breaking news
Bhadradri District Latest News
-
గురుకులాల్లో మౌలిక వసతులు
పాల్వంచరూరల్: గిరిజన విద్యార్థుల సమగ్రాభివృద్ధికోసం మౌలిక వసతులు కల్పిస్తానని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహారి, అదనపు తరగతిగదులు మంజూరు చేస్తామని, క్రీడా మైదానాన్నిఅభివృద్ధి చేస్తామని తెలిపారు. పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు టెబుల్ టెన్నిస్ సామగ్రిని అందజేశారు. ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్ ఎస్.శ్యామ్కుమార్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పరీక్షలకు సిద్ధం చేయాలి
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో హెచ్ఎంలు, వార్డెన్లతో సమీక్షా సమావేశం జరిపారు. పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ముందస్తుగా సిలబస్ పూర్తి చేసి మోడల్ పరీక్షా పత్రాలతో సంసిద్ధులను చేయాలన్నారు. కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పురాతన భవనాలు, పాఠశాలను వివరాలను అందించాలని, అవసరమైనచోట మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మెలో ఉన్న డైలీవేజ్ వర్కర్లు ఈ నెల 20 తేదీలోగా విధుల్లోకి రాకపోతే కొత్తగా వర్కర్లను నియమించుకోవాలన్నారు. ఈ నెల 17,18వ తేదీల్లో డివిజన్స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని పీఓ మరో ప్రకటనలో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు అశోక్, మధుకర్, సమ్మయ్య, రమేష్, చంద్రమోహన్, భారతీదేవి, అలివేలు మంగతాయారు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి వేంటేశ్వరస్వామి ఆలయంలో హుండీలోని నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. గత మంగళవారం రాత్రి శ్రీనివాసకాలనీలోని గుట్టపై గల వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశంచి, హుండీ తాళాలు పగులగొట్టి సుమారు రూ.3 వేల నగదును చోరీ చేశాడు. అక్కడ పనిచేసే వ్యక్తులకు చెందిన రెండు సెల్ఫోన్లు, పర్సులోని రూ.1,500 నగదునూ అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో గురువారం కిన్నెరసానిరోడ్లో గుడ్మార్నింగ్ హోటల్ వద్ద సదరు వ్యక్తిని గుర్తించిన గుడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో అదే దొంగ ఆలయంలో పలుమార్లు చోరీకి పాల్పడినట్లు సమాచారం. -
తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ మద్దతు
మణుగూరురూరల్: బీసీ రిజర్వేషన్ అమలుపై 18న బీసీ సంఘాలు నిర్వహించే తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని పేర్కొన్నారు. బీసీ సంఘాలు చేస్తున్న బంద్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాళ్లతో దాడి చేసిన వ్యక్తిపై కేసు పాల్వంచ: గొడవ జరుగుతుందనే సమాచారంతో వెళ్లిన కానిస్టేబుల్పై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడగా.. గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో డయల్ 100 గొడవ జరుగుతున్నట్లు కాల్ రాగా.. కానిస్టేబుల్ అబ్బురాములు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ జట్పట్ రమేశ్ మద్యం సేవించి సదరు కానిస్టేబుల్తో ఘర్షణకు దిగాడు. అనంతరం రాయితో దాడి చేయడంతో తలకు గాయమైంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రమేశ్పై ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం పట్టివేత అశ్వారావుపేటరూరల్: పలు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. మండలంలోని ఆసుపాక, జమ్మిగూడెం, తిరుమలకుంట, గుమ్మడవల్లి గ్రామాల్లో కొందరు వ్యక్తుల ఇళ్లల్లో రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సివిల్ సప్లై అధికారులకు సమాచారం రావడంతో అధికారులు ఆయా ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జమ్మిగూడేనికి చెందిన భీమవరపు గంగరాజు ఇంట్లో 9 క్వింటాళ్లు, ఆసుపాక గ్రామానికి చెందిన తాడేపల్లి ఆనందరావు ఇంట్లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిపై వేర్వేరుగా 6ఏ కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై ఇన్చార్జ్ డీటీ ప్రభాకర్ తెలిపారు. -
అర్హులకే డీసీసీ పదవి
మణుగూరు టౌన్/దమ్మపేట: సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, సమర్థత కలిగిన వారితోపాటు ఆరేళ్లుగా కాంగ్రెస్లో ఉంటూ కిందిస్థాయి కార్యకర్తల నుంచి పరిచయం ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవి లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. గురువారం మణుగూరులోని ఇల్లెందు అతిథి గృహంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిపారు. దమ్మపేట మండలం పట్వారిగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. యువతకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య కూడా మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ అబ్జర్వర్ ఆశావహుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, పరిశీలకులు సుబ్బారావు, వై. సాగరిక, సంజీవ్ ముదిరాజ్, రాజేందర్రెడ్డి, మోతుకూరి ధర్మారావు, నల్లపు దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, చింతిరాల రవికుమార్, పటాన్ మహ్మద్ ఖాన్, చందా సంతోష్, తాళ్లూరి చంద్రశేఖర్ చక్రవర్తి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం -
పంటల్లో తెగుళ్ల బెడద
● దిగుబడిపై రైతుల్లో ఆందోళన ● యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తల సలహాలుసూపర్బజార్ (కొత్తగూడెం): వాతావరణ పరిస్థితుల్లో రోజుకో రకంగా ఉంటున్నాయి. కొద్దిరోజుల పాటు ఎడతెగకుండా వర్షాలు కురి శాయి. ప్రస్తుతం మధ్యాహ్నం ఎండగా ఉంటున్నా సాయంత్రం మంచుప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యాన వివిధ పంటలను తెగుళ్లు ఆశిస్తుండగా దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు వివిధ పంటల్లో తీసుకోవాల్సి న యాజమాన్య పద్ధతులను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డి నేటర్ డాక్టర్ టి.భరత్ వెల్లడించారు. వరి అధిక తేమతో కూడిన వాతావరణం వరిలో మానుపండు తెగులు సోకడానికి అనుకూలం. ఈ లక్షణా లు కనిపిస్తే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు 0.4గ్రాములు + ట్రైపోసెక్సీస్ట్రెబిన్ టేబుకోన జోల్ లేదా ఒక ఎం.ఎల్. ప్రొఫైకోనజోల్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంటలో పాము పొడ తెగులు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక ఒక మి.లీ. ప్రొపికోనజోల్ను లీటర్ నీటిలో కలిపి 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే, వరిలో సుడిదోమ ఆశిస్తే నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 0.6 గ్రాముల పైమెట్రోజిన్ లేదా 0.48 మి.లీ. టేప్లోమేజపైరిన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇంకా కంకి నల్లి ఆశిస్తే ఒక మి.లీ. స్ప్రైరోమైసిపిన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, బాక్టీరియా ఎండు తెగులు ఉధృతి కనిపిస్తే ఎకరానికి 400 గ్రాముల కాపర్ హైడ్రాకై ్సడ్, స్టేపీటోమైసిన్ సల్ఫైడ్ 60 గ్రాములు అందిస్తూ.. యూరియా మోతాదును తగ్గించి నీటిని తడి – పొడి విధానంలో అందించాలి. అయితే, ఈ తెగులుకు పూర్తిగా నివారించడానికి సరైన మందులు లేవు. పత్తి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ. ప్రోఫినోపాస్ లేదా 1.5 గ్రాముల దియోడికార్బ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, ఎకరానికి 5 – 6 లింగాకర్షణ బుట్టలు అమరిస్తే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే, పత్తిలో కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక 0.2 గ్రాముల ప్లాంటమైసిన్ + 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి అపరాలు వెచ్చటి గాలి, అధిక తేమ వాతావరణ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము పంటలను మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆనవాళ్లను గమనిస్తే వర్షాలు తగ్గిన తర్వా త నివారణకు ఒక మి.లీ. నోవాలురాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి కూరగాయలు ●టమాట పంటలో సూది పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 0.3 మి.లీ. స్పైనో సాడే లేదా 0.2 మి.లీ. ఇండాక్సికార్బ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక వంగలో కొమ్మ, కాయ తులసి పురుగు ఆశిస్తే 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి -
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
దుమ్ముగూడెం/భద్రాచలంఅర్బన్: భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్న భద్రాచలం ఆర్టీసీ డిపో కండక్టర్ డి.సైదులు (55) గుండెపోటుతో మృతి చెందాడు. భద్రాచలం నుంచి గురువారం వెంకటాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములకపాడు వద్దకు చేరగానే సైదులుకు ఛాతి నొప్పి రావడంతో బస్సులోనే ఉన్న పర్ణశాల డాక్టర్ రేణుకారెడ్డి, మరో నర్స్ ములకపాడు వైద్యశాల దగ్గర బస్సు నిలిపారు. అనంతరం సైదులును ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా డాక్టర్ రుక్మాకర్రెడ్డి సీపీఆర్ చేశాక భద్రాచలం తరలించేసరికి సైదులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సైదులు స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు కాగా, ఆయన మృతిపై డీఎం జంగయ్య, ఆర్టీసీ సీఐ రామయ్య, ఉద్యోగులు సంతాపం తెలిపారు. అలాగే, ఆయన అంత్యక్రియలకు డీఎం జంగయ్య రూ.30 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. చెరువులో పడి వ్యక్తి..బూర్గంపాడు: మతిస్థిమితం లేని వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం సారపాకలోని తాళ్లగొమ్మూరులో చోటుచేసుకుంది. మేడేకాలనీకి చెందిన ధరావత్ నందనాయక్ (40) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి వరకు రాలేదు. గురువారం తాళ్లగొమ్మూరులోని చెరువులో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నందనాయక్గా గుర్తించారు. నందనాయక్కు అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తాయని, చెరువులోకి దిగినప్పుడు ఫిట్స్ వచ్చి మునిగి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య లీల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేశారు. -
వర్క్షాప్లో నూతన యంత్రం ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: సెంట్రల్ వర్క్ షాప్లో అత్యాధునిక ఎల్–45 లేత్ యంత్రాన్ని శుక్రవారం సెంట్రల్ వర్క్షాప్ జీఎం (ఈ–ఎం) ఎన్.దామోదరరావు ప్రారంభించి, మాట్లాడారు. రూ.1.45 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎల్–45 లేత్ మెషిన్ సాయంతో వేగం, కచ్చితత్వంతో కూడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వాడే డ్రమ్ము హబ్బులు, ఫ్యాన్ సాఫ్ట్లను తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని చేయవచ్చని చెప్పారు. కార్యక్రమములో ఏజీఎం (ఈ–ఎం) మెయిన్ వర్క్షాప్ పి.రాజీవ్కుమార్, అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, అప్రెంటిస్ విద్యార్థులు పాల్గొన్నారు. -
నకిలీ వే బిల్లుల ముఠా గుట్టురట్టు
అశ్వాపురం: నకిలీ వే బిల్లులతో లారీలో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారు. గురువారం అశ్వాపురం పోలీస్ స్టేషన్లో మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. జగ్గారంక్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 8న అశ్వాపురం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. టీఎస్30టీఏ 6498 నంబర్ గల ఇసుక లోడ్ లారీని ఆపి, పరిశీలించారు. డ్రైవర్ నాతి రాములు చూపించిన వే బిల్లుపై అనుమానం వచ్చి ప్రశ్నించగా అది నకిలీ వే బిల్లు అని, దానిని తమ యజమాని హైదరాబాద్కు చెందిన కర్నాటి శివశంకర్ ద్వారా పంపించాడని, రామానుజవరం ర్యాంపులో ఓ వ్యక్తి తనకు డీడీ లేకుండా ఇసుక లోడ్ చేశాడని తెలిపాడు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తరువాత పోలీసులు రామానుజవరం ఇసుక ర్యాంపులో తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండీసీ ఉద్యోగులు దగ్గు నిఖిల్దీప్, నాగేల్లి మధు, బొల్లెద్దు అనిల్ డీడీ లేకుండా అనుమతులు ఇవ్వగా.. జేసీబీ డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ ఇసుక లోడ్ చేశాడని, అతడికి సూపర్వైజర్గా పనిచేసే సతీశ్రెడ్డి ఫోన్ చేసి చెప్పాడని తేలింది. దీంతో హైదరాబాద్ హయత్నగర్లోని కర్నాటి శివశంకర్ నివాసానికి వెళ్లి విచారించగా.. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ తనకు నకిలీ వే బిల్లులు తయారు చేయడం నేర్పించాడని చెప్పాడు. కిరణ్పై 2023లో నకిలీ వే బిల్లులు తయారు చేయగా.. వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, జైలుకు కూడా వెళ్లాడని శివశంకర్ పోలీసులకు వివరించాడు. కాగా, కర్నాటి శివశంకర్, నాతి రాములు, ఇరగదిల్ల ఉపేందర్, దగ్గు నిఖిల్దీప్, నాగేల్లి మధు, బొల్లేదు అనిల్ను అరెస్ట్ చేశామని, కిరణ్, సతీశ్రెడ్డి, సుర్వే శ్రీకాంత్ (లారీ ఓనర్) పరారీలో ఉన్నారని డీఎస్పీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే అశ్వాపురం ఎస్హెచ్ఓ 87126 82093, డీఎస్పీ 87126 82006 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. సమావేశంలో అశ్వాపురం సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ రాజేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరుగురు నిందితుల అరెస్టు.. పరారీలో ముగ్గురు -
తొమ్మిది అడుగుల కొండచిలువ పట్టివేత
చుంచుపల్లి: మండలంలోని రుద్రంపూర్ క్లబ్ ఏరియాలో బుధవారం రాత్రి మోజెస్ ఇంట్లోకి సుమారు 9 అడుగుల పొడవైన కొండచిలువ రావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. స్థానికుల సమాచారం మేరకు ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపడు, కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్, సభ్యుడు నారదాసు శ్రీకాంత్తో ఆక్కడకు చేరుకుని కొండచిలువ (ఇండియన్ రాక్పైథాన్)ను బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి అర్ధరాత్రి అడవిలో వదిలేశారు. మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు గుడెల్లి యాకయ్య, బండ శంకర్, మురళి, శ్రీనివాస్, సలీం, తరుణ్, ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
మాదకద్రవ్య రహిత సమాజానికి పాటుపడదాం
మణుగూరురూరల్: మాదకద్రవ్య రహిత సమాజానికి పాటుపడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీ అశోక్నగర్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో అశ్వాపురం, ఏడూళ్లబయ్యారం సీఐలు అశోక్రెడ్డి, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది అశోక్నగర్లోని ప్రతీ ఇంటిని జాగిలాలతో తనిఖీ చేసి సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 58 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, బెల్ట్ షాపుల్లోని రూ.30 వేల విలువల గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా డ్రగ్స్పై యుద్ధం చేపట్టినట్లు తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సీహెచ్ నగేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కష్టపడితేనే సమాజంలో గుర్తింపు
పాల్వంచరూరల్: మహిళలు కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని తోగ్గూడెం తండా, రంగాపురంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోషన్ వాటిక పనులను, నారాయణరావుపేటలోని మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉపాఽధి హామీ పథకంలో వంద రోజులు పనులు పూర్తిచేసిన కుటుంబాల సభ్యుల కోసం కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 30 రోజులపాటు శిక్షణ ఇస్తామని అన్నారు. ఎస్బీఐ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు ముద్ర రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్రెడ్డి, ఎల్డీఎంలు వి.రామిరెడ్డి, వి.రవిప్రసాద్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఎంపీఓ చెన్నకేశ్, ఏపీఓ రంగా తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విద్యాచందన -
ఇదేమి దారిద్య్రం?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ గర్భం నుంచి కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మడంపై ఉన్న శ్రద్ధ, ఆ ఇసుకను తరలించేందుకు అనుసరించాల్సిన విధానంపై లేకపోవడం ఏజెన్సీ వాసులకు కష్టాలు తెచ్చి పెట్టింది. నదీతీర ప్రాంతంలో నివాసమనేది దైన్యంగా మారింది. ఇసుక తోడేస్తున్నారు నిర్మాణమే జరగని సీతమ్మ సాగర్ బరాజ్ ఎగువ భాగంలో పూడిక తీత పేరుతో 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు జారీ చేసింది. ఈ ఇసుకను తరలించేందుకు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం మండలాల పరిధిలో 20 ఇసుక రీచ్లను గుర్తించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా చకచకా జరిగిపోయింది. ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇసుక అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 2,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. అమ్మకాల వ్యవహారం మొత్తం పర్యవేక్షిస్తున్న టీజీఎండీసీ అధికారుల నిర్లక్ష్యం జిల్లా వాసులకు కష్టాలు తెచ్చి పెట్టింది. ఇసుక తరలించేందుకు వీలుగా రోడ్లను అభివృద్ధి చేయకుండానే అమ్మకాలు మొదలు పెట్టడంతో జిల్లాలోని రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. రోడ్ల సామర్థ్యం ఇలా.. గ్రామాలను కలిపే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో ముందుగా అడుగు మందంతో కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం మందంతో బీటీ వేస్తారు. రోజుకు రెండు వందల వాహనాలు తిరగడం, 40 టన్నుల బరువు తట్టుకునే సామర్థ్యంతో ఈ రోడ్లను నిర్మిస్తారు. ఆర్అండ్బీ రోడ్ల విషయంలో ఒకటిన్నర అడుగు వంతున కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం, 50 ఎంఎం వంతున బీటీ వేస్తారు. ఈ రోడ్లు పరిమిత సంఖ్యలో హెవీ వెహికల్స్ తిరిగేందుకు అనువుగా ఉంటాయి. ఇక జాతీయ రహదారుల విషయానికి వస్తే కనీసం రెండు అడుగులకు తక్కువ కాకుండా కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం ప్లస్ 30 ఎంఎం ప్లస్ 50 ఎంఎం వంతున బీటీ వేస్తారు. ఈ రోడ్లు అపరిమిత సంఖ్యలో భారీ వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉంటాయి. రోడ్లు విస్తరించరా? జిల్లాలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా మైనింగ్ చేస్తోంది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఆ సంస్థ చెల్లించే రాయల్టీతో జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇసుక అమ్మకాల ద్వారా టీజీఎండీసీకి వేలాది కోట్లు ఆదాయం వస్తున్నా కనీసం ఇసుక రవాణా చేసే రోడ్లను అభివృద్ధి చేయడం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేవలం ఇసుక అమ్ముకోవడం, సొమ్ములు చేసుకోవడం మా పని, రోడ్లు ఎలా ఉంటే మాకేంటనే విధంగా టీజీఎండీసీ అధికారుల తీరు ఉంది. ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల రోడ్లు తీవ్రంగా పాడైపోవడంతో ఆ జిల్లా అధికారులు ఇసుక లారీల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఇసుక లారీల ట్రాఫిక్ను భద్రాద్రి జిల్లా మీదుగా మళ్లించారు. ఇక్కడ కూడా అవే సమస్యలు వస్తున్నాయి. ఈ నెల ఆరంభంలో ఇసుక లారీల వల్ల చర్ల, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల మణుగూరులో టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి శంకర్నాయక్ను బాధితులు నేరుగా ప్రశ్నించారు. చివరకు ఇసుక లారీలను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ ప్రజలు సిద్ధమయ్యారు. పరిస్థితి ముదురుపాకన పడుతుండటంతో వర్షాలను సాకుగా చూపుతూ పర్మిట్ల జారీని టీజీఎండీసీ తగ్గించింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా ఇసుక లారీల సందడి తగ్గింది. ప్రస్తుతం గోదావరి తీరం నుంచి ఆర్అండ్బీ వరకు ఇసుక లారీలు తిరిగే రోడ్లన్నీ పంచాయతీరాజ్ ఆధీనంలో ఉన్నాయి. ఇవి భారీ వాహనాలు తిరిగేందుకు అనువుగా లేవు. ఇక గోదావరి తీరం వెంబడి ఉన్న చర్ల – భద్రాచలం, పినపాక – కృష్ణసాగర్ క్రాస్రోడ్ రోడ్లు ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్నాయి. ఇవి కూడా పరిమిత సంఖ్యలో హెవీ వెహికల్స్ తిరిగేందుకు అనువైన రోడ్లు. ఇలాంటి రోడ్ల మీద కనీసం యాభై టన్నుల బరువు (35 టన్నుల ఇసుక , 15 టన్నుల బాడీ వెయిట్)తో లారీలు ప్రతీ రోజు వందల కొద్దీ తిరుగుతున్నాయి. దీంతో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక వాహ నాలతో రహదారులు ఛిద్రం -
పత్తి రైతుకు ‘కపాస్’ కష్టం
బూర్గంపాడు: పత్తి రైతును సీజన్ ప్రారంభం నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక, ఆ తర్వాత అధిక వర్షాలు రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అన్నింటినీ అధిగమించి చేతికొచ్చిన అరకొర పంటను అమ్మాలంటే సీసీఐ తెచ్చిన కపాస్ యాప్ ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం నివారించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్తగా కపాస్ కిసాన్ యాప్ను తెచ్చింది. సీపీఐలో పత్తి విక్రయించాలంటే రైతులు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్లో కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోన్, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల నంబర్, భూముల సర్వే నంబర్, విస్తీర్ణం తదితర వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. పంట విక్రయించే సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎన్ని క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తెస్తున్నారు, తేమశాతం ఎంత? తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత స్థానిక వ్యవసాయ అధికారులు ఎప్పుడు, ఎక్కడకు తీసుకురావాలనే వివరాలను స్లాట్లోనే వెల్లడిస్తారు. రైతుల్లో ఆందోళన కపాస్ యాప్ విధానం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చాలామంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఉన్నా ఆ ఫోన్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకంతో లింకై ఉండాలి. లేకుంటే యాప్లో రిజిస్ట్రేషన్ కాదు. ఆధార్కార్డుతో అయినా చాలావరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువవుతుంది. కానీ కపాస్ కిసాన్ యాప్లో ఫోన్ నంబర్ కీలకంగా మారింది. పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినప్పుడు ఏ ఫోన్ నంబర్ ఉందో అదే నంబర్తో యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నాక మూడుసార్లు కేటాయించిన తేదీల్లో పత్తి తీసుకురాకుంటే వారు ఆటోమేటిక్గా బ్లాక్ లిస్ట్లో చేరతారు. ఏజెన్సీలో సిగ్నల్ సమస్య జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్ ఫోన్ల వినియోగం తెలియదు. యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియలపై అవగాహన లేదు. కొందరికి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం తెలిసినా సిగ్నల్ సమస్య ఎదురవుతుంది. క్రాప్బుకింగ్ సమయంలో సిగ్నల్స్ అందక వ్యవసాయశాఖ అధికారులే ఇబ్బందులు పడుతున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో మండల కేంద్రాలు, మార్కోడు గ్రామానికి తప్ప మిగతా గ్రామాల్లో సిగ్నల్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండవు. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లోని మారుమూల అటవీ గ్రామాల్లో కూడా సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా రావు. ఆయా గ్రామాల రైతులు చిన్న ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఇప్పుడు పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే వారు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలి. స్మార్ట్ ఫోన్ను వినియోగించుకోవాలంటే సిగ్నల్స్ వచ్చే ప్రాంతాలకు రావాలి. ఇన్ని గందరగోళ పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు మళ్లీ స్థానికంగా ఉన్న దళారులను, వ్యాపారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఇక కౌలురైతులు పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా పట్టాదారు రైతు నంబర్తో యాప్లో లాగిన్ కావాలి. ఆ తర్వాత వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతు వివరాలను యాప్లో నమోదు చేసి పట్టాదారుకు అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియలో కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. -
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి గురువారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.నేడు మంత్రి తుమ్మల పర్యటనదమ్మపేట: అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెంలో ఉన్న ఆయిల్ ఫెడ్ నర్సరీని నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సందర్శించనున్నారని పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపాటి ప్రసాద్ కోరారు. గురువారం మండలంలోని అల్లిపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పామాయిల్ మొక్కలకు తెగుళ్లు, అంటువ్యాధులు సోకకుండా మొక్క దశ నుంచే నర్సరీలో చేపట్టే చర్యల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని అన్నారు. రైతులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు దొడ్డా ప్రసాద్, కేవీ, అడపా రాంబాబు, మన్నెం అప్పారావు పాల్గొన్నారు. ‘ఎర్త్ సైన్సెస్’కు మన్మోహన్ సింగ్ పేరురాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో ఇటీవల ప్రారంభమైన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. సుమారు 300 ఎకరాల్లో రూపుదిద్దుకొంటుండగా, ఇక నుంచి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యావకాశాలను విస్తృతం చేయడంతోపాటు రాష్ట్రానికి కొత్త దిశను చూపించనున్న యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు దీపావళి బోనస్ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షలు చెల్లించనున్న సింగరేణి కొత్తగూడెంఅర్బన్: సింగరేణి కార్మికులకు నేడు దీపావళి బోనస్ అందనుంది. ఏటా యాజమాన్యం పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు(పీఎల్ఆర్) బోనస్ను దీపావళి ముందు అందజేస్తుంది. ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానుంది. కాగా ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకూ బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 20న దీపావళి సందర్భంగా యాజమాన్యం చెల్లింపు సెలవుగా ప్రకటించింది. 20న అన్నీ గనులు, విభాగాలు బంద్ ఉండనుండగా, చెల్లింపు సెలవు రోజుగా ప్రకటించి అత్యవసర కార్మికులకు మాత్రం మూడు రెట్ల వేతనం చెల్లించనున్నారు. పీఎల్ఆర్ బోనస్ 2023లో రూ.85,500, 2024లో రూ.93,750 చెల్లించారు. ఈ ఏడాది రూ. 9,250 పెంచి ఒక్కో కార్మికుడికి రూ.1,03,000 చెల్లించనున్నారు. -
బాణసంచా.. భద్రతాచర్యలు
● జిల్లా వ్యాప్తంగా దుకాణాల ఏర్పాట్లు ● మొదలైన అనుమతుల ప్రక్రియ ● ఈసారి ఖర్చు పెరిగిందంటున్న వ్యాపారులు ● ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై దృష్టి ● దుకాణం ఓపెన్ ఏరియాలో అనుమతి పొందిన ప్రదేశంలో ఉండాలి. ● నిర్మాణం క్లాత్ వుడ్ టార్పాలిన్ లాంటి కాలే వస్తువులతో చేయకూడదు. ● నాణ్యమైన వైరుతో ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలి. అతుకులు లేకుండా ఉండే విధంగా క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో వైరింగ్ చేయించాలి. ● 2 నంబర్ డీసీపీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. ● రెండు వాటర్ బ్యారెల్స్ (ఒకటి 200 లీటర్స్) ఉండాలి. ● స్మోకింగ్ నిషేధం అని బోర్డులు ఏర్పాటు చేయాలి. ● స్పార్క్ వచ్చే ఎలాంటి ఎక్విప్మెంట్ వాడకూడదు. ● 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదు. ● షాప్లో, చుట్టూ ప్రదేశంలో శుభ్రత పాటించాలి. ● రెండు షాప్ల మధ్య 3 మీటర్ల గ్యాప్ ఉండేలా చూడాలి.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి బాణసంచా విక్రయాలు సాగించే వ్యాపారులు రెవెన్యూ, మున్సిపాలిటీ / గ్రామపంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో కొత్తగూడెంలో 38, రుద్రంపూర్ 01, రామవరం 04, జూలురుపాడు 02, చండ్రుగొండ 02, ఇల్లెందు 28, మణుగూరు 16, పాల్వంచ 12, భద్రాచలం 8, చర్ల 4, సారపాక 1, బూర్గంపాడు 2, అశ్వారావుపేటలో 16 వంతున షాపుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమతులు వచ్చిన తర్వాత ఎంపిక చేసిన మైదానం/ఖాళీ ప్రదేశంలో దుకాణదారులు తాత్కాలిక షాపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఫైర్సేఫ్టీ జాగ్రత్తలు పాటించడంలో ఈ దుకాణాల దగ్గర నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. పెరిగిన ఖర్చు బాణసంచా వ్యాపారులు ఖర్చులు తగ్గించుకునేందుకు కలిసికట్టుగా (సిండికేట్) దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో మండల కేంద్రాల్లో ఒక్కో దుకాణం ఏర్పాటుకు కనిష్టంగా రూ.40 వేలు ఖర్చవుతుండగా పట్టణాల్లో ఇది రూ.60 వేలకు చేరుకుంది. ఇందులో అనుమతుల కోసం వేర్వేరు ప్రభుత్వశాఖలకు చలాన్ల రూపంలో చెల్లించే సొమ్ము రూ.2 వేలలోపు ఉండగా అద్దె రమారమీ రూ.5వేల వరకు ఉంది. షెడ్డు నిర్మాణం, జనరేటర్, విద్యుత్ బిల్లుల ఖర్చు రూ.10 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తంగా దుకాణం ఏర్పాటుకు రూ. 30వేలకు అటుఇటుగా ఖర్చు వస్తోంది. అయినా ఒక్కో దుకాణం ఏర్పాటు కోసం అదనంగా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ముడుపుల కోసమే అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన ఖర్చుల ప్రభావం ఫైర్సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటున్నారు. అనుమతుల్లో చేతివాటం? జిల్లాలో ఓ మున్సిపాలిటీ పరిధిలో బాణసంచా దుకాణం పర్మిషన్ కోసం రెవెన్యూ సిబ్బంది ఒక్కో షాపునకు రూ.5,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. అంత ముట్టచెప్పుకోలేమని వ్యాపారులు చెప్పడంతో అనుమతుల ప్రక్రియను సదరు అధికారి తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో బాణసంచా సిండికేట్ సదరు అధికారికి ఎదురు తిరిగి అనుమతుల కోసం పైఅధికారి దగ్గరకు వెళ్తామని చెప్పడంతో చివరకు డీల్ రూ.3,000 దగ్గర కుదిరినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర శాఖల్లోనూ ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. అనుమతులు లేకుండా టపాసులను విక్రయించినా, నిల్వ చేసినా చర్యలు తీసుకుంటాం. క్లస్టర్లో యాభై షాపులకు మించి ఉండకూడదు. ఇళ్ల మధ్య, కల్యాణ మంటపాలు, సమావేశ మందిరాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయొద్దు. –అబ్దుల్ రెహమాన్, డీఎస్పీ, కొత్తగూడెంతాత్కాలిక టపాకాయల దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి. జాగ్రత్తలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు అందరూ సహకరించాలి. –మురహరి క్రాంతి కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ -
ప్రజలకు ఇక్కట్లు
అధిక పర్మిట్లు.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు సహా అనేక మండలాలు షెడ్యూల్ 5 పరిధిలో ఉన్నాయి. పీసా చట్టాలను అనుసరించి ఇక్కడ ఇసుక రీచ్లను గిరిజనులే నిర్వహిస్తూ సొసైటీల ద్వారానే విక్రయించాలి. ఈ క్రమంలో యంత్రాలను వినియోగించకూడదు. అయితే సీతమ్మ సాగర్ – కాటన్ ఆనకట్టల ఎగువ భాగంలో డీ సిల్టేషన్ పేరుతో 30 ఇసుక రీచ్లకు అనుమతుల జారీతో కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్ముకునే వెసులుబాటు కలిగింది. డీ సిల్టేషన్ పేరిట మైనింగ్కు అనుమతి ఇవ్వడంతో పీసా చట్టం పరిధి నుంచి మినహాయింపు లభించింది. అసలు నిర్మాణమే జరగని సీతమ్మసాగర్ బరాజ్ కింద డీ సిల్టింగ్కు అనుమతులు ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఏ క్షణమైనా గోదావరి తీరం వెంబడి డీ సిల్టింగ్ కోసం జారీ చేసిన అనుమతులు రద్దవుతాయనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. లెక్కకు మించి పర్మిట్లు.. డీ సిల్టేషన్ ప్రక్రియపై విమర్శలు, వివాదాలు కొనసాగుతున్నందున అందుబాటులో ఉన్న కొద్ది సమయంలోనే ఎక్కువ ఇసుక తోడేయాలని, అలా తోడిన ఇసుకను వెంటవెంటనే అమ్ముకోవాలనే టీజీఎండీసీ ఆరాటం గోదావరి తీరం వెంట ఉన్న ప్రజలకు నరకం చూపిస్తోంది. ఇక్కడి ఇసుక ర్యాంపుల నుంచి లెక్కకు మించి పర్మిట్లు జారీ చేసింది. దీంతో 24 గంటలూ భారీ లారీలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్లే లారీలు వంద ఉంటే.. చర్ల నుంచి భద్రాచలం వైపు వచ్చే లారీలు అంతే సంఖ్యలో ఉంటున్నాయి. 60 కి.మీ. నిడివి కలిగిన రహదారి మొత్తం అటూ ఇటు ఇసుక లారీలతోనే నిండిపోతోంది. సామర్థ్యానికి మించి ఇసుక తరలించే లారీలతో రహదారి మొత్తం అడుగుకో గుంతగా మారింది. ఇక రాకపోకలకు స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా, ప్రధాన రహదారి ఎక్కాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారికి ఇరువైపులా ఇళ్లు ఉన్న వారికై తే ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టు గత శనివారం సాయంత్రం ఇసుక లారీలు గుంతలో కూరుకుపోవడంతో దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. వెంకటాపురం నుంచి భద్రాచలం వచ్చే ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి వేళ అడవిలో నిలిచిపోయి మహిళలు ఇబ్బంది పడ్డారు. విమర్శలు రావడంతో.. ఇసుక లారీలు సృష్టిస్తున్న ఇబ్బందులతో గోదావరి తీరంలోని గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఎక్కడికక్కడ లారీలను అడ్డుకునేందుకు యువత సిద్ధమయ్యారు. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీజీఎండీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. భారీ వర్షాలతో రోడ్లు పాడైపోయిందున ఈనెల 13, 14 తేదీల్లో పర్మిట్ల జారీని నిలిపేసింది. దీంతో గత సోమవారం లారీల తాకిడి తగ్గింది. అప్పటికే పర్మిట్లు జారీ అయిన లారీలే రాకపోకలు సాగించాయి. తిరిగి బుధవారం నుంచి పర్మిట్లు జారీ చేయగా.. మళ్లీ గురువారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఇసుక లారీలతో వేలాది మంది ప్రజల ఇబ్బందులను జిల్లా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. రీచ్ల దగ్గర జరిగే అవినీతి వైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఒకే లారీకి జారీ అయిన పర్మిట్(డీడీ)ని కలర్ జిరాక్స్ తీసి అనేక లారీలు ఉపయోగిస్తున్న వైనం ఇటీవల వెలుగు చూసింది. రీచ్ల దగ్గర సీరియల్ పేరిట ఒక్కో లారీ నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇలా అక్రమంగా వసూలు చేసిన సొమ్ములో ఎవరి వాటా వారికి వెళ్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అధిక పర్మిట్ల జారీ, నకిలీ పర్మిట్లు, సీరియల్ పేరిట అక్రమ వసూళ్లు వంటి అంశాలపై వివరణ కోరేందుకు టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకర్నాయక్తో ఫోన్లో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.ఇష్టారీతిగా అనుమతులు జారీ చేస్తున్న టీజీఎండీసీ -
‘బీఎస్ఎన్ఎల్’ను అందుబాటులోకి తేవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యార్థులు, ప్రజలు ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకునేలా అన్ని గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఇండియన్ టెలికం సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.భాస్కర్రావుతో పాటు అధికారులు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. మండలానికి ఒక పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని నెట్వర్క్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని అన్నారు. మొబైల్ ఫోన్ నెట్వర్క్తో దేశంలో జరిగే ప్రతీ విషయాన్ని తెలుసుకోవచ్చని, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఐటీఎస్ డైరెక్టర్ ఎం.అరవింద్, అసిస్టెంట్ డైరెక్టర్ జి.గణేష్కుమార్, ఏటీఎం జి. సుభాష్, ఎస్డీఈ సక్రు, ఎంఆర్డీవీ శివరాంజీ పాల్గొన్నారు. రైజింగ్ విజన్ సర్వేలో పాల్గొనాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వేలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. రానున్న కాలంలో అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేలా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ –2047’ డాక్యుమెంట్ను రూపొందిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఈ విజన్ పత్రం భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 10న ప్రారంభమైన సర్వే 25వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికి వచ్చే ప్రజాభిప్రాయాలు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. సర్వేలో పాల్గొనేవారు https//www.telangana.gov.in లింక్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందని వివరించారు. రైతులు ఇబ్బంది పడకుండా కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, తేమ పరీక్ష పరికరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొనుగోళ్లు పారదర్శకంగా సాగేందుకు జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ సూచన -
ఖాళీ కాకుంటే మిగిలేది ‘బూడిదే’!
పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ కాంప్లెక్స్లో యాజమాన్యం అనాలోచిత చర్యలతో బూడిద చెరువులు నిండిపోయాయి. విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గు మండించగా వెలువడే బూడిదను పైప్లైన్ల ద్వారా యాష్ పాండ్కు తరలిస్తారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో బయటకు పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్థానిక గిరిజనులకే బూడిద ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైన నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారికి తరలింపు చర్యలు మందగించాయి. యాష్ పాండ్కు పైప్లైన్ల ద్వారా బూడిద వస్తుంటే.. దాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ కొంతకాలంగా నిలిచిపోవడంతో బూడిద చెరువులన్నీ పొంగిపొర్లుతున్నాయి. తద్వారా కాలుష్య సమస్య కూడా వస్తోందని పరిసర ప్రాంతాల వారు అంటున్నారు. 10 కోట్ల టన్నుల నిల్వ.. కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో 5, 6, 7 దశల కర్మాగారాలు ఉండగా, 8, 9, 10, 11 యూనిట్ల ద్వారా మొత్తం 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలో బొగ్గును మండించినప్పుడు భారీగా బూడిద వెలువడుతుంది. కేటీపీఎస్ 5, 6 దశలకు ఏబీ, ఏబీ అడిషనల్, 7వ దశకు నార్తర్న్1, నార్తర్న్ 2 యాష్పాండ్లు ఉండగా.. ఈ నాలుగూ నిండి పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం సుమారు 10కోట్ల టన్నుల యాష్ నిల్వలు పేరుకుపోయినట్లు అధికారుల అంచనా. ఇదిలా ఉండగా పలుచోట్ల కాల్వల్లో బూడిదను కలపడంతో పక్కనే ఉన్న కిన్నెరసాని జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. మూతబడిన చిన్న పరిశ్రమలు కేటీపీఎస్ బూడిదను ఉచితంగా తీసుకెళ్లి ఉపాధి అవకాశాలు పొందేందుకు యువతకు సహకరిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో వేల సంఖ్యలో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. బూడిదకు ధర నిర్ణయించడంతో నష్టాలు వస్తున్నాయంటూ చాలా మంది పరిశ్రమలను మూసేశారు. ప్రస్తుతం టన్ను బూడిదకు రూ.50 చొప్పున ఇస్తుండగా.. తక్కువ మందే తీసుకెళుతున్నారు. ఇప్పటికై నా ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇస్తే తప్ప నిల్వలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదని స్థానికులు అంటున్నారు. కొత్త ప్లాంట్ నిర్మించేదెలా..? నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి భౌగోళిక పరిస్థితులు అనువుగా ఉన్నాయి. దీంతో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై డిజైన్ కాంపెనీ ద్వారా త్వరలో సర్వే చేపట్టనున్నారు. అయితే యాష్పాండ్ మినహా మిగితా వన్నీ అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత బూడిద చెరువు 450 ఎకరాల్లో ఉండగా 800 మెగవాట్ల ప్లాంట్లు రెండు నిర్మిస్తే మరో 200 ఎకరాల్లో యాష్ పాండ్ ఏర్పాటుతో పాటు ప్రస్తుత బూడిదను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి నిల్వ ఉన్న బూడిదను ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు. కాంప్లెక్స్లో పరిధిలోని నాలుగు పాండ్లూ నిండిపోయాయి. సుమారు 10 కోట్ల టన్నుల బూడిద పేరుకుపోయినట్లు అంచనా. కొత్త ప్లాంట్ నిర్మిస్తే నాలుగూ చెరువుల్లోనూ నిల్వ ఉన్న బూడిదను తీయించాలి. ఈ విషయాన్ని జెన్కో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. – ఎం.ప్రభాకర్ రావు, సీఈ యాష్ పాండ్లకు వదిలే బూడిదను ఖాళీ చేయించడంలో కొన్నేళ్లుగా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. ఎప్పటికప్పుడు బూడిద తరలించకుండా రూ.కోట్ల వ్యయంతో చెరువు ఎత్తు పెంచే పనులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడున్న బూడిద ఖాళీ చేయాలంటే సంవత్సరాల పాటు పట్టనుండగా.. అంతవరకూ కొత్త ప్లాంట్లు నిర్మించే అవకాశం లేదని తెలుస్తోంది. బూడిద తరలింపు ప్రక్రియపై ఇటీవల రాజకీయ జోక్యం పెరిగింది. బూడిదను బినామీ పేర్లతో సొసైటీలకు అప్పగించి తరలించే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక గిరిజనులకే అవకాశం ఇవ్వాలని కొందరు కోర్టుకు వెళ్లగా తరలింపు ప్రక్రియ మందగించింది. కేటీపీఎస్ కాంప్లెక్స్లో నిండిన యాష్ పాండ్లు -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక బస్సులుచుంచుపల్లి: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం పరిసర ప్రాంత భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం, పాల్వంచ నుంచి అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నవరానికి డీలక్స్ బస్సు, పంచారామాలైన అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. వివరాలకు 90103 74644 నంబర్లో సంప్రదించాలని కోరారు. వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంకొత్తగూడెంఅర్బన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎస్.వి. వేణుగోపాలాచారి అన్నారు. సుజాతనగర్ సబ్ స్టేషన్ ఆవరణలో బుధవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదులు స్వీకరించాక మాట్లాడారు. వినియోగదారులు తమ సమస్యలను మొబైల్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్యలు తెలుసుకుని సత్వరం వాటిని పరిష్కరించేందుకే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, వర్షాకాలంలో లూజ్ లైన్లతో ప్రమాదం పొంచి ఉంటుందని, అలాంటి సమస్యలు ఉన్నచోట సరిచేయాలని అధికారులకు సూచించారు. సీజీఆర్ఎఫ్ టెక్నికల్ మెంబర్ కె.రమేష్, మెంబర్(ఫైనాన్స్) ఎన్.దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ ఎం.రామారావు, ఎస్ఈ మహీందర్, డీఈ రంగస్వామి, ఏడీఈ రవికుమార్, ఏఈలు నరసింహారావు, కిషన్ పాల్గొన్నారు. వేతనాల కోసం ధర్నాఅశ్వాపురం: అటవీ శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న సిబ్బంది వేతనాలు చెల్లంచాలంటూ అటవీ శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతేడాది కాలంగా వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, అశ్వాపురం రేంజ్, ఎఫ్డీఓ, డీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం వేతనాలు చెల్లిస్తామని అటవీ శాఖ కార్యాలయానికి పిలిపించారని, అయినా జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందని వివరించారు. -
పోక్సో కేసు నమోదు
కొత్తగూడెంటౌన్: బాలికను వేధించిన వ్యక్తిపై బుధవారం టూటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. రామవరం నాగయ్యగడ్డ బస్తీకి చెందిన పల్లపు సాగర్ అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఒప్పుకోకపోతే చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. కాపర్ వైరు చోరీకరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామం వీరాపురం క్రాస్ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రూ. 40 వేల విలువైన కాపర్ తీగను చోరీ చేశారు. బుధవారం ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతిజూలూరుపాడు: మండలంలోని గంగారంతండాకు చెందిన రైతు ఆంగోత్ కృష్ణకు సంబంధించిన దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో బుధవా రం మృతి చెందింది. మేత కోసం పొలంలో వదలగా ఎద్దు ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. కాపర్ వైర్ దొంగ పరారీజూలూరుపాడు: పంట పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ను చోరీకి పాల్పడిన దొంగ పరారీలో ఉన్నాడని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి బుధవారం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. 2010లో పలు గ్రామాల్లోని పంటపొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసంచేసి కొత్తగూడెం అశోక్నగర్కు చెందిన లారీ క్లీనర్ తమ్మయ్య నాయుడు శ్రీరామ్ కాపర్ వైర్ అపహరించాడు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కొద్ది రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత నిందితుడు బెయిల్పై విడుదలయ్యాడు. కోర్టు నిబంధనలను ఉల్లఘించి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో కొత్తగూడెం అదనపుకోర్టు శ్రీరామ్కు నోటీసులు జారీచేసింది. నిందితుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
నిబంధనలకు కట్టుబడిన వారికే పీఠం
● రాజ్యాంగ హక్కుల పరిరక్షణే లక్ష్యం ● ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం కొత్తగూడెంఅర్బన్/ఇల్లెందు : ఆరేళ్లుగా కాంగ్రెస్లో ఉంటూ బూత్ స్థాయి కార్యకర్తల వరకు పరిచయం ఉంటూ కాంగ్రెస్ నిబంధనావళికి అనుగుణంగా ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవి లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకులు జాన్సన్ అబ్రహం అన్నారు. బుధవారం ఆయన ఇల్లెందు, కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు కట్టబెట్టాలనే రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమని, అందుకోసమే రాహుల్గాంధీ దేశమంతా యాత్రలు చేపట్టారని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ అధిష్టానానికి అందజేస్తామని, కార్యకర్తలు, నాయకుల నుంచి తాము సేకరించిన అభిప్రాయాలను కూడా ఢిల్లీ స్థాయిలో చర్చించి, కులమతాలకు అతీతంగా అర్హులైన వారిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని వివరించారు. భద్రాద్రి జిల్లా ఎంతో ఆదర్శవంతమైనదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోనికి రావడానికి ఇక్కడి నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని ఎప్పటికీ మరువబోమని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. డీసీసీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి అభిప్రాయాలు అందించి సహకరించాలని కోరారు. ఆయా సమావేశాల్లో డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, టీపీసీసీ పరిశీలకులు ఈడ్పుగంటి సుబ్బారావు, నాయకులు సాగరిక, సంజీవ్, ధర్మారావు, మహ్మద్ఖాన్, నాగేందర్రెడ్డి, జేబీ శౌరి, ఆళ్ల మురళి, ఎడవల్లి కృష్ణ, తూము చౌదరి, కోనేరు సత్యనారాయణ, ఎన్. దుర్గాప్రసాద్, తోట లక్ష్మీ ప్రసన్న, రవి, ఏలూరి కోటేశ్వరరావు, యదల్లపల్లి అనసూర్య, బానోతు రాంబాబు, భూక్యా దళ్సింగ్ నాయక్, పులి సైదులు, డానియేల్ పాల్గొన్నారు. -
గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం
కొత్తగూడెంటౌన్: జిల్లాను గంజాయి రహితంగా మారుద్దామని ఎస్పీ రోహిత్రాజ్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై ఈనెల 15 నుంచి నవంబర్ 15 వరకు చైతన్యం పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని నివారించాలని, ఆ మత్తుకు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని అన్నారు. జిల్లాలో గంజాయి హాట్స్పాట్లలో నిత్యం తనిఖీలు చేపడుతున్నామని, మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గంజాయిని రవాణా చేస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, సతీష్కుమార్, ఎస్బీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందాలి
పాల్వంచ/భద్రాచలంటౌన్: ѧéÅ-Æý‡$¦-Ë$ {MîSyýl-ÌZÏ Õ„ýS-׿ ´÷…§éÌS° MýSÌñæ-MýStÆŠ‡ h¡‹Ù Ñ.´ë-sìæÌŒæ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l ÝùçÙÌŒæ ÐðlÌôæ¹ÆŠ‡ VýSÆŠḥÌŒæÞ MýSâêÔ>-ÌS-ÌZ »êòÜP-sŒæ-»êÌŒæ {Osñæ°…VŠæ¯]l$ {´ëÆý‡…-À…^éÆý‡$. ѧéÅ-Ǧ¯]l$-ÌS-™ø Ð]l¬^èla-sìæ…^éÆý‡$. ¿ýæ{§é-^èl-ÌS… Isîæ-yîlH {´ë…VýS-׿…-ÌZ° ¿ýæÐ]l-¯éÌS¯]l$ ç³ÇÖÍ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> hÌêÏ-ÌZ »êòÜPsŒæ »êÌŒæ AÀ-Ð]l–-¨®MìS Ð]l¬…O»ñæMìS ^ðl…¨¯]l òßæ^Œl-I&5 ¸û…yól-çÙ¯ŒS Ð]l¬…§ýl$MýS$ Ð]l_a…§ýl-¯é²Æý‡$. {MîSyé Ððl$sîæ-ÇĶæ$ÌŒæ, çÜ´ù-Çt…VŠæ Mø_…VŠæ íܺ¾…¨° ¸û…yól-çÙ¯ŒS §éÓÆ> HÆ>µr$ ^ólÝë¢-Ð]l$-¯é²Æý‡$. Isîæ-yîlH {´ë…VýS-׿…-ÌZ° °Æý‡$-ç³-Äñæ*VýS ¿ýæÐ]l-¯éÌS¯]l$ ѰÄñæ*-VýS…-ÌZMìS ™ólÐéÌS°, ¿ýæÐ]l-¯éÌZÏ ÝûMýS-Æ>ÅÌS MýSÌS-µ¯]lMýS$ D¯ðlÌS 31 Ð]lÆý‡MýS$ {ç³×ê ãMýS-Ë$ íܧýl®… ^ólĶæ*-ÌS° A«¨M>Æý‡$-ÌS¯]l$ B§ól-Õ…^é Æý‡$. WÇf¯]l$ÌS ¯]l$…_ õÜMýS-Ç…^ól ArÒ çœÌêÌS¯]l$ iïÜïÜ Mö¯]l$-VøË$ ^ólĶæ*-ÌS° B§ól-Õ…^éÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Isîæ-yîlH ï³K ¼.Æ>çßæ$ÌŒæ, çÜ»Œæ MýSÌñæ-MýStÆŠ‡ Ð]l$–×êÌŒæ {ÔóæçÙx, hÌêÏ Ä¶æ¬Ð]l-f¯]l {MîSyé Ô>QÌS A«¨M>Ç G….ç³-Æý‡…-«§éÐ]l$Æð‡yìlz, C™èlÆý‡ A«¨M>Æý‡$-Ë$ yólÑyŠæ-Æ>gŒæ, AÔZMŠS, Ð]l$«§ýl$-MýS-ÆŠæ, ^ðl…VýS-ÌŒæ-Æ>Ð]l#, Æý‡Ðól$-‹Ù, çÜÐ]l$ÃĶæ$Å, «§ýl°Ä¶æ*ÌS Ððl…MýS-sôæ-ÔèæÓÆý‡$Ï, çßæÇMýS–çÙ~ ¸û…yól-çÙ¯ŒS çÜ¿¶æ$Åyýl$ Ð]l$«§ýl$-çÜ*-§ýl¯ŒSÆð‡yìlz, {í³°Þ´ëÌŒæ OÐðl$¤Í ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ఆర్థికాభివృద్ధి సాధించాలి
భద్రాచలంటౌన్: గిరిజన యువత ఐటీడీఏ అందిస్తున్న వృత్యంతర శిక్షణలను సద్వి నియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి సాధించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నారు. వరంగల్లో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కాలేజ్లో నిర్వహించే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు ఎంపికై న గిరిజన యువకులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా శిక్షణ పూర్తిచేసుకుని జీవితంలో స్థిరపడాలని చెప్పారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు దగ్ధంభద్రాచలంఅర్బన్: పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కొండచిలువ హతందుమ్ముగూడెం: మండలంలోని అంజుబాక క్రాస్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దూరిన కొండ చిలువను స్థానికులు చంపేశారు. మంగళవారం రాత్రి సమయంలో కొండ చిలువ ఇంట్లో దూరి కోళ్లను తినేందుకు చూస్తుండగా కోళ్లు బాగా అరవడంతో గమనించి హతమార్చారు. రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలుపాల్వంచ: లారీ, ఆటో ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం నవభారత్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
అందరికీ పోషకాహారం అందించాలి
అశ్వారావుపేటరూరల్: అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ క్రమం తప్పకుండా పోషకాహారం అందేలా సిబ్బంది కృషి చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూఓ) స్వర్ణలతా లెనీనా అన్నారు. అశ్వారావుపేట రైతువేదికలో బుధవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ముందుగా సిబ్బంది ప్రదర్శించిన పోషకాహారం, చిరు ధాన్యాల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, పోషకాలు అధికంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పీహెచ్సీ వైద్యాధికారి రాందాస్నాయక్ మాట్లాడుతూ.. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. పోషణ లోపం ఉన్న పిల్లలను ఎన్ఆర్సీ కేంద్రాలకు పంపించాలని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు, సీడీపీఓ ముత్తమ్మ, ఏసీడీపీఓ అలేఖ్య, సూపర్వైజర్లు వరలక్ష్మీ, రమాదేవి, సౌజన్య పాల్గొన్నారు. డీడబ్ల్యూఓ స్వర్ణలతా లెనీనా -
పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించాలి
జూలూరుపాడు: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన ఏసీపీ సబ్బత్తి విష్ణుమూర్తి కుటుంబాన్ని బుధవారం ఆయన వెంగన్నపాలెంలో పరామర్శించారు. విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలూరుపాడు సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రతిపాదన వచ్చినా పార్లమెంట్లో చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. విద్యుత్ రెగ్యులేటరీ బిల్లుతో దేశంలోని విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే యూరియా కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నవంబర్ 26న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి యాసా నరేష్, గార్లపాటి వెంకటి, వల్లమల్ల చందర్రావు, బోడా అభిమిత్ర, బొల్లి లక్ష్మయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట్ -
66 గ్రాముల బంగారం స్వాధీనం
చర్ల: మండలంలోని గాంధీనగరంలో ఈ నెల 8న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. బుధవారం చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. సూరవీడుకు చెందిన ముత్యబోయిన ప్రేమ్చంద్ గొమ్ముగూడెం గ్రామ పంచాయతీ గాంధీనగరంలోని స్నేహితుడికి ఇంటికి వచ్చాడు. గాంధీనగరానికి చెందిన కోడిరెక్కల భాస్కర్రావు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.7.60 లక్షల విలువ చేసే 66.414 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. బాధితుడు ఈ నెల 10న ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మండలంలోని సుబ్బంపేట శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటాపురం వైపు నుంచి చర్లకు వస్తున్న ప్రేమ్చంద్ పోలీసులను చూసి పారిపోతుండగా వెండించి పట్టుకున్నారు. విచారించడంతో చోరీ విషయం వెల్లడించాడు. పోలీసులు బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్లను ఏఎస్పీ అభినందించారు. చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
కల్వర్టు పైనుంచి పడి మహిళ మృతి
పాల్వంచ: మద్యం మత్తులో మహిళ కల్వర్టు పైనుంచి కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో పాల్వంచలో నివాసం ఉండి, ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న షేక్ జానీ భార్య మెహబూబీ(35) డబ్బులు రావాల్సి ఉందంటూ పది రోజుల క్రితం పాల్వంచ వచ్చింది. అప్పటి నుంచి జయమ్మ కాలనీలో సోదరుడి ఇంటి వద్ద ఉంటోంది. డబ్బులు తీసుకుని విజయవాడ వెళ్తానంటూ మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కుంటినాగుల గూడెం సమీపంలో మద్యం తాగి అక్కడే స్థానికులతో కొంత సేపు గొడవ పడింది. ఆ తర్వాత రోడ్డు మూలమలుపు వద్ద పడిపోయింది. అటుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్, క్లీనర్ రాత్రి 11 గంటల సమయంలో గమనించి, ఆమెను వాహనాలు తొక్కి వెళ్లే ప్రమాదం ఉందని లేపి, పక్కనే ఉన్న కల్వర్టుపై కూర్చోబెట్టి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత మత్తులో ఉండి కల్వర్టు పైనుంచి కింద పడింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం సాయంత్రం స్థానికుల సమాచారంతో వచ్చి పోలీసులు బయటకు తీశారు. అయితే అప్పటికే మృతి చెందింది. ఈ విషయమై ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా.. మద్యం మత్తులో కల్వర్టు పైనుంచి కిందపడి మృతి చెందినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించామని తెలిపారు. ఫిర్యాదు వచ్చాక కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
‘ఉపాధి’తో పశువుల షెడ్లు..
● ఈజీఎస్ జాబ్కార్డు ఉన్న రైతులు అర్హులు ● నాటు కోళ్ల పెంపకానికీ షెడ్ల నిర్మాణం కరకగూడెం: కేంద్ర ప్రభుత్వం పశు సంపద పెంపకానికి తోడ్పాటునందిస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్లు నిర్మించుకునే అవకాశం కల్పించింది. నాటు కోళ్ల పెంపకానికీ షెడ్లు నిర్మించుకోవచ్చు. జిల్లాలో మండలానికి 20 యూనిట్ల చొప్పున మంజూరుకాగా, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన షెడ్లను ఇటీవల నిర్వహించిన ‘పనుల జాతర’ కార్యక్రమంలో అధికారులు ప్రారంభించారు. ఆధునిక షెడ్లలో సరైన వెంటిలేషన్, పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండటంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. షెడ్లలో మూత్రం శుభ్రం చేయడానికి ప్రత్యే క ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇవీ నిబంధనలు ఉపాధిహామీ జాబ్కార్డులు ఉన్న రైతులకు మాత్ర మే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జిల్లా వ్యా ప్తంగా 2.23లక్షల జాబ్కార్డులున్నాయి. షెడ్డు నిర్మాణా నికయ్యే వ్యయాన్ని ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం 100శాతం చెల్లిస్తుంది. ఇందులో కూలీల వేతనం, నిర్మాణ సామగ్రి ఖర్చులు కలిపి ఉంటా యి. మేకలు, గొర్రెల, కోళ్ల షెడ్ల నిర్మాణానికి రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు మంజూరు చేస్తారు. షెడ్లు నిర్మించుకున్నాక అధికారులు బిల్లులు చెల్లిస్తా రు. పంచాయతీ కార్యదర్శి/ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద అప్లికేషన్ ఫారం తీసుకుని పేరు, జాబ్ కార్డు నంబర్, పశువుల సంఖ్య, భూమి తదితర వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించాక క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలి స్తారు. అర్హులైతే అనుమతులు జారీ చేసి, ఉపాధి హామీ కింద పనులు ప్రారంభిస్తారు.ఉపాధిపథకం ద్వారా షెడ్డు నిర్మించుకున్నాం. షెడ్డులో వెంటిలేషన్, పారిశుద్ధ్యానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మా జీవాల ఆరోగ్యం బాగుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇచ్చింది. –చిర్రా లక్ష్మి, లబ్ధిదారులు, మోతె గ్రామం, కరకగూడెం ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేశాం. మెరుగైన షెడ్ల ద్వారా పశువుల ఆరోగ్యం బాగుంటుంది. –విద్యాచందన, డీఆర్డీఓ -
టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ
పాల్వంచరూరల్: పశువులకు సమయానికి టీకా వేస్తే గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు 7వ విడత గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని సోములగూడెం గ్రామంలో పశువులకు టీకా వేసి జిల్లా పశుసంవర్థకశాఖ అధి కారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 3.71లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు, దూడలు ఉన్నాయని తెలిపారు. అన్ని మండలాల్లో టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలో 60 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం పశువులకు టీకాలు వేసి భారత్ పశుధాన్ పోర్టల్లో వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉప సంచాలకులు డాక్టర్ సత్యప్రసాద్, మండల పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ జి.రమేష్, గోపాల మిత్రలు మహ్మద్ సాబీర్ పాషా, షేక్ అస్గర్, రాధారామ్, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు -
హెచ్ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం
దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావుకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. ఇన్ఫోసిస్, సీఎస్సార్ నిధులతో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ను, వాష్ బేషిన్ ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాలుగా పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీయించి మోటార్ ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల మొక్కలు నాటించారు. పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా హైదరాబాద్లోని డైరెక్టర్ కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రశంసా పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిఏఎస్పీ నరేందర్ చర్ల: ఆదివాసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ (ఆపరేషన్స్) నరేందర్ అన్నారు. మండలంలోని మారుమూల అటవీ ప్రాంత గ్రామం ఎర్రంపాడులో బుధవారం ఆయన భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి 250 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు పోలీసుశాఖ తరఫున అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలి పారు. సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వివేక్రంజన్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల రక్షణకు సిబ్బందిభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల రక్షణకు తెలంగాణ టూరిజం శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన పోలీస్ సిబ్బంది నియమించింది. సిబ్బంది బుధవారం నుంచి విధులకు హాజరయ్యారు. ముందుగా ఆలయ ఈఓ దామోదర్రావును కలువగా ఆయన వారికి విధులను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోడి పుంజులు చోరీఅశ్వారావుపేటరూరల్: ఖరీదైన పందెం కోడి పుంజులను అపహరిస్తున్న దొంగలను గుర్తించిన గ్రామస్తులు బుధవారం ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఎస్సై అఖిల కథనం ప్రకారం.. భద్రా చలంలోని జగదీశ్ కాలనీకి భార్యాభర్తలు కట్టా వెంకటేష్, వెంకటలక్ష్మి కలిసి అశ్వారావుపేట మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామంలో మూడు కోడి పుంజులను చోరీ చేశా రు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు వారిని గమనించి వెంబడించారు. వెంకటేష్ పారి పోగా, భార్య వెంకటలక్ష్మిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా, ఎస్సై అఖి ల చేరుకుని మహిళను అదుపులోకి తీసుకు ని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం చోరీకి పాల్ప డిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రిసార్ట్కు బాలికతో వచ్చిన యువకుడు?యువకుడిని ఠాణాకు తరలించిన పోలీసులు? ములకలపల్లి: మండల సరిహద్దులోని ఓ రిసా ర్ట్ గదిలో మైనర్ బాలిక ఓ యువకుడితో ఉండగా బంధువులు పట్లుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ములకలపల్లి శివారులోని రిసార్ట్కు ఓ యువకుడు, ఉమ్మడి పూసుగూడెం పంచాయతీకి చెందిన మైనర్ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న బాలిక బంధువులు రిసార్ట్కు చేరుకుని యువకుడిని ప్రశ్నించినట్లు సమాచారం. బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లి కుటుంబీకుల వద్దకు చేర్చినట్లు తెలి సింది. విషయం వెలుగులోకిరాగా, ఘటనా ప్రదేశానికి వచ్చిన పోలీసులు వరంగల్ ఏరి యాకు చెందిన యువకుడిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ఈ వ్యవహా రంపై ఎస్సై మధుప్రసాద్ను వివరణ కోరగా.. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని తెలిపారు. రిసార్ట్ నిర్వాహకులను వివరణ కోరగా.. రిసార్ట్ చూసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తాము ఎవరికీ గది కేటాయించలేదని పేర్కొన్నారు. -
44.6 కేజీల గంజాయి స్వాధీనం
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనాలపై గంజాయి తరలిస్తుండగా పట్టణంలోని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ తిరుపతి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరి, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వరుసగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఆపి తనికీ చేయగా 44.6 కేజీల ఎండు గంజాయి దొరికింది. సూర్యాపేట జిల్లాకు చెందిన బానోతు మహేశ్, గుగులోతు అశోక్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిజ్వాన్పాషా, ఇమ్రాన్పాషా, మంజునాథ, కేశవ్ కలిసి.. ఒడిశాలోని సీలేరులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, బెంగళూరుకు తరలిస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. నిందితులను భద్రాచలం ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో అప్పగించామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. తనిఖీల్లో ఎకై ్సజ్ హెడ్కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీశ్, విజయ్, వీరబాబు, ఉపేందర్ పాల్గొన్నారు. -
అంతర్ కళాశాలల టోర్నీలో జయకేతనం
సూపర్బజార్(కొత్తగూడెం): వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి కాలేజీలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించిన మహిళల అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని 100 కళాశాలల విద్యార్థులు పాల్గొనగా, సింగరేణి కళాశాల విద్యార్థినులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకున్నారు. వివిధ అంశాల్లో ఎం.ఇందు, ఎం.సంగీత, ఎం.సింధు, కుమారి, డి.పూజిత విజేతలుగా నిలిచారు. అలాగే, బెంగళూరులో జరగనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి టోర్నీకి పలువురు ఎంపికయ్యారు. విద్యార్థినులను సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు కాలేజీ అధ్యాపకులు డాక్టర్ కె.సావిత్రి, డాక్టర్ కె.రాజ్యలక్ష్మి తదితరులు మంగవారం అభినందించారు. -
108 వాహనంలో ప్రసవం
ములకలపల్లి: 108 వాహనంలో మహిళ ప్రసవించించిన ఘటన మండలంలోని చింతపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవ్వా మౌనికకు సోమవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆశ కార్యకర్త 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది గ్రామానికి చేరుకొని, గర్భిణిని వాహనంలో తీసుకెళ్తుండగా మధ్యలో నొప్పులు అధికం కావడంతో రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపి ప్రసవం చేశారు. మౌనిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, మంగపేట పీహెచ్సీకి తరలించామ ని ఈటీఎం కళాధర్, పైలట్ రాజా తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సాహసం పినపాక: విద్యుత్ పునరుద్ధరించేందుకు ఈ–బయ్యారం విద్యుత్ ఉద్యోగులు సాహసం చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, పిడుగులకు మణుగూరు నుంచి బయ్యారం వచ్చే 33 కేవీ లైన్లో ఐలమ్మనగర్ చెరువు, తెర్లాపురం చెరువుల సమీపంలోని స్తంభాల్లో ఇన్సులేటర్ దెబ్బతిన్నది. మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా లైన్మెన్లు వెంకట్రావు, స్వామి, ఏఎల్ఎం కామేశ్ తెప్పపై వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఉద్యోగులను పలువురు అభినందించారు. కిన్నెరసానిలో గుర్రపుడెక్క..పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయంలో గుర్రపుడెక్క మొక్కలు పేరుకుపోయాయి. సో మవారం కురిసిన భారీ వర్షానికి ఎగువనుంచి వచ్చిన వరదలో ఇవి కొట్టుకువచ్చి, నీటిపై ప రుచుకుంది. దీంతో నీరు పచ్చగా కనిపిస్తోంది. ఇలా వస్తున్న మొక్కలను గేట్ల మద్య నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అండర్–14 కబడ్డీ జట్ల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల విభాగంలో అండర్–14 కబడ్డీ జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.రామారావు ప్రకటించగా.. ఈ జట్లు 16 నుంచి సంగారెడ్డి జిల్లా పఠాన్చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా బా లుర జట్టుకు బి.ఓంకార్తీక్, పి.సంతోష్, డి.ధనుష్, వి.జయప్రకాష్, బి.ఆకాష్, ఎ.మనోజ్, ఎ.అరుణ్, బి.అంజిబాబు, ఎ.శివ, ఎస్.గోపి, పి.బాబు, ఎస్.ప్రతీక్, బాలికల జట్టుకు సీహెచ్.గాయత్రి, డి.యామినిశ్రీ, పి.ప్రవల్లిక, బి.వర్ష, పి.సింధుజ, ఎస్కే ఫరీదా, కె.భవాని, పి.జాస్మిన్, ఎం.లిఖిత, కె.వినయశ్రీ, జి.సృజన, ఎం.శ్రీజ ఎంపికయ్యారని వెల్లడించారు. సీట్ల భర్తీకి 17న తుది గడువుపాల్వంచరూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–2026 విద్యా ఏడాదికి గాను ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్దేశించారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమన్వయాధికారి ఎం.అన్వేశ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష రాసి, దరఖాస్తు చేయని విద్యార్థులు, పరీక్ష రాయని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసినవారు హాల్టికెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలని, ప్రవేశ పరీక్ష రాయనివారు దర ఖా స్తు చేసుకుంటే కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని ఆయన వివరించారు. -
కారు బానెట్లో గంజాయి తరలింపు !
పాల్వంచ: గంజాయి స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో లారీల కింద అరలు ఏర్పాటు చేసి తరలించగా ఇప్పుడు కారు బ్యానెట్లో గంజాయి తరలిస్తున్నట్లు బయటపడింది. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు మంగళవారం కారు (ఓడీ 30జీ 8729) ముందు ఇంజన్ భాగంలో గంజాయి ప్యాకెట్లు దాచి తరలిస్తున్నారు. పాల్వంచకు కారు చేరుకోగా ఇంజన్ వేడికి గంజాయి అంటుకుని పొగలు మొదలయ్యాయి. దీంతో వాటర్ సర్వీస్ సెంటర్కు తరలించి బానెట్ తెరవగానే గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. సిబ్బంది ఆరా తీస్తుండగా ఓ మహిళతో కూడిన ముగ్గురు పరారయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లర్ల కోసం గాలిస్తున్నట్లు పాల్వంచ ఎస్ఐ సుమన్ తెలిపారు. పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు బానెట్లో గంజాయి ప్యాకెట్లు పెడుతూ, పట్టణాలు దాటాక బయటకు తీస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇంజన్ వేడికి మంటలు అంటుకోవడంతో స్మగ్లర్ల వ్యూహం బెడిసికొట్టింది. వేడికి నిప్పంటుకుని పొగలు రావడంతో పరారీ -
గుడుంబా స్థావరాలపై దాడులు
బూర్గంపాడు: మండలంలోని సారపాక, ఇరవెండి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి, బెల్లం పానకం ధ్వంసం చేశారు. భారీగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతి వివరాలు వెల్లడించారు. సారపాక, ఇరవెండి గ్రామాల్లో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది సుమారు 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 9 మంది (మహిళలు సైతం)ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారి వద్ద నుంచి సుమారు 113 లీటర్ల నాటుసారా, 3 సెల్ఫోన్లు చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, భద్రాచలం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్కు తరలించామని ఏఈఎస్ తిరుపతి తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1800 – 4252523కు సమాచారమివ్వాలని ఆయన సూచించారు. దాడుల్లో హెడ్కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీశ్, విజయ్, వీరబాబు, ఉపేందర్ పాల్గొన్నారు. 113 లీటర్ల నాటుసారా స్వాధీనం -
దీపావళికై నా వెలుగు నిండేనా?
