breaking news
Bhadradri District Latest News
-
సాహిత్యంతో మానవీయ విలువలు
అశ్వారావుపేటరూరల్: సాహిత్యానికి మానవీయ విలువలను పెంపొందించే శక్తి ఉందని విద్యాశాఖ జిల్లా మానిటరింగ్ అధికారి అమృతలూరి నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక సూర్య స్కూల్ ఆవరణలో భానూదయ సాహిత్య సంస్థ, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శతాధిక బాలకవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను బాల్యం నుంచే ఆంగ్లం వెంట పరుగులు పెట్టించకుండా మాతృభాషను కుడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కవి సమ్మేళనంలో 110మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలపై కవిత్వాన్ని వినిపించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సైదులు, ఎంఈఓ పి.ప్రసాదరావు, కాంప్లెక్స్ హెచ్ఎంలు హరిత, షాహీనా బేగం, కొండలరావు, వీరేశ్వరరావు, సూర్య స్కూల్ ప్రిన్సిపా ల్ పోతన రాంబాబు, డైరెక్టర్ జాహ్న వి, భానూదయ సంస్థ అధ్యక్షుడు సిద్దాంతపు ప్రభాకరాచార్యులు, మడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.విద్యాశాఖ జిల్లా మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ -
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం వైభవంగా స్నపన తిరుమంజనం జరిపారు. ప్రతీ బుధవారం బేడా మండపంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామాలయంలో ‘విజిలెన్స్’ విచారణశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయంలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడవతో వారు విచారణ చేసినట్లు సమాచారం. ప్రధానంగా గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తూ రెగ్యులర్ జాబ్ పొంది, మళ్లీ తిరిగి ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న ఒకరి వివరాలు సేకరించినట్లు తెలిసింది. దీంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు, రికార్డులను ఆలయ ఈఓ సమక్షంలో విచారించినట్లు సమాచారం. కాగా ఆలయంలో కేవలం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పైనే విచారణ జరపడం చర్చకు దారి తీసింది. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం మండలస్థాయిలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలస్థాయి ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు మొదట tgss.telangana.gov.in వెబ్సైట్లో ఈనెల 26 నుంచి మార్చి 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు ఒరిజినల్ ఆధార్కార్డు, 3వ తరగతి చదువుతున్న పాఠశాల నుంచి వయసు, విద్యార్హత సర్టిఫికెట్లు, పుట్టినతేదీ రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆరు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లాకు, అక్కడ ఎంపికై న వారిని రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు తెలి పారు. వివరాలకు 9505423226, 9966125087 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలిదమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న వార్షిక నిర్వహణ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన అప్పారావుపేట ఫ్యాక్టరీలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చేయకుండా గడువులోపుగా పూర్తిచేసి, యంత్రాల పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
28 నుంచి బ్రహ్మోత్సవాలు
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసిఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు వేడుకలు జరపనున్నారు. 28న ఉత్సవాలు ప్రారంభం కానుండగా, మార్చి 2న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఆలయానికి రంగులు వేసే, మండపం చుట్టూ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చుతున్నారు. ఆలయ మేనేజర్పాకాలవెంకట రమణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గుండుగుపల్లిలో క్యాంప్ కార్యాలయంలో బుధవా రం ఆవిష్కరించారు. మేనేజర్ పాకాల వెంకట రమణ, శివాలయ చైర్మన్ మల్లెల నర్సింహారావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ప్రసాదా చార్యులు, రామారావు తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల కాలం నాటి ఆలయం వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. కాకతీయుల సేనాని అన్నపురెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రశాంతతపై మక్కువతో ఆలయ నిర్మాణం చేపట్టారని, అతని పేరుమీదనే అన్నపురెడ్డిపల్లి గ్రామం ఏర్పడిందని చెబుతారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో గురుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కాగా ఆలయాన్ని కాళ్లూరి వంశస్తులు 1980లో పునర్నిర్మించినట్లు కాళ్లూరి ధర్మారావు రచించిన రాజధర్మ ప్రకాశిక పుస్తకంలో పేర్కొన్నారు. 2,300 ఎకరాల భూమి స్వామివారి కై ంకర్యాల నిమిత్తం ఆలయానికి 2,300 ఎకరాల భూమి ఉంది. కాకతీయుల కాలంలోనే రాయుడుచెరువు, నల్లచెరువులను నిర్మించినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. ఆలయాన్ని 1969 నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షిస్తుండగా 1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మహామండపం, ప్రాకార మండపం, నాలుగు దిక్కులు భారీ గోపురాలు నిర్మించారు. 28న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం .. ఈ నెల 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 5న ముగియనున్నాయి. తొలిరోజు ఆరా ధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం తదితర పూజాధికాలు నిర్వహిస్తారు. మార్చి 1న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం చేస్తారు. గురుడ ప్రసాదం అందజేస్తారు. 2న పసుపు కొట్నాలతోపాటు తలంబ్రాలు కలుపుతారు. ఎదుర్కోలు ఉత్సవం, తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 3న చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని మూసేస్తారు. 4న సామూహిక సుదర్శన హోమం, దొంగలదోపు ఉత్సవం, రథోత్సవం చేస్తారు. చివరిరోజు 5న ద్వారతోరణ బలి, చక్రస్నానం తదితర పూజా కార్యకమాలు నిర్వహించనున్నారు. -
గ్రీన్ సిగ్నల్
భద్రాచలం: ఎన్నో ఏళ్లుగా భద్రాచలం క్రీడాకారులు, స్థానికులను ఊరిస్తున్న గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఐదెకరాల స్థలం కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే హామీకే పరిమితం కాకుండా భూ సేకరణ, నిధుల విడుదల ప్రక్రియ పూర్తిచేసి స్టేడియం నిర్మాణం వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. అన్నింటికీ ఆ గ్రౌండే దిక్కు.. భద్రాచలంలో ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ మాత్రమే ఉంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైవేట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు.. ఇలా అన్నింటికీ ఈ మైదానమే దిక్కు కాగా, కాలేజీకి నామమాత్రపు ఫీజు చెల్లించి ఉపయోగించుకుంటున్నారు. చిన్నారులు, యువతకు ఫుట్బాల్, క్రికెట్, ఇతర క్రీడల కోచింగ్ క్యాంప్లు, అకాడమీల నిర్వహణా ఇక్కడే. ఇక అన్ని వర్గాల ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ గ్రౌండ్లోనే వాకింగ్ చేస్తుంటారు. భద్రాచలం ఏజెన్సీలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులకు కొదవ లేదు. ఆర్చరీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడల్లో గిరిజనులు అద్భుత ప్రతిభ చూపుతారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఇంతటి క్రీడానైపుణ్యం ఉన్నా.. సరైన శిక్షణ లేక పలువురు గ్రామాలకే పరిమితమవుతున్నారు. వీరందరికీ కోచింగ్ అకాడమీ నిర్వహణ, శిక్షణ కోసం స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. -
ఫారెస్ట్ వర్సెస్ రెవెన్యూ..
కారేపల్లి: అటవీ – రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళం నెలకొంది. తమ పరిధిలోని భూమిలో తవ్వకాలు చేపట్టారని అటవీ అధికారులు.. రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలంలోనే గోదాం నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ ప్రతినిధి అటవీ ఉద్యోగులపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. మండలంలోని గుట్టకిందిగుంపు గ్రామంలో గంగమ్మగుట్ట చివరి భాగాన సీలింగ్ భూమి పది ఎకరాలను ప్రభుత్వం రూ.9 కోట్లతో నిర్మించే గోదాంకు కేటాయించింది. అయితే, రేలకాయలపల్లి ఫారెస్టు సెక్షన్లో సీతా రామ ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి అటవీ భూమి సేకరించగా, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుట్టకిందిగుంపు గ్రామంలో గుట్టపై 33 ఎకరాలను అటవీ శాఖకు కేటాయించాక రెవెన్యూ అధికారులు హద్దులు కూడా నిర్ధారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అటవీ పరిధిలోకి వచ్చే సుమారు 30 చదరపు గజాల్లో చెట్లు నరికి పొక్లెయినర్తో మట్టి తవ్వి తరలిస్తున్నారంటూ కారేపల్లి అటవీ రేంజ్ ఉద్యోగులు మంగళవారం సాయంత్రం అడ్డుకున్నారు. అనంతరం టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు మాత్రం రెవెన్యూ అధికారులు కేటాయించిన హద్దుల్లోనే పనులు చేపడుతున్నా అటవీ ఉద్యోగులు వర్కర్లపై దాడి చేసి టిప్పర్ స్వాధీనం చేసుకున్నారంటూ సూపర్వైజర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సుజాతనగర్ : గ్రామాల్లో పచ్చదనం – పారిశుద్ధ్య చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. 2023 – 24లో జాతీయ అవార్డు సాధించిన సీతంపేట బంజర గ్రామాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. డ్రెయినేజీలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయ సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బహిరంగ మల విసర్జనకు స్వస్తి చెప్పాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, చెత్త వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శభ్రం చేస్తుండాలని సూచించారు. పచ్చదనం విస్తరణకు విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ లైబ్రరీలో 8, 9,10 తరగతుల విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారులపై గుంతలను సరిచేయడానికి అవసరమైన రోలర్ను అందజేస్తామని హామీ ఇచ్చారు. బయోచార్ తయారీతో వచ్చే బొగ్గును చల్లితే డ్రెయినేజీలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. త్వరలో జాతీయ స్థాయి పరిశీలన బృందం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ, మౌలిక సదుపాయాల సంరక్షణలో లోపాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, ట్రెయినీ డీపీఓ అనూష, ఎంపీడీఓ బి.భారతి, డీఎల్పీఓ ప్రభాకర్, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ గుగులోత్ జానకీరాం, ఉప సర్పంచ్ బానోత్ సాలి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ -
నూరు శాతం ఫలితాలు సాధించాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● చెన్నంగులగడ్డ వార్డెన్ సస్పెన్షన్, హెచ్ఎంకు మెమో ఇల్లెందురూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపించాయని, ఈ కొద్ది సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని రొంపేడు, చెన్నంగులగడ్డ ఆశ్రమ పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి.. పరీక్షలంటే భయం వీడాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం స్టడీ హవర్స్ విధిగా నిర్వహించాలని, పరీక్షలు పూర్తయ్యేవరకు విద్యార్థులను బయటకు అనుమతించొద్దని, డ్రాపౌట్స్ ఉంటే పాఠశాలకు తీసుకొచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కింది తరగతుల వారితో ఉద్దీపనం వర్క్బుక్లోని అంశాలను బోర్డుపై రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్ల లకు మెనూ ప్రకారం అల్పాహారం అందించాలని చెప్పారు. చెన్నంగులగడ్డ ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, రుచిగా లేకపోవడంతో వార్డెన్ బాయమ్మను సస్పెండ్ చేయడంతో పాటు హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అశోక్, హెచ్ఎంలు పద్మ, నామ తదితరులు పాల్గొన్నారు. -
హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు!
బెంగళూరు శిక్షణలో ప్రదర్శన దుమ్ముగూడెం: మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్కు చెందిన ఉపాధ్యాయుడు మోహన్కుమార్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ – సౌత్ ఇండియా ఆధ్వర్యాన బెంగళూరులో జరుగుతున్న శిక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ నుంచి హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ముఖ్య పండుగలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ప్రదర్శన ఇవ్వగా... మోహన్కుమార్ హనుమంతుడి వేషధారణలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ విశేషాలతో ప్రదర్శన ఇవ్వడంతో పలువురు అభినందించారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు హేయనీయంచుంచుపల్లి: గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం హేయమైన చర్య అని బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా వైస్ చైర్మన్ బానోత్ వీరూ నాయక్ హెచ్చరించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలి పారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శులు ధరావత్ కాన్షీరామ్, గుగులోత్ కేశవ్, గణేష్ మహరాజ్, ట్రెజరర్ బానోత్ రమేష్ నాయక్, జేఏసీ కో–కన్వీనర్లు గుగులోత్ భద్రు, ధరావత్ కృష్ణ, లావుడ్య హన్మంతు, జాటోత్ భరత్, గుగులోత్ ప్రసాద్, ధరావత్ నర్సింహా పాల్గొన్నారు. బ్యాంక్ లావాదేవీలపై అవగాహన తప్పనిసరి ఖమ్మంమయూరిసెంటర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లావాదేవీలపై సీసీలు, ఏపీఎంలు అవగాహన కల్పించా లని డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్ సూచించా రు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్ సీసీలకు ఆర్థిక అక్షరాస్యతపై ఖమ్మంలోని జిల్లా సమాఖ్య భవనంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కల్పించాలని తెలిపారు. అలాగే, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ, ప్రభుత్వం నుంచి తిరిగి ఎంత వస్తుందో అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో జయశ్రీ, ఆంజనేయులు పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్షఅశ్వారావుపేటరూరల్: మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష, మరో ముగ్గురు వ్యక్తులకు జరిమానా విధించారు. ఎస్ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామానికి చెందిన కణితిపల్లి కాంతారావు, మరో ముగ్గరు వ్యక్తులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి, నిందితులను బుధవారం దమ్మపేట జ్యుడీడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బి.భవానీరాణి ఎదుట హాజరు పరిచారు. కాంతారావు అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష, మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మొర్రేడు ఖాళీ..!
పాల్వంచరూరల్: మొర్రేడు నుంచి ఇసుక తోడేస్తున్నారు. నిత్యంజేసీబీ యంత్రాల సహాయంతో లారీ లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళ అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాగులో ఇసుక నిల్వలు ఖాళీ అవుతుండటంతో సాగునీటి సమస్య ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల నుంచి దందా సాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని తోగ్గూడెం, భోజ్యాతండా, దంతలబోరు ఎస్సీకాలనీ, బండ్రుగొండ, సంగం గ్రామాల మీదుగా ప్రవహించే మొర్రేడు దంతలబోరు శివారులో కిన్నెరసాని నదిలో కలుస్తుంది. ఈ వాగు నీళ్లపైన ఆధారపడి వానాకాలం, యాసంగి సీజన్లలో మండలంలో వందల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మరోవైపు ములకలపల్లి మండల పరిధిలోని రైతులు కూడా పంటలు సాగు చేస్తుంటారు. వాగు పొంగి పొర్లడంతో వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటలు నీటమునిగి పోతుంటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. యాసంగి పంటలు మాత్రం రైతుల చేతికొస్తుంటాయి. ఇప్పుడు వాగులోని ఇసుక అడుగంటుతుండటంతో వాగు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి, వేసవిలో సాగునీరు లభించదని, పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సర్పంచ్ అడ్డుకుంటున్నా... ఇటీవల ఎన్నికై న నాగారం మహిళా సర్పంచ్ స్వప్న అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం ఉదయాన్నే మొర్రేడు వాగులో జేసీబీ యంత్రాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సుమారు పది రోజుల క్రితం కూడా అర్ధరాత్రి వేళ ఆమె, గ్రామస్తులు కలిసి వాగులో ఉన్న జేసీబీ యంత్రాన్ని పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. స్పందించని మైనింగ్ శాఖ భోజ్యాతండా వద్ద మొర్రేడు వాగు నుంచి రాత్రి సమయంలో జేసీబీ ప్రొక్లెయినర్ సహాయంతో ఇసుక తోడి, రవాణా చేస్తున్న విషయమై మైనింగ్ ఏడీ దినేష్ను వివరణ కోరేందుకు ఫోన్లో పలుమార్లు ప్రయత్నించగా.. స్పందించలేదు. కొందరు ఇసుకాసురులు తోగ్గూడెం, భోజ్యాతండా, దంతలబోరు ఎస్సీ కాలనీ ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సాకు చూపుతూ ప్రైవేటుగా అధిక రేట్లకు విక్రయించుకుంటున్నారు. భోజ్యాతండా వద్ద మాత్రం భారీ జేసీబీ యంత్రాన్ని వాగులోకి దింపి రాత్రి సమయంలో లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. కానీ అక్రమార్కులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా వెనుక ఓ ప్రజాప్రతినిధి కుమారుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇసుక దందాను అరికట్టాల్సిన మైనింగ్ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. -
సౌర ప్లాంట్ల ఏర్పాటులో వేగం
బోనకల్: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. బోనకల్ మండలం చిరునోముల, బ్రాహ్మణపల్లి, కలకోట, ముష్టికుంట్లల్లో నిర్మిస్తున్న సబ్స్టేషన్లు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ మండలంలోని 22గ్రామాలను మోడల్ సోలార్ పథకం కింద ఎంపిక చేసినందున ప్రతీ ఇంటికి రెండు కిలోవాట్లు, రైతులకు ఉపయోగపడేలా 7.5 కిలోవాట్ల ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్లతో వినియోగదారులకు బిల్లులు తగ్గడమే కాక పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. మోడల్ సోలార్ గ్రామాల్లో సర్వే ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన మోడల్ సోలార్ గ్రామాల్లో సర్వే నిర్వహించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. ఖమ్మంలోని అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ బోనకల్ పూర్తి మండలంతో పాటు నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం, రఘునాథపాలెం, ఏన్కూరు మండలంలోని శ్రీరాంగిరి, మధిర మండలంలోని సిరిపురంలో సర్వే ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని తెలిపారు. సర్వే బాధ్యతలు 16 మంది సబ్ ఇంజనీర్లు నిర్వర్తించాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ, ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, రెడ్ కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పొలిశెట్టి అజయ్కుమార్, అధికారులు భద్రుపవార్, శ్రీనివాసరావు, అజయ్, కిరణ్ చక్రవర్తి, వైవీ.ఆనంద్కుమార్, మనోహర్, సర్పంచ్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, అనుముల కళావతి, పైడిపల్లి అనిత పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడిఝెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 37 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షలు నిర్వహించగా విద్యార్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్ విద్యార్థులు 7,973 మంది, ఒకేషనల్ విద్యార్ధులు 1,712 మంది ఉండగా తొలిరోజు పరీక్షకు జనరల్ విభాగంలో 7,683 మంది, ఒకేషనల్లో 1,527 మంది హాజరయ్యారు. రెండు విభాగాల్లో కలిపి 475 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడిఝెట్ నోడల్ అధికారి హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తనిఖీ చేశారు. ప్రశ్నపత్రాల భద్రత, పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్షించిన ఆయన.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం పట్ల సంతృపి్త్ వ్యక్తం చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రత చర్యలు కల్పించామని ఆయన వివరించారు. పరీక్షల ముగిసేంత వరకు ఇలాగే పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. -
వసూళ్లు అంతంతే..
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి ముగుస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మున్సిపల్ ఎన్నికల హడావిడితో సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో సగానికి కొంత అటుఇటుగా మాత్రమే పన్నులు వసూలు కావడం గమనార్హం. మణుగూరు మున్సిపాలిటీకి సంబంధించి కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు లేకపోవడంతో అక్కడ మాత్రం 75 శాతం మేర పన్నులు వసూలు చేయగలిగారు. మొండి బకాయిలపై దృష్టేది..? జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మొండి బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భారీగా పన్నులు పేరుకుపోయిన వారింటికి అధికారులు వెళ్లగానే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వారేమీ చేయలేక వెనుదిరుగుతున్నారు. ఎవరి అండ లేని పేదలు మాత్రం రూ.1000 బకాయి ఉన్నా అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అలా కాకుండా బకాయి పడిన వారందరి నుంచీ వసూలు చేయాలని పలువురు అంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో అయితే రూ.30 వేలు, రూ.40 వేలు బకాయిలున్న వారి ఇంటి నంబర్లను తొలగిస్తున్న అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్ ఉన్నవారి వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పన్నుల డిమాండ్, వసూళ్లు ఇలా.. జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఈ ఏడాది పన్నుల డిమాండ్ రూ.12కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.5.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన బకాయిలు మార్చి నెలాఖరు నాటికి వసూలు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేటలో రూ.2.35 కోట్లు డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.1.24 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.1.11 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో రూ.1.50 కోట్లకు గాను సుమారు రూ.75 లక్షలు వసూలు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో మాత్రం రూ.1.42 కోట్లకు రూ.1.05 లక్షలు వసూలయ్యాయి. గత చర్యలు పునరావృతం అయ్యేనా.. మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల మొండి బకాయిలు వసూళ్లు చేసేందుకు అధికారులు గతంలో సామాన్లు జప్తు చేసేవారు. ఇటీవల కాలంలో అయితే ఇంటి పన్నులు చెల్లించాల్సిన యజమానుల పేర్లను వారి వీధుల్లో ప్రధాన సెంటర్లు, కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తూ, పన్ను చెల్లించిన తరువాత వాటిని తొలగించే వారు. ప్రస్తుతం కూడా అలాంటి చర్యలు చేపడితేనే పన్నులు సక్రమంగా వసూలవుతాయని పలువురు సూచిస్తున్నారు. కాగా, మార్చి నెల మొత్తం పన్నుల వసూళ్ల పనిమీదే ఉంటామని, ఈ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు లక్ష్య సాధనకు చేరవవుతామని అంటున్నారు. -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
ములకలపల్లి: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన వలస ఆదివాసీ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడ్డురామవరానికి చెందిన బోడా జగదీష్ అలి యాస్ చంటి ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీలతో యర్రప్పగుంపు గ్రామ శివారులో మూడు రోజులుగా జామాయిల్ తోట నరికిస్తున్నాడు. బీజాపూర్ జిల్లా గుజ్జకుంట గ్రామానికి చెందిన మడివి బుద్రాం (24) బుధవారం చెట్టు నరుకుతుండగా, పక్కనే ఉన్న 220 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. అదే సమయంలో బుద్రాం నరికిన చెట్టును పట్టుకోవడంతో విద్యుదాఘాతానికిగురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘట నపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన కొర్స రాంబాబు (31) బుధవారం బైక్పై ఆళ్లపల్లికి బయలుదేరాడు. గంగారం సమీపంలో ఎదురుగా వస్తున్న ఐస్క్రీమ్ వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాపర్ తీగ చోరీమణుగూరు రూరల్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్ను చోరీ చేశా రు. మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ వెంకటపతినగర్ పరిధిలోని కోడిపుంజుల వాగు సమీపంలో పొలాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ ను పగులగొట్టి, అందులోని కాపర్ వైరును అపహరించారు. బుధవారం ఉదయం గుర్తించిన రైతులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడీఈ ఉమామహేశ్వరరావు, లైన్మెన్ ఇరుగు శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ములకలపల్లి, (అన్నపురెడ్డిపల్లి): ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాజాపురం గ్రామానికి చెందిన శనగారపు పుల్లయ్య (55) రోజూలాగానే మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాతిలో నొప్పిరావడంతో కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో, బైక్ ఢీమహిళ మృతి చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల క్రాస్రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. టేకులపల్లి మండలం శంభునిగూడేనికి చెందిన దంసలాపురి సక్కుబాయి (45) పాల్వంచ నుంచి ఆటోలో తమ గ్రామానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సక్కుబాయి కింద పడి తలకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆటోడ్రైవర్ కుక్కమూడి బుచ్చిబాబుకు, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహదారుడు నవీన్కు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు. నలుగురు నిందితులకు రిమాండ్మణుగూరురూరల్: ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నలుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు మణుగూరు సీఐ నాగబాబు మంగళవారం తెలిపారు. ఈ నెల 13వ తేదీన పోలోజు నవీన, శ్రీరామోజు సుధాకర్చారి, కొండగూడూరు జ్యోతి, మల్లిడి భాస్కర్ కలిసి.. అడ్డగర్ల సురేశ్ను మాట్లాడాల్సి ఉందని ఇంటికి పిలిపించి, అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అతడి తల్లి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సురేశ్ వాంగ్మూలం, ఇతర ఆధారాలను సేకరించి, నిందితులను అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించినట్లు సీఐ నాగబాబు పేర్కొన్నారు. పశువుల పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న పశువులను సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్కు అక్రమంగా బొలేరో వాహనంలో 9 పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోని చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. వాహనంలో తనిఖీ చేసి, పశువులను స్వాధీనం చేసుకుని, పాల్వంచ గోశాలకు తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని టౌన్ పోలీసులు వెల్లడించారు. -
మట్టి.. కొల్లగొట్టి
సీతారామ ప్రధాన కాల్వ ప్రాంతం ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాల్వ మట్టి మాయమైపోతోంది. మాధారం – పూసుగూడెం అటవీ ప్రాంతంలో కెనాల్ మట్టి అక్రమార్కుల పాలవుతోంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆర్అండ్బీ రోడ్డు వెంట సైడ్బర్మ్ పేరిట నెలకు ఐదురోజులపాటు అనుమతులు పొంది, నెలంతా అడ్డూ అదుపు లేకుండా అక్రమ తోలకాలు సాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాత్రివేళ వేలాది ట్రిప్పుల మట్టి టిప్పర్లతో మట్టిని పాల్వంచ, కొత్తగూడెం తరలించినట్లు సమాచారం. కలెక్టర్ స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
మున్సిపల్ చైర్పర్సన్కు సత్కారం
ఇల్లెందు: 17 ఏళ్లుగా తాను టీచర్గా పనిచేసిన పాఠశాలలో ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్మిత్రను మంగళవారం సన్మానించారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను స్కూల్ చైర్మన్ జోష్ నెడుంతుండం, ప్రెసిడెంట్ టి.సుధాకర్, డైరెక్టర్రాజు, హెచ్ఎం బిజూకే జోసెఫ్, ప్రిన్సిపాల్ నిషా సత్కరించారు. ఆ పాఠశాల లో కిరణ్మిత్ర 17 ఏళ్లు టీచర్గా పనిచేశారు. ఈ సందర్భంగా తన క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. టెండర్లు ఖరారుభద్రాచలం: సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం టెండర్ల ను ఖరారు చేశారు. భద్రాచలం ఆలయం వద్ద పాదరక్షలు, లాకర్ల లైసెన్సు హక్కులను రూ.21 లక్షలకు, పర్ణశాల ఆలయం వద్ద సెల్ఫోన్లు భద్రపర్చు లైసెన్సులను రూ. 8,30,000కు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ దామోదర్రావు వెల్లడించారు. -
సెల్టవర్ ఎక్కిన రైతు
నేలకొండపల్లి: భూపంచాయితీని పరిష్కరించడం లేదంటూ ఓ రైతు సెల్టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సెల్ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టడంతో ఆయనను సంప్రదించడం సాధ్యం కాక ఉద్రిక్తత నెలకొంది. చివరకు మూడు గంటల అనంతరం ఆయనే దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామానికి చెందిన ఆకుల శ్రీను కు కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని.. ఫలితంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయినట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆయన పైనంపల్లి వద్ద సెల్ టవర్పైకి ఎక్కాడు. దీంతో పోలీసులు చేరుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, ఫోన్ ఫ్లైట్ మోడల్లో పెట్టుకోవడం, చీకటి పడడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈమేరకు అగ్నిమాపక శాఖ చేరుకోగా, పోలీసులు పర్యవేక్షించారు. చివరకు రాత్రి 9గంటలకు శ్రీను తనకు తానే టవర్ దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల యూరియా కోసం సూర్యాపేట జిల్లాలోని కోదాడలో కూడా శ్రీను టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.మూడు గంటల పాటు కొనసాగిన నిరసన -
ఇక నూతన భవనాల్లో విద్య!
కొత్తగూడెంఅర్బన్: స్థానిక కూలీలైన్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొద్ది రోజుల కిందట శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేశారు. సదరు పాఠశాల, కళాశాలకు నిధులు కేటాయించి నూతన గదుల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో వచ్చేవిద్యా సంవత్సరంలో విద్యార్థులు నూతన భవనాల్లో విద్యనభ్యసించనున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల గదులు శిథిలావస్థకు చేరి, వర్షం వస్తే కురవడం, ఎండకు అధిక వేడి ప్రసరిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏళ్లుగా అవస్థలు పడ్డారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి విషయం చేరడంతో వారు స్పందించి పాఠశాల ఆవరణలో నూతనంగా ఎని మిది గదులు నిర్మించేందుకు రూ.2కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబర్లో శిథిలావస్థవకు చేరిన గదులను కూల్చి, వాటి స్థానంలో కొత్త గదు లు నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయి తే, ఆ గదుల్లో విద్యనభ్యసించేవారిని సైన్స్ ల్యాబ్ లు, గ్రంథాలయం, డిజిటల్ గదుల్లో సర్దుబాటు చేసి, పాఠాలు బోధిస్తున్నారు. గదులు కూల్చివేశా రు కానీ, పనులు ఆలస్యం అవుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. గదులు కూల్చివేసిన ప్రాంతం విద్యార్థులకు ప్రస్తుతం మైదానంగా ఉపయోగపడుతోంది. పాఠ్యంశాల బోధన, విద్యార్థులు కూర్చునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే విద్యా సంవత్స రం నాటికి గదుల నిర్మాణం జరిగితే ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. కూలీలైన్ ప్రభు త్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి పాఠశాలలో గదుల నిర్మాణ పనులు త్వరితగతిన జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు. జూనియర్ కళాశాలలో.. కొత్తగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అదే పరిస్థితి ఉండడంతో శిథిలావస్థలో ఉన్న గదులను ఇటీవల తొలగించారు. గదుల్లో రేకులు పగిలిపోయి, వర్షం వచ్చినప్పడల్లా విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడేవారు. గదుల గోడలు వర్షపు నీటితో తడిచి, చెమ్మ వచ్చి ఎప్పడు కూలు తాయోనని అందరూ ఆందోళన చెందే వారు. అయి తే, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి విషయం చేరడంతో ఆయన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కళా శాల పరిస్థితులను వివరించారు. దీంతో కళాశాల లో 14 నూతన గదులు నిర్మించేందుకు గానూ రూ. 3.92 కోట్లను మంజూరు చేయగా.. నిర్మాణ పనులు కళాశాలలో కొనసాగుతున్నాయి. నూతన గదుల నిర్మాణం కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తయితే విద్యార్థులకు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉంటుంది. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటుగా జిల్లాలో మరో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలున్నాయి. వాటంన్నీటిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కళాశాల భవన గదులు శిథిలావస్థకు చేరి ఉండడంతో ఎండ, వానలకు విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. కొన్నింటిలో టాయిలెట్లు సరిగా లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోగశాల గదులు, మైదానం ఇలా అన్నీ అసౌకర్యంగా ఉండడం వల్ల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది. మిగతా కళాశాలల్లో కూడా నూతన గదులు నిర్మించడానికి, మరమ్మతులు చేయించడానికి నిధులు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పాతబడిన గదులను తొలిగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. అవి అందుబాటులోనికి వస్తే విద్యార్థులు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉంటుంది. పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. –హెచ్.వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి -
మందగించిన బొగ్గు రవాణా..?
