ఏఎన్ఎమ్లు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. పోలీసుస్టేషన్లో అంబులెన్స్ గతంలో గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి రెండు 108 వాహనాలను కేటాయించగా, ఒకటి ఏడాది క్రితం ఇల్లెందుకు పంపించారు. ఆపై ఒక అంబులెన్స్ కొనసాగినా ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇల్లెందు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఫలితంగా ఎవరైనా ఆపదలో ఉంటే పక్క మండలం నుంచి అంబులెన్స్ రావాల్సిందే. ఇటీవల శంభునిగూడెం గర్భిణికి పురిటినొప్పులు వస్తున్నా అంబులెన్స్ లేక ఆమె ఆస్పత్రికి తీసురావడంలో జాప్యం జరిగి తల్లీబిడ్డ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, అంబులెన్స్ లేకపోవడం వంటి సమస్యలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చినందున సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడైనా స్పందించి సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని వేధిస్తున్న కొరత -
చిక్కటి అడవిలో చక్కటి ప్రయాణం
వాతావరణ ం జిల్లాలో గురువారం ఉష్ణోగ్రత తక్కువగానే నమోదవుతుంది. సాయంత్రం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.● నేటి నుంచి కిన్నెరసానిలో సఫారీ టూర్ ● వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి పాల్వంచరూరల్: జూపార్క్లో బోన్ల నడుమ జంతువులు, గూళ్లలోని పిచుకలను చూడాల్సిన పనిలేదు. దట్టమైన అడవిలో పచ్చని అందాలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ చెంగుచెంగున ఎగిరే జింకలను చూస్తూ ముందుకు సాగే అవకాశం అందుబాటులోకి వస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని వన్యప్రాణి విభాగం (వైల్డ్లైఫ్) ఆధ్వర్యాన జంగిల్ సఫారీ టూర్ గురువారం మొదలుకానుంది. ఈ మేరకు మూడు సఫారీ వాహనాలు ఇప్పటికే చేరుకోగా, ఈ టూర్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారని పాల్వంచ డివిజన్ వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీఎఫ్ఓ జి.కృష్ణగౌడ్ పాల్గొంటారని వెల్లడించారు. పది కి.మీ. ప్రయాణం కిన్నెరసాని డీర్ పార్కు నుంచి వాచ్ టవర్ వరకు, అక్కడ నుంచి మొండికట్ట బేస్ క్యాంప్ హరిణి వరకు సఫారీ వాహనాల ద్వారా సఫారీ కొనసాగుతుంది. ఇప్పటికే మూడు వాహనాలు సిద్ధం చేయగా, వాచ్టవర్ వరకు ఒకరికి రూ.100, మొండికట్ట హరిణి వరకై తే రూ.200గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ టూర్ ద్వారా పర్యాటకులు చుక్కల జింకలు, అడవి దున్నలు, సాంబార్లను చూడొచ్చు. అంతేకాక గైడ్లతో కలిసి అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అశ్వారావుపేటరూరల్: దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. సీఐ పి.నాగరాజురెడ్డి వివరాలు వెల్లడించారు. బుధవారం మధ్యా హ్నం పట్టణంలోని పాపిడిగూడెం మార్గంలో ఎస్ఐ టి.యయాతిరాజు సిబ్బందితో వాహనాల తనిఖీ లు నిర్వహిస్తుండగా, సత్తుపల్లి వైపు అనుమానస్పదంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏపీ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం అంకంపాలేనికి చెందిన కట్టూరి సుందరబాబు, అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జక్కుల చిన్ని అలియాస్ నాగేశ్వరరావు, నరదల ప్రసాద్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పార్కింగ్ చేసి ఉండే ట్రాక్టర్ ట్రక్కులు, డబుల్ బ్లేడ్ డిస్క్ యంత్రాలు, ట్రాక్టర్ విడి భాగాలను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన ట్రాక్టర్ ట్రక్కులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, అరెస్టయిన వారిలో నారాయణపురం గ్రామవాసి జక్కుల చిన్ని అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడం గమనార్హం. నిందితుల నుంచి ట్రాక్టర్ ట్రక్కులు స్వాధీనం -
భద్రగిరిలో పునర్వసు ప్రదక్షిణ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి కొలువైన భద్రాచలంలో బుధవారం గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా సాగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా దేవస్థానం, కంచర్ల గోపన్న సేవా సమితి సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించగా అర్చకులు, పండితులు, భక్తుల శ్రీరామ నామస్మరణలతో మాఢవీధులు మార్మోగాయి. భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్రావు, స్థానాచార్యులు స్థలశాయి, సిబ్బంది లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాస్, కంచర్ల శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు. కల్యాణం.. కమనీయం దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక నిత్యకల్యాణ మహోత్సవం పూర్తిచేశారు. కాగా, విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంకు చెందిన హరీశ్రావు ఆలయ అవసరాల కోసం కలర్ ప్రింటర్ను ఈఓ దామోదర్రావుకు అందజేశారు. ఏఈఓ శ్రావణ్కుమార్, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరింత సమర్థవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు చుంచుపల్లి: జిల్లాలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్ ఆదేశించారు. కొత్తగూడెంలోని కార్యాలయంలో బుధవారం ఆయన హెల్త్ ఎడ్యుకేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి అనుమానితులకు పరీక్షలుచేసి, నిర్ధారణ అయి తే చికిత్స తీసుకునేలా చూడాలని చెప్పారు. అంతేకాక వ్యాధిపై ప్రజల్లో అపోహలను తొలగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, చేతబడి, క్షుద్ర పూజలు తదితర మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఉద్యోగులు ప్రతాప్, భద్రు, మోహన్, శ్రీనివాస్, జయలక్ష్మి, రమాదేవి, బేబీ, వినయ్కుమార్, ప్రతిభ పాల్గొన్నారు. ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం సూపర్బజార్(కొత్తగూడెం): పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రాజ్ మహమూద్ కుటుంబానికి బుధవారం ఎస్పీ రూ.లక్ష చెక్కు అందజేసి మాట్లాడారు. పోలీసు ఉద్యోగులు తమ ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యాలయ ఏఓ మంజ్యానాయక్, పోలీసు అధికారు ల సంఘం సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కుళ్లిపోయిన స్థితిలో పూజారి మృతదేహం
నెల క్రితం అదృశ్యమైన పోలంపల్లి వాసి కారేపల్లి: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీ దేవిపల్లి మండలం గట్టుమల్ల అటవీ ప్రాంతంలో బుధవారం మృతదేహంగా కనిపించాడు. కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన మూతి వీరభద్రం (45) వీరభద్రస్వామి ఆలయంలో పూజారిగా కొనసాగుతున్నాడు. నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీస్తున్నారు. ఇంతలోనే గట్టుమల్ల అటవీప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో వీరభద్రం మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించిన అక్కడి పోలీసులు కుటుంబీకులతో పాటు సర్పంచ్కు సమాచారం అందించారు. అవివాహితుడైన వీరభద్రం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆయన ఎలా మృతి చెందాడనేది గుర్తించేందుకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ వచ్చేది కేసీఆరే..
● మా హయాంలోనే సీతారామ, భక్తరామదాసు ● మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కూడా ఇచ్చాం ● ఇక్కడి ముగ్గురు మంత్రులు మోసగాళ్లు ● ఎస్ఐఆర్పై పార్టీ నేతలు, శ్రేణులు అలర్ట్గా ఉండాలి ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మంరూరల్: ‘కేసీఆర్ నాయకత్వంలో ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పుష్కర కాలం తర్వాత ఇవాళ ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎవరిని కదిలించినా ఎట్లుండే తెలంగాణ .. ఎట్టయిపోయిందనే మాటే వినబడుతుంది. మళ్లీ కేసీఆర్ రావాలి అనే మాట జనంలో నుంచి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఒకటి, రెండు కాదు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ మళ్లీ వచ్చేది కేసీఆరే.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ‘ఎస్ఐఆర్’పై ఖమ్మం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. రైతులకు అండగా ఉన్నాం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. తిరుమలాయపాలెంలోని బీడు భూములకు నీళ్లు ఇచ్చేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తిచేయగా, సీతారామ ప్రాజెక్టు కూడా 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండున్నర ఏళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేయగా.. రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు.. ఇలా చెప్పుకుంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి ప్రతీ ప్రాంతానికి చేరాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఆగిపోగా, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ముగ్గురు మంత్రులు చేసిందేమీ లేదు.. ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నా ఇక్కడ వారు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ఎవరికి వారు వారి శాఖలను గాలికొదిలేసి కమీషన్లు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరు ముగ్గురు మొనగాళ్లు కాదని, మోసగాళ్లు కావడంతో ఉమ్మడి జిల్లా నలిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పాలేరు, మిగతా నియోజకవర్గాల్లో వస్తున్న స్పందన చూసి దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని వాళ్లకు అర్థమై ఇష్టారీతిన దోపిడీకి పాల్ప డుతున్నారని విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్కు నాయకుడు రేవంత్రెడ్డి అయితే, ఇక్కడ ఆయన ముగ్గురు అనుచరులు తిష్టవేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా రాక, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు పట్టడం లేదని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్సూచించారు. బూత్ల వారీగా బలమైన కేడర్, కమిటీల నిర్మాణం జరగాలన్నారు. అలాగే ఎస్ఐఆర్ మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ ఓటర్ల జాబితాను బూత్ల వారీగా పరిశీలించి.. ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాలని చెప్పారు. పార్టీ పరంగా నియామకం అయ్యే బీఎల్ఏలు.. ఎన్నికల సంఘం నియమించే బీఎల్ఓలకు సహకారం అందించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్రాజ్, రాకేష్రెడ్డి, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సీలింగ్ భూముల హద్దులు గుర్తించాలి
ఇల్లెందు: మండలంలోని మామిడిగుండాల సీలింగ్ భూముల హద్దులను ప్రభుత్వం తక్షణమే గుర్తించడమే కాక సీలింగ్ పట్టాలు పొందిన గిరిజనులపై భూస్వామల దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఇల్లెందులోని మాస్లైన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలం నుంచి మామిడిగుండాల భూసమస్య నానుతోందన్నారు. ఏళ్ల పోరాటం తర్వాత 900 మంది గిరిజన రైతులకు 2,800 ఎకరాల సీలింగ్ భూమికి పట్టాలు ఇస్తే, మరో 1,400 ఎకరాల భూమిని ఏటా వర్షాకాలంలో లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూములకు హద్దులు చూపకపోవటం వల్లే సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి గుర్తింపునకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. సీలింగ్ యాక్ట్ను తుంగలో తొక్కి కొందరు బినామీలు భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతుండడం గర్హనీయమన్నారు. అంతేకాక గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఎస్ఏ నబీ, సిలివేరు సత్యనారాయణ, బానోతు ఊక్లా, ఎట్టి వీరభద్రం, మొంతెన వసంతరావు, మెంతెన సంజీవరావు, ఎట్టి ప్రశాంత్, అంజయ్య, దుగ్యాల వీరభద్రం, ఈసం కృష్ణ, బాలకృష్ణ, రామటెంకి అశోక్, బొర్ర వెంకన్న, బోసు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అఖిలపక్షం నేతలు -
జాబ్మేళాలో 13 మందికి ఉద్యోగాలు
రుద్రంపూర్: కొత్తగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళా లో 13 మంది ఎంపికయ్యారు. ముత్తూట్ మైక్రో లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా ఏర్పాటు చేయగా 24 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం 13 మందిని ఎంపిక చేశారని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలుభద్రాచలంఅర్బన్: పట్టణంలోని పలు హోటళ్ల లో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. తినుబండారాల్లో కీటకాలు వస్తున్నాయనే ఫిర్యాదుల మేరకు సిబ్బందితో కలిసి హోటళ్లలోని అనుమానిత ఫుడ్ శాంపిళ్లను సేకరించారు. వీటిని ల్యాబ్కు పంపించి నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలి జిల్లా మలేరియా అధికారి రాందాస్ భద్రాచలంఅర్బన్: జ్వర పీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి రాందాస్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గల మలేరియా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. వర్షా కాలం సమీపించిన తరుణంలో ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించి, దోమల మందు పిచికారీ చేసి, వైద్యశిబిరాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీలో కేటీపీఎస్ క్రీడాకారులు ప్రతిభ పాల్వంచ: ఇటీవల భూపాలపల్లిలో జరిగిన టీజీ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రికెట్ టోర్నమెంట్లో కేటీపీఎస్ 7వ దశ క్రీడాకారులు విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం క్రీడాకారులను సీఈ జె.సూర్యనారాయణ అభినందించి మాట్లాడారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ఉద్యోగులను ప్రోత్సహించడానికి యాజమా న్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు ఎస్.యుగపతి, డీఈ శేఖర్, గేమ్స్ సెక్రటరీ డి.శ్యాంసుందర్, కెప్టెన్ ఆరిఫ్, క్రీడాకారులు జి.నవీన్, ఎం.శ్రీనివాస్, వివేక్, అశోక్, విలాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ముతైర్ అహ్మద్, రమేశ్, భాను మహేశ్, శ్రీనివాస్, రాహుల్, భరత్, రామకృష్ణ,, శివ, మహే శ్, నాగరాజు పాల్గొన్నారు. అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని నాబార్డు డీడీఎం సుజిత్కుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం’అంశంపై ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన మత్స్య రైతులకు సర్టిఫికెట్లు అందజేశాక డీడీఎం మాట్లాడుతూ.. డిమాండ్కు తగ్గట్టు చేపల ఉత్పత్తి జరగాలంటే నూతన విధానాలు ఎంచుకోవాలని సూచించారు. ఇందుకోసం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, మత్స్యకారుల కోసం నాబార్డు అందిస్తున్న పథకాలను వివరించారు. కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, దివ్య, చొప్పరి రాంచంద్రం, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతినేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో వడదెబ్బకు గురై బుధవారం వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగయ్య (40) ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు. -
సులువుగా యూరియా బుకింగ్
టేకులపల్లి: జిల్లా రైతులు సులువుగా ఎరువులు కొనుగోలు చేసేలా యాప్ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి బుధవారం మండలంలోని బేతంపూడి పీఏసీఎస్లో యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఇంటి వద్ద నుంచే సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం యాప్ను రూపొందించిందని తెలిపారు. జిల్లాలో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అయితే, రైతులు అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతోందని చెప్పారు. అలాకాకుండా అధికారుల సూచనలు పాటించాలని, తద్వారా ఎరువుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ.. ప్రతీ రైతుకు సరిపడా ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు అయినా క్వింటా రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేశామని చెప్పారు. అనంతరం యాప్ ద్వారా బుక్ చేసుకున్న పలువురు రైతులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఎరువుల బస్తాలు అందజేశారు. ఆ తర్వాత టేకులపల్లి ‘ఏ’కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు లక్కినేని సురేందర్రావు, రాంబాబు, సర్పంచ్ బోడ బాలు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, డీఏఓ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు గుండాల: ఎరువులు, పురుగుమందులు ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు హెచ్చరించారు. ఆళ్లపల్లి మండలంలోని పలు షాపులను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టాక్ రిజిస్టర్లు, ఇతర వివరాలు ఆరా తీశారు. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
సన్నాల సాగు.. బాగు
● వినియోగంతో పాటే పెరుగుతున్న డిమాండ్ ● మద్దతు ధర, బోనస్తో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తన విక్రయాలుఖమ్మంవ్యవసాయం: వరిలో సన్న రకాలకు మంచి డిమాండ్ ఉంది. స్థానికంగానే కాక జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ రకాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యాన ప్రభుత్వం కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తూ ఈ రకాల ధాన్యం సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. అలాగే, రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నారు. ఈమేరకు అన్నదాతలు సన్నాలు సాగు చేసి లాభాలు పొందాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య సూచిస్తున్నారు. కాగా, కేవీకే ద్వారా బీపీటీ–5204, డబ్ల్యూజీఎల్–44, డబ్ల్యూజీఎల్–962 రకాలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కూడా పలు రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రకాల వారీగా వివరాలు.. నేలల రకాలు, వనరుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సన్న వరి వంగడాలను ఎంపిక చేసింది. ఇందులో ఆరు వరి వంగడాలు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవి. ఆయా విత్తనాల వివరాలిలా ఉన్నాయి. ●ఆర్ఎన్ఆర్–15048: ఈ రకం పంట కాలం వానాకాలంలోనైతే 125 రోజులు, యాసంగిలో 135 రోజులుగా ఉంది. ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగబడి వస్తుంది. అగ్గి తెగులను తట్టుకుంటుంది. మొగి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ●జేజీఎల్–1798: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125 రోజులు, యాసంగిలో 140 రోజులుగా నమోదైంది. ఇది కూడా ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును పూర్తిగా తట్టుకుంటుంది. అంతేకాక అగ్గి తెగులు, పాము పొడ తెగులును కొంతమేర తట్టుకుంటుంది. ●కేఎన్ఎం–1638: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125, యాసంగిలో 135 రోజులుగా ఉంటుంది. ఇది ఎకరాకు 30 – 34 క్వింటాళ్ల దిగబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకునే ఈ రకానికి ఉంటుంది. ●డబ్ల్యూజీఎల్–962: ఈ రకం వానాకాలంలో 120 – 125 రోజులు, యాసంగిలో 130 – 135 రోజులుగా పంట కాలం నమోదైంది. ఎకరాకు 25 – 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గితెగులును కొంతమేర తట్టుకునే గుణం ఉంటుంది. ●బీపీటీ–5204: ఈ రకం వరి పంట కాలం 135 – 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీన్ని సాంబమసూరి లేదా సోనామసూరి అని పిలుస్తారు. ఈ పైరుకు ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంటుంది. ●డబ్ల్యూజీఎల్–44: ఇది వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ద్వారా అభివృద్ధి చేసిన రకం. దీని పంట కాలం 140 – 145 రోజులు. ఎకరాకు 28 – 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సిద్ధి రకం కూడా పిలిచే ఇది వానాకాలం సాగుకు అనుకూలమైనది. ఈ రకం వరికి సుడిదోమ, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకార్చన జరిగాయి. అత్యవసర వాహనాలు తనిఖీ ఇల్లెందు: ఇల్లెందు, టేకులపల్లి, గుండాల మండలాల్లోని 102, 108, 1962 (పశువైద్య) వాహనాలను అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు నజీరుద్దీన్, సతీశ్ వాహనాల్లోని మందుల నిల్వలు, వైద్య పరికరాలు పరిశీలించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేలా ఫోన్ రాగానే స్పందించి నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. ఈఎంటీలు, పైలట్లు, సిబ్బంది రేణుకాదేవి, కృష్ణవేణి, అశోక్, పారవేట్ భరత్, ఉదయ్, సంజీవ, సునీల్, నాగేశ్వరరావు, సాయి, దేవా, వినోద్ ఉన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ చుంచుపల్లి: ఆరోగ్య సేవల్లో నాణ్యత పెంపుతోపాటు మాతాశిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. కొత్తగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడాన్ని వైద్యాధికారులు బాధ్యతగా భావించాలని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులకు అవగాహన కల్పించి బిడ్డ పుట్టాక తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే, ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలను కట్టుదిట్టం చేయాలని, యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వైద్యులు, ఉద్యోగులు శ్రీధర్, సాయి కల్యాణ్, ప్రసాద్, ప్రతాప్, రాందాస్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.52.95లక్షలు ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు 92 రోజులకు గాను రూ.52,95,430 ఆదాయం నమోదైందని ఈఓ జగన్మోహన్రావు తెలిపారు. లెక్కింపులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్తో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
పెనుబల్లి/బూర్గంపాడు: ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. సత్తుపల్లి మండలం యా తాలకుంటకు చెందిన నేరెళ్ల వెంకటేశ్వరరావు (55) పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరలోని తన చెల్లిలి ఇంటికి వచ్చి అక్కడి నుంచి చౌడవరంలోని కూతురి ఇంటికి వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి చేరగా కుటుంబ సభ్యులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సరికే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలాగే, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కొప్పుల శ్రీను (50) వడదెబ్బ తో మృతి చెందాడు. కొంతకాలంగా కుటుంబంతో విభేదించి భిక్షాటన చేసి జీవిస్తున్న ఆయన మంగళవారం గ్రామంలోని కొర్రాజుల గుడి వద్ద నిద్రించాడు. రెండు రోజులుగా ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఆయన నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. -
కాలగర్భంలోకి డీసీఎంఎస్!
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. రాష్ట్రంలోని పూర్వ తొమ్మిది జిల్లాల్లో ఉన్న డీసీఎంఎస్లు రైతులకు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని మార్క్ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖమ్మం డీసీఎంఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోనుంది. 60 ఏళ్ల క్రితం రైతులు, పలు వర్గాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలు, చట్టాలను రూపొందించింది. గ్రామీణస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసి, వీటికి ప్రయోజనం చేకూర్చడం, ఆర్థికంగా చేయూత నిచ్చేలా జిల్లాస్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలకు పాలకవర్గాలను నియమిస్తుండగా, డీసీఎంఎస్ ద్వారా రైతులు పండించిన పంటల కొనుగోళ్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులే కాక విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు. 1963లో ప్రారంభం ఉమ్మడి జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి 63 ఏళ్ల చరిత్ర ఉంది. 1963లో ఈ డీసీఎంఎస్ రిజి స్ట్రేషన్ కాగా, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎరువులు, క్రిమి సంహా రక మందులు, విత్తనాల అమ్మకం, పంటల కొనుగోళ్లతో బలమైన ఆర్థిక పునాదులు పడ్డాయి. ఇది జిల్లాస్థాయిలో పాలకవర్గం కలిగి రైతు సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు డీసీఎంఎస్ పరిధిలో రూ.40 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఖమ్మంలోని వెంకటగిరి గేటు వద్ద 5.12 ఎకరాల విస్తీర్ణంలో వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు, 500 మెట్రిక్ టన్నుల రెండు గోదాములు ఉన్నాయి. ఇవికాక కొత్తగూడెంలో వేయి, 500 మెట్రిక్ టన్నుల గోదాములు రెండు, భద్రాచలంలో 1,500, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు ఉన్నాయి. ఇక ఖమ్మంలో 32 షాపులతో కూడిన కాంప్లెక్స్ ఉంది. అలాగే, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద 1.20 ఎకరాలు, మధిరలో 333 గజాల స్థలం ఉంది. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.40కోట్ల వరకు ఉంటుంది. అలాగే, దుకాణ సముదాయాలు, గోదాముల నుంచి అద్దె రూపంలో నెలవారీ ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమాన డీసీఎంఎస్ రూ.15 లక్షలకు పైగా లాభాల్లో కొనసాగుతుండగా, సొసైటీని మార్క్ఫెడ్లో విలీనం చేస్తే ఆస్తులన్నీ బదలాయించే అవకాశముంది. అయితే, డీసీఎంఎస్ పరిధిలో కొనసాగుతున్న 70 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మార్క్ఫెడ్లోకి తీసుకుంటారా, లేదా అన్నది తేలాల్సి ఉంది. డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేసే అంశం రాజకీయ పార్టీల నాయకులు, రైతుల్లో చర్చ జరుగుతోంది. ఆరు దశాబ్దాలుగా రైతు లు, పలు వర్గాలకు సేవలందిస్తున్న డీసీఎంఎస్లను తొలగించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, భూములు కలిగిన డీసీఎంఎస్ను తొలగించడం కన్నా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తే రైతులు, ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. -
బీఏఎస్ విద్యార్థుల్లో ఆందోళన
ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల (బీఏఎస్) పథకం ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం మొదలై రెండు రోజులైనా అనుమతించకపోవడం ఇందుకు కారణమైంది. పథకం ఈ విద్యా సంవత్సరం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఓ పాఠశాల యాజమాన్యం ఏకంగా వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించడం గమనార్హం. ఏటా ఇలానే వేధిస్తున్నందున ప్రభుత్వం స్పందించి పిల్లల భవిష్యత్ను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సీ డీడీ జి.జ్యోతిని వివరణ కోరగా.. బీఏఎస్ పథకం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమై పిల్లలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. మరోమారు పరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు. యువకుడిపై పోక్సో కేసు ఖమ్మంక్రైం: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన డిగ్రీ చదివే యువకుడు అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో చోరీకి యత్నం ఖమ్మంక్రైం: ఖమ్మంలోని డీమార్ట్ సమీపాన ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి గడ్డ పారతో ఇంటి గొడను పగులకొడుతుండగా ఆ మార్గంలో వెళ్తున్న ఆటోడ్రైవర్, ఆయన స్నేహితుడు అడ్డుకోబోగా వారిపై దాడికి యత్నించారు. దీంతో వారు కేకలు వేయడంతో స్థానికులు చేరుకోగా ఓ మహిళ పట్టుబడగా త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. -
జోరుగా నకిలీ విత్తనాల విక్రయం?
ఏన్కూరు: ఏన్కూరు కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన హెచ్టీ బీసీ–3 విత్తనాలను కొందరు విక్రయిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళ గుడ్డ సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చిన అక్రమార్కులకు గిరిజనులఅమాయకత్వమే ఆసరా అవుతోంది. ఈ విత్తనాలు వారికి అంటగడుతూ సొమ్మ చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక నిషేధించిన కలుపు మందు గ్లైసిన్ కూడా విక్రయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, అడపాదడపా అధికారులు కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. గత ఏడాది కేసులు మండలంలోని రేపల్లెవాడ, ఏన్కూరు గ్రామాల్లో గత ఏడాది నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకొని రూ.14 లక్షల విలువైన 560 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండే ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జోరుగా సాగుతోందని సమా చారం. ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేస్తూ విత్తనాలు ఇస్తున్నారని తెలిసింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు.. హెచ్టీ బీటీ–3 విత్తనాల సాగుతో ప్రజలకేగాక ఇతర ప్రాణులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ విత్తనాల సాగుతో కలుపు బెడద లేకు న్నా అనేక నష్టాలు ఎదురవుతాయని చెబుతున్నా రు. మరోపక్క కొన్నిచోట్ల కలుపు నివారణకు నిషేధిత గ్లైసిన్ మందు పిచికారీ చేస్తుండడం, ఈ భూముల్లో పంట అవశేషాలను పశువులు, మేకలు తింటే అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాయి. వీటి ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం ఉన్నా అక్రమార్కులు దొడ్డిదారిన తీసుకొచ్చి గిరిజన రైతులకు అంటగడుతున్నారని సమాచారం. మండలంలో మూడేళ్లుగా ననిలీ విత్తనాల దందా సాగుతున్నా వ్యవసాయ, పోలీసు శాఖలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ బృందాలు లైసెన్సు కలిగిన విత్తన దుకాణాల్లో తనిఖీ చేస్తూ, గ్రామాల్లో లూజ్గా జరుగుతున్న అమ్మకాలపై దృష్టి పెట్టడంలేదని చెబుతున్నారు. ఇకనైనా గ్రామాల్లో సైతం విస్తృత తనిఖీలు చేయడమే కాక నిషేధిత విత్తనాల సాగుతో ఎదురయ్యే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
ఠాణా.. నిఘా అణువణువునా
● ప్రతీ పోలీస్ స్టేషన్లో 11 చొప్పున సీసీ కెమెరాలు ● డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ● సుప్రీంకోర్టు సూచనలతో ఏర్పాటు భద్రాచలంఅర్బన్: సుప్రీంకోర్టు సూచన మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో 11 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంతో పాటు ఇంకొన్ని పీఎస్లలో వీటి ఏర్పాటు పూర్తి కాగా, మిగతా స్టేషన్లలో పనులు చివరి దశకు చేరాయి. నేరుగా తెలుసుకునేందుకు.. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనేది తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక కీలకమైన కేసుల సమయాన ఆధారాల కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, ఎస్హెచ్ఓ, కంప్యూటర్ రికార్డులు భద్రపర్చే గది, సీజ్ చేసిన వాహనాలు నిలిపే ప్రదేశం, స్టేషన్ ప్రధాన ద్వారం, ఫిర్యాదుదారులు వేచి ఉండే గది, రెండు లాకప్ రూమ్ల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో మాట్లాడిన మాటలు కూడా రికార్డు అయ్యేవి ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే సిటిజన్ ఫీడ్బ్యాక్ స్కానర్ ఏదైనా సమస్య, కష్టం వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిని పోలీసు ఉద్యోగులు పట్టించుకోకున్నా, నిర్లక్ష్యం చేసినా, ఇబ్బంది పెట్టినా ఫీడ్బ్యాక్ ఇచ్చేలా ఇప్పటికే స్టేషన్ల ఆవరణలో క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటుచేశారు. ఫిర్యాదు, ఈ–చలాన్, ఎఫ్ఐఆర్, పాస్పోర్టు ధ్రువీకరణతో పాటు ఇతర అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలపడానికి ఈ స్కానర్లు ఉపయోగపడుతున్నాయి. అంతేకాక స్టేషన్కు వెళ్లిన వారు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం సులువవుతోంది. తాజాగా పోలీస్స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేయడమే కాక రికార్డు దృశ్యాలను నేరుగా డీజీపీ కార్యాలయంలో వీక్షించేలా అటాచ్ చేశారు. దీంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరిగి పనితీరులో మెరుగైన మార్పు వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కెమెరాలు ఉన్నాయి. అయినప్పటికీ 11 కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో పనులు చేయిస్తున్నాం. జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటుచేస్తాం. అంతేకాక కెమెరాల పుటేజీని నేరుగా డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఉద్యోగులు జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. – రోహిత్రాజు, ఎస్పీ -
ఆశలు.. ఆవిరి
బూర్గంపాడు: సీజన్ ఆరంభంలోనే పత్తి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. అదును దాటుతుందనే భావనతో చినుకు పడకముందే పొడి దుక్కుల్లో గింజలు వేయగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అటూఇటు కాని వర్షంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పొడి దుక్కుల్లో వేసిన పత్తిగింజలు తేలికపాటి వర్షానికి మొలకలు వచ్చినా.. ఆ తర్వాత వరుణుడి కరుణ లేక అవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు రెండోసారి పత్తి గింజలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటికే కొందరు రైతులు రెండో విడతగా గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు. 50 వేల ఎకరాల్లో జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఇలా బూర్గంపాడు, అశ్వాపురం, టేకులపల్లి, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, ఇల్లెందు తదితర మండలాల్లో పొడి దుక్కుల్లోనే సుమారు 50 వేల ఎకరాలలో నాటినట్లు అంచనా. ఇలా నాటడం ద్వారా వర్షాలు పడగానే గింజలు మొలకెత్తుతాయని, తద్వారా త్వరగా పంట చేతికి వస్తుందని రైతులు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే జూన్ మొదటివారంలో విత్తనాలు నాటగా, తేలికపాటి జల్లులకు గింజలు మెత్తబడి మొలకలు తిరిగాయి. కానీ, ఆ తర్వాత జల్లుల జాడ లేకపోవడంతో మొలకలు వడలిపోతున్నాయి. అంతేకాక నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి రెండోసారి విత్తనాలు నాటుతుండగా.. ఇంకొందరు వర్షాలు కురిశాకే నాటాలనే భావనతో వేచిచూస్తున్నారు. ముందుగానే అధికారుల హెచ్చరిక ఏటా వ్యవసాయశాఖ అధికారులు ఒకటి, రెండు వర్షాలు కురిశాకే విత్తనాలు నాటాలని సూచిస్తారు. ఈసారైతే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని.. వరి, పత్తికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేశారు. కానీ రైతులు మాత్రం తమ అనుభవాలకు అనుగుణంగా పొడి దుక్కుల్లో గింజలు వేసి దెబ్బతిన్నారు. ఈ నెల మూడో వారం వచ్చినా కనీసం నాలుగైదు సెం.మీ. వర్షం కూడా లేక పత్తితో పాటు ఇతర పంటల సాగుకు సైతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ అంచనాలతో రైతులు ఆశలు చంపుకోలేక రెండో విడతగా పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జూన్, జూలై, ఆగస్ట్లోనే పత్తి పైరు ఎదగాలని, లేకపోతే ఆ తర్వాత వర్షాలు తక్కువగా ఉండి పైరు పెరుగుదల లోపిస్తుందని చెబుతున్నారు. అందుకే తొలివిడత నాటిన విత్తనాలు మొలకెత్తకపోయినా, రెండో సారి వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదటిసారి పత్తి విత్తనాలు నాటేందుకు రైతులకు ఎకరానికి రూ.5వేలకు పైగా ఖర్చు అయింది. భూమి దుక్కి చేసేందుకు ఎకరాకు రూ.2వేలు, సాళ్లు తోలేందుకు రూ.వేయి, పత్తి విత్తనాలు రెండు ప్యాకెట్లకు రూ.1,700, గింజలు నాటిన కూలీలకు రూ.800 చొప్పున వెచ్చించారు. అయితే, ప్రతికూల వాతావరణంతో ఈ గింజలు దెబ్బతినగా మళ్లీ గింజలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెవెన్యూ పరిధిలోని రైతులు సుమారు 4 వేలకు పైగా ఎకరాల్లో పొడి దుక్కుల్లోనే పత్తి గింజలు వేశారు. వీరు విత్తనాల కొనుగోలుకే రూ.70లక్షల వరకు వెచ్చించినట్లు అంచనా. మళ్లీ రెండోసారి విత్తనాలకు అంతే మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి జిల్లాలోని అనేక గ్రామాల్లో నెలకొంది. రెండు విడతలు కలిసి రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెట్టక తప్పదని తెలుస్తోంది. వర్షాభావంతో ఎండిపోతున్న పత్తి మొలకలు ఈ నెల 10వ తేదీన కురిసిన వర్షానికి పొడి దుక్కుల్లో వేసిన పత్తిగింజలు మొలకలు తిరిగాయి. అప్పటి నుంచి చినుకు జాడ లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయి. దీంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా నష్టం వచ్చింది. రెండో సారి విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.4 వేలకు పైగా ఖర్చవుతుంది. – యడమకంటి రవీందర్రెడ్డి, రైతు, నాగినేనిప్రోలు ఈనెల మొదటివారం 60 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. ఎకరాకు రెండున్నర ప్యాకెట్ల చొ ప్పున విత్తనాలకే రూ.1.50 లక్ష లు అయింది. తొలి వర్షానికి మొలకెత్తినా ఇప్పుడు ఎండిపోయాయి. మళ్లీ విత్తనాలు వేయిస్తున్నా. తొలివిడతలో విత్తనాలు, ఇతర ఖర్చులు రూ.2లక్షలు కాగా, మళ్లీ అంతే ఖర్చు పెట్టక తప్పదు. – గాదె ప్రభాకర్రెడ్డి, రైతు, రెడ్డిపాలెం -
రామయ్యా.. ఏమిటిలా?!