● ఈ పండుగ పూట కూడా పస్తులేనా? ● గెస్ట్ లెక్చరర్ల వేతనాలపై పట్టించుకోని పాలకులు, అధికారులు టేకులపల్లి: పాలకుల పట్టింపు లేక, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గెస్ట్ లెక్చరర్లు పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో గెస్ట్ లెక్చరర్లుగా చేరి రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల బాధలు వర్ణనాతీతం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ అధ్యాపకులు పనిచేస్తుండగా ఇటీవల చేపట్టిన నియామకాల్లో రెగ్యులర్ అధ్యాపకులు నియమితులు కావడంతో 1,200 మంది గెస్ట్ లెక్చరర్లు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 54 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తుండగా ఈ విద్యా సంవత్సరం నియామకాల కారణంగా 24 మంది ఇంటిబాట పట్టారు. వీరికి డిసెంబర్ 15 నుంచి మార్చి 31 వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. వీరితో పాటు కాలేజీల్లో కొనసాగుతున్న గెస్ట్ లెక్చరర్లకు కూడా వేతనాలు లేవు. పెండింగ్ వేతనాలు విడుదల కాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నట్లు పలువురు వాపోయారు. గెస్ట్ అధ్యాపకులకు పీరియడ్కు రూ.390 చొప్పున నెలకు 72 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. నెలలో 72 పీరియడ్లు బోధిస్తేనే రూ.28,080 వేతనం వస్తుంది. ఇది కూడా నెలనెలా రాదు. మూడు నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చేవారు. అసలే చాలీచాలని వేతనం, ఆపై ఆలస్యంగా వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. దసరా పండుగకు వేతనాలు వస్తాయని ఎదురు చూసినా వారికి నిరాశ ఎదురైంది. కనీసం దీపావళికై నా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని గెస్ట్ అధ్యాపకులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహించాం. రెగ్యులర్ లెక్చరర్లు రావడంతో మాకు పని లేకుండా పోయింది. చేసిన పనికి సంబంధించి 2024 డిసెంబర్ 15 నుంచి మార్చి 31 వరకు వేతనం నేటికీ ఇవ్వలేదు. దసరా పండుగ సమయంలోనూ రాలేదు. కనీసం దీపావళికై నా వేతనాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ వేతనాలు ఇచ్చేలా కృషి చేయాలి. – బాదావత్ రంజిత్కుమార్, టేకులపల్లి -
రెండు ద్విచక్రవాహనాలు ఢీ..
రిటైర్డ్ ఏఎస్ఐ మృతి అశ్వారావుపేటరూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొ న్న ఘటనలో రిటైర్డ్ ఏఎస్ఐ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఏపీలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మున్సి పాలిటీ పరిధిలోని పేరాయిగూడేనికి చెందిన, రిటైర్డ్ ఏఎస్ఐ నార్లపాటి జగ్గారావు (63) ద్విచక్రవాహనంపై ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో జల్లేరు వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగ్గారావుకు తీవ్ర గాయాలు కాగా జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జగ్గారావు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పామాయిల్ గెలల చోరీపై కేసు ములకలపల్లి: పామాయిల్ తోటలో గెలలు అక్రమంగా నరికి, తరలించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామానికి చెందిన కీసరి లక్ష్మణ్రావు పామాయిల్ తోటలో ఈ నెల 10న పక్వానికి వచ్చిన 5 టన్నుల గెలలు చోరీకి గురయ్యాయి. సోయం నాగేశ్వరరావు, సోయం లలిత గెలలు చోరీ చేశారని భాస్కర్రావు మంగళవారం లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. చోరీలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్ ముఠాలో భద్రాద్రి జిల్లా వాసులు నర్సంపేటరూరల్: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. నర్సంపేట పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మాదాసు నవీన్, మాదాసు భార్గవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండాయిగూడెంనకు చెందిన కుంజా విజయ, పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 20న నర్సంపేటలోని పాకాల సెంటర్లో తాళం వేసి ఉన్న దుకాణంలో ఆభరణాలు అపహరించారు. అంతకుముందు, మహబూబాబాద్, ఖానాపురం మండలం బుధరావుపేటలో చోరీలు చేసిన ఈ ముఠా.. ఆభరణాలను విక్రయించేందుకు మహబూబాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. నర్సంపేటలో తనిఖీలు చేస్తుండగా వీరిపై అనుమానంతో ప్రశ్నించగా చోరీల విషయం బయటపడింది. దీంతో ముఠా నుంచి రూ.4.30 లక్షల విలువైన ద్విచక్రవాహనం, ఆటో, ఐదు సెల్ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు రవికుమార్, గూడ అరుణ్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులంటూ ప్రచారంములకలపల్లి: ములకలపల్లి మండలంలో ఏసీబీ దాడులంటూ మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. రెవెన్యూ శాఖతో పాటు, వివిధ విభాగాల ఉద్యోగులపై ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. చివరకు ఎటువంటి దాడులు లేకపోవడంతో ఆయా శాఖల ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్కాల్వలో ఆరు రోజుల క్రితం స్నానం కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఖమ్మం వైఎ స్సార్ నగర్కు చెందిన ఎలగందుల వెంకన్న(60) కాల్వలో స్నానా నికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యా డు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ సమీపాన కాల్వలో మంగళవారంమాయన మృతదేహాన్ని గుర్తించిన స్థానాకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యా న బయటకు తీసి ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. -
వాణి వినేవారేరి?
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మసకబారుతోంది. తమ సమస్యలు నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్న ప్రజలకు ప్రజావాణి కార్యక్రమం వేదికగా మారింది. అయితే గత కొంతకాలంగా కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దుచేసి ప్రజల సౌకర్యార్థం కొత్తగూడెం, భద్రాచలంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు డివిజన్ స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో మాజరు కాకపోతుండగా ప్రజలు సైతం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కొంతమంది కలెక్టరేట్కు వెళ్లి ఇన్వార్డులో ఫిర్యాదులు ఇస్తున్నా వాటిని అధికారులు అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించినప్పుడు జిల్లా నలుమూలల నుంచి వచ్చి సమస్యలపై దరఖాస్తులు అందజేసేవారు. నేరుగా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్కు సమస్యలు చెబితే అవి వెంటనే పరిష్కారం అయ్యేవి. ఒకవేళ మండలస్థాయి సమస్య అయితే సంబంధిత తహసీల్దార్ లేదా ఎంపీడీఓ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్య వివరించి దరఖాస్తులను వారికి ఎండార్స్ చేసేవారు. దీంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేవారు సంతృప్తి చెందేవారు. అందుబాటులో ఉండని అధికారులు.. ఇటీవలి కాలంలో జిల్లా ఉన్నతాధికారులు తరచూ వివిధ పనులపై జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్తుండడంతో కలెక్టరేట్లో అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు ప్రజల సౌకర్యార్థం అంటూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ కూడా డివిజన్ స్థాయి అధికారులు కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులు, సిబ్బంది మాత్రమే వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ప్రజలు అటు వెళ్లేందుకే ఆసక్తి చూపకపోగా.. ప్రజావాణి కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించాలని, నేరుగా కలెక్టరే వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించాలి. ప్రజలు ఎంతో ఆసక్తితో ప్రజావాణి కోసం ఎదురు చూసేవారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించేవారు. వందలాది మంది వచ్చి దరఖాస్తులను అందజేసే వారు. కలెక్టర్ స్పందించి ప్రజావాణిని కలెక్టరేట్లోనే నిర్వహించాలి. – గూడ విజయ, కూలీలైన్, కొత్తగూడెంపేదల సమస్యలకు పరిష్కా వేదికగా ఉన్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోనే కొనసాగించాలి. వందలాది మంది ప్రజావాణి కోసం ప్రతి సోమవారం ఎదురుచూస్తుంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్లు సక్రమంగా జరగడం లేదు. కలెక్టర్ స్పందించి ప్రతి సోమవారం ప్రజావాణిని కలెక్టరేట్లోనే కొనసాగించాలి. – బి. లాలు, గుండాలకలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించకపోవడంతో నిరాశగా ఉంది. కలెక్టరేట్కు వస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేవి. ఇటీవల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించక పోవడంతో చాలామంది అసంతృప్తికి లోనవుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రజావాణి నిర్వహించాలని కోరుతున్నాం. – ముర్రం వీరభద్రం, కొత్తపల్లి, దుమ్ముగూడెం మండలం -
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశంసూపర్బజార్(కొత్తగూడెం): వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైతే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్వం క్వింటా రూ. 2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, సన్న ధాన్యానికి అదనంగా రూ. 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆన్లైన్లో నమోదు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను అకారణంగా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆయా శాఖల అధికారులు రుక్మిణి, త్రినాథ్బాబు, శ్రీనివాస్, బాబురావు, వెంకటరమణ, మనోహర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ భవన సందర్శన కొత్తగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామవరం క్యాంపస్ని హాస్టల్ భవనాన్ని కలెక్టర్ పాటిల్ మంగళవారం సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్థలానికి హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు విజయలక్ష్మి, శ్రీలత, బీసీ గురుకుల ఆర్సీఓ రాంబాబు, సతీష్కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను నిర్మూలిద్దాం కొత్తగూడెంఅర్బన్: మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా చాలా పద్ధతుల్లో జరుగుతోందని, అందరం కలిసి నివారించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంఓ నాగరాజు, ప్రజ్వల కో–ఆర్డినేటర్ శ్రావ్యశృతి తదితరులు మాట్లాడగా చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని, పిల్లల సామర్థ్యాల పెంపుదల కోసం కృషి చేసేలా ఉపాధ్యాయులను ఉత్తేజ పరచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. నిరంతరం ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఉతమ ఫలితాలు రాబట్టేలా చూడాలని కోరారు. పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. -
అటవీ క్రీడా పోటీలకు 37 మంది ఎంపిక
పాల్వంచరూరల్ : ఇటీవల కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి అటవీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన 37 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. హైదరాబాద్లోని ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో వీరు పాల్గొంటారని వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు, పాల్వంచ ఎఫ్డీఓ దామోదర్రెడ్డి తెలిపారు. జాతీయ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సూపర్బజార్(కొత్తగూడెం): అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్ కళింగ స్టేడియంలో సోమవారం రాత్రి ముగిసిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కరకగూడేనికి చెందిన తోలెం శ్రీతేజ స్వర్ణ పతకం సాధించిందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీతేజను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం అభినందించారు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. శ్రీతేజ మాట్లాడుతూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రోత్సాహంతో స్వర్ణ పతకం సాధించానంటూ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామరెడ్డి, కోచ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు బూర్గంపాడు విద్యార్థిని.. బూర్గంపాడు: బూర్గంపాడుకు చెందిన మేకల సృజన రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న సృజన ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. -
22 నుంచి కార్తీక మాసోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోగల శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామి వారికి నెలరోజుల పాటు తులసీ ఆరాధన, వేకువజామున దీపారాధనలు, రుద్రాభిషేకం, కార్తీక మాస నిత్యాభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే సోమవారాలు, ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు, మాస శివరాత్రి రోజున స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటాయని పేర్కొన్నారు. ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలకు ఆహ్వానంకొత్తగూడెంటౌన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపేలా ఇటీవల తీసిన మూడు ఫొటోలే కాక మూడు నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 25 తేదీలోగా షార్ట్ ఫిల్మ్ పెన్డ్రైవ్, గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు తీసిన ఫొటోలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అలాగే, డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలనే అంశాలపై విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాసిన వ్యాసాలను ఈనెల 28వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురికి బహుమతులు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు 87126 82121 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు జాబ్ మేళామణుగూరు రూరల్ : మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీ పరిధిలో గల మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ గిరిజన యువతకు మెదక్ ఐటీసీ, ఇంటిగ్రేటెడ్ కన్జ్యూమర్ గూడ్స్ తయారీ, లాజిస్టిక్ (ఐసీఎంఎల్) గండుపల్లి మెదక్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ఒకేషనల్తో పాటు ఐటీఐ చేసి, 18 నుంచి 29 సంవత్సరాలు ఉన్న వారు మిషన్ ఆపరేటర్ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. మొత్తం 40 సీట్లలో గిరిజన మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి గల గిరిజన యువత ఈనెల 15న జాబ్మేళాకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు (ఐసీఎంఎల్) ఐటీసీ మెదక్ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 16న కొత్తగూడెంలో..సింగరేణి(కొత్తగూడెం): మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ పరిధిలో ఖాళీగా ఉన్న 2,190 పోస్టుల భర్తీకి ఈనెల 16న కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 24 – 43 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగులు, డీగ్రీ, ఐటీఐ, బీటెక్, ఎంటెక్, ఏఎన్ఎం, జీఎన్ఎం కోర్సులు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీర్ పార్క్కు పోలీస్ రక్షపాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని డీర్పార్కు వద్ద రక్షణ కోసం ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించారు. సెలవురోజుల్లో సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుందని, వైల్డ్లైఫ్ సిబ్బందికి దుప్పుల ఆలనా పాలనతోనే సరిపోతుందని, పర్యాటకుల భద్రత కోసం పోలీసులను ఏర్పాటు చేశామని ఎఫ్డీఓ బి.బాబు తెలిపారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుష కానిస్టేబుళ్లు ఉండగా వైల్డ్లైఫ్ చెక్పోస్టు వద్ద ఒకరు, డీర్పార్కు వద్ద ఒకరు, బోటింగ్ పాయింట్ వద్ద మరొకరు విధులు నిర్వహిస్తారని వివరించారు. -
చిక్కులకు చెక్ !
సాక్షి ప్రతినిఽధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా అధికారులు రైల్వే శాఖతో చర్చించగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో ఎదురుగడ్డ – హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ఆరంభంలోనే బాటిల్ నెక్గా ఉన్న స్టేషన్ ప్రహరీని వెనక్కు జరిపేందుకు రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. విస్తరణకు రైల్వే అడ్డంకి.. ఈ రహదారి విస్తరణకు గడిచిన ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సూపర్బజార్ – న్యూగొల్లగూడెం రోడ్డుకు ఒకవైపు భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ ప్రహరీ ఉండగా.. మరోవైపు బడే మసీద్తో పాటు చిన్నబజార్, పెద్దబజార్, నేతాజీ మార్కెట్లకు సంబంధించిన దుకాణ సముదాయాలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డును విస్తరించడం కష్టంగా మారింది. పలుమార్లు నిధులు మంజూరైనా తన పరిధిలోని స్థలాన్ని ఇచ్చేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలపలేదు. దీంతో రైల్వే ప్రహ రీ దాటిన తర్వాతనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణకు తాము కోల్పేయే స్థలానికి పరిహారంగా మరో చోట స్థలం ఇవ్వాలంటూ రైల్వేశాఖ సూచనలు చేసింది. దీంతో గతేడాది కారేపల్లి మండలంలో 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించినా రైల్వేబోర్డు నుంచి సానుకూల స్పందన రాలేదు. ఖమ్మంలో ఎకరం.. రోడ్డు విస్తరణ కోసం రైల్వేశాఖకు అనువైన స్థలం ఇచ్చేందుకు ఏడాది కాలంగా పలు స్థలాలను పరిశీలించారు. చివరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో త్రీ టౌన్ పోలీస్స్టేషన్ ఏరియాలో నిరుపయోగంగా ఉన్న ఎకరం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రైల్వే ట్రాక్కు పక్కనే ఉన్న ఈ స్థలం తీసుకునేందుకు రైల్వేశాఖ సైతం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు బదులుగా కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ ఆరంభం నుంచి నేతాజీ మార్కెట్ వరకు 540 గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రోడ్డును పది గజాల మేరకు విస్తరించే వీలు కలిగింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రైల్వేశాఖతో లిఖితపూర్వక సంప్రదింపులు ప్రారంభించింది. లాంఛనాలన్నీ పూర్తయితే అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కానుంది. ఈ రోడ్డు విస్తరణ కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రైల్వేశాఖతో పలుమార్లు చర్చించారు. ఆర్టీసీ బస్సులకూ అవకాశం.. గతంలో కొత్తగూడెం – ఇల్లెందు మధ్య నడిచే ఆర్టీసీ సర్వీసుల్లో కొన్నింటిని హేమచంద్రాపురం – కారుకొండ రామవరం మీదుగా నడపాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే రైల్వేస్టేషన్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా ఈ మార్గంలో ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవడంతో పాటు మహాలక్ష్మి పథకం మరింత చేరువవుతుంది. అంతేకాక ఈ మార్గం ఇల్లెందు, టేకులపల్లికి దగ్గరి దారిగా కూడా ఉంటుంది. ఇల్లెందు క్రాస్రోడ్తో పోల్చితే కనీసం ఐదు కిలోమీటర్ల దూరాభారం తగ్గుతుంది.కొత్తగూడెం నగరంలో సూపర్బజార్ సెంటర్ ప్రధాన కూడలిగా ఉంది. ముఖ్యంగా భద్రాచలంరోడ్ స్టేషన్ ప్రాంగణానికి సమీపంలో చిన్న బజార్, పెద్దబజార్, నేతాజీ మార్కెట్ ఏరియాలు ఉన్నాయి. ఈ మార్కెట్లో ఉన్న దుకాణాలకు అవసరమైన సరుకులను నిల్వ చేసే గోదాములు ఇదే రోడ్డులోని న్యూగొల్లగూడెం – ఎదురుగడ్డ – హేమచంద్రాపురం వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ రహదారి 30 ఫీట్లకు మించి లేకపోవడంతో సగటున ప్రతీ ఇరవై నిమిషాలకు ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో, సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ఈ మార్గంలో ప్రయాణం చేయడమంటే కత్తిమీద సామే అవుతోంది. రాత్రి 8 గంటలకు సింగరేణి రైలు వచ్చినప్పుడైతే ఈ రోడ్డు, సూపర్బజార్ సెంటర్లో ఏర్పడే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో పరిష్కారం కానున్న ట్రాఫిక్ సమస్య -
యూనివర్సిటీ అభివృద్ధి అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: యూనివర్సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని.. తద్వారా బోధన, పరిశోధనల్లో అగ్రగామిగా నిలుస్తామని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, తరగతి గదులు, బోధనను పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, తద్వారా వారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు, ఉద్యోగులు శ్రీనివాస్, రవి, కె.వెంకటనరసయ్య పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్లో భాగస్వాములు కావాలి ఖమ్మం రాపర్తినగర్: ప్రతీ విద్యార్థి జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో భాగస్వాములయ్యేలా అధ్యాపకులు అవగాహన కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాపరెడ్డి సూచించారు. ఖమ్మంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్పై విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా అధ్యాపకులు చొరవ చూపాలన్నారు. యూనివర్సిటీ పరిధిలో అత్యధికంగా కళాశాలలు కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినా.. గత ఏడాది నుంచి విస్తృతం చేశామన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడారు. భద్రాద్రి జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆనంద్బాబు, ప్రియదర్శిని, గాయత్రి డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు నవీన్బాబు, కె.సునీల్కుమార్, డైరెక్టర్ కుటుంబరావు, ఎన్ఎస్ఎస్ పీఓలు విల్సన్, ఎస్.జయప్రద తదితరులు పాల్గొన్నారు.కేయూ వైస్ చాన్స్లర్ ప్రతాపరెడ్డి -
చారిత్రక సభకు సన్నద్ధం కావాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శత వసంత ఉత్సవాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్నందున పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నాటి భానుప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. వందేళ్ల కమ్యూనిస్టుల పోరాట చరిత్ర, త్యాగాలను నేటి తరానికి తెలియజేసేందుకు శత వసంత సంబరాల ముగింపు వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మందితో జరిగే బహిరంగసభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రజలు తరలివచ్చేలా ప్రత్యేక కళారూపాలతో ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని పార్టీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించిన కూనంనేని... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా జరిగే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
కుండపోత వర్షం
● ఉప్పొంగిన వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయం ● రహదారులపైకి వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం సాక్షి నెట్వర్క్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు అలుగు పొంగాయి. పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలుచోట్ల రోడ్లపైకి వరదనీరు చేరింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, జల్లేరు, ఏడుమెళికల వాగులు ఉధృతరూపం దాల్చాయి. ఆళ్లపల్లి–కొత్తగూడెం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ● మణుగూరులో భారీ వర్షం కురిసింది. మున్సిపాలిటీలోని పలు వీధుల్లోకి వరద నీరు చేరింది. మంగళగట్టు, గాంధీ బొమ్మసెంటర్, వినాయకనగర్, శ్రీశ్రీ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు నీట మునగడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. శాంతినగర్లో ఇళ్లను, వాగు మల్లారం డబుల్ బెడ్రూం సముదాయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. వాసవీ సురక్షా బస్టాండ్ వద్ద కార్గో కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ నరేశ్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. సింగరేణిలో ఓబీ, బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పూనెం వారి గుంపు నివాసాలు మునుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పారు. ● అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వెళ్లే మార్గంలో నారంవారిగూడెం వద్ద వరదనీరు చేరి జాతీయ రహదారి వాగును తలపించింది. కాంట్రాక్టర్ల్ నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ బానోతు నాగరాజు వెళ్లి వరదనీరు వెళ్లదీసే చర్యలు చేపట్టారు. పెదవాగు ప్రాజెక్ట్ రింగ్బండ్కు 6.1 మీటర్ల మేర వరద పోటెత్తడంతో మూడు గేట్లను ఎత్తివేసి నీటిని గోదావరిలోకి వదిలారు. ● దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద నారచీరల ప్రాంతం జలమయంగా మారింది. సీతవాగుకు భారీగా వరద నీరు చేరడంతో సీతమ్మ విగ్రహం నీట మునిగింది. ● పినపాక మండలం సాంబయ్యగూడెం సమీపంలో రోడ్డుపై వరద నీరు చేరి మణుగూరు–ఏటునారుగారం మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతల బయ్యారం, వెంకటరావుపేట గ్రామాల్లో మిర్చి పంట నీట మునిగింది. కరకగూడెం మండలంలో పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. పెద్దవాగు, బూడిదవాగు తదితర వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరి పొలం నీట మునిగింది. అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లో కూడా వాగులు ఉధృతంగా ప్రవహించాయి. తుమ్మలచెరువు అలుగు రెండు అడుగులుమేర ప్రవహిస్తోంది. -
మక్కలు కొంటారా.. కొనరా?
● జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు ● నూర్పిళ్లు పూర్తి చేసి గింజలు ఆరబెడుతున్న రైతులు ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రకటించని మార్క్ఫెడ్ ● అదే అదునుగా తక్కువ ధరకు దక్కించుకునేలా వ్యాపారుల యత్నంఇల్లెందురూరల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సారంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంటోంది. అధిక వర్షాలు, వాతావరణ ప్రతికూలత నడుమ సాగు చేసిన రైతులకు చివరకు గిట్టుబాటు ధర కూడా లభించడంలేదు. గతేడాది మిర్చి, పత్తి సాగులో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. జిల్లాలో మొక్కజొన్న లక్ష ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఖరీఫ్లో మొక్కజొన్న ఎకరం విస్తీర్ణంలో 25 క్వింటాళ్లు, రబీలో 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఈ దఫా ఎకరానికి అత్యధికంగా 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో ప్రస్తుత సీజన్లో కనీసం 15 లక్షల క్వింటాళ్ల మక్కలు ప్రస్తుతం మార్కెట్కు చేరే అవకాశం ఉంది. పెరిగిన పెట్టుబడి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తలేదు. రెండో దఫా విత్తాల్సి రావడంతో పెట్టుబడి భారం పెరిగింది. మొక్క ఎదుగుతున్న దశలో వర్షాభావం తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత అధిక వర్షాలు కోలుకోకుండా చేశాయి. ప్రధానంగా కంకి పాలుపోసే దశలో, గింజ పక్వానికి వచ్చే దశలో ప్రతికూల వాతావరణం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15 క్వింటాళ్లకు పడిపోయింది. ధర తగ్గిస్తున్న దళారులు ఈ సారి ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400గా నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కాకపోవడంతో దళా రులు మక్కల ధరను తగ్గించేశారు. క్వింటాల్కు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు చెల్లిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది. -
గ్రామాల్లో అవగాహన కల్పించాలి
చుంచుపల్లి: వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ కేన్సర్, బీపీ, షుగర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆహారపు అలవాట్లను సైతం సూచించాలన్నారు. కేన్సర్, బీపీ, షుగర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి, డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు మధువరణ్, శ్రీకాంత్ ఫ్రంట్లైన్ వర్కర్లు పాల్గొన్నారు. మేళ్లమడుగులో పూరిల్లు దగ్ధంకాలిబూడిదైన సర్టిఫికెట్లు, నగదు, సామగ్రి టేకులపల్లి: అగ్ని ప్రమాదంలో సోమవారం పూరిల్లు దగ్ధమైంది. మండలంలోని మేళ్లమడుగు గ్రామానికి చెందిన వట్టం నాగేశ్వర్రావు, జానకి దంపతులు ఇంటికి తాళం వేసి ఇద్దరు కుమార్తెలతో కలిసి పెట్రాంచెలక వెళ్లారు. షార్ట్ సర్క్యూట్తో భారీగా మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. రూ. 50వేల నగదు, ఇద్దరు కుమార్తెల డిగ్రీ, నర్సింగ్ కోర్సులు, ఇతర సర్టిఫికెట్లు, బట్టలు, మంచాలు, వంట సామగ్రి , ధాన్యం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చా రు. ఆర్థిక సాయం అందించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఐ సౌజన్య ప్రమాద వివరాలు నమోదు చేసుకుని తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, 5వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్కినేని సురేందర్, కోరం సురేందర్, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రాజేందర్, ఈది గణేష్, రెడ్యానాయక్, మాడె మధు, మంగీలాల్, సరిత, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో సామగ్రి..అశ్వాపురం : మండలకేంద్రంలోని మంచికంటి నగర్కు చెందిన సరస్వతి ఇంట్లో సోమవారం సామగ్రి దగ్ధమైంది. ఇంట్లో దేవుడి వద్ద వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించి బట్టలు, సామాన్లు, సిమెంట్ రేకులు, ఎల్ఈడీ టీవీ కాలి పోయాయి. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది. ఆర్ఐ లీలావతి ఇంటిని పరిశీలించి నష్టం వి వరాలు నమోదు చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. వేధింపుల కేసు నమోదుభద్రాచలంఅర్బన్: భద్రాచలం పోలీసులు సోమవారం వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన మడిపల్లి సంధ్యకు రాజాతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని నెలల నుంచే భర్త రాజా, అత్త లక్ష్మి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్త, అత్తపై ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేశారు. -
మహిళ బలవన్మరణ ం
అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగుకి చెందిన దూదిమెట్ల సరిత (35)భర్తతో గొడవపడి కొన్నేళ్లుగా భద్రాచలంలోని పెట్రోల్ బంక్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. భద్రాచలం సబ్ రిజిస్టార్ ఆఫీసులో ప్రైవేటుగా అటెండర్ పనిచేసే పోతురాజు గురుమూర్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సరిత దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఈ నెల 11న గడ్డి మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో గురుమూర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్షఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బెక్కమ్ రజని సోమవారం తీర్పుచెప్పారు. ఖమ్మం రోటరీనగర్కు చెందిన కోటకొమ్ముల నాగరాజు వద్ద భద్రాద్రి జిల్లా పాల్వంచ వాసి బొందిలి రామారావు 2019 నంబర్లో రూ.8 లక్షల అప్పు తీసుకున్నారు. తిరిగి 2021 అక్టోబర్లో రూ.8లక్షలకు చెక్కు జారీ చేసినా ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగరాజు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం రామారావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. యువకుడిపై పోక్సో కేసు ఖమ్మంక్రైం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జహీర్పుర ప్రాంతానికి చెందిన గోపి సుక్కు అదే ప్రాంతానికి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ మోహన్బాబు తెలిపారు. -
వర్షానికి కూలిన ఇల్లు
దమ్మపేట: మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామంలో యదిరాజు కన్నయ్యకు చెందిన తాటి ఆకుల పూరిల్లు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోగా, ఇంటి పైకప్పు నేలను తాకింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దగొల్లగూడెం గ్రామంలో కన్న య్య, పున్నమ్మ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి కట్టిన తడికెలు, పైకప్పు కలప బాగా తడిసి పటుత్వం కోల్పోయాయి. సోమవారం ఉదయం వర్షం కురుస్తుండగానే ఒక్కసారిగా పూరిల్లు కూలిపోయింది. ఇంట్లో వంట సామగ్రి, నిత్యావసరాలు ధ్వంసమయ్యా యి. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కన్నయ్య కుటు ంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
హోరెత్తిన తాలిపేరు..
చర్ల: తాలిపేరు ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుండగా 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో సోమవారం ప్రాజెక్టులోని 10 గేట్లను రెండడుగుల చొప్పున, 1 గేటును పూర్తిగా ఎత్తి 21,076 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో నీటిమట్టాన్ని 73.23 మీటర్లు ఉంచి మిగిలిన నీటిని బయటకు వదులుతున్నారు. డీఈ తిరుపతి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.11 గేట్లు ఎత్తి 21 వేల క్యూసెక్కుల నీరు విడుదల -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు నిత్యకల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లా జడ్జిని కలిసిన ఎఫ్డీఓపాల్వంచరూరల్ : ఇటీవల ఏర్పాటైన వైల్డ్లైఫ్ నల్సా కమిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి పాటిల్ వసంత్ను వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ, నల్సా జిల్లా నోడల్ అధికారి బి.బాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.భోజనంలో నాణ్యత పాటించాలిఎస్సీ డీడీ శ్రీలత పినపాక: సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని డీడీ శ్రీలత సిబ్బందిని ఆదేశించారు. పినపాక హాస్టల్లోని భోజనశాల, విద్యార్థుల గదులు, పరిసరాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తమకు సమాచారం అందించాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో 2025 – 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 9, 10 తరగతి బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. https:// telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఏడాది ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించి ఉండొద్దని, మీ సేవ ద్వారా తహసీల్దార్తో ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, ఆధార్కార్డు, బీసీ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి బ్యాంక్ పాస్బుక్, తల్లి/తండ్రి జాయింట్ ఖాతాతో తెరచిన జిరాక్స్ కాపీ జత చేయాలని సూచించారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలని వివరించారు. ప్రజావాణి వెలవెలసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చాయని ఆర్డీఓ మధు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి 3, చుంచుపల్లి మండలం నుంచి 4, జూలూరుపాడు, టేకులపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల నుంచి ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఫిర్యాదుదారులు ఎక్కువగా లేకపోవడంతో గ్రీవెన్స్ సెల్ వెలవెలబోయింది. -
రామాలయంలో మళ్లీ అంతర్గత బదిలీలు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం మళ్లీ అంతర్గత బదిలీలు చేశారు. ఈఓ కొల్లు దామోదర్రావు బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి. ఈఓ సీసీ, గోశాల ఫైల్ కరస్పాండెన్స్ ఎ.శ్రీనివాసరెడ్డికి సెంట్రల్ స్టోర్స్ ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు, సీనియర్ అసిస్టెంట్ ఆర్.బాలాజీని అన్నదాన సత్రం ఇన్చార్జ్ నుంచి ప్రసాదాల తయారీవిభాగానికి, ప్రసాదాల విభాగంలో పని చేస్తున్న శ్రీనివాసరావును పర్ణశాల గుమస్తా, ఆ పోస్టులో ఉన్న కన్సాలిడేటెడ్ ఎం.అనిల్కుమార్ను దేవస్థానంలో కీలక విభాగమైన ఎస్టాబ్లిష్మెంట్, పే బిల్స్కు బదిలీ చేశారు. ఎస్టాబ్లిష్మెంట్ క్యాషియర్ టి.రాజేష్ను డిపాజిట్, డీడీ, ఇతర రిజిస్టర్లకు, ప్రసాదాల విభాగంలో ఉన్న సతీష్ను ఈఓ అటెండర్గా, ఈఓ అటెండర్గా ఉన్న నందసాయిని ప్రసాదాల ఇన్చార్జ్గా, కంప్యూటర్ ఆపరేటర్ ఎం.మృణాళినిని ఇంజనీరింగ్ సెక్షన్ ఓఎస్గా, ఫైల్ కరస్పాండెన్స్గా, సునీతకు ప్రొటోకాల్ ఆఫీస్ ఇన్చార్జ్గా, వస్త్రాల స్టోర్స్ ఇతర బాధ్యతలు అప్పగించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు..? ఈఓ బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే రెండుసార్లు అంతర్గత బదిలీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవి సాధారణమే అయినా అన్ని విభాగాల్లో ఒకేసారి పెను మార్పులు చోటుచేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న కొందరికి కీలక విభాగాలు అప్పగించడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరిగిన ఎస్జీఎఫ్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. స్థానిక ఐడీఓసీలో సోమవారం ఆయన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖోఖో పోటీలో మధిరకు చెందిన బి.జాహ్నవి, ఇల్లెందుకు చెందిన పి.భువనశ్రీ, నేలకొండపల్లికి చెందిన బి.రూప బంగారు పతకాలు, ఎర్రుపాలెంకు చెందిన కె.సానియా రజిత పతకం, అన్నపురెడ్డిపల్లికి చెందిన టీ.హాసిని కాంస్య పతకం సాధించారని వివరించారు. క్రీడాకారులు మరింతగా రాణించి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. -
పంటలు హరీ !