టేకులపల్లి: కోయగూడెం ఓసీలో ఏడెనిమిది నెలలుగా బొగ్గు రవాణా గణనీయంగా తగ్గింది. బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు సకాలంలో రవాణా చేయడం కూడా ముఖ్యమే. కానీ, బొగ్గు రవాణాపై దృష్టి సారించాల్సిన కోయగూడెం ఓపెన్కాస్టు అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడమే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది. కోయగూడెం ఓసీ నుంచి గతంలో ప్రతీరోజు వివిధ పరిశ్రమలకు సుమారు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు రవాణా అయ్యేది. కానీ, కొంతకాలంగా అతికష్టంగా పది వేల టన్నులు కూడా రవాణా జరగడం లేదని సమాచారం. నవభారత్కు రోజూ సుమారు 6,000 టన్నుల బొగ్గు పంపించాల్సి ఉండగా కేవలం 2,500 నుంచి 3,000 టన్నులు మాత్రమే రవాణా చేస్తున్నారని, ఆర్సీహెచ్పీకి రోజూ సుమారు 8 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా మూడు నుంచి నాలుగు వేల టన్నులు మాత్రమే రవాణా చేస్తున్నారని తెలిసింది. బొగ్గును టిప్పర్లు, బాడీలకు లోడ్ చేసేందుకు గతంలో టెరెక్సులు ఉండేవి. ప్రస్తుతం కేఓసీలో టెరెక్సులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత టెరెక్స్లను పెట్టుకుని బొగ్గు లోడ్ చేసుకుంటున్నామని, దీంతో తమపై అదనపు భారం పడుతుందని కోల్ ట్రాన్స్పోర్టర్లు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కేఓసీని నమ్ముకుని టిప్పర్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో రోజుకు నాలుగు, ఐదు ట్రిప్పు ల లోడింగ్ ఉండగా.. ఇప్పుడు ఒక ట్రిప్ మాత్రమే పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుంచి బీపీఎల్, నవభారత్, ఇతర ప్రాంతాలకు బొగ్గు రవాణా అవుతోంది. స్థానికులు, భూ నిర్వాసితులు సుమారు 170కి పైగా లారీలు, టిప్పర్లు కొనుగోలు చేసి బొగ్గు లోడింగ్ చేస్తున్నారు. 14, 12 టైర్ల టిప్పర్ల యజమానులు బీపీఎల్, నవభారత్కు బొగ్గు రవాణా చేస్తున్నారు. అయితే, ఈ బొగ్గు రవాణా చేసేందుకు ఓ కాంట్రాక్టర్ యత్నిస్తుండటంతో ఆందోళన చెందిన వారు మంగళవారం టేకులపల్లి మండలం చుక్కాలబోడు క్రాస్రోడ్లోని టిప్పర్ లారీ ఓనర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 16 టైర్ల టిప్పర్లు బొగ్గు రవాణాకు వాడటం వల్ల 14, 12 టైర్ల టిప్పర్ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తమకు లోడింగ్ రాదని, ఆర్థిక సమస్యలు ఏర్పడి కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కేఓసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమా..? -
స్వీయ క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి..
సూపర్బజార్(కొత్తగూడెం): స్వీయ క్రమశిక్షణ అలవర్చుకుంటే విద్యార్థులు ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని ఎస్పీ రోహిత్రాజ్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎరైవ్ – ఎలైవ్’రెండో విడతలో భాగంగా మంగళవారం కొత్తగూడెం క్లబ్లో కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షించగా.. ఎస్పీ హాజరై మాట్లాడారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్పై వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్తో కలిగే దుష్పరిణామాలతోపాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లు లేదా సేవిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వన్టౌన్, త్రీ టౌన్, చుంచుపల్లి సీఐలు కరుణాకర్, ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్వర్లు ఎస్ఐలు రమణారెడ్డి, ప్రవీణ్, రమాదేవి, విజయ, రాకేశ్, విజయసింహారెడ్డి, ఉమ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎస్పీ రోహిత్రాజ్ సూచన -
రాష్ట్రస్థాయి పోటీల్లో దివ్యాంగ విద్యార్థి సత్తా
దమ్మపేట: ఈ నెల 17న హైదరాబాద్లో దివ్యాంగులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థి తురసం హర్షవర్దన్ 50 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి, ప్రథమ స్థానంలో నిలిచాడు. హర్షవర్దన్ మండలంలోని చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో హర్షవర్దన్ను ఎంఈఓ కీసర లక్ష్మి, సర్పంచ్ పగడాల రమాదేవి అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో పగడాల రాంబాబు, కాంప్లెక్స్ హెచ్ఎం ఊషారాణి, మస్తాన్, నాగలక్ష్మి, కనకదుర్గ, తిరుమల కుమారి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలిఇల్లెందు: రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమపాఠశాలల్లో నెలకొన్నసమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు గుగులోతు హరిలాల్, భాగ్య రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఇల్లెందు లోని సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని హా స్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా మార్చాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ నెల 26న ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, వచ్చే నెల 10న కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో పాయం సర్వేశ్వరరావు, కాయం లక్ష్మీనారాయ ణ, బానోతు రాజారత్నం, భూక్యా రాములు పాల్గొన్నారు. రేపు సేవాలాల్ జయంతి వేడుకలుభద్రాచలం: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను భద్రాచలంలో గురువారం నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన భవనంలో జరిగే ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అలాగే ఈనెల 28న ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. వారం రోజుల పాటు వేడుకల నిర్వహణకు సంత్ సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని కోరారు. రూ.67లక్షల విలువైన గంజాయి స్వాధీనంవైరా: వైరా మీదుగా కారులో తరలిస్తున్న గంజా యి, హషీష్ ఆయిల్ను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆధ్వర్యాన ఎస్ఐ సీహెచ్.శ్రీహరిరావు, ఉద్యోగులు వైరా ఐఎంఎల్ డిపో ఎదురుగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో పరిశీలించగా 101.2 కేజీల ఎండు గంజాయి, 2.7 కేజీల హషీష్ ఆయిల్ లభ్యమైంది. దీని విలువ రూ.67.20 లక్షలు ఉంటుందని ఏసీ గణేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందిన మహ్మద్ అస్లామ్ ఒడిశా రాష్ట్రం కలిమెలలో కొనుగోలు చేసిన గంజాయి, ఆయిల్ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు ఇస్లామ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా, గంజాయి, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 18004252523కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏదులాపురంలో 24కిలోలు... ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ మీదుగా ఆటోలో తరలిస్తున్న 24కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం గురవాయిగూడెంకు చెందిన పుట్టమంతి ఉదయ్, ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడుకు చెందిన ఎరుపుల అఖిల్ ఒడిశా రాష్ట్రానికి చెందిన నూకరాజువద్ద గంజాయికొనుగోలుచేసి ఆటోలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈమేరకు తనిఖీల్లో పట్టుబడగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
వ్యాపారం పేరుతో సైబర్ మోసం..
సత్తుపల్లి: సైబర్ ఆర్థిక నేరాల కేసు విచారణలో మలుపులు తిరుగుతోంది. ఓ కేసు విచారణ చేస్తుండగానే మరో కేసు నమోదు కావడం.. ఇందులో మరో 14 మందిని నిందితులుగా చేర్చడం సంచలనమైంది. రూ.549 కోట్ల సైబర్ క్రైం కేసులో కీలక నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామవెంకటచరణ్ చౌదరిని విచారిస్తుండగా.. మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇంకో కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పౌరోబి వెల్లడించారు. దీన్ని కూడా పూర్వపు కేసుతో కలిపి విచారిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సత్తుపల్లిలో ఆమె వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 14 మంది అరెస్ట్.. ఇంకొందరు పరారీలో వ్యాపారం పేరుతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి నిందితులు సైబర్ మోసాలకు పాల్పడ్డారని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పౌరోబి వెల్లడించారు. ఈ మేరకు ఉడతనేని వికాస్ చౌదరి, అడపా రామ వెంకటచరణ్చౌదరి, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్యసాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని సత్యశేఖర్, కాపుగంటి జోగేంద్ర, శేషు, దేవళ్ల వేణు, మామిడిశెట్టి సాయికుమార్, పఠాన్ ఇమ్రాన్ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేష్ను మంగళవారం అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక బొప్పన నాగప్రియ, ఇస్లావత్ లక్ష్మీకల్యాణ్, శీలం వేణుగోపాలరావు, నల్లంగుల శ్వేతన్, వీరంశెట్టి వంశీ, బిల్లాసాయి తరుణ్, సంఘం ప్రవీణ్కుమార్, భూక్యా తరుణ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అకౌంట్కు రూ.20వేలు ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్ల పేర్లతో నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందని ఏసీపీ వివరించారు. కరెంట్ అకౌంట్లు తెరిపించి సైబర్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. దీని కోసం కొందరికి నెలకు రూ.50వేల జీతం ఇచ్చి అకౌంట్లు తెరిపించడంతో పాటు ప్రతీ అకౌంట్కు రూ.20వేలు, అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తికి రూ.10వేలు ఇచ్చారని తెలిపారు. ఇలా 22 మందితో అకౌంట్లు తెరిపించారని చెప్పారు. కాగా, సైబర్ నేరగాళ్ల లావాదేవీలకు అకౌంట్లు ఇచ్చినా నేరంగా పరిగణిస్తామని, కమీషన్, వేతనం ఆశతో బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన వారిని వదిలిపెట్ట బోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్సై ప్రదీప్ పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని కనుల పండువగా జరిపించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికిఅభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. యాప్తో యూరియా సరఫరా సులభండీఏఓ బాబూరావు మణుగూరు రూరల్ : రైతులకు ఎరువులు, యూరియా సరఫరాను సులభతరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. మణుగూరు పీఏసీఎస్లో యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మంగళవారం ఆయన యూరియా బస్తాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్యూలైన్లలో నిల్చునే ఇబ్బంది లేకుండా రైతులు ఇంటి నుంచే యూరియా, ఇతర ఎరువులను బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 24,500 మంది రైతులు 1.42 లక్షల యూరియా బస్తాలను యాప్ ద్వారా తీసుకున్నారని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ బి.తాతారావు, ఏఈఓ కొమరం లక్ష్మణరావు, సొసైటీ సీఈఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 18,685 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్, 404 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానుండగా 73 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా సెంటర్లలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. పరీక్షల విధుల్లో పాల్గొనే అధికారులు ఐడీ కార్డులు ధరించి బాధ్యతాయుతంగా పని చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడిఝెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా జిల్లాలో 37 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యుత్, ఆర్టీసీ, పోలీసులు, పంచాయతీ, మున్సిపాలిటీ తదితర శాఖలతో సమన్వయం చేస్తూ పరీక్షల నిర్వహణకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,278 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9407 మంది రాయనున్నారు. పరీక్షల సమయానికి అనుకూలంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రతీ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయిస్తారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో వివిధ విభాగాల నిపుణలను, ఎంబీబీఎస్ వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా వైద్యులతో అశ్వారావుపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, చర్ల ఆస్పత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మార్చి 7 తేదీ సాయంత్రం 5 గంటలోపు సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పోడు భూములకు ట్రంచ్లుపాల్వంచరూరల్: గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని, రక్షణగా ట్రంచ్ కొడుతున్నారు. మండలంలోని చిరుతానిపాడు గ్రామానికి చెందిన మడివి సురేశ్, మడవి అజయ్ పదేళ్లుగా గ్రామ సమీపంలో సుమారు నాలుగు ఎకరాలు పోడు కొట్టి వ్యవసాయం చేస్తున్నారు. మంగళవారం వైల్డ్లైఫ్ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని, జేసీబీతో ట్రంచ్ కొట్టారు. దీంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. -
అలసత్వం చేయొద్దు
‘నవమి’ పనుల్లో భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్ల పనుల్లో అలసత్వం వహించొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖలకు కేటాయించిన పనులను షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాన్య భక్తులు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. టికెట్లను వీలైనంత త్వరగా ఆన్లైన్లో ఉంచాలని ఆలయ ఈఓకు సూచించారు. బారికేడ్ల పనులు సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. స్టేడియంలో శాశ్వత ప్రాతిపదికన కుళాయిలు ఏర్పాటు చేయాలని దేవస్థానం డీఈకి సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రతతో పాటు ట్రాఫిక్ జాం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. హోటళ్లు, లడ్డూ ప్రసాదాన్ని తనిఖీ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. పర్ణశాలలో సైతం భద్రాచలం తరహాలో ఏర్పాట్లు చేసి, ఆ క్షేత్ర ప్రాముఖ్యతను మరింతగా పెంచాలన్నారు. ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల వారు విధులు నిర్వర్తించాలన్నారు. శ్రీరామ కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు వచ్చే భక్తులు గిరిజన మ్యూజియాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సుమారు రెండువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, డీఆర్డీఓ విద్యాచందన, ఆలయ ఈఓ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ విజయాలు గర్వకారణం సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలు గర్వకారణమని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు పలు పోటీల్లో 54 పతకాలు సాధించారన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విజేతలను అభినందించారు. క్రీడాకారులు సాధించిన 15 బంగారు, 19 వెండి, 20 కాంస్య పతకాలు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలోనే 31 పతకాలు సాధించడం సానుకూల పరిణామమని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు ప్రతిభ చూపడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా జిల్లా క్రీడాకారులు రాణించేలా అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేశ్తోపాటు అనురాధ, మహీధర్, కొమరారం వెంకటనారాయణ, మట్టపర్తి రమేశ్, రమేశ్, వెంకటరామిరెడ్డి, నాగలక్ష్మి, చైతన్య, వాసు, నాగేందర్, నాగరాజు, మల్లికార్జున్, గిరిప్రసాద్, కావేటి రమేశ్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ఖమ్మంఅర్బన్: ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉదయం ఐదు గంటలకే.. అధికారులు పెద్ద సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో పోలీసు బందోబస్తు నడుమ ఉదయం ఐదు గంటలకే భూదాన్ భూముల్లోని నివాసాల వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు సామగ్రి సర్దుకుని ఇళ్లు ఖాళీ చేయాలంటూ మైక్ల ద్వారా సూచించారు. దీంతో స్థానికులు తేరుకుని కర్రలతో పోలీసులను, అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఎవరైనా అధికారుల చర్యలకు అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో వారంతా వెనక్కి తగ్గారు. అనంతరం 14 బృందాలుగా ఏర్పడిన అధికారులు నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ప్రతీ బృందాన్ని తహసీల్దార్ స్థాయి అధికారి పర్యవేక్షించగా, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేయి మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు రెవెన్యూ, కేఎంసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. గంటల వ్యవధిలో సుమారు 400 ఇళ్లను నేలమట్టం చేయగా, కోర్టు ప్రత్యేక ఆదేశాలు ఉన్న పది ఇళ్లను మినహాయించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేతలను ఖమ్మం ఆర్డీవో నరసింహారావు పర్యవేక్షించగా, నగర ఏసీపీ రమణమూర్తి బందోబస్తులో పాల్గొన్నారు. పునరావాసానికి తరలింపు అధికారుల సూచనతో కొందరు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయగా, మరికొందరిని అధికారులు వాహనాల్లో సామగ్రితో సహా ముందస్తుగా ఏర్పాటు చేసిన స్వర్ణభారతి కల్యాణ మండపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతోనే తొలగింపు ఖమ్మంసహకారనగర్: ఖమ్మం అర్బన్ మండలం భూదాన్ భూముల్లోని ఆక్రమణదారుల ఇళ్ల తొలగింపు ప్రక్రియను భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో చేపట్టినట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా కుటుంబాలకు స్వర్ణభారతి కల్యాణమండపంలో ఆశ్రయం కల్పించడమే కాక సామగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరచినట్లు తెలిపారు. -
భారీగా వ్యవసాయ కనెక్షన్లు
సూపర్బజార్(కొత్తగూడెం): వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా గరిష్ట స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేశామని విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 1,038 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇంకా కొత్త కనెక్షన్ల మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇందుకు అవసరమైన స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి సమృద్ధిగా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చర్ల: జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎస్ఈ మహేందర్ తెలిపారు. చర్లలో రూ. 2.40 కోట్లతో ఏర్పాటుచేసిన 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చర్ల సబ్స్టేషన్లో 5 ఎంవీఏ సామర్థ్యం గల ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉండేదని, అది ప్రస్తుతానికి సరిపోతున్నప్పటికీ వేసవిలో విద్యుత్ వాడకం పెరిగినా ఇబ్బంది కలగకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో మరో పదేళ్ల పాటు లోవోల్టేజీ సమస్య రాదని వెల్లడించారు. గిరిజన గ్రామాల్లో ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. మండలంలోని పెద మిడిసిలేరులో మరో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో డీఈలు కె.జీవన్కుమార్, బి.వెంకటేశ్వర్లు, ఏడీఈలు పి.ప్రభాకర్రావు, రాంబాబు, మానస తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఎస్ఈ మహేందర్ వెల్లడి -
మొక్కల పెంపకంలో నాణ్యత పాటించాలి
అశ్వారావుపేట: అటవీ అభివృద్ధి సంస్థ పరిధి నర్సరీల్లో మొక్కల పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని టీజీఎఫ్డీసీ జీఎం జి.స్కైలాబ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలోని పలు ప్లాంటేషన్లు, నర్సరీలను మంగళవారం ఆయన పరిశీలించారు. అశ్వారావుపేట నర్సరీలో పలు దశల్లో పెరుగుతున్న మొక్కల నాణ్యతను తనిఖీ చేశారు. మొక్కలను పెంచే విధానం, బెడ్ల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో జనరేటర్, మౌలిక వసతుల సమస్యలు ఉండేవని, వాటిని పరిష్కరించామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. ఆయన వెంట సత్తుపల్లి డీఎం జి.చంద్రమోహన్, అశ్వారావుపేట ప్లాంటేషన్ మేనేజర్ చంద్రకళ, డీపీఎం తిరుమలరావు తదితరులు ఉన్నారు.టీజీ ఎఫ్డీసీ జీఎం స్కైలాబ్ -
బొగ్గు టిప్పర్లతో ప్రమాదాలు
● భయపడుతున్న వాహనదారులు ● రెండేళ్లలో సుమారు 20 ప్రమాదాలురుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బొగ్గు టిప్పర్లతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్ఓసీ, కిష్టారం ఓసీ, ఇల్లెందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీల నుంచి రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్పీహెచ్పీ)కి రోజుకు 200 నుంచి 300 లారీల బొగ్గు రవాణా జరుగుతోంది. దీంతో విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2024, 2025 సంవత్సరాల్లో బొగ్గు టిప్పర్ల వల్ల సుమారు 20 ప్రమాదాలు జరిగాయి. 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మూడు ప్రమాదాలు జరగ్గా, ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రామవరంలోని విద్యుత్ హైటెన్షన్ టవర్ కూడా డ్యామేజ్కు గురైంది. డ్రైవర్లు రెస్ట్ లేకుండా పనిచేయడం, ప్రతీ డ్రైవర్ రోజుకు 4 ట్రిప్పులు తిప్పాలనే నిబంధనలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నాలుగు ట్రిప్పులు అనంతరం ప్రతీ ట్రిప్పునకు రూ.200 చొప్పున ఇన్సెంటివ్ ఇస్తుండటంతో డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పుల కోసం మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. కాగా సుమారు రూ.900 కోట్లతో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. బొగ్గు రవాణా కోసమే దీన్ని నిర్మించారు. అయినా మళ్లీ లారీల ద్వారానే బొగ్గు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక కోయగూడెం నుంచి ఆర్సీహెచ్పీకి బొగ్గు రవాణా చేయకుండా, అక్కడే మినీ బంకర్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. బొగ్గు రవాణాలో టిప్పర్లతో ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఆయా ఏరియాల జీఎంలు, కోల్ ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడి టిప్పర్ల స్పీడ్ను నియంత్రిస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. – వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పీపీ) -
ఆకాశవాణి కేంద్రంలో ‘ఆమ్’పై అవగాహన
చుంచుపల్లి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాలపై వివరించారు. అనంతరం పెనగడప, విద్యానగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యానగర్లో గాయత్రి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను తనిఖీ చేశారు. అధిక స్థాయిలో యాంటీబయాటిక్స్ వినియోగం ,ఖాళీ ఔషధ సీసాలు లభ్యం కావడం, నెబ్యులైజర్ పరికరాలు కలిగి ఉండటంతో నోటీసులు జారీ చేశారు ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష● పోక్సో కేసులో న్యాయమూర్తి తీర్పు కొత్తగూడెంటౌన్: మానసిక రోగిపై అత్యాచారం, కిడ్నాప్ చేసిన ఘటనలో బూర్గంపాడు సారపాక గాంధీనగర్కు చెందిన నూనవత్ నవీన్కు ఫోక్సో యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ మేరకు సోమవారం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి ) ఎస్.సరిత తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. తన సోదరుడి కుమార్తె, మానసిక రోగి కనిపించడం లేదని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చెందిన ఇడ్డి రంగా 2019.3.19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బూర్గంపాడు సారపాక గాంధీనగర్కు చెందిన నూనవత్ నవీన్ మానసిక రోగి అయిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు తేలింది. దీంతో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. 13 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఏడో డివిజన్ టేకులపల్లిలోని డబుల్ బెడ్రూమ్ సముదాయంలో నివసిస్తున్న తాళ్ల హరీష్(37) సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు 15ఏళ్ల క్రితం వివాహం జరగగా ఒక కుమార్తె ఉంది. మూడేళ్ల క్రితం భార్య వదిలి వెళ్లగా, మద్యానికి బానిసైన ఆయన మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరి నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కామేపల్లి: మండలంలోని మర్రిగూడెం సమీసాన ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి మార్చరీకి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59144 నంబర్లో కానీ పోలీసుస్టేషన్లో కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. సుభాష్నగర్లో చోరీఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్లో ఓ ఇంట్లో చోరీ జరగ్గా, సోమవారం వెలుగుచూసింది. తోట వాణి అనే మహిళ ఇంటికి తాళం వేసి ఈ నెల 18న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని రూ.90వేల విలువైన వెండి ఆభరణాలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హసీనా తెలిపారు. -
అథ్లెటిక్స్ టోర్నీలో చాంపియన్గా ఖమ్మం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకోగా, మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాంపియన్గా నిలిచింది. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు పాల్గొనగా, 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని విజేతలకు మెమోంటోలు అందించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్రెడ్డి, గట్టు మహేష్బాబు, మహ్మద్ కరీం, రాజేందర్తో పాటు కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. -
మామిడి.. మాకొద్దు..
● పూత నిలవక, పిందె రాక రైతుల ఆవేదన ● ఫలితంగా సీజన్ సమయంలో చెట్ల తొలగింపు ● లేత మామిడి తోటల్లో మాత్రం ఆశాజనకమే.. వేంసూరు: జిల్లాలో మేలైన రకాల మామిడి తోటలకు చిరునామాగా నిలిచిన వేంసూరు మండలంలో ఇప్పుడు గతమెంతో ఘన చరిత్ర అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు కళకళలాడిన మామిడి తోటలపై పెట్టుబడి తప్ప ఆదాయం రాకపోవడంతో రైతులు నెమ్మదిగా తమ మార్గం మార్చుకుంటున్నారు. ముదురు మామిడి తోటలపై ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్ని మందులు పిచికారీ చేసినా పూత నిలవక, నిలిచినా పిందె రాకపోవడంతో సీజన్ సమయంలోనే మామిడి చెట్లను తెగ నరుకుతున్నారు. ఫలితంగా వేంసూరు మండలంలో 25 వేలుగా ఉన్న మామిడి తోటల విస్తీర్ణం నేడు ఐదు వేల ఎకరాలకు పడిపోగా.. మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు. పెట్టుబడి భారం గత ఐదేళ్లుగా రకరకాల కారణాలతో మామడి రైతులకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో చాలా మంది పంటపై అనాసక్తి చూపుతున్నారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు, పిందె దశలో కాయకుళ్లు తెగులు, ఆశిస్తుండడం.. ఇవన్నీ దాటినా ప్రకృతి వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఇవన్నీ అధిగమిస్తే పంటకు ఉత్తరాది వ్యాపారులే ధర నిర్ణయిస్తుండడంతో కనీస పెట్టుబడి కూడా రాక మామిడి తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. లేత తోటల్లో పర్వాలేదు.. వేంసూరు మండంలో ముదురు మామిడి తోటలు తొలగించిన రైతుల్లో పలువురు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, ఇంకొందరు మాత్రం మళ్లీ మామిడే నాటడంతో ఆ లేత తోటల్లో దిగుబడి ఆశాజనకంగా ఉంటోంది. దీంతో లేత తోటల్లో పండ్లను కాపాడుకునేందుకు కవర్లు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుస ఐదేళ్ల నుంచి మామిడికి పెట్టుబడి తప్ప లాభాలు రావడంలేదు. ఈ నష్టాలతో తోట తొలగించే పరిస్థితి ఎదురవుతోంది. కాపు సమయాన కష్టాలు ఓర్చుకున్నా మార్కెట్లో సరైన ధర దక్కక ప్రత్యామ్నయ పంటల వైపు చూస్తున్నా. – దొడ్డ చెన్నకేశవరెడ్డి, రైతు, అడసర్లపాడు ముదురు మామిడి తోట తొలగించి కొన్నాళ్ల క్రితం మళ్లీ మొక్కలు నాటాం. ఇలాంటి లేత మామిడి తోటల్లో కాపు ఆశాజనకంగా ఉంటోంది. దీంతో కాాయను కాపాడుతూ, మంచి ధర వచ్చేలా నాణ్యత కోసం కవర్లు ఏర్పాటు చేస్తున్నాం.ఽ – బండి శ్రీనివాసరెడ్డి, రైతు, కల్లూరుగూడెం -
ఉపాధి పనులతో ఆర్థికాభివృద్ధి
● డీఆర్డీఓ విద్యాచందన జూలూరుపాడు: ఉపాధి పనులతో కూలీలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. సోమవారం ఆమె జూలూరుపాడు, మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఎంపీడీఓ పూరేటి అజయ్, ఎంపీఓ టి.తులసిరామ్, సిబ్బంది రామారావు, సైదులు, ఖాదర్మియా, జ్యోతి పాల్గొన్నారు. పారిశ్రామిక విద్యతో భవిష్యత్మణుగూరు రూరల్ : విద్యార్థల బంగారు భవిష్యత్కు పారిశ్రామిక విద్య బాటలు వేస్తుందని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ఏటీఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సమితి సింగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐటీఐ, ఏటీసీల అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఏటీసీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీఐ చదివితే సత్వర ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఏటీసీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు పరమయ్య, ఐటీఐ సిబ్బంది పూర్ణచందర్రావు, చైతన్య, భార్గవ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం కమిటీ ఎన్నికములకలపల్లి: ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కరపటి గోపాలరావు నియమితులయ్యారు. ములకలపల్లిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సున్నం బా బూరావు, ఉపాధ్యక్షుడిగా సోయం వీరస్వామి, సహాయ కార్యదర్శిగా సున్నం సుశీలతోపాటు మరికొందరిని సభ్యులు నియమించారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు..?● బియ్యంతోపాటు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం దుమ్ముగూడెం : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇక నుంచి నిత్యాసవరాలు కూడా అందించనుంది. ఇప్పటికే సన్న బియ్యం ఇస్తుండగా, తాజాగా ఐదు రకాల నిత్యావసర సరుకులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు రేషన్ కార్డుదారులకు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో ప్రకటించారు. బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల పంపిణీ అమల్లోకి వస్తే భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 41,246 మంది కార్డుదారులకు లబ్ధి జరగనుంది. టీపీసీసీ లీగల్, ఆర్టీఐ రాష్ట్ర కన్వీనర్గా రమేశ్ కొత్తగూడెంఅర్బన్: టీపీసీసీ లీగల్, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్గా అడ్వకేట్ మారపాక రమేశ్కుమార్ను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ సోమవారం హైదరాబాద్లో నియామకపత్రం అందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి రమేశ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు, రాష్ట్ర టీపీసీసీ సెల్ కన్వీనర్ ఆకుల సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు
ఇల్లెందు: ఆర్టీసీ ఇల్లెందు డిపో బస్సులు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఇల్లెందు బస్టాండ్ నుంచి బయల్దేరిన షటిల్ సర్వీస్ టేకులపల్లి–ఇల్లెందు మధ్య 9వ మైలు తండా దాటాక మూలమలుపు వద్ద ఆగిపోయింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సును నిలిపివేయాల్సి వచ్చింది. బస్సు కండీషన్లో లేదని డ్రైవర్ డిపోలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఒక్క ట్రిప్ వేయాలని సూచించడంతో గేర్లు పడని బస్సుతో డ్రైవర్ బయల్దేరాడు. సమస్య తీవ్రమై మధ్యలోనే నిలిచిపోయింది. అదే సమయంలో రెండు బస్సులు వచ్చినా అక్కడ నిలపకుండా వెళ్లడంతో కొందరు ప్రయాణికులు ఆటోలు, మ్యాజిక్లు, ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు అక్కడే నిరీక్షించగా, గంట తర్వాత వచ్చిన బస్సులో కొత్తగూడెం వెళ్లారు. ఇల్లెందు డిపోలోని పాత బస్సులకు మరమ్మతులు చేపట్టాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.తరచూ మొరాయిస్తున్న ఇల్లెందు డిపో సర్వీసులు -
డెంగీతో అంగన్వాడీ టీచర్ మృతి
అశ్వారావుపేటరూరల్: జ్వరంతో చికిత్స పొందుతున్న ఓ అంగన్వాడీ టీచర్ పరిస్థితి విషమించి మృతి చెందింది. మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వాగొడ్డుగూడేనికి చెందిన మడకం చెల్లమ్మ(36) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కొన్నేళ్లుగా టీచర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబీకులు ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా, ప్లేట్లెట్స్ పడిపోయి, డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. మృతురాలికి భర్త సర్వేశ్వరరావు, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా ఈ ఘటనపై గుమ్మడవల్లి పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ మధుళిక మాట్లాడుతూ.. మెడికల్ రిపోర్టులు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని తెలిపారు. -
మహిళల జీవితాల్లో ‘వెలుగులు’
ఖమ్మంవ్యవసాయం: మహిళా సంఘాల్లోని సభ్యులకు ఉపాధి కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా‘ఇందిరా మహిళాశక్తి’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రప్రభుత్వం పలు యూనిట్లు మంజూరు చేస్తోంది. బస్సుల కొనుగోలుకు రుణాలు అందించి ఆర్టీసీకి అద్దెకు ఇస్తుండగా.. సోలార్ ప్లాంట్ల విషయంలోనూ మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈమేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లోని రెండేసి గ్రామాల్లో తొలి దశగా ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ద్వారా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం ప్రతీ జిల్లాకు రెండు సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం, కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలంలోని ఉడతనేనిగుంపు గ్రామాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయించారు. నాలుగు ఎకరాలు.. రూ.3కోట్లు ఒక్కో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసేందుకు గాను ప్రభుత్వ భూములు, అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) కింద గిరిజన భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖల భూములను గుర్తించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించారు. పైలట్ ప్రాజెక్టు ఇక్కడే.. ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా డిప్యూటీ సీఎం భటి ్ట విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చివరి దశకు చేరింది. ఇక్కడ 520 మాడ్యూళ్లు బిగించడమే కాక ఎంసీఆర్ గది నిర్మాణం, ఫెన్సింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే, ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా కోసం జమలాపురం ఫీడర్కు 11 కేవీ లైన్ వేశారు. ఈ నెలాఖరు వరకు పనులను పూర్తి చేసి సీఈఐజీ నుంచి అనుమతులు పొందాలనే యోచనలో ఉన్నారు. అలాగే, చిన్నకోరుకొండిలో లే ఔట్ సిద్ధం చేసి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఇక భద్రాద్రి జిల్లా సుజాత్నగర్ లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపుల్లో స్థల సేకరణ పూర్తయింది. అటు ఆదాయం.. ఇటు ఉపాధి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రోజుకు సగటున 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను డిస్కంకు విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు యూనిట్కు రూ.3 చొప్పున ఆదాయం సమకూరుతుంది. తద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణ కిస్తీలు చెల్లిస్తూనే.. ఇంకొంత నిర్వహణ ఖర్చుల కింద ఇద్దరేసి సభ్యులు తీసుకుంటారు. తద్వారా ఐటీఐ విద్యార్హత ఉన్న వారికి ఉపాధి లభించనుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్లు మహిళల ఆర్థికాభివృద్ధికి ఎందో దోహదపడతాయి. రాష్ట్రంలో తొలిసారి రాజుపాలెంలో చేపట్టిన ప్లాంట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ నెలాఖరుకు ప్లాంట్ నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టి డిస్కంకు అందిస్తాం. మరో రెండు నెలల్లో మిగిలిన మూడింటిని పూర్తి చేస్తాం. – పొలిశెట్టి అజయ్కుమార్, రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ -
అటానమస్ ఇస్తే..