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల వ్యవహారం అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఆలయ అభివృద్ధి మొదటి దశ పనులకు ఇప్పటికే రెండు మార్లు టెండర్లు ఆహ్వానించినా ఓ కొలిక్కి రాలేదు. తొలిసారి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో రెండోమారు పిలిచారు. ఈసారి ఒకే బిడ్ దాఖలవడంతో వ్యవహారం ఆర్అండ్బీ శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి చేరింది. ఉన్నతాధికారులు దీన్ని ఆమోదిస్తారా లేక ఒక్కటే నమోదైనందున మూడోసారి టెండర్లను ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆమోదమా.. ఆపేస్తారా ? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధికి సుమారు రూ.351 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. తొలి విడత రూ.200 కోట్ల పనులకు ఒకే బిడ్ నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పేరున్న నిర్మాణ కంపెనీలు ముందుకు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకే కంపెనీ ముందుకు రావడంతో అంతర్గతంగా ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. అయితే, ఈ టెండర్లోనూప్రైస్ బిడ్ను తెరిచాక ఆమోదిస్తారా, లేక అంచనాలకు తగినట్లుగా లేకపోతే తిరిగి టెండర్లు ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. తిరిగి టెండర్లు ఆహ్వానిస్తే మరో నెల సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం మే 1వ తేదీ నాటికి పనులను ప్రారంభించాలని సూచించింది. ఈ పనుల పూర్తికి 30 నెలలు గడువుగా పేర్కొన్నా పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు టెండర్ల వ్యవహారమే కొలిక్కి రాకపోవడంతో పరిస్థితి ఏమిటన్నది ఎటూ తేలడం లేదు. రెండో సారి నిర్వహించిన టెండర్లలో టెక్నికల్ బిడ్ తెరిచాం. ఒకే నిర్మాణ కంపెనీ టెండర్ దాఖలు చేసింది. దీన్ని మా శాఖ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫీస్కు పంపించాం. అక్కడ ఉన్నతాధికారులు పరిశీలించి, ఫైనాన్షియల్ బిడ్ తెరిచాక తుది నిర్ణయం తీసుకుంటారు. – లాల్సింగ్, ఎస్ఈ, ఆర్అండ్బీ శాఖ దేవస్థానం అభివృద్ధిలో మొదటి దశలో భాగంగా ఆలయ కాంప్లెక్స్ విస్తరణను నిర్ణయించారు. సుమారు రూ.200 కోట్ల పనుల బాధ్యతలను ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. తొలిసారి మే 9 నుంచి 15వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించగా ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. దీంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించగా ఒకే కంపెనీ నుంచి బిడ్ దాఖలైంది. ఈమేరకు హైదరాబాద్లోని శాఖ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫీస్కు పంపించారు. ఈ బిడ్ స్క్రూట్నీ అనంతరం ప్రైస్ బిడ్ను తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వారం నుంచి పది రోజులు పడుతుందని సమాచారం. -
పెద్దమ్మతల్లి ఆలయ ఈఓగా విజయ్కుమార్
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రా మాల మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ నూతన ఈఓగా అద్దెంకి విజయ్ కుమార్ సోమవారం విధుల్లో చేరారు. ప్రసు త్తం ఈఓగా ఉన్న రజినీకుమారి అనారోగ్య కారణాలతో సెలవులో వెళ్లారు. దీంతో వరంగల్ భద్రకాళి ఆలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై గ్రేడ్–1 ఈఓగా నియమితులైన విజయ్కుమార్ను పెద్దమ్మతల్లి ఆలయ రెగ్యులర్ ఈఓగా నియమించారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీకొత్తగూడెంఅర్బన్: జర్నలిస్టు యూనియన్ల నుంచి అందిన వినతి మేరకు ఎయిడెడ్, ప్రైవే ట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ 50 శాతం ఇవ్వాలని సూ చిస్తూ విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలు, అక్రిడిటేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సంప్రదించా లని విద్యాశాఖ ఏడీ శంభుప్రసాద్ సూచించా రు. అక్రిడిటేషన్ కార్డు రాని వారి వివరాలను యూనియన్ల నాయకులు అందిస్తే జిల్లా విద్యా శాఖ నుంచి పాఠశాలలకు ఉత్తర్వులు పంపిస్తామని తెలిపారు. నేటి నుంచి సింగరేణి అధికారుల ఆందోళన? రుద్రంపూర్: సింగరేణిలో అధికారుల సమస్య లను యాజమాన్యం పరిష్కరించడం లేదని, కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటూ ఆందోళన చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం నుంచి రామగుండం రీజియన్లో, ఈ నెల 20న కొత్తగూ డెం రీజియన్లో సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యాన నిరసన తెలపనున్నట్లు తెలిసింది. అధికారులకు మూడేళ్లుగా ప్రాఫిట్ రిలేటెడ్ పే (పీఆర్పీ) బకాయిలు రూ.277 కోట్లు రావాల్సి ఉండగా, మంత్రులు, డైరెక్టర్లను కలిసినా ఫలి తం లేదని చెబుతున్నారు. అంతేకాక పీఆర్పీ చెల్లింపుపై కోలిండియా నుంచి ఉత్తర్వులు ఉన్నాయా అని ప్రశ్నిస్తుండడంతో చేసేదేం లేక ఆందోళన బాట పడుతున్నట్లు తెలిసింది. ఏడుగురికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి ఖమ్మంసహకారనగర్: ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక వీరిని ఖాళీగా ఉన్న స్థానాల్లో కేటాయించారు. ఈమేరకు నేలకొండపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్గా ఉన్న జి.లక్ష్మణ్ను వేంసూరుకు, కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పఠాన్ ఖాజా మొహినుద్దీన్ను మధిరకు బదిలీ చేసి డిప్యూటేషన్పై కూసుమంచికి కేటాయించారు. అలాగే, కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె.అప్పిరాములును అక్కడే కేటాయించగా, ఖమ్మం ఎస్డీసీ(రైల్వేస్)లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్.జగదీష్కుమార్ను ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్కు, ఖమ్మం రూరల్ మండలంలో పనిచేస్తున్న కే.వీ.వీ.ప్రసాద్ను ఖమ్మం డీసీఎస్ఓకు బదిలీ చేసి డిప్యూటేషన్పై కొణిజర్లలో విధులు కేటాయించారు. ఇక కామేపల్లి తహసీల్ నుంచి దినవాహి జ్యోతికి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చి ఎర్రుపాలెంకు, పాల్వంచ ఎస్డీసీలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.సులోచనకు పెనుబల్లిలో పోస్టింగ్ ఇచ్చి డిప్యూటేషన్పై ఏన్కూరుకు కేటాయించారు. కొనసాగిన బస్సుల తనిఖీలు ఖమ్మంక్రైం: ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు రెండో రోజైన మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న మూడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బస్సులను గుర్తించి కేసు నమోదు చేశా మని ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇకనైనా పాఠశాలల యాజమాన్యాలు అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, లేనిపక్షంలో సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలి కూసుమంచి: రైతుల వివరాల నమోదుకు చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని నూరుశాతం పూర్తి చేయా లని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన కూసుమంచిలోని రైతువేదిక నుంచి హాజరయ్యారు. అనంతరం శాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీపై దృష్టి సారించడమే కాక రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ తర్వాత పాలేరులోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఆత్మ పీడీ సరిత, కూసుమంచి ఏడీఏ సతీశ్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు. -
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
గుండాల: ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే కాక హాజరుశాతం పెరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆళ్లపల్లి మండలంలోని పెద్ద వెంకటాపురం, ఆళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పిల్లలను తప్పక బడికి పంపేలా తల్లిదండ్రలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయులు బోధనతో పాటు మధ్యాహ్న భోజనం అమలుపై దృష్టి సారించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆ తర్వాత పెద్దవెంకటాపురం – ఆళ్లపల్లి మధ్య రోడ్డు, కుంగిపోయిన కల్వర్టును పరిశీలించిన ఆయన.. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ ఉషారాణి, ఎంఈఓ శాంతారావు తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి కలెక్టరేట్లో మంగళవారం ఆయన పలు ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా భూమి సేకరించాలని తెలిపారు. సర్వేకు అదనపు సర్వేయర్లు అవసరమైతే ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. కాలేజీల్లో మరమ్మతులు పూర్తి చేయాలి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. 14 కాలేజీల్లో రూ.3.31 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే, ప్రవేశాలు, బోధన ఇతర అంశాలపై సమీక్షించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
వీధి వ్యాపారులకు ‘స్వనిధి’
ఖమ్మంమయూరిసెంటర్: కరోనా కష్టాల నుంచి కోలుకుని స్వయం ఉపాధితో ముందడుగు వేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్రప్రభుత్వ పీఎం స్వనిధి(ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి) పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఖమ్మంజి ల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీచేయడమే కాక వ్యాపార విస్తరణకు బ్యాంకుల నుంచి విడతల వారీగా రుణాలు ఇస్తున్నారు. మొదటి విడతగా రూ.15వేలు అందించి, అది సకాలంలో చెల్లిస్తే రెండో విడతగా రూ.24వేలు, అది చెల్లించాక మూడో విడతగా రూ.50వేల మేర రుణం మంజూరు చేస్తారు. తద్వారా వ్యాపారాల విస్తరణ, ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. 31వేల మందికి పైగా గుర్తింపు జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెప్మా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 31,666 మంది వీధి వ్యాపారులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 31,207 మందికి గుర్తింపు కార్డులు, 24,959 మందికి వెండింగ్ సర్టిఫికెట్లు సైతం అందజేశారు. అత్యధికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23,993 మంది వ్యాపారులు నమోదయ్యారు. చకచకా మంజూరు చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించి వారి ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఇప్పటివరకు మొత్తం రూ.70.01 కోట్ల రుణాలు అందించారు. మొదటి విడతలో రూ.15వేల చొప్పున 22,449 మంది వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా, అందులో 22,301 మందికి రూ.23.06 కోట్లు పంపిణీ చేశారు. ఖమ్మంలో అత్యధికంగా 16,596 మందికి, సత్తుపల్లిలో 2,013 మందికి మొదటి విడత సాయం అందింది. రెండో విడతలో రూ.25వేల చొప్పున(మొదటి విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) జిల్లాలో 11,535 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 11,434 మంది లబ్ధిదారులకు రూ.24.02 కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. ఇక మూడో విడతలో రూ.50వేలు చొప్పున (రెండో విడత రుణం సకాలంలో చెల్లించిన వారికి) 4,350 మందికి మంజూరు చేయగా, 4,263 మంది వ్యాపారులకు రూ.22.93 కోట్ల మేర ఆర్థికసాయం లభించింది. సత్తుపల్లి, వైరా భేష్.. వీధి వ్యాపారులను ఉమ్మడి గ్రూపులు(సీఐటీ గ్రూపులు)గా ఏర్పాటు చేయడంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 284 గ్రూపులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో ఇప్పటివరకు 220 గ్రూపులను ఏర్పాటయ్యాయి. ఇందులో సత్తుపల్లి మున్సిపాలిటీ 22 గ్రూపుల లక్ష్యానికి వంద శాతంతో జిల్లాలో అగ్రస్థానాన నిలవగా, వైరా మున్సిపాలిటీ కూడా 21 గ్రూపులకు 20 గ్రూపులను ఏర్పాటు చేసి 95.24శాతానికి చేరింది. ఇక ఖమ్మం కార్పొరేషన్లో 218 గ్రూపుల లక్ష్యానికి గాను 158 గ్రూపులు ఏర్పాటయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆరు పట్టణ ప్రాంతాల్లో పీఎం స్వనిధి కింద కొత్తగా లక్ష్యాలను నిర్దేశించారు. మొదటి విడత : ఈ ఏడాది మరో 4,465 మంది వీధి వ్యాపారులకు మొదటి విడత రుణం అందించాలి. ఇందులో ఖమ్మం కార్పొరేషన్లో 2,867, ఏదులాపురంలో 704 మందిని లక్ష్యంగా నిర్దేశించారు. మిగతా లక్ష్యంలో ఇతర మున్సిపాలిటీల నుంచి ఎంపిక చేయా ల్సి ఉంటుంది. రెండు, మూడో విడత : రెండో విడత కింద 2,004 మందికి, మూడో విడత కింద 553 మందికి రుణాలు ఇప్పించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.కేంద్రప్రభుత్వ పథకం ద్వారా రుణాలు -
మోదీ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి
చుంచుపల్లి: ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనలో అగ్ర దేశాలకు దీటుగా భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యాన మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సుస్థిర పాలనను అందించడమే కాక అభివృద్ధిలో దేశాన్ని ముందు నిలిపిన మోదీని ప్రజలు ఎప్పటికీ మర్చి పోరని తెలిపారు. బీజేపీ హయాంలో పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత, డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాల రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, సీఏఏ, భారత న్యాయసంహిత, లేబర్ కోడ్లల సంఘటీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాక ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేశారన్నారు. ఈ మేరకు కేంద్రం అమలుచేస్తున్న పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా తెలంగాణలోనూ అధికారం సాధించొచ్చని బాల రాజు వివరించారు. సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, డాక్టర్ విజయ్చందర్, జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
యాప్తో యూరియా బుకింగ్ సులువు
ఇల్లెందురూరల్: ప్రభుత్వం యూరియా సరఫరాకు ప్రవేశపెట్టిన యాప్ రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన మండలంలోని చల్లసముద్రం రైతు వేదిక నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలో యూరియా లభ్యత తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా అనుకూలమైన సమయంలో తీసుకునేలా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాక పంపిణీలో పారదర్శకత, బ్లాక్ మార్కెట్ను అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో ముకుందాపురం రైతు వడ్డె మహేష్ మాట్లాడారు. రబీలో వరి సాగు చేసిన తాను యాప్ ద్వారా సులభంగా యూరియా కొనుగోలు చేశానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ లాల్చంద్, ఏవో సతీష్, ఏఈఓ సందీప్, ఫెర్టిలైజర్ డీలర్ల సంఘం బాధ్యులు నాళ్ల సోమసుందర్, వ్యామసాని జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
బడి స్థలానికి కంచె..
టేకులపల్లి: మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండాలోని హరిజన చెర్రీ ప్రాథమిక పాఠశాలకు 1985లో భూక్యా చంద్రు సొంత భూమిని విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి 41 ఏళ్లుగా ఎందరో పిల్లలు ఇందులో చదువుతున్నారు. అయి తే, ప్రస్తుతం చంద్రు కుమారుడు దేవుజా కుటుంబీకులు రంగప్రవేశం చేసి వేసవి సెలవుల్లో పాఠశాల ప్రహరీని కూల్చడమే కాక ఆవరణలోని కొన్ని చెట్లను తొలగించారు. అలాగే, పాఠశాల స్థలాన్ని తమ భూమిలో కలుపుతూ దున్నించి ఫెన్సింగ్ వేశారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాగే కొంత స్థలాన్ని కలుపుకున్నట్లు తెలిసింది. ఈసారి కూడా అలాగే చేయగా పాఠశాలలు తెరిచేందుకు సోమవారం వచ్చిన హెచ్ఎం లక్ష్మణ్, ఉపాధ్యా యులు ఇదేమిటని ఆరా తీస్తే తమ పట్టా భూమిలో కంచె వేసుకున్నామని దేవుజా సమాధానం చెప్పారు. దీంతో మంగళవారం ఎంఈఓ జగన్, కాంప్లెక్స్ హెచ్ఎం రామచంద్ర సింగ్, సర్పంచ్ శివ, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు బానోతు సరోజిని తదితరులు దేవుజాతో చర్చించారు. ఈ విషయమై ఆదివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దాత వారసుల తీరుతో వివాదం -
భద్రాచలంలో బెల్ట్ షాపుల నిషేధం
గ్రామ పంచాయతీ పాలకమండలి తీర్మానం భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని బెల్ట్ షాపులను నిషేధిస్తూ మంగళవారం గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేయించాలని తీర్మానం చేశారు. ఈ క్రమాన ఎవరైనా బెల్ట్షాపులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, నివాస ప్రాంతాల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపునకు యజమానులకు నోటీసులు ఇవ్వాలని, ప్రధాన డ్రెయినేజీల్లో పూడిక తీత తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వార్డు సభ్యులతో పాటు ఈఓ శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
బూర్గంపాడు: బైక్పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్పై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సారపాక పల్లెప్రకృతి వనం వద్ద మంగళవారం ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.1.05 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. రవాణా చేస్తున్న మలుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బడే భరత్, ఉప్పరపల్లి వెంకటేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై కేసు దమ్మపేట: మండలంలోని గణేశ్పాడు శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై మంగళవారం కేసు నమోదైంది. గణేశ్పాడు శివారులో 4.04 ఎకరాల ప్రభుత్వ భూమిని సత్తుపల్లి మండలం రామగోవిందాపురం గ్రామానికి చెందిన ఊకే రాములు, కనసాని జగ్గాచారి ఆక్రమించారు. ఈ భూమిలో వరి సాగు చేయయడమే కాక పంట కూడా తీసుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రామనరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. ఓటర్ల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలికారేపల్లి: 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయడమే కాక ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వేకు ఉద్యోగులు సిద్ధం కావాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కారేపల్లిలో మంగళవారం బీఎల్ఓలతో పాటు పార్టీల బీఎల్ఏలు, సర్పంచ్లతో ఎస్ఐఆర్(ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ)పై అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. తొలుత ఉద్యోగులతో సమావేశమైన అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు పూర్తయిన మ్యాపింగ్పై ఆరా తీశాక మిగతా వారిని విభాగాల వారీగా విభజించిఇంటింటికి సర్వే సమయాన ఎన్యుమరేషన్ ఫామ్లు సేకరించాలని ఆదేశించారు. ఈవిషయంలో పార్టీల బీఎల్ఏలు, సర్పంచ్లు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. సింగరేణి తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్, సర్పంచ్లు మేదరి టోనీవీరప్రతాప్, భూక్యా రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
కార్మిక సమస్యలు పరిష్కరించాలి
మణుగూరు టౌన్: పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ అన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో, పీకేఓసీ–2 గేట్ వద్ద నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8న యాజమాన్యానికి 31 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. డిపెండెంట్లకు నియామకపత్రాలు ఇవ్వాలని, 40 శాతం లాభాల వాటా, విద్యుత్ కంపెనీలు సింగరేణికి బకాయి ఉన్న రూ.56 వేల కోట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంతింటి పథకం అమలు చేయాలని, రూ. 30 లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని కోరారు. మణుగూరు భవిష్యత్ కోసం పీకేఓసీ–2 డీప్సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి– సేవ్ మణుగూరు అనే నినాదంతో అన్ని యూనియన్లను, రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం చేపడతామన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు మేకల ఈశ్వర్రావు, ఆవుల నాగరాజు, బి.సురేందర్, శనిగరపు కుమారస్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి దర్గ్యాల సుధాకర్, ఇమాముద్దీన్, తేనేటి నారాయణ, శ్రీనివాస్ యాదవ్, రవికుమార్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ -
పరిస్థితులకు అనుగుణంగా సాగు చేపట్టాలి
టేకులపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడమే కాక వ్యవసాయాధికారుల సూచనల మేరకే రైతులు పంటల సాగు చేయాలని ఇల్లెందు వ్యవసాయ సహాయ సంచాలకులు గుగులోత్ లాల్చంద్ సూచించారు. మండలంలోని కొత్తతండా(పీ) గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన వర్షపాతం ఇంకా కురవలేదని, కనీసం 60 – 70 మి.మీ. వర్షపాతం నమోదైతేనే విత్తనాలు నాటాలని తెలిపారు. లేకపోతే విత్తనాలు మొలకెత్తక నష్టం వస్తుందన్నారు. అంతేకాక ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్నకు బదులు పెసర, కంది, నువ్వులు, పలు రకాల కూరగాయలు, ఆయిల్పామ్పై దృష్టి సారించాలని తెలిపారు. వరి సాగు చేయాలనుకునే రైతులు బీపీటీ 5204, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798, డబ్ల్యూజీఎల్ 962 వంటి మేలైన రకాలే ఎంచుకోవాలని సూచించారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించి నకిలీ, అనుమతి లేని విత్తనాల విక్రయాలను కట్టడి చేసేందుకు తనిఖీలు చేపడుతున్నామని ఏడీఏ తెలిపారు. సదస్సులో ఏఓ నీరుడు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి పాల్వంచరూరల్: వారం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థిని పొడియం శ్రీవల్లి (17) చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని కొత్తసూరారానికి చెందిన శ్రీవల్లి.. స్నేహితురాలు వైష్ణవితో కలిసి భద్రాచలం వెళ్లి స్కూటీపై వస్తుండగా ఈ నెల 9వ తేదీన మర్రికుంట వద్ద లారీ ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీవల్లి తీవ్రంగా గాయపడగా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. స్థానికులు చందాలు వేసుకుని, దహన సంస్కారాలు చేశారు. అంబులెన్స్ ఢీకొని మహిళ.. ఇల్లెందు: పట్టణంలోని జగదాంబసెంటర్లో ఆదివారం రాత్రి 108 అంబులెన్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన మామిడిగూడెం గ్రామానికి చెందిన గుర్రం ఇంద్రజ (33) సోమవారం మృతి చెందింది. సీఈఆర్ క్లబ్లో జరుగుతున్న డ్యాన్స్ పోటీలు తిలకించి ఇంటికి తన భర్త రాజుతో వెళ్తున్న ఇంద్రజను అంబులెన్సు ఢీ కొట్టింది. ఇంద్రజతోపాటు రాజు కూడా గాయపడగా ఇద్దరినీ ఖమ్మం తరలించగా ఇంద్రజ మృతి చెందినది. ఆమె సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అంబులెన్స్ డ్రైవర్ పి.కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న ప్రేమ జంట జూలూరుపాడు: కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువతీ, యువకుడు సోమవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దుమ్ముగూడెంనకు చెందిన దివ్యలక్ష్మి, జూలూరుపాడుకు చెందిన నరేందర్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుని, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల వారితో పోలీసులు మాట్లాడారు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారు పూలదండలు మార్చుకున్నారు. డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలను సోమవారం సర్పంచ్ పోదెం స్వరూప, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేశారు. కేశెట్టి ఖాదర్బాబు, బానోత్ సురేశ్, భూక్య సైదులు, చిలువేరు చంద్రశేఖర్, సామినేని సత్యనారాయణ, రేఖ రామచంద్ర, కుంజ సాంబయ్య, మాసిపాక రామస్వామి, అన్నారపు రవి, ఈసాల రవీందర్, సూరే వీరస్వామి, బాలాజీ, మురికి సత్యనారాయణ, మురికి శంకర్, ఈర్ప వెంకటేశ్, మహమ్మద్ మున్నా, మాడే అంజమ్మ, మాసిపాక అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నృత్య పోటీలు
ఇల్లెందు: పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో రెండు రాష్ట్రాలస్థాయి డ్యాన్స్ పోటీలు ఆదివారం ప్రారంభమై సోమవారం ముగిశాయి. కడారి వెంకట్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో బాల, సాయి జ్ఞాపకార్థం, 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య జన్మదినం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారు. సీనియర్ గ్రూపు విభాగంలో నాచురల్ నవీన్ టీం(వరంగల్), ఎంజే అశోక్ టీం(మణుగూరు)కు ప్రథమ బహుమతి లభించగా కల్యాణ్ టీం (భూపాలపల్లి)కు ద్వితీయ, గణేశ్ టీం(భూపాలపల్లి)కు తృతీయ బహుమతి వచ్చాయి. జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి వనపర్తి టీం, ద్వితీయ జమ్మికుంట టీం, తృతీయ బహుమతి గోదావరిఖని టీం గెలుపొందాయి. సీనియర్ సోలోలో విశాఖపట్నం టీం ప్రథమ, పరమేశ్కుమార్ (హైదరాబాద్) ద్వితీయ, లాస్య (జమ్మికుంట) తృతీయ బహుమతు సాధించారు. విజేతలకు కౌన్సిలర్ సారయ్య, పాబోలు స్వాతి, పింగళి అనూహ్య బహుమతులు అందజేశారు. -
● ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులకు ఆస్కారం ● వరి సాగు తగ్గించాలంటున్న వ్యవసాయ శాఖ ● ప్రత్నామ్నాయ పంటలు వేయాలంటూ ప్రచారం ● వైవిధ్య పంటల కొనుగోలుకు మాత్రం దక్కని సర్కారు హామీ
6.37 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లా వ్యాప్తంగా గతఖరీఫ్ సీజన్లో 6.09 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 2.04లక్షల ఎకరాల్లో పత్తి, ఆ తర్వాత స్థానంలో 1.65లక్షల ఎకరాల్లో వరి, 86 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 6.37 లక్షల ఎకరా ల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధి కారులు అంచనా వేశారు. పత్తి 2.10 లక్షల ఎకరా లు, వరి 1.75 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎల్నినో ప్రభా వం కారణంగా సాధారణకంటే తక్కువవర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యాక్షన్ ప్లాన్లో మార్పు తప్పనిసరైంది. వరి సాగులో కోతలు ఖరీఫ్లో సవరించిన యాక్షన్ ప్లాన్ విషయానికి వస్తే జూలై 15లోగా సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉంటే 1.75 లక్షలకు బదులుగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఒక వేళ లోటు వర్షపాతం నమోదైతే వరి సాగు విస్తీర్ణాన్ని లక్ష ఎకరాలకే పరిమితం చేయాలని వ్యవసాయ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 65వేల ఎకరాల్లో వరికి బదులుగా ఇతర పంటలను వేయాల్సి ఉంటుంది. నీటిని ఎక్కువ వినియోగించే మొక్కజొన్న విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా రైతులు పత్తి వైపు మళ్లితే తిప్పలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో సంతృప్త స్థాయిలో పత్తి సాగు జరుగుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా, పత్తి రైతుకు తిప్పలు పడుతూనే ఉన్నారు. ఈ సాగు ఇంకా పెరిగితే ఇబ్బందలు తప్పవు. కొంటామనే హామీ ఇస్తేనే.. ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం ఎంతగా చెబు తున్నా.. రైతులు ఆ దిశగా మార్పును స్వీకరించడం లేదు. ఎందుకంటే పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర అందుతోంది. ఈ తరహాలోనే తృణ ధాన్యాలు, పప్పు దినుసులు ఇతర ప్రత్యామ్నాయ పంటలకోసం జిల్లాస్థాయిలో లేదా మార్కె ట్ కమిటీ స్థాయిలోనైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ దన్ను లేకుండా ప్రత్నామ్నాయ పంటల వైపు మళ్లితే బహిరంగ మార్కెట్లో ఒడిదుడుకులు వస్తే నిండా మునుగుతామనే ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రచారాల వల్ల ఆశించిన ఫలితాలు రావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అత్యాచార ఘటన బాధాకరం