బూర్గంపాడు: ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే చేతికందే సమయాన భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. పత్తి తీసే దశకు వచ్చినా వానలతో వీలుపడడం లేదు. కంకి దశలో ఉన్న వరిపొలాలు వర్షాలకు ఒరిగిపోతున్నాయి. ఇటీవలే వేసిన మిరప తోటల్లో నీరు నిల్వడంతో మొక్కలు కుళ్లిపోతున్నాయి. మొక్కజొన్న పంటదీ ఇదే పరిస్థితి. ఓవైపు యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడిన రైతులు.. ప్రస్తుత ఎడతెరిపి లేని వర్షాలతో కుదేలవుతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి రావని ఆందోళన చెందుతున్నారు. మొదట ఆశాజనకంగానే.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటలు సాగు ఆశాజనకంగానే ప్రారంభమైంది. జూన్, జూలైలో అడపా దడపా కురిసిన వర్షాలకు పత్తి, మొక్కజొన్న, అపరాల పంటలు బాగానే మొలకెత్తాయి. నెలన్నర రోజుల వరకు పంటలు ఏపుగా పెరిగి రైతుల్లో ఆశలు కల్పించాయి. ఇక ఆగస్టు నుంచి ఆరంభమైన వానలు రైతులను రోజురోజుకూ కుంగదీస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలతో పాటు యూరియా కొరత కూడా వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. యూరియాకు బదులు ఎక్కువ ఖర్చు చేసి కాంప్లెక్స్ ఎరువులు వేసుకుని పంటలు సాగు చేశారు. అయితే అధిక వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తెగుళ్ల ఉధృతి ఎక్కువై పంటలకు నష్టం కలిగించాయి. దీంతో సస్యరక్షణ చర్యలకు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం పత్తి తొలివిడత తీసేందుకు సిద్ధమైంది. కానీ వర్షాలతో వీలు పడడం లేదు. వరి పంటకూ ప్రతికూలం.. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది. మొక్కజొన్న పంటకు కూడా వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అధిక వానలతో కంకి సరిగా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక ఇటీవల వేసిన మిర్చి తోటలకు కూడా వానలు ప్రతిబంధకంగా మారాయి. మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 2.21లక్షల ఎకరాల్లో పత్తి, 1.85లక్షల ఎకరాల్లో వరి, 28వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. సుమారు పదివేల ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉండగా ఇప్పటికే ఆరువేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పత్తి చేతికందే దశలో ఉండగా వారం, పది రోజుల్లో వరి కోతలు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు చెరువులను తలపిస్తుండగా రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిప్రవహిస్తున్నాయి. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. -
బీటీపీఎస్ ఎదుట ఆదివాసీల ఆందోళన
మణుగూరు టౌన్ : బీటీపీఎస్లో స్థానిక వీటీడీఏ సొసైటీలకు, స్థానికులకు అవకాశాలు కల్పించాలని, కమీషన్లు తీసుకుని టెండర్లు అప్పగించే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ చందా లింగయ్య దొర మాట్లాడుతూ.. బీటీపీఎస్ కోసం సేకరించిన భూముల్లో 95 మంది గిరిజనేతరులకు చెందినవి 138 ఎకరాల ఉంటే 767 ఎకరాల భూములున్నట్లు రికార్డులు మార్చి రెవెన్యూ అధికారులు, జెన్కో, బీటీపీఎస్ అధికారులు కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపించారు. 1,116 మంది ఆదివాసీల భూములు 2,044 ఎకరాలు ఉండగా 302 మందికి మాత్రమే ప్యాకేజీలు ఇచ్చారని, మిగిలిన వారిని మోసం చేశారని అన్నారు. భూ సేకరణ సమయంలో జీవనోపాధికి నెలకు రూ.5వేలు, గృహ నిర్మాణం, సమీప గ్రామాల అభివృద్ధి వంటి హామీలు ఇచ్చారని, ఇప్పుడు అవన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. అవసరమైతే ప్లాంట్ భూములను రీ సర్వే చేసి అర్హులకు ప్యాకేజీ, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటీపీఎస్ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే స్థానికులకు ఉపాధి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులంటే ప్లాంట్ అధికారులకు చులకనగా మారిందన్నారు. బూడిద చెరువు, బూడిద రవాణా విధానం టెండర్లను ఆదివాసీ వీటీడీఏ సొసైటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్లాంట్ సీఈ బిచ్చన్నకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, నాయకులు వాసం రామకృష్ణ, కొమరం రామ్మూర్తి, కొమరం శ్రీను, కలేటి వీరయ్య, చిడెం నాగేశ్వరరావు, కుంజా వెంకటరమణ, ఏనిక మంగమ్మ, పూనెం విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. కాగా, ఆదివాసీ అఖిలపక్ష సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట తలపెట్టిన నిరసనలో అక్రమాల అధికారి తీరుపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలే ప్లకార్డులుగా మారాయి. భూములు సేకరించిన అనంతరం వీటీడీఏ సొసైటీలకు ప్రాధాన్యత తగ్గడం తదితర అంశాలపై సాక్షిలో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. వీటీడీఏ సొసైటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన దర్బార్లో దరఖాస్తుల స్వీకరణ భద్రాచలం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దర్బార్కు వచ్చే గిరిజనుల సమస్యలను అర్హతల మేరకు సకాలంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆయా వినతులను ఆన్లైన్లో నమోదు చేయాలని, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ అశోక్, ఈఈ మధుకర్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఏఓ రాంబాబు, ఇన్చార్జ్ ఎస్ఓ భాస్కరన్, ఉద్యాన అధికారి ఉదయ్కుమార్, ఏపీఓ(పవర్) వేణు పాల్గొన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహిచాలి.. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని పీఓ రాహుల్ సిబ్బందికి సూచించారు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సర్వీస్ బుక్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ అశోక్, పర్యవేక్షకురాలు ప్రమీలబాయ్, సిబ్బంది రమణమూర్తి, రామకృష్ణారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. -
కిన్నెరసానికి వరద పోటు
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో నీటిమట్టం సోమవారం 406.70 అడుగులకు పెరిగింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. పర్యాటకులకు నిరాశే.. కిన్నెరసాని జలాశయం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే చూడాలనే ఉత్సాహంతో పలువురు రాగా, గేటుకు తాళం వేయడంతో పర్యాటకులకు నిరాశే మిగిలింది. కాగా, ఆ సమయంలోనే పంజాబ్ రాష్ట్రంలోని బర్మాల్ నుంచి కొందరు చేరుకోగా, గేట్లు మూసి ఉండడం, బోటు షికారు కూడా నిలిపివేయడంతో నిరాశగా వెనుదిరిగారు. గేట్లు తెరిస్తే సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారని, ఆ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే పర్యాటకులను లోనికి అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. ఐదు గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీరు విడుదల -
ఆదివాసీలు ఉద్యమించాలి
టేకులపల్లి: ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించిన కొమురం భీమ్ ఆశయ సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలని తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో ఆదివా రం కొమురం భీమ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ కావాలంటూ నైజాం నవాబులు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరు సల్పారని అన్నారు. భద్రాచలంలో జరిగిన ధర్మ యుద్ధం సభ సక్సెస్ కావడంతో కొందరు లంబాడీ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జోగ ప్రసాద్, మాడే రామకృష్ణ, ఈసాల రవి దొర, మాడే నవీన్, వాసం అనిల్, వాసం శ్రీను, పూణెం దేవరాజు, పూణే వెంకటేశ్వర్లు, మోకాళ్ల రవీందర్, ముడిగా హరీష్, పూణెం నాగరాజ్, ఈసం సత్యం పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు బలి
కరకగూడెం: విద్యుదాఘాతానికి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వట్టంవారిగుంపు పరిధి అరెంవారిగుంపు గ్రామానికి చెందిన కొమరం మహేశ్ (26) కరకగూడెం పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్కి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా పెద్దవాగులో యువకుడి మృతదేహం కనిపించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. -
వడ్డీ వ్యాపారులకు మావోయిస్టుల హెచ్చరిక
దుమ్ముగూడెం: అవసరాన్ని బట్టి పేద ప్రజల వద్ద పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులను హెచ్చరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధిక వడ్డీలు కట్టలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలన్నారు. వ్యాపారుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొందరు చనిపోతున్నారని, మరికొందరు ఆస్తులు అమ్ముకుని రోడ్డుపై పడుతున్నారని తెలిపారు. ఐఎస్జీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ కొత్తగూడెంఅర్బన్: ఇండియన్ స్కౌట్స్, గైడ్ ఫెలోషిప్ (ఐఎస్జీఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లోగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం సింగరేణి చిల్డ్రన్ పార్కులోని భారత్ స్కౌట్స్, గైడ్స్ సింగరేణి కార్యాలయంలో సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి సింగరేణి జీఎం వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఐఎస్జీఎఫ్ జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్) మ్యాక్ మిక్కి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ పేరును ప్రతిపాదించగా.. అందరూ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఐఎస్జీఎఫ్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి ఆస్పత్రిలో వైద్యశిబిరం కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరం నిర్వహించారు. హైదరాబాద్ నిఖిల్ ఆస్పత్రి నుంచి కార్డియాలజీ – న్యూరాలజీ, యురాలజీ, డెక్కన్ ఆస్పత్రి నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ – నెప్రాలజీ వైద్యులు హాజరై సేవలు అందించారు. మొత్తం 143 మందిని పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాళేశ్వరరావు, డా.లలిత, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ పీబీ అవినాష్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పీఈటీ అసోసియేషన్ కమిటీ ఎన్నికకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్కుమార్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతోనే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందా? అని, ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అవసరం లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్, హరియాణాలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, దానిని ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తం చేశాడని ఆరోపించారు. శాసీ్త్రయత లేని, రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్ వల్ల చాలా తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో కామ ప్రభాకర్రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్, కనికెళ్ల నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు అరకొరే..
● జెన్కో లాభాల్లో 2 శాతం వెచ్చింపుల్లో తేడాలు ● విడుదలైన నిధులు ఇతర ప్రాంతాలకు బదలాయింపు ● పాల్వంచకే కేటాయించాలని డిమాండ్ సీఎస్ఆర్ నిధుల కోసం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే వాటిని జెన్కో యాజమాన్యం పరిశీలించి విడుదల చేస్తోంది. అయితే వీటిని ఎక్కడ ఖర్చు చేయాలనేది మాత్రం మా పరిధిలో లేదు. జిల్లా అధికారులే చూస్తారు. రెండు సంవత్సరాల కాలంలో కొత్తగూడెం, పాల్వంచ మైనార్టీ, బీసీ కళాశాలల్లో భవనాలు, ఆడిటోరియం నిర్మించారు. ఇతర అభివృద్ధి పనులను కూడా అధికారులే చూడాల్సి ఉటుంది. – శ్రీనివాసబాబు, సీఈ, కేటీపీఎస్ 7వ దశ పాల్వంచ: పరిశ్రమల సామాజిక బాధ్యతగా వెచ్చించాల్సిన నిధులు అరకొరగానే విడుదల చేస్తున్నారు. కర్మాగారాల నుంచి నిత్యం వెలువడే కాలుష్య ఉద్గారాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఆయా ప్రాంతాల వారికి వైద్య సౌకర్యాలతో పాటు, అభివృద్ధికి తమవంతు సహకారం అందించాల్సి ఉంటుంది. పాల్వంచలోని కేటీపీఎస్ కర్మాగారం నుంచి నిత్యం 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గును మండించడం ద్వారా జల, వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. కాలుష్యం వల్ల ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుండటంతో యాజమాన్యం సామాజిక బాధ్యతగా ఏటా సీఎస్ఆర్ నిధులు విడుదల చేసి, అభివృద్ధిలో భాగస్వామి కావాల్సి ఉంది. కానీ, దీనిని పాటించడంలో జెన్కో యాజమాన్యం, జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలీచాలని నిధులు.. సీఎస్ఆర్ నిధులు విడుదల కోసం జిల్లా కలెక్టర్ జెన్కో యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టర్ ఖాతాలోకి నిధులు విడుదల చేస్తారు. వాటి నుంచి కలెక్టర్ సూచించిన చోట అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో సీఎస్ఆర్ నిధులను కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేటాయించినట్లు సమాచారం. కర్మాగారం ఉన్న పాల్వంచలో ప్రజలు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతుండగా ఆ నిధులను ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2022–23లో రూ.కోటి నిధులకు ప్రతిపాదనలు పంపించగా రూ.30 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.70 లక్షలు ఖర్చుచేయాల్సి ఉంది. 2023–24లో రూ.3.72 కోట్లు విడుదల కాగా నిధులు ఖర్చు చేశారు. ఇక 2024–25 సంవత్సరంలో రూ.1.07 కోట్లకు ప్రతిపాదనలు పంపించగా నిధులు మంజూరైనా వాటిని ఇంకా అధికారులు ఖర్చు చేయకుండా పెండింగ్లో ఉంచారు. ఏడాది ముగుస్తున్నా అధికార యంత్రాంగం ఈ నిధులను ఇంకా ఎక్కడ వినియోగించాలనేది తేల్చక తాత్సారం చేస్తున్నారు. 2 శాతం కేటాయింపులేవి జెన్కో యాజమాన్యం ఏటా లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులు అతి తక్కువగా మాత్రమే విడుదల అవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని, తరచూ వైద్య శిబిరాలు, నాణ్యమైన విద్య, ప్రజలకు నిత్యం ఉపయోగ పడే చోట అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు, నర్సరీల ఏర్పాటు, రోడ్ల విస్తరణ, వృత్తి విద్య, ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం చెందారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు లాభాల వాటలోని 2 శాతం నిధులు వెచ్చించడంతో పాటు, వాటిని స్థానికంగానే ఖర్చు చేయాలని, శాశ్వత ప్రాతిపాదికన సమస్యలకు పరిష్కార మార్గాలు రూపొందించాలని ప్రజలుకోరుతున్నారు. -
పట్టదా ఎవరికీ..?
భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల పరిధిలో దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఈ సమస్యను ఇటు తెలంగాణలోని కాంగ్రెస్, అటు ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ప్రజాపోరాటానికి సిద్ధమవుతాం. –రావులపల్లి రాంప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు భద్రాచలం: భద్రాచలం నుంచి చర్లకు వెళ్లి రావాలంటే ప్రయాణికులకు నరకమే. ఆ మార్గంలో గాయపడకుండా.. ఇబ్బంది లేకుండా ప్రయాణించలేం. గుంతలమయమైన రహదారిలో ఇసుక లారీలు నిరంతరం తిరుగుతుండటంతో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. దీంతో గంటల కొద్ది ప్రయాణికులు నిరీక్షిస్తూ నానా అవస్థలు పడుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే వరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం ినియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యగా ఉన్న దీనిపై రెండు ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు మౌనం దాల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడుగుకో గుంత.. భద్రాచలం నుంచి చర్లకు వయా దుమ్ముగూడెం మండలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అందులో లక్ష్మీనగరానికి వెళ్లే దారిలో ఏపీ రాష్ట్రం ఏడు కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఏపీలోని చింతలగూడెం, సీతంపేట, కన్నాయిగూడెం, తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్డు, కల్వర్టు, నర్సాపురం, రేగుబల్లి, గంగోలు, బుర్రవేముల, లక్ష్మీనగరం, ములకలపాడు, దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు వరకు రోడ్లన్నీ గుంతలమయమే. చర్ల మండలంలో సుబ్బంపేట, కొయ్యూరు, చర్ల, రైస్పేట, గుంపెనగూడెం, కలివేరు, కుదునూరు, దేవరపల్లి గ్రామాల్లోని ఆర్అండ్బీ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చర్ల నుంచి వెంకటాపురం రోడ్డు సైతం పూర్తిస్థాయిలో పాడైపోయింది. అడుగు దూరానికో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. అడుగు నుంచి రెండు అడుగుల లోతులో భారీ గుంతలు ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పర్ణశాలకు తగ్గిన భక్తుల రాక.. భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలకు భక్తులు వెళ్లటం పరిపాటి. దుమ్ముగూడెం మండలంలో ఉన్న పర్ణశాలకు ఈ రహదారే మార్గం. ప్రస్తుతం రోడ్డు తీవ్రంగా దెబ్బతిని ఉండటంతో భక్తులు పర్ణశాలకు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. కేవలం భద్రాచలం రామయ్యను దర్శించుకొని తిరుగుబాట పడుతున్నారు. దీంతో పర్ణశాలకు భక్తుల రాక తగ్గటంతో పాటుగా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధికి గండి పడింది. ఇటీవల కాలంలో చర్ల ఇసుక ర్యాంపుల నుంచి లారీలు దుమ్ముగూడెం, భద్రాచలం మీదుగా వెళ్తున్నాయి. గుంతలతోనే వేగలేకపోతున్న ప్రయాణికులు లారీల రాకపోకలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారులను ఆర్అండ్బీ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలోని టీడీపీ రహదారుల పర్యవేక్షణను గాలికొదిలేశాయి. మట్టితో గుంతలను తూతూమంత్రంగా పూడుస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనపడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ, ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని, ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు సైతం నిరసన కార్యక్రమాలతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. భద్రాచలం – చర్ల రహదారి గుంతలమయం.. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
చింతకాని: మండలంలోని నాగులవంచ పెట్రోల్ బంకు వద్ద ఆదివారం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బంధం లక్ష్మీనారాయణ (45) మృతి చెందగా అతని కుమారుడు గగన్కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొణిజర్ల మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావటంతో ద్విచక్ర వాహనంపై తన కుమారుడితో కలిసి ఖమ్మం నుంచి ముష్టికుంట్ల గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగులవంచ పెట్రోల్ బంకు వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే లక్ష్మీనారాయణ మృతి చెందగా, కుమారుడు గగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు -
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
దుమ్ముగూడెం: మండలంలో ఇసుక లారీలు వందల సంఖ్యలో రావడంతో తూరుబాక నుంచి పెద్దనల్లబల్లి వరకు కొన్ని కిలో మీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఏపీలోని సీతపేటం వద్ద భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపై రెండు ఇసుక లారీలు దిగబడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వందల సంఖ్యలో లారీలు ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో సామాన్య ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఇసుక లారీలను ములకపాడు వయా మారాయిగూడెం నుంచి డైవర్షన్ చేసి పంపినప్పటికీ అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. రహదార్లపైనే నిలుపుతున్న ఇసుక లారీలు చర్ల: మండలంలో కొనసాగుతున్న ఇసుక క్వారీల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణా కోసం వచ్చే లారీలకు ఇసుక రీచ్ల నిర్వాహకులు యార్డులను ఏర్పాటు చేయకపోవడంతో లారీ డ్రైవర్లు ఎక్కడబడితే అక్కడ లారీలను నిలుపుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా తిరుగుతున్న ఓవర్ లోడ్ ఇసుక లారీలు వల్ల రోడ్లు ఎక్కడికక్కడే కృంగిపోయి పెద్ద ఎత్తున లారీలు దిగబడుతున్నాయి. ఇసుక రీచ్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎందుకు లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం భద్రాచలం వెంకటాపురం రహదారిపై మండలంలోని రాళ్లగూడెం (పర్ణశాల) నుంచి సుబ్బంపేట వరకూ నిత్యం లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యవసర పనుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన జనం ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం భద్రాచలం వెంకటాపురం మార్గంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, చర్ల నుంచి భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు ఏడు గంటలు, చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే ప్రయాణికులకు ఐదు గంటల సమయం పడుతోంది. ఇసుక రీచ్ల వద్ద లోడింగ్ కోసం వచ్చిన లారీల కోసం యార్డులు ఏర్పాటు చేయకపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లు నానా అవస్థలు పడుతున్నారు. -
ముగిసిన టీటీ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్ : మూడు రోజులుగా నగరంలోని సర్థార్ పటేల్స్టేడియంలో జరిగిన బాలసాని సాన్యసయ్య స్మారక రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఖమ్మంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడా సంఘాల బాధ్యుల కృషి వల్లే ఖమ్మంలో విరివిగా రాష్ట్రస్థాయి టోర్నీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు బాలసాని విజయ్కుమార్, రాష్ట్ర టీటీ అసోసియేషన్ అధ్యక్షులు కె.కె.మహేశ్వరి, కార్యదర్శి సి.నాగేందర్రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్, సీనియర్ కోచ్ సోమనాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–11 బాలికల విభాగం ఫైనల్స్లో అపర్ణ, యశశ్రీ, అండర్–13 విభాగంలో డి.అవంతిక, బి.వి.మహిమకృష్ణ, అండర్ –15 విభాగంలో బి.వి. మహిమకృష్ణ, గాయత్రి కృష్ణ, అండర్–17 విభాగంలో అవంతిక, పి.జలని, అండర్–19 విభాగంలో కె.శ్రేష్ఠ, వైష్ణవి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్–11 విభాగంలో ఎం.విహాన్, నివాస్, అండర్–13 విభాగంలో సాగర్, పి.వేదాన్ష్, అండర్–15 విభాగంలో జె.ఎ. విలోహిత్, ప్రమాణ్, అండర్–17 విభాగంలో ఎం.ధర్మతేజ సాయి, పి.శ్రీహానీష్, అండర్–19 విభాగంలో అరూష్రెడ్డి, ఎం.దేవాన్ష్, పురుషుల విభాగంలో స్వర్నెండ్ చౌదరి, బి.వరుణ్ శంకర్, మహిళల విభాగంలో నిఖితా బాను, వరుణి జైస్వాల్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. -
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
భద్రాచలంఅర్బన్: పట్టణంలో పోలీసులు ము మ్మరంగా తనిఖీలుచేపట్టారు. ఆదివారం రాత్రి పట్టణంలోని బ్రిడ్జి పాయింట్, బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. బయోమెట్రిక్ ఆధారంగా అనుమానిత వ్య క్తుల వివరాలు తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణికులు లేకుండా తిరుగుతున్న ఆటోలను నిలిపి డ్రైవర్లను ప్రశ్నించారు. పలువురు యువతకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేటు బస్సులను సైతం తనిఖీ చేసి అనుమతి పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఆయా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని లగేజీలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి సీఐ నాగరాజు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన రాపర్తి లక్ష్మి ఆటోలో కొత్తగూడెం వైపు వెళ్తుండగా మొండికుంట వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై గుంత ఉండటంతో ఆటోలో నుంచి మహిళ అదుపుతప్పి రహదారిపై పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను 108లో మణుగూరు తరలించి అక్కడి నుంచి భద్రాచలం తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. -
వేతన వెతలు
● మధ్యాహ్న భోజన కార్మికులకు అందని జీతాలు ● కోడి గుడ్లు, వంట బిల్లులు కూడా పెండింగ్లోనే ● పలుమార్లు విన్నవించినా పట్టించుకోని ప్రభుత్వం కొత్తగూడెంఅర్బన్: బిల్లులు, వేతనాలు రాక ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. దసరా పండుగ వేళ వేతనాలు, బిల్లులు వస్తాయని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది. కనీసం దీపావళి పండుగ లోపైనా విడుదల చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,150 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనం నెలకు రూ.3 వేలు ఇస్తుండగా, అది కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. వంట బిల్లులు, ఎగ్ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో కూరగాయలు, గుడ్లు అప్పు చేసి కొంటున్నామని కార్మికులు వాపోతున్నారు. విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లను ఇవ్వాల్సి ఉండగా, బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా పాఠశాలల్లో కోడి గుడ్లను అందించడంలేదు. దీంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. జూన్ నుంచి వేతనాలు రాట్లే.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కార్మికుల వేతనాలు విడుదల కావడం లేదు. వంట బిల్లులు గత మార్చి నుంచి ఇవ్వడంలేదు. కోడి గుడ్ల బ్లిలులు కూడా గత జూన్ నుంచి చెల్లించాల్సి ఉంది. గుడ్డుకు ప్రభుత్వం రూ.6 చొప్పున చెల్లిస్తుండగా, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో రూ.7, ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతాల్లో రూ.8 వరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతోంది. పోరాటానికి సిద్ధం వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని కోరుతూ డీఈఓ, జిల్లా అధికారులకు మధ్యాహ్న భోజన కార్మికులు వినతులు అందజేశారు. గత 10వ తేదీలోగా వేతనాలు, బిల్లులు వచ్చే విధంగా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినా విడుదల కాలేదు. దీంతో కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నిరసన దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వేతనాలు, బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల పండుగ రోజుల్లో కూడా అవస్థలు పడాల్సివస్తోంది. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం 10న బిల్లులు విడుదల కాలేదు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలుపుతాం. –సత్తెనపల్లి విజయలక్ష్మి, మిడ్డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి -
‘మద్యం’ దరఖాస్తులు 102
పాల్వంచరూరల్: నూతన వైన్షాపుల లైసెన్స్ మంజూరు ద్వారా ప్రభుత్వం ఆశించిన ఆదాయం వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. శనివారం వరకు జిల్లాలో కేవలం 102 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తద్వారా రూ.3.06 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా, ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో వైన్షాపుల లైసెన్స్కోసం ఆసక్తి చూపడంలేదనే చర్చ సాగుతోంది. గతంలో మద్యం వ్యాపారులు పోటీలు పడి ఒక్కొక్కరు ఐదు, పది షాపులకు దరఖాస్తు చేసుకునేవారు. ఈసారి మాత్రం ఉత్సాహం చూపడంలేదు. గడువులోగా ఆశించిన మేరకు దరఖాస్తులు వస్తాయనే భావనలో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు మణుగూ రు, కొత్తగూడెం ఎక్సైజ్స్టేషన్ల పరిధి లో తక్కువ దరఖాస్తులు రాగా, అశ్వారావుపేటలో అధికంగా 63 దరఖాస్తులు వచ్చాయి. ఎకై ్సజ్ శాఖకు రూ.3.06 కోట్ల ఆదాయంనూతన వైన్ షాపుల లైసెన్స్ కోసం శనివారం వరకు 102 దరఖాస్తులు వచ్చాయి. శనివారమే 50 దరఖాస్తులు అందాయి. ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోగా అనుకున్న మేర దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నాం. –జానయ్య, జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ -
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనక దుర్గమ్మతల్లికి ఆది వారం అర్చకులు విశేష పూజలు నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూ జలు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజ నులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. నేడు కొత్తగూడెం, భద్రాచలంలో ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజల సౌకర్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భద్రాచలం రెవెన్యూ డివిజన్ ప్రజ లు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ ప్రజలు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాలకు హాజరై తమ సమస్యల దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కలెక్టరేట్లోని ఇన్వార్డులో కూడా ప్రజలు సమస్యల దరఖాస్తులను అందజేసి రశీదులు పొందవచ్చని, సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపిస్తామని వివరించారు. కిన్నెరసానిలో సండే సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయా న్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ సరదాగా గడిపారు. 496మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.27,390 ఆదాయం లభించింది. 480మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.24,410 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనుమతి లేకపోతే కఠిన చర్యలుఎస్పీ రోహిత్రాజు కొత్తగూడెంటౌన్: దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పా టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాసుల షాపులను నిర్దేశిత ఖాళీ స్థలాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన ఎన్ఓసీ సర్టిఫికెట్ పొందుపర్చాలని తెలిపారు. క్లస్టర్లో 50 షాపులకు మించి ఉండొద్దని, జనావాసాల్లో టపాసుల షాపులు ఏర్పా టు చేయొద్దని, కల్యాణ మండపాల్లో, సమావేశ ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేయొద్దని అన్నా రు. తాత్కాలిక దుకాణాల వద్ద ఆగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. షాపుల వద్ద ఇసుక, నీటి సదుపాయాలను అందుబాటులోఉంచుకోవాలని కోరారు. ఆయా శాఖల అధికారుల అనుమతులు పొందాకే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
‘సౌర’ పందెం.. రూ.కోటి ఖాయం
● ఉమ్మడి జిల్లాలో కొణిజర్ల, భద్రాచలం ఎంపిక ● ఎంఎన్ఆర్ఈ ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు ● ‘గృహజ్యోతి’తో ఇంకా ముందుకు రాని ప్రజలు ఖమ్మంవ్యవసాయం: సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తృతపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను అమలుచేస్తోంది. ప్రధాన మంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్ వంటి పథకాలు ఉండగా.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనివబుల్ ఎనర్జీ(ఎంఎన్ఆర్ఈ) పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్లకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నిబంధనల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడేలా ఈ నిధులు వినియోగిస్తారు. మోడల్ సోలార్ విలేజ్గా పరిగణించడానికి తాజా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5 వేలకు మించి ఉండాలి. ఇక 2025 ఏప్రిల్ నుంచి ఆరు నెలల కాలాన్ని గడువుగా నిర్దేశించగా.. ఈ సమయంలో నిబంధనల ప్రకారం అధికంగా సౌర విద్యుత్ కనెక్షన్లు, సామర్థ్యాన్ని బట్టి జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. ఆ గ్రామానికి ఎంఎన్ఆర్ఈ పథకం కింద రూ. కోటి విలువైన సౌర ప్లాంట్ల నజరానా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న ఈ పథకాన్ని ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 4 నుంచి అక్టోబర్ 3 వరకు, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ 9 నుంచి అక్టోబర్ 8వరకు అమలు చేశారు. విద్యుత్ శాఖ పర్యవేక్షణలో రెడ్ కో సంస్థ ఈ పోటీలు నిర్వహించింది. పోటీ పడిన గ్రామాలు 22.. ఎంఎన్ఆర్ఈ పథకం కింద నిబంధనల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 22 గ్రామాలు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం(తల్లాడ మండలం), నేలకొండపల్లి, కొణిజర్ల, వల్లభి(ముదిగొండ మండలం), తనికెళ్ల(కొణిజర్ల మండలం), తల్లాడ, ముదిగొండ, కందుకూరు(వేంసూరు) గ్రామాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం, భద్రాచలం, సారపాక, నాగినేనిప్రోలు(బూర్గంపాడు మండలం), రుద్రంపూర్(చుంచుపల్లి మండలం), దమ్మపేట, కూనవరం(మణుగూరు మండలం), ముల్కలపల్లి, బూర్గపాడు, చండ్రుగొండ, బాబూక్యాంప్(చుంచుపల్లి మండలం), మందలపల్లి(దమ్మపేట మండలం), సమితి సింగారం(మణుగూరు మండలం) చర్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో అర్హులైన వారికి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సూర్య ఘర్ పథకం కింద రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇంటి పైకప్పు 100 నుంచి 300 ఆపైన స్క్వేర్ ఫీట్ ఉన్న భవనాలకు అవకాశం కల్పించారు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్కు రూ.30 వేల రాయితీ, 2 కిలోవాట్ల సౌరప్లాంట్కు రూ. 60 వేలు, 3 కిలోవాట్ల సౌరప్లాంట్కు రూ.78 వేల రాయితీ సౌకర్యం కల్పించారు. రూ.కోటి నజరానా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో నిర్వహించిన మోడల్ సోలార్ విలేజ్ పథకం పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, భద్రాద్రి జిల్లా నుంచి భద్రాచలం గ్రామాలు విజేతలుగా నిలిచాయి. భద్రాచలంలో 180 విద్యుత్ సర్వీసులు సౌర విద్యుత్కు అనుసంధానం పొందగా 2 వేల కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పునరుత్పత్తి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల కూడా అత్యధికంగా పోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని ముందంజలో నిలిచింది. దీంతో ఈ రెండు గ్రామాలను రెండు జిల్లాల స్థాయిలో మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేశారు. సోలార్ పథకం కింద విజేతలుగా నిలిచిన గ్రామాలకు విడుదల చేసే రూ. కోటి నిధులను ఆయా గ్రామాల్లో ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకరాన్ని గృహజ్యోతి పథకం కింద కల్పించింది. గ్రామాల్లో 80 శాతం మంది విద్యుత్ కనెక్షన్లు ఈ పథకంలో ఉన్నాయి. దీంతో ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. 3 కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీలను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. కిలోవాట్లు తగ్గితే వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఈ పథకం ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పించినా.. వినియోగదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. చాలా మందికి సిబిల్ స్కోర్ సరిగా లేక రుణాలకు అర్హత సాధించలేక పోయారు. దీంతో మోడల్ సోలార్ విలేజ్ పథకానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. -
నిర్విరామ కృషితోనే సాధ్యం
● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్లు, సిబ్బందికి అభినందన దమ్మపేట:అప్పారావుపేట, అశ్వారావుపేట పామా యిల్ ఫ్యాక్టరీల మేనేజర్లు, సిబ్బంది నిర్విరామ కృషితోనే మూడు లక్షల టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిర్దేశిత క్రషింగ్ లక్ష్యాన్ని సాధించిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రాంగణంలో అధికారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీల మేనేజర్లు కళ్యాణ్, నాగబాబులతోపాటు సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయిల్పామ్ సాగులో ఎకరాకు 12 టన్నులు పైబ డి దిగుబడి సాధించిన రైతులు స్వీయ అనుభవా లను వివరించారు. వారినీ సన్మానించారు. మహా రాష్ట్రకు చెందిన రైతు చంద్రశేఖర్ వ్యవసాయంలో అనుసరిస్తున్న రీజనరేటివ్ విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రీజనరేటివ్ విధానాన్ని పరిశీలించేందుకు 40 మంది రైతులను అక్కడికి పంపుతామన్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి, రాబోయే సంవత్సరానికి నూతన ఫ్యాక్టరీ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ఫెడ్ సిబ్బందికి పదోన్నతి కల్పించాలన్నారు. తోటల్లో ఆయిల్పామ్ చెట్లపై నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ను ఆదేశించారు. అప్పారావుపేట గ్రామ అభివృద్ధి, అశ్వారావుపేట లో డివైడర్ నిర్మాణానికి ఆయిల్ఫెడ్ నిధులు కేటా యిస్తామన్నారు. ములకలపల్లి మండలంలో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం దాటితే ఫ్యాక్టరీ నిర్మిస్తామని తెలిపారు. ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ మొక్కలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అత్యధిక ఓఈఆర్ 19.92ను సాధించడంతో రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ రైతులు మునగ, వెదురు, కూరగాయలు సాగు, పట్టు పురుగుల పెంపకంపై కూడా దృష్టి సారించాలని అన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పేటలో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, అచ్యుతాపురంలో ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూ విస్తీర్ణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్సు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కిరణ్ కుమార్, డీఎం రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు, రాఘవరావు, పైడి వెంకటేశ్వరరావు, గంగాధరరావు, కాసాని నాగప్రసాద్, కె.వి, రైతులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి -
ఉపాధిలో ఈకేవైసీ
చర్ల/చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. కూలీలు ఆధార్కార్డులను జాబ్కార్డులతో ఈ కేవైసీ చేసుకుంటేనే అక్టోబరు నుంచి ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్ఆర్ఈజీఏస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధికూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను నమోదు చేసి కూలీ ముఖగుర్తింపు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కూలీలు తమ ఆధార్, జాబ్కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలి స్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకోసం కూలీలు ఆధార్కార్డును తప్పనిసరిగా అప్డే ట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేయని కూలీలు ఇక నుంచి ఉపాధి పనుల్లో అవకాశం కోల్పోతారు. అవకతవకలను నిరోధించేందుకు.. కూలీల హాజరును నేషనల్ మోబైల్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు క్షేత్ర సహాయకులు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తూ, నిధులు స్వాహా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు, ఒకరి పేరు మీద మరొ కరు వెళ్తున్నట్లు నమోదు చేస్తున్నట్లు తేలింది. మరో వైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడటం, రికవరీలు జరుగుతున్నా ఏ మాత్రం మార్పు కనిపించడంలేదు. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని సైతం దుర్వినియోగం చేస్తున్న ట్లు అధికారులు గుర్తించారు. ఇతర చిత్రాలతోపాటు పని చేయకపోయినా చేసినట్లు అప్లోడ్ చేస్తున్నట్లు అనేక చోట్ల తేలింది. దీంతో కూలీలకు కూలీ గిట్టుబా టు కాక ఆశించిన స్థాయిలో వేతనాలు సైతం రావడంలేదు. గతంలో జాబ్కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానంచేసినా కొన్ని చోట్ల హాజరు నమోదులో తప్పిదా లు చేస్తున్నట్లు తేలింది. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. హాజరు నమోదు ఇలా.. యాక్టీవ్ కూలీల వివరాలను మొబైల్ యాప్లో నమో దు చేసి, పనికి రాగానే, పని పూర్తయ్యాక రెండుసార్లు ముఖ గుర్తింపు ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. ఫొటోలు పనిప్రదేశంలోనేతీయాలి. కూలీలవివరాలు యాప్ లో నమోదు కాకపోతే ఉపాధి పనికి వెళ్లినా హాజరు పడదు. దీంతో కూలీ డబ్బులు ఖాతాల్లో జమ కావు. వేరే ప్రాంతంలో ఫొటో తీసి అప్లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం ద్వారా అది తప్పుడు హాజరని నిర్ధారిస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఉపాధి హామీ పథకంలో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జాబ్కార్డులు 2.23 లక్షలు మొత్తం కూలీలు 4.58 లక్షల మంది యాక్టివ్ కూలీలు 2.21 లక్షల మంది ఈకేవైసీ చేసినవారు 1.09 లక్షల మంది ఇంకా చేయాల్సినవారు 1.11 లక్షల మంది జిల్లాలో ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాం. ప్రస్తుతం అన్ని మండలాల్లోనూ ముమ్మరంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య వల్ల నెమ్మదిగా జరుగుతోంది. నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా ఈకేవైసీని పూర్తి చేస్తాం. – విద్యాచందన, డీఆర్డీఓగత నెల 24 నుంచి జిల్లాలోని 471 గ్రామాల్లో కూలీల ఈకేవైసీ ప్రక్రియను ఉపాధి హామీ సిబ్బంది చేపడుతున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో మొత్తం 2,023 లక్షల జాబ్కార్డులు ఉండగా, ఇందులో 1.31 లక్షల యాక్టీవ్ జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం కూలీల సంఖ్య 4.58 లక్షల ఉండగా, యాక్టీవ్ కూలీలు 2,21,051 మంది ఉన్నారు. వీరి వివరాలను ఈ యాప్ ద్వారా నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1,09,597 మంది కూలీల వివరాలను ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది యాప్లో నమోదు చేశారు. ఇంకా 1,11,454 మంది కూలీల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. -
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలంలోని ముసలమడుగుకు అక్రమంగా ఓట్రాలీలో ఐదు దూడలను తరలిస్తుండగా బ్రిడ్జి సెంటర్లోని చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇదిలాఉండగా.. ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా గుంటూరుకు టమాటా ట్రేలతో వెళ్తున్న డీసీఎంను ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 30 పశువులును పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న వాటిలో ఒకటి భద్రాచలంలో మృతి చెందగా మరొకటి పాల్వంచ గోశాలకు తరలించిన తరువాత మృతి చెందిందని, మరో 7 పశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ట్రాలీలో తరలిస్తున్న దూడల్లో ఒకటి గోశాల వద్ద మృతి చెందింది. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి, పట్టుబడిన పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. -
గంజాయి స్వాధీనం
అశ్వారావుపేట: అశ్వారావుపేట మీదుగా అక్రమంగా తరలిస్తున్న రూ.1.1 కోట్ల విలువైన 222 కిలోల (111 ప్యాకెట్లు) ఎండు గంజాయిని అశ్వారావుపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ పింగళి నాగరాజురెడ్డి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం ఎస్ఐ రామమూర్తి, టాస్క్ఫోర్స్ సిబ్బంది, జంగారెడ్డిగూడెం రోడ్లో పేపర్ మిల్లు సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న పీ09బీవీ 5868 నంబరు గల కారును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి విచారించారు. హైదరాబాద్కు చెందిన ఉంగరాల సరిన్కుమార్, బెల్లంపల్లికి చెందిన బాబర్ఖాన్ విశాఖపట్టణానికి చెందిన పంగి శ్రీను వద్ద రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన 222 కిలోల ఎండు గంజాయిని మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన ఇంతియాజ్కు అధిక ధరకు అమ్మేందుకు అశ్వారావుపేట మీదుగా తరలిస్తున్నట్లు అంగీకరించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ ఎక్కువగా ఉందని భావించి సరిన్కుమార్ స్నేహితులైన హైదరాబాద్కు చెందిన ఎండీ ఫిరోజ్, సంతోష్ పైలట్గా ఓ ఇన్నోవా వాహనం వినియోగించారు. ప్రధాన నిందితుడు సరిన్పై గతంలో కూడా ఎన్డీపీఎస్ కేసులున్నట్లు సీఐ వెల్లడించారు. గంజాయి తరలించడానికి వినియోగించిన కారు, రెండు సెల్ఫోన్లు, జియో రూటర్, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగరాజురెడ్డి వివరించారు. తనిఖీల్లో కొత్తగూడెం టాస్క్ఫోర్స్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, కానిస్టేబుళ్లు సంతోష్, రమేశ్, హరిబాబు పాల్గొన్నారు. -
నకిలీ డీడీపై పోలీసుల ఆరా..!