● భద్రగిరి రామాలయ అభివృద్ధికి అవకాశం ● తాజాగా వేములవాడకు ఇవ్వాలని ప్రభుత్వ యోచన ● భద్రాచలానికీ స్వయం ప్రతిపత్తి కల్పించాలని భక్తుల విన్నపం భద్రాచలం: రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి నిధులు విడుదల చేయడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆలయానికి అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా కల్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలని జీఓ జారీ చేసింది. ఈ క్రమంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి కూడా అటానమస్ హోదా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబాటు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. ఆలయం రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉండటంతోపాటు తహసీల్దార్గా ఉన్న భక్త రామదాసు ప్రాణత్యాగానికి సిద్ధపడి నిర్మించాడు. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రగిరికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పవిత్ర గోదావరి చెంతనే ఉండటంతో కార్తీక మాసం పూజలు, హనుమాన్ జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. కానీ దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. భక్త రామదాసు నాటి ప్రధాన ఆలయానికి కొద్దిపాటి మార్పులే చేపట్టారు. అంతకుమించి అభివృద్ధి పనులు, భక్తులకు వసతుల కల్పన పనులు చేపట్టలేదు. ఆలయ ఆదాయంలో అత్యధికం నిర్వహణకే సరిపోతుండగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదు. దీంతో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. పాలకమండలిని కూడా నియమిస్తే.. భద్రాచల క్షేత్రానికి చివరి పాలకవర్గం 2010, నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో, మళ్లీ 2025 నవంబర్లో నోటిఫికేషన్లు జారీ చేశారు. రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించారు. రెండోసారి దరఖాస్తులు స్వీకరించి నాలుగు నెలలు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగడంలేదు. పాలకవర్గాన్ని నియమిస్తే ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. త్వరలో శ్రీరామనవమి, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు–2027 జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాలకవర్గ నియామకం, అటానమస్ హోదా ప్రకటిస్తే ఉత్సవాలు విజయవంతం చేయడంతోపాటు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భక్తులు పేర్కొంటున్నారు. భద్రగిరికి అటానమస్ హోదా లభిస్తే సొంత నిర్ణయాధికారం వస్తుంది. దీంతో స్థానిక అవసరాలకు తగినట్లు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకునేలా భాగస్వామ్యం చేయొచ్చు. ఆర్థిక వనరులపై స్పష్టమైన నియంత్రణ, నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటుంది. భక్తుల సౌకర్యాలు, వసతిలపై ప్రత్యక్షంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గోదావరి తీరం, ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలు, మిథిలా స్టేడియం, కరకట్టతోపాటు భద్రాచలం గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. -
నిత్య జీవితంలో సైన్స్ను అన్వయించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: నిత్యజీవితంలో విద్యార్థులు సైన్స్ను అన్వయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆనందఖని పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పోటీల్లో జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వరుణ్సా యి ప్రథమ బహుమతి సాధించారు. ద్వితీయ బహుమతిని ఆనందఖని ఉన్నత పాఠశాల విద్యార్థి బి. ధనుష్, తృతీయ బహుమతి భద్రాచలం పాఠశాల విద్యార్థి షేక్ నజీమాలు సాధించారు. డీఈఓ విజేతలకు బహమతులు అందించి మాట్లాడారు. అధికారులు సంపత్ కుమార్, నాగరాజ్ శేఖర్, సైదులు, సతీష్, అమీరుద్దీన్, యశోద, అనురాధ, మోహన్ పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు, సీ సెంటర్ కస్టోడియన్లు, మండల విద్యాశాఖాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాల్లో 12,731 మంది రెగ్యులర్, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, సమయపాలన వంటి అంశాల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బి అమలు చేయాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, పరిశీలక బృందాలను నియమించాలని ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే అనుకూల పరిస్థితులు కల్పించాలని తెలిపారు. కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
స్పోర్ట్స్ మీట్లో పోలీసుల ప్రతిభ
కొత్తగూడెంటౌన్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. 19 పతకాలు సాధించారు. వాటిలో బంగారు పతకాలు 6, రజత 6, కాంస్య పతకాలు 7 ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం ఎస్పీ రోహిత్రాజు తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ క్రీడల్లో ప్రతిభ చాటడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. టెన్నిస్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, పాల్వంచ సీఐ కే.సతీష్, ఆర్ఐ కృష్ణారావు రజత పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభా గంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ రజత పత కం, త్రీటౌన్ కానిస్టేబుల్ రత్నకుమారి బాక్సింగ్, ట్రెడిషనల్ యోగా, జిమ్నాస్టిక్స్ విభాగాల్లో నాలు గు పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ ప్రవీణ్ బ్యాడ్మింటన్లో రెండు రజత పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ డి.సుష్మ పరుగు పందెంలో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అశ్వాపురం కానిస్టేబుల్ నాగ స్వరూప బ్యాడ్మింటన్లో మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం, విమెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలుసాధించారు.విజేతలకు ఎస్పీ రోహిత్రాజు అభినందన -
అసహనం!
ఆనందం..మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఇఫ్తార్ (మంగళ వారం సాశ్రీశ్రీ)6.19సహర్ (బుధవారం ఉశ్రీశ్రీ)5.08బూర్గంపాడు: రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీల్లో కనీస అవసరాలకు కూడా నిధుల కటకట ఏర్పడింది. గ్రామపంచాయతీ కార్యదర్శులు అత్యవసర పనులకు అప్పులు చేసి ఖర్చు చేశారు. గత డిసెంబర్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, ఇటీవల గ్రామపంచాయతీ ఖాతాల్లో జమచేశారు. వీటిని 2024–25లలో చేసిన పనులకు బిల్లులు చెల్లించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన కొత్త పాలకవర్గాలు పాత బిల్లులు చెల్లించేందుకు అసహనంగా ఉన్నాయి. కొత్త పాలకవర్గాల ఆశలపై నీళ్లు.. జిల్లాలోని471 గ్రామపంచాయతీలకు గాను 468 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. ఎన్నికల ముందు కోతులు తరిమివేత, రోడ్లు, డ్రెయినేజీల మరమ్మతులు, తాగునీటి సమస్యలపై హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా నిధులు లేకపోవటంతో ఏ పనులూ చేపట్టలేకపోయారు. కొందరు సర్పంచ్లు సొంత ఖర్చులతో అత్యవసర పనులు చేపట్టారు. ఈ తరుణంలోనే కేంద్రం నిధులు విడుదల చేయడంతో కొత్త పాలకవర్గాల్లో ఆనందం వ్యక్తమైంది. పాత బిల్లులు చెల్లించేందుకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో కొత్త పాలకవర్గాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పాత బిల్లులను కూడా కొత్తగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్లు జాయింట్ చెక్పవర్తోనే చెల్లించాల్సి ఉంది. దీంతో పెండింగ్ బిల్లులు రావాల్సిన వారు సర్పంచ్, ఉప సర్పంచ్ల చుట్టూ తిరుగుతున్నారు. -
ఉత్పత్తి లక్ష్యాలపై సీఎండీ నజర్
రుద్రంపూర్: వార్షిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ లక్ష్యాలపై సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ దృష్టి సారించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఇటీవల డైరెక్టర్లు, జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 5 గంటలపాటు సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించిన వార్షిక లక్ష్యం 72 మిలియన్ టన్నులు సాధించాలని, రానున్న 35 రోజుల్లో ఉత్పత్తికి ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. గతేడాది ఈ సమయానికి 58.61 మిలియన్ టన్నులు సాధించిన ఏరియాలు ఈసారి సుమారు 7 మిలియన్ టన్నులు ఎందుకు వెనకబడ్డాయో తెలపాలని ఆదేశించారు. కార్మిక భద్రతకు ప్రాధాన్యమివ్వాలి మణుగూరు టౌన్: కార్మికుల భద్రకు ప్రాధానమిస్తూ రోజుకు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.15లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్పి) కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం ఆయన ఓసీ–2, ఓసీ–4 గనులను సందర్శించి వ్యూ పాయింట్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన, వ్యయ నియంత్రణ, కార్మికుల భద్రతపై చర్చించారు. పీకే ఓిసీ కొత్త బెల్ట్ వర్క్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తొలుత పీవీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. జీఎం దుర్గం రామచందర్, అధికారులు శ్రీనివాసచారి, ఆర్.శ్రీనివాస్, ఎం.రమేష్, సిహెచ్ రాంబాబు, వేణుమాధవ్ పాల్గొన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళా ల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిబేడామండపంలో కొలువుదీర్చారు. విశ్వ క్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణా న్ని శాస్త్రోక్తంగా జరిపారు. అమలాపురంలో రామయ్య కల్యాణం.. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఏపీలోని అమలాపురంలో భద్రాచలం శ్రీసీతారామ చం ద్రస్వామిదేవస్థానం ఉత్సవ మూర్తులకు కల్యా ణ మహోత్సవం జరపునున్నట్లు ఆలయ ఈఓ దామోదర్రావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు కిమ్స్ విద్యా సంస్థల ప్రాంగణంలో 3వ ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా కల్యాణం జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నేడు నవమి ఏర్పాట్లపై సమీక్షభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మార్చి 27,28వ తేదీల్లో జరిగే శ్రీరామనవ మి, పట్టాభిషేకంఉత్సవాలఏర్పాట్లపై మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు సకా లంలో హాజరు కావాలని వెల్లడించారు. భక్తులకు అందించే సౌకర్యాలు, వసతులపై సమగ్ర సమాచారంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా రావాలని ఆదేశించారు. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నంపాల్వంచరూరల్: అధికంగా మాత్రలు మింగి ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల పరిధిలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆదివారం రాత్రి మాత్రలు వేసుకోవడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై రూరల్ ఎస్ఐని వివరణ కోరగా.. సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మిర్చి రైతులకు వర్ష భయంకరకగూడెం: రాష్ట్రంలో వాతావరణం అకస్మాత్తుగా మార్పు చెంది వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఆరబోసిన మిర్చిని కుప్పగా చేర్చి పట్టాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. వర్షం పడితే మిర్చి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అర్హత పత్రాలతో ప్రభుత్వ పథకాలు
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గిరిజనులు అన్ని అర్హత పత్రాలతో దరఖాస్తులు చేసుకోవా లని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో జరిగిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులను స్వీకరించి సంబంఽధిత యూనిట్ అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గిరి జనుల సమస్యలను పరిష్కరించి, వారికి సత్వరమే ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మోతీలాల్, సీతారామ ప్రాజెక్ట్ భూ నష్టపరిహారం కోసం పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన రమాదేవి దరఖాస్తు చేశారు. వ్యవసాయ పంపు కోసం టేకులపల్లి మండలం వాగొడ్డు గ్రామానికి చెందిన సోనా, రుణం కోసం కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్ గ్రామానికి చెందిన చంటి, సోలార్ కనెక్షన్ కోసం జూలూరుపాడు మండలం భూక్య తండా గ్రామానికి చెందిన కృష్ణ వినతిపత్రాలు అందించారు. కాగా దర్బార్లో దాదాపు 250 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని ఆన్లైన్లో నమోదుచేసి పరిష్కరించాలని సూచించారు. అధికారులు డేవిడ్ రాజ్, అశోక్, అరుణ కుమారి, మధుకర్, సున్నం రాంబాబు, ఉదయ్ కుమార్, గన్యా, లక్ష్మీనారాయణ, హరిత, హేమంత్, నాగేశ్వరరావు, ఆదినారాయణ పాల్గొన్నారు. తిరుకల్యాణోత్సవాలకు ఆహ్వానం కాగా కరకగూడెం మండలం బుద్ధారం గ్రామంలో మార్చి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే జ్వాల లక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణ మహోత్సవాలకు రావాలని పీవో రాహుల్ను ఆహ్వానించారు. అనంతరం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్ కమిటీలు
ఖమ్మంసహకారనగర్: జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్, వెబ్సైట్ సమస్యలు, కేబుల్ చానళ్లు, చిన్న పత్రికల అంశాలపై టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ్నారాయణ సారథ్యంలో కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం చూస్తే 50 శాతం కార్డులు కూడా రాకపోవచ్చనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని, ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని, అక్రిడిటేషన్ వెబ్సైట్ ఫార్మాట్ సులభతరం కాకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్రిడిటేషన్ గడువును మరో నెల పొడిగిస్తామని, అర్హులైన అందరికీ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం బాధ్యులు మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, మైస పాపారావు, మామిడాల భూపాల్, కనకం సైదులు, మోయినుద్దీన్, నాగండ్ల శివ, చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్దనాచారి, వేగినాటి మాధవరావు, ఏలూరు వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నవోదయ నిర్మాణ స్థలం పరిశీలనఅశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో నవోదయ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఎన్బీసీసీ నిర్మాణ సంస్థ బృందం ఆదివారం పరిశీలించింది. బీజీకొత్తూరు గ్రామంలో పాఠశాల నిర్మాణానికి 997 సర్వే నంబర్లో 33 ఎకరాల భూమిని గతంలో సేకరించి ప్రభుత్వానికి అప్పగించారు. రూ.80 కోట్లు అంచనా వ్యయంతో కేంద్రీయ విద్యాలయాల నిర్మాణంలో గుర్తింపు పొందిన ఎన్బీసీసీ సంస్థకు నవోదయ నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దీంతో వారు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నవోదయ పాఠశాలకు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. విద్యుత్, నీటి సదుపాయాలు ఏర్పాటు కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిబంధనలు పాటించాలిపాల్వంచ: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నా రు. ఆదివారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించనివారికి నోటీసులు జారీ చేశారు. నిర్దిష్ట గడువు లోగా లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. అనంతరం మాట్లాడుతూ రిసెప్షన్ కేంద్రం వద్ద, ఆస్పత్రి ముందుభాగంలో అన్ని వివరాలు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. -
అటవీ అధికారుల భిన్నవాదనలు
గుండాల: ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి అనంతోగు, కాచనపల్లి, కొమరారం రేంజ్ పరిధిలోకి ప్రవేశించినట్లు సమాచారం. అయితే కాచనపల్లి, కొమరారం రేంజ్ పరిధిలోకి రాలేదని సంబంధిత అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులపాటు రేగళ్ల, ఆళ్లపల్లి రేంజ్లలో సంచరించినట్లు స్థానిక అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దవెంకటాపురం, లక్ష్మీపురం అటవీ ప్రాంతం నుంచి అనంతోగు వైపు వెళ్లినట్లు ఆళ్లపల్లి మండల అటవీ అధికారులు గుర్తించిన పాదముద్రల ద్వారా తెలుస్తోంది. పెద్దపులితోపాటు పులి పిల్ల కూడా సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనంతోగు వైపు వెళ్లినట్లు ఆళ్లపల్లి మండల అటవీశాఖ అధికారులు చెబుతుండగా, అటువైపు రాలేదని కాచనపల్లి, కొమరారం రేంజ్ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క స్థానికులు, చేను పనులకు, పశువుల మేతకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక క్షేత్రస్థాయిలో అన్వేషణ లేకపోవడంతోనో ఒకరికొకరు పొంతన లేకుండా చెబుతున్నారు. పులి సంచరిస్తుందనే సమా చారంతో గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఏడు గంటల ప్రయాణం..
మాది మహబూబాబాద్ జిల్లా రోటిబండ గ్రామ పంచాయతీ దుద్యా తండా. నా కూతురికి దమ్మపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కేంద్రం కేటాయించారు. తెల్లవారుజామున రెండు గంటలకు బయల్దేరి సుమారు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దమ్మపేట చేరుకున్నాం. ఏడు గంటల సమయం పట్టింది. –అంగోత్ బుజ్జి, మహబూబూబాద్ జిల్లా మాది కరకగూడెం. మా పాపతోపాటు మా గ్రామానికి చెందిన మరికొందరు పిల్లలకు దమ్మపేటలో పరీక్ష కేంద్రం కేటాయించడంతో ఆటో మాట్లాడుకుని వచ్చాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు బయల్దేరాం. దూర భారంతో పిల్లలు కూడా అలసిపోయారు. చార్జీలు కూడా ఎక్కువయ్యాయి. –పోలేబోయిన సరస్వతి, కరకగూడెం పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ పరీక్షలను సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి, మరో మారు ఇలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – అరుణ కుమారి, గిరిజన గురుకులాల ఆర్సీఓ -
విలువిద్యలో విద్యార్థుల ప్రతిభ
భద్రాచలం టౌన్: ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ (ఫేస్–2) విలువిద్య పోటీల్లో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ పురుషుల జట్టు తరఫున ఆడిన కళాశాల విద్యార్థులు ఇర్పా ఆనంద్, కొమరం అశ్విత్ దొర జట్టు ఎలిమినేషన్ రౌండ్లో 4వ స్థానం కై వసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఛత్తీస్గఢ్లో జరిగే ఫేస్–1 క్రీడలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, కోచ్ కళ్యాణ్ను ప్రిన్సిపాల్తోపాటు పీడీ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ అభినందించారు. నేడు గిరిజన దర్బార్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. -
బలి పశువులు..
అడ్డూ అదుపులేని ‘పశు’రవాణా ● ఒడిశా, ఛత్తీస్గఢ్, మారుమూల గ్రామాల నుంచి యథేచ్ఛగా తరలింపు ● భద్రాచలం, మణుగూరు మీదుగా హైదరాబాద్కు.. ● పోలీసులను తప్పించుకునేందుకు ఎస్కార్ట్ల పహారా ● రెండు రోజుల్లో 100 పశువుల స్వాధీనం భద్రాచలంటౌన్/మణుగూరురూరల్: అవసరం ఉన్నంతవరకు పనులు చేయించుకుని, చివరి దశలో విక్రయిస్తున్న రైతులు ఒకవైపు.. ఇతరత్రా అవసరాల నిమిత్తం అమ్ముతున్నవారు మరోవైపు.. వెరసి పశువుల అక్రమ రవాణా తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీ వాహనాల్లో పశువులను అమానవీయంగా కుక్కి హైదరాబాద్ వైపు తరలిస్తున్నారు. అంతేకాకుండా మారుమూల ఏజెన్సీ గ్రామాల నుంచి కూడా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీలు, ట్రాలీ వాహనాల్లో వందలాది పశువులను కుక్కి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను నిలువరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. పోలీసులను తప్పించుకునేందుకు పశువులను తరలించే లారీలకు ముందు కార్లను ఎస్కార్ట్లా నడిపిస్తూ చెక్పోస్టుల సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది. అధికారులు తనిఖీలు నిర్వహించేలోపే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17న భద్రాచలంలో కంటైనర్ ముందు వెళ్తున్న కారులో ఉన్న ఐదుగురు వ్యకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం బయటపడింది. అలాగే, మణుగూరు, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు ప్రాంతాల్లోనూ పశువులను రవాణా చేస్తున్నవారు పోలీసులకు పట్టుబడిన ఘటనలున్నాయి. సరిహద్దు దాటుతున్నాయి.. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకే పశువులను కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా హైదరాబాద్ సహా ఇతర నగరాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే వాహనంలో పరిమితికి మించి పశువులను కుక్కి తరలించడం జంతు సంరక్షణ చట్టాలకు విరుద్ధమని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో రెండు రోజుల్లోనే 100 పశువులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి, సంబంధీకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ అక్రమ రవాణా వెనుక కొందరు బడా వ్యాపారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాలను ఎంచుకుని పశువులను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసేందుకు ఓ వ్యవస్థ పనిచేస్తోందని విశ్వసనీయ సమాచారం. పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తున్నాం. రెండు రోజుల్లోనే 100కు పైగా పశువులను రక్షించి కేసులు నమోదు చేశాం. పోలీసులను తప్పించుకునేందుకు ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, సీఐ, భద్రాచలం ప్రతి రోజూ వందల సంఖ్యలో పశువులు తరలిపోతున్నా, చెక్పోస్టుల వద్ద కఠిన తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తు న్నా, అవి కేవలం కంటితుడుపు చర్యలేనని స్థానికులు వాపోతున్నారు. చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాల వద్ద నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పశువుల అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సీఎం కప్ పోటీల్లో సత్తా..
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో గిరిజన మహిళ సత్తా చాటింది. మండలంలోని గుంటిమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ బంధం విజయకుమారి హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో భాగంగా సీనియర్ షాట్పుట్లో ప్రతిభ కనబరిచి, కాంస్య పతకం సాధించింది. గ్రామస్తులు, స్నేహితులు విజయకుమారిని అభినందించారు. ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత ఖమ్మంస్పోర్ట్స్: జాతీయస్థాయి గిరిజన ఖేలో ఇండియా ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఫేస్–1కు అర్హత సాధించారు. న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ గిరిజన ఆర్చరీ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న కె.అశ్విత్దొర, ఈ.ఆనంద్, కె.లక్ష్మణ్ రికర్వు ఈవెంట్లో జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో నిలిచి ఫేస్–2 నుంచి ఫేస్–1 కు అర్హత సాధించారు. వీరు త్వరలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగే ఫేస్–1 జాతీయస్థాయి గిరిజన ఆర్చరీ పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ హించనున్నారు. క్రీడాకారులు ఎంపిక కావడంపై జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాధుల సారంగపాణి, కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి అభినందనలు తెలిపారు. -
నాటక రంగానికి పూర్వవైభవం తేవాలి
భద్రాచలంటౌన్: సమాజానికి దిశానిర్దేశం చేసే నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు అన్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నాటక రంగాన్ని బతికించు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కాగా చివరి రోజు ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. మిమిక్రీ రమేష్ ప్రదర్శించిన షో నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటులు గౌతమ్రాజు, తనూజతో పాటు సినీ నిర్మాత, దర్శకుడు విజయ్ వర్మను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సినీ నటుడు గౌతమ్ రాజు -
పెరుగుతున్న పులుల సంచారం
● కిన్నెరసాని అభయారణ్యంలో మూడింటి కదలికలు ● గత నెల 20న అశ్వారావుపేట అడవిలో మరో పులి జాడలు పాల్వంచరూరల్: గతంలో ఏడాదికోసారి మాత్రమే వచ్చిపోయే పెద్ద పులుల సంఖ్య కిన్నెరసాని అభయారణ్యంలో క్రమంగా పెరుగుతున్నాయి. అభయారణ్యం పరిధిలో గతేడాది నుంచి ఓ పులి సంచరిస్తోంది. తాజాగా ఆళ్లపల్లి రేంజ్లో మరో రెండు పులులు సంచరిస్తున్నట్లు పాదముద్రల ద్వారా వైల్డ్లైఫ్ అధికారులు ఆదివారం గుర్తించారు. ఏపీ అడవుల నుంచి గత నెల 20న ఇదే పాల్వంచ డివిజన్ పరిధిలోని అశ్వారావుపేట రేంజ్ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. ఆ పులి ఆవుపై దాడి చేసి చంపింది. దీన్నిబట్టి వలస వచ్చే పులుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏటూరునాగరం నుంచి వచ్చిన రెండు (తల్లీబిడ్డలు) పులులు ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం నుంచి ఈ నెల 20న కిన్నెరసాని అభయారణ్యంలోకి పులులు ప్రవేశించాయి. రేగళ్ల అటవీ ప్రాంతం మీదుగా ఆళ్లపల్లి ప్రాంతంలోకి 21న చేరుకున్నాయి. చింతోనిగుంపు బీట్లోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో వైల్డ్లైఫ్ సిబ్బంది పాదముద్రలు గుర్తించారు. తొలుత ఒక పులి మాత్రమే సంచరించినట్లు గుర్తించిన అధికారులు 22న కిన్నెరసాని వాగు ఒడ్డున రామాంజగుంపు వద్ద 6 సెంటిమీటర్లు కలిగిన చిన్న పులి పాదముద్రను గుర్తించారు. దీంతో పులితోపాటు పులి పిల్ల కూడా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. పాదముద్రల ఆధారంగా ఇది కిన్నెరసాని వాగు దాటి కాచనపల్లి మీదుగా పాకాల అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తల్లి(పెద్దపులి) మాత్రం ఇక్కడే ఉందని నిర్ధారణ చేశారు. వేసవి కాలం కావడంతో చెట్ల ఆకులు రాలి నేలపై పడుతున్నాయని, ఎండు ఆకులు రాలిన ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించడం కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. గణనలో గుర్తించింది ఒకటే.. కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో శాఖాహార, మాంసాహార జంతువుల సంతతి కూడా పెరుగుతోంది. ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులులు, 14 చిరుతలు ఉండేవి. గత నెల 19 నుంచి 26 వరకు జరిగిన పులుల గణనలో ఒక పులి మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. కానీ ఇటీవల ఘటనలతో అభయారణ్యంలో మూడు, పాల్వంచ డివిజన్ పరిధిలోని అశ్వారావుపేట రేంజ్లో ఒకటి.. మొత్తం నాలుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కిన్నెరసాని అభయారణ్యంలో పులుల గుర్తింపునకు పది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతేడాది నుంచి ఒక పులి సంచరిస్తోంది. తాజాగా రెండు రోజులుగా తల్లి, బిడ్డ పెద్దపులి, చిన్నపులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించాం. చిన్నపులి మాత్రం కాచనపల్లి వైపు వెళ్లగా, తల్లి పులి మాత్రం అభయారణ్యంలోనే మాటేసింది. వాటి సంరక్షణకు నిఘా పెంచాం. –బి.బాబు, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ డివిజన్ఽ -
ఖమ్మం అంటేనే కళల గుమ్మం..