పాల్వంచ: ఖమ్మంలో చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపెల్లి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం పాల్వంచలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, కనీసం వారు స్పందించక పోవడం దారుణమని పేర్కొన్నారు. వైద్యానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పిన మంత్రుల మాటలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఫాస్ట్ట్రాక్ కోర్టును పెట్టి నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్టా బాబూరావు, కంచర్ల రామారావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయితేజ, ఆఫీజ్, ధనుశ్, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సత్వర సేవలు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యలు పరి ష్కరించి సత్వర సేవలు అందించడమే ప్రజావాణి లక్ష్యమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్ఓ పద్మావతితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రతీ వినతిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు ● టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన భూక్య సుమన్ తాను పుట్టుకతోనే దివ్యాంగుడినని, అద్దె ఇంటిలో నివసిస్తూ జీవనం సాగించడం కష్టతరంగా మారిందని, ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని దరఖాస్తు చేయగా గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు. ● ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన స్వప్న వ్యవసాయ బోరు, విద్యుత్ సదుపాయం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా కలెక్టర్ పరిష్కారానికి ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు. ● ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామ పరిధిలోని బాలాజీ తండాకు చెందిన బానోత్ అనూష తనకు సంబంధించిన రెండు వేర్వేరు భూముల భూభారతి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని దరఖాస్తు చేయగా ధరణి అధికారులకు ఎండార్స్ చేశారు. పారదర్శకత పాటించాలి జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. రెండో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2 వేలు ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పూరి గుడిసెలు, నివాసయోగ్యం కాని ఇళ్లు, వివరాలను సేకరిస్తూ ఎంపికల్లో పారదర్శకత పాటించాలని అన్నారు. ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, గృహ నిర్మాణ శాఖాధికారి సవేరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య రంగాలకు సీఎస్ఆర్ నిధుల్లో ప్రాధాన్యం.. జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో సీఎస్ఆర్ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కొత్త పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించాలి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఎంఈఓలదేనని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో ఎంఈఓలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, బడిబాట కార్యక్రమం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, ఆధార్ అప్డేషన్, అపార్ నమోదు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో నిర్దేశించిన 60,415 అడ్మిషన్ల లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలతో సమన్వయంతో అడ్మిషన్లు పెంచాలన్నారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న 10 ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ డీఈఓ శంభు ప్రసాద్, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్, నాగశేఖర శర్మ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
●యథావిధిగా రాగిజావ, మధ్యాహ్న భోజనం
జిల్లాలోని 1,332 ప్రభుత్వ పాఠశాలల్లో 62,532 మంది విద్యార్థులకు సోమవారం నుంచి యథావిధిగా ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం వడ్డించనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో అల్పాహారం కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొన్ని జిల్లాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో రాగిజావ, మధ్యాహ్నభోజనం మాత్రమే అమలు జరుగనుంది. కాగా విద్యార్థుల యూనిఫాం క్లాత్ ఇప్పటివరకు జిల్లాకు చేరలేదు. రెండు రోజుల్లో క్లాత్ వస్తుందని, వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
అర్ధరాత్రి భూకంపం
పాల్వంచరూరల్/బూర్గంపాడు/పాల్వంచ: జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 2:26 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచ మండలం సారెకల్లు, అశ్వాపురం మండలం మామిళ్లవాయి గ్రామాల మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూకంప కేంద్రంగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విభాగం గుర్తించింది. భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా, తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైంది. పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం, కేశవాపురం, సారెకల్లు, కారెగట్టు ప్రాంతాలతోపాటు పాల్వంచ పట్టణం, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ప్రకంపనలతో ఉలిక్కిపడి బయటకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మరికొందరు భూకంప ప్రభావమేమీ కనిపించలేదని పేర్కొంటున్నారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంచం, తలుపులు స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని, భూకంపంమే అని భావించి కుటుంబ సభ్యులతో బయటకు వచ్చామని పాల్వంచ గట్టాయిగూడేనికి చెందిన లింగం వెంకటేశ్వర్లు తెలిపారు. తక్కువ లోతు కావడంతో.. భూమి లోపలి పొరల్లో జరిగే ఘర్షణల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. వీటి తీవ్రతను రిక్టరు స్కేలు సాయంతో గుర్తిస్తుంటారు. భూకంపం తీవ్రత, అది సంభవించిన లోతు, భూ ఉపరితలం పరిస్థితుల ఆధారంగా భూకంప ప్రభావం ఉంటుంది. సాధారణంగా రిక్టర్ స్కేల్పై 3 కంటే తక్కువగా నమోదు అయ్యే కంపనాల గురించి సామాన్యులకు అర్థం కూడా కాదు. భూకంప తీవ్రత 3.5 దాటితే స్వల్పంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత భూంకప తీవ్రత 3.8 నమోదుకాగా, ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా భూ ఉపరితలం నుంచి కేవలం 10 కి.మీ లోతులో కంపన కేంద్రం ఉండటం వల్ల తీవ్రత పెరిగింది. అందువల్లే అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించినా కొందరు ప్రజలు గుర్తించగలిగారు. అంతకుముందు 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉదయం 7:27 గంటల సమయంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై ప్రమాదకర స్థాయిలో 5.3గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత ఉత్తర తెలంగాణ అంతా చవిచూసింది. అయితే, అప్పుడు 40 కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే.. గోదావరి తీరంలో విస్తరించిన జిల్లాకు భూకంపాలు కొత్తేమి కాదు. 1954లో రిక్టర్ స్కేల్పై 4.3 భూకంప తీవ్రత నమోదుకాగా, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 1969లో దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర 5.3 తీవ్రతతో భూంకపం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాకు సంబంధించినంత వరకు అతి పెద్ద భూకంపంగా ఇది రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 2004లో, 2018 ఆగస్టు 14న భూమి కంపించింది. మళ్లీ 2023 ఆగస్టు 25 తెల్లవారుజామున మణుగూరులో భూమి కంపించిన అనుభూతిని ప్రజలు పొందారు. 1968, 2004, 2009ల్లో కూడా స్వల్ప భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తేదీ తీవ్రత సమయం 5 –7– 1969 5.3 –– 14 –8–2018 5.1 9:10 పీఎం 25 –8–2023 3.5 4:45 ఏఎం 04–12–2024 5.3 7:27 ఏఎం 13 –6– 2026 3.8 2.26 ఏఎంఆర్ధరాత్రి సమయంలో దడదడ అని శబ్దం రావడంతో నిద్రలేచా ను. రోడ్డు పైన ఏదైనా భారీ వా హనం వెళ్తుంటే కూడా అప్పడప్పుడు అలాగే శబ్దం వస్తుంది. తెల్లవారు జామున చుట్టుపక్కల వాళ్లు భూకంపం వచ్చిందంటే అప్పుడు ఆశబ్దంభూకంపం అనుకు న్నా. గతంలో కూడా రెండు సార్లు ఇలాగే వచ్చింది. –ఎం.ఉమాదేవి, జగన్నాథపురం -
రైతు జీవనాన్ని చాటిన ‘మట్టి మనిషి’
ఖమ్మంగాంధీచౌక్: రైతు జీవనం, అనుభవాలను ‘మట్టి మనిషి’నాటిక చాటిచెప్పింది. నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కతిక సంస్థ (ఆర్క్స్) నిర్వహణలో ఆదివారం రాత్రి ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ‘మట్టి మనిషి’ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నవల ఆధారంగా వల్లూరు శివప్రసాద్ ఈ నాటిక రూపొందించగా, ఎస్.ఎం.బాషా దర్శకత్వంలో హైదరాబాద్కు చెందిన మిత్ర క్రియేషన్స్ కళాకారులు 50 మంది ప్రదర్శించారు. భూమి ఉత్పత్తి సాధనమే తప్ప వ్యాపార వస్తువు కాదనే సంకేతాన్ని ఈ నాటిక ద్వారా ఇచ్చారు. తొలుత బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు నాగప్రసాద్, నీరజ, తూము ప్రకాష్రావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాగా, నాటికను ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేతతో పాటు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మల్లంపాటి శ్రీధర్, రవిమారుత్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల పాపారావు, బుగ్గవీటి సరళ, ప్రసేన్, ఆనందాచారి, రైతు రవి తదితరులు తిలకించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, నామాలక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
భద్రాచలంఅర్బన్/అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన మల్లెల సత్యసాయి (32) సిరి ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఏపీ 03 టీఈ 4189 నంబర్ గల టెంపో ట్రావెలర్లో 11 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి మణుగూరుకు వెళ్తుండగా వాహనంలో డీజిల్ అయిపోవడంతో రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం సత్యసాయి వాహనం దిగి రోడ్డుపక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా, మొండికుంట వైపు నుంచి అతివేగంగా వచ్చిన బుల్లెట్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని 108లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జానంపేటకు చెందిన కోసూరి సుభాష్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడపడం వల్లే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య స్వర్ణముఖి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఇదిలాఉండగా.. సత్యసాయి మృతదేహంతో అతడి భార్య, కుటుంబ సభ్యులు భద్రాచలంలోని సిరి ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. మృతుడి పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తామని ట్రావెల్స్ నిర్వాహకులు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. బావిలో పడి యువకుడు..దమ్మపేట: మద్యానికి బానిసైన, మానసిక స్థితి సరిగాలేని యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మపేటకు చెందిన జుజ్జూరి లక్ష్మీనారాయణ(30)కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారు. శనివారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల వెతికగా, వారి ఇంటి సమీపంలోని బావిలో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్కుమార్ తెలిపారు. కరకట్ట కందకంలో పడి.. ఖమ్మంక్రైం: వరద ముంపు రాకుండా మున్నేటి వద్ద నిర్మిస్తున్న కరకట్ట కందకంలో ప్రమాదవశాత్తు పడిన ఓ యువకుడు మతి చెందాడు. ఖమ్మం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన వనమాల కృష్ణ చిన్నకుమారుడు జయశంకర్ (21) ఇంటర్ తర్వాత ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన శనివారం మధ్యాహ్న భోజనం చేశాక బయటకు వెళ్తున్నానని తల్లి, సోదరుడికి చెప్పి బయలుదేరాడు. అయితే, రాత్రి వరకు తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ కూడా ఇంట్లోనే ఉండడంతో స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం కానరాలేదు. ఈ మేరకు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా, మున్నేటి కరకట్ట కోసం తవ్విన 20 అడుగుల లోతు కందకంలో జయశంకర్ మృతదేహం తేలుతోందన్న సమాచారంతో వెళ్లిన కుటుంబీకులు కన్నీరమున్నీరయ్యారు. కందకంలో చేతులు కడుక్కోవటానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు పడగా, ఈత రాకపోవడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, జయశంకర్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. మహిళపైకి దూసుకొచ్చిన అంబులెన్స్ ఇల్లెందు: మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ ఓ మహిళపైకి దూసుకెళ్లాడు. ఇల్లెందులోని జగదాంబసెంటర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతూ మహిళపైకి దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు ఆమెను అంబులెన్స్ కింది నుంచి బయటికి లాగి ఆస్పత్రికి తరలించారు. వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని సురక్షా బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలి రెండు కాళ్లు నుజ్జునుజ్జుకాగా.. భారీ వాహనం వృద్ధురాలి పైనుంచి వెళ్లిన ఆనవాళ్లు ఉన్నాయి. రాత్రివేళ కావడం లారీలు వేగంగా దూసుకురావడం వల్ల ఇలా జరిగిందా లేదా మరేదైనా వాహనం ఢీకొన్నదా అన్నది తెలియరాలేదు. -
ట్రాక్టర్ ట్రాలీతో మోటార్ వెలికితీత
కరకగూడెం: రైతు బావిలో ఇరుక్కుపోయిన మోటార్ను ట్రాక్టర్ ట్రాలీతో చాకచక్యతంతో వెలికితీశాడు ఓ ఎలక్ట్రీషియన్. మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో ఉన్న బోరుబావి లో మోటార్ ఇరుక్కుపోవడంతో రైతు ఆందోళనకు గురయ్యాడు. స్థానిక ఎలక్ట్రీషియన్ సతీశ్ రైతులతో కలిసి ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపి, మోటార్ పైపును గొలుసుతో అనుసంధానం చేసి నెమ్మదిగా పైకి లాగడంతో మోటా ర్ బయటకు వచ్చింది. అనంతరం మోటార్కు మరమ్మతులు చేసి బోరుబావిలో దించారు. కాగా, సతీశ్ను రైతులు అభినందించారు. నేవీ మార్కోస్లో గుండాల యువకుడు గుండాల: మండలంలోని నర్సాపురంతండాకు చెందిన బోడా నరేశ్నాయక్ భారత నావికా దళంలోని మార్కోస్ (మైరెన్ కమాండో)కు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్కు దరఖాస్తు చేసుకుని పోటీ పరిక్షల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన నరేశ్నాయక్ మార్కోస్కు ఎంపిక కావటంపై తల్లిదండ్రులు శ్రీను – సరోజ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన ఆయన త్వరలో మార్కోస్లో చేరబోతున్నాడని వారు తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జూన్ 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న రోజుల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాధార పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నందున రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం వంటి పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు. కిన్నెరసానిలో సందడిపాల్వంచరూరల్: ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సండే సందడి వాతవరణం కన్పించింది. ఆదివారం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 724 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.38,125 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.25,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెట్రోల్ బంక్ల ఎదుట ఆందోళన.. ఇల్లెందు: వ్యవసాయ అవసరాలకు ట్రాక్టర్ల కోసం డీజిల్ తీసుకెళ్లాలని వస్తే క్యాన్లలో పోయడం లేదంటూ ఇల్లెందులో ఆదివారం రాత్రి పలు బంక్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు డీజిల్ క్యాన్లలో పోసేది లేదని నిర్వాహకులు చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు పలువురు ఖాళీ క్యాన్లతో నిరసన తెలిపారు. 26న ‘కనకతార’ ఖమ్మంగాంధీచౌక్: తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు 150వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘కనకతార’నాటిక ప్రదర్శన ఉంటుందని చందాల కేశవదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో వాల్పోస్టర్లను పలు సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. -
అలా.. మొదలైంది!
‘బడి బాట’ జ్ఞాపకాల్లో అధికారులు ● అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం ● కుటుంబీకుల ప్రోత్సాహం, గురువుల బోధనతో ఉన్నతస్థానాలకు..భద్రాచలంఅర్బన్/ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ క్రమాన పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈసారే పాఠశాల బాట పట్టనుండగా.. ఇంకొందరు కొత్త తరగతిలోకి వెళ్లనున్నారు. ఈ క్రమాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులను వారి ‘బడి’జ్ఞాపకాలపై ఆరా తీయగా ఆ సంగతులన్నీ ఆసక్తిగా వివరించారు. స్ఫూర్తిదాయకమైన ఆ వివరాలు... మాది సింగరేణి మండలం గేటుకారేపల్లి. నాన్న భూక్యా చిట్టిబాబు పోస్టుమాస్టర్గా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు. అమ్మానాన్న చిట్టిబాబు – రాధకు నేను మొదటి కుమార్తెను. ఆ తర్వాత చెల్లె సుజాత, తమ్ముడు అరుణ్ ఉన్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి సిద్ధమయ్యా క నాన్న సైకిల్పై తీసుకెళ్లి స్కూల్లో దింపేవారు. ఎనిమిదో తరగతికి వచ్చాక కారేపల్లి హైస్కూల్కు వెళ్లే మార్గంలో బుగ్గవా గు ఉండడంతో చదువు లో వెనకబడతామని నాన్న భద్రాచలం ఏపీఆర్ఎస్లో చేర్పించారు. ఇంటర్ వరకు అక్కడ చదివాక అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ, ఆపై ఎమ్మెస్సీ పూర్తి చేశా. గెజిటెడ్ ఉద్యోగం చేయాలనే నాన్న ఆశయం మేరకు దమ్మ పేట ఏఓగా గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం సాధించాం. ప్రస్తుతం ఖమ్మం ఆత్మ పీడీగా కొనసాగుతున్నా. –బి.సరిత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, ఖమ్మం మాది వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్. అమ్మానాన్న యాదగిరి – భాగ్య వ్యవసాయం చేస్తూ నన్ను, మా అన్నయ్య రాజును చదివించారు. చిన్నప్పుడు నేను స్కూల్కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని. కానీ అన్నయ్య సర్దిచెప్పి వెంట తీసుకెళ్లేవాడు. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో 10వ తరగతి పూర్తి చేశాక, ఇంటర్ వరంగల్లో చదివి ఓపెన్ డిగ్రీ పూర్తిచేశా. 2007లో హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ 2009లో ఎస్ఐగా ఎంపికవడంతో తొలి పోస్టింగ్ కరకగూడెంలో వచ్చింది. ఈ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించాక సీఐగా పదోన్నతిపై హైదరాబాద్ వెళ్లినా, మళ్లీ డీఎస్పీగా పదోన్నతితో భద్రాచలంలో పోస్టింగ్ వచ్చింది. మా అన్నయ్య రాజు జనగామ జిల్లా రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువు పూర్తిచేసి ఈ స్థాయికి చేరగలిగా. –అరుణ్కుమార్, భద్రాచలం డీఎస్పీ మా నాన్న ఎన్.ఎస్.రాయుడు న్యాయవాది కాగా, అమ్మ లక్ష్మీదేవి రైల్వే శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్లోని రైల్వే పాఠశాలలో నా చదువు కొనసాగింది. అమ్మ ఉదయం క్యారేజీ రెడీ చేస్తే, ఆ తర్వాత స్కూల్కు వెళ్లే వరకు నాన్న వెంట ఉండేవారు. ప్రాథమిక తరగతులకు ఆటోలో వెళ్లగా, ఆ తర్వాత స్నేహితులతో కలిసి సైకిళ్లపై స్కూల్కు వెళ్లా. అమ్మానాన్న సూచనలతో చదువు, క్రమశిక్షణలో ముందు నిలుస్తూ చదువులో స్నేహితులతో పోటీ పడేవాడిని. ఇంజనీరింగ్ అయ్యాక ఎస్బీఐ, ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ రైతులకు సేవలందించాలనే తపనతో డీసీసీబీ సీఈఓ పోస్టు ఎంచుకున్నా. –ఎన్.వెంకటఆదిత్య, డీసీసీబీ సీఈఓ -
పదిరోజుల్లో ఏడు మేకలు చోరీ
ఆందోళన చెందుతున్న ప్రజలు ఇల్లెందు: గడిచిన పదిరోజుల్లో మండలంలోని పలు గ్రామాల నుంచి ఏడు మేకలను దుండగులు అపహరించారు. మండలంలోని మాణిక్యారం, కొమరారం, బోయితండా, పోచారం, మసివాగుతండాలో నలుగురు వ్యక్తులు రెండు బైక్లపై సంచరిస్తూ ఆవరణలో కట్టేసి ఉంచిన మేకలను ఎత్తుకెళ్తున్నారు. తుంటిబాలుతండాలో బానోతు రమేశ్ మేకపోతు, ఎల్లాపురంలో జి.కృష్ణ ఇంట్లో నంచి ఒకటి, మిట్టపల్లిలో జి.రాందాస్కు చెందిన రెండు, పోచారంతండాలో లక్ష్మణ్కు చెందిన ఒకటి, మసివాగులో రెండు మేకలు చోరీకి గురయ్యాయని తెలిపారు. కాగా తుండాబాలుతండాలో ఓ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలో చోరీ ఘటన రికార్డయింది. ఇద్దరిద్దరు కలిసి రెండు బైక్లపై రావడం, ఇంటి ఆవరణలో కట్టేసి ఉంచిన మేకలను ఎత్తుకెళ్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఓ నిందితుడు కెమెరాకు చిక్కాడు. వృద్ధుడి అదృశ్యం టేకులపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామ పరిధి గుడితండాకు చెందిన బానోతు సక్రు (70) ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన అల్లుడు, టేకులపల్లికి చెందిన గుగులోత్ కిషన్ ఆదివారం తెలిపారు. కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు చీమలపాడు స్టేషన్లో ఎక్కినట్లు తెలుస్తుండగా, ఆ తర్వాత సక్రు ఆచూకీ తెలియరాలేదని వెల్లడించాడు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 79934 48485, 83415 21726 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కిషన్ కోరాడు ఉద్యోగాల పేరుతో టోకరా దమ్మపేట: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మండలంలోని ముష్టిబండకు చెందిన ముగ్గురు యువకులను హైదరాబాద్కు చెందిన వ్యక్తి మోసం చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొద్ది నెలల కిందట మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన హర్షవర్దన్తో పాటు మరో ఇద్దరు యువకులకు హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమర్నాథ్ అనే వ్యక్తి నమ్మబలికి, వారి వద్ద నుంచి రూ.5,40,000 వసూలు చేశాడు. అనంతరం హైదరాబాద్లోని మున్నా అనే వ్యక్తికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాడు. వారు ఆ కంపెనీలో ఐదు నెలల పాటు పనిచేసినప్పటికీ వేతనాలు చెల్లించకపోగా, మరో మంచి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఉద్యోగాలకు రిజైన్ చేయించాడు. అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధిత యువకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేశ్కుమార్ తెలిపారు. -
హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తా
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదని.. సీఎం, ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే హెల్త్ కార్డులు జారీకి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డుల విధివిధానాల రూపకల్పన, జారీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. అయితే, ఈనెల 2వ తేదీ నాటికి పీఆర్సీ, డీఏలపై అనుకూల నిర్ణయం వస్తుందని ఆశించినా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్, సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని శ్రీపాల్రెడ్డి కోరారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ మాట్లాడగా, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్, ఆర్.రంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ అలీ, పీఆర్టీయూ బాధ్యులు యలమద్ది వెంకటేశ్వర్లు, కె.వెంకటనర్సయ్య, జి.విజయ్, అమృత్కుమార్, ఆర్.బ్రహ్మారెడ్డి, చిత్తలూరి ప్రసాద్, కే.వీ.రమణ తదితరులు పాల్గొన్నారు. గంజాయితో పట్టుబడిన జిల్లా యువకులు -
●అమ్మ ఆదర్శ, పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలు, పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల నిర్వహణ బాధ్యత అంతా కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పీఎం శ్రీ పథకానికి కేంద్రం నుంచి దశల వారీగా నిధులు విడుదల కావడంతో పాఠశాలల్లో క్రీడలకు, ల్యాబ్ల నిర్మాణాలకు ఉపయోగపడుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రీప్రై మరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో 118 పాఠశాలలను ఎంపిక చేశారు. ఉపాధ్యాయులు, ఆయాల నియామకానికి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయితే తరగతులు ప్రారంభంకానున్నాయి. -
ఎయిర్పోర్టుకు స్థలం చూపలేదు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నల్లగొండ ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్ చుంచుపల్లి: జిల్లాలో ఎయిర్పోర్టు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా స్థలం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, నల్లగొండ ఇన్చార్జి సన్నె ఉదయ్ ప్రతాప్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆస్పిరేషన్ జిల్లా అయిన భద్రాద్రికి కేంద్రం రూ.50 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో అవినీతి లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తున్నారని అన్నారు. కొందరు ఎన్నికల ముందు తిట్టిన పార్టీలతో సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, డాక్టర్ జాటోత్ వెంకన్న, పూనెం భిక్షపతి, కృష్ణయ్య, పూనియా నాయక్, రామారావు, కుమార్, తుంపురి శివ, మోహన్ కృష్ణ గాయత్రి, పద్మ పాల్గొన్నారు. నేడు ఇంటర్ అడ్మిషన్లకు స్పాట్ కౌన్సెలింగ్పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల్లో కౌన్సెలింగ్ ఉంటుందని, ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) కళాశాలలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
వరద కాల్వకు మోక్షం
● వీడిన నష్ట పరిహారం చిక్కుముడి ● మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో కదలిక అశ్వారావుపేటరూరల్: ఏళ్లుగా సాగుతున్న వెంకమ్మ వరద కాల్వ సమస్యకు మోక్షం లభించినట్లయింది. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం వివాదం నేపథ్యంలో పనులు నిలిచాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జోక్యంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మండలంలోని ఊట్లపల్లిలోని వెంకమ్మ చెరువు అలుగు నుంచి ఏటా వానాకాలం సీజన్లో వేలాది క్యూసెక్కుల వరదనీరు వాగుల్లో కలిసి వృథాగా ఏపీలోని గోదావరిలో కలుస్తోంది. ఈ వృథా జలాలను కాల్వలు నిర్మించి పంట పొలాలకు తరలిస్తే వందల ఎకరాల భూముల్లో పంటలు పండుతాయని భావించి నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా 2005 డిసెంబర్ 31న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ వరద కాల్వ నిర్మాణానికి వైఎస్సార్ హయంలోనే రూ.13కోట్లు నిధు లు కుడా కేటాయించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2009లో ఒప్పందం చేసుకుని, 2010లో పనులు ప్రారంభించారు. వెంకమ్మ చెరువు నుంచి(కేసప్పగూడెం) దబ్బతోగు ప్రాజెక్టు చెరువు దాకా 15 కిలోమీటర్లు, నారాయణపురం – ఆసుపాక మధ్యలోగల లోతువాగు చెరువుకు మరో 7 కిలోమీటర్లు కలిపి మొత్తం 22 కిలోమీటర్ల దూరం వరద కాల్వ నిర్మించాల్సి ఉంది. మూడేళ్ల క్రితమే 18 కిలోమీటర్ల వరకు కాల్వ నిర్మించారు. మరో నాలుగు కిలోమీటర్లు కాల్వ తీయాల్సి ఉంది. ఈ కొద్ది పనులను పూర్తి చేస్తే వృథా వరద నీరు దబ్బతోగు, లోతువాగు చెరువుల్లోకి చేరి దాదాపు ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమస్య పరిష్కారం కాల్వ కింద భూములు కోల్పోతున్న గిరిజన, గిరిజనేతర రైతులు 152 మందికిగాను 42 ఎకరాలకు నీటిపారుదల శాఖ ద్వారా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. అందులో 20 ఎకరాలు పట్టా భూములు, మరో 22 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. భూసేకరణ సమయంలో ఒక్కో ఎకరానికి రూ. 1.35 లక్షలు చొప్పున ప్రభుత్వం నిర్ణయించగా, ఐదేళ్ల క్రితం పాత భూసేకరణ చట్ట ప్రకారం రూ.78 లక్షలు మంజూరు చేసింది. అప్పటికే 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు కావడంతో కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని, నష్ట పరిహారం చెక్కులను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా ఈ కాలువ పూర్తి కావడం లేదు. దశలవారీగా పోరాటాలు.. కాగా, రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆది వాసీ గిరిజన సంక్షేమ సంఘం బాధ్యులు మడకం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు భూసేకరణ గ్రామసభ సైతం అడ్డుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టి సారించి బాధిత రైతులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపించారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజన రైతులకు ఎకరానికి రూ.10.80 లక్షలు, గిరిజనేతరులకు ఎకరానికి రూ.22.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో సమస్య పరిష్కారమై మరికొద్ది నెలల్లోనే కాల్వ పనులు పూర్తి కానున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని అందించే విధంగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక అందించాం. త్వరలోనే నిర్వాసిత రైతాంగానికి పరిహారం చెక్కులు మంజూరు అవుతాయి. –వెంకటేశ్వరరావు, డీఈఈ, నీటిపారుదల శాఖ -
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..
మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా గోపాలపురం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు కృష్ణారెడ్డి – పద్మకు నేను, అన్నయ్య సంతానం. చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుతూ అన్నయ్యతో పాటు స్కూల్కి వెళ్లగా, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సైదులు ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదో తరగతి నుంచి ఊరికి ఐదు కి.మీ. దూరాన పాఠశాలకు సైకిల్పై వెళ్లేవాళ్లం. పదో తరగతి తర్వాత సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ నాన్న కోరికతో ఇంటర్లో బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదివి, చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశా. ఆపై సంగారెడ్డిలో పీజీ అనంతరం 2018లో ప్రభు త్వ వైద్యుడిగా ఎంపికయ్యా. తొలి పోస్టింగ్ భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రాగా, ఇక్కడే సూపరింటెండెంట్ స్థాయి కి చేరా. మా ఊరిలో మొట్టమొదటి వైద్యుడిని నేనే. ఈ స్థాయికి చేరేలా తోడ్పాటునిచ్చిన నాన్న, అన్నయ్యతో పాటు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా. –డాక్టర్ రాజశేఖర్రెడ్డి, భద్రాచలం ఆస్పత్రి ఆర్ఎంఓ -
తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయం
కొణిజర్ల: రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని అమ్మపాలెంలో ఆదివారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి బీఆర్ఎస్ జెండా దిమ్మెను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి ముందు అన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఢిల్లీలో దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లు తొలగిస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాక ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం నోరు మెదపలేదని పేర్కొన్నారు. అలాగే, రైతు రుణమాఫీ, రైతుబంధు అమలులో విఫలం కాగా, యూరియా సరఫరాకు యాప్ ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను అణగదొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వద్దిరాజు స్పష్టం చేశారు. అధికారులు సైతం కాంగ్రెస్ పక్షాన నిలవకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, పోట్ల శ్రీను, డేరంగుల బ్రహ్మం, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కిలారు మాధవరావు, ఖాదర్బాబా, హుస్సేన్, బూర ప్రసాద్, రాజ్కుమార్, జీడయ్య, బాబూరావు, విజయ, నాగయ్య, చిలుకూరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
పోలీసుల బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ
ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు బూర్గంపాడు: ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం ఇసుక లారీలను స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగగా.. సమాచారంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు మంగీలాల్, శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వారు మోటార్ సైకిల్పై వస్తున్న క్రమంలో దోమలవాగు వద్ద వెనుక నుంచి ఇసుక లారీ వేగంగా ఢీకొట్టింది. మంగీలాల్, శ్రీనివాసరావుకు గాయాలు కాగా.. భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్, రెండు ట్యాబ్లు ధ్వంసమయ్యాయి. లారీడ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. లోన్ ఇప్పిస్తామని దగా..భద్రాచలంఅర్బన్: లోన్ ఇప్పిస్తామని సైబర్ నేర గాళ్లు దంపతులను బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని భగవాన్దాస్కాలనీకి చెందిన మానస గత ఏప్రిల్ 4న ఫేస్బుక్ చూస్తోంది. అందులో 83429 94417 నంబర్లో సంప్రదిస్తే లోన్ ఇప్పిస్తామని ఉండటంతో భర్త నర్సింహారావు సహకారంతో ఫోన్ చేశారు. సైబర్ నేరగాడు వారి ఆధార్కార్డు, పాన్కార్డు కావా లని అడగగా.. నర్సింహారావు, మానసలకు చెందిన కార్డులను పంపించారు. అయితే, రుణ ప్రక్రియకు రూ.52 వేలు అవసరం అవుతాయని చెప్పి.. తాను పంపించే స్కానర్కు డబ్బు పంపాలని చెప్పాడు. అది నమ్మిన దంపతులు పలు దఫాలుగా రూ.52 వేలు పంపించారు. తర్వాత సైబర్ నేరగాడు ముఖం చాటేడయండో బాధితురాలు 1930 నంబర్కు ఫిర్యాదు చేశారు. అలాగే, శనివారం అర్ధరాత్రి స్థానిక పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేయగా టౌన్ సీఐ నాగరాజు కేసు నమోదు చేశారు. వీధి కుక్కల దాడిలో మహిళకు తీవ్రగాయాలుబూర్గంపాడు: సారపాక మేజర్ గ్రామ పంచాయతీలోని శ్రీరాంపురంకాలనీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం ఓ మహిళపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు గమనించి రాళ్లు విసిరి కుక్కలను తరిమివేయటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. స్థానికులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీరాంపురంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోజూ ఎవరినో ఒకరిని గాయపరుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్సర్క్యూట్తో జేసీబీలో పొగలుమణుగూరుటౌన్: పట్టణంలో ఓ ప్రాంతం నుంచి బయలుదేరిన జేసీబీలో ఒక్కసారిగా షార్ట్సర్క్యూట్తో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆపరేటర్ వెంటనే దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన పట్టణంలో సీపీఐ కార్యాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరేలోపే స్థానికులు, ఆపరేటర్తో కలిసి జేసీబీ పొగలను అదుపులోకి తెచ్చారు. -
నడుస్తూ.. వాగులు దాటుతూ...
ప్రస్తుత భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జన్మించిన నాకు చదువులో మార్గదర్శకుడు అన్న వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 3వ తరగతి ఉండేది. ఆ తర్వాత నాలుగు కి.మీ. అన్నయ్యతో కలిసి నడుస్తూ వాగులు దాటి స్కూల్కు వెళ్లేవాడిని. అలా మా గ్రామం నుంచి 15 మంది ఉండేవాళ్లు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో చెట్ల కింద కూర్చొని అంతా కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లం. పరీక్షల సమయంలో కూడా కలిసి చదువుకునేవాళ్లం. అమ్మనాన్నది వ్యవసాయ కుటుంబమైనా మమ్ముల్ని చదువుకోవాలని ప్రోత్సహించేవాళ్లు. అయితే, స్కూల్ దూరం కావడంతో ఇబ్బందిగా ఉందని కిన్నెరసాని గురుకులంలో చేర్పించారు. అక్కడ పదో తరగతి తర్వాత, భద్రాచలంలో ఇంటర్ పూర్తి చేసి అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ చదివాక ఉద్యోగం సాధించా. మా అన్నయ్య వెంకటేశ్వర్లు ఉన్నత విద్య పూర్తిచేసి సింగరేణిలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అందుబాటులో స్కూళ్లు లేకపోయినా అమ్మానాన్న ప్రోత్సాహంతో హాస్టళ్లలో ఉండి చదువుకోవడంతో ఈ స్థాయికి చేరాం. –ధనసరి పుల్లయ్య, డీఏఓ, ఖమ్మం -
జమలాపురంలో నూతన ధ్వజస్తంభాలకు పూజలు
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29న మహా కుంభాభిషేకం ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతిష్ఠించనున్న ధ్వజ స్తంభాలకు ఆదివారం అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ కె.జగన్మోహన్రావు మాట్లాడుతూ మహా కుంభాభిషేకం, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠా పూజలకు గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు.ఽ ఈకార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు అంకసాల శ్రీనివాసరావు, ఎల్.పీ.నారాయణరెడ్డి నన్నపనేని రామారావు, సుఖవాసి రమేష్, వేమిరెడ్డి అంకిరెడ్డి, వీరమాచినేని జగదీష్ బాబు, భూక్యా బాలాజీ, చొప్పరపు శ్రీనివాసరావు, మిర్యాల శ్యామ్ప్రసాద్, మేడా భానుప్రతాప్ పాల్గొన్నారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చ న జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు నిత్య కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరికి నదీ హారతిభద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద అధిక జ్యేష్టమాస అమావాస్య సందర్భంగా ఆదివారం నదీహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. శాంతి మంత్ర పఠనంతో కార్యక్రమాన్ని ముగించారు. అర్చకులు రామ వజ్జల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, అశోక్కుమార్ శర్మ, సుబ్రహ్మణ్య ఆచార్యులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికా రులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజ లు తమ సమస్యలకు సంబంధించిన అంశాల ను లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్ల పేర్కొన్నారు. ఐటీడీఏ, సబ్ కలెకరేట్లో.. భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాల యం, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమాలకు అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజ లు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసు పు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దరఖాస్తుల ఆహ్వానంభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెవిటి, మూగ, దృష్టిలోపం, ఇతర వికలాంగత కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాలలో ఉచిత విద్య, వసతి, భోజనంతోపాటు హియరింగ్ ఎయిడ్, స్పీచ్ థెరపీ, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 7 నుంచి 16 ఏళ్ల వయస్సు గల ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేర్పించాలని, వివరాలకు 93811 81407, 6303 947240 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాత పరీక్షకు 642 మంది హాజరురుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 17 జూనియర్ కెమిస్ట్ /టెక్నికల్ ఇన్స్పెక్టర్ ఇంటర్నల్ పోస్టులకు ఆదివారం కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 642 మంది అభ్యర్థులు హాజరుకాగా, కేంద్రాన్ని పర్సనల్ విభాగం జీఎం ఏజే మురళీధర్ పర్యవేక్షించారు. -
వైభవంగా రుద్రహోమం పూజలు
పాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని శనివారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో హోమం జరిపారు. తొలుత మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామి వారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ రుద్రహోమం గావించారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించా రు. పూజలో పాల్గొన్న ఏడుగురు భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదా లను అందజేశారు. ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేక పూజలు నిర్వహించారు. నేడు జూనియర్ కెమిస్ట్ పోస్టులకు రాత పరీక్షరుద్రంపూర్: కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జూనియర్ కెమిస్ట్/జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. 17 ఖాళీ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయగా, 695మంది దరఖాస్తు చేసుకున్నా రు. అభ్యర్థులకు హాల్టికెట్లు పంపిణీ చేశారు. గిరిజన యువతకు ఉచిత శిక్షణభద్రాచలంటౌన్: గిరిజన యువతకు ఐటీడీఏ ఆధ్వర్యంలోని యువజన శిక్షణా కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి. రాహు ల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 33 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా వైటీసీ కేంద్రానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
తెల్లరాయి తరలిపోతోంది
పాల్వంచరూరల్: భూగర్భంలో లభించే ప్రత్యేకమైన, ఎంతో విలువైన వైట్ క్వార్జ్ (తెల్లరాయి) అక్రమంగా తరలిపోతోంది. తవ్వకం, రవాణా బాహాటంగానే సాగిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని బిక్కుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం శివారు సూరారంవైపు వెళ్లే మార్గంలో ఓ రైతు భూమిలో తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి. వాటి తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ శాఖల ద్వారా అనుమతులు పొందిన తర్వాతనే క్వారీ నిర్వహించాల్సి ఉండగా కొందరు నాయకుల అండదండలతో తెల్లరాయి ఉన్న భూమిలో క్రేన్ సాయంతో పెకిలించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిసింది. కాగా, తెల్లరాయిని గ్లాస్(అద్దాలు) తయారీలో ఇతర పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తారు. కంప్యూటర్ చిప్స్, పౌడర్ల తయారీకి వినియోగిస్తుంటారు. దీంతో తెల్లరాయికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ముందుగా తెల్లరాయిని పరీక్షించిన తర్వాత నాణ్యతను బట్టి ధరను నిర్ధారిస్తారు. తెల్లరాయిని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే టన్నుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అలా జరగడం లేదని సమాచారం. అనుమతిలేకుండానే క్వారీ నిర్వహణ?బిక్కుతండా పంచాయతీలో తెల్లరాయి తవ్వ కాలు నిర్వహిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. మైనింగ్ ద్వారా గానీ, రెవెన్యూ శాఖ దారా గానీ తప్పనిసరిగా తవ్వకాలకు అనుమతులు ఉండాలి. అనుమతులు లేకుండా తెల్లరాయి క్వారీని నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – దారా ప్రసాద్, తహసీల్దార్ -
ప్రణాళిక లేక..
వనరులున్నా.. భద్రాచలం: వనరులు ఉన్నా సిబ్బంది కొరత వల్ల భద్రాచలం ఆర్టీసీ డిపో ఆదాయం కోల్పోతోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా మార్చాలనే డిమాండ్ ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. మరో వైపు ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి భద్రగిరి మీదుగా బస్సులను తిప్పుతూ ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. కాగా, ముక్కోటి, శ్రీరామ నవమి ఉత్సవాలే డిపోకు శ్రీరామరక్షగా మారాయి. సరిహద్దు ఏపీకి ఆ రాష్ట్ర సర్వీసులే విభజనకు ముందు భద్రాచలం డిపో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదాయంలో ముందుండేది. 9 మండలాలతో కళకళలాడేది. ఇక్కడి నుంచి కుక్కునూరు, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, కూనవరం, రేకపల్లి, చింతూరు ప్రాంతాలకు నిత్యం ఎర్ర బస్సులు తిరి గేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో పరిస్థితి తారుమారైంది. ఉద్యోగుల బదలాయింపుతోపాటు సర్వీసులు కుదించారు. దీంతో రేకపల్లి, చింతూరు, కుక్కునూరు సర్వీసుల ను ఎత్తివేశారు. రాజమండ్రి వైపు వెళ్లే సర్వీసులను తగ్గించారు. ఇదే అవకాశంగా ఆంధ్రప్రదేశ్లోని గోకవరం తదితర డిపోల నుంచి సర్వీసులు పెంచి ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం పొందుతోంది. డ్రైవర్ల కొరతతో ఇక్కట్లు ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఆదాయం వస్తుండటంతో భద్రాచలం డిపో లాభాల్లో నడుస్తోంది. ఉత్సవాల సమయంలో మినహా మిగతా రోజుల్లో నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. డిపోలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం డిపోలో 107 బస్సులు సర్వీసులు ఉన్నా మరమ్మతుల నేపథ్యంలో 103 సర్వీసులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. వీటికి 225 మంది డ్రైవర్లు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం 193 మంది మాత్రమే ఉన్నారు. 32 మంది లోటుతో సర్వీసులు నడపాల్సివస్తోంది. దీంతో డ్రైవర్లతో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లకు జిల్లాలోనే విధులు కేటాయించాలని నిబంధనలు ఉండటంతో సమస్య మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో సర్వీసులను రద్దు చేస్తూ ఆర్టీసీ ప్రజలకు దూరమవుతోంది. బస్సుల పెంపుపై దృష్టిసారించాల్సిన ఆర్టీసీ.. ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం, దుకాణాలు అద్దెకు ఇవ్వటంపై చొరవ చూపడం గమనార్హం. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. ఆ దిశగా ఆర్టీసీ కనీసం ప్రణాళికలు రూపొందించలేదు. రెండేళ్ల క్రితం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నడుమ బస్సులు నడపాలని ఒప్పందం కుదుర్చుకున్నా అమల్లోకి రాలేదు. మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం పదుల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఏసీ, స్లీపర్ వంటి అధునాతన సౌకర్యాలతో సుమారు 10 బస్సులు భద్రాచలం మీదుగా ఒడిశాకు వెళ్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ సైతం భద్రాచలం వస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచీ రోజూ పదుల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు, వైద్య, వాణిజ్య కేంద్రమైన భద్రాచలానికి ప్రయాణాకులను తరలిస్తున్నాయి. భద్రాచలం డిపో నుంచి బస్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల డిపోలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయం దండుకుంటున్నాయి. ఇప్పటికై నా తెలంగాణ ప్రభుత్వం భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా ఏర్పాటు చేయడంతోపాటు సర్వీసులు, సిబ్బందిని పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. భద్రాచలం, ఒడిశాల మధ్య బస్సులు తిప్పేందుకు మళ్లీ సర్వే నిర్వహిస్తాం. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిహద్దు, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. –జంగయ్య, డిపో మేనేజర్, భద్రాచలం -
వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్లో చేపట్టిన సమ్మె సమయాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అడుగులు పడుతున్నాయని, ఇందులో భాగంగా 2021 వేతన సవరణ వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు అంశాలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు. త్వరలోనే యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించాక, గుర్తింపు పొందిన యూనియన్ నుంచి సభ్యుడిని విలీన కమిటీలోకి తీసుకుంటారని వెల్లడించారు. అలాగే, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించగా, కార్మికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని ఆర్ఎం వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య పాల్గొన్నారు.బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలిటీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ మణుగూరు టౌన్: దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న పోరాటం బూత్ స్థాయిలో విజయం సాధించినప్పుడే సార్థకమవుతుందని, బీఎల్ఏలు సైని కుల్లా పనిచేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బూత్ లెవల్ ఏజంట్ల శిక్షణా శిబిరంలో మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించడం, దొంగ ఓట్లు గుర్తింపు ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలన్నా రు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న మా ట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలను ఫారం–6, 7,8 ద్వారా పూర్తి చేయించాలన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం నాయకులను శాలువాలతో సన్మానించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, మాజీ ఎంఎల్సీ నర్సిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఎఫ్బీఓతో ఆరుగురి దురుసు ప్రవర్తన పాల్వంచరూరల్: రిజర్వ్ ఫారెస్టుకు చెందిన భూమిలో మట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తు న్న వారిని అడ్డుకున్న బీట్ ఆఫీసర్పై ఆరుగు రు దురుసుగా వ్యవహరించిన ఘటన ఇది. రేంజర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగం గ్రామ పంచాయ తీ పరిధి సంగం గట్టు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన భూమిలో మట్టిని అక్రమంగా తరలించేందుకు ఈనెల 11న జేసీ బీ, ట్రాక్టర్లు తీసుకురావడంతో సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ హరి సంఘటన స్థలానికి వెళ్లి అట్టుకున్నారు. దీంతో అక్కడున్న ఆరుగురు ఎఫ్బీఓపై దురుసుగా వ్యవహరించి విధులకు ఆటకం కల్గించారు. దీంతో ఎఫ్బీఓ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైదిక పోస్టుల భర్తీకి పరీక్షలుభద్రాచలంటౌన్: భద్రాచలం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టుల భర్తీకి శనివారం హైదరాబాద్లోని కాచిగూడ తుల్జా భవన్ ధర్మశాలలో రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, చీఫ్ ఎగ్జామినర్తో పాటు సంబంధిత పోస్టుల ఎంపిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అటవీ అధికారుల తీరు సరికాదు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని గుడిపాడులో 25ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు ఏటా అడ్డుకోవడం సరికాదని పీఓడబ్ల్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ పేర్కొన్నారు. గుడిపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ అధికారులు ప్రతీ సీజన్లో పోడుదారులు, మహిళలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా సర్వే చేసి పట్టాలు ఇవ్వడమే కాక ఆదివాసీ గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు శిరోమణి, ఝాన్సీ, దుర్గా, సరోజిని, పద్మ, నర్సమ్మ, పరిమళ, అమర్లపూడి శరత్, నాగిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రాణదాతలు..
ఎవరు దానం చేయొచ్చు.. రక్తదానం చేయడానికి కొందరు భయపడిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 168సార్లు రక్తదానం చేయొచ్చు. ఈనేపథ్యాన ● ఆరోగ్యంగా ఉండి 18 నుంచి 60 ఏళ్లలోపు వారు రక్తదానం చేయొచ్చు. ● మత్తు మందులకు అలవాటుపడినవారు, హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తం ఇవ్వడానికి అవకాశం లేదు. ● ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలు అయితే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల తర్వాతే రెండోసారి రక్తం ఇవ్వాలి. ● శరీర బరువు సగటున 45 కేజీలు ఉండి హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. ఒకరి రక్తం.. ముగ్గురికి ప్రాణం.. ఒక వ్యక్తి దానం చేసే రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలిసిన ద్రవం ఉంటుంది. రక్తం ఇవ్వగానే దాన్ని వివిధ కాంపోనెంట్లుగా విభజిస్తారు. ఒక హోల్ బ్లడ్ను కనీసం మూడు రకాల కాంపోనెంట్లుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కరి రక్తమే కనీసం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. దీనిని మరిన్ని కాంపోనెంట్లుగా విడదీసే అవకాశం ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రయోజనాలు.. రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్ ప్రొఫైల్ తెలుసుకుంటారు. దీంతో ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా లేదో తెలుసుకుని పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తనష్టాన్ని భర్తీచేయడం కోసం 4–8 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్ర రక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్ధరణను సరిచేస్తుంది. కొరవడిన అవగాహన.. గతంలో రక్తదానంచేయడంపై ఉన్న అవగాహన కార్య క్రమాలు, ప్రజల్లో ఉన్న సేవా భావం కరోనా విజృంభన తదుపరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రజల్లో ఏర్పడిన అపోహలను అధికారులు పోగొట్టేందుకు చేయాల్సిన అవగాహన కార్యక్రమలు తూతూ మంత్రంగానే చేస్తున్నా రు తప్ప పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. ఇకనైనా అధికారులు రక్తదానంపై విస్తత ప్రచారం చేసి, అవగాహన కల్పిస్తే ఎందరో ప్రాణాలను కాపాడవచ్చు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్లుగా.. ● గడిచిన ఐదేళ్లుగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 12 వేల యూనిట్ల రక్తం సమకూరగా.. ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 70 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంది. ● నిత్యం ‘ఓ’పాజిటివ్ రక్తం నిల్వలు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ‘ఓ’పాజిటివ్తో పాటు ‘ఎ’పాజిటివ్ రక్తం ఎక్కువగా అవసరమవుతుంది. ● రక్తం నిల్వలకు 300 యూనిట్ల స్టోరేజ్ రిఫ్రిజిరేటర్లు, ప్లేట్లెట్ల మెషిన్, ప్లాస్మా స్టోరేజ్ రిఫ్రిజిరేటర్(– 80 డిగ్రీలు) అందుబాటులో ఉన్నాయి. ● ఇప్పటివరకు అక్రమంగా అమ్ముకుంటూ దొరికిన సంఘటనలు లేవు. ● ప్రతి నెలా ఐదుగురు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఐదు యూనిట్ల రక్తాన్ని ఇస్తున్నారు. ● వివిధ ప్రమాదాల్లో గాయపడిన 1,200 మందికి రక్తాన్ని అందించారు. ● పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కామెర్లతో బాధపడుతూ అత్యవసరంగా రక్తం కావాల్సి ఉన్న రెండేళ్ల చిన్నారికి ఈ ఏడాది జనవరి 23న అర్ధరాత్రి మురళి అనే వ్యక్తి రక్తదానం చేయడంతో చిన్నారి ప్రాణాలకు కాపాడారు. ● భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఫ్రిబవరి 3న 14 రోజుల నవజాత శిశువుకి ప్లేట్లెట్ల సంఖ్య తక్కువ ఉండడంతో మురళి రక్తదానం చేశారు. ● అలాగే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జనవరి 31వ తేదీన తల్లికి బిడ్డకి ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉంటడంతో అర్ధరాత్రి 12.30కి మురళి రక్తదానం చేశారురక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చేందుకు రక్తం ఎక్కించడమే మార్గం కావడంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమాజం కోసం ఇప్పుడు రక్తదాతలు అవసరం. – భద్రాచలంఅర్బన్నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవంమదర్థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువకులంతా కలిసి రక్తదానం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 61 సార్లు రక్తదానం చేశాను. పట్టణంలో అనేక సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. రానున్న కాలంలో ఈ సేవలను మరింత విస్తృత పరుస్తాం. – మురళి, మదర్థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహుకుడు, భద్రాచలం రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భద్రాచలంలో ఉన్న రక్తదాతతు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రక్తదానం చేయండి. రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున స్వచ్ఛందంగా యువత ముందుకురావాలి. శుభకార్యాలు, పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేలా కృషి చేయాలి. – డాక్టర్ రాజశేఖర్రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, భద్రాచలం -
మట్టి గుట్టలపై పచ్చనిహారం
మణుగూరు టౌన్: మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓబీ మట్టిగుట్టలపై పచ్చదనం పరుచుకుంటోంది. ఏటా యాజమాన్యం మొక్కలు నాటి రక్షిస్తోంది. 1989 నుంచి 2025 సంవత్సరం వరకు 1440.58 హెక్టార్లలో 32,32,032 మొక్కలు నాటింది. పీకేఓసీ, మణుగూరు ఓసీ మట్టి గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచుతోంది. వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది కూడా వన మహోత్సవానికి సిద్ధమవుతోంది. 1,52,450 మొక్కలు నాటేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. 19.50 హెక్టార్లలో 48,750 మొక్కలు, ఎండిపోయిన, చనిపోయిన మొక్కల స్థానాల్లో 25 హెక్టార్లలో 62,500 మొక్కలు, మొదటి సంవత్సరం మొక్కల మెయింటెనెన్స్ కింద 41,200 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించింది. నారేప, వెదురు, రావి, వేప, బట్టగనం, ఎగిస, ఉసిరి, నేరేడు, ఏడాకులపాల, చిందుగ, సీతాఫలం, తాని, ఆకాశమల్లె, చింత, రేల, సీమచింత, తప్సి, టేకు, బండారి, పుత్రంజీవ, బూరుగ, కరక వంటి 40 మొక్కలు నాటనున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా మణుగూరు ఓసీలోని సుమారు 7 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏటా వానాకాలం మొక్కలు నాటడం, సమీప ప్రజలకు పంపిణీ చేయడంలో సింగరేణి ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది కూడా మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తించాం. సమీప గ్రామాల్లో కూడా మొక్కలు పంపిణీ చేస్తాం. –దుర్గం రాంచందర్, ఏరియా జీఎం -
రైలు కిందపడి వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే డోర్నకల్ జీఆర్పీ ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. తెల్లవారుజామున స్టేషన్కు చేరుకున్న మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కింద గుర్తు తెలియని వ్యక్తి పడడంతో మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా.. 40–45 ఏళ్ల వయస్సు వ్యక్తి ఒంటిపై బ్లూ కలర్ లుంగీ, నిలువు గీతల తెల్లరంగు చొక్కా ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తరలించామని, గుర్తించిన వారు ఫోన్ నంబర్ 87126 58606, 87126 58600, 94947 90619, 89194 30272లకు సమాచారం ఇవ్వాలన్నారు. ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్.. పాల్వంచ: పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ బొల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బంగారు రామస్వామి గుంపు నందు బంగారు బాబు వద్ద ఛత్తీస్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట మండలం కిష్టారంకు చెందిన కర్కా శ్రీను (26) ట్రాక్టర్ డ్రైవర్గా గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం శేఖరం బంజరకు చెందిన బానోతు భీముడుకి చెందిన వ్యవసాయ భూమిని దున్నడానికి శ్రీను ట్రాక్టర్తో వచ్చాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి ట్రాక్టర్ బొల్తా పడటంతో స్టీరింగ్ ఛాతిభాగంలో తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు అతడిని బయటకు తీయగా.. మృతుడి తండ్రి జోగారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడు.. అశ్వాపురం: వడదెబ్బకు గురైన మండల పరిధిలోని చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ చింతిర్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నాగరాజు (31) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 10న మండల పరిధిలోని అమెర్ధ గ్రామంలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి అశ్వాపురం పీహెచ్సీకి అక్కడి నుంచి మణుగూరు, భద్రాచలం, ఆపై ఖమ్మంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేశారు. వడదెబ్బతో మరొకరు.. భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన మల్లేష్(50) శనివారం ఉదయం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, భద్రాచలం టౌన్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి కూలీగా పనిచేసే మల్లేష్ శుక్రవారం ఉదయం 8 గంటలకు కాంట్రాక్ట్ కూలీ పనికి వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నాక అర్ధరాత్రి సమయాన వాంతులు, విరోచనాల అయ్యాయి. అనంతరం నిద్రపోయిన మల్లేష్ తిరిగి 13వ తేదీ ఉదయం సృహతప్పినట్లు కనిపించడంతో కుటుంబాలకులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య గురవమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న వ్యక్తి .. రఘునాథపాలెం: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఎలుకల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం కేసీఆర్ కాలనీకి చెందిన కొరదాల గోపి(29) కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే, గోపి దంపతుల నడుమ మనస్పర్థలతో ఆయన భార్య ఏడాది కాలంగా విజయవాడలోని పుట్టింట్లో కుమారుడితో ఉంటోంది. ఏడాది దాటినా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన గోపి ఈనెల 3వ తేదీన ఎలుకల మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి మైసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఉసా్మ్న్ షరీఫ్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్.. ముగ్గురికి గాయాలు, కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ టి.యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమి ల్లి మండలం దర్భగూడేనికి చెందిన దారబోయిన శ్రీను, సోమ వెంకన్నబాబు, గౌతమ్లు ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రా మానికి శుక్రవారం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్యాంకర్ డ్రైవర్ రామ్చరణ్సింగ్(మధ్యప్రదేశ్) ఘటన స్థలంలో ఆగకుండా పారిపోతు న్న క్రమంలో పేటమాలపల్లి వద్ద పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 200 కేజీల గంజాయి స్వాధీనం? కొణిజర్ల: కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన మామిడికాయల లోడు పేరిట లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు, ఈగిల్ ఫోర్స్ సభ్యులు శనివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈక్రమాన సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఒడిషా రాష్ట్రం నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేపట్టగా.. పైన మామిడికాయలు లోడ్ చేసి వాటి కింద ట్రేలలో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించారని తెలిసింది. -
‘ఉపాధి’లో వివాహ వేడుకలు!