మణుగూరుటౌన్: మండలంలోని రామానుజవరం ఇసుక క్వారీ నుంచి ఓ లారీ నకిలీ డీడీతో ఇసుక తీసుకెళ్తూ అశ్వాపురం మండలంలో పట్టుబడిన విషయం విదితమే. మరో మూడు లారీలు నకిలీ డీడీలతో వెళ్లి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఇసుక క్వారీ నిర్వాహకుల తీరుపై అక్కడ పనిచేస్తున్న టీజీఎండీసీ కాంట్రాక్ట్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం రామానుజవరం ఇసుక క్వారీని అశ్వాపురం సీఐ అశోక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నకిలీ డీడీ వ్యవహారంపై టీజీఎండీసీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని విచారించారు. ఈ విషయమై సీఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా, కేసు విచారణ దశలో ఉందన్నారు. -
చట్టాలను అధ్యయనం చేయాలి
ఖమ్మం లీగల్: న్యాయవాదులు చట్టపరమైన సూత్రాలను లోతుగా అధ్యయనం చేసి, ఆస్తుల బదిలీల్లో జరిగే పొరపాట్లను నివారించేలా కక్షిదారులకు సరైన సలహాలు ఇవ్వాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.శివశంకర్రావు అన్నారు. ఐలు జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ –మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శివశంకర్రావు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నిబంధనలను న్యా యవాదులంతా తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు కోర్టుల గౌరవాన్ని కాపాడాలని, న్యాయంపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించారు. రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వెంపటి అపర్ణ మాట్లాడుతూ డాక్యుమెంట్ల మార్కింగ్లో ప్రతీ న్యా యవాది జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బార్ కౌ న్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు యువ న్యాయవాదులకు చట్ట పరిజ్ఞానాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు నవీన్ చైతన్య, సత్తుపల్లి, మధిర బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మల్లెపూల వెంకటేశ్వరరావు, బోడెడ్ల పుల్లరావు, ఐలు బాధ్యులు మందడపు శ్రీనివాసరావు, ఏడునూతల శ్రీనివాసరావు, చింతనిప్పు వెంకట్, గద్దల దిలీప్, మీసాల వెంకటేశ్వర్లు, పాగోలు కిషోర్ పాల్గొన్నారు.హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శివశంకర్రావు -
కూలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
మధిర: పట్టణంలోని శివాలయం రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మం గుడి వద్ద ఏర్పాటు చేసిన విద్యు త్ ట్రాన్స్ఫార్మర్తో పాటు స్తంభం శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కూలిపోయా యి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.వివాహిత అదృశ్యం ములకలపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఎస్ఐ మధుప్రసాద్ కథ నం మేరకు.. మండలంలోని ము త్యాలంపాడు గ్రామానికి చెందిన పొడియం కాంచన గత నెల 16న వైద్యశాలకు వెళ్లి వస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లింది. కానీ, తిరిగి రాకపోవడంతో భర్త పొడియం ప్రసాద్ శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరీక్షలకు సన్నద్ధం చేయాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను వార్షిక్ష పరీక్షలకు సన్నద్ధం చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి డీడీ అశోక్ అన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్లను పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డైలీ వేజ్ వర్కర్లు సమ్మె చేస్తున్నందున, వంట నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనం వడ్డించాలని అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై న విద్యార్థులను నాగేంద్రబాబు, కొర్సా సాయిరాంలను అభినందించారు. హెచ్ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు హరికృష్ణ, గంగారాం, సునీత పాల్గొన్నారు. -
నూరుశాతమే లక్ష్యం
● పదో తరగతిలో ఫలితాల మెరుగుకు విద్యాశాఖ అధికారుల దృష్టి ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● అభ్యాస దీపికలతో సన్నద్ధత, వారానికోసారి పరీక్షలుకరకగూడెం: పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ దృష్టిసారించింది. పరీక్షలకు కొద్ది నెలల ముందు నిర్వహించే ప్రత్యేక తరగతులను ఈసారి ముందస్తుగానే, ఇటీవల ప్రారంభించింది. కష్టమైన అంశాలపై శ్రద్ధ చూపేలా అభ్యాస దీపికలను (వర్క్ బుక్స్) ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. జిలాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు 110 ఉండగా 4,650 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. 14 కేజీబీవీ పాఠశాలల్లో కూడా 567 మంది 10వ తరగతి చదువుతున్నారు. ఈసారి పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిలబస్ పూర్తి చేయడంతపాటు ప్రతీ విద్యార్థికి సబ్జెక్ట్పై లోతైన అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు బోధన చేపడుతున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించడమే ప్రత్యేక తరగతుల ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, జిల్లా పదో తరగతి వార్షిక పరీక్షల్లో 2023–24 విద్యా సంవత్సరంలో 92.24 శాతం, 2024–25లో 92.14 శాతం ఫలితాలు సాధించింది. పక్కాగా ప్రత్యేక తరగతులు ప్రణాళిక ప్రకారం రోజూ పాఠశాల వేళలకు ముందు/ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత దృష్టి సారించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వారానికోసారి పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వెనుకబడ్డాడో గుర్తించి, మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్కు సంబంధించిన అభ్యాస దీపికలను పంపిణీ చేశారు. దీపికలోని ప్రశ్నలు, అభ్యాసాలను పూర్తి చేయించడం ద్వారా విద్యార్థులు సొంతంగా నేర్చుకునే నైపుణ్యాన్ని పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. గత పరీక్షల్లో తరచుగా అడిగిన ప్రశ్నలను, కష్టమైన యూనిట్లను పొందుపరిచి, చదివించడంతో విద్యార్థుల్లో పరీక్షలంటే భయం తగ్గనుంది. విద్యార్థులకు చదువుపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. టీచర్లు, అధికారులు కలిసి ఈ ఏడాది పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాటుపడుతున్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. 15న జిల్లాస్థాయి సైన్స్ డ్రామాకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 15న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో 8 నుంచి 10వ తరగతి లోపు చదివే పిల్లలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మాన్ కై ండ్’ ప్రధానాంశంగా, విమన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, ఎంపవరింగ్ లైఫ్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్ ఉపాంశాలుగా తీసుకోవాలని సూచించారు. డ్రామా నిడివి 30 నిమిషాలకు మించొద్దని, ఎనిమిది మంది మాత్రమే స్టేజిపై ప్రదర్శన ఇవ్వాలని, స్కిరప్ట్ రైటర్, డైరెక్టర్ హాజరు కావొచ్చని వివరించారు. డ్రామా ఏ భాషలోనైనా ఉండవచ్చని తెలిపారు. డ్రామాలో పాల్గొనేవారి వివరాలను ఈ నెల 14వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ 98492 29350 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. పోటీలు పాత కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఆనందఖని)లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయం● రేపు స్థలాలు పరిశీలించనున్న టీటీడీ బృందం ఖమ్మంఅర్బన్: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతితో టీటీడీ సానుకూలంగా స్పందించగా కొద్దిరోజుల క్రితం ఓ బృందం ఇక్కడ సానుకూలతలను పరిశీలించింది. ఆ తర్వాత 15వ డివిజన్ అల్లీపురం పరిధి హైదరాబాద్–దేవరపల్లి హైవే వెంట ధంసలాపురంలో సర్వే నంబర్లు 565, 563, 564, 565లో సుమారు 20 ఎకరాల భూమి అనుకూలంగా ఉందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అంతేకాక అదే గ్రామంలో సర్వే నంబర్ 408లో మరో 20 ఎకరాల భూమి కూడా ఉందని తెలిపారు. ఈ స్థలాలతో పాటు రఘునాథపాలెం బైపాస్లో నరిసింహులు గుట్ట భూమిని సైతం సోమవారం టీటీడీ బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత స్థలాన్ని ఖరారు చేసి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలుఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం గావించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేయగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విజ్ఞప్తులతో విసిగిపోయి.. తలా ఓ చేయి వేసి..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విజయవాడ–జగ్దల్పూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్–30)లో కొత్తగూడెం నగరంలో ముర్రేడువాగుపై ఉన్న పాత బ్రిడ్జి మొత్తం గుంతలమయంగా మారింది. ఏడాదిన్నరగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు నరకం చూస్తున్నారు. రాజకీయ పక్షాలు విజ్ఞప్తులు చేసినా, మీడియాలో పలుమార్లు కథనాలు వచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆఖరికి ఆగస్టులో ఐడీఓసీలో ముగ్గురు మంత్రుల సమక్షంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి సమావేశంలోనూ ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. జాతీయ రహదారుల శాఖ తన పని చేయకపోయినా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్ శాఖల అధికారులైనా తాత్కాలిక మరమ్మతులు చేయాలని సూచించారు. రెండు నెలలు గడిచినా ఆ పని జరగలేదు. శనివారం కూడా ఓ వాహనదారుడు నిరసన తెలిపాడు. ప్రభుత్వ శాఖలకు మొరపెట్టుకోవడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయింది. ఆటోలు, టూ వీలర్లు పాడైపోతున్నాయి. దీంతో నగరంలోని లోతువాగు ప్రాంతానికి చెందిన యాకుబ్పాషా, బొమ్మగాని శ్రీకాంత్, పాషా, బన్నీ, సూర్య, శ్రీధర్, నితిన్, మనోజ్ తదితరులు సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. సొంత ఖర్చులతో కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసి ఆటోలో తీసుకొచ్చి వంతెనపై గుంతలు ఉన్నచోట వేశారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం జరగకుండా తమవంతు బాధ్యతను నెరవేర్చారు. దాదాపు ఏడాది పాటు నగర ప్రజలను, ఈ మార్గం గుండా ప్రయాణించే వారిని పీడిస్తున్న సమస్య పరిష్కారానికి పాటుపడ్డారు. వీరు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యువకుల కృషిని పలువురు అభినందిస్తున్నారు. -
మరో విద్యుత్ ప్లాంట్కు ముందడుగు
పాల్వంచ: పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందుడుగు పడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం కేటీపీఎస్ గెస్ట్హౌస్లో కేటీపీఎస్ 5,6,7 దశల చీఫ్ ఇంజనీర్లు ఎం.ప్రభాకర్ రావు, శ్రీనివాస్ బాబులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలతలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై డిజైన్ కంపెనీకి సర్వే చేయాలని నిధులు మంజూరు చేయడం జిల్లా ప్రజలకు ఊరటనిచ్చే అంశమని అన్నారు. ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 450 ఎకరాల భూమి 800 మెగావాట్ ప్లాంట్కు సరిపోతుందని, రెండు కర్మాగారాలు నిర్మించాలంటే మరో 200 ఎకరాలు అవసరం ఉంటుందని, దీని కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం కూడా పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ చేశామని, ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించడంతోపాటు, అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎన్ఎండీసీ కర్మాగారం విస్తరణను కూడా ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ఇక్కడ పరిశ్రమ తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. సమావేశంలో ఎస్ఈ యుగపతి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సీతారామి రెడ్డి, దుగ్గిరాల సుధాకర్, ముత్యాల విశ్వనాధం, పూర్ణచందర్ రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
ముగిసిన అటవీశాఖ జోనల్ క్రీడలు
చుంచుపల్లి: కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న అటవీ శాఖ జోనల్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన 800 మంది అటవీ ఉద్యోగులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ తదితర క్రీడా పోటీలను నిర్వహించగా, ఓవరాల్ చాంపియన్గా నిలిచిన టీమ్కు భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.భీమానాయక్ ట్రోఫీ అందజేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను, సిబ్బందిని కూడా సీసీఎఫ్, డీఎఫ్ఓలు సత్కరించారు. ఈ సందర్బంగా సీసీఎఫ్ భీమానాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. ఐదు జిల్లాల అటవీ అధికారులు కిష్టాగౌడ్, సిద్ధార్థ విక్రమ్ సింగ్, బత్తుల విశాల్, బి.లావణ్య, అనూజ్ అగర్వాల్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.విజేతలకు బహుమతులు అందజేసిన సీసీఎఫ్ -
ఏజెన్సీలను రద్దు చేయాలి
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ కమిటీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య కోరారు. ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ శాఖల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్కు వినతిపత్రం అందించి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున సహకరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. కార్మిక శాఖ మంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారని లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ దుర్గం శ్రీను, ట్రెజరర్ సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ, బాలకృష్ణ, క్రాంతి, విజయలక్ష్మి, సురేష్, రాజేష్, గౌస్ పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య -
కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలయాశానికి వరద కొనసాగుతోంది. శనివారం నీటిమట్టం 406.40 అడుగులకు పెరగడంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తివేసి 2 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. ఎస్పీకి రేగా ఫిర్యాదు కొత్తగూడెంటౌన్: మణుగూరు పోలీస్ స్టేషన్ సమీపంలో సీఐ ఎదుట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరుడు గంటా రమేశ్ ఓ రైతుపై చేయి చేసుకున్న ఘటనలో అతడితోపాటు సీఐపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎస్పీ రోహిత్రాజుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్రాజును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి ఘటన వివరాలు వెల్లడించారు. అనంతరం రేగా మాట్లాడుతూ.. శుక్రవారం కమలాపురం గ్రామంలో ఓ రైతుపై చేయి చేసుకుంటుంటే సీఐ ఏం చేస్తున్నారని, ఇసుక మాఫియాకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని, కారకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరినట్లు రేగా తెలిపారు. కార్యక్రమంలో కుర్రి నాగేశ్వరావు, కుంట లక్ష్మణ్, నూకారపు రమేశ్, పోషం నర్సింహారావు, తాళ్లపల్లి యాదవ్గౌడ్, మధు, బోశెట్టి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సర్పాలు మనుషులు, ప్రకృతికి ఉపయోగమే.. కొత్తగూడెంఅర్బన్: సర్పాలు మనుషులు, ప్రకృతికి ఉపయోగకరమేనని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రెస్క్యూ స్పెషలిస్టు సంతోష్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం, రామా టాకీస్ ఏరియా, పాత కొత్తగూడెం, బాబూక్యాంప్, సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో ఇటీవల ఇళ్లల్లోకి చేరి సురక్షితంగా బంధించి నాలుగు నాగు పాములు (నాజా నాజా), నూనె కట్లపాము (వోల్ఫ్ స్నేక్), జెర్రిపోతు (రాట్ స్నేక్) జాతులకు చెందిన ఆరు పాములను శనివారం అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. ప్రకృతి జీవరాసులైన సర్పాలతో క్రిమి కీటకాలు, పంట వినాశకాల నియంత్రణ, జీవవైవిద్యం, ఔషధాల ఉత్పత్తి కోసం సర్పాల అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెస్క్యూటీం సభ్యుడు నారదాసు శ్రీకాంత్ (చోటు) పాల్గొన్నారు. కొనసాగుతున్న టీటీ ర్యాంకింగ్ టోర్నీ ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ శనివారం రెండో రోజుకు చేరింది. అండర్–11, 13 బాలికల విభాగంలో జిల్లాకు చెందిన బాలసాని తన్మయి, హార్వికతో పాటు డి.శాన్విక క్వార్టర్ ఫైనల్స్కు చేరారు. అండర్– 13, 17 బాలుర విభాగంలోనూ జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల క్రీడాకారులు సైతం తమ ర్యాంకును నిలుపుకునేందుకు పోటీ పడుతున్నారు. శనివారం రాత్రి 45 – 80 ఏళ్ల కేటగిరీల పోటీలు ప్రారంభమయ్యాయి. కాగా, ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తా మని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్కుమార్ తెలిపారు. అంతేకాకజాతీయస్థాయి టోర్నీలో పాల్గొనే రాష్ట్రజట్లను ఎంపిక చేస్తా మని వెల్లడించారు. పోటీల ముగింపు సమావేశానికి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.కె.మహేశ్వరి, సి.నాగేందర్రెడ్డి, టెక్నికల్ అఫీషియల్ ఎన్.లక్ష్మీకాంత్, సీనియర్ కోచ్ సోమనాథ్ఘోష్, మేయర్ పి.నీరజ హాజరవుతారని తెలిపారు. -
డైనోసార్.. స్టెగోడాన్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సృష్టి పరిణామ క్రమంలో భూమిపై మంచుయుగం అంతరించాక రాక్షస బల్లులు (డైనోసార్లు), రాకాసి ఏనుగు(స్టెగోడాన్)ల వంటి భారీ జంతువులు వేర్వేరు కాలాల్లో ఆవిర్భవించాయి. ఈ జంతువులు క్రీస్తు పూర్వం మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై సంచరించాయి. ఆ కాలంలో జీవించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగులు, రాక్షస బల్లులు ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతంలో ఒకప్పుడు రాజ్యమేలాయి. అందుకు సంబంధించిన అవశేషాలు కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నాయి. గత ఏప్రిల్లో స్టెగోడాన్ అవశేషాలు గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, వార్థా, పెన్ గంగా పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో 2025 ఏప్రిల్లో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలు లభించాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అప్పటికే సింగరేణి ఆధీనంలో స్టెగోడాన్ ఏనుగుల అవశేషాలపై దృష్టి పడింది. తెలంగాణ గడ్డపై జీవించిన ప్రాచీన జీవజాలానికి సంబంధించిన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సింగరేణి–బిర్లా సైన్స్ సెంటర్లు జత కట్టాయి. అందులో భాగంగా బిర్లా సైన్స్ సెంటర్లో సింగరేణి పెవిలియన్ పేరుతో ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటుకు నిర్ణయించారు. సింగరేణి తవ్వకాల్లో లభించిన వందలాది పురాతన శిలాజాల్లో యాభైకి పైగా శిలాజాలను కొత్తగూడెం నుంచి హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రదర్శనకు పెట్టారు. అందులో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు దంతాలు కూడా ఉన్నాయి. అంతకుముందు మరొక జత స్టెగోడాన్ ఏనుగు దంతాలు, దవడ అవశేషాలను నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఇచ్చారు. ప్రస్తుతం కొత్తగూడెం మ్యూజియంలో స్టెగోడాన్ ఏనుగుకు సంబంధించిన ఒక దంతం, దాని రిప్లికాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే డైనోసార్లు.. సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన గోదావరి పరీవాహక ప్రాంతం ఒకప్పుడు భారీ జంతువులకు నెలవుగా ఉండేది. ప్రస్తుతం బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని డైనోసారియంలో కనిపించే రాక్షస బల్లి(డైనోసార్) ఆకృతికి సంబంధించిన అవశేషాలు గోదావరి తీరంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేమనపల్లి దగ్గర అడవుల్లో 1974–80 వరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన పరిశోధనల్లో లభించాయి. మొత్తంగా 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో డైనోసార్ ఆకృతి తయారుచేశారు. అంతకు ముందు 1960, 70వ దశకాల్లో ప్రస్తుత ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో సైతం ప్రాచీనకాలానికి సంబంధించిన జంతుజాలం అవశేషాలు లభించాయి. వీటిని బిర్లా సైన్స్ సెంటర్, ఆర్కియాలజీ మ్యూజియం, వరంగల్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) మ్యూజియం–బండ్లగూడలో భద్రపరిచారు. చివరిసారిగా 2014లో ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం దగ్గర ప్రాచీన శిలాజాలు వెలుగుచూశాయి. హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్ వేదికగా పెవిలియన్ ఏర్పాట్లు చేశాం. బొగ్గు తవ్వకాల సందర్భంగా లభించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలను ఈ తరానికి చూపించాలనేది మా లక్ష్యం. అందుకే సింగరేణి పెవిలియన్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. –బలరాంనాయక్, సింగరేణి సీఎండీగోదావరి–ప్రాణహిత నది పరీవాహకంలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా బొగ్గును వెలికితీస్తోంది. 2020–21లో పెద్దపల్లి జిల్లా రామగుండం–2 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఓవర్ బర్డెన్(మట్టి) తొలగిస్తుండగా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఐదు ఏనుగు కొమ్ములు లభించాయి. వీటిపై పరిశోధనలు జరిపి, కీస్తు పూర్వం 26 వేల నుంచి 23 వేల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలుగా తేల్చారు. ఈ ఏనుగు 13 అడుగుల ఎత్తుతో 13 టన్నుల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటన్నింటినీ కొత్తగూడెంలోని ఎక్స్ఫ్లోరేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఎపిక్ సెంటర్లోని మ్యూజియంలో భద్రపర్చారు.సింగరేణి తవ్వకాల్లో లభించిన అవశేషాలు -
ధనధాన్య కృషి యోజన ప్రారంభం
సూపర్బజార్(కొత్తగూడెం): పీఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా, కొత్తగూడెం కేవీకేలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని, భూసారం పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త ఎన్.హేమశరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, డీడీఏ సరిత, మణుగూరు ఏడీఏ తాతారావు, ఇల్లెందు ఏడీఏ లాల్చంద్, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు. -
ఊపిరి తీసుకోలేక..
భద్రాచలంఅర్బన్: కొద్ది రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పసిపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. చలి పెరుగుతుండటంతో చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ప్రైవేట్.. ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి నిత్యం వచ్చేపిల్లల ఓపీ సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. రెండు నెలలుగా కొద్ది రోజులు వర్షం పడటం ఆగిపోవడం, మళ్లీ వరుసగా రెండు రోజుల పాటు వర్షాలు పడటం ఆగిపోవటం, తరువాత మళ్లీ ఒక వారం రోజులు తీవ్రంగా ఎండ రావడం, ఆ తరువాత మళ్లీ వర్షాలు పడటంతో చలి వాతావరణంలో పిల్లలు అత్యధికంగా జ్వరం, దగ్గుతో పాటు ఆయాసానికి గురవుతున్నారు. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. న్యూమోనియా లక్షణాలున్న వారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ప్రాంతంలో సొట్టలు కనిపిస్తుంటాయి. పిల్లలు మరీ ఇబ్బందులకు గురవుతుంటారు. సాధారణంగా రెండు నెలలలోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు, ఏడాదిలోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్ల లోపు పిల్లలు 40 సార్లు, ఐదేళ్లకు మించిన పిల్లలు 30 సార్లు శ్వాస పీల్చుకున్నారంటే వారిలో న్యుమోనియా లక్షణాలున్నట్లు భావించాలి. జాగ్రత్తలే రక్ష.. న్యూమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీని తీవ్రత పెరుగుతున్నా కొద్ది పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. తీవ్రతను బట్టి వైరల్ న్యుమోనియానా, బ్యాక్టీరియల్ న్యుమోనియానా అనే విషయాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేస్తారు. చలి కాలం మొదలయ్యే రోజులు వస్తుండటంతో ప్రస్తుతం ఈ రోగాలు చిన్నారుల దరిచేరకుండా రానున్న రోజుల్లో పిల్లలకు చల్లని గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్తుంటే చల్లటి గాలికి పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇబ్బంది పడుతున్న చిన్నారులు వైరల్ ఫీవర్ నుంచి క్రమంగా ఇతర వైరస్, బ్యాక్టీరియాలు కూడా సంక్రమించేందుకు అవకాశం ఉంది. ఇందుకు ఎక్కువ రోజులు పడుతుంది. గతంలో రెండు రోజులు చికిత్స తీసుకున్న సమస్యకు ఇప్పుడు ఎక్కువ రోజుల వరకు చికిత్స పొందాల్సి వస్తోంది. మొదటి దశలో అతి తక్కువ స్థాయిలో ఉంటుంది. క్రమక్రమంగా అది పెరిగి రెండో దశలో ఆస్తమా లక్షణాలు బయట పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూడు, నాలుగు దశల్లో రోజుకు రెండు, మూడు సార్లు రాత్రి పూట దగ్గు, ఆయాసంతో బాధపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పండుగ సెలవులు పూర్తయి పాఠశాలలు మొదలవడంతో హైజీన్ కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు సోకడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లుగా ఎక్కవ మంది చిన్నారుల్లో కనిపించింది. పిల్లల్లో ఏమాత్రం అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స ఇప్పించాలి. –డాక్టర్ క్రాపా విజయ్, పిల్లల వైద్య నిపుణుడు, భద్రాచలం పిల్లలకు వచ్చే దగ్గు, తుమ్ములు, జలుబు వంటి వాటికి తల్లిందండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. వాటితో తగ్గిపోతుందనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యాధుతు తీవ్రమవుతుంటాయి. ప్రత్యేకంగా వైద్యం చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తరచుగా పిల్లల వైద్యులను సంప్రదించి, వారి సలహాలను అనుసరించి మందులు తప్పనిసరిగా వాడాలి. –డాక్టర్ రాజశేఖరరెడ్డి, ఆర్ఎంఓ, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం -
అండర్–19 వాలీబాల్,
హ్యాండ్బాల్ జట్ల ఎంపికఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన వాలీబాల్, హ్యాండ్బాల్ బాలబాలికల జట్లను ఎంపికచేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీలకు 170 మంది వాలీబాల్క్రీడాకారులు, వంద మంది హ్యాండ్బాల్ క్రీడా కారులు హాజరయ్యారు. ఇక్కడ ఎంపిక చేసిన జట్లు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లాక్రీడల సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. వాలీబాల్ జిల్లా బాలుర జట్టుకు జి.అక్షయ్కుమార్, ఎ.గోపినాథ్, వి.నా యుడు, ఈ.అనిల్కుమార్, ఎస్.శివకోటి, పి.విష్ణువర్దన్, బి.కల్యాణ్ప్రసాద్, ఎన్.శ్రీహాస్, టి.వినయ్, ఎం.శ్యామ్, ఎండీ అస్లాం, పి. వంశీ, టి.శ్రీరాం, రవికుమార్, జోషినాథ్, రోహిత్, బాలికల జట్టుకు బి.అంబిక, ఎం.నక్షత్ర, కె.ప్రసన్నకుమారి, జి.నవ్యశ్రీ, ఎ.కీర్తన, విద్యశ్రీ, బి.తనూజ, ఆర్.శ్రావణి, డి.పుష్పలత, అతియా ఫాతిమా, ఎస్.ఉమాలత, వి.బేబికల్యాణి, అస్మిత ఎంపికయ్యారని పేర్కొన్నా రు. హ్యాండ్బాల్ బాలుర జట్టులో విగ్నాగ్పక్, తి యామాత్, కె.వేణు, ఎస్కే ఇమ్రాన్, ఎం. యశ్వంత్, ఎస్కే జకీరుల్లా, జె.గౌతమ్, ఎం.హర్షిత్, జె.రాంచరణ్, వి.పవన్, జి.లాల్కృష్ణ, ఐ.కార్తీక్, ఎండీ అబ్దుల్లా, సీహెచ్ కార్తీక్రెడ్డి, ఎం.జనార్దన్, సంతోష్కుమార్, కె.వంశీ, ఎన్.కార్తీక్ ఎంపికయ్యా రని తెలిపారు. అలాగే, బాలికల జట్టులో ఉషాశ్రీనేహా, టి. భవాని, పి.సింధు, వి.సంధ్య, జె.సౌమ్య, సాబా తబాస్సుమ్,డి.భారతి, కె.సాత్విక, కె.హర్షిణి, సీహెచ్.మాధురి, జె.జ్యోత్స్న, అక్షర, బి. రిషి త, ఎన్.అక్షర, బి.కార్తీకరెడ్డికి స్థానం దక్కిందని వెల్లడించారు. ●జిల్లా పాఠఽశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన జిల్లా అండర్–14 బాలబాలికల కబడ్డీ జట్లను శనివారం ఖమ్మంలో ఎంపిక చేశారు. ఈ పోటీలకు 107 మంది బాలురు, 70 మంది బాలికలు హాజరుకాగా జిల్లా జట్లను సంఘం కార్యదర్శి వై.రామారావు ప్రకటించారు. బాలుర జట్టుకు బి.హర్ష, పి.సంతోష్, ఎ.మనోజ్, కె.యశ్వంత్, ఎ.యశ్వంత్, ఆర్.జేమ్స్, బి.అరుణ్, బి.వెంకటేశ్, ఎల్.కౌశిక్, బి.సరిరాం, కె.నాగర్జున, బి.అంజిబాబు, ఎస్. గోపి, కె.అక్షయ్కృష్ణ, పి.బాబు, బాలికల జట్టుకు నాగస్వర్చిత, ఎం.శ్రీజ, కెభవ్యశ్రీ,, కె.ఫరిదా, బి.అనూ, కె.భవాని, జి.సృజన, ఎస్కే సమీనా, డి.దేవిశ్రీ, వి.మోక్షితకృష్ణ, ఎల్.స్పందన, జి.అంకిత ఎంపికయ్యారని తెలిపారు. ●కల్లూరు: ఉమ్మడి జిల్లా ఖో–ఖో బాలబాలికల జట్లను కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎంపిక చేశారు. అండర్–19 విభాగంలో జట్ల ఎంపికకు నిర్వహించిన పోటీలకు బాలురు 130 మంది, బాలికలు 90 హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశామని నిర్వహణ కార్యదర్శి బోడా బీమా, పసుపులేటి వీరరాఘవయ్య, మూసా ఖలీమ్ తెలిపారు. పోటీలను పీఈటీలు, కోచ్లు ఎస్.రామారావు, పి.పవన్కుమార్, ఎ.కృష్ణ, ప్రసాద్, సైదులు, సమ్మయ్య, కై సర్ పద్మావతి, స్టేడియం ఇన్చార్జ్ గౌతమ్రెడ్డి, నాగబాబు, మామిడాల వెంకటేశ్వరరావు, గోపాల్రావు పర్యవేక్షిచారు. -
పురుగుల మందు పిచికారీ చేస్తూ..