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం అంటేనే కళల గుమ్మమని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి అభివర్ణించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నెల నెలా వెన్నెల 103 సాంస్కృతిక కదంబ కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రాజశేఖర్రెడ్డికి నిర్వాహకులు మంగళవాయిద్యాలతో ఆహ్వానం పలికాక ఆయన ప్రసంగించారు. జిల్లాతో తనకు విడదీయరాని బంధం ఉందని తెలిపారు. నెల నెలా వెన్నెల కార్యక్రమం 103 నెలల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటిక ప్రదర్శనలు నిర్వహించటం గొప్ప విషయమని, అంతరించిపోతున్న నాటక రంగానికి నిర్వాహకులు జీవం పోస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో చావా వెంకయ్య, కాటంనేని రమేశ్, కొల్లి సత్యనారాయణ, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, డాక్టర్ నాగబత్తిని రవి, నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, నిర్వాహకులు జస్టిస్ రాజశేఖర్రెడ్డిని సత్కరించారు. ఆలోచింపజేసిన ‘యాగం’ నాటిక హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన ‘యాగం’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అధికారం కోసం ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం, గెలిచిన తరువాత వాటిని అమలు చేయకపోవటం, అధికారం కోసం యజ్ఞ, యాగాలు చేయటం, జ్యోతిష్కులు చెప్పే మాటలు విని చివరికి భార్యను కూడా దానం చేయటం వంటి అంశాలతో రూపుదిద్దుకొన్న నాటిక ఆలోచింపజేసింది. నాటికను శ్రీశైలమూర్తి రచించగా, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చిరంజీవి, అబ్బోజు భావనప్రియ భరతనాట్యం అలరించింది. జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాల్వంచ: రాష్ట్రస్థాయి సీఎం కప్–2026 వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు 14 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక శ్రీనివాసకాలనీలోని మినీ స్టేడియంలో జిల్లాస్థాయి సీఎం కప్–2026 వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు సుమారు 30 మంది క్రీడాకారులు హాజరు కాగా అందులో 14 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారిని డీవైఎస్ఓ పరంధామరెడ్డి అభినందించారు. వై.వెంకటేశ్వర్లు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ భద్రాచలంటౌన్: హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు రజత పతకాలు సాధించినట్లు జిల్లా పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 57 కేజీల విభాగంలో బట్టు శ్వేత, 76 కేజీల విభాగంలో కంబాల అక్షిత అద్భుత ప్రదర్శన కనబరిచి రెండోస్థానంలో నిలిచారు. వారిని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.మల్లేశ్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు భోగాల శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, కోశాధికారి వెంకటకృష్ణాజీ, జాయింట్ సెక్రటరీ శోభన్నాయక్ తదితరులు అభినందించారు. పర్యాటకుల సందడి పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్ పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 397 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్కు రూ.20,995 ఆదాయం లభించింది. 170 మంది బోటింగ్ చేయడం ద్వారా రూ.10,610 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘జూపల్లి’ వైద్యశాల ప్రారంభం సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గుండె వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని హైదరాబాద్ కిమ్స్ గ్రూప్ ఆఫ్ వైద్యశాలల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని జూపల్లి వీధిలో జూపల్లి రామచంద్రరావు ఐ అండ్ కార్డియాక్ (గుండె) ఆస్పత్రిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ బి.స్నిగ్ధ, జూపల్లి వెంగళరావు.. సత్తుపల్లి ప్రాంతంలో జపాన్ టెక్నాలజీతో క్యాత్ల్యాబ్ మిషన్తో స్టంట్స్, పేస్మేకర్, యాంజియోగ్రామ్ వంటి వై ద్యసేవలు తొలిసారిగా ప్రవేశపెట్టారని చెప్పా రు. వివేకానందన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పసి మనసులకు ‘పరీక్ష’
దమ్మపేట : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష చిన్నారులను ఇక్కట్లకు గురిచేసింది. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో విద్యార్థులు అవస్థ పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో పది పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి 9 తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష జరిపారు. జిల్లాలో 5,688 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 94.5శాతం హాజరు నమోదైంది. కాగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకే ప్రయాణం ప్రధానంగా ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది పరీక్ష రాశారు. వీరంతా 10, 11 ఏళ్ల లోపు పిల్లలే. వారి స్వస్థలాల నుంచి కేంద్రాలు 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో కేటాయించారు. దీంతో తెల్లవారుజామున రెండు గంటలకే ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. కరకగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల విద్యార్థులకు దమ్మపేట గురుకులాల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. చర్ల మండలంలోని విద్యార్థులకు అన్నపురెడ్డిపల్లి కేంద్రాలు కేటాయిస్తే, అన్నపురెడ్డిపల్లి విద్యార్థులకు చర్ల మండలంలో కేంద్రాలు కేటాయించారు. మిగతా మండలాల విద్యార్థులది కూడా అదే పరిస్థితి. దూరం ఎక్కువగా ఉండటంతోపాటు బస్సులు సకాలంలోలేక, ఉన్నా రెండు, మూడు బస్సులు మారి కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కొందరు తల్లిదండ్రులు ఆర్థికభారమైనా ఆటోలను కిరాయికి మాట్లాడుకుని వెళ్లారు. కేంద్రాలకు చేరుకోవడానికి సుమారు ఆరు, ఏడు గంటల సమయం పట్టిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అంత దూరం ప్రయాణం చేసి చిన్నారులు అలసిపోయారని, ఇక పరీక్ష ఎలా రాశారోననే ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల కోసం నీడ, కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో కల్పించలేదు. మరోవైపు ఎండ తీవ్రత కూడా ఉండటంతో చెట్ల నీడన సేదతీరారు. -
మామిడి రైతులకు రాయితీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మామిడి తోటల్లో కాయల రక్షణకు ఫ్రూట్ కవర్ల వినియోగాన్ని ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగి రైతులకు ఆదాయం మెరుగుపడుతుందని ఉద్యాన శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఫ్రూట్ కవర్లు కాగితం, వస్త్రం, బయోడిగ్రేబుల్ పదార్థాలతో తయారు చేస్తారు. కవర్లు తొడిగితే మామిడి కాయలను ఈగలు, కీటకాల, దుమ్ము, ఎండదెబ్బ, వర్షం, రసాయనిక అవశేషాల నుంచి రక్షించుకోవచ్చు. మామిడి కాయలు మార్బుల్ పరిమాణంలో ఉన్నపుడు ప్రూట్ కవర్లు తొడగాలని, కోత వరకు అలాగే ఉంచితే ఉత్తమ ఫలితాలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఎకరా విస్తీర్ణంలో మామిడి తోటకు కవర్ల ఖర్చు రూ.20 వేలు అవుతుందని, ఇందులో కవర్లు, కూలీలకు కలిపి రూ. 10 వేలు రాయితీ వస్తుందని తెలిపారు. మామిడి రైతులు రాయితీ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ఫ్రూట్ కవర్లు కొనుగోలు చేసిన బిల్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో దరఖాస్తుకు జతచేయాలి. పెట్టుబడిలో 50 శాతం రాయితీ లభిస్తుంది. – జంగా కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారిఫ్రూట్ కవర్ల వినియోగంలో 50 శాతం.. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్టు వంతెన వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పూనం అనిల్ మరో వ్యక్తితో బైక్పై అశ్వాపురం వైపు వస్తుండగా కొత్తగూడెం వైపు వెళ్తున్న ట్రాలీ ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వస్తున్న కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేశ్ వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ సుజాతనగర్: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆధివారం వెలుగుచూసింది. స్థానిక నందనవనంకాలనీకి చెందిన రఘురాం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 18న ఊరెళ్లాడు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లగా ఇంటి తలుపుల తాళం పగలగొట్టి ఉండటం చూసి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఇంటికి చేరుకున్న కుంటుబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. అన్న కుమారుడిపై దాడి పాల్వంచ: సొంత అన్నకుమారుడిపైనే దాడి చేసిన వ్యక్తిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. పాత పాల్వంచ బొడ్రాయిసెంటర్కు చెందిన కట్టెబోయిన వెంకటేశ్వర్లు తన తల్లిపేరున ఉన్న కరెంట్ మీటర్ను పెట్టుకున్నాడు. ఈ విషయంలో వెంకటేశ్వర్లు ఇంటి వద్ద లేని సమయంలో అతని కుమారుడు ప్రణయ్దాస్పై బాబాయి అయిన కట్టెబోయిన శ్రీనివాసరావు ఈ నెల 16వ తేదీన దాడి చేశాడు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని గాయాలైన కొడుకును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ఆదివారం ప్రణయ్దాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెలివర్రీ..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. కొన్నేళ్లలో జరిగిన ప్రసవాల సంఖ్య చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియకపోవడంతో ఈ ప్రభావం ప్రసవాలపై పడుతోంది. ఈ విషయం కలెక్టర్ అనుదీప్ దుదిశెట్టి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అధికారులతో ఆయన గురువారం సమీక్షించగా.. ప్రసవాలు తక్కువగా నమోదవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇకపై ప్రసవాలపై నిరంతరం పర్యవేక్షించాలని, గైనిక్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత వైభవం లేదు.. సహజంగా హైదరాబాద్ తర్వాత ప్రసవాలకు ఖమ్మం మాతా, శిశు ఆరోగ్య కేంద్రం పెట్టింది పేరు. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఒక నెలలో 1000 ప్రసవాలకు పైగా నిర్వహించిన రికార్డు కూడా సాధించారు. అది గత వైభవం మాత్రమే. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. గతంలో రోజూ 30కి పైగా ప్రసవాలు నిర్వహించగా, ప్రస్తుతం 20 ప్రసవాలు కూడా చేయడం లేదు. అందుకు కేసీఆర్ కిట్ రద్దు కావటం కొంత వరకు కారణమైనా, ఎక్కువ శాతం పెద్దాస్పత్రికి రావాలంటే గర్భిణులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు మొగ్గు చూపట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్లో 435, మే 421, జూన్ 352, జూలై 454, ఆగస్ట్ 479, సెప్టెంబర్ 520, అక్టోబర్ 560, నవంబర్ 494, డిసెంబర్ 427, ఈ యేడాది జనవరిలో 394 డెలివరీలు నిర్వహించారు. పట్టించుకునేవారేరి.. ఖమ్మం మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారు. కాగా, వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న సమయంలో అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు ప్రసవాలు చేసేవారు. ఆ సమయంలో పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉండటం, వైద్యులు సమయపాలన పాటించటంతో ఎక్కువ ప్రసవాలు జరిగేవి. అయితే, 2023 నవంబర్ నుంచి పెద్దాస్పత్రి డీఎంఈ ఆధీనంలో వెళ్లగా వైద్య విధాన పరిషత్ వైద్యులను సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు సర్దుబాటు చేశారు. తర్వాత డీఎంఈకి సుమారు 10 మంది గైనకాలజిస్టులను కేటాయించడంతో గతం కంటే ఎక్కువ ప్రసవాలు జరుగుతాయని భావించారు. కానీ, పర్యవేక్షణ కొరవడటంతో ప్రసవాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా గైనకాలజీ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి, కొందరు వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగిస్తుండటంతో సమయపాలన కొరవడి, ఆ ప్రభావం ప్రసవాలపై పడుతోంది. అలాగే, కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ రోగులతో గొడవపడుతుండటం కూడా ప్రసవాలు తగ్గటానికి కారణమవుతోంది. ఇప్పటికై నా గైనిక్ విభాగంపై పర్యవేక్షణ పెంచి, గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు. ఏడాది ప్రసవాలు 2022–23 7,325 2023–24 6,972 2024–25 6,077 2025–26 (ఏప్రిల్–జనవరి) 4,480 పెద్దాస్పత్రిలో తగ్గుముఖం పడుతున్న ప్రసవాలు మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. గతంలో ప్రసవాలు తగ్గటానికి గల కారణాలను విశ్లేసిస్తున్నాం. వైద్యులు సమయపాలన పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రసవాలు పెంచటంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ ఎం.నరేందర్, జిల్లా జనరల్ ఆస్పతి సూపరింటెండెంట్ -
జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ ప్రస్థానం కీలకం
ఖమ్మంమయూరిసెంటర్: భారతీయ జీవన విధానంలో దేశభక్తి, క్రమశిక్షణను నరనరానికీ ఎక్కించి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానం అద్వితీయమని తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్లో ఆర్ఎస్ఎస్ ప్రతిష్ట వ్యక్తుల సమావేశం నిర్వహించి, ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు, ప్రస్తుత శతజయంతి ఉత్సవాలపై సమీక్షించారు. 1925లో డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ చేత నాగపూర్లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అవతరించిందన్నారు. సంఘంలో చేరడానికి ఎలాంటి రుసుములు, అప్లికేషన్లు అవసరం లేదని, ప్రతిరోజూ జరిగే శాఖకు హాజరై భగవధ్వజం ముందు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ స్వయం సేవకులేనని సంఘ్ స్పష్టం చేస్తోందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా రామజన్మభూమి నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు వంటి చరిత్రాత్మక ఘట్టాల్లో ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి ఎంతగానో ఉందన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక మార్పు కోసం పకృతిని కాపాడుకోవడం, భారతీయ సంస్కృతి, విలువలు కాపాడుకోవడం, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడం, కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించడం, స్వదేశీ వస్తువులనే వాడటం, మాతృభాషను గౌరవించి అభివృద్ధి చేయడం వంటివి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాటేపల్లి లక్ష్మీనారాయణ, లక్కినేని ప్రసాద్, డాక్టర్ కిషోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాలు అంతంతే!
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలేదు. కనీసం కార్యాలయంలో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవలే కార్పొరేషన్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయరు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పాత కౌన్సిల్ హాల్లోనే పూర్తి చేశారు. ఈ నెలలోనే పాలకవర్గం సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం 60 మంది కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, మీడియా మొత్తం కలిసి పాలకవర్గ సమావేశానికి వంద మంది వరకు ఉండవచ్చు. పాత హాల్ వీరందరికీ సరిపోదు. పాలకవర్గ సమావేశం పాత హాల్లోనే నిర్వహిస్తారా? కార్యాలయం పక్కన ఉన్న పాత బిల్డింగ్ హాల్ను ఉపయోగిస్తారా అనే విషయమై అధికారుల్లో స్పష్టత లేదు. పాత భవనంలోని హాల్ విశాలంగా ఉందని, మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని కొందరు కార్పొరేటర్లు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ చైర్పర్సన్ వినియోగించిన రూమ్నే మేయర్ వినియోగిస్తున్నారు. హోదా పెరిగినా తగిన ఏర్పాట్లు చేయలేదు. వేధిస్తున్న సిబ్బంది కొరత కొత్తగూడెంలో కార్పొరేషన్కు తగిన సిబ్బంది లేరు. దీంతో ప్రజాపనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో మూడు డివిజన్ కార్యాలయాలుగా పేర్లు పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. టౌన్ ప్లానింగ్లో కొత్తగూడెంలో ఇద్దరు, పాల్వంచలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణాలు, అనుమతులపై అధికారులు, సిబ్బందికి సమాచారం ఉండటం లేదు. పారిశుద్ధ్య విభాగంలో ప్రస్తుతం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం 210 మంది ఉన్నారు. సిబ్బంది సరిపోక పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. కార్పొరేషన్ కమిషనర్గా ఐఏఎస్ స్థాయి అధికారి నియమాకంపై ఇంకా స్పష్టత కరువైంది. ఉన్నతాధికారులు స్పందించి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే అభివృద్ధి వేగంగా జరిగే, పాలన మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేషన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సమాధానం చెప్పే తత్వం కలిగిన కార్పొరేషన్ అధికారి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇక్కడి అధికారుల్లో మార్ప రావడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పెంచి కార్యాలయంలో తగిన సౌకర్యాలు కల్పించాలని, సిబ్బంది కొరతను తీర్చాలని నగర ప్రజలు కోరుతున్నారు. కార్పొరేషన్ పాలకవర్గ సమావేశాలకు తప్పని అవస్థలు -
పశువుల పట్టివేత..
అశ్వాపురం: ఎలాంటి అనుమతి లేకుండా బొలేరో వాహనంలో తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో శనివారం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన అజ్మత్ అలీ, మహమ్మద్ అక్బర్, కొత్తగూడెంనకు చెందిన మహమ్మద్ మషాద్ మహేంద్ర బొలేరో వాహనంలో మణుగూరు నుంచి హైదరాబాద్ వైపు 12 పశువులను తరలిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని, వాహనంలోని పశువులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్టు సీఐ అశోక్రెడ్డి వెల్లడించారు. పంట బోరు దహనంగుండాల: పాత కక్షలతో పంట బోరుకు నిప్పంటించిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చెట్టుపల్లికి చెందిన ఇర్ప బుచ్చయ్య (ఉప సర్పంచ్) తన వ్యవసాయ భూమిలో ఇటీవల బోరు వేశాడు. శుక్రవారం రాత్రి కొందరు పొలంలో ఉన్న బోరు, స్టాటర్పై పెట్రోల్ పోసి నిప్పంటిచారు. శనివారం పొలం వద్దకు వెళ్లగా బోరు పూర్తిగా కాలిపోయిందని బోరున విలపించాడు. తనపై వ్యక్తిగత కక్షలతోనే బోరును దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరిపై అనుమానం ఉన్నట్లు కొమరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
చుంచుపల్లి: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్లకు ఇస్తున్న శిక్షణ రెండో విడత కార్యక్రమం శనివా రం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచులకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. శిక్షణలో భాగంగా పంచాయతీల పరిపాలన విధానం, గ్రామాభివృద్ధి కార్యాచరణ రూపకల్పన, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించామని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే సర్పంచులు సరైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటివాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఆ తర్వాత శిక్షణ పొందిన సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సుధీర్కుమార్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలి, ఏపీఓ రంగ, ఎస్బీఎం రేవతి, డీటీఎం సందీప్, అరుణ్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ -
అంజనాపురం పాఠశాలకు అవార్డు
బూర్గంపాడు: మండలంలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు ఎంపిక కావడంపై విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఏఎంఓ నాగరాజుశేఖర్, ఎంఈఓ యదుసింహరాజు ఫోన్ ద్వారా పాఠశాల హెచ్ఎం కిషన్ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వచ్ఛ ఎవమ్ హరిత్ విద్యాలయ’రేటింగ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, శౌచాలయాల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ వంటి ఆరు ప్రధాన అంశాలపై రేటింగ్లు కేటాయించగా, అంజనాపురం ప్రాథమిక పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,000 పాఠశాలలు పోటీపడగా, ఎంపికై న 20 పాఠశాలల్లో అంజనాపురం పాఠశాల ఉంది. జాతీయస్థాయి పురస్కారానికి కూడా పాఠశాలను ప్రతిపాదించామని, త్వరలో జాతీయస్థాయి బృందం పాఠశాల పరిశీలనకు రానుందని హెచ్ఎం కిషన్ తెలిపారు. -
15 వేల మొక్కలు నాటిన రోటరీక్లబ్ బాధ్యులు
బూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సారపాక రోటరీక్లబ్ బాధ్యులు శనివారం 15,000 మొక్కలను నాటారు. కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ హాజరై మొక్కలు నాటి, మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలి అందించడంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడతాయని తెలిపారు. రోటేరియన్ శైలేంద్రసింగ్, రాంబాబు, చాంద్బాషా, శ్యాంకిరణ్, భాస్కర్, ప్రఫుల్ల కుమార్, చంగల్రావు, బసప్ప రమేశ్, రాజశేఖర్, సత్యనారాయణ, మురళీధర్, తిరుపతిరావు, మహేష్, విద్యా వాణి, మల్లికార్జున్, సౌమ్య పాల్గొన్నారు. -
మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు శిక్షణ ఇచ్చారు. మీ సేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై జిల్లా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అవగాహన కల్పించారు. మీ సేవ కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీ సేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగం కీలకమని తెలిపారు. యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి, పోర్టల్కు అప్డేట్ చేయొచ్చని చెప్పారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల దరఖాస్తులు త్వరితగతిన ఆమోదం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీ సేవ పోర్టల్కు అనుసంధానమై డేటా తక్షణమే అప్డేట్ అవుతుందని పేర్కొన్నారు. 160 మంది జీపీఓలు, ఆర్ఐలు, 40 మంది డీటీలు,15 మంది అధికారులు పాల్గొన్నారు. -
అడవికోడిని పట్టిన కేసులో నలుగురి అరెస్టు
చండ్రుగొండ: చండ్రుగొండ అటవీ రేంజ్ పరిధి బెండాలపాడు శివారు కనకగిరి అటవీప్రాంతంలో అడవి కోడిని ఉచ్చుల ద్వారా పట్టుకున్న కేసులో నలుగురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెండాలపాడుకు చెందిన కణితి గోపాలరావు.. పాల్వంచకు చెందిన సారయ్య, నర్సింహారావు, సాల్మన్రాజును పిలిపించి అడవి కోళ్ల వేట ప్రారంభించాడు. పిట్టల అరుపును రికార్డ్ ద్వారా మైక్లో వినిపిస్తుండడంతో ఒక కోడి వచ్చి ఉచ్చులో చిక్కుకుంది. ఈ కోడి వన్యప్రాణుల జాబితాలో ఉండడంతో పెట్రోలింగ్ చేస్తున్న అటవీ సిబ్బంది గుర్తించి నలుగురిని చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టు ఆదేశాలతో భద్రాచలం సబ్జైలుకు పంపించినట్లు రేంజర్ ఎల్లయ్య తెలిపారు. డీఆర్వో లక్ష్మిపతి, బీట్ సిబ్బంది రామకృష్ణ, హనుమంతు పాల్గొన్నారు. -
అంబులెన్స్ల పనితీరు పరిశీలన
చుంచుపల్లి: జిల్లాలో నడుసుతన్న 108 అంబులెన్స్లను డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ శనివారం తనిఖీ చేశారు. వాహనాల బయటి, లోపలిస్థితి, టైర్లు (స్టెప్నీ సహా), హెడ్ లైట్లు, ఇండికేటర్లు, సైరన్, పీఏ సిస్టమ్ పనితీరు, జీపీఎస్ వ్యవస్థ, ఇంధన స్థాయి, లాగ్బుక్ నిర్వహణను పరిశీలించారు. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ల చెల్లుబాటు స్థితిని ధ్రువీకరించారు. ఆక్సిజన్ సిలిండర్ ప్రెషర్ స్థాయి, బీవీఎం (వయోజనులు, పిల్లల కోసం), సెక్షన్ యంత్రం, బీపీ యంత్రం, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సీమీటర్, స్ట్రెచర్, స్పైన్ బోర్డ్, సర్వైకల్ కాలర్లు, డెలివరీ కిట్, ఇతర అత్యవసర పరికరాలను తనిఖీ చేశారు. -
రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు
కొత్తగూడెంఅర్బన్: రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ సాయి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్లో భాగంగా ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో పార్శిల్ ఆఫీస్, స్టేషన్ ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం అగ్నిమాపక యంత్రాల వాడకం, రైళ్లలో ఏ వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారో ప్రమాణికులకు వివరించారు. ఉద్యోగులు, ప్రయాణికుల అప్రమత్తతను పెంచడం డ్రైవ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జేమ్స్పాల్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు క్రీడల్లో ప్రతిభ చుంచుపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడా పోటీల్లో భాగంగా టీజీఎస్పీ రేంజ్–1 నుంచి 6వ పటాలం భద్రాద్రి కొత్తగూడెంనకు చెందిన పోలీస్ క్రీడాకారులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు అందుకున్నారు. పీసీ–894 టి.ప్రణీత్ కరాటే విభాగంలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. పీసీ–881 కె.నవీన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఆర్ఎస్ఐ కె.క్రాంతి కుమార్ ఆర్చరీ విభాగంలో రజత పతకం సాధించారు. హెచ్సీ–439 పి.వెంకటవరప్రసాద్, పీసీ–734 యం.భరత్చంద్ర, పీసీ–917 యన్.రాకేశ్ బాస్కెట్బాల్ విభాగంలో రజత పతకాలు సాధించారు, పీసీ–795 జి.కల్యాణ్ హ్యాండ్ బాల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. విజేతలను తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏడీజీపీ సంజయ్కుమార్జైన్, కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీవాసరావు, హెచ్.అబ్దుల్రషీద్, కె.శంకర్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, 6వ పటాలం సిబ్బంది అభినందించారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టండి.. రుద్రంపూర్: సామాజ్రవాదానికి కొమ్ము కాస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. శనివారం మంచికంటిభవన్లో రెడ్ బుక్ డే కార్యక్రమం పార్టీ నాయకుడు అన్నవరకు కనకయ్య అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన మాట్లాడారు. 178 ఏళ్ల క్రితం కారల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికకు నిదర్శనం ఏటా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డేగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, కొక్కర పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, కారం పుల్లయ్య, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, కొండపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో జిల్లావాసులు సూపర్బజార్(కొత్తగూడెం): ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ఆరుగురికి స్థానం దక్కింది. రాష్ట్ర సమితి సభ్యులుగా జిల్లాకు చెందిన వరక అజిత్, ఎస్కే షాహిద్, గండాల సుజన్, ఇనంపల్లి సాయి, మాణిక్యాల వినయ్, గగులోతు వంశీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు నిజామాబాద్లో జరిగాయి. శనివారం రాష్ట్ర కమిటీకి ఎన్నికై నవారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం కోసం కృషి చేస్తామని, మతోన్మాద భావజాలాన్ని విద్యాసంస్థల్లో అరికట్టేందుకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా పరిధి లకావత్తండాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా శనివారం కేసు నమోదైంది. తండాకు చెందిన లకావత్ రవి(45) మద్యానికి బానిస కావడంతో పాటు కడుపునొప్పి రావడంతో శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య విజయ, ముగ్గురు పిల్లలు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. -
ఆళ్లపల్లి అడవుల్లో పులి..
● పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ● అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనగుండాల : ఆళ్లపల్లి మండలంలోని అటవీప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆళ్లపల్లి మండల పరిధిలోని చింతోనిగుంపు బీట్ పరిధి లక్ష్మీపురం అడవుల్లో పులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రేంజర్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి, రేగళ్ల రేంజ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతోగు అటవీ ప్రాంతంలో ఉందని అంటున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపర్లు అటుగా వెళ్లొద్దని సూచించారు. పెద్దపులికి ప్రాణ హాని తలపెట్టొద్దని, అదే సమయంలో ఆ ప్రాంతానికి పశువులను మేతకు పంపొద్దని కోరారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. అనంతోగు అడవుల నుంచి పాల్వంచ అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని, వాహనదారులు, ప్రయాణికులు సైతం తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. పులి తిరుగుతోంది.. జాగ్రత్త పాల్వంచరూరల్: జిల్లా అభయారణ్యంలోకి పులి ప్రవేశించిన విషయం నిజమేనని జిల్లా అటవీశాఖాధికారి జి.కృష్ణాగౌడ్ తెలిపా రు. వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు, పశువుల కాపర్లు ఒంటరిగా కాకుండా సమూమంగా వెళ్లాలని సూచించారు. పులి సంచారం లేదా పాదముద్రలు కనిపిస్తే స్ధానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అటవీ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సిబ్బంది ద్వారా దండోర, చాటింపు చేయించామని పేర్కొన్నారు. అయితే ఈ పులి జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది కాదని, మరో కొత్త పులి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. -
మంచి మిత్రులు..
సోములగూడెంనకు చెందిన కవల సోదరులు ప్రభుత్వ పాఠశాల్లో 3వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉంటారని తల్లితండ్రులు వినోద్కుమార్, వెంకటరమణ తెలిపారు. – సాలకోటి వినయ్కుమార్, ఉమామహేశ్ ఈ ఇద్దరు కవలలది పాల్వంచ మండలం పునుకుల గ్రామం. ఇద్దరూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు వీరబాబు, ఉమ వెల్లడించారు. – బారి రాకేశ్, బారి రాజేశ్ పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కవలలు గ్రామంలోనే 4వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉంటాయి. ఏది కొన్నా ఇద్దరికీ సమానంగా ఇవ్వాల్సిందేనని తల్లిదండ్రులు నాగేంద్రబాబు, లక్ష్మీమణికుమారి చెప్పారు. – కందుకూరి రుషిమంత్, రేమంత్ -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న ప్రారంభమ య్యే పరీక్షలు మార్చి 18న ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,278 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9,407 మంది హాజరు కానున్నారు. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు జిల్లాలో రెండు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. పరీక్ష పత్రాలను భద్రంగా నిల్వ చేయనుండగా ఆయా కేంద్రాలకు ఆదివారం చేరుకోనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 163 బీ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 37 కేంద్రాలు.. ఇంటర్ మీడిఝెట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు ఆయా విభాగాధిపతులను నియమించారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవజ్ఞులైన ఇన్విజిలేటర్లను నియమించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను అత్యంత జాగ్రత్తగా మూల్యాంకన కేంద్రాలకు పంపించేందుకు పోస్టల్ శాఖ చర్యలు చేపడుతోంది. విద్యుత్ సరఫరా.. వైద్య సేవలు.. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించడంతో పలువురు ఏఎన్ఎంలకు విధులు కేటాయించారు. మున్సిపల్, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు నిమిషం, ఐదు నిమిషాల నిబంధనలు ఏమి లేనప్పటికీ.. విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు -
రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘కనకం’
దమ్మపేట: ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం లోహితశ్రీ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. హైదరాబాద్లోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లోహితశ్రీ బాలికల విభాగంలోని అర్చరీ పోటీల్లో రికర్వ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ మేరకు శనివారం ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోగా, నాయకులు కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కూరం అర్జునరావు, బొల్లికొండ నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మానికి చెందిన శీలం లలిత రూ.లక్ష ఆలయ అధికారుల కు అందజేయగా పర్యవేక్షకులు లింగాల సాయిబాబా రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 4న స్వర్ణ లక్ష్మీ అమ్మవారి పూజ మార్చి 4వ తేదీన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో స్వర్ణ లక్ష్మీ అమ్మవారి పూజా మహోత్సవం జరపనున్నట్లు ఈఓ దామోదర్ రావు తెలిపారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులు రూ.600 చెల్లిస్తే అమ్మవారి వెండి ప్రతిమ, జాకెట్ పీసు, ప్రసాదం అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే 3, 4 తేదీల్లో నిత్యకల్యాణాలను రద్దు చేశామని వెల్లడించారు. నేడు ఏఈ అభ్యర్థులకు రాతపరీక్షరుద్రంపూర్: సింగరేణిలో ఖాళీగా ఉన్న నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గ్రేడ్–2(ఇంటర్నల్) ఉద్యోగాల భర్తీకి ఆదివారం రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న 126 మందికి హాల్టికెట్లు జారీ చేశారు. పరీక్ష కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో జరగనుందని రిక్రూట్మెంట్ సెల్ జీఎం మురళీధర్రావు తెలిపారు. పూర్తిగా ఆన్లైన్లో విధానంలో పరీక్ష జరగనున్నందున, అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. -
నాటకమే జీవితానికి దిక్సూచి
భద్రాచలంటౌన్: నాటక రంగం మనిషి జీవితానికి దిక్సూచి వంటిదని, తన ఎదుగుదలలో నాటకమే కీలక పాత్ర పోషించిందని ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. శనివారం భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర నాటకోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషిలోని నటన, భావోద్వేగాలను వెలికితీయడంలో నాటకానికి మించిన వేదిక లేదన్నారు. తాను సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి, నాటక రంగంలో నేర్చుకున్న క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళలపై మక్కువ పెంచుకోవాలని, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని సూచించారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆలోచింపజేసిన ‘విడాకులు కావాలి!’ నాటకోత్సవాల్లో భాగంగా తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘విడాకులు కావాలి!’నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వల్లూరు శివప్రసాద్ రచన, గంగోత్రి సాయి దర్శకత్వంలో సాగిన ఈ ప్రదర్శన నేటి తరం దంపతుల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న అపోహలు, పంతాల వల్ల విడాకుల వరకు వెళ్లడం ఎంతవరకు సమంజసమనే అంశాన్ని కళ్లకు కట్టింది. అహంకారానికి పోకుండా సర్దుబాటు ధోరణితో మెలిగితేనే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుందని స్పష్టమైన సందేశాన్ని అందించింది. సినీ దర్శకుడు విజయ్ కనకమేడల -
మ.. మ.. మాస్క్!