అశ్వారావుపేటరూరల్: ఉపాధి కూలీ దంపతుల వివాహా వేడుకకు పని ప్రదేశమే వేదికగా మారింది. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆకుల శ్రీను–దుర్గ దంపతులు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం కూడా ఉపాధి పనికి వెళ్లారు. కాగా, వీరి వివాహామై శనివారం నాటికి పాతికేళ్లు నిండాయి. విషయం తెలుసుకున్న తోటి కూలీలు పూలు, ఆకులతో దండలు సిద్ధం చేశారు. తలంబ్రాలు తయారు చేశారు. దంపతులతో దండలు మార్పించి పెళ్లి తంతు జరిపించారు. స్వీట్లు పంపిణీ చేశారు. వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పెద్దతండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దతండాకు చెందిన ధరావత్ శంకర్–కాంతి దంపతులు తాటాకులతో కూడిన పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసెకు నిప్పంటుకోవడంతో వృద్ధాప్యం, అనా రోగ్యంతో బాధపడుతున్న శంకర్ మంచంపై పడుకోగా.. ఒకేసారి లేచి రాలేకపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈప్రమాదంలో పూరి గుడిసెతో పాటు ఇంట్లోని ఫ్రిజ్, ఇనుప బీరువా, టీవీ, ఫ్యాన్లు, డబుల్ కాట్, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. వైరా ఎమ్మెల్యే భరోసా.. శంకర్ పూరిల్లు దగ్ధమైన విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను తెలుసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అమరారంలో గడ్డివాము.. పినపాక: అనుమానాస్పదంగా పది ఎకరాల గడ్డి వాము దగ్ధమైన ఘటన మండల పరిధిలోని అమరారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ ముజాఫర్ తన ఇంటి ఆవరణలో 10 ఎకరాల గడ్డిని ఉంచాడు. శనివారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో గడ్డివాముకు మంటలు వ్యాపించడాన్ని గమనించి ఫైర్ ఇంజన్కు సమాచారం అందించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో సుమారు రూ.50వేల నష్టం వాటిల్లిందని, కావాలనే ఎవరైనా నిప్పంటించారేమోనని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం -
ప్లే డేకు హాలిడే?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో గ్రేడ్–5 (జీ–5) నుంచి గ్రేడ్–17 రకం వరకు బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో జీ–5 మేలి రకం కాగా జీ–17 నాసిరకం బొగ్గుగా పరిగణిస్తారు. సింగరేణిలో సగటు గ్రేడ్ జీ–3గా ఉంది. మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తికి సింగరేణిలో సగటున రూ.4,700 ఖర్చు అవుతుండగా కోలిండియాలో రూ.2,600గానే ఉంది. తద్వారా తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సింగరేణి బొగ్గును కొనేందుకు తటపటాయిస్తున్నాయి. భవిష్యత్కు ఇది ఒక ప్రమాదకర సంకేతంగా సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గిస్తే తద్వారా మార్కెట్లో తోటి కంపెనీలతో పోటీ పడవచ్చని యోచిస్తోంది. రొటేషన్ పద్ధతిలో వారాంతపు సెలవు! ప్రస్తుతం సింగరేణిలో ఇల్లెందు ఏరియాను (శుక్రవారం) మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఆదివారం సెలవు దినంగా ఉంది. ఆ రోజు కూడా పని చేసే కార్మికులకు ప్లే డే విధానం అమలు చేస్తుండగా, రెట్టింపు వేతనం అందుతుంది. సదరు సెలవు దినాన్ని మరో రోజు వాడుకునే వీలు ఉంది. దీనివల్ల ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతోందని, రాబోయే వేజ్బోర్డు అమల్లోకి వస్తే ప్లే డే ఖర్చు రెట్టింపు కావడం ఖాయమని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. దీంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి సూచించినట్టు ఆదివారం ప్లేడే ఇచ్చే బదులు రైల్వేస్, ఆర్టీసీ తరహాలో రొటేషన్ పద్ధతిలో వారాంతపు సెలవు విధానం అమలు చేసే అంశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. ప్లే డే కేటాయింపులోనూ అవకతవకలు! గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ పెరిగింది. భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల నుంచే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల్లో సైతం కంటిన్యూస్ మైనర్లు ఉన్న చోట ప్రైవేట్ సంస్థలే అత్యంత ముఖ్యమైన పనులు చేస్తున్నాయి. మరోవైపు కంప్యూటరీకరణ పెరిగిపోయిన తర్వాత నిర్వహణ సైతం సులువుగా మారింది. అయినా ప్లే డే విధానం గతంలో తరహాలోనే కొనసాగుతోంది. హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్లో సుమారు వంద మంది ఉద్యోగులు పని చేస్తుంటే ఇందులో కనీసం నాలుగో వంతు మంది ప్రతీ వారం ప్లే డేలు పొందుతున్నారు. కొన్ని గనుల్లో ఉన్నత స్థాయి అధికారులకు ఎంతో కొంత సమర్పిస్తూ, వారి ఇంటి పనులు చేస్తూ ప్లే డేలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటేషన్ల అంశంపై దృష్టి సారించిన సింగరేణి యాజమాన్యం ఆ తర్వాత ప్లేడేలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. తొలినాళ్లలో ప్రమాదకర పరిస్థితుల మధ్య పనిచేసే గని కార్మికుల్లో భయం పోగొట్టేందుకు, విభిన్న ప్రాంతాల కార్మికుల మధ్య ఐక్యత సాధించేందుకు ఆటల పోటీలు నిర్వహించి, వేతనం చెల్లించేవారు. దీన్ని ప్లే డేగా అప్పట్లో బ్రిటీషర్లు పేర్కొన్నట్టు సీనియర్ కార్మికులు చెబుతుంటారు. ఆ తర్వాత 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక బొగ్గుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సెలవు రోజుల్లో కూడా కార్మికులు పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా విధులకు గైర్హాజర్ కాకుండా పని చేసిన కార్మికులకు వాచీలు, లంచ్ బాక్స్లు, సైకిళ్లను బహుమతులుగా ఇచ్చారు. ఇదే క్రమంలో ప్లే డే విధానం తిరిగి తెర మీదకు వచ్చింది. అప్పట్లో సంస్థలో కార్మికులు, ఉద్యోగులు లక్ష మందికి పైగా ఉండేవారు. నాలుగు వందలకు పైగా కార్మిక సంఘాలు ఉండేవి. అందరినీ అధిక ఉత్పత్తి లక్ష్యం దిశగా నడిపించేందుకు ఉత్పత్తితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న మెజారిటీ కార్మికులు, ఉద్యోగులకు ప్లే డేలు ఉపయోగపడ్డాయి. కాగా, ఇప్పుడు దుర్వినియోగం అవుతున్నాయనేది కార్మికుల మాటగా ఉంది. గ్రేడ్ కోలిండియా వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ సింగరేణి జీ–5 4,412 5,031 8,519 జీ–7 3,180 4,387 7,322 జీ–10 1,882 2,750 4,774 జీ–15 1,095 1,879 2,899 జీ–17 894 1,638 2,703సింగరేణికి భారంగా మారిన ఉత్పత్తి వ్యయం -
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ఖమ్మంసహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హెల్త్కార్డుల విధివిధానాలు రూపొందించి వెంటనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన వేలాది మంది ఉద్యో గ, ఉపాధ్యాయులకు బెనిఫిట్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అంతేకాక సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ, హెల్త్ కార్డులపై నగ దు రహిత వైద్యం, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల రూపకల్పన, సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సమా వేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నర్సయ్య, నాగేశ్వరరావు, నిర్మలకుమారి, రామకృష్ణ, ఉద్దందు, పద్మ పాల్గొన్నారు. -
బోనస్ 8 రకాలకేనా?
● గతేడాదిలాగా 33 సన్న రకాల వడ్లకు ఇస్తారా..! ● వానాకాలంలో పండించనున్న ధాన్యంపై స్పష్టత కరువు ● మరోవైపు 8 రకాల సన్నాలే సాగు చేయాలని ప్రభుత్వ సూచన ● అయోమయానికి గురవుతున్న అన్నదాతలు బూర్గంపాడు: మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల సన్న వడ్లనే సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టింది. దీంతో ఈ ఎనిమిది రకాల సన్నాలకే ప్రభుత్వం బోనస్ అందిస్తుందా..? లేకుంటే ఇతర సన్నరకాలకు కూడా అందిస్తుందా? అని రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో రైతులు అధిక దిగుబడులిచ్చే సన్నరకాలను వదులుకుని ప్రభుత్వం సూచించిన రకాల వైపే మొగ్గు చూపాల్సి వస్తోంది. యాసంగి ధాన్యం అమ్మకాల్లో నానాయాతన యాసంగి ధాన్యం అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడాల్సివచ్చింది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోలేక, ప్రభుత్వం కొనుగోలు చేయక నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచిచూడాల్సి వచ్చింది. కొందరు విసిగివేసారి తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయించుకున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో యాసంగి ధాన్యం అమ్మకాలు పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం వానాకాలం సీజన్లో డిమాండ్ ఉన్న సన్నరకాలను సాగు చేయాలని ముందస్తుగా సూచిస్తోంది. వీటికి బహిరంగ మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుండటంతో రైతులు నష్టపోయే అవకాశం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నాలు తినేందుకు అనువుగా లేవని.. ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల భోజనానికి అందిస్తోంది. కొన్ని రకాల సన్నబియ్యం చూసేందుకు సన్నగా ఉన్నా అన్నం వండాక దొడ్డు కావటం, అన్నం మెతుకుల పొట్ట పగలటం, రుచిగా లేకపోవటం వంటివి జరుగుతున్నాయి. రైతులకు బోనస్ అందించి కొనుగోలు చేసిన సన్న బియ్యం కూడా తినేందుకు అనువుగా లేకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఏ రకం సన్నాలకు బోనస్ ఇచ్చేది ప్రస్తుతం ప్రకటించకపోయినా ప్రభుత్వం సూచించిన 8 రకాలకే బోనస్ వస్తుందనే చర్చ రైతుల్లో సాగుతోంది. ప్రభుత్వం సూచించిన 8 సన్న రకాలనే వానాకాలం సీజన్లో రైతులు సాగు చేస్తే మంచిది. ఇవి అధిక దిగుబడులిస్తాయి. బియ్యం నాణ్యతగా ఉండటంతోపాటు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలు. ప్రభుత్వం ఈ ఎనిమిది రకాలకే బోనస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. –బి.తాతారావు, ఏడీఏ, మణుగూరురాష్ట్ర ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్లో 33 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించింది. క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లించింది. ఈ ఏడాది మాత్రం బీపీటీ–5204(సాంబమసూరి), జేజీఎల్–1738, కేఎన్ఎం–1638, ఆర్ఎన్ఆర్–15048(తెలంగాణ సోన), డబ్ల్యూజీఎల్–44(సిద్ధి), డబ్ల్యూజీఎల్–962, జైశ్రీరాం, హెచ్ఎంటీ(సోన) వరి రకాలను సాగు చేయాలని చెబుతోంది. వీటికి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే ఈ ఎనిమిది రకాల పంటకాలం ఎక్కువగా ఉండటం, చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. వీటికంటే తక్కువ కాలపరిమితిలో ఎక్కువ దిగుబడులు ఇచ్చే సన్న రకాలను ప్రభుత్వం సూచించకపోవటం విచారకరమని అంటున్నారు. -
తాలిపేరు కాల్వకు మరమ్మతులు చేపట్టాలి
కలెక్టర్ అంకిత్చర్ల: తాలిపేరు ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు మరమ్మతులు చేపట్టాలని, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం ఆయన దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని ఎడమ కాల్వను పరిశీలించారు. నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు సాగు నీటి విడుదలలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఆయకట్టు పరిధిలోని ప్రతీ రైతుకు సాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు, మందులను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మసూపర్బజార్(కొత్తగూడెం): సైబర్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ రెండేళ్లుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసం జరిగితే మొదటి గంటలోనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్బీఐ బ్రాంచిల సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. 22న రామాలయ హుండీ లెక్కింపుభద్రాచలం: ఈ నెల 22న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్ రావు శుక్రవారం ఒక తెలిపారు. సిబ్బంది, స్వచ్చంద సంస్థ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. భద్రాచలం సబ్ ట్రెజరీ ఏటీఓగా మీనాక్షిభద్రాచలంటౌన్: భద్రాచలం సబ్ ట్రెజరీ కార్యాలయం అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏటీఓ)గా మీనాక్షి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏటీఓగా పనిచేసిన విష్ణురావు ఉద్యోగ విరమణ చేయడంతో, ప్రభుత్వం ఆమెను నియమించింది. మీనాక్షి ఇప్పటివరకు కొత్తగూడెంలో ఇన్చార్జి డీటీఓ, ఏటీఓగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎల్వీ ప్రసాద్, కోశాధికారి కృష్ణమూర్తి, సుభద్ర, ఉషారాణి, గౌరీ, రంజాన్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి తోడ్పాటుఅశ్వారావుపేటరూరల్: వ్యవసాయ రంగానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం ఎంతో తోడ్పాటునందిస్తోందని వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ ఐవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాలలో రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం 62వ స్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులను అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీజన్, స్రవంతి, రాంప్రసాద్, జంబమ్మ, కృష్ణతేజ, రమేష్ పాల్గొన్నారు. లోక్ అదాలత్తో రాజీ..జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాజేందర్ మణుగూరు టౌన్: పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్ తదితర కేసులను రాబోయే లోక్ అదాలత్లో పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాసంస్థ సెక్రటరీ రాజేందర్ సూచించారు. శుక్రవారం మణుగూరు కోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. అంతకుముందు పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఇటుక బట్టీల యజమానులతో సమావేశమై ప్రపంచ బాలక కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. మణుగూరు కోర్టు జడ్జి కంభపు సూరిరెడ్డి, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, జనరల్ సెక్రటరీ వీర మధుసూదన్, న్యాయవాదులు కుర్మ విజయరావు, శ్రీనివాసరెడ్డి, పద్మావతి, వాసవి, రమేశ్, సునీత, సుస్మిత, ప్రియాంక పాల్గొన్నారు. -
స్వల్పకాలిక పంటలే మేలు
● జిల్లాపై ఎల్నినో ప్రభావం తక్కువగానే ఉండొచ్చు ● ఈ నెల 15 నుంచి కురిసే వర్షాలు సాగుకు అనుకూలం ● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూపర్బజార్(కొత్తగూడెం): ‘జిల్లాలో ఎల్నినో ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా జాగ్రత్తగా ఉండాలి. స్వల్పకాలిక పంటలు సాగు చేస్తే మేలు. విత్తన వ్యాపారుల నుంచి తప్పకుండా రశీదులు తీసుకోవాలి. ఈ నెల 15 నుంచి సాగుకు అనుకూల వర్షాలు కురిసే అవకాశం ఉంది.’ అని జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు, ఏడీఏ శోభన్బాబు, ఏఓ(టెక్నికల్) సాయినారాయణ సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు రైతులు వ్యవసాయ అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సలహాలు, సూచనలు పొందారు. ప్రశ్న: వరి విత్తనాల్లో ఏవి మేలైన రకాలు? – నందమూరి రాము, దమ్మపేట, వజ్జ మహేష్, కరకగూడెం, మడకం శ్రీనివాసరావు, ములకలపల్లిజవాబు: ప్రభుత్వం మిల్లింగ్ సామర్థ్యం ఉన్న ఆర్ఎన్ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్ఎన్–1638, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ –962, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్ –1798 రకాలను ప్రోత్సహిస్తోంది. ప్ర: ఎకరానికి ఎంత యూరియా వాడాలి? – సోయం నాగరాజు, ములకలపల్లిజ : పంటను బట్టి యూరియా, దఫాదఫాలుగా వేసుకోవాలి. ఏ ఎరువైనా సరైన సమయంలో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వేసుకుంటే మొక్కకు బాగా ఉపయోగపడుతుంది. ప్ర: పెసరలో ఏ విత్తన రకం మంచిది? – షేక్ ఖలీల్ మియా,పెనగడప, చుంచుపల్లి మండలంజ : ఎంజీజీ–295. మధిర పరిశోధనా స్థానంలో దొరుకుతుంది. ప్ర: జీలుగు విత్తనాలు కావాలి. – నూనావత్ రవి, పూసలతండ, పాల్వంచ మండలం జ : పాల్వంచ సొసైటీలో అందుబాటులో ఉన్నాయి ప్ర: జిల్లాకు రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? – మాలోత్ వీరన్న, ఒడ్డుగూడెం, ఇల్లెందుజ : ఈ నెల 15వ తేదీ వరకు విస్తరించవచ్చు. రైతులు భూమిలో సరిపడా తేమ వచ్చిన తర్వాత మాత్రమే విత్తనాలు వేసుకోవాలి ప్ర: భూమిపట్టా లేనివారు యాప్ ద్వారా యూరియా పొందవచ్చా? – వాంక్డోత్ రమేష్, సుజాతనగర్జ : పొందవచ్చు. మీ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేయించుకోవచ్చు ప్ర: ఆళ్లపల్లిలో సొసైటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి – పాయం రమేష్, ఆళ్లపల్లి జ : ఆళ్లపల్లిలో భవనాలు దొరకక ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికి అద్దె భవనం తీసుకున్నాం. అందులో సొసైటీ అందుబాటులో ఉంటుంది. ప్ర: యూరియా యాప్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. – గొల్ల సత్యనారాయణ, అడపా శ్రీనివాసరావు, యర్రారెడ్డి వెంకటరెడ్డి– బయ్యారం, పినపాక మండలం, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి జ : వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుంది ప్ర: చౌడుని తట్టుకొనే వరి రకాలు తెలుపగలరు? – చిన్నశెట్టి వెంకటనర్సయ్య, నారాయణపురం, అశ్వారావుపేటజ : ఆర్ఎన్ఆర్–11718, దాన్ –58 రకాలు తట్టుకుంటాయి ప్ర: ఐదేళ్లు దాటిన ఆయిల్పామ్ తోటలో అంతరపంటగా ఏ పంటలు వేయవచ్చు? – వాగబోయిన నరసింహా, కొమ్ముగూడెం జ : కోకో పంటను అంతర పంటగా వేయవచ్చు ప్ర: ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవాలి – పెండేకట్ల పాపారావు, రాయపాడు, ఆళ్లపల్లి మండలంజ : ఎల్నినో ప్రభావం జిల్లాపై తక్కువగా ఉండే అవకాశం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధార భూముల్లో సాగు చేసే రైతులు తక్కువ పంట కాల సమయం ఉన్న పంటలను అంటే అపరాలను ఎంపిక చేసుకోవాలి. ప్రత్తి పంట వేసుకునే వారు అంతర పంటగా కందిపంటను వేసుకుంటే మంచిది. వర్షాధారం కింద వరి, మొక్కజొన్న పంటలను వేయొద్దు. ప్ర: పత్తిలో నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా? – వాగబోయిన సీతారాములు, గుండాలజ : రైతులు అధీకృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఇంటి వద్దకు, మధ్యవర్తి ద్వారా, గుడ్డ సంచుల్లో అమ్మే విత్తనాలే కొనొద్దు. సీల్ చేసిన ప్యాకెట్/డబ్బాలో ఉన్న గింజలను మాత్రమే కొనాలి. విత్తన ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కంపెనీ తయారు దారు, ఇతర వివరాలు తెలుస్తాయి. బిల్లులో పంట, రకం, లాట్ /బ్యాచ్ నంబర్ ఉండేలా చూసుకుని, సంతకం చేసి తీసుకుని భద్రపరుచుకోవాలి.ప్ర: బాడవ భూముల్లో వరి ఎలాంటి రకాలు వాడాలి? – కూరపాటి ఆంజనేయులు, ఆర్ కొత్తగూడెం, చర్ల మండలంజ : బాడవ భూముల్లో నీరు అధికంగా నిలువ ఉంటుంది. మొదటగా నీటి కాల్వలు వేసుకోవాలి. పొలాన్ని ఎక్కువగా ఆరబెట్టుకోవాలి. కాండం గట్టిగా, పొట్టిగా ఉండే రకాలను ఎంచుకోవాలి. యూరియా తక్కువగా వాడాలి. స్వర్ణ సబ్1 (ఎంటీయు–1061), జేజీఎల్ 1798 (జగిత్యాల్ సన్నాలు), ఎంటీయూ 1140 అనుకూలంగా ఉంటాయి. ప్ర: కేఎన్ఎన్ –1638 ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? – నాగళ్ల సతీష్, ములకలపల్లిజ : కొనుగోలు చేస్తుంది. గడిచిన రబీలో జిల్లాలో ఈ రకం ధాన్యంలో నూక ఎక్కువగా వచ్చింది. వేరే రకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది -
విద్య, వైద్యం, సాగునీటికి ప్రాధాన్యత
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయంగా దిక్కుతోచనిస్థితిలో ఉన్న తనను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెల్లడించారు. శుక్రవారం అశ్వారావుపేటలోని కాసాని గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు పొంగులేటి గాడ్ఫాదర్ లాంటివారని, డిప్యూటీ సీ ఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతోనూ సత్సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి విభాగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని, అశ్వారావుపేటలో కొద్ది రోజుల క్రితమే రూ.200 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అశ్వారావుపేటలో మెడికల్ కళాశాల మంజూరు అయిందని, త్వరలోనే నర్సింగ్ కళాశాల, ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ కళాశాల)ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అటవీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని, దిబ్బగూడెంలో మొబైల్ ఆస్పత్రి, ప్రత్యేకంగా అంబులెన్స్తోపాటు దమ్మపేట మండలంలోని పట్వారీగూడెం, ములకలపల్లి పీహెచ్సీలను సీహెచ్సీలుగా అప్గ్రేడ్ చేయడంతోపాటు యర్రగుంటపల్లిలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. చండ్రుగొండ మండలంలోని వెంగళరాయసాగర్ను రూ.34కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, పెద్దవాగు ప్రాజెక్టును రూ.19 కోట్లతో పున:నిర్మాణానికి ప్రతిపాదన ఉండగా తెలంగాణ వాటా రూ.3 కోట్లు, ఏపీ వాటా కింద రూ.16 కోట్లు మంజూరు దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జూపల్లి రమేశ్బాబు, సీహెచ్ సత్యనారాయణ, తుమ్మా రాంబాబు, జూపల్లి ప్రమోద్, తాడేపల్లి రవి, విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
హైవేపై ఆర్తనాదాలు..
ప్రమాద ఘటనలు ఇలా.. పాల్వంచ మండలంలోని బీసీయం జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న టిప్పర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పినపాక మండలం ఐలాపురం సమీపంలో బైక్పై వస్తున్న ధర్రాజు, బట్టు ప్రశాంత్ను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సారపాకలో అటో ఆదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్ శివ మృతి చెందాడు. మంగళవారం సారపాకలో బైక్ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో చెలికాని గణేశ్ మృతి చెందగా తండ్రి ప్రవీణ్కు గాయాలయ్యాయి. జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ సాంబశివరావు, ట్యాంకర్ డ్రైవర్ కోటయ్య తీవ్రంగా గాయపడ్డారు. 9వ తేదీన మర్రికుంట వద్ద జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో పాల్వంచ మండలం సూరారానికి చెందిన వైష్ణవి, శ్రీవల్లి తీవ్రంగా గాయపడ్డారు. 7వ తేదీన దమ్మపేట మండలం ఆల్లిపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కుంభా మోసి, మెర్ని వరప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. ఇంకా గతనెలలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏవి..? బీసీఎం రహదారిపై నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు 24 గంటలూ రాకపోకలు సాగిస్తుంటాయి. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు సుమారు 50 కిలోమీటర్ల పొడవునా ప్రమాద హెచ్చరిక బోర్డులు కన్పించవు. పాల్వంచ మండలం కేశవాపురం మూలమలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. పదేళ్లుగా బీసీయం జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి. హెవీ లోడుతో వాహనాలు వెళ్లుండటంతో గతంలో నిర్మించిన రోడ్డు ఎత్తుపల్లాలుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికై నా రహదారి పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇల్లెందు నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు, నవభారత్ నుంచి పెద్దమ్మగుడి వరకు రహదారిపై బూడిద ట్యాంకర్లతోపాటు ఇసుక లారీలు నిబంధనలకు విరుద్ధంగా నిలుపుతున్నారు. దీంతో ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్డుపై వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రహదారిపై ప్రమాదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. డ్రైవర్ల అజాగ్రత్త, కండిషన్ లేని వాహనాలు, రోడ్డు మలుపులు, మితిమీరిన వేగం.. ఇలా పలు కారణాలతో బీసీయం జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవిస్తూ క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాద సూచిక, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమతోంది. ఆపద సమయాల్లో చికిత్స, ఇతర అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన హైవే అంబులెన్స్ల సేవలు అంతంతమాత్రంగానే ఉండటం ఆందోళన చెందే అంశం. – పాల్వంచరూరల్రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలతోపాటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి. కారు నడిపేవారు సీట్ బెల్టు పెట్టుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపితే జరిమానా విధిస్తున్నాం. – సతీశ్కుమార్, డీఎస్పీ, పాల్వంచ -
సెర్ప్, ఉపాధి సిబ్బందికి వైద్య పరీక్షలు
చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్, ఉపాధి సిబ్బందికి ఎరిక్సన్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. డీఆర్డీఓ విద్యాచందన పరిశీలించి, పరీక్షలు చేయించు కున్నారు. ఇలాంటి శిబిరాలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. హెల్త్ క్యాంపులను హైదరాబాద్ యశోద వైద్యశాల, శరత్ మాక్స్ విజన్ వరంగల్, ఎరిక్సన్ ఇన్సూరెన్స్ సహకారంతో నిర్వహించారు. జడ్జిని కలిసిన న్యాయవాదులుసూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ హైకో ర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ జె.శ్రీనివాస్ను కొత్తగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నూతన కోర్టు భవనాల నిర్మాణం, న్యా యవాదులు, వ్యాజ్యదారులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పా టు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేష న్ అధ్యక్షులు కిరణ్కుమార్ముధుల్కర్, ప్రధా న కార్యదర్శి మహేశ్ గాడిపెల్లి, కార్యవర్గ సభ్యులు కె.సంజీవరావు, షాజహాన్ పర్వీన్, జి.నాగరాజు, బి.దేవదాస్, డి.ప్రసాద్, ఉమ, ఉషారాణి, బార్ అసోసియేషన్ సలహాదారులు రమేశ్కుమార్మక్కడ్, న్యాయవాదులు పప్పుల ప్రసాద్, కె.రోహిత్ పాల్గొన్నారు. ఏఐఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడిగా కనకయ్యమణుగూరుటౌన్: తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా అన్నవరపు కనకయ్య, రేపాకుల శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మణుగూరు కిన్నెర కల్యాణ మండపంలో జరిగిన నాలుగో జిల్లా మహాసభల్లో ఈ ఎన్నిక జరగ్గా, గత కార్యక్రమాలను సమీక్షించుకున్నారు. అనంతరం నూతన కర్తవ్యాలను రూపొందించుకుని వాటి అమలుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, నిమ్మల వెంకన్న, శెట్టి వినోద, ముదిగొండ రాంబాబు, గడ్డం స్వామి, సోలం నాగరత్నమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులుగా మరమ్మం చంద్రయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, ఆలేట్ కిరణ్, యాస నరేశ్, బందెల చంటితోపాటు మరో 26 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
చేనేత కార్మికుల సమస్యలపై మంత్రికి వినతి
ఖమ్మంమామిళ్లగూడెం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి కోరారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం తదితరులతో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్ర చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆయన శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం నాయకులు ఆమెను కలిసి సమస్యలను విన్నవించారు. ఇప్పటికే 2.50 లక్షల బెడ్ షీట్లు, కార్పెట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చామని, మరో రెండు లక్షల బెడ్షీట్ల ఆర్డర్ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే, ఈ ఏడాది మార్చి నుంచి చేనేత సహకార సంఘాల కార్మికులకు పెంచిన వేతనాలు అమవుతాయని, సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అంతేకాక పెండింగ్ బిల్లులు, మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు అవ్వారి భాస్కర్, మాచర్ల రామచందర్రావు, కందగట్ల భిక్షపతి, గుర్రం శ్రావణ్, వడ్నాల నరేందర్, అంబటి శ్రీనివాస్తో పాటు పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి
చర్ల: పురుగులమందు సేవించిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని కలివేరు గ్రామానికి చెందిన యువతి భద్రాచలంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. మూడు రోజుల క్రితం ఇంటి వద్దనే పురుగులముందు తాగగా కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి ..పినపాక: మండలంలోని చిన్నరాజుపేట గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెబోయిన పొట్టయ్య (60) గేదె కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతుకుతూ వెళ్లాడు. ఓ ఇంటి వద్ద ఉన్న రేకుల షెడ్డు పైపునకు విద్యుత్ సరఫరా చేస్తున్న తీగ తెగి అతని తలపై పడింది. విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వడదెబ్బతో రైతు.. టేకులపల్లి: మండలంలోని లచ్చతండాకు చెందిన జాటోత్ భీంజీ (45) శుక్రవారం ఉదయం తన చేనులోనే వడదెబ్బకు గురై అస్వస్థతతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో వారు శోకసంద్రంలో మునిగారు. -
యూరియా బుకింగ్కు గ్రీన్సిగ్నల్
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు ఎరువుల ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఎరువుల తయారీ ముడి పదార్థాలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి ఎరువుల ధరలు కూడా పెరిగాయి. ఈనేపథ్యాన గత ఏడాది వానా కాలం నుంచి యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యాసంగి సీజన్ నుంచి ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా సరఫరా చేస్తోంది. ఈసారి కూడా ఇదే విధానం అమలుకు నిర్ణయించింది. క్యూలో నిలబడకుండా.. జిల్లాలో సోమవారం నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని నిర్ణీత సెంటర్కు, నిర్ణీత తేదీలో వెళ్తే యూరియా అందిస్తారు. ఫలితంగా రైతులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన బాధ తప్పుతుందని అధికారులు చేపడుతున్నారు. ఈమేరకు పీఏసీఎస్లు, డీలర్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. నాలుగు స్టెప్పుల్లో బుకింగ్ తొలుత స్మార్ట్ ఫోన్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఆపై రైతు(పీపీబీ/ఆర్ఓఎఫ్ఆర్/ఎన్డీఎస్) ఎంపిక చేసి లాగిన్ కావాలి. అనంతరం సాగు వివరాలను నమోదు చేసి, అవసరమైన యూరియా బస్తాల సంఖ్య నమోదు చేసి బుకింగ్ చేసుకోవాలి. ఆతర్వాత వచ్చే గుర్తింపు నంబర్ను డీలర్కు చూపించి యూరియా బ్యాగ్లు కొనుగోలు చేయొచ్చు. ఇక్కట్లు రాకుండా... గత సీజన్లోనూ యాప్ ద్వారా యూరియా అమ్మకాలు చేపట్టినా ఇక్కట్లు ఎదురయ్యాయి. యాప్ సరిగ్గా పనిచేయక, రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక సమస్యలు వచ్చాయి. దీంతో తొలుత ఒక్కో రైతు రెండు బస్తాల యూరియా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత వానాకాలం సీజన్కు ఖమ్మం జిల్లాలో సాగయ్యే పంటల ఆధారంగా 30వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 14,135మె.టన్నుల యూరియా జిల్లాలో ఉంది. ఇదిగాక రిజర్వ్లో మరో 6,197 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నందున పంటల మార్పిడి జరిగితే యూరియా వినియోగం తగ్గే అవకాశముంది. తద్వారా సమస్య రాదని భావిస్తున్నారు. అంతేకాక యూరియా బుకింగ్లో సమస్యలు అధిగమించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001237157ను ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించే వీలు కల్పించారు. అలాగే, స్మార్ట్ ఫోన్ లేని వారు ఏఈఓలను కానీ మీ సేవ, సీఎస్పీ సెంటర్లలో ద్వారా బుక్ చేసుకోవచ్చని అవగాహన కల్పిస్తారు.రైతులు అపోహలకు గురికావొద్దు. పంటల సాగుకు అనుగుణంగా అవసరమైన యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందొచ్చు. జిల్లాలో ఇబ్బంది రాకుండా చూస్తాం. – ధనసరి పుల్లయ్య, డీఏఓ ఖమ్మం -
‘బీజేపీ హయాంలో సంక్షోభం’
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో సంక్షోభంలోకి నెడుతూ అధోగతి పాలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలో జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేశ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ధరలు, రైతులు, కార్మికుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా కేంద్రం వాటి పరి ష్కారంపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు అనుగు ణంగా మోదీ వ్యవహరిస్తుండడం ఇక్కడి ప్రజలను కష్టాల్లోకి నెడుతోందని తెలిపారు. ఇకనైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, రాజ కీయ కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.సోమయ్య, బండి రమేశ్, వై.విక్రం, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, శ్రీనివాసరావు, మడుపల్లి గోపాల్రావు, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భద్రగిరి మార్ట్ ఆదర్శనీయం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్, ట్రైబల్ మ్యూజియం ఆదర్శనీయమని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీఐఆర్డీ) సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో పీసా చట్టం అమలుపై గురువారం జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలు వంటి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం భద్రగిరి మార్ట్ను నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. పీసా అధికారి అశోక్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. సినిమా హాల్ మేనేజర్పై దాడిభద్రాచలంఅర్బన్: దాడి ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన నాగభూషణం ఓ సినిమా హాల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేటకు చెందిన రవి కుమార్ మామూళ్ల కోసం నాగభూషణం వద్దకు వెళ్లాడు. హాల్ యజమానిని అడగాలని సమాధానం ఇవ్వగా రవికుమార్ కోపంతో నాగభూషణంపై చేయిచేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలుజూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. వెంగన్నపాలేనికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం వైపు నుంచి కారు కొత్తగూడెం వెళ్తోంది. ఈ క్రమంలో మాచినేనిపేటతండా గ్రామం వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పూర్ణచందర్, లాజర్లకు అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రెండు కేజీల గంజాయి స్వాధీనంపాల్వంచరూరల్: ఇద్దరు విద్యార్థులు, మరో నలుగురు యువకులు రెండు కేజీల గంజాయితో గురువారం పోలీసులకు పట్టుబడ్డారు. రూరల్ ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గురుకుల కళాశాల సమీపంలో ఆరుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు పట్టుకుని విచారించారు. వారి నుంచి రూ.1.7 లక్షల విలువైన రెండు కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగేందుకు ఒడిశా నుంచి తెచ్చినట్లు విచారణలో అంగీకరించారు. నిందితులు, పాల్వంచ పట్టణానికి చెందిన ఇంటర్ చదివిన గడ్డం వికాస్ గాంధీ, ఐటీఐ చేస్తున్న వేల్పుల చరణ్, దారవత్ చరణ్, ఎస్కె.సాకిర్, ఎస్కే యాకూబ్ పాషా, బట్ట నాగేంద్రబాబులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మట్టి ట్రాక్టర్ ఢీకొని విరిగిన రెండు విద్యుత్ స్తంభాలు రాత్రి వేళ సీతారామ మట్టి అక్రమంగా తరలింపు జూలూరుపాడు: మండలంలోని నల్లబండబోడు సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ మట్టిని గురువారం తెల్లవారుజామున అనంతారం గ్రామానికి కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొనగా, రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. డ్రైవర్ దుర్గాప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గాయపడ్డ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సీతారామ కెనాల్ మట్టిని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. -
724 మె.టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు గురువారం స్పిక్ కంపెనీకి చెందిన 724.05 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 224.05 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పూర్తి ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్లో నాలుగు రోజులుగా ఏఐ, లైఫ్ స్కిల్స్పై ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 139 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, గురువారం జరిగిన కార్యక్రమంలో డీబీసీడీఓ జి.జ్యోతి అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారు సాంకేతికత ఆధారంగా జీవనోపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత, అక్షిత, ఏబీసీడీఓ వెంగళ్రావు తదితరులు పాల్గొన్నారు. -
సాగుతున్న పనులు..
సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాలు కురుస్తుండటంతో రైతులు వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభించారు. వానాకాలంలో 6,37,800 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గత వానాకాలం సీజన్ కంటే ఈసారి 28,178 ఎకరాల్లో పంటల సాగు పెరగనుంది. ఎప్పటిలాగే సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు. వర్షాధారంగా సాగు చేసే రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రమంతా విస్తరించలేదని, రాబోయే ఐదారు రోజులు ఎండ తీవ్రత అధికంగానే ఉంటుందని, రైతులు తొందరపడి విత్తనాలు విత్తొద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సరిపడా వర్షపాతం నమోదై, నేలలో తగిన తేమశాతం ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు వరి: స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలు మాత్రమే నారు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు. పత్తి: పత్తి విత్తనాలను జూలై 20 వరకు విత్తుకోవచ్చు. వారం వ్యవధిలో తేలిక నేలల్లో 50–60 మి.మీ వర్షపాతం, నల్లరేగడి బరువు నేలల్లో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలి కంది: ఏక పంటగా లేదా పత్తి, పెసర, మినుము, వేరుశెనగ, మొక్కజొన్న, జొన్నలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మొక్కల సాంద్రత పెంచి ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న: నీటి ఎద్దడి, నీటి నిల్వను తట్టుకోలేని పంట. బోడేలు– చాళ్ల పద్ధతిలో విత్తితే తేమ నిల్వ ఉంటుంది. అధిక వర్షం కురిసినప్పుడు మురుగునీరు సులభంగా బయటకు వెళ్తుంది. మధ్యకాలిక సంకరాలను జూలై 15 వరకు స్వల్పకాలిక సంకరాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. జొన్న: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు పెసర/మినుము: తక్కువ కాలపరిమితి కలిగిన పంటలు. జూలై 15 వరకు విత్తుకోవచ్చు. వేరు శెనగ: జూలై 31 వరకు విత్తుకోవచ్చు. పొద్దుతిరుగుడు: తేలిక నేలల్లో జూలై 15 వరకు, బరువు నేలల్లో ఆగస్టు 30 వరకు విత్తు కోవచ్చు.జిల్లాలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 35.9 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 115 మి.మీ, దుమ్ముగూడెంలో అత్యల్పంగా 8.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కరకగూడెం 38.6, పినపాక 31.2, చర్ల 40.2, అశ్వాపురం 14.2, మణుగూరు 14.6, ఆళ్లపల్లి 43.4, గుండాల 82.2, ఇల్లెందు 16.4, టేకులపల్లి 39.8, జూలూరుపాడు 102.4, అన్నపురెడ్డిపల్లి 37, చుంచుపల్లి 48.4, సుజాతనగర్ 62, కొత్తగూడెం 50.4, లక్ష్మీదేవిపల్లి 47, పాల్వంచ 36.2, బూర్గంపాడు 11.6, భద్రాచలం 13.4, ములకలపల్లి 12.8, దమ్మపేట 34.6, అశ్వారావుపేట మండలంలో 18.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అడపాదడపా వర్షాలకు వ్యవసాయ పనులు చేపడుతున్న రైతులు వర్షాలు ఎక్కువగా కురవవు అనే ప్రచారం ఆందోళన కలిగిస్తోది. మాకు సాగు పంటలపై వ్యవసాయాధికారులు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులను ప్రారంభించాం. – తోలెం సావిత్రి, మహిళా రైతు, కరకగూడెంవానాకాలం సీజన్ వ్యవసాయ పనుల్లో రైతులు తొందర పడకుండా స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో చేపట్టాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలి. నాణ్యమైన విత్తనాలను విత్తుకోవాలి. – వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి -
‘సుడా’కు అండదండలేవీ?!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘సుడా’ (స్తంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటై పదేళ్లు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు వీడడం లేదు. పాలక మండళ్లు మారుతున్నా, చైర్మన్లు బాధ్యతలు స్వీకరిస్తున్నా పాలన సాఫీగా సాగేల సొంత ఉద్యోగి ఒక్కరు లేకపోవడం గమనార్హం. ఫలితంగా ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) అధికారులే ఇటు కార్పొరేషన్, అటు సుడా బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇక సుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసినా అనుమతులు విడుదల చేయకపోవడంతో పాత పరిధిలోనే పాలన సాగుతోంది. ఆ ఉద్యోగులే అటూఇటు.. గత ప్రభుత్వం 2017లో ‘సుడా’ను ఏర్పాటుచేసి పాలక మండలిని నియమించింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత కమిటీని రద్దుచేయగా, ఇటీవలే నూతన చైర్మన్ను నియమించారు. ఇలా నియామకాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పని చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. నిబంధనల ప్రకారం సుడా వైస్ చైర్మన్గా కేఎంసీ కమిషనర్ వ్యవహరిస్తున్నారు. అంతేకాక కార్పొరేషన్కు చెందిన టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్, ఎస్టాబ్లిస్మెంట్ విభాగాల ఉద్యోగులే సుడా కార్యకలాపాలను కూడా అదనంగా నిర్వర్తిస్తుండడంతో వారిపై భారం పడుతోంది. అటు కార్పొరేషన్ పనులు చేస్తూనే, ఇటు సుడా పరిధిలోని లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతుల పరిశీలనకు ఆటంకం కలుగుతోంది. రాబడి పెరిగినా.. సుడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలు, లే ఔట్లకు ఏర్పాటుకు అనుమతుల ద్వారా ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఒకవేళ ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని కేటాయిస్తే నిరంతరం పర్యవేక్షిస్తూ అక్రమ లేఔట్లను అడ్డుకుంటే రాబడి రెట్టింపు అవుతుంది. పొరుగున ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ‘కుడా’(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)కు ప్రభుత్వం ప్రత్యేక పోస్టులు మంజూరు చేయడంతో పాలన సాఫీగా సాగుతోంది. కానీ ‘సుడా’ విషయంలో ఆ చొరవ లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రెండుసార్లు నివేదికలు పరిపాలన సజావుగా సాగడానికి ఐదు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, కనీసం 78 పోస్టులు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి ఓ సారి, ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ప్లానింగ్, డెవలప్మెంట్, అర్బన్ ఫారెస్ట్రీ, అడ్మిన్/అకౌంట్స్, భూసేకరణ విభాగాలను ఏర్పాటు చేయాలని ఇందులో పేర్కొన్నారు. అయినా పోస్టుల మంజూరుపై సానుకూల స్పందన రాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక పోస్టులను సృష్టించి ఉద్యోగులను నియమిస్తేనే సార్ధకత ఉంటుందని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కూడా... గత పాలకవర్గ హయాంలో కేఎంసీ ఉద్యోగులను ‘సుడా’లో విధినిర్వహణకు కేటాయించారు. తాజాగా చైర్మన్ను నియమించగా, పోస్టులు మంజూరు కాకపోవడంతో ఉన్నతాధికారులు మరోసారి కేఎంసీ వైపే చూశారు. ఈమేరకు కేఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి సీపీఓ రాజ్కుమార్, ఇంజనీరింగ్ సెక్షన్ నుండి డీఈఈ వి.నరేందర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ షమ, అకౌంట్స్ విభాగం నుంచి అకౌంట్స్ ఆఫీసర్ చింత శ్రీనివాసరెడ్డి, సీనియర్ అకౌంటెంట్ ఏ.ఉపేందర్రావు, ఎస్టాబ్లిస్మెంట్ విభాగం నుంచి మేనేజర్ జి.శ్రీనివాసరావు, టైపిస్ట్ చంద్రహాసినికి అదనపు బాధ్యతలు కేటాయించారు. -
రైతులకు అండగా ‘సాక్షి’
జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్సూపర్బజార్(కొత్తగూడెం): రుతుపవనాల రాకతో జిల్లాలో వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల నిల్వలు, నకిలీ విత్తనాలు, తొలకరి వర్షాలకే విత్తనాలు వేసే పరిస్థితులు, తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. నేడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సమయం : ఉదయం 11నుంచి 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 8977743066, 9347111131 -
సాగుకు విత్తనాలు రెడీ..
● వరిలో ఐదు రకాలు, 7వేల క్వింటాళ్లు ● అందుబాటులో పెసర, మినుము విత్తనాలు కూడా.. ● పీఏసీఎస్లు, ఆగ్రోస్ ద్వారా విక్రయానికి ఏర్పాట్లు ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ మొదలుకావడంతో విత్తనాభివృద్ధి సంస్థ వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలోని వనరులు, నేలల రకాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖల నుంచి అందిన ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో వరి ప్రధాన పంట కావడంతో ఐదు రకాల విత్తనాలు సమకూర్చనుండగా, మెట్ట పైర్లుగా సాగు చేసే పెసర, మినుము విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాల విక్రయాలు ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు కేంద్రాల ద్వారా జరుగుతున్నాయి. సన్న రకాలు ప్రభుత్వం వరిలో సన్న రకాల సాగును ప్రోత్సహిస్తోంది. దీంతో మూడు రకాలను విత్తనాభివృద్ధ సంస్థ విక్రయానికి సిద్ధం చేసింది. ఇందులో బీపీటీ– 5204 రకం మూడు వేల క్వింటళ్లు, ఆర్ఎన్ఆర్–15048 కేఎన్ఎం–1638 రకాలు రెండేసి వేల క్వింటాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కాక దొడ్డు రకాల్లో ఎంటీయూ–1010, కేఎన్ఎం–118 రకాలను 500 క్వింటాళ్లు చొప్పున సిద్ధం చేశారు. మెట్ట పంటలకు సైతం.. ఉమ్మడి జిల్లాలో మెట్ట పంటలుగా వర్షాధారం ఆధారంగా పెసర, మినుము సాగు చేస్తారు. అంతేగాక వరి మాగాణి భూముల్లో ముందస్తు పంటగా కొందరు రైతులు పెసర సాగు చేసి పరిస్థితులకు అనుగుణంగా పచ్చిరొట్టగా వినియోగిస్తారు. మిర్చి వంటి పంటల సాగుకు ముందు కూడా భూసారం పెంచేందుకు పెసర వేస్తారు. తద్వారా రైతులకు ఆదాయం లభించడమే కాక పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది. పెసరలో మధిర రకాలు ఎంజీజీ–295 రకం 500 క్వింటళ్లు, ఎంజీజీ–385 రకం 800 క్వింటళ్లు అందుబాటులో ఉండగా, మినుములో పీయూ–31 రకం 200 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు విక్రయ కేంద్రాల ద్వారా విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇండెంట్ల ఆధారంగా విత్తనాలను సమకూరుస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తన విక్రయాలు మొదలయ్యాయి. వరి, పెసర, మినుము విత్తనాలు కూడా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. – బయ్య రఘు, ప్రాంతీయ మేనేజర్, విత్తనాభివృద్ధి సంస్థ -
ప్రాణం తీస్తున్న పశువులు
● అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపాన ఇటీవల ద్విచక్రవాహనంపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న కారం దుర్గారావు(32) రహదారిపై గేదెలను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ● మణుగూరు పీవీ కాలనీకి చెందిన చింతల ఎల్ల మ్మ(80) గత మంగళవారం ఇల్లెందు వెళ్లడానికి బస్టాండ్కు బయలుదేరింది. రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ ఎల్లమ్మపై పడడంతో తీవ్రగాయాలతో కన్నుమూసింది. చుంచుపల్లి: రహదారులపై మూగజీవాల సంచారం నానాటికీ పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులుగా తిష్ట వేస్తున్న పశువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొందరు యజమానులు పట్టింపు లేకుండా వాటిని మేత కోసం వదిలిపెడుతుండడంతో అవి రోడ్లపైకి చేరి వాహనదారుల ప్రానాలను బలిగొంటున్నాయి. పల్లెల్లో కాస్త నియంత్రణలో ఉన్నా పట్టణాల్లో పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. పశువుల సంచారంపై పంచాయతీ, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని జనం మండిపడుతున్నారు. అయితే, కొన్నిచోట్ల పశువులు రహదారులపై బైఠాయిస్తుండగా, ఇంకొన్ని చోట్ల పరిగెత్తి వస్తుండడంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. చర్యలు కరువు... మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో పశువుల సమస్యను అరికట్టడానికి కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పశువులు రోడ్లపైకి వస్తే మొదటి తప్పుగా రూ.వేయి నుంచి రూ.5వేల వరకు యజమానులకు జరిమానా విధించొచ్చు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ నిబంధనలను అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక పశువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై యజమానులకు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం. రోడ్లే ఆవాసం గ్రామీణ రహదారుల్లోనే కాక పట్టణాలు, నగరాల్లో ప్రధాన రహదారుల్లో కూడా పశువులు తిష్ట వేస్తున్నాయి. హోటళ్లలో యజమానులు పడేసే ఆహారం, కూరగాయలు తింటుండగా.. ఇంకొందరు భక్తితో పెట్టే బియ్యం, అన్నం, పండ్లు తింటూ కాలం గడుపుతున్నాయి. కొన్నింటిని యజమానులే మేత కోసం వదులుతుండగా.., ఇంకొన్ని పశువులు ఎవరివో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొందరు యజమానులు పశువులకు మేత పెట్టలేక రోడ్లపైకి వదిలేస్తుండడంతో వాహనదారులకు శాపంగా మారుతోంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాల పాలవుతున్నారు. ఇక కొన్ని ఘటనల్లో మూగజీవాలు సైతం గాయపడుతున్నాయి. ఇక రాత్రి పూట సమీపానికి వెళ్లే వరకు గేదెలు కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. యజమానులు ఇస్టారాజ్యంగా పశువులను రహదారులపైకి వదిలేస్తున్నారని తెలిసింది. దీని వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆవులు, గేదెలు గుంపులు,గుంపులుగా తిష్ట చేయటమే కాకుండా వచ్చిపోయే ప్రజలు, వాహనదారులపై దాడులకు దిగుతున్నాయి. దీని విషయంలో పశువుల యజమానులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తాం. – ఎం.విద్యాచందన, డీపీఓ -
కొనుగోళ్లలో అగ్రభాగాన నిలుస్తాం
ఇల్లెందురూరల్: పొదుపు సంఘాల నిర్వహణతోపాటు వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధిస్తామని, పంటల విక్రయం, కొనుగోళ్లలో అగ్రభాగాన నిలుస్తామని తెలంగాణ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సూర్నపాక విజయ అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సాధించిన ప్రగతిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం ఉపాధ్యక్షురాలు ధనసరి శివసరిత, డీపీఎంలు సమ్మక్క, నర్సయ్య, ఏపీఎంలు వెంకయ్య, కరుణాకర్, రామకృష్ణ, సీఈవో ప్రగతి, సీసీలు, మహిళలు పాల్గొన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ -
కార్పొరేట్లకు లొంగిపోయిన మోదీ ప్రభుత్వం
మణుగూరు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు లొంగిపోయిందని, దేశ సంపదను కార్పొరేట్లు, ట్రంప్ కాళ్ల దగ్గర పెడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. గురువారం పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రూ. 70వేల కోట్ల వ్యవసాయ రంగాన్ని అమెరికాకు, యూరోపియన్ యూనియన్కు అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైల్ భరో ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తుపాకీ రాముడి మాటలు చెబుతున్నారని అన్నారు. నాయకులు అన్నవరపు కనకయ్య, బి.చిరంజీవి, చిట్టి వినోద, మర్మం చంద్రయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్, వినోద, నిమ్మల వెంకన్న, శ్రీనివాస్, సాంబశివరావు, నర్సింహారావు పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అదేవిధంగా స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో పరీక్షలకు 4,440 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,167 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 71.33 నమోదు కాగా, ఇందులో బాలురు 63.68 శాతం, బాలికలు 77.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 15వ స్థాఽనంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఒకేషనల్కు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 414 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్కు సంబంధించి 1,826 మంది పరీక్ష రాయగా, 978 మంది ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్లో 366 మంది విద్యార్థులు హాజరు కాగా, 256 మంది ఉత్తీర్ణులైయ్యారు. విద్యార్థులు షార్ట్ మెమోలు బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందవచ్చని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్ కోసం పేపర్కు రూ.100, రీవెరిఫికేషన్ కోసం పేపర్కు రూ.800 చొప్పన ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా నిపుణుల ఉచిత కౌన్సెలింగ్ కోసం 14416 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని హోటళ్లు, లాడ్జీ ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు 62 లాడ్జీలు, హోటళ్లలో సోదాలు నిర్వహించారు. అతిథుల గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డులు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్ఇన్ వివరాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతకు సంబంధించిన ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో పోలీస్ జాగిలంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వివరాలు సేకరించారు. దాదాపు 30 మంది ప్రయాణికులను విచారించారు. ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్కుమార్ మాట్లాడుతూ హోటళ్లు, లాడ్జీలకు వచ్చేవారి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీఐ నాగరాజు ఎస్ఐలు సతీష్, శ్యాం, రామకృష్ణ, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీజనల్ జ్వరాలు ప్రబలకుండా చర్యలు
మణుగూరు రూరల్/భద్రాచలం అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం అడిషనల్ డీఎంహెచ్ఓ కార్యాలయం, మలేరియా డ్రగ్ స్టోర్స్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలన్నారు. మలేరియా మాసోత్సవాలను, ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏసీఎం, స్టిరప్ పంపులు, ఫాగింగ్ మెషిన్ల వివరాలను అందించాలన్నారు. అధికారులు ప్రతాప్, హరీష్, శ్రీధర్, పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గేదెను బైక్ ఢీకొనడంతో ఘటన పెనుబల్లి: మండలంలోని లింగగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. లింగగూడెంకు చెందిన స్నేహితులు పద్దం విష్ణు(19), విరపా గోపరాజు ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మరో మిత్రుడు మిడియం శివ(19)ను వీఎం బంజర్లో ద్విచక్రవాహనం ఎక్కించుకున్నారు. ఆపై లింగగూడెం వస్తుండగా ఆకస్మాతుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టి గాలిలో ఎగిరి పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, బైక్ నడుపుతున్న విష్ణు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆతర్వాత మిడియం శివ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక గాయాలైన గోపరాజును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు. -
పేరు మారేనా..?
● రైల్వే స్టేషన్ పేరు కొత్తగూడెంగా మార్చాలని విన్నపాలు ● పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండటంతో భద్రాచలం రోడ్గా ఏర్పాటు ● స్టేషన్ల పేర్ల మార్పుపై కసరత్తు నేపథ్యంలో ఇక్కడా మార్చితే మేలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బ్రిటీష్ జమానాలో పెట్టిన రైల్వే స్టేషన్ల పేర్లను స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు తగ్గట్టుగా కొత్త పేరు పెట్టే ప్రక్రియ కొన్నేళ్లుగా జరుగుతోంది. మరోసారి ఈ అంశం తెర మీదకు రావడంతో జిల్లా కేంద్రంలో ఉన్న భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన సమయం వచ్చింది. భద్రాచలం – మల్కన్గిరి ప్రస్తుతం భద్రాచలం– మల్కన్గిరి రైలు మార్గం మంజూరైంది. మల్కన్గిరి వైపు నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ లైన్ అందుబాటులోకి వచ్చాక భద్రాచలంలో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. దీనికితోడు కొత్తగూడెం– కిరండోల్ లైన్ సైతం ఫైనల్ లొకేషన్ సర్వే జరుపుకుని నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ మార్గం నిర్మించాల్సి వచ్చినా.. కొత్తగా అందుబాటులోకి రాబోయే భద్రాచలం దగ్గర నిర్మించే స్టేషన్ కీలకం అవుతుంది. ప్రస్తుతం కొత్తగూడెంలో ఉన్న భద్రాచలంరోడ్ స్టేషన్ పేరును మార్చని పక్షంలో భద్రాచలం, భద్రాచలంరోడ్ స్టేషన్ల పేర్ల మధ్య సామీప్యం వల్ల ప్రయాణికులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవీ చిక్కులు గతంలోనూ భద్రాచలం రోడ్ స్టేషన్ పేరును కొత్తగూడెంగా మార్చాలనే డిమాండ్ వచ్చింది. సాంకేతిక చిక్కులు అందుకు అడ్డుగా నిలిచాయి. ప్రస్తుతం భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ కోడ్నేమ్ బీడీసీఆర్గా ఉంది. రైల్వే ట్రాక్, సిగ్నల్స్, క్రూ తదితర నిర్వహణ, టికెట్ రిజర్వేషన్లలో కోడ్ ఎంతో కీలకం. భద్రాచలం రోడ్ను కొత్తగూడెంగా మార్చితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో నైనీతాల్ దగ్గర కాత్గోడం పేరుతో ఓ రైల్వే స్టేషన్ ఉండగా, కోడ్ నేమ్ కేజీఎంగా ఉంది. భద్రాచలంరోడ్ పేరును కొత్తగూడెంగా మార్చితే, కాత్గోడం (కేజీఎం)తో సాంకేతిక చిక్కులు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచే ప్రతిపాదనలు రైల్వే స్టేషన్ పేరును మార్చాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రైల్వేశాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిపాదనపై రైల్వేశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత కేంద్ర హోంశాఖ పరిశీలించి కొత్త పేరును ఖరారు చేస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భద్రాచలంరోడ్ స్టేషన్ పేరు మార్పుపై రాష్ట్ర సర్కారు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి చొరవ చూపించాల్సి ఉంది. 1932లో ఏర్పాటు సింగరేణి బొగ్గు తరలించేందుకు తొలిసారిగా డోర్నకల్ నుంచి ఇల్లెందుకు రైల్వే లైన్ 1927లో అందుబాటులోకి వచ్చింది. 1932 నాటికి కొత్తగూడెం రైల్వేలైన్ ఏర్పడింది. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు దగ్గరగా ఉన్న రైలు మార్గం కావడంతో కొత్తగూడెంలో నిర్మించిన రైల్వే స్టేషన్కు భద్రాచలం రోడ్గా పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే లెక్కల ప్రకారం గ్రేడ్–4 స్టేషన్గా ఉన్న భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి రోజూ నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో మూడు రైళ్లకు భద్రాచలంరోడ్ స్టేషన్ టెర్మినల్ పాయింట్గా ఉంది. రోజూ 8,020 మంది ప్రయాణికులు స్టేషన్ను ఉపయోగించుకుంటుండగా, రూ.7.21 కోట్లు వార్షిక ఆదాయంగా ఉంది. అమృత్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా 513 రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో కొన్ని స్టేషన్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్ల పేర్ల మార్పు విషయంలో కసరత్తు జరుగుతోంది. ఇందులో కరీంనగర్ పేరును కరంనగర్గా, ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా, కాజీపేట జంక్షన్ పేరును వరంగల్ రోడ్ జంక్షన్గా మార్చాలని ప్రతిపాదించారు. ఏపీలో తెనాలికి తెనాలి రామన్ పేరును పరిశీలిస్తున్నారు. విజయనగరం ఇంగ్లిష్ స్పెల్లింగ్లో ఉన్న జెడ్ బదులు జేను చేర్చాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘అమృత్ భారత్’లో ఉన్న మధిర, ఖమ్మం, భద్రాచలంరోడ్ పేర్లను మార్చబోవడం లేదని పొరుగున ఉన్న మహబూబాబాద్ పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే, భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) స్టేషన్ పేరును మార్చాల్సిన అవసరం ఉంది. -
క్వారీలో అక్రమంగా తవ్వకాలు
పాల్వంచరూరల్: అక్రమ క్వారీల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు మైనింగ్, పోలీసుశాఖ అధికారులు గత మే 21న రెండు చోట్ల కందకాలు తవ్వితే.. ఒక చోట క్వారీల నిర్వాహకులు పూడ్చివేశారు. క్వారీలో బండరాళ్లను పగులగొట్టి క్రషర్లకు తరలిస్తున్నారు. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఒక్క క్వారీకి మాత్రమే మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఐదు క్వారీలకు అనుమతులేవు. నిర్వాహకులు అనుమతులు లేకుండా క్వారీల్లో పేలుడు పదార్థాలను వినియోగించి పెద్దపెద్ద బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి, క్రషర్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారుల పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం క్వారీల తనిఖీ కోసం విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అక్రమ క్వారీ నిర్వహణ పనులను నిలిపివేశారు. కాగా తోగ్గూడెంలోని పాత క్వారీలకు అనుమతులు రావని తెలిసి క్వారీల నిర్వాహకులు నూతన క్వారీల నిర్మాణం కోసం ముగ్గురు గిరిజనుల పేరుతో రెవెన్యూ, మైనింగ్ శాఖలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
సెప్టెంబర్లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభలను ఖమ్మం వేదికగా నిర్వహించనున్నట్లు జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో జరిగే సభల పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి వి.కోటేశ్వరరావు అధ్యక్షత వమించగా వెంకట్రామయ్యతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్, రవిమారుత్, కొల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపద, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మండల వెంకన్న, పీఓడబ్ల్యూ, టీపీటీఎఫ్తో పాటు న్యూడెమోక్రసీ నాయకులు ఎన్.తిరుమలరావు, ఝాన్సీ, తాళ్లూరి వేణు, పి.రామకోటేశ్వరరావు, శేషగిరిరావు, సీహెచ్.బాబురావు, ఆవునూరి మధు, బండారు ఐలయ్య, గౌని ఐలయ్య, ముక్తి సత్యం, జడ సీతారామయ్య, కోలా లక్ష్మీనారాయణ, బజ్జూరి వెంకట్రామిరెడ్డి, వై.ప్రకాష్, పి.విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా అభయాంజనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమల పాకులతో అర్చన జరిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాల్లో అంతరాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తాలన్నారు. వర్షాల ఆలస్యం లేదా తక్కువ వర్షపాతం పరిస్థితులు కొనసాగితే రైతులు తక్కువ కాలవ్యవధిలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొరల్రు, సామలు వంటి పంటల సాగును పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని వివరించారు. జేకే ఓసీ విస్తరణ భూముల పరిశీలనఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణకు ప్రతిపాదించిన 17.51 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు ప్రాంతాన్ని బుధవారం పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎస్.యువరాజ్ పరిశీలించారు. భూమి విస్తీర్ణం, ప్రాజెక్ట్ అవసరాలు, ప్రభావిత ప్రాంత వివరాలు, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. జేకే ఓసీ భవిష్యత్ అభివృద్ధి, ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అటవీభూమి మళ్లింపు, అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ కరుణాకర్, ఎస్ఓటూ జీఎం బలరాం, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● మూడేళ్ల చిన్నారి మృతి, మరో నలుగురికి గాయాలు ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం పాల్వంచరూరల్/మధిర: ఏపీలోని శ్రీకాకుళం నుంచి మధిరలో ఉంటున్న వైద్యుడి వద్దకు ఆయన తల్లిదండ్రులు, సోదరి, మేనకోడలు వచ్చారు. మేనకోడలికి గొంతు సంబంధిత శస్త్రచికిత్స చేయించారు. చికిత్స విజయవంతం కావడంతో భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాలని కారులో వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారిన పడ్డారు. దీంతో చిన్నారి మృత్యువాత పడగా మిగతా వారికి తీవ్రగాయాలైన ఘటన పాల్వంచలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి పాల్వంచకు.. ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన పద్మావతి – కృష్ణారావుల కుమార్తె హావియాకు భర్త అనురాగ్, మూడేళ్ల కుమార్తె బాల ఆద్య ఉన్నారు. ఇందులో అనురాగ్ అమెరికాలో ఉంటుండగా, హావియా తన కుమార్తెతో భర్త స్వస్థలమైన వైజాగ్లోని మధురవాడలో ఉంటోంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లిన హావియా తల్లిదండ్రులతో కలిసి మధిరలో ఉండే సోదరుడు డాక్టర్ సోమశేఖర్ వద్దకు వారం క్రితం వచ్చింది. ఆద్యకు గొంతు సంబంధిత సమస్య ఉండడంతో శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం కారులో వెళ్తున్నారు. కారులో కృష్ణారావు దంపతులు, హావియా, ఆమె కుమార్తె ఆద్య ఉంది. అయితే, పాల్వంచ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన టిప్పర్ వాహనం నిలిపి ఉంది. ఆ రహదారిపై వెళ్తున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ తడికమల్ల కృష్ణ దానిని తప్పించే క్రమంలో ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అమ్మమ్మ ఒడిలో కూర్చున్న చిన్నారి ఆద్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి, అమ్మమ్మ, తాతయ్యతోపాటు డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఎస్ఐ బి.సురేశ్ క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
అడవిలో వెదురు
పాల్వంచరూరల్: అటవీశాఖకు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నందును అభయారణ్యంలో వెదురు మొక్కలు పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కిన్నెరసాని అభయారణ్యంలో ఈ ఏడాది 7 లక్షల మొక్కలను 400 పైన హైక్టార్ల విస్తీర్ణంలో పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందులో భాగంగా ప్రస్తుతం నాలుగు లక్షలకుపైగా నాటాలని నిర్ణయించారు. అందుకోసం వైల్డ్లైఫ్కు చెందిన నాలుగు నర్సరీల్లో ఆ జాతి మొక్కలను పెంచుతున్నారు. వానలు కురిసిన తర్వాత వాటిని నిర్దేశించిన ప్రాంతాల్లో నాటేందుకు వైల్డ్లైఫ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదాయం బాగు.. ఏజెన్సీ ప్రాంతంలో వెదురు సాగుకు అనుకూలం. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెదురు బాగా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పంట భూముల్లో గట్టు చుట్టూ 4 మీటర్ల వెడల్పులో నాటుకోవాలి. 30/30 సెంటిమీటర్ల గుంతలను తీసుకుని 4 కేజీల పశువుల ఎరువు, మట్టి కలిపి గుంతలో నింపాలి. తర్వాత నాటిన మొక్కలు ఏడేళ్ల తర్వాత దిగుబడి వస్తుంది. వెదురు చివరి దశలో పూతకు వచ్చి విత్తనాలు ఇచ్చిన తర్వాత కుదురు చనిపోతుంది. నీటి సౌకర్యం ఉన్న చోట వేసవి కాలంలో నెలకోసారి తడిపెడితే దిగుబడి బాగుటుంది. ఎకరం విస్తీర్ణంలో 150 వెదురు కుదుళ్లు నాటుకోవచ్చు. ఏడేళ్ల తర్వాత 10 గెడల చొప్పున 1,500 గెడలు వస్తాయి. ఒక్కసారి నాటిన వెదురు చెట్టు కుదురు 20 నుంచి 25 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి. ఉపయోగాలు.. వెదురు పోయేసి సంతంతికి చెందిన గడ్డి జాతి మొ క్క. అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో ఇది ఒకటి. వెదురు విత్తనాలు మొక్కల కొమ్మల ద్వారా పండిస్తారు. జూన్, ఆగస్టు నెలల మధ్యలో నాటుతారు. వెదురు బొంగులతో ఇళ్లు, గుడిసెల నిర్మాణం, ఫర్నిచర్, కాగితం, బుట్టలు, హస్తకళల తయారీకి ఉపయోగపడుతుంది. వెదురు చెట్టు తన జీవిత కాలంలో 10 నుంచి 12 ఏళ్లకోమారు పూచే పూత కంకుల నుంచి లభించే గింజల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, రక్తంలో చెక్కర నియంత్రణకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అభయారణ్యంలో ఈ వానాకాలంలో నాలుగు వందల హెక్టార్లలో సుమారు ఐదు లక్షల వెదురు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మరో రెండు వందల హెక్టార్లలో ఇతర కలపజాతుల మొక్కలను నాటుతున్నాం. వెదురు మొక్కలను నాలుగు నర్సరీల్లో పెంచుతున్నాం. వర్షాలు కురిసిన తర్వాత నాటుతాం. –బి.బాబు, ఎఫ్డీఓ, వైల్డ్లైఫ్ పాల్వంచ డివిజన్ -
ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి చిన్నచూపు
భద్రాచలంఅర్బన్: నాలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించే వాహనం లేక భుజాలపై మోసుకుని వెళ్లడం చూస్తే ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి ఉన్న వివక్ష తెలుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఈ ఆస్పత్రిని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్రెడ్డితో చర్చించారు. ఆతర్వాత జాన్వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఆస్పత్రికి ప్రతీతీ రోజు 400 – 600 మంది వస్తున్నా సరైన వైద్యం అందకపోగా, వైద్యులు, ఉద్యోగులు 212మందికి గాను 98మందే ఉండడం గర్హనీయమన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు లేక పేదలకు సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, శానిటేషన్ కార్మికులకు రూ.26వేలకు బదులు కేవలం రూ.11వేల వేతనం, అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై సీపీఎం ఆధ్వర్యాన అధ్యయనం చేస్తున్నామని, ఇందులో గుర్తించిన సమస్యలపై ఆగస్టులో హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జాన్వెస్లీ తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు బండారు రవికుమార్, ఏ.జే.రమేష్, ఎం.బీ.నర్సారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, సున్నం గంగ, ఎర్రంశెట్టి వెంకటరామారావు, సీతాలలక్ష్మి, ఇరుప అనసూర్య, లీలావతి, కొలగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
బూత్ కమిటీలే కాంగ్రెస్కు పునాదులు
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికొత్తగూడెంఅర్బన్: బూత్ కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాదులని, రాబోయే ఎన్నికల్లో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకం కానుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం క్లబ్లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఓటరు నమోదును నిర్ధారించడం, అర్హులైన ఓటర్లందరూ చురుకుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అన్నారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, అడ్రస్ మార్పులు ఫారం–6, 7, 8, ఎన్యుమరేట్ ఫారం ద్వారా వెంటనే చేయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, నాయకులు కొత్వాల శ్రీను, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, మండే వీర హనుమంతరావు, చీకటి కార్తీక్, అర్జున్ రావు, అంతోటి పాల్, ఎం ప్రసాద్ బాబు, మంద హనుమంతరావు, కొదుమూరి శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, నాగార్జున శ్రీనివాస్రెడ్డి, చింతలపూడి శేఖర్, రంగారావు, గద్దెల రమేష్, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కులు చెల్లించి వస్తూ..