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన రైతు వాంకుడోత్ రవి (40) వరి పొలంలో శుక్రవారం పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందాడు. స్థానిక రైతుల కథనం ప్రకారం.. రవి తనకున్న ఎకరన్నర పొలంలో వరిసాగు చేశాడు. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేపట్టాడు. గురువారం పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేశాడు. శుక్రవారం వరి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పొలం నుంచి బయటకు వచ్చి నేలపై వాలిపోయాడు. గమనించిన సమీప రైతులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య సరిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు పోటు రవి, కృష్ణ, శారద తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అస్వస్థతకు గురై గిరిజన రైతు మృతి -
శాంతి భద్రతలను పరిరక్షించాలి
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ జూలూరుపాడు: శాంతి భద్రత పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. జూలూరుపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రికార్డులు, ఫైల్స్ పరిశీలించారు. పనితీరు, పెండింగ్ కేసుల పురోగతి, కోర్టు పరిధిలో ఉన్న కేసుల వివరాలపై సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్సైలు బాదావత్ రవి, శివరామకృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఘనంగా ఫ్రెషర్స్ డేకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నతస్థానాలకు ఎదగాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలు, మాదకద్రవ్యాలతో జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అధ్యాపకులు బండి వెంకటేశ్వరరావు, దనకొండ నరసింహారావు, బండి లక్ష్మణ్, రామలక్ష్మి, శ్రీరాములు, ప్రోగ్రాం కన్వీనర్ సముద్రాల శ్రీనివాస్, లైబ్రరీ బాబు, వన్ టౌన్ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. జామాయిల్ చెట్ల నరికివేతపై కేసు నమోదుములకలపల్లి: జామాయిల్ చెట్లు నరికివేతపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పొగళ్లపల్లి శివారు అటవీశాఖ (టీజీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో జామాయిల్ తోటలను పెంచుతున్నారు. ఈ నెల 5న అక్రమంగా జామాయిల్ చెట్లు నరుకుతుండగా, స్థానిక సిబ్బంది చేరుకునేలాగో నిందిడుతు పరారయ్యాడు. దంతెలబోరు గ్రామానికి చెందిన కాకర్ల చిన్నముత్యాలు అనే వ్యక్తి ప్లాంటేషన్లోని 80 చెట్లు నేలకూల్చాడని, రూ. 30 వేల నష్టం వాటిల్లిందని ప్లాంటేషన్ మేనేజర్ (పీఎం) నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురిపై.. పాల్వంచరూరల్: పశువులు, మేకలు మేపి జామాయిల్ తోటకు నష్టం కలిగించిన ఘటనలో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మొండికట్ట గ్రామ శివారులో తొంగల వెంకన్నకు చెందిన భూమిలో జామాయిల్ మొక్కలను సాగు చేశాడు. శుక్రవారం అదే గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్, నవీన్, ఓర్సు మల్లేష్ పశువులు, మేకలను చేలో మేపడంతో నాలుగువేల మొక్కలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతు ఫిర్యాదుతో ముగ్గురు పశువుల కాపరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువకుడిపై..దమ్మపేట: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువకుడిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన కుంజా చందు(19) అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ సైరన్ వాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
ఖమ్మం స్పోర్ట్స్: ప్రపంచంలో కొన్ని చిన్నదేశాల పేర్లను సైతం గుర్తుపెట్టుకోవడానికి అక్కడి ప్రజలు క్రీడల్లో రాణించడమే కారణమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందనే విషయాన్ని గుర్తించి విద్యార్థులను తీర్చిదిదిద్దేలా రాష్ట్రప్రభుత్వం నూతన క్రీడా పాలసీని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు కూడా గెలుపోటములను సమానంగా తీసుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని తెలిపారు. అనంతరం రఘురాంరెడ్డి కొద్దిసేపు టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. డీవైఎస్ఓ సునీల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్బాబు, పాల్గొన్నారు. మనోళ్ల ముందంజ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు తొలి రోజు హోరాహోరీగా కొనసాగాయి. అండర్–11 కేట గిరీ నుంచి సీనియర్స్ వరకు క్రీడాకారులు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డారు. కాగా, అండర్–17 బాలు ర సింగిల్స్లో పూల్ విన్నర్గా పి.జ్వాలిత్, అండర్–13 సింగిల్స్లో కోగిరి హితేష్ ముందంజలో నిలిచి నాకౌట్ దశకు చేరడం విశేషం. బాలికల విభాగంలో జి.సిరి తొలి మ్యాచ్లో విజయం సాధించింది. -
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మణుగూరు రూరల్ : ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ను తెరపైకి తెచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్పై రాజ్యాంగబద్ధంగా బిల్లు చేయాలని, ఇందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతుందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, ముత్యంబాబు, అడపా అప్పారావు, నూకారపు రమేష్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వేర్పులసురేష్, ముద్దంగుల కృష్ణ, రామకోటి, గుర్రం సృజన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు -
ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైట్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్ తెలిపారు. పదో తరగతి చదువుతున్న మహేందర్ అండర్– 17 ఖోఖో, అండర్– 14 కబడ్డీ పోటీలకు కె.హర్షిత్, ఖోఖో పోటీలకు కె.దిక్షీత్ అర్హత సాధించారని వివరించారు. వీరిని ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఖో–ఖో జిల్లా జట్టుకు ఎంపిక ఇల్లెందు/ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని బూరుగడ్డ పవిత్ర జిల్లా జట్టుకు ఎంపికై ంది. గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా, అండర్–14 విభాగంలో విద్యార్థిని ప్రతిభ చూపింది. త్వరలో భద్రాద్రి, ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగే పోటీల్లో పాల్గొననుంది. పవిత్రను పాఠశాల హెచ్ఎం సుధాకర్, పీఈటీ రాంబాబు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు అభినందించారు. నేడు ఉమ్మడి జిల్లా ఖో–ఖో ఎంపిక పోటీలు కల్లూరు: అండర్–19 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికకు శనివారం కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే, చదరంగం జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరుగుతాయని జిల్లా పాఠశాల ల క్రీడల సంఘం కార్యదర్శి ఎండీ.మూసా ఖలీం తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న బాలబాలికలు అర్హులని, ఆసక్తి ఉన్న వారు విద్యార్హతల సర్టిఫికెట్లు, మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. డీఎంఎల్టీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానంచుంచుపల్లి: 2025–26 విద్యాసంవత్సరానికి కొత్తగూడెం వైద్య కళాశాలలో డీఎంఎల్టీ 30, డయాలసిస్ టెక్నీషియన్లు 30 సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.హరిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు వైద్య కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. రూ. 22 వేలు కాజేసిన హ్యాకర్దుమ్ముగూడెం : మండలంలోని పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన మట్టా శేఖర్బాబు అకౌంట్ను హ్యాక్ చేసిన సైబర్ మోసగాళ్లు రూ.22,400 తస్కరించారు. శుక్రవారం బాధితుడు వివరాలు వెల్లడించాడు. హెచ్డీఎఫ్సీ అకౌంట్ ఖాతా నుంచి నగదు రూ.22,400 డ్రా చేసినట్లు శేఖర్బాబు ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన బ్యాంకు అధికారులను సంప్రదించగా అకౌంట్ హ్యాక్ చేసి, నగదు డ్రా చేశారని తెలిపారు. దీంతో బాధితుడు హైదరాబాద్లోని సైబర్ క్రైం పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆకతాయిల దాడిలో వ్యక్తికి గాయాలుకొత్తగూడెంటౌన్: ఆకతాయిల దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన శుక్రవారం టూటౌన్ ఏరియా పరిధిలోని రామవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రుద్రంపూర్లోని సెంటర్లో మద్యం తాగుతున్న యువకులను బొమ్మకంటి మధుకర్ అనే వ్యక్తి గతంలో మందలించాడు. చిన్నవయసులో మందు తాగొద్దని, మీ ఇంట్లో చెప్తానని హెచ్చరించాడు. ఆ విషయం మనసులో పెట్టుకుని అదే ప్రాంతానికి చెందిన రుద్రాక్ష్ (షానూ)అనే వ్యక్తి బీరు సీసాతో మధుకర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తలకు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. కోతుల దాడిలో వృద్ధుడికి తీవ్రగాయాలు పాల్వంచరూరల్: ఇంటి మీదకు వచ్చాయని అదిలించబోగా కోతులు దాడి చేయడంతో వృద్ధుడికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం మండలంలోని నారాయణరావుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు కొల్లు పెద్ద సుబ్బారెడ్డి ఇంటిమీద కోతులు వచ్చాయి. వాటిని కర్రతో తరిమే ప్రయత్నం చేయగా, అవి తిరిగి దాడి చేశాయి. దీంతో వృద్ధుడు కిందపడగా చేతులు, తలపై కరవడంతో స్పృహతప్పాడు. పక్క ఇంటివాళ్లు గమనించి వచ్చి కోతులను తరిమివేశారు. వృద్ధుడిని ఆటోలో పాల్వంచలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. -
హాహాకారాలు.. ఆర్తనాదాలు
బూర్గంపాడు: పాత సారపాక మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్ర గాయాలై హాహాకారాలు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో బస్సు భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తోంది. అదే సమయంలో కొత్తగూడెం నుంచి భద్రాచలానికి కొత్తగూడెం ఆర్టీసీ డిపో బస్సు వస్తోంది. ఈ క్రమంలో పాత సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ కొన్నాయి. దీంతో ఓ బస్సు కేబిన్లో మరో బస్సు కేబిన్ ఇరుక్కుపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లతోపాటు బస్సుల్లో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదకరమైన ఈ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించి తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్లు చెబుతున్నారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షంలు ఘటనాప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఒకదాంట్లో మరొకటి ఇరుక్కుపోయిన బస్సులను జేసీబీ సాయంతో విడదీశారు. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొనటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అరుపులు, కేకలతో ఆర్తనాదాలు చేశారు. చేతులకు, తలకు, కాళ్లకు, ఒంటిపై గాయాలై రక్తం కారుతుండటంతో హాహాకారాలు చేశారు. భద్రాచలంలో బస్సు ఎక్కినవారు తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ డాక్టర్లను, సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్యసేవలు అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారపాక మూలమలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
థర్మల్ విద్యుదుత్పత్తి అంతంతే!
● కేటీపీఎస్, బీటీపీఎస్ ప్లాంట్లలో రిజర్వ్ షట్డౌన్ ● కొద్దిరోజులుగా తగ్గిన థర్మల్ విద్యుత్ వినియోగంపాల్వంచ: ధర అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగతా సమయాల్లో యూ నిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరకు వస్తున్న హైడల్, సోలార్ విద్యుత్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ విద్యుత్ కేంద్రాల్లో పలు యూ నిట్లు రిజర్వ్షట్ డౌన్లకే పరిమితమవుతున్నాయి. దీంతో జెన్కో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. రిజర్వ్ షట్డౌన్లతో సతమతం కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారంలో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రావాల్సి ఉంది. 5వ దశలోని 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9,10 యూనిట్లు గురువారం వరకు రిజర్వ్ షట్డౌన్లోనే ఉన్నాయి. అకస్మాత్తుగా 6వ దశలోని 11వ యూనిట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో వెంటనే రిజర్వ్ షట్డౌన్లో ఉన్న 10వ యూనిట్ను అందుబాటులోకి తీసుకుని 11వ యూనిట్లో మరమ్మతు పనులు చేపట్టి శుక్రవారం పూర్తి చేశారు. ప్రస్తుతం 9,11 యూనిట్లు రెండూ రిజర్వ్ షట్డౌన్లోనే కొనసాగుతున్నాయి. వెయ్యి మెగావాట్లకు గాను 750 మెగావాట్లు రిజర్వ్షట్డౌన్లోనే నడుస్తున్నాయి. మణుగూరు బీటీపీఎస్ కర్మాగారంలో 1080 మెగావాట్లు కలిగిన 1,2,3,4 యూనిట్లలో 4,320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 1,2,4 యూనిట్లు రిజర్వ్షట్డౌన్లోనే ఉన్నాయి. ఫలితంగా 3,240 మెగావాట్ల ఉత్పత్తి తగ్గించారు. కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో 800 మెగావాట్లకు గాను 460 మెగావాట్లు మాత్రమే తీసుకుంటూ మిగతాది బ్యాక్డౌన్లో ఉంచుతున్నారు. రాత్రి సమయాల్లో ఒకటి, రెండు గంటలు మినహా మిగిలిన సమయాల్లో బ్యాక్ డౌన్లో యూనిట్ నడిపిస్తున్నారు. ఈ విషయమై 5,6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా.. థర్మల్ యూనిట్ఽ ధర ఎక్కువగా ఉందని రిజర్వ్షట్డౌన్లో ఉంచుతున్నట్లు, రాత్రి సమయాల్లో లోడ్ తీసుకుంటూ పగలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. -
రాళ్లు రువ్వుతున్న రహదారి
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో ఏళ్ల తరబడి జరుగుతున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్, రహదారి ఆధునికీకరణ పనులు ప్రజలకు శాపంగా పరిణమించాయి. నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డును తవ్వేసి వెట్మిక్స్ పోసి వదిలేశారు. దీంతో దుమ్ము రేగడంతోపాటు లారీల టైర్లకు తగిలి కంకర రాళ్లు ఎగిసి పడుతున్నాయి. రాళ్లు తగిలి దుకాణాల అద్దాలు పగిలిపోతున్నాయి. ఇళ్లలోకి వచ్చి పడుతున్నాయి. ఓ వ్యక్తి బైక్పై వెళుతుండగా రాయి వచ్చి ఛాతీపై తగలడంతో గాయపడ్డాడు. అశ్వారావుపేట–ఖమ్మం రహదారిలో నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. రూ.18 కోట్ల పనులను ఏళ్లతరబడి నిర్వహిస్తున్నా ఆ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంలేదు. భారీగా నగదు చేతులు మారిందని, అందుకే చర్యలు తీసుకోవడంలేదనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పగిలిపోతున్న దుకాణాల అద్దాలు -
పది రోజుల్లో పత్తి కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లు సీసీఐ నిబంధనలు కఠినంగా ఉన్నాయని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు టెండర్లకు దూరంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే సీసీఐ జిన్నింగ్ మిల్లులను గుర్తించి, మూడుసార్లు గడువు పొడిగించినా టెండర్ల దాఖలకు ముందుకు రాలేదు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో తేమ, నాణ్యత సాకుతో వ్యాపారులు క్వింటాకు రూ.6 వేలు మించి చెల్లించడం లేదు. ఫలితంగా కేంద్రప్రభుత్వం పత్తికి తేమశాతం ఆధారంగా రూ.8,110గా నిర్ణయించిన గరిష్ట దక్కక రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మరోమారు చర్చలు జరిపి నిబంధనల్లో కొన్ని మార్పులు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 15మిల్లుల యజమాన్యాలు టెండర్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లను పరిశీలించి కలెక్టర్ల ఆమోదంతో వారంలోగా ఖరారు చేయనున్నారు. ఆపై పది రోజుల్లోగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు మొదలుకానున్నాయి. క్రాప్ బుకింగ్ ఆధారంగానే... సీసీఐ పత్తి కొనుగోళ్లకు క్రాప్ బుకింగ్ ముడిపడి ఉండటంతో వ్యవసాయ శాఖ పంట నమోదును వేగవంతం చేసింది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనికోసం‘కపాస్ కిసాన్ యాప్’ను ప్రవేశపెట్టగా వ్యవసాయ అధికారులు పంట నమోదు పూర్తి చేసి వివరాలను మార్కెటింగ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వారంలో ఇది కూడా పూర్తయితే యాప్లోనే రైతులు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా కేటాయించిన జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా త్వరలోనే పూర్తిచేసి ఈనెల 22, 23వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇవే... ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధి ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలోని జీఆర్ఆర్ ఇండస్ట్రీస్, తల్లంపాడులోని శ్రీ సాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు చేయనుంది. అలాగే, మధిర మార్కెట్ పరిధి దెందుకూరులోని అమరావతి టెక్స్టైల్స్, మాటూరులోని మంజీత్ కాటన్ మిల్, ఇల్లెందులపాడులోని శ్రీ శివ గణేష్ కాటన్ ఇండస్ట్రీస్, నేలకొండపల్లి మార్కెట్ పరిధి ముదిగొండ మండలం సువర్ణాపురంలోని ఉషశ్రీ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్, వైరా మార్కెట్ పరిధి తల్లాడలోని స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, మద్దులపల్లి మార్కెట్ పరిధి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్, తిరుమలాయపాలెం మండలం గోల్తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్తో పత్తి కొనుగోలు చేస్తారు. ఇక భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇల్లెందు మార్కెట్ పరిధి కారేపల్లిలోని లక్ష్మీప్రియ జిన్నింగ్ మిల్, శ్రీలక్ష్మీప్రియ కొటెక్స్ జిన్నింగ్ మిల్, కొత్తగూడెం మార్కెట్ పరిధిలోకి వచ్చే కొత్తగూడెంలోని మంజిత్ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు మార్కెట్ పరిధి బూర్గంపాడులోని అనూశ్రీ జిన్నింగ్ మిల్, శ్రీ లక్ష్మీనర్సింహ జిన్నింగ్ మిల్, శ్రీ రమేష్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్, భద్రాచలం మార్కెట్ పరిధి అశ్వాపురంలోని శ్రీరామా జిన్నింగ్ మిల్లులోపత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.తేమ మద్దతు ధర 8 8,110 9 8,029 10 7,948 11 7,867 12 7,786జిల్లా సాగు దిగుబడి (ఎకరాల్లో) (క్వింటాళ్లలో) ఖమ్మం 2,25,613 27,07,356 భద్రాద్రి కొత్తగూడెం 2,40,345 28,05,576 -
పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ !
పాల్వంచ: పాల్వంచలో మరో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ముందడుగు పడింది. కొత్తగా ఒకటి లేదా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయాలని జెన్కో యాజమాన్యం న్యూ ఢిల్లీకి చెందిన డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ బృందం పాత ప్లాంట్ ప్రదేశంలో త్వరలో సర్వే చేపట్టనుంది. అయితే అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కలిగిన 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు సాధ్యమేనా అనే అంశంపైనా పరిశీలన చేయనున్నారు. ఖాళీగా 400 ఎకరాలు.. పాత ప్లాంట్ కూల్చివేతతో సుమారు 400 ఎకరాల స్థలం ఖాళీ అయింది. ఇక్కడ నీటి వనరులు, రైల్వే మార్గం, సింగరేణి బొగ్గు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు, రిజర్వాయర్లు, యాష్ పాండ్ల వంటి భౌగోళిక వనరులు అందుబాటులో ఉన్నందున తక్కువ ఖర్చుతో మరో ప్లాంట్ నిర్మించాలని పలువురు కోరారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సైతం ఇటీవల పార్లమెంట్లో ఇదే అంశాన్ని కోరగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసి తమ వంతు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో జెన్కో యాజమాన్యం కొత్త ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సర్వే చేయాలని ఢిల్లీకి చెందిన డిజైన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే సదరు కంపెనీ బృందం కర్మాగారాన్ని సందర్శించనుంది. పాత ప్లాంట్ కూల్చివేతతో తీరని నష్టం.. పాల్వంచలో 1965 – 78 మధ్య కాలంలో కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని నిర్మించారు. ఇందులో ఏ, బీ, సీ స్టేషన్లలో 1, 2, 3, 4 యూనిట్లు ఏర్పాటు చేసి 720 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. జపాన్ టెక్నాలజీతో తొలి యూనిట్ నిర్మాణానికి రూ.59.29 కోట్లు ఖర్చు చేశారు. ఈ కర్మాగారం కాలం చెల్లడంతో పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా 2018లో మూసేశారు. అనంతరం ఈ కర్మాగారంలో దశల వారీగా కూల్చివేత పనులు చేపట్టి గతేడాది ఆగస్టు 5న చివరగా కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. అయితే ఈ కర్మాగారం తొలగింపుతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సుమారు 2,500 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా పడింది. కొత్తగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కలిగిన 7వ దశ నిర్మాణం జరిగినా తక్కువ మంది ఉద్యోగులతోనే కర్మాగారం నడుస్తుండడంతో అత్యధిక శాతం మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం చేశా రు. తొలుత అమ్మవారి జన్మస్థలంవద్ద పంచా మృతాలతో పాటు పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నివేదన, పంచహారతి, నీరా జన మంత్రపుష్పం సమర్పించారు. కుంకమ పూజ, గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికఅశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన కేశిబోయిన భవ్య శ్రీలక్ష్మి రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో శ్రీలక్ష్మి అద్భుత ప్రతిభ కనబర్చింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ పోటీలకు హాజరు కాగా శ్రీలక్ష్మి ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు బాలిక హాజరు కానుంది. కాగా, శ్రీలక్ష్మి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 175 మంది అధికారులకు పదోన్నతిసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 175 మంది అధికారులకు కేడర్ స్కీమ్లో భాగంగా పదోన్నతులు కల్పిస్తూ కార్పొరేట్ కార్యాలయం ఈఈ సెల్ హెచ్ఓడీ ఏజే మురళీధర్రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో డిప్యూటీ మేనేజర్, అడిషినల్ మేనేజర్, సీనీయర్ అండర్ మేనేజర్, అండర్ మేనేజర్, సీనియర్ సర్వే ఆఫీసర్, సర్వే ఆఫీసర్, డీవైఎస్ఈ, ఈఈ, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ స్థాయి అధికారులు ఉన్నారు. డబ్లింగ్ లైన్ పనులు పరిశీలన కారేపల్లి: కారేపల్లి రైల్వేస్టేషన్ మీదుగా నిర్మిస్తున్న డబ్లింగ్ లైన్ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణ శుక్రవారం పరి శీలించారు. డోర్నకల్ రైల్వే జంక్షన్నుంచి కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నిర్మించే లైన్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కాగా, లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారు పరిహారం చెల్లించాలని కోరగా డీఆర్ఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం కారేపల్లి గ్రామస్తులు డీఆర్ఎంను కలిసి కరోనా సమయాన రద్దు చేసిన డోర్నకల్–భద్రాచలం రోడ్, మణుగూరు–కాజీపేట జంక్షన్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. అంతేకాక డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు వెళ్లే అన్ని రైళ్లకు కారేపల్లిలో హాల్టింగ్ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. గ్రామస్తులు సురేందర్రెడ్డి, సురేందర్ మణియార్, తురక నారాయణ, అజ్మీర బిచ్చ్యానాయక్, తొగర శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ఉద్యోగుల క్రీడలు షురూ..
● జోనల్ పరిధి నుంచి హాజరైన ఉద్యోగులు ● పోటీలను ప్రారంభించిన సీసీఎఫ్ భీమానాయక్ చుంచుపల్లి: రెండు రోజుల పాటు నిర్వహించనున్న అటవీ శాఖ ఉద్యోగుల జోనల్ స్థాయి క్రీడా పోటీలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సీసీఎఫ్ భీమానాయక్ శుక్రవారం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉద్యోగులకు 800 మంది అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు కబడ్డీ, షటిల్, రన్నింగ్, వాలీబాల్, క్రికెట్ పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ప్రారంభం సందర్భంగా భీమానాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అటవీ, పర్యావరణ పరిరక్షణలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని చెప్పారు. ఇదే సమయాన క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే పలు క్రీడాంశాల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల డీఎఫ్ఓలు, ఎఫ్డీఓలు, డీఆర్ఓలు, రేంజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధనంపై నజర్
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వినియోగదారులు.. కొన్ని బంకుల వారు చేసే మోసాలతో నష్టపోతున్నారు. డబ్బులు సరిగానే తీసుకుంటున్నా పెట్రోల్, డీజిల్ తక్కువగా కొట్టడం, ఇంధనంలో కల్తీ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తద్వారా వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసి బంక్ నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నా.. చాలా బంక్ల యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలో సింగరేణి ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్ల ఏర్పాటుతో నాణ్యమైన ఇంధనం లభ్యమవుతుందని, తగ్గింపులు ఉండవని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంఅర్బన్: బొగ్గు ఉత్పత్తితో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునే మార్గాలను ఎంచుకుంటున్న సింగరేణి.. అందులో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బంగారం, రాగి గనుల అన్వేషణ, సోలార్ విద్యుదుత్పత్తితో పాటు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏడు ఏరియాల్లో బంకుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతోంది. ఆయిల్ కంపెనీలకు సింగరేణి స్థలాలు లీజుకు ఇచ్చేందుకు పది రోజుల క్రితమే భూమి కేటాయించారు. తద్వారా సంస్థ స్థలాలను కాపాడుకోవడంతో పాటు వాటి నుంచి ఆదాయం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు బంక్లు నిర్మించి ఇస్తే వాటి నిర్వహణ బాధ్యతను సింగరేణి అధికారులే చూస్తారు. సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్ల ఏర్పాటుతో వాహనాదారుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు బంకుల ఏర్పాటు.. సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, బెల్లంపల్లి, కొత్తగూడెం, మణుగూరు, రామగుండం ఏరియాలో మొత్తం ఏడు బంకుల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయిల్ కంపెనీలకు భూమిని సైతం కేటాయించగా.. ఎన్ఓసీ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు నాగపూర్లోని పీఈఎస్ఓకి ఆయా కంపెనీల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. అనుమతి రాగానే పెట్రోల్ బంకుల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కేటాయించిన స్థలాలను చదును చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులు నిర్మించి సింగరేణికి అప్పగిస్తే.. నిర్వహణ బాధ్యతలను సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. సింగరేణి స్థలానికి లీజుతోపాటు లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రూ.2 చొప్పున కమీషన్ ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. తొలిదశలో ఏడు బంక్లు నిర్మిస్తుండగా.. ఇవి విజయవంతంగా నడిస్తే భవిష్యత్లో మరిన్ని బంకుల ఏర్పాటుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో స్థానికంగా ఉండే నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. పెట్రోల్బంక్ల ఏర్పాటుకు సింగరేణి స్థలాల లీజు -
భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
● ఖమ్మంలో టీటీడీ ఆలయానికి 13న స్థల పరిశీలన ● దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సాక్షిప్రతినిధి, ఖమ్మం: దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అధికారులతో శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాచలం ఆలయ విస్తరణ కోసం భూసేకరణ పూర్తయిందన్నారు. మాడవీధుల విస్తరణ, ప్రాకార గోడల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా ఆర్కిటెక్ట్ రూపొందించిన డిజైన్లను ఖరారు చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. భక్తులకు వసతి, రవాణా, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాద్రి రామాలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని అన్నారు. టీటీడీ ఆధ్వర్యాన ఆలయ నిర్మాణం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన ఖమ్మం నగరంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందుకోసం మూడు ప్రాంతాలను కలెక్టర్ టీటీడీ అధికారులకు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మేరకు వచ్చే సోమవారం టీటీడీ అధికారులు ఖమ్మంలో పరిశీలించి ఆలయ స్థలాన్ని ఖరారు చేస్తారని మంత్రి వెల్లడించారు. -
స.హ.చట్టం.. శక్తివంతమైన ఆయుధం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీ పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాక ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ప్రజలకు శక్తినిచ్చే పదునైన ఆయుధం వంటిదని అన్నారు. పారదర్శకత పెంపొందించి, అధికారుల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పుతుందని చెప్పారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా పాలనలో విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. శాఖల వారీగా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రతీ కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓ, అప్పీలేట్ అథారిటీని నియమించి, ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అన్నారు. సమాచారం ఇచ్చేందుకు నిరాకరించాల్సి వస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అన్ని శాఖల సిబ్బందికి ఈ చట్టంపై అవగాహన కల్పించాలని, ఈ మేరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీఎస్ఓ రుక్మిణి, బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ.. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశామని, ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించామని తెలిపా రు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వొద్దని అధికారులను, సెక్యూరిటీ గార్డ్ను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నిత్యకల్యాణ వేడుకకు చైన్నె భక్తులు పోటెత్తారు. ఏకకాలంలో 200 మంది దంపతులు పాల్గొనడంతో చిత్రకూట మండపం కిటకిటలాడింది. చైన్నెలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన సభ్యులు ముందుగానే నిత్యకల్యాణ టికెట్లు బుక్ చేసుకున్నారు. కల్యాణం అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చైన్నె, ఇతర భక్తులు కలిపి మొత్తం 240 జంటలు నిత్యకల్యాణంలో పాల్గొనడం రికార్డుగా నమోదైంది. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలు చేశారు. నిత్యకల్యాణానికి హాజరైన 200 మంది చైన్నె భక్త దంపతులు -
ప్రాణాలతో చెలగాటం !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒకప్పుడు దీపావళి టపాకాయలను తమిళనాడులోని శివకాశి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి అమ్మేవారు. గత రెండేళ్లుగా జిల్లాలోనే హోల్సేల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ షాపుల వద్ద సైతం నిబంధనల ఉల్లంఘన సాగుతోంది. మొక్కుబడిగా.. హోల్సేల్ షాపులు ఆరంభించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని హామీలు ఇచ్చే వ్యాపారులు ఆ తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంటలు అంటుకునే స్వభావం ఉండే వస్తువులు హోల్సేల్ షాపుల దగ్గర ఉండకూడదు. కానీ ఈ షాపుల దగ్గర భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సరిపడా ఫైర్ ఎక్సిటింగ్ విషర్లు లేవు. ఫైర్ ఫైటింగ్లో శిక్షణ పొందిన సిబ్బంది కేవలం కాగితాల్లోనే ఉన్నారు. హోల్సేల్ షాపులో టేబుల్ వేసి మరీ స్టాక్ ఉన్న బాణ సంచాకు సంబంధించిన ప్యాకెట్లను ఓపెన్ చేసి షో పీస్లను ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల భద్రాచలంలో బాణ సంచా అక్రమ విక్రయాలపై దాడులు జరగడం, ఏపీలో బాణ సంచా తయారీ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితిలో గురువారం మార్పులు చోటు చేసుకున్నాయి. షో పీస్లు తొలగించారు. మొక్కుబడిగా ఒకటి రెండు అన్నట్టుగా ఫైర్ ఎక్సిటింగ్ విషర్లు ఏర్పాటు చేశారు. ఇక వాటర్ ట్యాంకులు, వాటి పనితీరు ఎలా ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికీ మారనితీరు.. గతంలో శివకాశి నుంచి కొనుగోలు చేసిన సందర్భాల్లో చాలా మంది బాణ సంచా స్టాక్ను తమ ఇళ్లు, లేదా ఇతర వ్యాపారాలకు సంబంధించిన గోదాముల్లో నిల్వ చేసే వారు. హోల్సేల్ షాపులు వచ్చిన తర్వాత ఈ పద్ధతికి చాలా మంది స్వస్తి పలికారు. కానీ, కొందరు ఈ పద్ధతిని ఇప్పటికీ మార్చుకోవడం లేదు. కొత్తగూడెంలో పెద్ద బజార్లో ఒక వ్యాపారి, రామాటాకీస్ ఏరియాలో మరొకరు ఈ తరహాలో బాణ సంచాను ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇక రామవరం ఏరియాలో ఓ ఖద్దరు నేత ఇంటినే బాణ సంచా దుకాణంగా మార్చారు. మణుగూరు పట్టణంలో టీడీపీ సెంటర్ దగ్గర ఒకరు, పూల మార్కెట్ దగ్గర ఇద్దరు వ్యాపారులు తమ ఫ్యాన్సీ స్టోర్ గోదాముల్లోనే బాణ సంచా నిల్వలు ఉంచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పాల్వంచలో సీతారామపట్నం దగ్గర ఓ ఇంట్లో మరో వ్యాపారి, ఇల్లెందులో ఆంబజార్ ఏరియాలో కొందరు వ్యాపారులు వీటిని ఇళ్లలోనే నిల్వచేసుకుంటూ ప్రమాదాలతో చెలగాటం ఆడుతున్నారు. వీరంతా దీపావళితో పాటు వివిధ శుభ, అశుభ కార్యాలకు అవసరమైనప్పుడు బాణసంచాను విక్రయిస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోసం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఎం. క్రాంతికుమార్ సంప్రదించగా ఆయన సెలవులో ఉన్నారు. దీంతో కొత్తగూడెం ఫైర్ ఆఫీసర్ పుల్లయ్యను సంప్రదించగా అనుమతి లేకుండా పరిమితికి మించి ఇళ్లలో కానీ షాపుల్లో కానీ ఎవరైనా అక్రమంగా బాణ సంచా నిల్వ చేస్తే చర్యలు తప్పవని, అక్రమ నిల్వలపై సమాచారం ఇస్తే తనిఖీలు చేపడతామని చెప్పారు. తయారీదారుడు ప్యాక్ చేసిన రీతిలోనే బాణసంచాను డిస్ప్లేలో ఉంచాలి. ప్యాక్ ఓపెన్ చేసి ఉంచకూడదు 5 కేజీల సామర్థ్యం కలిగిన డీసీపీ ఫైర్ ఎక్సిటింగ్ విషర్లు ఆరు ఉండాలి. 4.5 కేజీల సామర్థ్యం కలిగిన సీఓటూ ఎక్సిటింగ్ విషర్లు రెండు ఉండాలి బాణ సంచా నిల్వ చేసే గోదాం పైభాగంలో 1000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, దిగువ భాగంలో 450 లీటర్ల సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంకులు (బూస్టర్ పంప్తో కలిపి) ఉండాలి. వీటికి అనుసంధానమైన వాటర్ పైపులు, హోస్లు కండిషన్లో ఉండాలి అగ్ని, పొగలను గుర్తించే ఆటోమేటిక్ అలారమ్ ఏర్పాటు చేసుకోవాలి నో స్మోకింగ్తో పాటు సదరు దుకాణం దగ్గర చేయాల్సిన, చేయకూడని చర్యలను తెలిపే బోర్డులు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి ఫైర్ ఫైటింగ్లో శిక్షణ పొందిన వారిని ఇక్కడ నియమించాలి పోలీసులు, ఫైర్సేఫ్టీ, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. -
ఎస్జీఎఫ్ విజేతలకు బహుమతుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ముగియగా విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. అండర్ – 17 బాలుర విభాగం కబడ్డీలో మొదటి బహుమతిని ఇల్లెందు జట్టు కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని అశ్వారావుపేట, తృతీయ బహుమతిని కొత్తగూడెం జోన్లు దక్కించుకున్నాయి. ఖోఖో పోటీల్లో ప్రథమ బహుమతి అశ్వారావుపేట, ద్వితీయ బహుమతి కొత్తగూడెం, తృతీయ బహుమతి పాల్వంచ జోన్లు దక్కించుకోగా, వాలీబాల్ పోటీల్లో పాల్వంచ ప్రథమ బహుమతి, ఇల్లెందు ద్వితీయ బహుమతి, కొత్తగూడెం తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, డీవైఎస్ఓ పరంధామరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సీత, సుజాత, బుగ్గ వెంకటేశ్వర్లు, భావ్సింగ్ లక్ష్మణ్, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ధరలో దగా!
బూర్గంపాడు: ఈ ఏడాది అధిక వర్షాలు, తెగుళ్లు పత్తి రైతులను కలవరపెడుతున్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వారిని వేధిస్తోంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా చేతికొస్తున్న పంటను అమ్ముదామంటే కొనే నాథుడు లేడు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా.. ప్రైవేట్ వ్యాపారులు తేమ పేరుతో అందులో సగం ధరకే కొంటున్నారు. ప్రతికూల వాతావరణంతో అసలే దిగుబడి రాక దిగులు చెందుతుండగా ధరల పతనం రైతులను మరింతగా కలవరపెడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి అమ్మాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఇంతవరకు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో పెట్టుబడి అవసరాల కోసం తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన సాగు జిల్లాలో పత్తి సాగు గతేడాది కంటే పెరిగింది. సుమారు 2.21 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయగా 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు పత్తిపంటను నష్టపరిచాయి. ప్రతికూల వాతావరణంతో చేలు ఆశాజనకంగా లేవు. ఎరువులు, పురుగుమందుల వినియోగంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఎకరాకు కనిష్టంగా రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది సగటున ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో తొలివిడత పత్తి తీతలు కొనసాగుతుండగా అమ్మితే వచ్చిన డబ్బు కూలీలకు, పురుగుమందులకు వెచ్చిద్దామని భావించారు. కానీ కొనుగోళ్లు చురుగ్గా సాగడం లేదు. స్థానిక వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3వేల నుంచి 4వేల మధ్యనే అడుగుతున్నారు. దీంతో రైతులు పత్తి అమ్మాలా, నిల్వ ఉంచాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. కొందరు అవసరాల కోసం తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. రూ.5వేలకు మించని ధర కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కనప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర క్వింటా రూ.5వేలకు మించడం లేదు. జిల్లా రైతులు పత్తిని విక్రయించేందుకు సరైన మార్కెట్ సౌకర్యాలు లేవు. ఖమ్మం, వరంగల్ వెళ్లాలంటే రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అక్కడికి వెళ్లినా తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకుతో ధరలో విపరీతంగా కోతపెడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరముంది. తేమ ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే సీసీఐ కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరిస్తే తప్ప పత్తికి ధర రాదు. ఊళ్లలో వ్యాపారులు క్వింటా రూ.4వేల నుంచి రూ.5వేలకే అడుగుతున్నారు. క్వింటా పత్తి తీసేందుకే కూలీలకు రూ.3,500 ఖర్చవుతోంది. రూ.ఐదు వేలకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. ఈసారి పదెకరాల్లో పత్తి వేయగా ఐదెకరాలు వరదలకు దెబ్బతిన్నది. మిగతా ఐదెకరాల్లో 30 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – ధరావత్ శ్రీను, బోజ్యాతండా, జూలూరుపాడు మండలం ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు పత్తిచేలు దెబ్బతిన్నాయి. మొక్కలు పెరిగినా కాపు నిలువలేదు. ఎన్ని ఎరువులు వేసినా, మందులు కొట్టినా పెద్దగా మార్పు లేదు. దీనికి తోడు ధర కూడా లేకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం పత్తి అమ్మితే ఆ డబ్బులు పత్తి ఏరిన కూలీలకే సరిపోతున్నాయి. – నిమ్మల రాములు, రైతు, నాగినేనిప్రోలు, బూర్గంపాడు మండలం çÜ$gê™èl¯]lVýSÆŠæḥ: ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చయింది. అధిక వర్షాలతో పంట దెబ్బతిని కాయలు నల్లబారుతున్నాయి. పూత, పిందె రాలిపోతోంది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. –వెంకటకృష్ణ, సుజాతనగర్ -
ఆశలపై నీళ్లు!