మేడారం జాతర సందర్భంగా ముఖానికి చెక్క మాస్క్ ధరించిన కొందరు గిరిజనులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతరే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గిరిజన జాతరలు జరిగినా ఉపయోగించే మాస్క్లు భద్రాద్రి జిల్లా నుంచే వెళ్తుండడం విశేషం. చెక్కను చేతితో చెక్కి రంగులతో తీర్చిదిద్దే మాస్క్ల తయారీ వెనుక ఉన్న కళాకారుల ‘ముఖ’చిత్రమిది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవివిధ రూపాల్లోని నాయక్పోడు మాస్క్లుదేవేరుల రూపాలతో.. రాష్ట్రంలో సంప్రదాయంగా నివసిస్తున్న గిరిజన తెగల్లో నాయక్పోడులు కూడా ఉన్నారు. వీరు లక్ష్మీదేవరను ఇలవేల్పుగా పూజిస్తూ మాఘమాసంలో జాతర నిర్వహిస్తారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక మండలం చేగర్శలలో ఈ తిరునాళ్లు జరుగుతాయి. లక్ష్మీదేవరతో పాటు పంచపాండవులను కొర్రాజులుగా, కృష్ణుడిని కిట్టయ్యగా, మద్దిరామక్క, గట్టు ముసలమ్మ, ఎర్రమ్మ తదితర దేవరలను కూడా కొలుస్తారు. దేవరలతో పాటు నాయక రాజ్యాలను ఏలిన ప్రోలయ, సింగబోయుడు, మైసమ్మ, పోతురాజు, గుర్రపోతు, పందిరాజును ఆరాధిస్తారు. నాయక్పోడులకు సంబంధించి 14 పవిత్ర స్థలాలు, పవిత్ర జాతరలు ఉన్నాయి. ఈ ఉత్సవాల సమయంలో దేవేరులను పోలిన చెక్కతో చేసిన ముఖ తొడుగులు (చెక్క మాస్క్)లను ధరించి నృత్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, జిల్లాలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గిరిజన జాతరలు జరిగినా ఈ మాస్క్లు సింహభాగం ములకలపల్లి మండలం మాదారం గ్రామంలోనే తయారవుతున్నాయి. అలంకరణలోనూ నాయక్పోడు గిరిజనులు జాతరల సందర్భంగా ధరించే మాస్క్లు విశేష ప్రాచుర్యం పొందాయి. దీంతో ఈ తెగకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు గిరిజన తెగ అంటే కోయ, గొత్తికోయ, గోండులే అన్నట్టు ఉండేది. కానీ చెక్క మాస్క్లతో నాయక్పోడుల ప్రత్యేకత కూడా పరిచయమైంది. ఇదే సమయంలో చెక్క మాస్క్ల తరహాలోనే గిరిజనులు పూజించే దేవేరుల చెక్కబొమ్మలు ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఎగ్జిబిషన్లు, కార్యక్రమాల్లో వీటిని ప్రదర్శించడం, బహూకరించడంతో పాటు క్రమంగా చాలా మంది తమ ఇళ్లలోనూ దేవేరుల బొమ్మలను గోడలకు అలంకరిస్తున్నారు. అయితే జాతరలో ధరించే చెక్క మాస్క్కు వెనుక భాగంలో బోలుగా ఉంటే, గోడలకు అలంకరించే బొమ్మల వెనుక భాగం సమంగా ఉంటుంది. ఒకప్పుడు నాయక్పోడు తెగకు సంబంధించి మొత్తం 52రకాలైన దేవేరుల బొమ్మలు తయారయ్యేవి. కానీ బొమ్మలు తయారుచేసే కుటుంబాల సంఖ్య పరిమితంగా ఉండడం, అందులోనూ కొన్ని రకాల బొమ్మలనే ఎక్కువగా తయారు చేస్తుండడంతో క్రమంగా మిగతావి కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం 24 రకాల బొమ్మల తయారీలోనే ఈ తరం కళాకారులకు నైపుణ్యం ఉంది. ఈ నేపథ్యంలో కళను భావితరాలకు అందించడం, అన్ని రకాల బొమ్మల తయారీకి ప్రభుత్వం తరఫున ఆర్డర్లు రావాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హస్తకళా ఖండాలు ఈ – కామర్స్లో అమ్మకానికి ఐటీడీఏ వంటి సంస్థలు తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు. జాతర ఏదైనా తయారీ ఇక్కడే... బొమ్మల తయారీకి కలప వినియోగించేవాళ్లం. ఇక్కడ అడవుల్లో ఈ కలప లభ్యం లభించక బూరుగు కలపతోనూ తయారు చేస్తున్నాం. కలపను బొమ్మ రూపంలో చెక్కి నునుపుదనం తీసుకొచ్చాక రంగులు అద్దుతాం. ఇదంతా జరగడానికి 18 రోజులు పడుతుంది. చిన్న బొమ్మలైతే ఐదు రోజుల్లో పూర్తవుతాయి. పూర్తిగా చేతి పని కావడంతో కళాఖండాల ఖరీదు రూ.600 నుంచి మొదలవుతుంది. – పసుల అంజన్, నాయక్పోడు కళాకారుడుచెత్తతో చేసే మాస్క్ల తయారీ అరుదైన కళ. దీనికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కళాకారులు ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు కోసం వెళ్లిన 29వ దరఖాస్తుగా నాయక్పోడు వుడెన్ మాస్క్/ బొమ్మలు ఉన్నాయి. – అరవింద్ ఆర్యా, ‘టార్చ్’ కార్యదర్శి -
వ్యక్తి అనుమానాస్పద మృతి
● హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన వేముల రాము (30) అనుమానాస్పదంగా మృతిచెందడంతో శనివారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘర్షణకు దారితీసింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాములసింగారం గ్రామానికి చెందిన రాముకు, ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన గౌడిచర్ల మౌనికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కలహాల కారణంగా ఆరు నెలల క్రితం భార్యతో కలిసి రాము కొమరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న పని కోసమంటూ వెళ్లిన రాము ఆచూకీ పోలీసుల ద్వారా తెలుసుకొని ఇంటికి తీసుకెళ్లారు. 20న మౌనిక, ఆమె అక్కల కుటుంబాలు కలిసి మేడారం బయలుదేరాయి. వీరు పస్రా చేరుకున్న క్రమంలో అనారోగ్యానికి గురైన రామును అక్కడే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు చేరుస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు నిర్ధారించుకొని తిరిగి కొమరారం బయలుదేరారు. రాము మృతి విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియచేసి కొమరారం పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లారు. ఎస్ఐ నాగుల్మీరా సూచనతో రాము భౌతికకాయాన్ని ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇదంతా ఆస్పత్రి వద్ద భార్య మౌనిక బంధువులు రాము కుటుంబ సభ్యులకు వివరించారు. కానీ, వారే హత్య చేసి కట్టుకథలు చెబుతున్నారని రాము కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారించి రాము తండ్రి వెంకన్న నుంచి ఫిర్యాదు తీసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. భార్య మౌనికతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కొమరారం ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. యూరియా చల్లుతూ కూలీ..అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ, హమాలీ మేసీ్త్ర సామకూరి శంకరయ్య (55) శనివారం ఓ రైతు పొలంలో యూరియా చల్లుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శంకరయ్య పొలంలో యూరియా చల్లుతూ పడిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. విద్యుదాఘాతంతో ఛత్తీస్గఢ్ కూలీ..ఇల్లెందురూరల్: మండలంలోని 21 పిట్ ఏరియా సమీపంలోని జామాయిల్ తోటలో చెట్లు నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా మక్కావారు గ్రామానికి చెందిన మరకం సోమాను (31) మృతి చెందాడు. మూడు రోజులుగా జామాయిల్ చెట్లు నరుకుతున్న క్రమంలో శనివారం నరికిన చెట్టు హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని తండ్రి మరకం చైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో పడి వ్యక్తి ..ములకలపల్లి: చెరువులో పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన బండి రాంబాబు (40) ఓ ఫంక్షన్ నిమిత్తం ఇటీవల సుబ్బనపల్లిలో నివసించే సోదరుడు బండి దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చాడు. గురువారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాంబాబు తిరిగి రాలేదు. చుట్టుపక్కల విచారించినా జాడ తెలియలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులోని చింతలచెరువులో రాంబాబు మృతదేహం బయటపడింది. బహిర్భూమికి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు చెరువుతో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య శోభన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22) తండ్రి బాలరాజు గతంలో మృతి చెందగా తల్లి తనను వదిలి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురై ఒంటరితనం భరించలేక శనివారం గ్రామ శివారులో చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బాబాయి సున్నం సతీశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో ఒకరు..భద్రాచలంటౌన్: భార్య దూరంగా ఉంటుందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పట్టణంలోని అశోకనగర్ కాలనీకి చెందిన ఇమ్మడి ఇమ్మాన్యుయేల్ (29)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్మాన్యుయేల్ శనివారం ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు
● ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ ● ప్రారంభమైన సీఎం కప్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలుఖమ్మం స్పోర్ట్స్: క్రీడాకారులు తమ ప్రయత్నాలను విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ప్రతీ ప్రయత్నంలో గెలుపు దక్కకున్నా నిరాశ చెందకుండా ముందుకు సాగితే గెలుపు సొంతమవుతుందని తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ పోటీలను శుక్రవారం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరుకాగా సీపీ మాట్లాడారు. ఆర్చరీలో సహజసిద్ధమైన ప్రతిభ ఉన్న జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా స్నేహసంబంధాలు మెరుగవుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే స్ఫూర్తి పెరుగుతుందని తెలిపారు. యువత, విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు దరిచేరవని పేర్కొన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సాధుల సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆర్చరీని జిల్లావ్యాప్తంగా విస్తృతం చేయడంతో పలువురు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, జాతీయ ఆర్చరీ డెవలప్మెంట్ సభ్యుడు, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య మాట్లాడగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామారావుతో పాటు వివిధ అసోసియేషన్ల బాధ్యులు గోంగూర వెంకటేశ్వర్లు, ఆదర్శ్కుమార్, సాంబమూర్తి, బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
●నిత్యం ట్రాఫిక్ సమస్యలు..
మణుగూరు రూరల్: ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గుట్టమల్లారం వద్ద ప్రధాన రహదారిపై వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. లారీలను రోడ్డు పక్కనే పార్కింగ్ చేయడంతో ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలు ఉండటంలేదు. వివిధ పనులపై వెళ్లే ఉద్యోగులు, ప్రజలు, రోగులు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతున్నారు. లారీల రాకపోకలతో ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి గ్రామాన్ని కమ్మేస్తోందని, ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై మణుగూరు ఎఫ్ఆర్ఓ ఉపేందర్ను వివరణ కోరగా.. దుమ్ము, ధూళి నివారణకు చర్యలు చేపట్టామని తెలిపారు. -
సింగరేణి క్వార్టర్లో చోరీ..
ఇల్లెందు: పట్టణంలోని జేకే సింగరేణి కాలనీలోని క్వార్టర్లో చోరీ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం జేకే ఏరియాలోని ఎస్డీ –48 క్వార్టర్లో కేఓసీలో జనరల్ మజ్ధూర్గా విధులు నిర్వహిస్తున్న షబ్బీర్ రెండు రోజులు బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి తన ఇంటికి రాగా తలుపులు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని ఆరు తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ సంఘటనపై షబ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య భద్రాచలంటౌన్: కుటుంబకలహాల నేపథ్యాన ఓ వ్యక్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాచలంలోని జగదీష్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచిలకకు చెందిన గుండమ్మల రమేష్(34) పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. ఈక్రమంలో గత కొంతకాలంగా భార్య సుమలతతో ఏర్పడిన గొడవల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రీన్ సిగ్నల్
ఇసుక లారీలకుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు పట్టణ శివారులో గుట్టమల్లారం నుంచి స్వప్ప వాటర్ ఫాల్స్ (కట్టుమల్లారం), జాబిల్లి వాటర్ఫాల్స్ (కట్టుమల్లారం) వరకు ఫారెస్టు శాఖ ఆధీనంలో ఉన్న 7 కిలోమీటర్ల రోడ్డు మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అడ్డంకులు కల్పించవద్దంటూ తెలంగాణ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫారెస్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, మణుగూరు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్, మణుగూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సూచించింది. అటవీ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు ఒక్కో లారీ నుంచి అటవీశాఖ రూ.100 పన్ను వసూలు చేసుకోచ్చంటూ ఆదేశాల్లో పేర్కొంది. సహజ న్యాయం దక్కేలా న్యాయస్థానం ఆదేశాలు.. మెస్సర్స్ నాగులమ్మ తల్లి మహిళా ట్రైబల్ శాండ్ క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీకి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య 2025 మే 12న ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నాగులమ్మ గిరిజన మహిళా సొసైటీ గోదావరిలో ఇసుక పూడిక తీత పనులు దక్కించుకుంది. కోడిముత్తయ్య గుంపు స్టాక్ పాయింట్ నుంచి మణుగూరు ఆర్ అండ్ బీ రోడ్డు వరకు ఇసుక రవాణా చేసేందుకు కట్టుమల్లారం, కమలాపురం మీదుగా ఫారెస్ట్ శాఖ నిర్మించిన వాటర్ఫాల్స్ రోడ్డు ఒక్కటే అందుబాటులో ఉంది. ఒకే ఒక రోడ్డు అందుబాటులో ఉన్నప్పుడు దాని మీదుగా రాకపోకలు నిషేధించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, ఫారెస్టు శాఖ ఇలా చేయడం వల్ల నాగులమ్మ తల్లి మహిళా సొసైటీకి సహజ న్యాయం దక్కేలా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. టీజీఎండీసీ సామాజిక బాధ్యత ఏదీ..? టీజీఎండీసీ వంటి కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యత కింద ఇసుక ర్యాంపులు ఉన్న గ్రామాల దగ్గర చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. ఆఖరికి ఇసుక లారీల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, విస్తరించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫలితంగా మైనింగ్ ప్రాంతాలకు దగ్గరున్న స్థానికుల్లో మెజారిటీ ప్రజానీకం సదరు సహజ వనరుల వల్ల కనీస స్థాయిలో లబ్ధి పొందే మాట అటుంచితే ప్రతీరోజు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్సులు పోయేందుకు రోడ్లు నిర్మిస్తామంటే నానా కొర్రీలు వేసే అటవీశాఖ ఇసుక రవాణా సాఫీగా సాగేందుకు వీలుగా తమ ఆధీనంలో ఉన్న ఎడ్లబండి దారులను లారీలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విస్తరించడం, అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం కొత్త విధానానికి తెర లేపినట్లయింది. గోదావరి తీరం వెంబడి కోడిముత్తయ్యగుంపు, చిన్నరావిగూడెం, పెద్దరావిగూడెంల దగ్గర ఏళ్ల తరబడి ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక లోడ్ చేసుకున్న లారీలు కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల మీదుగా మణుగూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ రోడ్డుకు చేరుకునేవి. హెవీ లోడ్ లారీల రాకపోకల కారణంగా కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. ఎగిసిపడే దుమ్ముతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ చిక్కులు ఏర్పడి, పిల్లలు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కోడిముత్తయ్యగుంపు– కమలాపురం– కట్టుమల్లారం వరకు రోడ్డును అభివృద్ధి చేసేంత వరకు తమ గ్రామం మీదుగా ఇసుక రాకపోకలు సాగించేందుకు వీలులేదంటూ ఆ గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు.గుట్టమల్లారం, కట్ట్ముల్లారం, కమలాపురంల మధ్య గతంలో ఎడ్లబండ్లు తిరిగే దారి ఉంది. ఇసుక లారీల వల్ల కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఇక్కడున్న వాటర్ ఫాల్స్కు వెళ్లే పర్యాటకులు, ఇసుక లారీల కోసం కట్టుమల్లారం, కమలాపురం దగ్గరున్న రథంగుట్ట రిజర్వ్ ఫారెస్టులో మా శాఖ తరఫున రూ.2 లక్షలతో రోడ్డు నిర్మించాం. న్యాయస్థానం, జిల్లా అధికారుల ఆదేశాలతో ఒక్కో లారీ నుంచి రూ.100 వంతున ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. ఈ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికే వెళ్తుంది. – ఉపేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మణుగూరు -
సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
ఇల్లెందురూరల్: సంత్ సేవాలాల్ మహరాజ్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందా లని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మండలంలోని బోయితండా గ్రామపంచాయతీలో సేవా లాల్ 287వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భోగ్బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బానోత్ సంతు, డాక్టర్ బన్సీ, డాక్టర్ సునీంద్ర, డాక్టర్ రాంనివాస్, జగదీష్ పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ఒకటైనా వచ్చేనా?!
కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతల్లో నామినేటెడ్ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చేనెల 15లోగా పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిన నేపథ్యాన పార్టీ పెద్దలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆశావహులు తమ వంతుగా మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఈసారి కూడా ఒకటి, రెండు పదవులైనా దక్కించుకోవాలన్న ఉత్సాహంతో పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నందున ఈసారి ఒక్క పదవైనా వస్తుందా.. వస్తే అది ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంతరచుగా ప్రచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. 2024లో కొన్నింటిని భర్తీ చేయగా.. ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. అలాగే ఉమ్మడి, జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. అయినా ఇంకొన్ని పదవులు ఉండడంతో పండుగలు, ఎన్నికల సమయాన ప్రచారం జరుగుతున్నా ముందడుగు పడడం లేదు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు నియామకం పూర్తవడం, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యాన నేతలు, కేడర్ను ఉత్సాహపరిచేందుకు పదవుల భర్తీకి అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా మార్చి 15లోగా ఖాళీగా ఉన్న కొన్ని పదవులు భర్తీ చేయనున్నారు. కార్పొరేషన్లపైనే గురి ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులపైనే గురి పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రాయల నాగేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పొదెం వీరయ్య, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వా విజయ్బాబు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ చైర్పర్సన్గా నూతి శ్రీకాంత్ కొనసాగుతున్నాయి. ఈసారి రాష్ట్రస్థాయిలో దాదాపు 35కుపైగా పదవులు భర్తీ చేయనుండగా, ఉమ్మడి జిల్లాకు ఒకటి, రెండైనా దక్కుతాయనే విశ్వాసంతో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తమకు పదవి దక్కేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు తెలిసింది. జిల్లా స్థాయి పదవులపైనా.. ఇంకొందరు నేతలు జిల్లాస్థాయి పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నేపథ్యాన ఈసారి భర్తీపై ఆశలు ఉండడంతో తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు భర్తీ కావాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నందున గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించిన వారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులకు పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో బొర్రా రాజశేఖర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్రెడ్డి, కమర్తపు మురళి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగ సీతారాములు తదితరులు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉండడంతో కొందరు రాష్ట్ర లేదా జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని.. సాధ్యం కాకపోతే వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే భావనతో ఉన్నట్లు సమాచారం. -
సీతమ్మ సాగర్ ఇనుము చోరీ..
● మణుగూరులోని ఇనుప దుకాణాల్లో విక్రయం ● ఇనుము తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేతఅశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీకి సంబంధించిన ఇనుము చోరీ చేసి మణుగూరులోని ఇనుము దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గత కాలంగా కొందరు వ్యక్తులు ఇనుము పెద్ద మొత్తంలో తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఈక్రమంలో శుక్రవారం మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలోని ఎల్అండ్టీ సంస్థ స్టాక్ యార్డ్ నుంచి ట్రాక్టర్లో సీతమ్మ సాగర్ ఇనుము చోరీ చేసి మణుగూరుకు తరలిస్తుండగా ఎల్అండ్టీ సంస్థ అధికారులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించి ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. సెక్యురిటీ జనరల్ మేనేజర్ జయంత్చక్రవర్తి ఫిర్యాదు మేరకు అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన నేలపట్ల రవీందర్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. నిద్రావస్థలో అధికారులు.. గత కొంతకాలంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇనుమును పెద్ద మొత్తంలో చోరీ చేసి ఆటోలు, ట్రాక్టర్లలో మణుగూరుకు తరలిస్తున్నారు. ఈక్రమాన ఇనుము దుకాణాల యజమానులు చోరీ ఇనుమును గుర్తు పట్టకుండా ముక్కలుముక్కలుగా చేసి పనిముట్లకు వినియోగించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎల్అండ్టీ సంస్థ, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎల్అండ్టీ స్టాక్ యార్డ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వరిస్తున్నా ఇనుము చోరీ ఎలా జరుగుతుందో ఆ సంస్థ అధికారులు, సిబ్బందికే తెలియాలి. దొరికితేనే దొంగ లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇనుము చోరీపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ర్యాంపులు నిల్.. అక్రమాలు ఫుల్!
● అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇసుక రవాణా ● కిన్నెరసాని, మొర్రేడు వాగుల నుంచి తరలింపు ● నాగారం, భోజ్యాతండా చెక్డ్యామ్లు కేంద్రాలుగా.. ● పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పాల్వంచరూరల్: నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయినా పోలీస్, రెవెన్యూ అధికారుల్లో చలనం ఉండటంలేదు. ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులకు కలిసివస్తోంది. పాల్వంచ మండలంలోని మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగుల నుంచి కొద్దిరోజులుగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. భోజ్యాతండా సమీపంలోని మొర్రేడు వాగు, నాగారం సమీపంలోని కిన్నెరసాని నుంచి రాత్రి సమయంలో జేసీబీలతో ఇసుక తోడుతున్నారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోతున్నారు. చెక్డ్యామ్ల పనుల పేరుతో ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్ డ్యామ్ల నిర్మాణ పనులు నడవకున్నా జేసీబీలను వాగుల వద్ద ఉంచి రాత్రి వేళ్లలో భోజ్యాతండా, నాగారం శివారు ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ర్యాంప్ల ఏర్పాటేది..? ప్రభుత్వం నాగారం, రంగాపురంలో ర్యాంపులు ఏర్పాటు చేయలేదు. దీంతో అక్రమార్కులు ఇసుక విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ర్యాంపులు ఏర్పాటు చేస్తే ‘మన ఇసుక మన వాహనం’ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.కిన్నెరసాని, మొర్రెడు వాగుల్లో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. భోజ్యతండా వద్ద నుంచి భారీ వాహనాల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు మాకు సమాచారం లేదు. ఇక నుంచి నిఘాపెట్టి చర్యలు తీసుకుంటాం. స్థానికులు సహకరించకపోవడంతో రంగాపురం వద్ద కిన్నెరసాని వాగులో ర్యాంప్ ఏర్పాటు చేయలేదు. నాగారం వద్ద ఇసుక ర్యాంప్కు అనువుగాలేని కారణంగా ఏర్పాటు చేయలేదు. –దారా ప్రసాద్, తహసీల్దార్, పాల్వంచ -
‘పది’పై ప్రత్యేక దృష్టి
ఆశ్రమపాఠశాలలో నెల రోజులు మాకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అర్థంకాని విషయాలపై, సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. మంచి మార్కులు సాధిస్తాం. – ఇర్ప రాకేష్, పదో తరగతి పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నాయి. చదువులో వెనుకబడినవారికి ఉపాధ్యాయులు శ్రద్ధతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. – బచ్చు నాగచైతన్య, పదో తరగతి ఆశ్రమ పాఠశాలలో వందశాతం ఫలితాలు, ఎక్కువ మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించేలా కృషి చేస్తున్నాం. ఐటీడీఏ అందించిన ప్రత్యేక మాడ్యూల్స్ ప్రాక్టీస్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. – చందు, హెచ్ఎం, కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలపాల్వంచరూరల్: విద్యార్థుల భవితకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలకు కాలం సమీపిస్తోంది. దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉండగా, డిప్యూటేషన్ పద్ధతిలో సర్దుబాటు చేశారు. నెల రోజులుగా ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ ఆశ్రమాల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ, గిరిజన విద్యాలయాలు పోటీపడుతున్నాయి. ఐటీడీఏ పాఠశాలల్లో కార్యాచరణ.. గిరిజన ఆశ్రమ పాఠశాలలల్లో వందశాతం ఉత్తీర్ణతకు ఐటీడీఏ పీఓ రాహుల్ 60 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన క్రీడాపాఠశాల, ఉల్వనూరులోని బాలికల పాఠశాలతోపాటు ఐటీడీఏ పరిధిలోని అన్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. సంబంధిత ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై నజర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో గత నాలుగు రోజుల నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు ముందుగా సబ్జెక్ట్ల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ ఉదయం 5గంటల నుంచి 7.30 గంటలు, రాత్రి 7.30 గంటలనుంచి 9.30 గంటల వరకు స్టడీ అవర్, సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కిన్నెరసాని క్రీడాపాఠశాలలో పదో తరగతిలో 39 మంది విద్యార్థులు, ఉల్వనూరు ఆశ్రమ పాఠశాలల్లో 80 మంది విద్యార్థినులు పదో తరగతి అభ్యసిస్తున్నారు.ప్రత్యేక తరగతుల్లో సబ్జెక్ట్ల వారీగా రోజుకో ఉపాధ్యాయుడు బోధన చేపట్టాలని, ఉత్తమ మార్కులు సాధించేలా కృషిచేయాలని పీఓ నిర్దేశించారు. ఆ దిశగా విద్యార్థులు కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నా రు. గతేడాది కిన్నెరసాని ఆశ్రమంలో పదో తరగతి లో 98శాతంఉత్తీర్ణత సాధించగా, ఉల్వనూరు బాలి కల ఆశ్రమ పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. రానున్న పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. -
మహిళా సర్పంచ్ అర్ధరాత్రి పట్టుకున్నా..
ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో వాగు నుంచి జేసీబీ యంత్రంతో ఇసుక తోడి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా నాగారం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ స్వప్న, మరో ముగ్గురు వార్డు సభ్యులు, స్థానిక యువకులతో కలిసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు దాడికి యత్నించడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా సర్పంచ్ అర్ధరాత్రి వెళ్లి అడ్డుకుని, అధికారులకు సమాచారం ఇచ్చినా రెవెన్యూ, పోలీస్ శాఖలు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రోజులు గడిచినా యంత్రాన్ని సీజ్ చేయకపోవడం, కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు.విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధి లో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి ఏపీకి చెందిన భక్తులు శుక్రవారం విరాళం అందజేశారు. విశాఖపట్నంకు చెందిన భక్తురాలు కె.అపురూప రూ.1,11,116ను ఆలయ పర్యవేక్షకుడు సాయిబాబుకు అందజేయగా, ఆయన దాతలకు రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాత ల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవా రం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచా మృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరంఆలయంలోని మూల విరాట్కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హో మం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ప్రారంభంభద్రాచలం టౌన్: భద్రాచలంలో అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు, సాంస్కృతిక సంబరాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగాన్ని బతికించేందుకు భద్రాద్రి కళాభారతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తొలిరోజు హైదరాబాద్కు చెందిన గో వాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అంతకుముందు చిన్నారుల నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సీఐ నాగరాజు, పాకాల దుర్గాప్రసాద్, తాళ్లూరి పంచాక్షరయ్య, సబ్జైలర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు వంద శాతం వసూలు చేయాలి
చుంచుపల్లి: మహిళా సంఘాలకు ఇచ్చిన సీఐఎఫ్, సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను వంద శాతం వసూలు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.విద్యాచందన ఆదేశించారు. శుక్రవారం చుంచుపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సమాఖ్య సభ్యులకు సెర్ప్ ద్వారా చేపడుతున్న అన్ని కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కూల్, మెడికల్, ఆర్టీసీ, ఫైర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని యూనిఫామ్లను ప్రభుత్వం మహిళా సంఘాలకే ఇస్తుందన్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా నెలకొల్పాలని, గ్రామ సంఘ భవనాల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నీలయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సోయం సుజాత, తదితరులు పాల్గొన్నారు. సదరం క్యాంపు పరిశీలన.. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపులో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్లైన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని, ఆస్పత్రిలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల లభ్యత, వైకల్య నిర్ధారణకు వినియోగిస్తున్న పరికరాల పనితీరును సమీక్షించి సదరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ నుంచి సహకారం అందిస్తాం
కొత్తగూడెంఅర్బన్: నిరుద్యోగులు పోటీ పరీక్షలు సిద్ధమయ్యేందుకు కావాల్సిన పుస్తకాలు, మెటీరియల్ అందించేందుకు, ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ఐటీడీఏ నుంచి తప్పనిసరిగా సహకారం అందిస్తామని ఐటీడీఏ పీఓ బి రాహుల్ భరోసా ఇచ్చా రు. శుక్రవారం కొత్తగూడెంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు పలు సూచనలు చేశారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మధుకర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. లక్ష్యంతో చదవాలిభద్రాచలం టౌన్: గిరిజన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సూచించారు. శుక్రవారం నిర్వహించిన గిరిజన గురుకుల పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకులాల ఆర్సీ బి.అరుణకుమారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, ప్రిన్సిపాల్ హేమావతి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలిసూపర్బజార్(కొత్తగూడెం): క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో, ఢిల్లీలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో జిల్లాకు ఏ వెంకటప్రసాద్, కె.నవీన్ 100 సత్తా చాటి ఖేలో ఇండియా జాతీయ చాంపియన్ షిప్నకు ఎంపికయ్యారు. శుక్రవారం కొత్తగూడెంలో పీఓను జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ పి.కాశీ హుస్సేన్, క్రీడాకారులు కలవగా అభినందించి మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ సీతారాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధి ఇ.మొగిలి, సుదర్శన్ పాల్గొన్నారు. పీఓ రాహుల్ -
గణితం ఆధునిక సాంకేతికతకు మూలం
పాల్వంచరూరల్: మారుతున్న కాలంలో గణిత శాస్త్రం ఆధునిక సాంకేతిక అభివృద్ధికి మూలస్తంభమని నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణితశాస్త్రం ప్రొఫెసర్ డి.శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ‘ఇంజనీరింగ్ సాంకేతిక రంగాలకోసం అన్వయ గణితం, గణనాత్మక పద్ధతుల్లో తాజా ధోరణులు’అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయస్థాయి సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగాఆయన మా ట్లాడుతూ విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రో త్సహించాలన్నారు. అనంతరంప్రొఫెసర్ను, కళా శాల ప్రిన్సిపాల్ పద్మను సత్కరించారు. పి.శ్రీనివాసరావు,ప్రొఫెసర్ సీహెచ్.రామిరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టాటా మ్యాజిక్ గుండాల: గుండాల నుంచి ఇల్లెందు వెళ్తున్న ఒక టాటా మ్యాజిక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక టాటా మ్యాజిక్ పసరా నుంచి ఇల్లెందు వెళ్తుండగా కాచనపల్లి గుండాల మధ్య క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడగా.. కరెంట్కు అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్ లింక్లతో రూ.26లక్షలు స్వాహా దమ్మపేట: మోసపూరిత ఆన్లైన్ లింక్లు క్లిక్ చేసి నగదు నష్టపోయిన ఘటనపై శుక్రవారం పోలీసులు సైబర్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ సాయికిషోర్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పాతచీపురుగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ స్మార్ట్ఫోన్లో ఆన్లైన్లో పెట్టుబడి పెడితే ఒకటికి పది రెట్లు అదనంగా డబ్బులు వస్తాయని వచ్చిన సందేశాన్ని నమ్మి గత నెల రోజుల క్రితం దశలవారీగా లింక్లను క్లిక్ చేశారు. ఈనేపథ్యాన పాతచీపురుగూడెంకు చెందిన వ్యక్తి రూ.3లక్షలు, కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద రూ.23లక్షలను పెట్టుబడిగా పెట్టారు. ఆతర్వాత వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. బాధిత వ్యక్తులు దమ్మపేట స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారని ఎస్ఐ తెలిపారు. పాల్వంచరూరల్: సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పాతసూరారం గ్రామానికి చెందిన నిరుపేద రైతు జక్కుల రమేష్ కుమారుడు ప్రవీణ్ బీటెక్ పూర్తి చేసి ఇంటివద్ద నుంచి ఉద్యోగ అన్వేషణలో ఉంటున్నారు. ఈక్రమాన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ప్రవీణ్ తండ్రి కరీంనగర్కు చెందిన హైదారాబాద్లోని కూకట్పల్లిలో ఉంటున్న దొడ్డి అనిల్కుమార్తో పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.5లక్షలు ఖర్చవుతుందని నమ్మించడంతో తండ్రి ఒకసారి ఫోన్పే ద్వారా రూ.2.49 లక్షలు, మరోసారి 2.51లక్షల నగదు ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాది గడిచినా ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని శుక్రవారం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాల్యవివాహంపై కేసు పాల్వంచరూరల్: బాల్య వివాహం జరిగిన ఐదు నెలల తర్వాత ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఇల్లెందు పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలికతో పాల్వంచ మండలం దేవోజ్యాతండాకు చెందిన వ్యక్తితో గతేడాది ఆగస్టు 17 తేదీన వివాహమైంది. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్ సుధాతిదేవి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మైనర్ బాలిక తండ్రి, పిన్ని, వరడు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. సాగర్ కాల్వలో వృద్ధుడి మృతదేహం ఖమ్మంఅర్బన్: ఖమ్మం గోపాలపురం ప్రాంతానికి చెందిన షేక్ నాగుల్ మీరా(65) మృతదేహాన్ని టేకులపల్లి సమీపాన సాగర్ ప్రధాన కాల్వలో శుక్రవారం గుర్తించారు. ఆయన అదృశ్యమైనట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు పోలీసులు ఆరా తీస్తుండగానే సాగర్ కాల్వలో మృతదేహం తేలుతుందనే సమాచారం అందింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించగా నాగుల్మీరాదేనని కుటుంబీకులు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు
● ఉమ్మడి జిల్లాలో 14కేంద్రాల ఏర్పాటు ● రూ.590 కోట్ల విలువైన 7.55లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణఖమ్మంవ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లు శుక్రవారం ముగిశాయి. ప్రైవేట్ మార్కెట్లో కనీస మద్దతు ధర లేనందున రైతులు నష్టపోకుండా సీసీఐ ద్వారా కేంద్రప్రభుత్వం పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఈమేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 4.77 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, కొనుగోళ్లకు 14 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది, భద్రాద్రి జిల్లాలోని ఆరు కేంద్రాల్లో అమ్ముకునేలా స్లాట్ బుకింగ్కు కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 8 – 12 శాతం తేమ ఉన్న పత్తిని క్వింటాకు రూ.8,110 నుంచి రూ.7,786 చొప్పున కొనుగోలు చేశారు. 33వేల మంది రైతుల నుంచి.. ఉమ్మడి జిల్లాలో సీసీఐ ద్వారా గడువు ముగిసే నాటికి రూ.590 కోట్ల విలువైన 7.55 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఖమ్మం జిల్లాలో రూ.360 కోట్ల విలువైన 4.53 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో రూ.230 కోట్ల విలువైన రూ.3లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు జిల్లాల్లో కలిపి 33వేల మంది రైతుల నుంచి పత్తి సేకరించగా, చివరి దశలో అమ్మిన వారికి తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. అయితే, ఇంకా పలువురు రైతుల వద్ద పత్తి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. కూలీల కొరతతో సేకరణ ఆలస్యమైనందున మరికొన్ని రోజులు సీసీఐ కేంద్రాలు కొనసాగించాలని కోరినా ఫలితం దక్కలేదు. -
డిజిటల్ క్రాప్ బుకింగ్కు రెడీ..
● గ్రామానికి ఓ వలంటీర్ను నియమించిన వ్యవసాయశాఖ ● రెండు రోజుల్లో సర్వే ప్రారంభానికి అధికారుల కసరత్తు ● సర్వే నంబర్, రైతు ఫొటో, పంట వివరాలు ఆన్లైన్లో నమోదుబూర్గంపాడు: పంటల సాగు వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సేకరించి, పారదర్శకంగా డిజిటలైజేషన్ చేసేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ గ్రామానికి ఓ వలంటీర్ను కేటాయిస్తోంది. వలంటీర్ల నియామకపు ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చింది. రెండేళ్ల నుంచి డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పనిభారం ఎక్కువగా ఉందంటూ క్షేత్రస్థాయిలో ఏఈఓలు విముఖత చూపడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు వలంటీర్లను నియమిస్తోంది. ఇప్పటికే 285 గ్రామాలకు వలంటీర్ల నియామకం జిల్లాలో మొత్తం 67 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఏఈఓల ఆధ్వర్యంలో కొత్తగా నియమించే వలంటీర్లు డిిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని 291 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటికే 285 గ్రామాలకు వలంటీర్లను నియమించారు. ఆయా గ్రామాల్లో చదువుకున్న స్థానిక యువకులనే వలంటీర్లుగా తీసుకున్నారు. స్మార్ట్ఫోన్ ఉండి ఆన్లైన్ చేయటంపై అవగాహన కలిగిన వారికి అవకాశం కల్పించారు. డిజిటల్ క్రాప్ బుకింగ్పై రెండురోజులపాటు శిక్షణనిచ్చి క్షేత్రస్థాయి సర్వేకు పంపించనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ గ్రామాల భూ భారతి మ్యాప్లతో వలంటీర్లు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టనున్నారు. భూ భారతి మ్యాప్లు లేని (ఆర్ఓఎఫ్ఆర్)ప్రాంతాల్లో ఏఈఓలు వ్యవసాయశాఖ పోర్టల్లో సర్వే చేస్తారు. యాసంగిలో పంటలు సాగు చేసిన భూములతో పాటు, పంటలు వేయని భూములను కూడా ఈ సర్వేలో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్కు రూ.7 చెల్లింపు వలంటీర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఒక్కో సర్వే నంబర్లో వేసిన పంటను ఫొటో తీసి డిజిటల్గా బుకింగ్ చేస్తే వారికి సర్వే నంబర్కు రూ.7 చొప్పున చెల్లించనున్నారు. ఈ సర్వేలో రైతుల ఫొటో, భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంట, రైతుల ఫోన్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్న ఏఈఓడిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం. సర్వే చేసేందుకు ఏఈఓలు గ్రామాల్లో వలంటీర్లను నియమించారు. వారికి ఒక్కో సర్వేనంబర్లో క్రాప్ బుకింగ్ చేసి డిజిటలైజేషన్ చేసినందుకు రూ 7లు చెల్లిస్తాం. రైతులు ఏ భూమిలో ఏఏ పంటలు వేశారో ఫొటోలతో సహా ఆన్లైన్లో నిక్షిప్తమవుతాయి. దీంతో ఎరువుల సరఫరా, రైతు భరోసా, రైతు బీమా క్లెయిమ్స్, పంట నష్టపరిహారాలు, రుణాలు అందించటం వంటి ప్రక్రియలు చాలా సులభతరమవుతాయి. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం. –బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సారపాకలో విషాదం..
● రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి ● ప్రయోజకుడు అవుతాడనుకుంటే మృతదేహమై ఇంటికి.. బూర్గంపాడు: ఎన్నో ఆశలు, ఆశయాలతో తన కొడుకుని ఇంజనీర్ చేసి గొప్ప ప్రయోజకుడిని చేద్దామని అనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు మధ్యలోనే ఆవిరయ్యాయి. స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే అనంతలోకాలకు చేరుకోవడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సారపాకకు చెందిన పేకేటి నాగ వెంకటరెడ్డి(20) గుంటూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. గురువారం సాయంత్రం స్నేహితునితో కలిసి గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న క్రమంలో బొలేరో వాహనం వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగ వెంకటరెడ్డి, అతడి స్నేహితుడు రోడ్డుపై పడిపోగా.. అదే సమయాన అటుగా వస్తున్న కంటైనర్ లారీ నాగ వెంకటరెడ్డి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో అతని స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నాగ వెంకటరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం సారపాకకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న పుల్లారెడ్డి, సరితల పెద్ద కుమారుడైన నాగ వెంకటరెడ్డి చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్నాడు. ఎంసెట్లో 10వేల ర్యాంకు రావడంతో గుంటూరు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకునే సమయంలో అతడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కేటగిరీల్లో 16 మంది విద్యార్థులు పాల్గొని నాలుగు ప్రథమ, నాలుగు ద్వితీయ, మూడు తృతీయ.. మొత్తం 11 బహుమతులు సాధించారు. విజేతలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. డీఈఓ బి.నాగలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు ఎస్కే. సైదులు, ఎన్.సతీష్ కుమార్, సమ్మిళిత శిక్షకులు సిద్దయ్య, శ్రీరామ్, రామారావు, పద్మావతి, శుభకర్, నాగలక్ష్మి, జానకి, నాగశ్రీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయానికి రూ.10 లక్షలు..● నిధులు కేటాయించిన ఎంపీ రేణుకాచౌదరి కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రహరీ నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ విద్యాభివృద్ధి పట్ల ఉన్న ఆసక్తి, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రేణుకాచౌదరి నిధులు కేటాయించారని తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శి కే.కరుణకుమారి, ఆఫీస్ ఇన్చార్జ్ ఎం.నవీన్ కుమార్, గ్రంథపాలకురాలు జీ.మణిమృదుల హర్షం వ్యక్తం చేశారు. -
వన్యప్రాణి సంరక్షణపై దృష్టి
పాల్వంచరూరల్: వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించారు. 63,465 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కిన్నెరసాని అభయారణ్యంలో వివిధ రకాల అటవీ జంతువులు ఉన్నాయి. అటవీ సంరక్షణకు వైల్డ్లైఫ్ డివిజన్ ప్రత్యేక విభాగం నాలుగు రేంజ్లు, 77 బీట్లతో కొనసాగుతోంది. ఇక్కడ అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబర్లు, కొండగొర్రెలు, చిరుతలు, తోడేళ్లు, కుందేళ్లు వంటి వన్యప్రాణుల సంతతి వృద్ధిని ఇటీవల జరిగిన జంతుగణనలో వైల్డ్లైఫ్ శాఖ అధికారులు గుర్తించారు. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు, నీటి కుంటలు, సాసర్ పిట్లు, గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేశారు. గొత్తికోయ గుంపులను ఖాళీ చేయించే ప్రయత్నం.. గొత్తికోయ గ్రామాలతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోందని అధికారులు భావిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇస్తున్నారు. 2002, 2003లలో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయ గిరిజనులు అభయారణ్యంలోని దట్టమైన అటవీప్రాంతంలో 25 గుంపులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో సుమారు 5,500 మంది నివాసం ఉంటున్నారు. వీరు అవసరాలకు మించి పోడు భూమి సాగు చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 ఎకరాల పోడు భూమిని ఆక్రమించారని చెబుతున్నారు. ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కలిగిన భూములను మినహాయించి, మిగతా భూమి సుమారు 5 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్డీఓ బాబు తెలిపారు. ఇంకా కొందరి వద్ద ఆక్రమించుకున్న భూమి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభయారణ్యంలో అటవీ భూమితోపాటు వన్యప్రాణుల పరిరక్షణపై దృష్టి పెట్టామని తెలిపారు. దట్టమైన అటవీలో ఉన్నవారికి నోటీసులు అభయారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న బూసురాయి, రాళ్లచెలక, చిరుతానిపాడు, ఒంటిగుడిసె తదితర గుంపుల గిరిజనులకు నివాస ఆధారాలు చూపాలని, లేని పక్షంలో ఉన్న ప్రదేశాన్ని ఖాళీచేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని వైల్డ్లైఫ్ యాక్టు–20 కింద రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్డీఓ తెలిపారు. అభయారణ్యంలో వనప్రాణి, వృక్షసంపద, అటవీభూమి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అభయారణ్యంలో అలజడి ఉన్నా, మనుషుల సంచారం అధికమైనా వన్యప్రాణి స్వేచ్ఛగా సంచరించదు. సంతానం వృద్ధి చెందదు. అందుకోసం ముందుగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గొత్తికోయ గుంపుల గిరిజనులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని నోటీసులు ఇచ్చాం. గతంలో జంతువుల వేటాడిన కేసులో ఇద్దరు గొత్తికోయలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత. అటవీశాఖకు సహకరించాలి. –బాబు, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పెనుబల్లి: తోటి ఉద్యోగి దశదిన కర్మకు వెళ్లి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన ఇది. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె వంశీ సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సహచరుడైన డ్రైవర్, పెనుబల్లికి చెందిన రాయల జయప్రకాష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని దశదిన కర్మకు హాజరైన వంశీ ఎర్రగుంట్లలోని తన అత్తవారింటికి బైక్పై వెళ్తుండగా పెనుబల్లి మండలంలోని కొత్తగూడెం వైపు వెళ్లే జాతీయ రహదారిపై నాగమల్లేశ్వర ఆలయం వద్ద వాహనం అదుపుతప్పి డ్రెయినేజీని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108 సిబ్బంది చేరుకుని వంశీకి సీపీఆర్ చేస్తూ పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉన్నారు. బోనకల్: మండలంలోని లక్ష్మీపురానికి చెందిన వివాహిత గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మి (48) రెండేళ్లుగా మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆమె భర్త రమేశ్ గురువారం మండల కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం వచ్చేసరికి ఆమె కింద పడి ఉండగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గుర్తించాడు. ఘటనపై వీరి కుమారుడు ఆకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. కాగా, లక్ష్మి మృతదేహం వద్ద సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. -
ఇరిగేషన్ ఇన్చార్జి సీఈగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ
పాల్వంచరూరల్: జలవనరులశాఖ జిల్లా చీఫ్ ఇంజనీర్గా ఎస్.శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన సీఈ గతేడాది సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ పొందాడు. అప్పటి నుంచి ఇన్చార్జి బాధ్యతలను ప్రభుత్వం వరంగల్ జిల్లా ఇరిగేషన్ శాఖ సీఈ సుధీర్కు అప్పగించింది. రెండు చోట్ల బాధ్యతలు నిర్వర్తించడం వల్ల శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రెండు రోజుల క్రితం ఇరిగేషన్శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరెడ్డిని ఇన్చార్జిగా కేటాయించగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇసుక లారీల రవాణాపై సీఈ ఆగ్రహం పాల్వంచరూరల్: సీతారామ ప్రాజెక్ట్ కాలువల పక్క నుంచి ఇసుక లారీల రవాణాపై ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీలు నిత్యం అక్రమంగా రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాలువ కట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ సాక్షిలో ‘నిబంధనలకు నీళ్లు’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఇసుక లారీల రవాణాపై ఆరా తీశారు. అనుమతులు లేకపోయినా ఇసుక లారీలు తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎస్ఐ నర్సింహులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇసుక లారీలు కాలువల కట్టలు, రోడ్లు మీదుగా రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి నుంచి లారీల రాకపోకలను అడ్డుకుంటామని తెలిపారు. పెద్దమ్మగుడి వద్ద వ్యక్తి అదృశ్యంపాల్వంచరూరల్: పెద్దమ్మగుడి వద్ద ఉంటున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ఇబ్రహీంపేటకు చెందిన కాకర్ల నాగేశ్వరరావు(40) ఐదేళ్లుగా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఉంటూ రోజూవారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేశవాపురం గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తితో చనువుగా ఉండేవాడని, గత నెల 2వ తేదీ నుంచి కన్పించడంలేదని నాగేశ్వరరావు సోదరుడు కాకర్ల రమణయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
గిరిజన మాల్తో ఆదరణ
భద్రాచలం/దుమ్మగూడెం: గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా గిరిజన మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న గిరిజన బజార్కు అదనపు గదిగా రూ. 15 లక్షలతో నిర్మించనున్న గిరిజన మాల్కు గురువారం భూమి పూజ చేశారు. దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో నీతి ఆయోగ్ అవార్డు నిధులతో 54 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పపువ్వు, కరక్కాయలు , ఇతర తృణధాన్యాలు దళారులు చెంతకు చేరకుండా ఈ మాల్లు ఉపయోగపడతాయన్నారు. పట్టణాల్లోని మాల్స్కు పోటీగా గిరిజన మాల్ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపిన మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనులు తయారు చేసే, పండించే ప్రతీ వస్తువు మాల్లో లభిస్తుందన్నారు. చదువు కోసం రవాణా సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థినులు పడుతున్న కష్టాలు, వారి సాధించిన ఉత్తమ ఫలితాలపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవ తీసుకుని డాక్యుమెంటరీని తయారు చేయించి, నీతి ఆయోగ్ వెబ్సైట్లో పొందుపరిచారని అన్నారు. దీంతో నీతి ఆయోగ్ అధికారులు కలెక్టర్ను అభినందిస్తూ రూ.3 లక్షల నగదు బహుమతిని ప్రకటించారని తెలిపారు. ఆ నగదుతో నర్సాపురం, పర్ణశాల హైస్కూళ్ల విద్యార్థినులకు సైకిళ్లు అందించామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్లక్ష్యం వహించే హెచ్ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని పీఓ రాహుల్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో హెచ్ఎంలు, వార్డెన్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఏటీడీవోలు రాత్రిపూట పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించాలని ఆదేశించారు. జీపీఎస్ పాఠశాలలకు ఫర్నిచర్ కొనుగోలుకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్రాజ్, అశోక్, సంజీవరావు నవనీత్, లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, వేణు, వివేక్రామ్, సున్నం సమ్మయ్య, సమ్మయ్య, గన్యా, మధుకర్, అలివేలు మంగతాయారు, హరికృష్ణ, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, పూజారి రత్నకుమారి, హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు, పీఓ రాహుల్ -
ఇక పత్తి ‘ప్రైవేటు’కే..
బూర్గంపాడు: ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి పంట ఆలస్యంగా రైతుల చేతికి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పత్తితీతలు చివరి దశకు చేరుకున్నాయి. కూలీల కొరత కారణంగా మార్చి వరకు పత్తి తీయించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి 20(శుక్రవారం) నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నట్లు సీసీఐ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందతున్నారు. చేలల్లో ఉన్న పత్తిని ఎలా అమ్ముకోవాలని మదనపడుతున్నారు. ఈసారి నెలరోజులు ముందే.. ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు సరాసరి 6 క్వింటాళ్ల దిగుబడులే వచ్చాయని రైతులు వాపోతున్నారు. తొలుత తీసిన పత్తి నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందని తక్కువ ధరలకు అమ్ముకున్నారు. రెండో, మూడో విడతల్లో తీసిన పత్తిని సీసీఐలో అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గురువారం వరకు 10,781 మంది రైతుల నుంచి 2.98 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తికి రూ 8,110 నుంచి రూ.7,950ల వరకు సీసీఐ మద్దతు ధర చెల్లించింది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ విధానం కొందరు రైతులకు ఇబ్బందికరంగా మారింది. సీసీఐ గతేడాది మార్చి మూడో వారం వరకు కొనుగోళ్లు జరపగా, ప్రస్తుతం పత్తి నాణ్యత సరిగా లేదంటూ ఈసారి నెలరోజులు ముందే కొనుగోళ్లకు బ్రేకులు వేసింది. రైతుల్లో ఆందోళన అధిక వర్షాల కారణంగా తొలుత కాసిన పత్తి కాయలు కుళ్లి, నాణ్యమైన దిగుబడులు రాలేదు. దీంతో క్వింటా రూ. 4వేల నుంచి రూ. 5వేలకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. నవంబర్లో వర్షాలు తగ్గాక సస్యరక్షణకు వేల రూపాయలు ఖర్చుచేసి పురుగుమందులు స్ప్రే చేశారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పత్తిచేలు ఓ మాదిరి కాపుకాశాయి. గ్రామాల్లో కూలీల కొరతతో పక్క మండలాల నుంచి తీసుకువస్తున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ప్రాంతం నుంచి కూడా తీసుకువచ్చి పత్తిని తీయిస్తున్నారు. దీంతో వారికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ తరుణంలో సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇళ్లవద్ద, చేలలో ఇంకా 25శాతం మేర పత్తి విక్రయానికి ఉంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూతబడితే ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర చెల్లించే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోనున్నారు. మార్చి మొదటివారం వరకై నా సీసీఐ కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు. కూలీలు దొరకక పత్తితీతలు ఆలస్యమవుతున్నాయి. గతేడాది కిలో పత్తితీస్తే రూ.13 చెల్లించాం. ఈ ఏడాది రూ.20 ఇస్తామన్న కూలీలు దొరకటం లేదు. సీసీఐ లేకపోతే ప్రైవేటోళ్లు సగానికి సగం తక్కువ ధర పత్తిని అడుగుతారు. మరో 20 రోజులైనా కొనుగోళ్లు జరపాలి. –ఆవుల వెంకటేశ్వరరెడ్డి, రైతు, రెడ్డిపాలెం ఫిబ్రవరి 20న పత్తి కొనుగోలు కేంద్రాలను మూసేస్తామని సీసీఐ 20 రోజులు ముందుగానే ప్రకటించింది. పత్తి నాణ్యత లేకపోవటంతో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు కూడా క్వింటాల్కు రూ. 8 వేలు చెల్లిస్తున్నారు. –నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన
టేకులపల్లి: మండలంలోని ముత్యాలంపాడు క్రాస్రోడ్ రైతు వేదికలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (సీఐపీఎంజీ) ఆధ్వర్యంలో సస్యరక్షణ చర్యలపై గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి, మొక్కజొన్న తదితర పంటల్లో సమగ్ర సస్యరక్షణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్చార్జి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ పొలంబడి, ర్యాపిడ్ రోవింగ్ సర్వే, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రబ్యూషన్ ఆఫ్ బయో పెస్టిసైడ్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్పై శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర అధికారులు ఉదయ శంకర్, హోపన్న గౌడ, బాబూరావు, అన్నపూర్ణ, మంగీలాల్, శ్రావణి, రమేష్, భాగ్యశ్రీ, విశాల, రెహానా పాల్గొన్నారు. సరిహద్దు గ్రామాల్లో సోదాలుచర్ల: తెలంగాణా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు చెందిన డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్లో తప్పించుకున్న మావోయిస్టులు తెలంగాణాకు వచ్చే అవకాశం ఉందనే అనుమానంతో చర్ల మండలంలోని ఉంజుపల్లి రోడ్, కుర్నపల్లి రోడ్, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తనిఖీలు చేపట్టారు. కేఓసీలో విజిలెన్స్ తనిఖీలు?టేకులపల్లి: కోయగూడెం ఓసీలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. కోయగూడెం ఓసీ అధికారుల నిర్లక్ష్యంతో కేఓసీలోని వే బ్రిడ్జి తూకంలో తేడాల వల్ల సింగరేణికి రోజూ 100 నుంచి 150 టన్నుల బొగ్గు నష్టం వాటిల్లుతోందని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో బుధవారం ఇల్లెందు ఏరియా అధికారులు కేఓసీలోని వే బ్రిడ్జిని సందర్శించి కాటా రాళ్లను ఉంచి తనిఖీ చేసిన విషయం విదితమే. గురువారం విజిలెన్స్, సింగరేణి సెక్యూరిటీ అధికారులు కూడా కేఓసీలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. వే బ్రిడ్జి వద్ద పరిశీలించి సంబంధిత శాఖాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, విచారణ వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. -
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెల్లవారుజామున, రాత్రి వేళల్లోనూ చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది. కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణ వాసులు సరదాగా బయటకు వెళ్లాలంటే సరైన పార్కులు లేవు. దీంతో చిన్నారులకు ఆటా, పాట కరవవుతున్నాయి. ఇక ప్రతీ వార్డులోనూ డ్రెయినేజీ సమస్య వేధిస్తోంది. ఒకటో వార్డులోని వడ్డెరబజారు వానొస్తే ముంపునకు గురవుతోంది. రెండో వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. 3, 4, 5 వార్డుల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఆరో వార్డులో కోనేరు చెరువు మురుగు నీటి చెరువుగా మారింది. ఏడో వార్డులో వీధి దీపాలు లేక అంధకారం నెలకొంది. 8వ వార్డులోని మెరుపు కాలనీ, అటెండర్స్ కాలనీ, కోత మిషన్ బజారుల్లో పారిశుద్ధ్య సమస్య ప్రజలను వెంటాడుతోంది. ఇక్కడ పల్లె ప్రకృతి వనం సైతం నిరుపయోగంగా ఉంది. తొమ్మిదో వార్డులో పలువురికి పక్కా ఇళ్లు లేక గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. పదో వార్డులో పలువురి నివాస స్థలాలకు పట్టాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. 11వ వార్డు మోడల్కాలనీ, ఫైర్ కాలనీలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి మున్సిపాలిటీలో ఇంటి పన్ను ఆన్లైన్ చేయడానికి చిక్కులుండగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మిగిలిన అన్ని చోట్లా రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. నూతన పాలకవర్గ సభ్యులు వీటిపై దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
చట్టాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ రోహిత్ రాజ్సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు పోక్సో, అత్యాచార చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల ఆధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కేసుల దర్యాప్తు, విచారణలో శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్నందున నేపథ్యంలో భవిష్యత్ జీవితంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రాజేందర్, డీఎస్పీలు మల్లయ్యస్వామి, ఆదినారాయణ, ఆర్ఎంఓ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రసాద్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, డీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలాలు.. మొయినాబాద్ ఐఐటీఏలో ఎనిమిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించిన పోలీస్ జాగిలాలు షైనీ, లైకాను గురువారం ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. పేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు. పోలీస్ జాగిలాలకు హ్యాండ్లర్లుగా వ్యవహరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్సింగ్, కె.ముత్తయ్య, ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, ఎంటీఓ సుధాకర్ పాల్గొన్నారు. -
మంచి కోర్సులతోనే ఉజ్వల భవిష్యత్
పాల్వంచరూరల్ : డేటా సైన్స్, ఏఐ వంటి మంచి కోర్సులను ఎంచుకుని శిక్షణ పొందితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వరంగల్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణిత శాస్త్ర ప్రొఫెసర్ జె.వి.రమణమూర్తి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘సాంకేతిక రంగాల కోసం అన్వయ గణితం, గణనాత్మక పద్ధతుల్లో తాజా ధోరణులు’ అనే అంశంపై గురువారం సదస్సు నిర్వహించగా రమణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డీగ్రీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏఐ, డేటాసైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. డిగ్రీ తర్వాత జామ్ ఎంట్రెన్స్ రాస్తే అర్హత సాధించిన వారికి సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసే అవకాశం లభిస్తుందని వివరించారు. ప్రిన్సిపాల్ పి.పద్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో పి.శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహకుమార్, ప్రొఫెసర్ ఎ.వెంకటేశ్వర్లు, డాక్టర్ అరుణకుమారి పాల్గొన్నారు.నిట్ ప్రొఫెసర్ జె.వి.రమణమూర్తి -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళంభద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యాన్నదానానికి కొత్తగూడేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యం – నాగ కుసుమాంబ దంపతులు గురువారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ అధికారులకు చెక్కు అందించగా వారు దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేద పండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాల ప్రచార రథం ప్రారంభంపాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరిపై మార్చి 15న జరిగే కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం నుంచి గురువారం ప్రచార రథం బయలుదేరింది. ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ చైర్మన్ కొత్తా వెంకటేశ్వర్లు, అధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్యాణ మహోత్సవ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి గోవింద రెడ్డి, ఆరుట్ల లక్ష్మణాచార్యులు, గొర్రెపాటి రమేష్, జమ్ముల సీతారామి రెడ్డి, రమేష్, భక్త సమాజ మండలి అధ్యక్షులు ఊకే భద్రయ్య, శ్రీలత, నరసింహాకుమార్, పసుమర్తి వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు నగేష్ శర్మ, ఆరుట్ల ఫణిరాజా చార్యులు పాల్గొన్నారు.కాయకల్ప బృందం పరిశీలనఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిని జిల్లా కాయకల్ప బృందం గురువారం పరిశీలించింది. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఆస్పత్రిలో పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు, చికిత్స తీరుపై ఆరా తీశారు. పలు విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ బృందానికి ఆర్ఎం డాక్టర్ రాంనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫర్జానా తదితరులు సహకరించారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్అశ్వాపురం: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక గౌతమీనగర్ కాలనీ ఏఈసీఎస్ స్కూల్లో భారజల కర్మాగారం జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ(ఏఈఈఎస్) వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఏఈసీఎస్ విద్యార్థులు ఇటీవల వివిధ పోటీల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందగా కలెక్టర్ వారికి బహుమతులు అందజేశారు. ఏఈఈఎస్ పూర్వ విద్యార్థిగా కలెక్టర్ తన అనుభవాలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఏఈసీఎస్ ప్రిన్సిపాల్ ప్రమోద్కుమార్ సింగ్, డీజీఎంలు శర్మ, రఫీక్ అహ్మద్, మోహన్కుమార్, సీఏఓ లక్ష్మీదేవి, ఏడీఎంఓ లత, ఐఆర్ఓ కృష్ణకాంత్ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ.. సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రీ ఇంకై ్లన్, అశ్వారావుపేట, నారావారిగూడెం, ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుజాతనగర్, చుంచుపల్లి, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఆటోమేటిక్ సిగ్నళ్లు, సైన్ బోర్డులు, సూచికల ఏర్పాటుకు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అశ్వారావుపేటలో అంబులెన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. దమ్మపేట, అళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి రహదారులపై బోర్డుల ఏర్పాటుతో పాటు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగించాలని చెప్పారు. వర్షాకాలానికి ముందే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఏఓ బాబురావు, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఆర్అండ్బీ, పీఆర్ ఈఈలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, డీఎంహెచ్ఓ తుకారాం తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగుతోనే నాణ్యమైన దిగుబడులు బూర్గంపాడు: సేంద్రియ సాగుతోనే నాణ్యమైన పంట దిగుబడులు సాధ్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లక్ష్మీపురంలో యారం లక్ష్మీరెడ్డి అనే రైతు సేంద్రియ విధానంలో సాగు చేసిన మిర్చి పంటను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలు సాగు చేస్తున్న లక్ష్మీరెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతుందని, ఆ పంటలను తింటే వ్యాధుల బారిన పడతామని అన్నారు. సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సేంద్రియ వరి సాగు చేస్తున్న మేడేపల్లి ఉదయ్కుమార్, పామాయిల్ రైతు పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయానికి ‘మోక్షం’
పాల్వంచ: వందల ఏళ్లుగా ఆదరణకు నోచుకోని శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ఒకప్పుడు నిత్యపూజలు జరిగేవి. కాలక్రమేణ ఆలయం శిథిలావస్థకు చేరగా భక్తులు ఇబ్బంది పడేవారు. ఆలయ దీనస్థితిపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితం కాగా, శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి ఆలయ పునఃనిర్మాణానికి ముందుకొచ్చారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పాత ఆలయ నిర్మాణాలను పూర్తిగా తొలగించి, సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నూతన ఆలయం, చుట్టూ మాడవీధులు, వకుళా మాత, విశ్వక్సేన, భూ వరహస్వామి ఉపాలయాలతో పాటు గోశాల, యాగశాల, ప్రహరీ, గుడి కార్యాలయం, పార్క్ తదితర నిర్మాణాలు చేపట్టారు. గుడిపాడుగా రామచంద్రాపురం.. పాల్వంచ 9వ డివిజన్ పరిధి గుడిపాడులో క్రీ.శ.1323లో కాకతీయుల కాలంలో శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారని తెలుస్తోంది. ఆ తర్వాత నిజాం పాలనలో క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. కాకతీయుల కాలంలో ఈ గ్రామం పేరు రామచంద్రాపురం కాగా, గుడి పాడుబడిపోవడంతో గుడిపాడుగా మారిందని చెబుతుంటారు. ఈ ఆలయంలో అద్భుత శక్తి ఉందని, ఇక్కడి స్వామిని వేడుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 21 నుంచి ఆరు రోజుల పాటు వేడుకలు.. ఆలయ పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు విగ్రహాల గ్రామోత్సవం, దీక్షాధారణ, అంకురార్పణ, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్టి, 22న యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హోమం, క్షీరాభిషేకం, 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు శుద్ధ జలాలతో అభిషేకం, జలాధివాసం, 24న ధాన్యాధివాసం, 25న హోమాలు, పుష్పాధివాసం 26న ప్రాణాధికాశ వాయిన్యాస హోమాలు, మహాపూర్ణాహుతి, శ్రీదేవి, గోదా సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి, గరుడాళ్వార్, విశ్వక్సేన, వకుళాదేవి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునః నిర్మాణ పనులు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఒకసారి ఆలయానికి వచ్చిన భక్తులు మళ్లీ రావాలనుకునేలా చేయడం తన సంకల్పమని అన్నారు. శనివారం నుంచి జరిగే వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 2022 జూలైలో నాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ రజినీకుమారి, దాత నల్లా సురేష్రెడ్డి, ప్రవళ్లిక దంపతులు భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు నాలుగేళ్ల పాటు పనులు సాగగా ప్రస్తుతం పూర్తి కావొచ్చాయి. ఆలయానికి రోడ్డు కోసం ఇటీవల రూ.80 లక్షలు మంజూరు కాగా త్వరలో 20 అడుగుల రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. -
సవాళ్ల స్వాగతం!