పినపాక: ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుని వస్తున్న యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మండలంలోని ఐలాపురం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన ధర్రాజు కిశోర్ (24), బట్ట ప్రశాంత్ (30) మండలంలోని గొట్టెల గ్రామంలోని దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తుండగా.. ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కిశోర్ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రశాంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. దేవుడి ఆశీస్సులు తీసుకుని వస్తారనుకుంటే దేవుడి దగ్గరికే వెళ్లారా.. అంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన సీపీఐ శ్రేణులు ● అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు సూపర్బజార్(కొత్తగూడెం) : పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నేలపై పడుకొని నిరసన తెలిపారు. తొలుత ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్వాదం నెలకొంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. పేదల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పొట్టకొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి.పూర్ణచందర్ రావు, జి.వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు.రాహుల్, ఎస్కే ఫహీమ్ పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు కన్నయ్యచర్ల : తుది శ్వాస వరకు ప్రజల సమస్యల కోసం పోరాడిన యోధుడు మచ్చా కన్నయ్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు తండ్రి, సీపీఎం చర్ల సీనియర్ నాయకుడు మచ్చా కన్నయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం చర్లలో కన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. నయీమ్ ఖురేషీ, కల్లూరి వెంకటేశ్వరరావు, తాతాజీ తదితరులు ఉన్నారు. -
యజమానులతో కార్మిక సంఘం చర్చలు విఫలం
ఇల్లెందురూరల్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఉమ్మడి జిల్లా పెంకు పరిశ్రమల కార్మికులు మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. యజమానులు, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నేతల మధ్య బుధవారం పెంకు పరిశ్రమలో చర్చలు జరిగాయి. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు వేతనాల పెంపు విషయంలో యజమానులు మొండిగా వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే వినతి భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. భద్రాచలం – వాజేడు ప్రధాన రహదారి మరమ్మతులు, నూతన రహదారి నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే చేపట్టాలని కోరారు. తాలిపేరు ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి కాల్వల ద్వారా నీటిని అందించాలని, పోలవరం ప్రాజెక్టు నుంచి భద్రాచలానికి ముప్పు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇంకా ఏరియా ఆస్పత్రి, గోదావరి వరద, దుమ్ముగూడెం మండలానికి మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ పనులపై విన్నవించారు. వడదెబ్బతో ఇద్దరు మృతి మధిర: మధిర మండలం సిద్దినేనిగూడెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీరాములు(110) కొద్దిరోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడ్డాడు. ఇంటి వద్దే ఆయనకు చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. శ్రీరాములుకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పట్వారిగూడెంలో వృద్ధుడు.. దమ్మపేట: దమ్మపేట మండలం పట్వారిగూ డెం గ్రామానికి చెందిన వృద్ధుడు బండి రాఘవులు(70)వడదెబ్బతగిలి మృతిచెందాడు. కూలీ పనులు చేయలేక మూడు రోజులుగా భిక్షాటన చేస్తున్న ఆయన బుధవారం స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేశామని అదనపు ఎస్ఐ బాలస్వామి తెలిపారు. డివైడర్ను ఢీకొని ఆటో బోల్తా తలకు తీవ్ర గాయాలై డ్రైవర్ మృతి బూర్గంపాడు: సారపాకలో ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. తలకు తీవ్రగాయాలైన ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ కథనం ప్రకారం.. సారపాక గాంధీనగర్కు చెందిన ఆటోడ్రైవర్ శివ (36).. మంగళవారం రాత్రి సారపాక ప్రధానకూడలి నుంచి ఐటీసీ ఈస్ట్గేట్ వైపునకు వెళ్తున్నాడు. ఆటో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృడుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి జీపీ కార్యాలయంలో సర్పంచ్ లకావత్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈయేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని సూచించారు. పంటమార్పిడి పద్ధతి పాటించాలని, పీఆర్ –126 రకం వరి పంట సాగు చేయవద్దని సూచించారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
బైక్ల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
భద్రాచలంఅర్బన్: బైక్ల చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ అరుణ్కుమార్ వెల్లడించారు. మంగళవారం రాత్రి కూనవరం రోడ్డులో టౌన్ ఎస్ఐ శ్యాం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడిని ఆపి విచారించారు. దీంతో పట్టణంలో 8వ తేదీన ద్విచక్రవాహనాల చోరీ నిందితుల వివరాలు తెలిశాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకులు జల్సాలకు అలవాటు పడి.. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి నగదుకు బదులుగా చోరీ చేసిన ద్విచక్రవాహనాలను ఇచ్చినట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారని, వీరిపై గతంలో హైదరాబాద్, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయని, వారిని రిమాండ్కు తరలించామని తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ఛేదించామని డీఎస్పీ అరుణ్కుమార్ వివరించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ శ్యాం తదితరులు పాల్గొన్నారు.24 గంటల్లో ఛేదించిన పోలీసులు -
బోనస్ కట్?
డిప్యూటేషన్ వ్యక్తిగతమైతే సింగరేణిలో లెక్కాపత్రం లేకుండా డిప్యూటేషన్లు ● క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిన యాజమాన్యం ● వ్యక్తిగత విన్నపమైతే ఆర్థిక ప్రయోజనాల్లో కోతసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం కఠినమైన పని పరిస్థితులు ఉండే భూగర్భ (యూజీ) గనుల నుంచి సర్ఫేస్ (ఉపరితల) పనులకు బదిలీలపై నిషేధం ఉంది. దీంతో భూగర్భ గనుల్లో పని చేసేందుకు సుముఖతలేని ఉద్యోగులు డిప్యూటేషన్పై సర్ఫేస్కు వస్తున్నారు. ఇందుకోసం రాజకీయ అండదండలు, పైరవీలు చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు ఉపరితల గనుల్లో పని చేసే ఉద్యోగులు/కార్మికులకు యూజీల్లో కంటే ఎక్కువ మొత్తంలో అలవెన్సులు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఖాళీలు ఉండటం లేదు. ఫలితంగా పైరవీ డిప్యూటేషన్లపై లెక్కకు మిక్కిలి సర్ఫేస్కు వస్తున్నారు. వారిని అంతగా ప్రాధాన్యత లేని విభాగాలు, బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా లేని శాఖల్లోకి సర్దుబాటు చేయాల్సి వస్తోంది.. ఫలితంగా ఇటు ఓసీ, అటూ యూజీలలో కంటే సపోర్టింగ్ విభాగాల్లోనే అవసరానికి మించి పని చేస్తున్న ఉద్యోగులు/కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. దీనికి తోడు ఇక సంస్థ ఆవల రాజకీయ నాయకులు దగ్గర వ్యక్తిగత సహాయకులుగా 50 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్టు గుర్తించారు. డిప్యూటేషన్లు ఎక్కువ వ్యక్తిగత రిక్వెస్టులపైనే.. ప్రస్తుతం ఉన్న డిప్యూటేషన్లలో 80 శాతానికి పైగా సంస్థ అవసరాల కంటే వ్యక్తిగత రిక్వెస్టులపై జరిగినవే ఎక్కువ. కానీ, బాహ్య ఒత్తిళ్ల కారణంగా అన్ని డిప్యూటేషన్లు సంస్థ అవసరాల కోటా కిందే పరిగణనలో ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కొంత మొత్తాన్ని కార్మికులకు పంచుతోంది. అయితే, సింగరేణి అంటేనే బొగ్గు, అలాంటి బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేకుండా ఉన్న వారికి బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వడం కఠిన పరిస్థితుల మధ్య భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల్లో అసంతృప్తికి కారణం అవుతోందనే వాదనలు ఉన్నాయి. ఓ వైపు సమర్థంగా మ్యాన్ పవర్ను వినియోగించుకుంటూనే, మరోసారి కార్మికుల శ్రమకు గుర్తింపు ఇచ్చే దిశగా సింగరేణి సిద్ధమైంది. అందులో భాగంగా సింగరేణిలో సులువైన పనిగా మారిన డిప్యూటేషన్లపై ఉక్కుపాదం మోపుతోంది. లాభాల వాటాలో కోత కొత్త మార్పులు – సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రస్తుతం నిరవధికంగా కొనసాగుతున్న డిప్యూటేషన్ల పొడిగింపులు క్రమంగా తగ్గిపోతాయి. వాటికి ఎక్స్టెన్షన్ కావాలంటే కచ్చితమైన కారణం తెలపాలి. లేదంటే పర్సనల్ రిక్వెస్ట్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే సింగరేణి యాజమాన్యం అసలైన మెలిక పెడుతోంది. సంస్థ అవసరాల రీత్యా డిప్యూటేషన్పై ఉన్న వారికే లాభాల వాటా, దీపావళి బోనస్ అందించే విధంగా కొత్తగా సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేని విభాగాల్లో వ్యక్తిగత రిక్వెస్ట్ల మీద డిప్యూటేషన్పై వెళ్లిన ఉద్యోగులు/కార్మికులకు లాభాల బోనస్లో వాటాను నిరాకరించడమే అవుతుంది. అదే జరిగితే వ్యక్తిగత రిక్వెస్ట్ మీద లైట్ జాబ్లకు రావాలనుకునే ఉద్యోగులు/కార్మికులు లాభాల బోనస్, దీపావళి బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాలను వదులుకునేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇక మీదట డిప్యూటేషన్పై ఒక ఉద్యోగి/కార్మికుడిని పంపే ముందు అందుకు గల కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అవసరం పడిందా లేకా ఉద్యోగి రిక్వెస్ట్ మేరకు జరిగిందా అనే విషయాన్ని తేటతెల్లం చేయాలి. ఆర్నెళ్ల పరిమితి ముగిసిన తర్వాత తదుపరి ఎక్స్టెన్షన్ కోసం డైరెక్టర్ పా నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ స్థాయి నుంచి సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అని ఫైల్ పెట్టినప్పటికీ, ఆ ఫైల్కు తగిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఉన్నాయా ? లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం జరుగుతుంది. గరిష్టంగా ఏడాదికి మించి డిప్యూటేషన్ పొడిగింపు ఉండదు. ఎప్పటిలాగే ఒక ఏరియా నుంచి మరో ఏరియా డిప్యూటేషన్కు పా అనుమతి, సంస్థ ఆవల పని చేసేందుకు సీఎండీ అనుమతి తప్పనిసరి. అయితే, ప్రతీ సందర్భంలో డిప్యూటేషన్కు సంస్థ అవసరాలు కారణమా లేక ఉద్యోగి రిక్వెస్ట్ కారణమా అనేది కీలక అంశం కానుంది. -
తమ్ముళ్ల నుంచి ప్రాణహాని ఉంది..
టేకులపల్లి: తల్లిదండ్రుల మరణం తర్వాత ఆస్తి పంచుకుందామని అడిగితే తమ్ముళ్లు తనతోపాటు తన భార్యపై దాడికి పాల్పడటమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్న కన్నీటిపర్యంతమయ్యాడు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం రేగులతండాకు చెందిన మోహన్, మీనాక్షి దంపతులు వివరాలు వెల్లడించారు. 2021లో అమ్మ, 2025లో నాన్న మరణించాక భూమి, బంగారం, ఇతర ఆస్తులను పంచుకుందామని తమ్ముళ్లు శోభన్, సుమన్కు చెప్పారు. దీంతో వారు బెదిరింపులకు దిగడంతో గత ఏప్రిల్ 14న పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ తమ్ముళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోగా వివాదాస్పద పొలాన్ని దున్నేందుకు వచ్చారు. మోహన్, మీనాక్షి దంపతులు అడ్డుకోవడంతో శోభన్, సుమన్ వారిని చితకబాదారు. దీంతో బాధితులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వగా జూన్ 8న పోలీసులు శోభన్, సుమన్ను రిమాండ్ చేశారు. తర్వాత కూడా వారు వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని, వారితోపాటు గ్రామస్తులు కూడా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని మోహన్, మీనాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వారు కోరారు. రక్షించాలని అన్న వేడుకోలు.. -
13.6 కిలోల గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: సీలేరు, ఒడిశా ప్రాంతాల్లో కొనుగోలు చేసి.. కర్నూలు, నల్లగొండ, హైదరాబాద్కు మూడు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న ఎండు గంజాయిని కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద ఎకై ్సజ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు, 13.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.9.90 లక్షలు ఉంటుందని, ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రాజు, రమేశ్బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడులు బూర్గంపాడు: మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.12,480 నగదు, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. -
రహదారి భద్రత.. అందరి బాధ్యత
కూసుమంచి: రహదారి భద్రతను వాహనదారులంతా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. వాహననం నడిపేటప్పుడు తమ కోసం కుటుంబం ఎదురుచూస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తద్వారా నిబంధనలు పాటిస్తూ వాహనదారులు తమను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వాహనదారులకు మేలు చేసిన వారవుతారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. అలాగే, మద్యం, మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు. అనంతరం ఇటీవల పలు ప్రమాదాల్లో గాయపడిన బాధిత కుటుంబాలతో మాట్లాడిన సీపీ వారికి సురక్షిత ప్రయాణంపై సలహాలు, సూచనలు అందించారు. అలాగే, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లోక్యాతండాకు చెందిన జర్పుల సందీప్ తల్లి లలితకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాంచాని సైదమ్మ, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎస్ఐలు నాగరాజు, జగదీశ్, సంతోష్, స్రవంతి, దివ్య, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ -
రైతులకు అండగా ‘సాక్షి’
జిల్లా వ్యవసాయాధికారితో రేపు ఫోన్ ఇన్సూపర్బజార్(కొత్తగూడెం): రుతుపవనాల రాకతో జిల్లాలో వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల నిల్వలు, నకిలీ విత్తనాలు, తొలకరి వర్షాలకే విత్తనాలు వేసే పరిస్థితులు, తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 12–06–2026, శుక్రవారం సమయం : ఉదయం 11నుంచి 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 8977743066, 9347111131 -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ఎస్పీ రోహిత్ రాజు జూలూరుపాడు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ బి.రోహిత్ రాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్ష ప్లాన్లో గుండెపుడిలో నిర్వహించిన రోడ్డు భద్రత గ్రామసభలో మాట్లాడారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని , స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వివరించారు. గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకుని, రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, మోటారు వాహనాల అధికారి వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, శ్రీలక్ష్మి, ఇతర అధికారులు టి.శ్రీనివాస్, తాళ్లూరి రవి, రామారావు, బి.వెంకటేశ్వర్లు, తేజశ్వి, బాదావత్ రవి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచాలి
చుంచుపల్లి: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతృ, శిశు మరణాలను తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, శాంపిల్ సేకరణ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఎన్సీ పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీల ప్రత్యేక ప్రొఫైల్ను గుర్తించాలన్నారు. అధికారులు సాయి కళ్యాణ్, ప్రతాప్, రాందాస్, దినేష్, రాకేష్, హరీష్ పాల్గొన్నారు. 8 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది (2000 బ్యాచ్)కి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిలో నలుగురిని భద్రాద్రి జిల్లాకు, ఇద్దరిని ఖమ్మం కమిషనరేట్కు, మహబూబాబాద్, ఇంటెలిజెన్స్కు ఒక్కొక్కరినీ కేటాయించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు సీపీ సునీల్దత్ను బుధవారం కలవగా ఆయన అభినందించారు. -
ఓవర్ స్లో బ్రిడ్జి!
భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా భద్రాచలం వద్ద కరకట్ట పొడిగింపు పనుల్లో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి.. నిర్మాణానికి నోచుకోవడంలేదు. ఇప్పటికే పలుమార్లు డిజైన్లు రూపొందించినా ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్ అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలను జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి గురువారం హైదరాబాద్లో సమీక్ష జరపనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపుతో ఇప్పటికే భద్రాచలంవాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జి సమస్యను సమీక్షించి నిధులు కేటాయించి, పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరకట్టకు రూ.38 కోట్లు.., ఓవర్ బ్రిడ్జికి రూ.150 కోట్లు భద్రాచలం ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు గోదావరి తీరం వెంబడి 2000 సంవత్సరంలో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో సుమారు 700 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం ఆగిపోయింది. 2022లో గోదావరి వరదలు తీర ప్రాంత కాలనీలను ముంచెత్తడంతో పాలకులు రూ.38 కోట్లతో కరకట్ట పొడగింపు పనులు చేపట్టారు. ఓవర్ బ్రిడ్జికి రూ.12 కోట్లను ప్రతిపాదించారు. కరకట్ట నిర్మాణం, స్లూయిస్, రిటైనింగ్ వాల్ తదితర పనులు ముగింపు దశకు వచ్చాయి. అయితే రూ.150 కోట్లతో ఓవర్ బ్రిడ్జి ప్లాన్ను జాతీయ రహదారుల శాఖ ఫైనల్ చేసింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తేనే కరకట్ట పనులు పూర్తవుతాయి. ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి పలు మార్లు డిజైన్లకు జాతీయ రహదారుల శాఖ అభ్యంతరం తెలుపుతుండగా, బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన సాగుతోంది. వర్షాకాలం సీజన్, గోదావరి వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆ శాఖ అధికారులకు చీవాట్లు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను సైతం జారీ చేశారు. కానీ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇరిగేషన్ అధికారులకు మాత్రం సమస్య తలనొప్పిగా మారింది. జాతీయ రహదారి శాఖ ఆమోదించిన డిజైన్ను ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే తిరిగి ఆ పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. అదేవిధంగా మా శాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తాం. –జాని, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం -
స్కూటీ, లారీ ఢీ
ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు బూర్గంపాడు: మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్రగాయాలయ్యాయి. మర్రికుంట నుంచి పాల్వంచ వైపు స్కూటీపై వెళ్తున్న పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన వైష్ణవి, శ్రీవల్లిని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైష్ణవి, శ్రీవల్లిలు మర్రికుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 మెట్రిక్ టన్నుల చేపలు మృతిజూలూరుపాడు: మండలంలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ దండేల చెరువులో సోమవారం సుమారు 5 మెట్రిక్ టన్నుల చేపలు మృతి చెందాయి. ఎండ తీవ్రతతో చెరువులో నీటి నిల్వ తగ్గి, నీటిలో ఆక్సిజన్ కొరతతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్య సహకారం సంఘం సభ్యులు తెలిపారు. సుమారు రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా చేపల పెంపకం చేపట్టామని, మృగశిర కార్తె సందర్భంగా చేపల అమ్ముకోవచ్చని భావించామని, సోమవారం ఉదయం చెరువు వద్దకు రాగానే చేపలు చనిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా, మృతి చెందిన చేపలతో చెరువు కలుషితం కాకుండా జేసీబీతో గొయ్యి తవ్వించి పూడ్చివేసినట్లు సర్పంచ్ లావుడ్యా ద్వాలీ తెలిపారు. -
తండ్రి కూలీ.. కుమారుడు డెలివరీ బాయ్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల వెల్లడైన బీపీఈడీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఖమ్మంకు చెందిన రామడుగు నరేందర్ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన జాతీయస్థాయిలో బాస్కెట్బాల్, నెట్బాల్ క్రీడల్లో రాణించడమే కాక యూనివర్సిటీ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూనే నరేందర్కు క్రీడలపై ఉన్న ఆసక్తి దృష్ట్యా శిక్షణ ఇప్పించాడు. మరోపక్క నరేందర్ సైతం వివిధ సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే చదువుకుని బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంక్ సాధించడంపై నెట్బాల్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి పీ.వీ.రమణ, తదితరులు అభినందించారు.బీపీఈడీ ఎంట్రెన్స్లో రాష్ట్ర ఐదో ర్యాంక్ -
సామాజిక బహిష్కరణకు గురయ్యాం
న్యాయం చేయాలని బాధితుల వినతి టేకులపల్లి: టేకులపల్లి గ్రామపంచాయతీ మూడ్ తండాకు చెందిన మూడ్ వస్రాం (65) కుటుంబా న్ని తండా పెద్దలు సామాజిక, కుల బహిష్కరణ చేశారు. ఈ మేరకు బాధితుడు సోమవారం టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథ నం ప్రకారం... ఇటీవల తండాలో తన పిన్ని మూడ్ హీమిలి మృతిచెందగా తండా సంప్రదా యం ప్రకారం నిర్వహించే కార్యక్రమాలకు తమ కుటుంబానికి సమాచారం ఇవ్వలేదన్నారు. చేతబడి నెపంతో తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ, శుభకార్యాలకు కూడా రాకూడదని ఆంక్షలు విధించారని తెలిపారు. తండా నాయకుడు, అతని కుమారుడు తమ స్థలంలో అక్రమంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారని ఆరోపించా రు. సామాజిక బహిష్కరణ కారణంగా తమ ఇంట్లో చిన్నపిల్లలతో కూడా ఎవరూ మాట్లాడటం లేదని, కనీసం ఆడుకోవడానికి కూడా పిల్లలను రానివ్వకుండా కన్నీరుమున్నీరయ్యాడు. చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని టేకులపల్లి పోలీసులను వేడుకున్నాడు. పురాతత్వ శాఖతో డిగ్రీ కళాశాల ఒప్పందం పాల్వంచరూరల్: చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ, భావితరాలకు చరిత్రపై అవగాహన పెంపొందించేందుకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పురాతత్వశాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సోమవారం పురాతత్వశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ పి.పద్మ, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ వేముల కామేశ్వరరావు ఒప్పందంపై సంతకాలు చేశారు. హిందీ భాష అభివృద్ధిపై దృష్టి గిరిజన విద్యార్థుల్లో హిందీ భాష అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ బి.సుధాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం ఆయన సందర్శించి, మొక్కలు నాటి మాట్లాడారు. అధికారులు నాగరాజు, రాజు, మల్లికార్జున్, అరుణకుమారి, మాధవి పాల్గొన్నారు.పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: రంగువారిగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. తొమ్మిది మంది పేకా టరాయుళ్లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. మూడు బైక్లు, రూ, 9,530 నగదు స్వ్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. భూ వివాదంలో వ్యక్తికి గాయాలుసుజాతనగర్: భూ వివాదంలో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుజాతనగర్ రెవెన్యూ లక్ష్మీదేవిపల్లిలో వ్యవసాయ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలో చుంచుపల్లికి చెందిన మూడ్ భీముడు పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, చిట్టిరామవరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాలు కాగా చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, పట్వారిగూడెం, మొద్దులగూడెం, నాయుడుపేట గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం, బీటీ రోడ్లకు శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అశ్వారావుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయడంతోపాటు పబ్లిక్ అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టనున్నారు. కాగా, మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తెలిపారు. ముత్తంగి అలంకరణలో రామయ్యభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సికిల్ సెల్ అనీమియా కేసులను గుర్తించాలిచుంచుపల్లి: జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, హైపోతలసేమియా కేసులను గుర్తించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సికిల్ సెల్ అనీమియా, హైపోథలసేమియా నియంత్రణలపై సోమవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల గుర్తింపు, నివారణపై దృష్టి సారించాలని సూచించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు, వారి భర్తలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇద్దరికీ పాజిటివ్గా తేలితే గర్భస్థ శిశువుకు కూడా తగిన పరీక్షలు చేయాలన్నారు. పుట్టిన బిడ్డకు 48 గంటల తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామవరం యూపీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ తుకా రాం రాథోడ్, ఇతర అధికారులు ప్రతాప్, రాకేష్, హరీష్, దినేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. ప్రతీ న్యాయమైన సమస్య పరిష్కరిస్తాం ఖమ్మంరూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చివరి ప్రజాదర్బార్ జరగగా 3,500 దరఖాస్తులకు వచ్చాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. మొత్తం ప్రజా దర్బార్లలో అందిన 21,536 దరఖాస్తుల్లో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యలకు 4వేలు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు
సూపర్బజార్(కొత్తగూడెం):నిరుద్యోగులను ఉద్యో గస్తులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన Rakesh Reddy E& Classes యాప్ను సోమవారం కొత్తగూడెం క్లబ్లో ఎంపీవద్దిరాజు రవిచంద్ర ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ పదేళ్ల కాలంలో సుమారు 1.67లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాల ఊసెత్తడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల పక్షాన పోరాడటమే కాకుండా వారి ప్రిపరేషన్లో కూడా తోడుగా ఉంటుందన్నా రు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2న ఉద్యోగ ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశిస్తే.. నిరాశే ఎదురైందన్నారు. ఒక్క ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, రెండున్నరేళ్ల తర్వాత 5వేల ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వ ర్లు, నాయకులు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, కిలారు నాగేశ్వరరావు, మానే రామకృష్ణ, వన మా రాఘవేందర్, అనుదీప్, జలీల్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
కార్మిక సమస్యలను విస్మరిస్తున్న నవ లిమిటెడ్
పాల్వంచ: నవ లిమిటెడ్ సంస్థ కార్మిక సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని, సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, సీఐటీయు సీనియర్ నాయకుడు ఎంవీ అప్పారావు డిమాండ్ చేశారు. సోమవారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నవలిమిటెడ్ సంస్థ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు 5 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా యాజమాన్యం కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మికులకు పని భద్రత, బీమా సౌకర్యం, గ్రాట్యూ టీ లేవని, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవభారత్లో మహిళా ఉద్యోగుల నియామకాలు లేవని, ఫెర్రో ఎల్లాయిస్లో 12/3 అగ్రిమెంట్ ప్రకారం 55 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా, 47 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దొడ్డా రవికుమార్, పి.తులసీరాం, కె.సత్య, వి.సత్యవాణి, వింజా రాములు, ఎస్కె.నిరంజన్, బి.కాంతి, గోపాల్, సుధీర్, సురేష్, యాకోబు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ -
విజిలెన్స్ అధికారుల విచారణ
పాల్వంచరూరల్: పాల్వంచ రేంజ్ పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో రిజర్వ్ ఫారెస్ట్లో కొట్టిన చెట్లు, అర్బన్పార్కులో జరిగిన అవకతవకలపై ఫారె స్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ శివయ్య, రేంజర్ అఫ్రొజ్ సోమవారం విచారణ చేపట్టారు. మంగళవారం విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై రేంజర్ ప్రసాద్ను వివరణ కోరగా.. ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ పాండురంగాపురం శివారులో విచారణ చేశారని తెలిపారు. గత నెల 30న నారవేప చెట్టు నరకగా, కేసు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు. విద్యుత్ మోటార్ చోరీఅశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామం రాళ్లవాగు సమీపంలో రైతు స్వర్గం చంద్ర య్య పొలంలో విద్యుత్ మోటార్ను ఆదివారం రాత్రి చోరీ చేశారు. ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా చోరీ విషయం వెలుగుచూసింది. ఇటీవల ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ మోటార్లు, మోటార్ల వైరు చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య నేలకొండపల్లి: మండలంలోని అజయ్తండాకు చెందిన బానోత్ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత అదృశ్యంపై కేసు మండలంలోని ఆజయ్తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆయిల్పామ్ ధర జోరు..