తొలిరోజు కొందరే.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం గురువారం తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం10.30 గంటల నుంచి తొలి విడత ఎన్నికలు జరిగే అశ్వాపురం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, బూర్గంపాడు, జూలూరుపాడు, చర్ల మండలాల పరిధిలోని 11 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 113 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రిజర్వేషన్లపై బుధవారం విచారించిన హైకోర్టు.. తీర్పును గురువారానికి వాయిదా వేసిన నేపథ్యంలో తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 17 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. భద్రాచలంలోని 1, 2, 3, 4, 12, 13, 14 ఎంపీటీసీ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబెల్లి–1, నర్సాపురం–2, లక్ష్మీనగరం–1, ప్రగళ్లపల్లి–1, నారాయణరావుపేట –1, దుమ్ముగూడెం–1, తూరుబాక–1 చొప్పున, అశ్వాపురం మండలం మొండికుంట ఎంపీటీసీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 11 మండలాల పరిధిలో జెడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా, హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తొలిరోజు వేసిన నామినేషన్లను అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది కొంత సందిగ్ధం నెలకొంది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మిని సంప్రదించగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన అధికారులు.. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆయా కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నామినేషన్ల దాఖలు సందర్భంగా పోటీచేసే అభ్యర్థులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. హైకోర్టు స్టేతో ఆగిన ఎన్నికల ప్రక్రియ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.41.02 లక్షలుపెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. మే 29 నుంచి ఈనెల 8 వరకు కానుకలు లెక్కించగా రూ.41,02,731 ఆదాయం లభించింది. ఇంకా నాలుగు విదేశీ నోట్లు, విదేశి నాణేలు 20 లభ్యమయ్యాయి. అలాగే 2024 మార్చి 14 నుంచి ఈనెల 8 వరకు హుండీల్లో 120 గ్రాముల మిశ్రమ బంగారం, 2.600 కేజీల వెండి లభించినట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. దేవాదాయ శాఖ డివిజినల్ పరిశీలకులు పి.భేల్సింగ్ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. పామాయిల్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కిరణ్కుమార్ అశ్వారావుపేటరూరల్ : స్థానిక నర్సరీలో రైతులకు అవసరమైన పామాయిల్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కిరణ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన పీఈక్యూ(పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) నిపుణుల బృందంతో కలిసి అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ నర్సరీని సందర్శించారు. పామాయిల్ మొక్కల పెంపకానికి సిద్ధం చేసిన షేడ్ నెట్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తి చేస్తామని, 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా 4.50లక్షల మొక్కలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఓపీడీ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, ఉద్యాన శాస్త్రవేత్త విద్యాసాగర్, క్వారంటైన్ నిపుణులు వెంకటరెడ్డి, ఆయిల్ఫెడ్ డీఓ రాధాకృష్ణ, ఖమ్మం డీఓ సబావత్ శంకర్ పాల్గొన్నారు. హాస్టళ్లకు వంట సామగ్రి పంపిణీ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు నూతన వంట సామగ్రి పంపిణీ చేశామని డీడీ జి.అశోక్ తెలిపారు. పట్టణంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహ సిబ్బందికి గురువారం ఆయన సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు వంట సామగ్రితో పాటు 3,023 మంది విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్నాక్స్ గిన్నెలు పంపిణీ చేశామని వివరించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏటీడీఓ భారతీదేవి, అధికారులు వెంకటరమణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విరిగిపడ్డ సీతమ్మ తల్లి బొమ్మ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు రామాయణ ఇతివృత్తం తెలిసేలా గోదావరి కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన బొమ్మలు విరిగిపోతున్నాయి. ప్రముఖ చిత్రకారుడు బాపు నేతృత్వంలో రామాయణ ముఖ్య ఘటనలకు సంబంధించిన బొమ్మలను ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు బొమ్మలను విరగగొడుతున్నారు. సీతమ్మ తల్లి బొమ్మ విరిగి కిందపడి ఉండటంతో భక్తులు అసహనం చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి, రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 12న యోగా పోటీలుకొత్తగూడెంటౌన్: హైదరాబాద్లో ఈ నెల 12న జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలను విజయవంతం చేయాలని టీవైటీసీసీ ఉమ్మడి జిల్లాల చైర్మన్ గుమలాపురం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఆదియోగ పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. వివరాలకు 92902 10218 నంబర్లో సంప్రదించాలని కోరారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ గేటు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలో వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,200 క్యూసెక్కుల వరదనీరు రావడంతో గురువారం నీటిమట్టం 406.70 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్కు చెందిన ఒక గేటును ఎత్తివేసి 4వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. ఇసుక లారీ, జేసీబీ సీజ్ బూర్గంపాడు: మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని, లోడ్ చేస్తున్న జేసీబీని గురువారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మహిళ అదృశ్యంభద్రాచలంఅర్బన్: పట్టణంలో జగదీష్ కాలనీకి చెందిన వివాహిత విమల బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఆమె భర్త రాజుదేవర రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోతుల దాడిలో రైతుకు గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని చల్లసముద్రం క్యాంపు సెంటర్ గ్రామానికి చెందిన రైతు షేక్ మౌలానా గురువారం కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్న సమయంలో పొలం వద్దకు వెళుతున్న ఆయన్ను కోతులు వెంబడించాయి. చుట్టుముట్టి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. గమనించిన స్థానికులు కర్రలతో అక్కడకు చేరుకుని కోతులను తరిమివేశారు. రైతుకు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. దాడి ఘటనలో కేసు నమోదుఇల్లెందురూరల్: దాడి ఘటనలో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని బియ్యని దినేష్ అనే వ్యక్తి తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ మండలంలోని ములకలపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొర్లగుంపు గ్రామానికి చెందిన దినేష్ తరచూ ములకలపల్లి గ్రామానికి వచ్చి తనపట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, ప్రశ్నించినందుకు కర్రలతో దాడిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిభార్య, ఇద్దరు పిల్లలకు గాయాలు అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మణుగూరుకు చెందిన సీహెచ్. రాము(38) తన భార్య ఇద్దరు పిల్లలతో బైక్పై భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొండికుంట గ్రామ సమీపంలో సువ్వల మోరి వద్ద మణుగూరు నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న డీసీఎం వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో రాము తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో భద్రాచలం తరలించారు. సీఐ అశోక్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఉన్న అరుగుపై మృతదేహం ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భిక్షాటన చేసుకుని జీవిస్తుండేవాడని, అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు తెలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కుడి చేతిపై హిందీలో పచ్చ బొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మార్చురీలో ఉంచామని, వివరాలు తెలిస్తే 87126 82106, 87126 82105లో సంప్రదించాలని టౌన్ సీఐ నాగరాజు కోరారు. -
ఆయిల్ఫెడ్ అదుర్స్!
గణనీయంగా పెరుగుతున్న ఓఈఆర్ పామాయిల్ రికవరీ రేటు(ఓఈఆర్) ఏటా గణనీయంగా పెరుగుతోంది. దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో 2017లో ఏర్పాటుచేసిన అధునాతన ఫ్యాక్టరీతో ఓఈఆర్ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీజీ ఆయిల్ఫెడ్ ద్వారా వచ్చిన ఆయిల్ రికవరీ రేటు శాతం ఆధారంగానే ఏపీలో ఉన్న ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆయిల్పామ్కు ధరను ప్రకటించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయిల్ రికవరీ రేటు 19.90 పైగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఇదే జరిగితే ఆయిల్ఫెడ్ చరిత్రలోనే ఈ ఆయిల్ సంవత్సరపు ఓఈఆర్ అత్యధికం కానుంది. అదనపు ఫ్యాక్టరీల నిర్మాణం టీజీఎస్ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగు చేపడుతున్నారు. సుమారు 70 వేల ఎకరాల నుంచి గెలల దిగుబడి వస్తోంది. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో గెలల దిగుబడి కూడా ఏటా పెరుగుతోంది. దిగుబడికి అనుగుణంగా ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో అదనపు ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అప్పారావుపేట, అశ్వారావుపేటల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఉండగా, సిద్దిపేటలోని నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసుకుంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. గెలల దిగుబడి పెరగడంతో అశ్వారావుపేటలో మరో అదనపు ఫ్యాక్టరీని కూడా త్వరలోనే నిర్మించనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సిద్దిపేట, నారాయణపేట, గద్వాల్, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాల్లో సేకరణ కేంద్రాల ద్వారా గెలలను సేకరించి, లారీల్లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. దిగుబడి లక్ష్యాలు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండటంతో దిగుబడి లక్ష్యాలు కూడా పెరుగుతున్నాయి. 2020–21లో ఆయిల్ఫెడ్ పామాయిల్ గెలల దిగుబడి లక్ష్యం 2 లక్షల టన్నులు కాగా 2024–25కు మూడు లక్షల టన్నులకు చేరుకుంది. ఆయిల్ దిగుబడి లక్ష్యం దిగుబడి (ఓఈఆర్ సంవత్సరం) (టన్నుల్లో) (టన్నుల్లో) 2020–21 2,00,000 2,29,380 19.22 2021–22 2,25,000 2,64,520 19.32 2022–23 2,50,000 2,70,375 19.17 2023–24 2,75,000 2,27,110 19.42 2024–25 3,00,000 2,95,000 ఆయిల్ ఫెడ్ లక్ష్యానికి అతి చేరువలో ఉంది. మరో వారం రోజుల్లో టార్గెట్ పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆయిల్ సంవత్సరంలో మూడు లక్షల టన్నుల పామాయిల్ గెలల సేకరణను ఆయిల్ ఫెడ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నెల 7వ తేదీ వరకే 2.95 లక్షల టన్నులను సేకరించింది. రేటు అనేక ఎత్తుపల్లాలు చవిచూసినా ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.19,400తో ఆశాజనకంగా ఉంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతాంగం స్థిర ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ సాగు వైపు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో ఏటా సాగు విస్తీర్ణంతోపాటు పంట దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. గెలల క్రషింగ్ కోసం యాజమాన్యం కూడా అదనపు ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది. కాగా నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31వరకు ఆయిల్ సంవత్సరంగా పేర్కొంటారు. –దమ్మపేటప్రస్తుత ఆయిల్ సంవత్సరంలో నిర్దేశించిన పామాయిల్ గెలల దిగుబడి లక్ష్యాన్ని అతి త్వరలోనే అధిగమించబోతున్నాం. ఆయిల్పామ్ తోటల సాగు విస్తీర్ణంతోపాటు గెలల దిగుబడి కూడా పెరిగింది. అత్యధిక ప్రమాణాలు కలిగిన ఆధునిక యంత్రాల ద్వారా క్రషింగ్ చేయడం ద్వారా ఆయిల్ రికవరీ రేటు శాతం గణనీయంగా పెరుగుతోంది. – కల్యాణ్, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ -
సైబర్ నేరస్తుడి అరెస్ట్
దుమ్ముగూడెం: సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు దుమ్ముగూడెం పోలీసులు గురువారం తెలిపారు. సీఐ వెంకటప్పయ్య కథనం ప్రకారం.. మండలంలోని పెద్దనల్లబల్లి గ్రామ సెంటర్లో బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపాయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 150 పాత ఫోన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా బిహార్ రాష్ట్రంలోని కతీహార్ జిల్లాకు చెందిన అక్తర్ అలీగా తేలింది. ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తూ, ప్రజల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొని బిహార్కు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేసే తన్వీర్మరియు, హలీమ్లకు అందజేస్తున్నాడు. వారు మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్వేర్లను మార్చేసి ఇస్తే నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. ఆ నగదును అందరూ పంచుకుంటున్నట్లు విచారణలో వెల్లడించాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.150 పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం -
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
పినపాక: పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎల్సిరెడ్డిపల్లిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు వంటగది, డైనింగ్ హాల్, పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. వర్షాకాలం వస్తున్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డైలీ వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నందుకు పాఠశాలలో చెత్త పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులన నైపుణ్యాలను పరిశీలించారు. రోజూ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ గోపాలకృష్ణ, హెచ్ఎం వీరా కుమారి, వార్డెన్ విజయ పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలి అశ్వాపురం: ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. గురువారం ఆయన మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు, హాజరు పుస్తకాలను పరిశీలించారు. ప్రజా సేవల అమలుపై ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, ఎడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ -
ఏఆర్టీ బాధితులపై వివక్ష చూపొద్దు
చుంచుపల్లి/టేకులపల్లి: ఏఆర్టీ బాధితులకు వివక్ష లేకుండా వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. గురువారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు బాధితులకు భయం, సంకోచం వంటి ఉంటాయని, ఆ సమయంలో వైద్యసిబ్బంది ఆత్మీయతతో వ్యవహరించాలని చెప్పారు. యువత పొగాకుకు దూరంగా ఉండాలి యువత పొగాకుకు దూరంగా ఉండాలని డీఎంహెచ్ఓ జయలక్ష్మి అన్నారు. గురువారం టొబాకో ఫ్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తంబాకు, గుట్కా, పొగాకు, చుట్ట, బీడీ వినియోగం ల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్సీడీపీఓ డాక్టర్ మధువరణ్, వైద్యులు దినేష్, డాక్టర్లు రమేష్, నర్సింహారావు, శాంసన్, ప్రవీణ్, పుల్లారెడ్డి, సిబ్బంది పార్వతి, చంద్రకళ దేవా తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి -
నేటి నుంచి టీ.టీ. ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన హాల్లో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ జరగనుంది. బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు ఖమ్మం చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలు అండర్–11 నుంచి సీనియర్స్ వరకు బాలబాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో జరుగుతాయి. టేబుల్ టెన్నిస్ పోటీలకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుంచి ర్యాంకింగ్ క్రీడాకారులు వచ్చారు. ఇక్కడ ప్రతిభ చూపేవారిని మధ్యప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం. టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. – వి.సాంబమూర్తి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు -
మాజీ దళ కమాండర్ సీపీఎంలో చేరిక
పాల్వంచ: ప్రజా ప్రతిఘటన రాష్ట్ర నాయకుడిగా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల బాధ్యుడిగా, ఏజెన్సీ దళ కమాండర్గా పనిచేసిన శంకరన్న అలియాస్ దాసరి వీరయ్య సీపీఎంలో చేరారు. గురువారం మంచికంటి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కొండబోయిన వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, పాకాల వెంకట్రావ్, తులసీరాం, కంటె శ్రీను, నాగభూషణం, వినోద, నాగర్జున తదితరులు పాల్గొన్నారు. కై క విగ్రహం ధ్వంసంపై కేసు నమోదుభద్రాచలంఅర్బన్: పట్టణంలోని కరకట్ట ప్రాంతంలో ఉన్న కై క విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం భద్రాచలం దేవస్థానం ఏఈవో శ్రావణ్కుమార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధుడి ఆత్మహత్య బూర్గంపాడు: మండల పరిధిలోని సోంపల్లి గ్రామానికి చెందిన పెంకె లక్ష్మయ్య(60) బుధవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు పాల్వంచలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్ఐ నాగబిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జ్వరంతో టెక్నికల్ అసిస్టెంట్ మృతి
చర్ల: జ్వరంతో బాధపడుతున్న క్రమంలో ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గి ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ మృతి చెందాడు. బూర్గంపాడు మండలంలోని వేపలగడ్డకు చెందిన కనితి సతీష్ (45) పదేళ్లుగా చర్లలో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జ్వరంతో బాదపడుతున్న క్రమంలో ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గి మృతి చెందాడు. మృతిపట్ల ఇన్చార్జి ఏపీఓ సాంబశివరావు, సిబ్బంది సంతాపం తెలిపారు. ముద్దాయికి ఐదేళ్ల జైలు శిక్షకొత్తగూడెంటౌన్: ప్రైవేట్ చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం గంగాబిషన్బస్తీకి చెందిన జక్కుల వెంకన్న చిట్టీలు కట్టించుకుని, తమకు రావాల్సిన రూ.16,41,000 చెల్లించకుండా మోసం చేశాడని అదే ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్తోపాటు మరో 20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. 22 మంది సాక్షులను విచారించిన అనంతరం జక్కుల వెంకన్నపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్ఐ ఆర్ ప్రభాకర్, కోర్టు లైజన్ ఆఫీసర్ నేరేడు వీరబాబు, పీసీ కె.వీరన్న సహకరించారు. -
సై
సమరానికి చుంచుపల్లి: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. మొదటి విడతలో 113 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 13,14 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ నెల 23న పోలింగ్ నిర్వహించిన తర్వాత నవంబర్ 11న తుది ఫలితాలను ప్రకటిస్తారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే పదకొండు మండలాల్లో జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ సందర్భంగా జెడ్పీటీసీ స్థానంలో పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీ స్థానాలకు జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షల చొప్పున ఖర్చు పెట్టేలా ఎన్నికల సంఘం పరిమితిని విధించింది. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో 11 మంది రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీసీలకు సంబంధించి 39 మంది రిటర్నింగ్ అధికారులు, 39 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 113 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోనే ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్వోలు స్వీకరిస్తారు. నామినేషన్లు సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో పూర్తి విషయాలను పొందుపరచాలి. –బి.నాగలక్ష్మి, అదనపు ఎన్నికల అధికారి23న తొలిదశలో 11 మండలాల్లో పరిషత్ ఎన్నికలు మండలం ఎంపీటీసీలు పోలింగ్ ఓటర్లు కేంద్రాలు అశ్వాపురం 12 65 33,347 భద్రాచలం 14 60 40,761 బూర్గంపాడు 17 89 50,351 చర్ల 12 67 32,653 దుమ్ముగూడెం 13 73 36,762 కరకగూడెం 5 26 12,869 మణుగూరు 11 60 36,480 పినపాక 9 55 27,350 ఆళ్లపల్లి 5 21 9,314 గుండాల 5 25 13,330 జూలూరుపాడు 10 61 27,985 -
ప్రగతి సాధించేలా..
భద్రాచలం: వెనుకబాటుకు గురైన గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. విజన్–2030 పేరుతో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించింది. ప్రజలను, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఆదికర్మ యోగి అభియాన్ పథకం తెచ్చింది. దీని కింద భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 28 మండలాల్లో 165 గ్రామాలను ఎంపిక చేసింది. ఇప్పటికే నివేదికలను సిద్ధం చేసిన అధికారులు ఎన్నికల కోడ్ అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. 28 మండలాలు.. 165 గ్రామాలు సేవా, సంకల్పం, సమర్పణం నినాదాలతో ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వయం ఉపాధి కల్పించనున్నారు. మొదటి ఫేజ్లో ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లో 35 గ్రామాలకు అవకాశం కల్పించగా, 91,482 గిరిజనులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 మండలాల్లో 130 గిరిజన గ్రామాల్లో 1,37,108 మంది గిరిజనులు పథకం పరిధిలోకి రానున్నారు. కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలను, భద్రాచలం పట్టణాన్ని ఈ పథకం నుంచి మినహాయించారు. భద్రాద్రి జిల్లాలో రూ.1,355 కోట్లతో ప్రణాళిక గిరిజన గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళిక రూపొందించారు. ప్రతీ గ్రామంలో ఆది సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన 20 మందిని సభ్యులుగా గుర్తించి సాతి, సహయోగిలను ఎంపిక చేశారు. జిల్లా, మండల, గ్రామాల్లో ట్రైబల్ వెల్ఫేర్, విద్య, వైద్య, రూరల్ డెవలప్మెంట్, శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులను సభ్యులుగా నియమించారు. అధికారులు సాతి, సహయోగిల భాగస్వామ్యంతో ప్రతీ గ్రామంలో రచ్చబండ, గ్రామంలో నడక ద్వారా సమస్యలను గుర్తించారు. గ్రామ కార్యాచరణ ప్రణాళిక నివేదికను సిద్ధం చేశారు. ఆ గ్రామ అడవి, జలవనరులు, మౌలిక సదుపాయాల తదితర అంశాలకు ప్రణాళికలో చోటు కల్పించారు. భద్రాద్రి జిల్లాలో 130 గ్రామాల్లో సుమారు రూ.1,355 కోట్ల నిధుల అవసరాన్ని గుర్తించారు. ఖమ్మం జిల్లా అధికారులు తుది నివేదికను అందజేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతులను కల్పించాలని భావి స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలను అందగానే నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతీ గ్రామానికి ఐదేళ్ల కాలంలో సుమారు రూ.2కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అధి కారులు మాత్రం గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన వివరాలతో నివేదికలను రూ పొందించారు. అంతర్గత రోడ్లు, చెక్డ్యాంలు, తాగు, సాగు నీరు వసతులు, విద్యుత్, ఇళ్ల నిర్మా ణం, బోర్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.జిల్లా, మండల, గ్రామాల స్థాయిలో మాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేశాం. గ్రామాల్లో పర్యటించి నివేదికలను సిద్ధం చేశాం. నివేదికలు గ్రామసభల్లో ఆమోదం పొందాక జిల్లా లెవల్ రివ్యూ మీటింగ్ అనంతరం అప్రూవల్కు పంపిస్తాం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్ ముగియగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికలను అందచేస్తాం. –డేవిడ్రాజ్, ఏపీఓ జనరల్, భద్రాచలం ఐటీడీఏ -
బాంబుల భయం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యనే పెద్ద ఎత్తున బాణసంచా నిల్వ చేస్తున్న గోదాంలపై మంగళవారం భద్రాచలం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జనావాసాల నడుమ ఇరుకు ప్రదేశంలో ఐదు నుంచి పది లక్షల రూపాయల విలువైన బాణసంచా ఉన్నట్టు గుర్తించి, కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా అక్రమంగా బాణసంచా నిల్వ చేయడం ఒక్క భద్రాచలంలోనే కాదు జిల్లా అంతటా జరుగుతోంది. అయినా పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ యంత్రాంగాలు ఈ వ్యవహారం పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఐదు కేజీలకు మించితే.. దీపావళి పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఒక ఇంట్లో మొత్తంగా ఐదు కేజీల బరువైన బాణసంచా నిల్వ చేసుకునేందుకు ఎటువంటి అనుమతులు అక్కర్లేదు. అంతకు మించితే కచ్చితంగా పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. బాణసంచాలో ఉపయోగించే పేలుడు పదార్థాలకు పొరపాటున నిప్పు రాజుకుంటే పెను ప్రమాదం జరిగి, క్షణాల్లో ఆ ఇంటిని దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చుట్టుముడుతుంది. తేరుకునేలోపే కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్లే బాణసంచా అమ్మకాలు, నిల్వ చేయడంపై కఠినమైన ఆంక్షలను చట్టాల రూపంలో ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. నిబంధనలు ఇలా.. బ్రిటీష్కాలం నుంచి బాణసంచా నిల్వ చేయడంపై చట్టాలు ఉన్నాయి. ఇవి అనేక మార్పులకు లోనవుతూ చివరిసారిగా 2012లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బాణసంచా నిల్వ చేసే ప్రదేశం (షాపు, గోదాం) దగ్గర 5 కేజీల సామర్థ్యం కలిగిన రెండు అగ్నిని ఆర్పే పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇంటి పైకప్పు పైన వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, దిగువ భాగంలో 450 లీటర్ల సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంకు ఉండాలి. నాణ్యత కలిగిన కరెంటు వైర్లను ఉపయోగించాలి. ఇటుకలు, కాంక్రీట్, జీఐషీట్స్ వంటి అంటుకునే స్వభావం లేని వస్తువులతోనే బాణసంచా నిల్వ చేసే గదులు/గోదాంలను నిర్మించాలి. ఈ గదుల దగ్గర మండే స్వభావం కలిగిన కలప, బట్టలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఉండకూడదు. ఈ బాణసంచా నిల్వ చేసే గదులు/గోదాంలు రోడ్డు నుంచి కనీసం మూడు కిలోమీటర్ల లోపలికి ఉండాలి. వీటి చుట్టూ 15 మీటర్ల వరకు మరే ఇతర నిర్మాణాల ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల మధ్యనే నిల్వలు దీపావళి సంబరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. అప్పటికే తమ రెగ్యులర్ వ్యాపారాలకు ఉపయోగించే పని ప్రదేశాల(షాపులు, గోదాంలు)లోనే బాణసంచా కూడా నిల్వ చేస్తున్నారు. పేలే స్వభావంలేని సాధారణ వస్తువులు నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్రదేశాలు ఇళ్ల మధ్యన, కిక్కిరిసిన మార్కెట్ ఏరియాల్లోనే ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లోనే యథేచ్ఛగా బాణసంచా నిల్వ చేస్తున్నారు. కేవలం దీపావళికి వారం రోజులపాటు జరిగే వ్యాపారం కోసం రక్షణ నిబంధనలు అమలు చేయడం అనవసర ఖర్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేవలం లాభాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గుణపాఠం నేర్చుకోకుంటే.. ఏపీలోని కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ నిల్వ కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు సమాచారం. అంతకుముందు 2018లో వరంగల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఘటన స్థలిలోనే పది మంది కార్మికులు మాడిమసై పోయారు. పేలుడు తీవ్రతకు చుట్టు పక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. గోడలు, ఇంటి పైకప్పు ఊడిపోయి ఇళ్లలో ఉన్నవారిపై పడి గాయాలయ్యాయి. ప్రమాదాలు చెప్పి రావు, అవి చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ లాభాలే ధ్యేయంగా కొందరు వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు ప్రమాదాలకు ఆహ్వానంగా మారుతోంది. దీపావళి పండుగ రాకముందే బాణసంచా, టపాకాయలను భారీ ఎత్తున ఇళ్ల మధ్యన నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతుల సంగతి మొత్తానికే పక్కన పెట్టడంతో పాటు ఇరుగుపొరుగు వారిని ప్రమాదంలోకి నెడుతున్నారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేయడం నేరం. విక్రయాలకు కూడా అధికారుల అనుమతులతోనే చేపట్టాలి. అక్రమ నిల్వలను గుర్తించేందుకు భద్రాచలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమతులు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఎక్కడైనా బాణసంచా అక్రమంగా నిల్వచేసినా, విక్రయిస్తున్నా డయల్ 100తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలం -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వివరాలను పోలీస్ అధికారులకు అందించాలని సూచించారు. ఎంపీడీఓలు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు నామినేషన్ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. స్వీకరించిన నామినేషన్లను అదే రోజు టీ–పోల్ సైట్లో అప్లోడ్ చేయాలని, రోజువారీ నివేదికలు అందజేయాలని వివరించారు. తహసీల్దార్లు (మండల ఎంసీసీ నోడల్ అధికారులు) ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్ అధికారులకు పంపాలని సూచించారు. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సంబంధిత ఆర్డీఓ/సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బ్యాలెట్ పేపర్ తయారీ, ముద్రణను తెలుగు వర్ణమాల క్రమంలో నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ సామగ్రిని కేంద్రాల వారీగా వేరు చేసి భద్రంగా ఉంచాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ఎస్హెచ్ఓ/సీఐల నుంచి అనుమతులు పొందాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, 13న అప్పీల్ స్వీకరణ, 14న అప్పీల్ విచారణ జరుగుతాయన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్షర జ్ఞానం కోసం..
అశ్వారావుపేటరూరల్: వలస గొత్తికోయ చిన్నారులు ‘అక్షర’ సేద్యానికి ‘నడక’యాతన పడుతున్నారు. అడవి, పంట పొలాల మధ్య నుంచి రోజూ కాలినడకన సర్కారు బడికి రాకపోకలు సాగిస్తున్నారు. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రమణక్కపేట గొత్తికోయల కాలనీకి చెందిన 8 మంది బడిఈడు పిల్లలు రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటిమడుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది జూన్లో చేరారు. వీరి వయసు పదేళ్లలోపే ఉన్నప్పటికీ రోజూ ఐదు కిలోమీటర్లు నడుస్తున్నారు. వలస గొత్తికోయలు ఇరవై ఏళ్లుగా అడవిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా, ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు లేవు. పాఠశాలలో కొత్తగా విధుల్లోచేరిన టీచర్ శ్రుతి ప్రత్యేకదృష్టి పెట్టి చిన్నారులను బడి బాట పట్టించారు. కాగా, ప్రభుత్వం, దాతలు స్పందించి చిన్నారులకు వాహన సదుపాయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.రోజూ ఐదు కిలోమీటర్ల దూరం నడుస్తున్న గొత్తికోయ చిన్నారులు -
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేఇల్లెందు: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిశారు. బుధవారం హైదరాబాద్లోని అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలవగా, ఇల్లెందు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా చూడాలని సూచనలు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరం సురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, శ్రీనివాస రెడ్డి, గణేష్, సర్దార్, రాము తదితరులు పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలిఅశ్వారావుపేటరూరల్: ప్లాంటేషన్ నిర్వహణ, మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని, సంరక్షణలో నిర్లక్ష్యం చేయొద్దని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో పర్యటించారు. మండలంలోని ఊట్లపల్లి సమీపంలో అటవీ శాఖ ద్వారా 50 ఎకరాల్లో పెంచుతున్న ప్లాంటేషన్ను సందర్శించి మొక్కలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఫారెస్టు గెస్ట్ హౌస్ భవనాన్ని పరిశీలించి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ దామోదర రెడ్డి, ఫారెస్టు రేంజర్ మురళి, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలిపాల్వంచ: పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జె.స్వర్ణలత లెనినా అన్నారు. బుధవారం పాల్వంచ ప్రాజెక్ట్ పరిధిలోని షిరిడీ సాయినగర్లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలలో కిశోర బాలికలకు ‘మీరు తీసుకునే ఆహారం, మీ పెరుగుదల’అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో అత్యధిక పౌష్టిక విలువలు ఉన్న ఆహా రం తీసుకుంటే ఆరోగ్య వంతులుగా ఉంటా రని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మైథిలి, సీడీపీఓ ప్రసన్నలక్ష్మి, సూపర్వైజర్ రమాదేవి, శారద, అశోక కుమారి, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ రాము, కో ఆర్డినేటర్ సోనీ, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్ వన్ పరీక్షల్లో గోల్మాల్
సూపర్బజార్(కొత్తగూడెం): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పెరిగిందని, 2 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, గ్రూప్–1 పరీక్షల్లో గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి విమర్శించారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, వైఎస్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకానికి, 108 సర్వీసులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కాకుండా వాయిదాల మంత్రిగా, వాటాల మంత్రిగా ఘనత సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి 55 సార్లు ఢిల్లీ తిరగడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీని భూస్థాపితం చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ను భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు సంకుబాపన అనుదీప్, తొగరు రాజశేఖర్, కర్నే మురళి, పూల రవీందర్, మునీర్, పోతురాజు రవి, భూపతి శ్రీను, జయరామ్, ఎల్. రమేష్, రిజ్వాన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి -
బోటుగూడెంలో పోడు వివాదం
పినపాక: మండలంలో పోడు భూముల లొల్లి మళ్లీ మొదలైంది. బోటుగూడెం పంచాయతీ బందగిరినగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు, పోడు సాగుదారుల మధ్య వివాదంగా మారింది. అధికారులు పోడు భూముల చుట్టూ ట్రెంచ్ కొట్టడానికి సిద్ధమవుగా సాగుదారులు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా తాము భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. సీపీఎం కన్వీనర్ నిమ్మల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు అక్కడకు చేరుకుని అధికారులతో మా ట్లాడారు. ప్రభుత్వం పోడు సాగుదారులకు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. వివాదంపై ఫారెస్ట్ రేంజర్ తేజస్విని వివరణ కోరగా.. ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూముల్లోనే ట్రెంచ్ కొడుతున్నామని, పట్టాలు పొందిన భూముల జోలికి తాము వెళ్లడంలేదని తెలిపారు. పిడుగుపాటుకు గుడిసె దగ్ధంములకలపల్లి: పిడుగుపాటుకు గుడిసె దగ్ధమైన సంఘటన మూకమామిడి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పుప్పాల ములకేశ్వర రావు, వేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం పనికి వెళ్లగా, సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటిపై పిడుగు పడింది. దీంతో గుడిసె, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. -
అధికంగా వర్షపాతం, పంటలు..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో వానాకాలం సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 23.8 శాతం అధికవర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా సరాసరి సాధారణ వర్షపాతం 1,007 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 1,246.4 మి.మీ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో అధిక వర్షపాతం, 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికవర్షపాతం నమోదైన మండలాలు చర్ల, మణుగూరు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, అశ్వారావుపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, ఆళ్లపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక విస్తీర్ణంలో పంటలు.. వానాకాలం సీజన్లో సాధారణ విస్తీర్ణం కంటే రైతులు అధికంగా పంటలు సాగు చేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,91,714 ఎకరాలు కాగా 6,13,702.43 ఎకరాల్లో సాగు చేశారు. అందనంగా 21,988 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వేరుశెనగ అంచనా కంటే తక్కువ సాగు కాగా కూరగాయలు, మిర్చి అతితక్కువగా సాగు చేస్తున్నారు. వరి, పత్తి, కంది, మొక్కజొన్న, ఆయిల్పామ్ పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. -
ఆర్టీసీ లక్కీ డ్రా విజేతల ఎంపిక
ఖమ్మంమయూరిసెంటర్: బతుకమ్మ, దసరా సెలవుల్లో రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ డీలక్స్, సూపర్లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ప్రయాణికులు తమ వివరాలతో టికెట్లను డిపోల వారీగా బాక్సుల్లో వేయగా ఏడు డిపోల టికెట్లను ఖమ్మం తీసుకొచ్చి కొత్త బస్టాండ్లో బుధవా రం డ్రా తీశారు. రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లక్కీ డ్రా ముగ్గురు విజేతలను ప్రకటించారు. ఖమ్మం డిపో నుంచి రాజధాని బస్సులో ప్రయాణించిన కాంతారావు, భద్రాచలం డిపో సూపర్లగ్జరీ బస్సులో ప్రయాణించిన సాయిబాబా, మణుగూరు డిపో నుంచి డీలక్స్ బస్సులో ప్రయాణించిన పి.సునీల్ను ఎంపిక చేయగా, వీరికి హైదరాబాద్లో బహుమతులను అందించనున్న ట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య, ఖమ్మం డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, సెక్యూరిటీ అధికారి కోటాజీ తదితరులు పాల్గొన్నారు. డ్రా తీసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
ఇంతింతై.. వనమంతై !