వన్యప్రాణి సంరక్షణపై దృష్టి గొత్తికోయలతో వన్యప్రాణులకు ముప్పు ఉందని భావిస్తున్న అటవీ అధికారులు.. వారిని అడవుల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే పాలకులకు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణాల్లో పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్య నెలకొంది. డ్రెయినేజీలు అంతంతగానే ఉన్నాయి. ఇక డంపింగ్ యార్డులు అన్ని చోట్లా ప్రధాన సమస్యగా మారింది. పట్టణాల్లో సేకరిస్తున్న చెత్త వేసేందుకు డంపింగ్ యార్డుల్లో స్థలం లేక అనేక చోట్ల రోడ్లపైనే దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అపరిశుభ్రంగా మారుతుండగా ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ నూతన పాలకులకు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. –కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేట/ఇల్లెందుఇఫ్తార్ (శుక్రవారం సాశ్రీశ్రీ)6.18సహర్ (శనివారం ఉశ్రీశ్రీ)5.12ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 15 కోట్లు ఉండగా, 24 వార్డుల పరిధిలో 56 పనులు చేయాల్సి ఉంది. వీటికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే శంకుస్థాపన చేసినా వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. ఇక చెరువు కట్ట వద్దనున్న లేక్ వ్యూ పార్క్, ఆర్అండ్ఆర్ కాలనీ(కొత్తకాలనీ)లో చిల్డ్రన్ పార్క్ల్లో పిచ్చి మొక్కలు పెరిగి కళావిహీనంగా మారాయి. లేక్వ్యూ పార్క్లో రూ. కోటితో ఈత కొలను నిర్మించినా నిర్వహణ సక్రమంగా లేక మూతపడింది. సత్యనారాయణపురం రహదారిలో అలుగు వాగుపై హైలెవల్ బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఇల్లెందులపాడులో అలుగు వాగు మీదుగా వైకుంఠధామానికి వెళ్లేందుకు లోలెవల్ కాజ్వే కూలిపోయింది. దీని స్థానంలో మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.35 లక్షలు నిధులు కేటాయించినా పనులు సాగలేదు. ఇక పట్టణంలోని పలు ఇళ్లకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. పలు వార్డుల్లో ట్యాప్లు, లైన్లు లేవు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా, ఎండలు ఎక్కువైతే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెత్త సేకరణ వాహనాలు సగానికి పైగా మూలనపడ్డాయి. ఈ సమస్యలన్నీ నూతన పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి.కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోన ఏడు పంచాయతీలను కలిపి గతేడాది జూన్లో కొత్తగూడెం కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. ఎనిమిది నెలలైనా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయి. డంపింగ్ యార్డులు నిండిపోయి, చెత్తంతా రోడ్లపైనే చేరుతోంది. పాతకొత్తగూడెం ఏరియాలో శ్మశానవాటికకు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి వస్తుండగా, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నగర వాసులు ఆహ్లాదం కోసం వెళ్లాలంటే సరైన పార్కులు కూడా లేవు. పాల్వంచలో దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు తరచూ లీకవుతున్నాయి. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కేఎస్పీ, శాస్త్రి రోడ్లలో డ్రెయినేజీలు నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సుజాతనగర్లో అసలు డ్రెయిన్లే లేక వర్షం వస్తే నీరంతా రోడ్లపైనే నిలుస్తుంది. అంతర్గత రోడ్లు సైతం విశాలంగా లేక ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఎదుళ్ల వాగుపై వంతెన లేక అటుగా వెళ్లే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో విలీన గ్రామాల్లో సుమారు 5వేల మంది కూలీలు ఉపాధి పనులు కోల్పోయారు. వీరికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినా.. గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్నే కొనసాగిస్తున్నారు. ఇక్కడ తక్షణమే ఐఏఎస్ అధికారిని నియమించేలా నూతన పాలకవర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నో సమస్యలు -
‘గిరి’ పల్లెల్లో విద్యుత్ వెలుగులు..
కరకగూడెం/దుమ్ముగూడెం: మారుమూల హ్యాబిటేషన్లలో సైతం విద్యుత్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) మోహన్ రావు తెలిపారు. బుధవారం ఆయన కరకగూడెం మండలంలోని తాటిగూడెం, చింతలగుంపు గ్రామాల్లో 25 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, దుమ్ముగూడెం మండలంలోని చినబండిరేవులో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక లోఓల్టేజీ సమస్యలు తొలగి నాణ్యమైన విద్యుత్ అందుతుందని, వర్షాకాలంలో కూడా విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉండవని చెప్పారు. రూ.1.80 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. అనంతరం పద్మాపురం గ్రామంలో పూర్తయిన 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. కాగా 25 ఏళ్లుగా చీకటిలో మగ్గుతున్న చింతలగుంపు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈ మహేందర్, టెక్నికల్ డీఈలు కృష్ణ, వెంకటేశ్వర్లు, జీవన్ కుమార్, ఏడీఈ ప్రభాకర్రావు, ఏఈలు మోహన్రెడ్డి, రాజశేఖర్, సర్పంచ్లు బి.పార్వతి, కె. విజయలక్ష్మి, ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్ రావు -
లక్ష్యానికి ఆమడదూరంలో...
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు సొంత వ్యాపారంతో ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాక కుటుంబ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, మరికొందరికి ఉపాది కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇలా ఇప్పటికే జిల్లాలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, ఈ విషయంలో సభ్యులను ప్రోత్సహించడంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు వెనుకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో అర్హులైన 18,924 మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలపై ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సభ్యులు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా అవసరమైన రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,047.46కోట్ల లక్ష్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు చేరుతున్నా 8,858 సంఘాలకురూ.811.24 కోట్ల రుణాలు ఇవ్వడం గమనార్హం. మరో 40రోజులే గడువు ఈ ఏడాది జిల్లాలో 18,924 సంఘాలు బ్యాంక్ లింకేజీ రుణాలకు అర్హత ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఆయా సంఘాలకు రూ.1,047.46 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో జిల్లా అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని టర్మ్ లోన్, సీసీఎల్ లోన్లు మంజూరు చేయిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు 8,858 సంఘాలకు రూ.811.24 కోట్లు రుణాలే ఇవ్వగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 40 రోజుల గడువు ఉండగా.. ఇప్పటి వరకు 77.45 శాతం లక్ష్యాన్నే చేరడం గమనార్హం. గత రెండు, మూడేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా ఈసారి కూడా లక్ష్యం మేర రుణాలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు.మండలం ఎస్హెచ్జీల రుణం సంఖ్య (రూ.కోట్లలో) తిరుమలాయపాలెం 646 56.64 ఎర్రుపాలెం 374 52.05 రఘునాథపాలెం 670 52.16 నేలకొండపల్లి 467 50.19 ముదిగొండ 499 48.41 కూసుమంచి 606 47.76 వేంసూరు 439 42.99 తల్లాడ 436 41.91 చింతకాని 524 41.49 సింగరేణి 442 39.72 పెనుబల్లి 447 38.47 మధిర 404 38.28 ఖమ్మంరూరల్ 334 38.08 కొణిజర్ల 379 36.98 కామేపల్లి 328 35.08 కల్లూరు 348 34.50 వైరా 367 30.03 ఏన్కూరు 347 30.19 బోనకల్ 380 28.96 సత్తుపల్లి 421 27.25ఎస్హెచ్జీలకు రుణ పంపిణీలో జాప్యం ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే హడావుడిగా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పూర్తిగా పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కొన్ని సంఘాలకే చెక్కులు మంజూరు చేయించగా, ఆతర్వాత పట్టించుకోలేదని సమాచారం. అంతేకాక ప్రభుత్వానికి గతనెలలో సమర్పించిన నివేదికలో ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు పొందుపర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక గత 6వ తేదీకే రుణ మంజూరు లక్ష్యాలను అధిగమించినట్లు చూపించారు. -
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ‘బెస్ట్ అవైలబుల్’కు దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నిర్వహించే బెస్ట్ అవైలబుల్ మోడల్ స్కూల్స్ పథకంలో నూతన పాఠశాలల ఎంపిక కోసం ప్రసిద్ధ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం వివరాలు వెల్లడించారు. స్టేట్బోర్డు/సెంట్రల్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలు గత ఐదేళ్లలో 7, 10వ తరగతుల్లో 90 శాతం కంటే ఎక్కువ ఫలితాలు, 50 శాతం కంటే ఎక్కువ మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. విశాలమైన గదులు, వసతి, క్రీడా మైదానం, క్రీడా పరికరాలు, పాఠశాల లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కలిగి ఉండాలని వివరించారు. అర్హత కలిగిన అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, 50 శాతం కంటే ఎక్కువ సాధారణ సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన పాఠశాలలు మార్చి 25వ తేదీ వరకు కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభమణుగూరు టౌన్: హైదరాబాద్లోని దోమలగూడ ప్రభుత్వ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల ఆటల పోటీల్లో మణుగూరు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 17న క్రీడలు జరగ్గా మణుగూరు భవిత స్కూల్ విద్యార్థులు దుర్గా భవాని, అనిత లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండో, మూడో స్థానాలు సాధించారు. బహుమతులు అందుకున్నారు. ఈ మేరకు భవిత పాఠశాల నిర్వాహకురాలు నాగజ్యోతి బుధవారం వివరాలు వెల్లడించారు. తునికాకు టెండర్ల గడువు పొడిగింపుపాల్వంచరూరల్: తునికాకు సేకరణ కోసం అటవీశాఖ ఈ ఏడాది మూడు విడుతలుగా టెండర్లు పిలిచింది. కేవలం సగం యూనిట్లకే టెండర్లు ఖరారు కాగా, మిగిలిన యూనిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బుధవారం షార్ట్ టెండర్లును పిలిచింది. 4వ విడత టెండర్ గడువు ఈ నెల 20 నుంచి 24 వరకు, 5వ విడత గడువు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు ఉంటుందని డీఎం తెలిపారు. మూడు విడుతల్లో 16 యూనిట్లే.. ఈఏడాది ఇప్పటివరకు మూడు విడుతలుగా టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 31 యూనిట్లకు టెండర్లు పిలువగా, ఇప్పటివరకు 16 యూనిట్లకే టెండర్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం డివిజన్లో రెండు యూనిట్లు, సత్తుపల్లి డివిజన్లోని 3 యూనిట్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు విడతల టెండర్లలోనైనా దరఖాస్తులు వస్తాయని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు ఎదురుచూస్తున్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● పదో తరగతి ఫలితాల మెరుగుకు సమీక్ష సూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి ఎంఈఓలు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో ఆన్లైన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల్లో గుర్తించి వివరాలు అందజేయాలన్నారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామస్థాయిలో మహిళా సమాఖ్య సభ్యులు కూడా విద్యార్థుల విజయంలో భాగస్వాములు కావాలని చెప్పారు. అవసరమైతే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఆకాంక్షిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రశ్నాపత్రాలు, పాఠ్యసామగ్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులను సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో అనుసంధానం చేయాలని, అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో బాలికల మరుగుదొడ్లు ఉండాలని ఆదేశించారు. 30 ఏళ్లలోపు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణుల వివరాలు, వారి ఉపాధి, వృత్తి సమాచారంతో వీఓఏలు సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
ములకలపల్లి, (అన్నపురెడ్డిపల్లి): పిట్టలను వేటాడేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదశాత్తూ చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అబ్బుగూడెం గ్రామానికి చెందిన గిరికె కృష్ణయ్య (52) మంగళవారం సాయంత్రం సమీపంలోని చెరువు వద్దకు పిట్టలను పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. చెరువు కట్టపై కృష్ణయ్య చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కానరాలేదు. బుధవారం కృష్ణయ్య మృతదేహం చెరువులో తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. పిట్టల కోసం చెరువులో దిగి, ప్రమాదవశాత్తూ నీటిలో మునిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయసింహారెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతిపినపాక: విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన మండలంలోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీ కొత్తరెడ్డిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తుమ్మ సంజీవరెడ్డికి చెందిన గేదె మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ తగలి, షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.1.20లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేతభద్రాచలంటౌన్: ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పశువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒక కంటైనర్లో 75 పశువులను తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఇవ్వాలని ఘర్షణ పాల్వంచ: కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడి ఓడిపోవడం వల్ల భారీగా నష్టం వచ్చిందని, ఆ నగదు ఇవ్వాలని ఘర్షణకు దిగడంతో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. 37 డివిజన్ సీతారాంపట్నంలో స్వతంత్య్ర అభ్యర్థి ఉబ్బన ధనలక్ష్మి ఓడిపోవడానికి కారణం అయ్యాడని ఆమె తరఫున కొందరు 17వ తేదీన బొల్లేరుగూడెంనకు చెందిన బూరుగుపల్లి ప్రసాద్రావు ఇంటివద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. ఎన్నికల్లో నిలబెట్టి, రూ.30 లక్షల వరకు ఖర్చు చేయించి, చివరికి ధనలక్ష్మికి కాకుండా మరో అభ్యర్థికి మద్దతు ప్రకటించావని, తాము ఓడిపోవడంతో భారీగా నష్టపోయామని, ఖర్చు అయిన డబ్బులు ఇవ్వాలని గొడివ పడి బెదిరించారు. ప్రసాద్రావు ఫిర్యాదు మేరకు వాడపల్లి మహేశ్, నవీన్, కొప్పుల వెంకన్న, కాల్వ రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. గుర్తుతెలియన వాహనం ఢీకొని దుప్పి మృతిచుంచుపల్లి: రామవరం అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం దుప్పి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి దాటుతుండగా భారీ వాహనం ఢీకొట్టి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ సీహెచ్ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
ఎట్టకేలకు స్నాక్స్..
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి విద్యార్థులకు ఎట్టకేలకు మంగళవారం నుంచి స్నాక్స్ అందిస్తున్నారు. జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు గత డిసెంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు అలసిపోతారనే ఉద్దేశంతో ఏటా విద్యార్థులకు స్నాక్స్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్నాక్స్ నిధుల మంజూరులో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా జాప్యం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో స్థానికంగా దాతలను ఎంపిక చేసుకుని పిల్లలకు స్నాక్స్ అందజేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల స్నాక్స్కు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం జనవరిలో ప్రకటించింది. కానీ అమలు మాత్రం మంగళవారం నుంచి చేస్తోంది. డిసెంబర్ నుంచే అమలు చేసి ఉంటే విద్యార్థులకు ఎంతో మేలు జరిగేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పరీక్షలు దగ్గర పడే సమయంలో కంటి తుడుపు చర్యగా ఇప్పడు ఇవ్వడం సరికాదంటున్నారు. పల్లీ పట్టి, మరమరాలతోనే సరి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 కేటాయించింది. దీంతో పల్లీపట్టిలు, మరమరాలు, బిస్కెట్లు మాత్రమే అందజేస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలోనైనా విద్యార్థులకు బలం చేకూర్చే పౌష్టికాహారం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మొలకెత్తిన గింజలు, రాగి జావ, టిఫిన్ వంటివి కూడా అందజేశారు. కానీ ప్రస్తుతం సాధారణ స్నాక్స్ అందజేయడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉండాలి గతంలో పాఠశాలల్లో కరాటే శిక్షణకు సంబంధించిన డబ్బుల విషయంలో గందరగోళం నెలకొని ఓ హెచ్ఎం అవినీతి బయటపడింది. ప్రస్తుత స్నాక్స్ డబ్బులు కూడా పక్కదారి పట్టకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. స్నాక్స్ పంపిణీపై డీఈవోతోపాటు జిల్లా కో ఆర్డినేటర్లు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరముంది. కాగా ఈ ఏడాది కూడా ఇన్చార్జ్ల పాలనతోనే జిల్లా విద్యాశాఖ నెట్టుకొస్తోంది. పదో తరగతి ఫలితాలు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి. జిల్లాలో ఈ ఏడాది ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 12,731 మంది బాలబాలికలు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రైవేటు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా జిల్లాలోని 101 జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో 3,395 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి 19 రోజుల స్నాక్స్ కోసం ప్రభుత్వం రూ.9.67 లక్షలు విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున కేటాయించింది. కాగా, ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయి. వచ్చే నెల 14 నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. -
ఆయుష్ కేంద్రంలో తనిఖీ
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ ఆయుష్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. హెల్త్, వెల్నెస్తోపాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ను మరింత బలోపేతం చేయాలని, గర్భిణుల ఏఎన్సీ నమోదు శాతం పెంచాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలలో ఆరోగ్య విద్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గుర్తింపుతోపాటు స్క్రీనింగ్ చేపట్టాలని అన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దమ్మపేట: సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పి.అభిలాష్, ఎం.మనోజ్కుమార్ జిల్లాస్థాయిలో జరిగిన ఖో–ఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని ప్రిన్సిపాల్ పూనెం వీరస్వామి బుధవారం వెల్లడించారు. శిక్షణ ఇచ్చిన పీఈటీలు పద్దం ప్రసాద్, బుచ్చయ్యను ప్రత్యేకంగా అభినందించారు. క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఈఎస్ఏ) నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఈఎస్ఏ రాష్ట్ర సెక్రటరీ కృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి డి.పుల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రసాద్, ట్రెజరర్ రంగప్రసాద్, టీజీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా నాయకులు అనంత రామకృష్ణ, శంకర్, అంజద్ పాషా, ప్రభాకర్, శిరీష, స్వర్ణ, రామకృష్ణ, రామ్నరేష్, మణిధర్, కట్టా రామకృష్ణ, వీరభద్రం, డీవీ, హుస్సేన్, ఆదినారాయణ, శివ, హుస్సేన్, రషీద్, హచ్యా పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు టేకులపల్లి: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో మండలంలోని లచ్చతండా గ్రామానికి చెందిన భూక్య బాలాజీకి ఇల్లెందు కోర్టు జడ్జి రెండు రోజలు సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతున్న దాస్తండా పంచాయతీ లచ్చతండా గ్రామానికి చెందిన భూక్య బాలాజీని బ్రీత్ అనలైజర్తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నాడని తేలింది. అతడిని ఇల్లెందు స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరు పరచగా.. పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఎరువుల బస్తా రూ. 2 వేలు
14:35:14 రూ.2,150బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వానాకాలం సీజన్ కంటే బస్తాకు రూ. 150 నుంచి రూ. 250 వరకు పెరిగాయి. వానాకాలం సీజన్ మాదిరే ప్రస్తుత యాసంగిలో కూడా సరిపడా యూరియా దొరకటం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వస్తోంది. ధరలు అమాంతం పెరిగిపోవటంతో ఆర్థికభారం పడుతోంది. ఎకరాకు రూ. 2వేల వరకు పెట్టుబడి పెరుగుతోంది. నియంత్రణ చర్యలతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం యూరియా ధరలో రాయితీని భరిస్తోంది. యూరియా అధిక వినియోగంతో పొలాల్లో భూసారం దెబ్బతింటోందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అటు రాయితీ భారం, ఇటు భూసారం దెబ్బతింటున్నాయనే కారణంతో ప్రభుత్వం యూరియా సరఫరాలో నియంత్రణ విధించింది. రాష్ట్రాలకు సరఫరా చేసే యూరియాలో కోతలు పెడుతోంది. వానాకాలం సీజన్లో రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడ్డారు. యాసంగి సీజన్లో అలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం యూరియా విక్రయాల కోసం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్, సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవటం, ఓటీపీలు చెప్పటం రానటువంటి రైతులు యూరియాపై ఆశలు వదులుకుంటున్నారు. ఎక్కువ ధరలైనా కాంప్లెక్స్ ఎరువులు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎరువుల దుకాణాల వద్దకు వెళితే ధరల షాక్ కొడుతోంది. 5.40 లక్షల బస్తాలు అవసరం జిల్లాలో యాసంగి సీజన్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. కనీసంగా ఎకరాకు మూడు బస్తాల చొప్పున కాంప్లెక్స్ ఎరువులు వినియోగించిన 5.40లక్షల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. బస్తాకు రూ.200 చొప్పున పెరిగిన ధరలతో జిల్లా రైతులపై రూ 10.80 కోట్ల భారం పడుతుంది. అటు యూరియా దొరకక, ఇటు కాంప్లెక్స్ కొనలేక రైతులు అగచాట్లు పడుతున్నారు. కాంప్లెక్స్ ధరలను కొంతమేర తగ్గించి పెట్టుబడి భారం తగ్గించాలని రైతులు కోరుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగటంతో వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలను తగ్గిస్తేనే రైతులు కోలుకునే పరిస్థితులుంటాయి. – మల్లికంటి వెంకటేశ్వర్లు, రైతు, భాస్కర్నగర్వానాకాలం 14:35:14 బస్తా ధర రూ.1850కు కొన్నాం. ఇప్పుడు అదే బస్తా ధర రూ.2,150 చేరింది. పెరిగిన ధరలతో కాంప్లెక్స్ బస్తాలు కొనలేకపోతున్నాం. యూరియా ఆలైన్ బుకింగ్తో ఇబ్బందులు పడుతున్నాం. – బాసిబోయిన గంగరాజు, రైతు, బూర్గంపాడు వానాకాలం సీజన్లో రూ.1,900 ఉన్న 14:35:14 ఎరువుల బస్తా ప్రస్తుతం రూ.2,150కు పెరిగింది. రూ. 1,300 ఉన్న 20:20:013 కాంప్లెక్స్ ఎరువు బస్తా ప్రస్తుతం రూ.1,475కు చేరింది. నెల క్రితం వరకు రూ.1,800 ఉన్న 28:28:0:13 బస్తా ధర ప్రస్తుతం రూ.1,950కు చేరింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా బస్తాకు రూ.150 నుంచి రూ.250 వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీతో డీఏపీ ఎరువు మాత్రం రైతులకు ప్రస్తుతం రూ.1,450కు అందుతోంది. పొటాష్, కాల్షియం ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం యూరియాపై రాయితీ ఇచ్చి కాంప్లెక్స్ ఎరువులలో అంతకు రెట్టింపు తమ వద్ద వసూలు చేస్తున్నారని రైతులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం చేసేదెట్టా అని రైతుల ఆవేదన -
బీటీపీఎస్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
మణుగూరురూరల్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు బీటీపీఎస్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి మాట్లాడుతూ.. బీటీపీఎస్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న బీటీపీఎస్ సీఈ బిచ్చన్న ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించారు. సీఈ ఆదేశాలతో ఏడీఎం మురళీకృష్ణ, ఎస్ఈలు శ్రీనివాసరావు, రమేశ్బాబు చర్చల్లో పాల్గొని.. సోమవారంలోపు పెండింగ్ జీతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గద్దల శ్రీనివాస్, కొడిశాల రాములు, సత్రంపల్లి సాంబశివరావు, సాయికృష్ణ, సత్యనారాయణ, ఎగిడి రవి, భిక్షపతి, నాగరాజు, సూర్య రమేశ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
సస్యరక్షణతో చీడపీడల నివారణ
ఇల్లెందురూరల్: మామిడిలో సమగ్ర సస్యరక్షణతో చీడపీడలను నివారించుకోవచ్చని ఇల్లెందు హార్టికల్చర్ అధికారి బి.స్రవంతి సూచించారు. మామిడిలో పూత దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆమె పలు సూచనలు చేశారు. మామిడిలో పూతను కాపాడుకోవడానికి సరైన సమయంలో మందులు పిచికారీ చేయాలని సూచించారు. రసం పీల్చు పురుగు, బూడిద తెగులు నివారణతో మొగ్గలు రావడానికి, అవి విచ్చుకోవడానికి లీటరు నీటికి 2 మి.లీ. మోనోకొటోఫాస్, 3 గ్రాములు వెట్టబుల్ సల్ఫర్, 10 గ్రాములు 19:19:19 కలిపి పిచికారీ చేయాలన్నారు. తెల్లపూత దశలో మందులు పిచికారీ చేయొద్దని, నీటి తడులు అందించొద్దని సూచించారు. పురుగు పూతను గూడుగా ఏర్పర్చుకొని, పూతను తిని పిందెలు ఏర్పడకుండా చేస్తుందన్నారు. ఈ పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పూల గుత్తులపై పిచికారీ చేయాలని చెప్పారు. చల్లని రాత్రులు, వెచ్చని పగటి వాతావరణంలో పువ్వు కాడలపై, పూల మీద తెల్లని పొడ లాంటి బూజు ఏర్పడుతుందని, దీని నివారణకు పూలమొగ్గలు కనిపించిన దశలో లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలన్నారు. పూత దశలో బూడిద తెగులు కనిపిస్తే లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మిలీ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా డైనోకాప్ 1 మి.లీ చొప్పున కలిపి పూత కాడలు తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. పూత మాడు తెగులు నివారణకు మొగ్గ బయటకు వచ్చే దశలో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, పచ్చిపూత మీద 1 గ్రాము కార్భండాజిమ్ లేదా 1 గ్రాము ఽథయోఫినైట్ మిథైల్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. -
కూరగాయల సాగుకు రూ.9,600 సబ్సిడీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కూరగాయలు పండించే రైతులకు ఎకరానికి రూ.9,600 సబ్సిడీని ప్రకటించింది. విత్తనాలు, నాటే మొక్కలు, సాగు ఖర్చులకు ఈ సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడుతుంది. కాగా, అర్హులైన రైతులు ఉద్యాన శాఖ ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖా అధికారి జంగా కిశోర్ కోరారు. సబ్సిడీ కోసం సపీపంలోని ఉద్యాన అధికారి లేదా మండల స్థాయి ఉద్యాన అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
నిబంధనలకు నీళ్లు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్కు సంబంధించిన నిర్మాణాలు ఇసుక లారీల కారణంగా ప్రమాదంలో పడ్డాయి. కళ్లెదుటే నష్టం జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు (కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు స్థిరీకరణ) గోదావరి నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. మొత్తం 16 ప్యాకేజీలుగా పనులు విభజించారు. ఇప్పటికే రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రాజెక్టు ఫలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు దక్కలేదు. అంచనా వ్యయం రూ. 8 వేల కోట్ల నుంచి ఏకంగా 19 వేల కోట్లకు పైకి చేరుకుంది. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పూర్తయితేనే కొద్దొగొప్పో ఈ ప్రాజెక్టు కారణంగా ప్రయోజనం నెరవేరేది. కానీ, అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు ద్వారా అందే ప్రయోజనాలకు ఎసరు పెట్టే పని మొదలైంది. ఇప్పుడు గుంతలు.. రేపు కుంగుబాటు గోదావరి తీరం వెంబడి అశ్వాపురం మండలంలో సీతమ్మసాగర్ బరాజ్ నిర్మించే కుమ్మరిగూడేనికి ఎగువన రామ్నగర్ వద్ద టీజీఎండీసీకి సంబంధించిన ఇసుక ర్యాంప్ ఉంది. అక్కడ ఇసుక నింపుకున్న లారీలు కుమ్మరిగూడెం చేరుకుని, అక్కడి నుంచి 9 కి.మీ మేర సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజీ–1లో ఉన్న ట్రంక్ కెనాల్ గుండా ప్రయాణం చేసి ఏటూరునాగారం – మణుగూరు – ఎన్హెచ్ 30 (విజయవాడ – జగ్దల్పూర్) రోడ్డుకు చేరుకుంటున్నాయి. సాధారణంగా ఇసుక లారీల బాడీ వెయిట్, లోడ్ వెయిట్తో కలుపుకుని కనిష్టంగా 50 టన్నులకు పైగా బరువుతో ఉంటాయి. హెవీ లోడు కారణంగా అత్యంత పటిష్టమైన జాతీయ రహదారి మీదనే గోతులు, గుంతలు పడుతున్నాయి. అలాంటిది, కాలువ ఎగువ భాగంలో ఉన్న సాధారణ మట్టిరోడ్డు మీదుగా వెళ్లడం వల్ల కెనాల్ మనుగడ ప్రమాదంలో పడుతోంది. బాధ్యత ఎవరిది ? మొండికుంట–మణుగూరు ఆర్అండ్బీ రోడ్డుకు దగ్గరల్లో కెనాల్ ఒడ్డు మీదనే వెయింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ తూకం వేసుకునేందుకు వందలాదిగా హెవీ లోడ్ లారీలు కెనాల్ మీదనే బారులుదీరుతున్నాయి. ఈ లోడ్ కారణంగా కెనాల్ పటిష్టత దెబ్బతింటోంది. ఇసుక లారీల వల్ల జరుగుతున్న నష్టానికి బాధ్యులు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే ప్యాకేజీ–1కి సంబంధించిన నిర్మాణం ప్రమాదంలో పడుతుంటే జిల్లా యంత్రాంగం మిన్నకుండిపోతోంది. ఈ అంశంపై సీతారామ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాసరెడ్డి వివరణ కోరగా.. కెనాల్ మీదుగా హెవీ లోడ్ వెహికల్స్ తిరిగేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇసుక లారీలు నడుస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టులో 1 నుంచి 8 ప్యాకేజీలకు సంబంధించిన పనులు రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ఇందులో 104 కి.మీ ప్రధాన కాలువతో పాటు మూడు పంప్హౌస్లు, విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొదటి ప్యాకేజీ కింద 10.40 కి.మీ పొడవైన కాలువ నిర్మించారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం–దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామాల మధ్య నిర్మించే సీతమ్మ సాగర్ బరాజ్ నుంచి నీటిని ఒడిసి పట్టి బీజీ కొత్తూరు దగ్గరున్న మొదటి పంప్హౌస్కు ఈ కాలువ ద్వారానే నీటి సరఫరా చేస్తారు. ఈ కాలువ మెయింటెనెన్స్ కోసం ఇరువైపులా మట్టి రోడ్డు (ఒక వైపు కొంత మేర సిమెంట్ రోడ్డు ఉంది) నిర్మించారు. బరాజ్ నుంచి మొదటి పంప్హౌస్ వరకు నీరు గ్రావిటీ ద్వారా వచ్చేందుకు వీలుగా సాధారణం కంటే ఎక్కువ లోతుగా కెనాల్ నిర్మించారు. అయితే కీలకమైన కెనాల్ భవిష్యత్ ప్రశ్నార్థకం చేసేలా రోజూ హెవీలోడుతో వందలాది ఇసుక లారీలు తిరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ కాలువలకు ఇసుక లారీల ముప్పు -
రంజాన్ ఆగమనం..