అశ్వారావుపేటరూరల్: పెరుగుతున్న పామాయిల్ గెలల ధర రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. గత నెలలో టన్ను ధర రూ.23,501కు చేరుకోగా, ఈ నెలలో రూ.23,852కు పెరిగింది. టన్నుకు తాజాగా మరో రూ.351 పెరిగి ఆయిల్ఫెడ్ చరిత్రలోనే ఆల్టైం రికార్డు సృష్టించింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటైన తర్వాత అత్యధిక ధర ఇదే కావ డం విశేషం. కరోనా సమయం, 2022వ సంవత్సరంలో అత్యధికంగా టన్నుకు రూ.23,467 గరిష్టంగా నమోదైంది. కరోనా సమయం తర్వాత మళ్లీ ఈ ఏడాదిలోనే రూ.23వేల మార్క్ దాటింది. దీంతో ఆయిల్పామ్ సాగుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరలో పెరుగుదల కనిపించగా, ఆరు నెలలుగా పెరుగుతూనే ఉంది. దీంతో మరికొందరు రైతులు పామాయిల్ తోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కౌలుదారులపై భారమే.. ఆయిల్పామ్ తోటలను కౌలు తీసుకుని సాగు చేసే రైతులపై ధరల భారం పడుతోంది. గతేడాది ఎక రం ఆయిల్పామ్ తోట కౌలు రూ.45 వేల నుంచి అత్యధికంగా రూ.70 వేలుగా ఉంది. ఈ ఏడాది పామాయిల్ గెలల టన్ను ధర పెరుగుదల, ధర తగ్గకపోవడంతో సాగుదారులు ఒకేసారి కౌలు ధరలు పెంచేశారు. గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎకరం కౌలు ఏకంగా రూ.లక్ష దాటింది. జిల్లాలోని మిగి లిన ప్రాంతాల్లో ఎకరం కౌలు ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉండగా, ఈ రెండు మండలాల్లోనే కౌలు ధర ఆందోళన కలిగిస్తోంది. భారీగా పెరిగిన కౌలు ధరలతో చిన్న, సన్నకారు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల ధర జనవరి 19,694ఫిబ్రవరి 20,456మార్చి 21,546ఏప్రిల్ 23,005మే 23,501జూన్ 23,852 -
‘నీట్’కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పునర్పరీక్షను సజావుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న నిర్వహించే పరీక్షకు జిల్లాలో 1,128 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నా రు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా, జవాబు పత్రాల భద్రతకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, డి సెక్షన్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, తహసీల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో నక్ష సర్వే..నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపికై న మణుగూరు మున్సిపాలిటీలో సర్వే, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వమించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే 5,064 ఆస్తుల సర్వే పూర్తయిందని వివరించారు. 2,074 ఆస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఏడీ సర్వే శ్రీనివాస్, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
నేను రాసిన కథ
అతి నమ్మకం అనర్థంసత్తుపల్లి టౌన్: సిరిపురం గ్రామంలో గౌతమ్ అనే విద్యార్థి ఉండేవాడు. ఏ పనినైనా ఇట్టే చేసేయగలనని ఆయనకు అతి నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకంతోనే ఎందులోనూ రాణించలేకపోయేవాడు. ఒకరోజు గౌతమ్ వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వారం రోజుల్లో రామాపురం అనే గ్రామంలో ఆటలు పోటీలు ఉన్నాయి. అందరూ బాగా సాధన చేయండి అని సూచించాడు. మిగతా పిల్లలందరూ సార్ చెప్పినట్టుగా సాధన చేయసాగారు. కానీ గౌతమ్ మాత్రం తనకు అన్నీ వచ్చనే అతి నమ్మకంతో ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ రోడ్లమీద తిరుగుతూ వృథాగా కాలక్షేపం చేయసాగాడు. అటు ఉపాధ్యాయుడు, ఇటు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. ఇంతలో పోటీల రోజు రానే వచ్చింది. అందరూ రామాపురం వెళ్లారు. అందరూ దూరం కావడంతో.. రామాపురంలో జరిగిన పోటీల్లో మొదటి రెండు ఆటల్లో గౌతమ్ను తీసుకోలేదు. మూడో ఆటలో ఆయనను తీసుకున్నా ఆయన ఆటతీరు సరిగ్గా లేక ఓడిపోయారు. దీంతో స్నేహితులంతా గౌతమ్ వల్లే ఓడిపోయామని తిట్టారు. సార్ కూడా కోపడ్డాడు. దీంతో ఆయన బాధపడుతూ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు. అదే విషయం ఆలోచిస్తూ వెళ్తుండడంతో సైకిల్తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా కాళ్లు, చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొన్నాళ్లపాటు పాఠశాల, స్నేహితులకు దూరమయ్యాడు. అప్పుడు గౌతమ్ ‘అతి నమ్మకం వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది’అని తెలుసుకుఇ బాధపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత పాఠశాలకు వెళ్లిన గౌతమ్ వ్యాయామ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి ‘నేను మళ్లీ ఆటలు ఆడుతాను సార్. ఇప్పటినుంచి బాగా సాధన చేస్తాను. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను’అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే బాగా సాధన చేసి మంచి క్రీడాకారుడుగా ఎదిగాడు.నీతి : నమ్మకం ఉండడం తప్పు కాదు కానీ అతి నమ్మకం ఉండకూడదు. అతి నమ్మకం అహంకారానికి, ఆ అహంకారం పతనానికి దారి తీస్తుంది. -
డిప్యూటేషన్ కఠినతరం!
3 వేల మందికి పైగా సింగరేణిలో క్రమపద్ధతి లేకుండా ఇష్టారీతిగా అమలవుతున్న డిప్యూటేషన్లపై స్టేట్ ఆడిట్ కమిటీ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు భూగర్భ గనుల్లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడి కఠిన పరిస్థితుల మధ్య డ్యూటీలు చేస్తున్నారు. రాజకీయ పలుకుడి ఉన్న వారు ఇలా ఉద్యోగంలో చేరి అలా సర్ఫేస్లో లైట్ జాబ్స్కు మళ్లడం సైతం ఉద్యోగులు/కార్మికుల్లో అసంతృప్తికి కారణమవుతున్న వైనాన్ని సైతం సంస్థ గుర్తించింది. ప్రస్తుతం సింగరేణిలో మూడు వేల మంది కార్మికులు/ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో లైట్ జాబ్లలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 600 మందికి పైగా కనీసం టైం ఫ్రేమ్ లేకుండా లైట్ జాబ్లలో ఉన్నట్టుగా సంస్థ గుర్తించింది. దీంతో డిప్యూటేషన్ల క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి యాజమాన్యం వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు డిప్యూటేషన్ల విషయంలో కచ్చితమైన నిబంధనలతో కూడిన సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇకపై ఆరు నెలలే.. సింగరేణి సంస్థ పరిధిలో ఒకే ఏరియా పరిధిలో, వివిధ ఏరియాల మధ్య , సంస్థకు ఆవల ఇలా మూడు పద్ధతుల్లో డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. వీటికి నిర్ణీత కాల పరిమితి కూడా లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాబోయే మార్పుల్లో భాగంగా.. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఒకే ఏరియా పరిధిలో డిప్యూటేషన్ ఇచ్చే అధికారం ఆ ఏరియా జనరల్ మేనేజర్కు ఉంటుంది. అయితే, ఇది ఆరు నెలలకు మించి ఉండకూడదు. ఆరు నెలల సమయం మించితే, కార్పొరేట్ కార్యాలయంలో డైరెకర్ట్ పా నుంచి అనుమతి తీసుకునేలా మార్పులు చేశారు. ఇక సంస్థ పరిధిలో వివిధ ఏరియాల మధ్య డిప్యూటేషన్లు జరగాలంటే డైరెక్టర్ పా అనుమతి ఉండాల్సిందే. ఈ డిప్యూటేషన్ల కనిష్ట గడువు ఆరు నెలలు ఉండగా, గరిష్ట పరిమితి ఏడాది వరకే అనే విధంగా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక సంస్థ ఆవల డిప్యూటేషన్ కావాలంటే సీఎండీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సింగరేణిలో ఉన్నత స్థాయిలో సుమారు వంద మందికి పైగా ఉద్యోగులు డిప్యూటేషన్ల పేరుతో హైదరాబాద్లో పని చేస్తున్నట్టుగా ఆడిట్ లెక్కలు చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే లెక్కాపత్రం లేకుండా కొనసాగుతున్న డిప్యూటేషన్లకు చెక్ పడే అవకాశం ఉంది. సంస్థలో కార్మికులు/ఉద్యోగులకు జీతభత్యాలతోపాటు అదనంగా అందించే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, లాభాల బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.అస్తవ్యస్తంగా మారిన డిప్యూటేషన్లపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రాజకీయ అండదండలు, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని డిప్యూటేషన్ ద్వారా తేలికపాటి జాబ్లలో కొనసాగే ఉద్యోగులు/కార్మికుల విషయంలో చూసీ చూడకుండా ఉండబోమనే సంకేతాలు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే భూగ ర్భ గనుల్లోకి దిగి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పని చేయాల్సి ఉండేది. లాంగ్వాల్, ఎస్డీఎల్, కంట్యిన్యూస్ మైనర్ తదితర ఆధునిక యంత్రాలు వచ్చాక భూగర్భ గనుల్లో సైతం బొగ్గు వెలికితీత సులభంగా మారింది. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం బ్లాస్టింగులు, తట్టా, చెమ్మాస్, లాడీస్ ఇలా అన్ని పనుల్లో కార్మికులు ఎంతో చెమటోడ్చితే కానీ బొగ్గు బయటకు వచ్చేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా కొత్తగా సంస్థలోకి వస్తున్న ఉద్యోగులు/కార్మికుల్లో చాలా మంది భూగర్భ గనుల్లో పనులకు సుముఖంగా లేరు. మెడికల్ బోర్డు ద్వారా సింగరేణిలో ఉద్యోగం పొందిన వారు, ప్రొబేషనరీ పీరియడ్ ముగిశాక భూగర్భ గనుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. తమకు తెలిసిన ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు మొదలుపెడుతున్నారు. ఫలితంగా సర్ఫేస్ (ఉపరితలం) విభాగంలో ఉద్యోగులు/కార్మికుల సంఖ్య అవసరానికి మించి ఉంది. -
ఫలప్రదం
‘ఉపాధి హామీ’ ద్వారా పండ్ల తోటల సాగు ● రైతులకు మొక్కలు, ఎరువుల సరఫరా, ఇతర ఖర్చులు చెల్లింపు ● జాబ్ కార్డు ఉన్న వారందరూ అర్హులే ● ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంరైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపునకు మళ్లించడమే కాక వారి ఆదాయం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం అందించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన పంటల సాగుకు ఊతమివ్వాలని నిర్ణయించింది. ఉపాధి పథకంలో జాబ్కార్డులు కలిగి, ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు ఉన్న రైతులను అర్హులుగా నిర్దేశించారు. ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం చేపట్టేలా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపండ్ల తోటలకు ఊతం పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద సాయం అందించనుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఆధ్వర్యాన నిర్వహించే పథకానికి జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. గ్రామపంచాయతీల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి భూవిస్తీర్ణంలో 20 శాతం మేర మొక్కల పెంపకం, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సహించనున్నారు. మండలానికి 50 ఎకరాలు ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతీ మండలంలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా పంటల సాగు చేయించాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం జాబ్కార్డులు ఉన్న సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో రానున్న ఏడాది మరింత మంది ఆసక్తి చూపుతారనే భావన వ్యక్తమవుతోంది. మూడేళ్లపాటు ఆసరా ఐదెకరాల లోపు వ్యవసాయ భూములు కలిగిన ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వర్గాల రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, మామిడి, జీడిమామిడి, వెదురు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్, సపోటా, బత్తాయి, అల్లనేరేడు మొక్కలను అధికారులే పంపిణీ చేస్తారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు చేయూత ఇవ్వనుంది. మట్టి నమూనా సేకరణ, పరీక్ష, మొక్కలు నాటేలా గుంతలు తీయడం, నాటడం, వంగిపోకుండా కర్రలు కట్టడం, సంరక్షణ, ఎరువులు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే అందిస్తుంది. డిమాండ్ ఆధారంగా.. సీజన్ వారీగా లభించే పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇవి జిల్లాలో లభ్యత లేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసకుంటున్నారు. ఈనేపథ్యాన ఉపాధి హమీ పథకం కింద ప్రోత్సహించనుండడంతో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా రైతులకు దీర్ఘకాల జీవనోపాధి, సుస్థిర ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు చౌక ధరలో లభిస్తాయి. జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేలా ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందిస్తాం. అవసరమైన మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చు, మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా అందుతాయి. ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేయిస్తాం. జాబ్కార్డు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుకు దరఖాస్తు చేసుకుంటే జిల్లాకు కేటాయించిన లక్ష్యం ఆధారంగా అవకాశం కల్పిస్తాం. – కొండపల్లి శ్రీరామ్, ఖమ్మం డీఆర్డీఓ -
కాంప్లెక్స్ ఎరువుల ధర తగ్గించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, యూరియా యాప్ను తొలగించాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ముద్దా భిక్షం, బుర్ర వెంకన్న, కంగాల కల్లయ్య, బానోత్ ధర్మ, ఈసం శంకర్, గొగ్గల వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కోటయ్య, బైరు వెంకన్న, జూకంటి గాంధీ, నాయిని రాజు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ వనమా కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి తమకు ఇంటి నిర్మాణ స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు ఎండార్స్ చేశారు. ● ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న కొండపల్లి ఉమ తన కుమెర్తా అనారోగ్యం కారణంగా గురుకుల కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరు కాలేకపోయిందని, తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని సీటు కేటాయించాలని కోరుతూ చేసిన దరఖాస్తును ఆర్సీఓకు ఎండార్స్ చేశారు. ● దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం ఆదివాసీ రైతులు 116 మంది తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 250 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా, దుమ్ముగూడెం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ● అశ్వాపురం మండలానికి చెందిన కోడి నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయానని, డిగ్రీ చదివిన తనకు ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పించాలని కోరగా, జిల్లా ఉపాధి కల్ప నాధికారికి ఎండార్స్ చేశారు. ● కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓ మధుకు పది మంది అర్జీలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దర్బార్కు రావొద్దుభద్రాచలం: గిరిజన దర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని, కేవలం స్వయం ఉపాధి పథకాలకు మాత్రమే అందజేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరి జన దర్బార్లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఆనంద్ కుమార్, మధుకర్, రాంబాబు, వేణు, ఉదయ్కుమార్, గన్యా, మణిధర్ పాల్గొన్నారు.ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ -
బొమ్మలు గీయడంలో దిట్ట!
అశ్వారావుపేటరూరల్: వేసవి సెలవులను వృథా చేయకుండా స్వతహాగా ఉన్న ఆసక్తితో బొమ్మలు గీస్తూ ప్రతిభ చాటుతోంది ఓ విద్యార్థిని. అశ్వారావుపేట బీఎస్ఆర్ నగర్కు చెందిన కృష్ణారెడ్డి – తిరుపతమ్మ దంపతుల కుమార్తె లక్కిరెడ్డి ఏశ్విత సాయి రోషిణిశ్రీ 9వ తరగతి పూర్తి చేసింది. కొంతకాలంగా చదువుతో పాటు బొమ్మలు గీయడంలో కుడా ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో తక్కువ రోజుల్లోనే వందల సంఖ్యలో బొమ్మలు గీసింది. చిత్రకళలో రాణించాలంటే కొద్దోగొప్పో శిక్షణ అవసరం. కానీ ఏశ్విత సాయిరోషిణిశ్రీ మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండానే అందమైన బొమ్మలను చకచకా వేస్తోంది. పెన్సిల్, వాటర్ కలర్లు, పెన్నులతో జాతీయ నాయకులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రకృతి అందాలు, సామాజిక అంశాలు, రాజకీయ నాయకులు, దేవుళ్లు, సినీ నటుల చిత్రాలను గీస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు లీఫ్ ఆర్ట్స్, పేపర్ ఆర్ట్స్ సైతం అద్భుతంగా చేస్తోంది. ఆమె గీసిన బొమ్మలకు సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల అభినందనలు అందుతున్నాయి. -
కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అక్కడే స్థల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్తో సోమవారం ఖమ్మంలో భూదాన్ బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ బాధితుల సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉత్తరాల ద్వారా తెలియజేశామని చెప్పారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి 100 గజాల స్థలంలో తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బాధితుల పోరాటానికి అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ కేవీ.కృష్ణారావుతో పాటు వట్టే ఉదయ్కిరణ్, మట్టే నవ్య, సుమలత, రామకృష్ణ, కృష్ణ, రాము పాల్గొన్నారు.వెలుగుమట్ల బాధితుల ర్యాలీ -
కొమరయ్య సేవలు చిరస్మరణీయం
రుద్రంపూర్: సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బొగ్గు గనుల్లో ఎని మిది గంటల పని విధానాన్ని సాధించిన ఘనత కొమరయ్యదేనని గుర్తుచేశారు. భూగర్భ గనుల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించటంలో కీలక పాత్ర పోషించారని, పదేళ్లలోపు పిల్లలతో పనులు చేయించే అమానవీయ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, బొగ్గు గనుల్లో బాలకార్మిక వ్యవస్థకు ఆనాడే స్వస్తి పలికించారని గుర్తుచేశారు. కొమరయ్య ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, యూనియన్ నాయకులు రాజ్కుమార్, మిరి యాల రంగయ్య, వంగా వెంకట్, జీ.వీరస్వామి, రమణమూర్తి, మల్లికార్జున్రావు, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, కొమరయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కూనంనేని -
‘నెట్బాల్’ విజేత హార్విగో హాస్టలర్స్
ఖమ్మంస్పోర్ట్స్: రెండురోజులుగా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న నెట్బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో విజేతగా హార్విగో హాస్టలర్స్ నిలవగా, హార్వెస్ట్ చాలెంజర్స్, ఎవర్ గ్రీన్స్ ప్రాజెక్టు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా ఆయా జట్లకు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆర్.పార్వతీరెడ్డి ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల జీవితంలో ముఖ్య పాత్ర వహించడమే కాక క్రమశిక్షణ, నాయకత్వ లక్ష ణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రాంచైజీల బాధ్యులు డాక్టర్ రవికుమార్, దీప్తి, చల్లపల్లి ఆదిత్య, డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ బాలభాస్కర్, సత్యనారాయణ, నర్సింహారావు, ఫణికుమార్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
బట్ట సంచి... ప్లాస్టిక్ కవర్ !
కరకగూడెం: ఒక గ్రామంలోని కిరాణా దుకాణంలో బట్ట సంచి, ప్లాస్టిక్ కవర్ పక్కపక్కనే ఉండేవి. ప్లాస్టిక్ కవర్ తన మెరుపును చూసుకుని గర్వపడేది. ‘నన్ను చూడు... తేలికగా ఉంటాను. అందరూ నన్నే తీసుకెళ్తారు. నువ్వు మాత్రం పాతకాలం వస్తువులా కనిపిస్తున్నావు’అని బట్ట సంచిని ఎగతాళి చేసేది. అందుకు బదులుగా బట్ట సంచి ‘సరైన సమయంలో వస్తువుల విలువ తెలుస్తుంది’అనేది. కాలక్రమంలో అవసరం తీరాక ప్లాస్టిక్ కవర్లను రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో వేస్తుండడంతో కుప్పలు పేరుకుపోయాయి. ఓ రోజు భారీ వర్షం కురిసింది. గ్రామంలోని డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడగా గ్రామ పెద్దలు సమావేశమై ‘ఈ ఇబ్బందికి కారణమైన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలి’అని నిర్ణయించారు. మరుసటి రోజు నుంచి గ్రామంలో ప్రతిఒక్కరూ బట్ట సంచి ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమంలో గ్రామం పరిశుభ్రంగా మారింది. కాల్వలు శుభ్రంగా ఉండడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లేది. అప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకసారి మాత్రమే ఉపయోగపడతాను. తర్వాత ప్రకృతికి భారంగా మారతాను.. కానీ నువ్వు ఎన్నోసార్లు ఉపయోగపడుతూ ప్రకృతిని కాపాడుతున్నావు. నిజంగా నువ్వే గొప్పదానివి’అని బట్ట సంచితో చెప్పింది. అందుకు బట్ట సంచి నవ్వుతూ ‘గొప్పతనం బయట కనిపించే అందంలో కాదు. ఇతరులు, ప్రకృతికి ఉపయోగపడడంలో ఉంటుంది’అని చెప్పింది. ఆ మాటలు విన్న కవర్ తన తప్పు తెలుసుకుంది.నీతి: తాత్కాలిక సౌకర్యం కంటే ప్రకృతిని కాపాడే అలవాట్లే గొప్పవి. చిన్నచిన్న మార్పులే పర్యావరణాన్ని రక్షిస్తాయి. -
ముగిసిన ధాన్యం సేకరణ
● యాసంగిలో సన్నాలు ప్రైవేటు మార్కెట్లో విక్రయం ● దొడ్డు రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం ● లక్ష్యం 48 వేల మెట్రిక్ టన్నులు.. సేకరణ 40 వేల ఎంటీ ● 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమపాల్వంచరూరల్: ప్రభుత్వ పట్టింపులేనితనం, రైతుల అవస్థల మధ్య ధాన్యం సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ఈ నెల 3వ తేదీతో ముగించారు. రైతులు సన్నరకం ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు, దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. జిల్లాలో 89 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, లక్షా 87 వేల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాలశాఖ 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 5,294 మంది రైతుల నుంచి రూ.96.45 కోట్ల విలువైన 40,670 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొన్నది. 4,724 మంది రైతుల ఖాతాల్లో రూ.88 కోట్లు జమ చేయగా, ఇంకా 570 మందికి సుమారు రూ.8.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నరకం ప్రైవేట్కు... యాసంగిలో సన్నరకం ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం 5,342 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 35.32 వేల మెట్రిక్ టన్నులు విక్రయించారు. గతేడాది యాసంగిలో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈసారి 40,670 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. గతేడాది కంటే 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తగ్గింది. ఈసారి బహిరంగ మార్కెట్లో సన్నాలకు అధిక డిమాండ్ ఉంది. దీనికితోడు గతేడాది యాసంగి ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అధిక డిమాండ్ ఉండటం, బోనస్ వస్తుందో, రాదో తెలియని పరిస్థితుల్లో రైతులు సన్నాలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. దొడ్డు రకాలను మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. యాసంగిలో సన్న రకాలకు బయట మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ఈసారి యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేశాం. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.88 కోట్లు జమ చేశాం. మిగిలిన రైతులకు రెండు రోజుల్లో నగదు జమ చేస్తాం. –ఎస్.త్రినాథ్బాబు, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్కొనుగోలు కేంద్రాలు ధాన్యం విలువ సేకరించిన ధాన్యం (రూ. కోట్లలో) (మెట్రిక్ టన్నుల్లో) సహకార సొసైటీ 93 66.36 27,986 ఐకేపీ 17 14.13 5,954 జీసీసీ 26 5.24 2,207 డీసీఎంఎస్ 31 10.72 4,522 -
డ్రిప్ ఆటోమేషన్తో నీటి పొదుపు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నీటి కొరత, ఎద్దడిని అధిగమించేందుకు, ఉద్యాన పంటల సాగులో అధిక ఉత్పాదకత సాధించేందుకు డ్రిప్ నీటిపారుదల ఆటోమేషన్ సాంకేతికతను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ పద్ధతి ద్వారా రైతులకు సమయం ఆదా, శ్రమ, ఖర్చును తగ్గించడంతో పాటు పంటల నిర్వహణ సులభతరంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేదా కంట్రోలర్ సహాయంతో పంటలకు సాగునీటిని అందించవచ్చు. నిర్ణీత సమయాలలో పంటలకు అవసరమైన మేరకు నీరు అందడం వల్ల నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యాన శాఖ హెక్టారుకు యూనిట్ ధర రూ.40 వేలుగా నిర్ణయించింది. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 55 శాతం సబ్సిడీతో రూ 22 వేలు, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో రూ. 18 వేలు రాయితీ లభిస్తుంది. ఆర్కేవీవై, పీడీఎంసీ పథకం ద్వారా సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే డ్రిప్ వ్యవస్థ కలిగిన రైతులు కూడా ఆటోమేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని సబ్సిడీ పొందవచ్చని ఉద్యాన శాఖాధికారులు తెలిపారు.ఉద్యానశాఖ ద్వారా రైతులకు రాయితీ డ్రిప్ ఆటోమేషన్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాయితీలను వినియోగించుకుని ఆటో మేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని నాణ్యమైన దిగుబడులు పొందాలి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. –జంగ కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి -
ఆర్టీసీపై అ‘ధనం’!
● డీజిల్ ధర పెరుగుదలతో భారం ● రీజియన్పై భారం రోజుకు రూ.4.25 లక్షలు.. ● పొదుపు చర్యల వేళ ధరలతో సతమతం ఖమ్మంమయూరిసెంటర్: సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీపై డీజిల్ ధరల పెంపు పిడుగులా పడింది. ఇప్పటికే రకరకాల భారాలతో సతమతమవుతున్న సంస్థకు ఇటీవల రోజుల వ్యవధిలోనే డీజిల్ ధర లీటర్కు సుమారు రూ.9 మేర పెరగడం కోలుకోలేని దెబ్బతీసింది. ఖమ్మం రీజియన్లో ప్రాంతాల వారీగా రూ.96 నుండి రూ.97 వరకు ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ.103.41 నుంచి రూ.105.08 వరకు చేరింది. ఫలితంగా ఆర్టీసీ చక్రాలు తిరగడం భారంగా మారింది. కి.మీ.కు రూ.1.51 అదనం ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రీజియన్ పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి రోజుకు సగటున 2.82 లక్షల కి.మీ. మేర తిరుగుతున్నాయి. ధరల పెంపుతో కిలోమీటర్పై రూ.1.51 అదనపు భారం పడగా.. సంస్థ రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. నెలకు రూ.1.27 కోట్లు డీజిల్ ధర పెరుగుదలతో ఆర్టీసీ ఖమ్మం రీజియన్పై రోజుకు అదనంగా రూ.4,25,820 వెచ్చించాల్సి వస్తోంది. ఇది నెలకు రూ.1,27,74,600 గా నమోదవుతుందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని డిపోల ఆదాయం అంతంతమాత్రంగానే సాగుతుంటే, మరోవైపు డీజిల్ భారం పడడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే లీటర్పై రూ.9 పెరగడం సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ రూట్లను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయాన ఇంధన ధరల పెంపు తమ అంచనాలను తలకిందులు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.ఆర్టీసీ, అద్దె బస్సులు తిరిగే దూరం 2.82 లక్షల కి.మీ. ప్రతీ కిలోమీటర్పై అదనపు భారం రూ.1.51 రోజుకు.. రూ.4,25,820 నెలకు.. రూ.1,27,74,600