ఖమ్మంవ్యవసాయం: ఆయిల్ పామ్ విస్తీర్ణం ఉమ్మ డి జిల్లాలో ఏటేటా పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలకు తోడు అనుకూలిస్తున్న వాతావరణం, అందుబాటులో ఫ్యాక్టరీలు ఉండడం సాగు పెరగడానికి ఊతమిసోంది. సాగు విస్తీర్ణాన్ని పెంచాలని గత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. దీంతో జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో రైతులు కూడా ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 3లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుంటే.. సింహభాగం ఉమ్మడి జిల్లాలోనే ఉండడం విశేషం. ప్రభుత్వం నుంచి రాయితీలు ఆయిల్పామ్ మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయడమే నాలుగేళ్ల పాటు అవసరమైన ఖర్చులను అందిస్తోంది. రూ.193 విలువైన మొక్క ను కేవలం రూ.20కే అందిస్తున్న ప్రభుత్వం ఏటా నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 రైతులకు చెల్లిస్తోంది. అలాగే, డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, సన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం సబ్సి డీపై అందిస్తున్నారు. మొత్తంగా ఎకరాకు రూ. 50,918 రాయితీ అందుతోంది. ఇక ఆయిల్పామ్ సాగుతో 30 ఏళ్లపాటు ఆదాయం లభించనుండడం.. ప్రకృతి వైపరీత్యాలు, కోతుల సమస్య లేకపోవడంతో రైతులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఐదేళ్లలో 75వేల ఎకరాలు ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా అగ్రస్థానాన నిలుస్తోంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యాన రెండు పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అలాగే, ఖమ్మం జిల్లాలోని వేంసూరు, కొణిజర్ల మండలాల్లోనూ ఫ్యాక్టరీల నిర్మానం జరుగుతోంది. ఉంది. అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం ఉద్యాన డివిజన్లలో పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 2019–20 వరకు 11,913 మంది రైతులు 48,296.19 ఎకరాల్లో పంట సాగు చేయగా.. 2025–26 సెప్టెంబర్ నాటికి 31,196 మంది రైతులు 1,22,351.34 ఎకరాల్లో పంట సాగు చేస్తుండడం విశేషం. తద్వారా ఐదేళ్ల కాలంలో ఆయిల్పామ్ సాగు 74 వేల ఎకరాలు పెరిగినట్లయింది. సంవత్సరం ఖమ్మం భద్రాద్రి రైతులు ఎకరాలు రైతులు ఎకరాలు 2019–20వరకు 1,897 8,232.67 10,016 40,063.5 2020–21 313 1,417.10 686 2,976.19 2021–22 700 3,009.03 1,013 4,237.50 2022–23 2,756 11,427.11 3,961 16,508.36 2023–24 1,255 4,605.025 2,402 8,953.00 2024–25 1,680 5,620.00 1,535 5,464.93 2025–26 1,858 6,034.40 1,124 3,802.50 మొత్తం 10459 40,345.34 20,737 82,006ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆయిల్పామ్ సాగు సుదీర్ఘకాలం ఆదాయాన్ని ఇచ్చే పంట కావడం, జంతువులు, చీడపీడల సమస్య లేకపోవడంతో ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలూ అందుతున్నాయి. ఇక్కడే ఫ్యాక్టరీలు ఉండడంతో సాగు పెరుగుతోంది. – ఎం.వీ.మధుసూదన్, ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొక్కలు, ఇతర పెట్టబడి కూడా అందిస్తోంది. ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్ పామ్ మేలని గుర్తించా. భవిష్యత్లో మరింత డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 15ఎకరాల్లో మొక్కలు నాటా. –లక్కినేని శ్యాంమోహన్, పెగళ్లపాడు, టేకులపల్లి మండలం -
జిల్లాస్థాయి క్రీడలు షురూ..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రకాశంలో 69వ ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను బుధవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపాలని సూచించారు. కాగా బుధవారం అండర్–17 విభాగంలోని బాలబాలికలకు పోటీలు నిర్వహించారని, గురువారం అండర్–14 విభాగంలో పోటీలు నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ సెక్రెటరీ వాసిరెడ్డి నరేష్ కుమార్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, డీసీఈబీ సెక్రెటరీ నీరజ, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, యుగంధర్, స్టెల్లా, కవిత, వీరన్న, కృష్ణ, పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పరిశీలన ప్రకాష్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సందర్శించి పరిశీలించారు. హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. చిన్నారులను ఎత్తుకుని ఆడిపించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ఉరివేసుకుని పీఈటీ ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన చుంచు కృష్ణ (46) అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల ఆశ్రమ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం స్వగ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై విధులకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్న భర్త కృష్ణ తనతో గొడవపడి ఇంట్లో ఉరివేసుకున్నాడని భార్య యశోద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొమరారం ఎస్సై నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణ వాలీబాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారుడిగా రాణించాడు. పలువురికి శిక్షణ ఇచ్చాడు. -
రైతులకు యూరియా కష్టాలు
పినపాక: రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల పరిధి లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాల యం ఎదుట యూరియా బస్తాలు కోసం రైతులు బారులుదీరారు. ఒకరికి ఒక యూరియా బస్తా ఇవ్వడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీపీఎస్ కాల్వలో మొసళ్ల సంచారంపాల్వంచ: మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి కేటీపీఎస్కు నీళ్లు వచ్చే కాల్వలో మొసళ్లు సంచరిస్తున్నాయి. రిజర్వాయర్ నుంచి మొసళ్లు కాల్వలోకి వస్తున్నాయి. సుమారు పది కిలోమీటర్లు ఉండే ఈ కాల్వలో అక్కడక్కడ ఓడ్డుకు చేరి, పరిసరాల్లో సంచరిస్తుడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంగళ, బుధవారాల్లో కరకవాగు రోడ్లోని కాల్వ లో మొసళ్లు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఉద్యాన కళాశాల విద్యార్థుల సందర్శనఅశ్వారావుపేటరూరల్: మండలంలోని అచ్యుతాపురం గ్రామాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించి పంట పొలాలకు వినియోగించే రసాయనిక ఎరువులు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యాన పంటలకు విని యోగించే రసాయనాలపై ఉండే గుర్తుల గురించి రైతులకు వివరించారు. పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల విద్యార్థులు శివ, సత్యసాగర్, అభినవ్, అజయ్, నేతాజీ, యశ్వంత్ పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ పాల్వంచరూరల్: అక్రమంగా కిన్నెరసాని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం నుంచి రాజాపురంవైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని సీజ్చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, ఉప్పుసాక గ్రామానికి చెందిన పెరుమాళ్లపల్లి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మేకలు చోరీపాల్వంచరూరల్: వేర్వేరు గ్రామాల్లో ఒకే రోజు 8 మేకలను అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి మొండికట్ట గ్రామంలో సంపంగి వెంకటేశ్వర్లు ఇంటి పక్క దొడ్డిలో ఉన్న ఐదు మేకలను ఈ నెల 6వ తేదీ రాత్రి సమయంలో దొంగలు అపహరించారు. అదే రోజు రాత్రి మండల శివారు గ్రామమైన మామిడిగూడెంలోని ముక్కటి మల్లయ్యకు చెందిన మూడు మేకలను దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. టీజీ ఎఫ్డీసీ వాచర్పై దాడిములకలపల్లి: అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్డీసీ) వాచర్ అల్లూరి శ్రీనివాస్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడు శ్రీనివాస్ కథనం ప్రకారం.. గొల్లగూడెం (కమలాపురం క్రాస్ రోడ్) వాచర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలపరిఽధిలోని మాధారం గ్రామంలో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి తన ఇంటి ముందు ఫోన్లో మాట్లాడుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కుటుంబీకులు, సమీపస్తులు గమనించి వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యారు. శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో మంగపేట పీహెచ్సీలో ప్రాఽథమిక చికిత్స పొందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎస్.మధుప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
సర్వే నంబర్ల మాయాజాలం
● అసైన్డ్ భూములకు పట్టా సర్వే నంబర్లు ● ఆపై యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లుసత్తుపల్లి: అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమార్కుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సత్తుపల్లి రెవెన్యూ పరిధితో పాటు అయ్యగారిపేట రెవెన్యూలో పట్టా భూముల సర్వే నంబర్లను అసైన్డ్ భూములకు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయించడం వెనుక ఓ ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయాన అధికారులు పట్టా నంబర్లు ఉండడంతో చకచకా పని పూర్తిచేస్తున్నారు. అయితే, ఈ మా యాజాలంలో అధికారుల పాత్రపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా అక్రమార్కుల తీరుతో అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు వివాదాస్పద భూములను కొనుగోలు చేసి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే నంబర్ అన్నింటికీ.. సత్తుపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 166లో పట్టా భూమి ఉంది. అయితే, చుట్టుపక్కల ఉన్న ప్రభు త్వ, అసైన్డ్ భూములకు సైతం ఇదే సర్వేనంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సర్వే నంబర్లోని భూమి కంటే అధిక విస్తీర్ణం నమోదవుతుండగా.. భవిష్యత్లో వాస్తవ పట్టాదా రులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వాలు దళితులు, బీసీలకు పంపిణీ చేసిన అసైన్డ్, ప్రభుత్వ వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అయ్యగారిపేటలోని సర్వే నంబర్ 38/ఊలో జొన్నలగడ్డ పున్నయ్యకు చెందిన అసైన్డ్ భూమిని సమీప వెంచర్ యజమానులు తప్పుడు సర్వే నంబర్తో ఆక్రమించినట్టు పున్నయ్య వారసుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడానికి మరో ఎత్తుగడ కూడా వేస్తున్నట్లు సమాచారం. ఏదైనా రెవె న్యూ పరిధిలో రైతుకు భూమి కన్నా రికార్డుల్లో అదనంగా నమోదై ఉంటే ఆ భూమిని రికార్డులో ఎక్కించి అదే సర్వే నంబర్తో విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. గాడిదల వాగు అన్యాక్రాంతం సత్తుపల్లి శివారు కాకర్లపల్లి రోడ్డులో గాడిదల వాగు అన్యాక్రాంతమవుతోంది. తామర చెరువు నుంచి అలుగు పోసుకొని గాడిదల వాగు మీదుగా ప్రవా హం వేశ్యకాంతల చెరువుకు వెళ్తుంది. దీనికోసం 40 మీటర్ల వరద కాలువను సైతం రైతులు స్వచ్ఛందంగా వదులుకున్నారు. అయితే, ఇక్కడ బ్రిడ్జి చిన్నగా ఉండడంతో వర్షాకాలంలో తరచూ వరద పోటెత్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కానాలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి పక్కన ఉన్నవి పట్టా భూములు కావటంతో బ్రిడ్జి కానాలను మట్టితో పూడ్చేస్తున్నారు. ఒకవేళ పట్టా భూములైనా వ్యవసాయానికే ఉపయోగించాలని, ఎఫ్టీఎల్కు మించి భూములను మట్టితో చదును చేయడం చట్టవ్యతిరేకమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా హైలెవల్ బ్రిడ్జి నిర్మించినా రోడ్డుపైకి వరద చేరుతూ కాకర్లపల్లిరోడ్డు తదితర ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురవుతున్నాయి. అలాగే, సత్తుపల్లి నలు దిక్కుల పూర్వకాలంలో ఉన్న నాలుగు నీటి కుంటలు సైతం అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. -
ఏసీపీ విష్ణుమూర్తికి అంతిమ వీడ్కోలు
జూలూరుపాడు: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సబ్బతి విష్ణుమూర్తి హైదరాబాద్లో ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. స్వస్థలమైన జూలూరుపాడుకు ఆయన మృతదేహాన్ని మంగళవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైరా, కొత్తగూడెం ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్నాయక్, కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్రాజ్ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే, ఖమ్మం అదనపు డీసీపీ రామానుజం, ఇంటిలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేశ్, డీఎస్పీలు నాగన్న, అబ్దుల్ రెహమాన్, సీఐలు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. అలాగే, వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు సైతం విష్ణుమూర్తి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, విష్ణుమూర్తి అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో నిర్వహించాలని వరంగల్ నార్త్ జోన్ డీఐజీ చంద్రశేఖర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే రాందాస్ తీసుకెళ్లారు. దీంతో ఆయన అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరిగాయి. నివాళులర్పించిన ఎస్పీ, ఎమ్మెల్యేలు -
‘వసతి’కి తాళం..
ఖమ్మంమయూరిసెంటర్: వేతనాల సమస్యపై కొద్ది వారాలుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వంటగదులు తెరుచుకోలేదు. దసరా సెలవుల కన్నా ముందే కార్మికులు సమ్మెలోకి దిగడంతో విద్యార్థులకు ఆహారం అందించడం సమస్యగా మారింది. సెలవులు ముగిసేలోగా పరిస్థితులు చక్కబడతాయని భావించినా ఆ పరిస్థితి లేక జిల్లాలోని పలు గిరిజన సంక్షేమ వసతిగృహాలు తెరుచుకోలేదు. ఈ విషయం తెలిసి ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థులు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. వేతనాల తగ్గింపు జీఓను రద్దు చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగిన కార్మికులు సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. ఈ ప్రభావం విద్యార్థులపై పడుతుండగా.. అధికారులు కూడా సమస్య ప్రభుత్వం, కమిషనర్ స్థాయిలో ఉన్నందున తామేమీ చేయలేమని చెబుతుండడం గమనార్హం. రెండు రోజులైనా అదే పరిస్థితి.. కార్మికుల సమ్మె కాలంలో దసరా సెలవులు రావడంతో అటు గిరిజన శాఖ అధికారులు, ఇటు వసతిగృహ సంక్షేమ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, సెలవులు ముగిసినా సమ్మె విరమింపజేయకపోవడంతో గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో పొయ్యిలు వెలగడం లేదు. ప్రీమెట్రిక్ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు ఈ నెల 4వ తేదీ శనివారం నుంచే తెరుచుకోవాల్సి ఉండగా సోమవారం నుంచి రావాలని విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ వసతి గృహాల అధికారులు మాత్రం తాము చెప్పేవరకు రావొద్దని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక పోస్ట్మెట్రిక్ వసతి గృహాలకు సంబంధించి కొన్ని వసతిగృహాలను మూసి ఉంచారు. ఖమ్మంలో ఏడు వసతిగృహాలు ఉండగా రెండు, మూడే తెరిచినట్లు తెలుస్తోంది. బయటే టిఫిన్, భోజనం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, డెయిలీ వేజ్ కార్మికుల సమ్మెతో వసతిగృహాల్లో పనులు నిలిచిపోయాయి. చాలా వసతిగృహాల్లో ఇద్దరు, ముగ్గురు డెయిలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులే ఉన్నారు. దీంతో చాలా వాటిని మూసి ఉంచగా, కొన్నింటిని తెరిచినా వంట చేయడం లేదని తెలుస్తోంది. ఖమ్మం రేవతి సెంటర్లోని ఏటీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గిరిజన సంక్షేమశాఖ ఖమ్మం రూరల్ కళాశాల బాలుర వసతిగృహంలో వంట గది తాళం తెరుచుకోలేదు. దీంతో వచ్చిన విద్యార్థులు టిఫిన్, భోజనం బయటే చేస్తున్నారు. ఏటీడీఓ కార్యాలయ ఆవరణలోని వసతిగృహం ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులపై ప్రభావం కార్మికుల సమ్మె ప్రభావం విద్యార్థులపై పడుతోంది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైనా వసతిగృహాలు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మారుమూల గ్రామాలకు చెందిన వారు ఖమ్మం కళాశాలల్లో చదువుతుండగా వీరికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కార్మికుల సమ్మెతో భోజనం సిద్ధం చేయించే పరిస్థితి లేక ఆశ్రమ పాఠశాలలకు రావొద్దని సమాచారం ఇచ్చినా త్వరలో జరగనున్న సమ్మెటివ్ పరీక్షల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇకనైనా ప్రభుత్వం కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ ఖమ్మం భద్రాద్రి పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు 12 22 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు 08 17 ఆశ్రమ పాఠశాలలు 10 86 తెరుచుకోని హాస్టళ్లు.. వెలగని పొయ్యి కార్మికుల సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కార్మికులు లేరనే సాకుతో కొన్ని వసతిగృహాలను తెరవకపోవడం సరికాదు. సెలవులు ముగియగానే వసతిగృహాలను తెరిపించాల్సిన అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరించడం గర్హనీయం. –ఇటికాల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వసతిగృహాలకు వస్తున్న విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. కార్మికులు లేరని వంట గదులు కూడా తెరవలేదు. అధికారులు వెంటనే కార్మికులను ఏర్పాటుచేసి విద్యార్థులకు భోజనం అందేలా చూడాలి. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. –వి.వెంకటేశ్, పీడీఎస్యూ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో ప్రతిభ
మణుగూరుటౌన్: ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో మణుగూరు సింగరేణి విద్యార్థులు ప్రతిభ చూపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్ఎం కల్యాణి ఎన్సీసీ ధ్రువపత్రాలను అందజేసి మాట్లాడారు. గత నెల 25 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుపతిలో ఎన్సీసీ 8వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 102 మంది పాల్గొన్నారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు సింగరేణి హైస్కూల్ నుంచి 8 మంది పాల్గొని ప్రతిభ చూపారన్నారు. శ్రీకృష్ణకౌషిక్ గ్రూప్ డ్యాన్స్లో బహుమతి సాధించాడని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల కోచ్, ఏఎన్ఓ కె.రాజసింహ, ఉపాధ్యాయుడు మస్తానయ్య ఉన్నారు.పంట కాల్వల పరిశీలనచండ్రుగొండ: సీతారామ ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న కాల్వల నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం సర్వే అధికారులు మంగళవారం మండలంలో పలు భూములను పరిశీలించారు. మద్దుకూరు, దామరచర్ల, గుర్రాయిగూడెం, చండ్రుగొండ, రావికంపాడు, గానుగపాడు, పోకలగూడెం గ్రామాల్లో మొత్తం 19 కిలోమీటర్ల మేరకు కాల్వలు నిర్మించనున్నామని, 400 ఎకరాల భూమి అవసరముంటుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్లు లక్ష్మణ్రావు, ప్రియాంక, జీపీఓ జగ్గయ్య, బొర్రా సురేశ్, మల్లం కృష్ణయ్య పాల్గొన్నారు.ఫోరెన్సిక్ ల్యాబ్కు అస్తిపంజరందుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు మామిడితోటలో ఇటీవల లభ్యమైన మానవ అస్తిపంజరాన్ని పోలీసులు మంగళవారం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ అస్తిపంజరం ములకపాడు గ్రామానికి చెందిన సిద్ధి రవికుమార్దిగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినప్పటికీ శాసీ్త్రయ నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సీఐ వెంకటప్పయ్య తెలిపారు.వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తలుఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ):మండలంలోని రాజాపురం, నామవరం, ఊటుపల్లి గ్రామాల్లో వరి పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో వరిపంటలో బెరుకులు వచ్చాయని రైతులు ఇటీవలే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంటకు బ్యాక్టీరియల్ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పంటపై ప్లాంటోమైసిన్ మందు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హేమంత్, భారత్, ఏఓ అనూష, ఏఈఓ సరిత, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఘనంగా ఆర్సీఎం చర్చి స్వర్ణోత్సవంఇల్లెందు: పట్టణంలోని ఆర్సీఎం చర్చి (పరిశుద్ధ జపమాల మాత దేవాలయం)లో స్వర్ణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. చర్చి 50 వసంతాల వేడుకలను చర్చి ఫాదర్ ఎ.సునీల్ జయప్రకాష్ ఆధ్వర్యాన నిర్వహించగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమానికి ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరవగా, అమృతరాజు, జయానంద్ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పాలస్తీనాపై అమానవీయ యుద్ధం
ఇల్లెందు: అత్యంత చిన్నదేశమైన పాలస్తీనాపై అగ్రరాజ్యం అండతో ఇజ్రాయిల్ రెండేళ్లుగా యుద్ధం కొనసాగిస్తూ మహిళలు, చిన్న పిల్లలను అమానవీయంగా హతమారుస్తుండడం గర్హనీయమని వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఇల్లెందులో మంగళవారం పాలస్తీనా సంఘీభావ సదస్సు జరగగా, ఎన్డీ రాష్ట్ర నాయకుడు గౌని ఐలయ్య మాట్లాడారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న ఏకపక్ష దాడులతో అమాయక పాలస్తీనా పౌరులు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కనీసం తాగునీరు, ఆహారం, మందులు కూడా ఇజ్రాయిల్ అందనివ్వడం లేనందున యుద్ధం నిలిపివేసేలా అన్ని దేశాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పౌరులంతా పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎన్డీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాస్లైన్, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీల నాయకులు చండ్ర అరుణ, ఏఎస్ నబీ, డి.శంకర్, రాంసింగ్, ఎ.సాంబ, దొడ్డా డానియల్, సిలివేరు సత్యనారాయణ, టి.నాగేశ్వరరావు, నాయిని రాజు, బంధం నాగయ్య, కిరణ్, కృష్ణ, సత్యనారాయణ, జాఫర్, కె.సారంగపాణి, యాకూబ్షావలీ, కాంపాటి పృథ్వీ, బాస శ్రీనివాస్, గణేశ్, అభిమన్యు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సంఘీభావ సదస్సులో అఖిలపక్షం నేతలు -
సీఎస్ఆర్ విధివిధానాలపై సమీక్ష
కొత్తగూడెంఅర్బన్: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్ న్యూఢిల్లీ నుంచి మంగళవారం కోల్ ఇండియా పరిధి బొగ్గు సంస్థలు, మైనింగ్ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో సింగరేణి సంస్థ తరపున హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, కొత్తగూడెం కార్యాలయం నుండి జీఎం(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్ఆర్ జీ.వీ.కిరణ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొగ్గు రంగంలో సీఎస్ఆర్ నిధుల కేటాయింపు, వినియోగంపై చర్చించి సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో సింగరేణి అధికారులు బి.గట్టుస్వామి, గౌస్పాషా, రవికిశోర్ పాల్గొన్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కొత్తగూడెంటౌన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్పై దాడికి నిరసనగా మంగళవారం కొత్తగూడెం కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ సీజేఐపై దాడి జరగడం భారత న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.గోపీకృష్ణ, న్యాయవాదులు మాధవరావు, కాసాని రమేష్, ఉప్పు అరుణ్, కె.కృష్ణప్రసాద్, ఆడపాల పార్వతి, మాలోతు ప్రసా ద్, ఉటుకూరి పురుషోత్తంరావు, పి.నిరంజన్రావు, ఎస్.విజయభాస్కర్రెడ్డి, పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని ఆంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన తెలపగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎర్రా కామేశ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుంటాం..
ములకలపల్లి/పినపాక/మణుగూరురూరల్: రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీ సీట్లు దక్కించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే కాక ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. ములకలపల్లి, పినపాక మండలం ఈ–బయ్యారం, మణుగూరుల్లో మంగళవారం పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. జిల్లాలో సింగరేణి తదితర సంస్థల నుంచి రావాల్సిన డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు రాబట్టడంలో విఫమలమయ్యారని తెలిపారు. ఇదే సమయాన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీసేలా ఇంటింట అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కనీసం రైతులకు యూరియా అందించలేని విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. కాగా, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సులువవుతుందని కాంతారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ–బయ్యారంలో జరిగిన సమావేశంలో దుగ్నేపల్లికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, నాయకులు మోరంపూడి అప్పారావు, సతీశ్రెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, ఎడ్ల శ్రీనివాస్, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, యూసుఫ్ షరీఫ్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ప్రభుదాస్, అక్కి నర్సింహారావు, వేర్పుల సురేశ్, గువ్వా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు రేగా కాంతారావు -
బడి.. బహుదూరం..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరంతా వలస గొత్తికోయ చిన్నారులు.. అడవే వీరికి ఆవాసం. ఈ చిన్నారులు చదువుకోవాలంటే దూరంలో ఉన్న ఆశ్రమ పాఠశాల బాట పట్టాల్సిందే. అశ్వారావుపేట మండలంలోని మొద్దులమడ పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండపై ఉన్న పెద్దమిద్దె గ్రామంలో ఏళ్లుగా వలస గొత్తికోయలు నివాసం ఉంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లేందుకు రహదారితోపాటు ప్రభుత్వ పాఠశాల కుడా లేదు. బడి ఈడు చిన్నారులు ఏటా చదువు కోసం సుమారు 50 కిలో మీటర్ల దూరంలోని కావడిగుండ్ల ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలకు రావాల్సిందే. దూరభారం కావడంతో సెలవులు వస్తే చిన్నారులు స్వగ్రామానికి వెళ్లి తిరిగి పాఠశాల తెరుచుకున్న తర్వాత రావడం లేదు. దీంతో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారావు స్వయంగా పెద్దమిద్దె గ్రామానికి మొద్దులమడ నుంచి కాలినడకన వెళ్లి చిన్నారులను తిరిగి పాఠశాలకు తీసుకొస్తున్నారు. –అశ్వారావుపేటరూరల్ -
ఆర్చరీ, కబడ్డీ, రెజ్లింగ్ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన వివిధ క్రీడల ఉమ్మడి జిల్లాస్థాయి జట్ల ఎంపికకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం పోటీలు నిర్వహించారు. కబడ్డీ జట్ల ఎంపికకు 110 మంది బాలబాలికలు, ఆర్చరీ జట్ల ఎంపికకు 20 మంది, రెజ్లింగ్ ఎంపికకు 25 మంది హాజరయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న జట్ల ఎంపిక పోటీలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, ఖేలో ఇండియా ఖమ్మం సెంటర్ కోచ్ నగేశ్, క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసీకలీం పర్యవేక్షించారు. ● జిల్లా బాలుర కబడ్డీ జట్టులో బి.కౌశిక్, జి.వినయ్, పి.మనోహర్, వి.సాయికిరణ్, ఐ.కుమార్, ఆర్.రాకేశ్, జి.గణేశ్, కె.భార్గవ్రెడ్డి, ఈ.అజయ్కుమార్, బి.మధు, డి.సాయికిరణ్, సాయికృష్ణ, వి.వివేక్, ఎల్.అరవింద్, బి.శరత్, డి.ధనుష్, డి.ఆనంద్కిశోర్ స్థానం దక్కించుకున్నారు. ● బాలికల కబడ్డీ జట్టుకు జి.మైశ్రీ, బి.కుసుమ, బి.పల్లవి, ఎస్కే వాదాహసీనా, ఎన్.పల్లవి, జి.సాహితి, జి.హరిణి, టి.వినీల, ఎస్.భావ్యశ్రీ, కె.ప్రత్యూష, ఎస్కే రిజ్వాన, ఆర్.శ్రీలత, జి.యశస్విని, స్నేహ, కె.ఇందు, ఎండీ ఆసియా, ఎల్.మిత్ర, కె.సోమక్క ఎంపికయ్యారు. ● జిల్లా ఆర్చరీ బాలుర జట్టులో ముల్కి చరణ్, ఆర్.బార్గవ్, బి.హరికృష్ణ, ఎ.కొండల్రాయ్, బాలికల జట్టులో టి.వీరభద్రమ్మ, కుంజ భవ్యకు స్థానం దక్కింది. ● రెజ్లింగ్ బాలుర జట్టులో ఎ.విష్ణువర్దన్, జి.యువరాజ్, ఎన్.వివేక్వర్దన్, బి.మణిచరణ్, పి.శివతేజ్నందన్, పి.జయదేవ్, పి.గణేశ్, వి.ఉదయ్కిరణ్, కె.లిఖిత్ చరణ్, ఎం.అమేశ్ బహూదుర్, ఎస్.చరణ్రాజ్, బాలికల జట్టులో జి.వర్షిత, కె.దీక్షిత, ఆర్.గీత హర్షిణి స్థానం దక్కించుకున్నారు. -
ఆర్టీసీకి దసరా బొనాంజా!
● ఖమ్మం రీజియన్కు రూ.24.22 కోట్ల ఆదాయం ● 6వ తేదీన అత్యధికంగా రూ.2.18 కోట్ల రాబడి ● అవిశ్రాంతంగా పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది ఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగ ఆర్టీసీ ఖమ్మం రీజియన్కు కనకవర్షం కురిపించింది. పండుగ రద్దీ ఆధారంగా ఆర్ఎం సరిరామ్ ఆధ్వర్యాన ముందస్తు ప్రణాళికలు రూపొందించడమే కాక సిబ్బంది నిర్విరామంగా పనిచేయడంతో రాకపోకలు సాఫీగా సాగాయి. ఫలితంగా రీజియన్కు రూ.24,22,58,199 ఆదాయం లభించింది. 1,208 ప్రత్యేక బస్సులు.. బతుకమ్మ, దసరా పండుగలకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు స్వస్థలాలకు రానున్నందున ముందుగానే డిపో మేనేజర్లు, సూపర్వైజర్లతో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ పలు దఫాలు సమీక్షించారు. ఈమేరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతనెల 20 నుంచి ఈనెల 6వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు బస్సులు నడిపారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందుకు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు వేలాది మందిని చేర్చేలా 1,208 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగించాయి. 38.50లక్షల కి.మీ. ప్రయాణం గత నెల 20వ తేదీ నుంచి ఈనెల 6వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు 38.50 లక్షల కి.మీ. బస్సులు తిరిగాయి. దీంతో ఆర్టీసీ రీజియన్కు మహాలక్ష్మితో కలిపి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.4.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా, బతుకమ్మ, దసరా పండుగకు వచ్చివెళ్లే ప్రయాణికులకు సేవలందించేలా రీజియన్లోని ఏడు డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, కార్మికులు, సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు అవిశ్రాంతంగా పనిచేయడంతో ఎక్కడా లోటుపాట్లు ఎదురుకాలేదు. ఒకేరోజు 3.17 లక్షల కిలోమీటర్లు ఈ దసరా సెలవుల్లో ఖమ్మం రీజియన్ అధికారులు గత రికార్డులను బ్రేక్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ఒకేరోజు 3.17 లక్షల కి.మీ. మేర బస్సులు తిరగగా రూ.2.18 కోట్ల ఆదాయం రాబట్టారు. ఇందులో రీజియన్లోని ఖమ్మం డిపోకు అత్యధికంగా రూ.49 లక్షలు ఆదాయం రాగా, భద్రాచలానికి రూ.38.39 లక్షలు, సత్తుపల్లికి రూ.37.95లక్షలు, మధిరకు రూ.32 లక్షలు, మణుగూరుకు రూ.21.50 లక్షలు, కొత్తగూడెంకు రూ.21.50 లక్షలు, ఇల్లెందుకు రూ.11 లక్షలు ఆదాయం సమకూరింది.ఇల్లెందు1.12భద్రాచలం4.44సత్తుపల్లి4.41ఖమ్మం5.53మణుగూరు 3.25డిపో ఆదాయం (రూ.కోట్లలో)మధిర2.99కొత్తగూడెం2.47సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించి మరేది లేదని ప్రయాణికులకు ఉన్న నమ్మకం మరోమారు రుజువైంది. అందుకే పండుగ సెలవుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు ఎక్కువ మంది ఆర్టీసీనే ఆశ్రయించారు. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది శ్రమించారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సేవలందిస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
ఏటీసీతో యువతకు ఉజ్వల భవిష్యత్
మణుగూరు రూరల్: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో ఇచ్చే శిక్షణతో నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని ముత్యాలమ్మనగర్ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఏటీసీని మంగళవారం పరిశీలించిన ఆయన పెండింగ్ పనుల పూర్తిపై సూచనలుచేశారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ యువతకు సాంకేతికత శిక్షణను చేరువ చేయాలనే భావనతో ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ జి.రవి, సూపరింటెండెంట్ టీఎన్.జ్యోతిరాణి, ఏటీఓలు ఎం.శ్రీనివాసరావు, జీవీ.కృష్ణారావు, ఏ.నర్సయ్య, వేణుగోపాల్, సిబ్బంది పూర్ణచందర్రావు, సూనాథ్ అశోక్, శ్రావణి, చందు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో వాల్మీకి జయంతి
సూపర్బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెం టౌన్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. వాల్మీకి రామాయణం ఆధారంగా హితోక్తులు పాటిస్తే అందరూ ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. బీసీ సంక్షేమాధికారి పి.విజయలక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం, వాల్మీకి బోయ సంఘాల నాయకులు నాయకులు కొదుమూరి సత్యనారాయణ, ముదురుకోళ్ల కిషోర్, ఎం.వెంకన్న, బి.నందకిషోర్, ఎం.శ్రీనివాస్, కె.సాంబయ్య, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి పూలమాల వేసి నివాలర్పించారు. అధికారులు, సిబ్బంది సత్యనారాయణ, సుధాకర్, లాల్బాబు, కృష్ణారావు, మంజ్యూనాయక్ పాల్గొన్నారు. -
కుమురం భీం ఆశయస్ఫూర్తిని కొనసాగించాలి
భద్రాచలం: గిరిజన హక్కుల సాధనతో పాటు జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరాడిన ధీరుడు కుమురం భీం ఆశయ స్ఫూర్తిని గిరిజన యువత కొనసాగించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో మంగళవారం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పీఓ నివాళులర్పించి మాట్లాడారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి మన్యంలో పోరాటం సాగించిన భీం ఆదర్శప్రాయుడయ్యారని తెలిపారు. ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, అధికారులు ఉదయ్కుమార్, భాస్కర్, మధుకర్, రాజారావు, తదితరులు పాల్గొన్నారు. ఆదికర్మ యోగి నివేదిక సిద్ధం గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నామని ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్రెడ్డి మంగళవారం ఆదికర్మ యోగి పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం అమలుచేస్తున్న పథకాన్ని విజయవంతం చేసేలా నివేదికలను త్వరగా పంపించాలని సూచించారు. ఈమేరకు భద్రాచలం నుంచి ఏపీఓ మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పరిధి 19 మండలాల్లోని 130 గ్రామాల్లో సమస్యలను గుర్తించామని తెలిపారు. వీసీలో టీసీఆర్టీఐ డైరెక్టర్ సమజ్వాల, ఉద్యోగులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
సహజసిద్ధంగా వేడినీరు
గోదావరి తీర ప్రాంతంలో చమురు నిక్షేపాల కోసం 70, 80వ దశకంలో ఆయిన్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) అన్వేషణ సాగించింది. ఈక్రమాన అనేక చోట్ల బోర్లు వేయగా మణుగూరు మండలం పగిడేరు వద్ద వేసిన ఓ బోరు నుంచి నిత్యం వేడి నీరు బయటకు వస్తోంది. ఆర్టిసన్ వెల్స్గా వీటిని పిలుస్తారు. భూమి లోపలి పొరల్లో ఉండే నీరు విపరీతమైన వేగంతో బండరాళ్ల గుండా ప్రవహించినప్పుడు ఏర్పడే రాపిడితో నీరు వేడెక్కుతుంది. పగిడేరు వద్ద ఉబికి వచ్చే నీరు 70 – 80 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇక్కడ వేడినీటి ఊటల ఆధారంగా 20 కిలోవాట్ల సామర్ధ్యంతో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ మేరకు రెండేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉష్ణగుండాలు హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించిన అనేక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర ఉష్ణగుండాలు ఇటు పర్యాటకులను, అటు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్ప్రదేశ్లోని మణికరణ్, ఉత్తర్ఖండ్లోని గౌరీకుండ్, తపోవన్ వంటి ప్రదేశాల్లో సహజసిద్ధంగా భూమిలో నుంచి వేడి నీరు బయటకు వస్తుంది. వీటిని పవిత్ర ప్రదేశాలుగా పరిగణిస్తూ అక్కడకు వెళ్లే భక్తులు స్నానాలు ఆచరిస్తారు. మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, కాల్షియం వంటి ఖనిజాలను కలిగిన ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల నమ్మిక. అలాగే, టైర్ వన్ సిటీల్లో కొత్తగా వెలుస్తున్న వెల్నెస్ సెంటర్లలోనూ ‘హాట్ వాటర్ థెరపీ’లు అందుబాటులో ఉన్నాయి. కృత్రిమ బీచ్ ఏర్పాటుతో.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని ప్రకటించింది. అందులో భాగంగానే తెలంగాణలో కృత్రిమ బీచ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే హైదరాబాద్లో ఆర్టిఫీషియల్ బీచ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పుడు వేడి నీటి ఊటల ఆధారంగా పగిడేరులోనూ బీచ్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉబికి వచ్చే వేడి నీటిని సమీప ప్రాంత రైతులు నేరుగా ఉపయోగించడం లేదు. మడుల్లో నిల్వ చేసి చల్లారాక పొలాలకు పారిస్తున్నారు. ఇలాంటి మడుల దగ్గరే ఇసుక రాశులను భారీగా పోయడం ద్వారా కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సింగరేణి సహకారం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉండడంతో జిల్లాలో టెంపుల్ టూరిజం ఉన్నత స్థాయిలో ఉంది. ఏపీలోని పాపికొండలు, మారేడుమిల్లికి వెళ్లే పర్యాటకులు జిల్లా మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఇక పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద కూడా ఏకో టూరిజం అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఇలా జిల్లాకు వచ్చే పర్యాటకులకు మరో ఆకర్షణగా ఈ కృత్రిమ వేడి నీటి బీచ్ను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈమేరకు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లా యంత్రాంగం చూసుకోనుండగా, ఇక్కడ జియో థర్మల్ పవర్ ప్లాంట్ పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న సింగరేణి ఈ ప్రదేశాన్ని బీచ్గా మార్చేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించనుంది. బొగ్గుతో మొదలైన సింగరేణి ప్రస్థానం థర్మల్, సోలార్ పవర్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్తో పాటు పర్యాటక రంగంలోనూ పాదం మోపనుంది. ఇప్పుడు కృత్రిమ బీచ్ ఏర్పాటు ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే సింగరేణి మరో అడుగు ముందుకేసినట్లవుతుంది.పగిడేరులో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు సన్నాహాలు