33 ఏళ్ల తర్వాత.. ఈ ఏడాది రంజాన్ మాసానికి ఒక చారిత్రక ప్రత్యేకత ఉంది. దాదాపు 33 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంటే సుమారు 1992 – 93 కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఫిబ్రవరి మాసంలోనే రంజాన్ రావడం విశేషం. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని గమనంపై ఆధారపడి ఉండటం వల్ల ఏటా పది రోజులు ముందుకు జరుగుతూ మూడు దశాబ్దాలకు పైగా కాలచక్రాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఫిబ్రవరి నెలకు చేరింది. మండుటెండల ప్రభావం లేకుండా చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈసారి ఉపవాస దీక్షలు సాగడం ముస్లింలకు గొప్ప ఊరటనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, వ్యవసాయదారులు ఈ చల్లని వాతావరణంలో ఉపవాసం ఉంటూనే పనులు చేసుకోవడం సులభతరమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనలకు మసీదులు ముస్తాబు.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలైంది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు వంటి ప్రధాన పట్టణాల నుంచి కరకగూడెం వంటి మారుమూల గ్రామాల వరకు ప్రతి మసీదును రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. మసీదుల గోపురాలు, ప్రాంగణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. స్థానిక మసీదు కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశాయి. వజూ కోసం నీటి సౌకర్యం, రాత్రి ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు మసీదుల వద్ద స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ, పరిసరాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేయడానికి దాతలుఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో 110 మసీదులు ఉండగా సుమారు 80 వేల మంది ముస్లింలు ఉన్నారు. జిల్లాలో హిందూ, ముస్లింలు కలసిమెలసి ఈ వేడుకలను జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సౌభ్రాతృత్వం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో మసీదుల నుంచి వినిపించే ప్రార్థనా గీతాలు జిల్లా అంతటా భక్తి భావాన్ని నింపుతున్నాయి. మార్కెట్లలో ఖర్జూరాలు, సేమియా, పండ్ల దుకాణాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా ఇఫ్తార్ విందుల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం జిల్లా గొప్ప సంస్కృతికి నిదర్శనం. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు షురూ విశ్వమానవ సౌభ్రాతృత్వం, క్రమశిక్షణ, దాతృత్వాన్ని చాటిచెప్పే రంజాన్ మాసం వచ్చింది. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం నుంచి ఉపవాస దీక్షలు మొదలు కానున్నాయి. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు (రోజా) కేవలం ఆహార త్యాగానికి చిహ్నం మాత్రమే కాదు. ఆకలి విలువను తెలుసుకుంటూ నిరుపేదలకు అండగా నిలిచే గొప్ప జీవన సూత్రం. ఈ పవిత్ర మాసంలో ఖురాన్ పఠనం, జకాత్ (దానధర్మాలు), రాత్రి వేళల్లో సాగే ప్రత్యేక తరావీహ్ ప్రార్థనలతో ప్రతి ఇల్లు, ప్రతి మసీదు ఆధ్యాత్మిక నిలయంగా మారనున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ముస్లిం కుటుంబాలు తెల్లవారుజామునే లేచి ‘సహర్’ ముగించుకుని తమ కఠిన దీక్షలకు శ్రీకారం చుట్టారు. – కరకగూడెంపవిత్ర రంజాన్ మాసం అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్ప అవకాశం. ఈ నెలలో ఖురాన్ అవతరించింది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత. ఉపవాసం (రోజా) మనిషిలో సహనాన్ని, క్రమశిక్షణను పెంచుతుంది. మన సంపాదనలో కొంత భాగాన్ని ‘జకాత్’ రూపంలో పేదలకు పంచడం ద్వారా సమాజంలో సమానత్వం సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నెలలో దైవచింతనతో గడుపుతూ, తోటి మనుషుల పట్ల దయతో ఉండాలి. 33 ఏళ్ల తర్వాత మరలా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో రంజాన్ రావడం అల్లాహ్ కరుణగా భావిస్తున్నాను. –మౌలానా మొహమ్మద్ ఫిరోజ్, కరకగూడెం జామ మసీదు ఇమామ్ -
మార్చి 4 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మార్చి 4, 5, 6 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో డీసీసీబీ విస్తరించి ఉండగా 50బ్రాంచీల ద్వారా సేవలను విస్తృతం చేసేందుకు 99 స్టాఫ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి బ్యాంకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఐబీపీఎస్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్) సంస్థ ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. పీఏసీ ఎస్ల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇన్ సర్వీస్ కింద 25శాతం అవకాశం కల్పించారు. మార్చి మొద టి వారంలో సర్టిఫికెట్లు పరిశీలించి ఏప్రిల్ మొదటి వారంలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. -
ఇల్లెందులోనూ కొలువుదీరారు..
ఇల్లెందు : ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ముగిసింది. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నడుమ కార్యక్రమం చేపట్టగా.. ఇతరులను లోనికి అనుమతించకుండా వేడుకలను చూసేలా బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన వారు సకాలంలో హాజరుకాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం 19 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఒక రెబల్, ఒక స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి మధు అక్షర క్రమంలో వారితో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కార్యక్రమానికి హాజరయ్యారు. చైర్పర్సన్గా కిరణ్ మిత్రా.. ప్రమాణ స్వీకారం అనంతరం టీపీసీసీ అందజేసిన సీల్డ్ కవర్ను ఎమ్మెల్యే కనకయ్య తెరిచి రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్పర్సన్గా, 17వ వార్డు నుంచి విజయం సాధించిన పెండేలా రాజు(మార్కెట్ రాజు)ను వైస్ చైర్మన్గా ప్రకటించారు. కిరణ్మిత్రాను 21వ వార్డు కౌన్సిలర్ నీలపు రమేష్ ప్రతిపాదించగా, 7వ వార్డు కౌన్సిలర్ గోపగాని రాజుగౌడ్ బలపర్చారు. రాజును మూడో వార్డు కౌన్సిలర్ అజ్మీరా వంశీ ప్రతిపాదించగా 24వ వార్డు కౌన్సిలర్ శనిగరపు శృతి బలపర్చారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్లకు ఎన్నికల అధికారి ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు సేవలందిచడంతో పాటు ఇల్లెందు అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. రాజకీయాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమం, అభివృద్ధిని సమ పాళ్లలో అందించాలని కోరారు. ఆ తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లందరినీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, మేనేజర్ అంకుషావళీ, డీఈ మురళీ, ఆర్ఐ శ్రీనివాస్తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ బయోడేటా.. పేరు : కిరణ్ మిత్రా దొడ్డాభర్త : దొడ్డా డానియేల్ (పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు) పిల్లలు : ఆర్డర్ అనిరుధ్, రోహిత్ విద్యార్హత : ఎంఏ, బీఈడీ వృత్తి : ప్రైవేట్ టీచర్ పుట్టిన తేదీ : 29.05.1980 నివాసం : ఇల్లెందులపాడు, 2వ వార్డు -
ఇసుక రవాణాను అడ్డుకున్న సర్పంచ్
పాల్వంచరూరల్: అర్ధరాత్రి కిన్నెరసాని వాగు నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వప్న మరో ఇద్దరు వార్డు సభ్యులతో కలిసి అడ్డుకున్నారు. మండలంలోని నాగారం సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి మంగళవారం రాత్రి ఇసుక తరలిస్తుండగా వార్డు సభ్యులు రంజిత్, లక్ష్మి, అంగోతు లచ్చుతో కలిసి సర్పంచ్ స్వప్న ఘటనా స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న ఉపేందర్ తనపై, తనతోపాటు వచ్చిన పవన్పై దాడికి యత్నించాడని, దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించాడని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టుకోని అధికారులు.. కాగా, కిన్నెరసాని వాగులో జేసీబీతో ఇసుక తోడి తరలిస్తున్నట్లు సర్పంచ్ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేసీబీని సీజ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
బూర్గంపాడు: రూ. 2 కోట్ల బీమా సొమ్ము కాజేసేందుకు యువకుడిని హతమార్చాలని యత్నించిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఐ మేడ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. మండలంలోని మోతె పట్టీనగర్ సమీపంలో ఈనెల 14న కట్టా యశ్వంత్ను ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో తలపై దారుణంగా కొట్టి గాయపర్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మంగళవారం కారులో పరారవుతుండగా సారపాక వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. ఏపీలోని గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్ పేరున రూ. 2 కోట్లకు బీమా చేసి, నామినీగా అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్ పేరు పెట్టారు. భద్రాచలంలోని ఓ బ్యాంక్లో ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్గా ఉన్న భానుప్రకాశ్ ఈ వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించాడు. సాయిదీపక్, భానుప్రకాశ్ పథకం ప్రకారం గత నవంబర్లో యశ్వంత్ పేరున బీమా చేయించి రూ.2లక్షల ప్రీమియం చెల్లించారు. నాటినుంచి యశ్వంత్తో స్నేహంగా ఉంటూనే హతమార్చాలని, తద్వారా రూ.2 కోట్ల బీమా సొమ్ము కాజేయాలని కుట్ర చేశారు. ఈ క్రమంలో ఈనెల 14న ముగ్గురూ కలిసి మద్యం సేవించాక యశ్వంత్ తలపై రాడ్లతో కొట్టి హత్యాయత్నం చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డుపై పడేశారు. బాధితుడిని వారే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ప్రయత్నించారు. వారి ప్రవర్తనపై అనుమానంతో బాధితుని కుటుంబ సభ్యులు సాయిదీపక్, భాను ప్రకాశ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.బీమా సొమ్ము కాసేందుకు పన్నాగం -
సేంద్రియ రైతు లక్ష్మీరెడ్డికి కలెక్టర్ అభినందన
బూర్గంపాడు: సేంద్రియ పద్ధతుల్లో మూడేళ్లుగా మిర్చి సాగు చేసి, నాణ్యమైన దిగుబడి సాధిస్తున్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శరైతు యారం లక్ష్మీరెడ్డిని మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు. నాణ్యమైన ఆహార ఉత్పత్తుల కోసం రైతులు వ్యవసాయంలో సేంద్రియ పద్ధతులు ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. లక్ష్మీరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పుస్తక పఠనంతో విజ్ఞానం టేకులపల్లి: పుస్తకపఠనంతో విజ్ఞానం సంపాదించుకోవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. మంగళవారం టేకులపల్లి లైబ్రేరియన్ ఆర్.నాగన్న ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువతీయువకులతో కలిసి ఏర్పాటు చేసిన పుస్తక ప్రియుల పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని, గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రియులు, కవి, సామాజిక వేత్త, గ్రంథాలయంతో 50 ఏళ్ల అనుబంధం ఉన్న చాగంటి కృష్ణమూర్తి, వీరబాబు, ఆర్.నాగన్నను సన్మానించారు. కార్యక్రమంలో రత్తయ్య, ఉప్పు దీప్తి, బొడ్డుపల్లి బ్రహ్మచారి, మోహన్, బసవమ్మ, బాబూరావు, శంకర్, ప్రభు, నోముల భానుచందర్, కిరణ్, మూడ్ గణేశ్, అనూష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్నకు భద్రాద్రి విద్యార్థులు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.రాము, జి.లక్ష్మణ్ రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10న జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో వీరిద్దరూ (సోదరులు) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులు, పీడీ ఎం.రమేశ్ను హెచ్ఎం జి.పద్మజ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. భూమి ఆక్రమించుకున్నారని ఆవేదన కారేపల్లి: జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కింద కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాక రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులతో కలిసి గలిగ పాపమ్మ తదితరులు మంగళవారం మాట్లాడారు. 2003లో లొంగిపోయిన పాపమ్మకు కమలాపురం సర్వే నంబర్ 147లో 4–37ఎకరాల భూమి కేటాయించగా, అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పట్టా అందజేశారు. ఈ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకోగా పోలీసులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందన్నారు. అయినా ఆగకుండా ఓ గిరిజన రైతు ద్వారా దాడులకు దిగుతున్నారని, మరికొందరి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో పేర్లు మార్పించారని వాపోయారు. ఈమేరకు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పాపమ్మ తదితరులు కోరారు. ఈ సమావేశంలో నాయకులు అలెం కృష్ణ, కల్తి రాంప్రసాద్, ఈసం భాస్కర్, గలిగ జయమ్మ పాల్గొన్నారు. రేపు జాబ్మేళా ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. పేటీఎం సేల్స్ అండ్ సర్వీసెస్లో వంద ఉద్యోగాల భర్తీకి టేకులపల్లిలోని మోడల్ కేరీర్ సెంటర్లో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హతలు, ఇతర వివరాల కోసం 98667 71213 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక మంగళవా రం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రామయ్యను దర్శించుకున్న ఆదిలాబాద్ జడ్జిభద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆదిలాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి కె. ప్రభాకర్ రావు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీ–హబ్ ద్వారా పరీక్షలు చేయించాలిచుంచుపల్లి: ప్రతీ నెల పీహెచ్సీ స్థాయిలో క్షయ బాధితులకు టీ–హబ్ ద్వారా పరీక్షలు చేయించాలని, అందుకోసం ప్రత్యేక క్లినిక్లను నిర్వహించాలని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలో టీబీ కేర్ అంశంపై జిల్లాలోని వైద్యాధికారులు, ఎన్టీఈపీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆ తర్వాత కొత్తగూడెం, పాల్వంచలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వి.సుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగలక్ష్మి, సిబ్బంది పుల్లారెడ్డి, మోహన్ పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి ఇల్లెందురూరల్: ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ తుకారాం సూచించారు. ఇల్లెందులోని పలు బస్తీ దవాఖానాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఇల్లెందు, గుండాల, టేకులపల్లి మండలాల పరిధిలోని ఏఎన్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమతుల ఆహారం ప్రాముఖ్యతపై ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్కు ముందడుగుభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనుల కోసం మంగళవారం ఆలయ పరిసరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. సుమారు రూ. 534 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి, ఆర్కిటెక్ట్ నవనీత్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మార్కింగ్ చేపట్టారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్యత్లో ఆలయం చుట్టూ నిర్మించబోయే భవన సముదాయాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసే మాఢ వీధులు ఎక్కడి వరకు విస్తరిస్తాయనే అంశాన్ని గుర్తించి, తదుపరి కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదరావు, ఈఈ రవీందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. యాప్ ద్వారానే యూరియాఇల్లెందురూరల్: యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని డీఏఓ బాబూరావు రైతులకు సూచించారు. మండల, పట్టణ పరిధిలోని యూరియా విక్రయ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్లో నమోదు కాకుండా ఒక్క బస్తా కూడా విక్రయించొద్దని వ్యాపారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 22,310 మంది రైతులు యాప్లో బుకింగ్ చేసుకొని 90,240 బస్తాల యూరియా కొనుగోలు చేశారని చెప్పారు. పట్టా లేని రైతులకు, కౌలు రైతులకు కూడా యాప్ ద్వారా యూరియా విక్రయిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఓ సతీష్, ఏఈఓ సుమన్ పాల్గొన్నారు. -
ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతా
● గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం ● త్వరలో 60 డివిజన్లలో పర్యటిస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కొత్తగూడెం మేయర్ గణేశ్ కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కృషి చేస్తానని, కార్పొరేషన్ను అభివృద్ధిపథంలో నడిపిస్తానని మేయర్ మూడ్ గణేశ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సమస్యలు గుర్తించామని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ప్రచార సమయంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు..? మేయర్: ఎన్నికల ప్రచారంలో నేను పోటీ చేసిన డివిజన్లో ఇంటింటి పర్యటన సందర్భంగా పలు సమస్యలు గుర్తించాను. డివిజన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి లేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి కొంత ఏరియా ముంపునకు గురవుతోంది. అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతా. సాక్షి: సమస్యల పరిష్కారానికి మీకున్న ప్రణాళిక..? మేయర్: సీసీ రోడ్డు, డ్రెయినేజీలతో పాటు బ్రిడ్జి నిర్మాణ అంశాలను పాలకవర్గ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో పాటు సలహాలు, సూచనలతో కార్యాచరణ రూపొందిస్తాం. సాక్షి: నగరాభివృద్ధి, ప్రధాన సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటారు..? మేయర్: కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారానికి ఎక్కువ నిధులు కేటాయిస్తాం. 60 డివిజన్లలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అంతటా ప ర్యటిస్తా. తద్వారా ఎక్కువ సమస్యలు గుర్తించే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ పరిష్కరించి, ప్రజ లకు సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతాం. సాక్షి: కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినందున అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు ? మేయర్: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆప్గ్రేడ్ కావడమే అభివృద్ధి. ఆ స్థాయికి తగ్గట్టుగా వసతుల కల్పనకు కృషి చేస్తాం. కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలని ప్రజలను కోరుతున్నా. సాక్షి: నగరంలో పాలనపై ప్రణాళిక ఏంటి..? మేయర్: గతంలో ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది. 2019 నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. మండలంలో పాలనకు, ప్రస్తుతం కార్పొరేషన్లో 60 డివిజన్ల పాలనకు వ్యత్యాసం ఉంటుంది. డివిజన్లన్నింటికీ సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా. సాక్షి: పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యపై ఏం చేస్తారు..? మేయర్: నగరంలో ప్రధానంగా పారిశుద్ధ్య, తాగునీటి సమస్య లేకుండా కార్యాచరణ రూపొందిస్తాం. నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తా. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ప్రజల, నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయను. -
కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?
మామిడి చెట్లకు ప్రస్తుతం పూత బాగానే ఉన్నా.. తెగుళ్లు ఆశించి రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ కలిపి 16 పదవులు ఉన్నాయి. ఇందులో జనరల్కు రిజర్వ్ అయినవి కలుపుకుని మొత్తంగా ఒకే సామాజిక వర్గానికి ఐదు దక్కాయని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పదవుల్లో కూర్చోవాలని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు వారితో పాటు, వారి భార్యను కూడా పోటీ చేయించి గెలిచారు. అయినా పదవులు రాక వారు అసంతృప్తితో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇచ్చారని గుసగుసలాడుతున్నా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి మాత్రం వెళ్లగక్కడం లేదు. -
రహదారి నిర్మించాలని ధర్నా
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక నుంచి పర్ణశాల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని మంగళవారం దుమ్ముగూడెం యువత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అఖిలఫక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. ఇసుక లారీలతో ధ్వంసమైన రహదారితో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ యువత.. లక్ష్మీనగరం, ములకపాడు గ్రామాల్లో బంద్తో పాటు రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు. తొలుత లక్ష్మీనగరం నుంచి ములకపాడు వరకు ర్యాలీ చేపట్టి, ములకపాడు సెంటర్లో ధర్నా చేశారు. గుంతలమయంగా మారిన రహదారితో ఎందరో మృత్యువాత పడుతున్నారని, తూరుబాక నుంచి పర్ణశాల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్లో ఆందోళనకారులతో మాట్లాడుతూ.. మరమ్మత్తు పనులు చేపడతామని చెప్పారు. తహసీల్దార్ అశోక్కుమార్, సీఐ వెంకటప్పయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మరమ్మతులు చేపడతామని, రాత్రి సమయంలోనే లారీలు నడిచేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో నాలుగు గంటలపాటు నిర్వహించిన ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు లంకా శ్రీనివాసరావు, కణితి రాముడు, యండీ జానీపాషా, యలమంచి వంశీకృష్ణ, యలమంచి శ్రీనుబాబు, కొమరం చంటి, బొల్లోజు వేణు, రామిరెడ్డి, సోయం కామరాజు, సొందె మల్లూరు, జిలకర చంటి, క్రాంతి పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో అవకతవకలు
సుజాతనగర్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు పాత అంజనాపురం రైతు వేదికలో మంగళవారం జరిగిన ప్రజావేదికలో వెల్లడైంది. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.6 కోట్లతో ఉపాధి హామీ పనులు జరిగాయి. వారం రోజులుగా గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ బృందం సర్వే చేపట్టి.. ప్రజావేదికలో వివరాలు వెల్లడించారు. బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులు, పనులు చేయకుండానే చెల్లింపులు జరిగినట్లు డీఆర్పీలు నివేదికలు చదివి వినిపించారు. పనుల డిమాండ్ కోసం కూలీల వద్ద నుంచి ఎఫ్ఏలు డబ్బులు ఆశించినట్లు తేలింది. క్యాటిల్ షెడ్లు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు చేయకుండానే చేసినట్లు చెల్లింపులు చేశారని, ఒక కుటుంబానికి ఒకే జాబ్ కార్డు ఉండాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కుటుంబాల్లో విచ్చలవిడిగా జాబ్ కార్డులు ఇచ్చారని తెలిపారు. దీంతో సుమారు రూ.13 లక్షల మేర ఈజీఎస్ సిబ్బంది నుంచి రికవరీకి ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రవి, డీవీఓ రమణ, ఎంపీడీఓ బి.భారతి, ఎస్ఆర్పీ సుశీల తదితరులు పాల్గొన్నారు. సుమారు రూ.13 లక్షల మేర రికవరీ -
భారజలం ఉత్పత్తిలో భేష్
మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్కు ఉత్తమ అవార్డుఅశ్వాపురం: భారజలం ఉత్పత్తిలో మణుగూరు భారజల కర్మాగారం ఉత్తమ పనితీరు కనబరిచింది. ఎన్నో ఏళ్లుగా భారజల ఉత్పత్తి, ఎగమతుల్లో అగ్రస్థానంలో ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్లాంట్.. 2025 సంవత్సరానికి గాను ఉత్తమ ప్లాంట్ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్కుమార్ మహంతి, డీఏఈ మాజీ చైర్మన్ ఏఎన్ వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్, భారజల బోర్డు చైర్మన్ సత్యకుమార్ తదితరుల చేతుల మీదుగా మణుగూరు కర్మాగారం జీఎం శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, డి.వి.చారి, విష్ణువర్దన్రాజు, ప్రభాస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని, పరీక్షలు సజావుగా సాగేలా అనుభవజ్ఞులైన ఇన్విజిలేటర్లను నియమించాలని సూచించారు. ప్రశ్న, జవాబు పత్రాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి, భద్రత మధ్య కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బీ సెక్షన్ అమలు చేయాలని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా సాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లనును మూసివేయాలని ఆదేశించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను జాగ్రత్తగా మూల్యాంకన కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని పోస్టల్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రథమ చికిత్స సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలి చుంచుపల్లి: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామ పాలన, బాధ్యతలు, కర్తవ్యాలపై సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకే శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామాలకు అందుతున్న నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని, చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని కోరారు. ప్రతీ గ్రామంలో ఇప్ప పువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపదను అభివృద్ధి చేయాలని చెప్పారు. అనంతరం సర్పంచులకు శిక్షణ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్ కుమార్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, శిక్షకులు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలి, ఏపీఓ రంగ, ఎస్బీఎం రేవతి, డీటీఎం సందీప్, అరుణ్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?
● ఆందోళన చెందుతున్న మామిడి రైతులు ● పూత దశలోనే ఆశిస్తున్న తెగుళ్లు ● రాలిపోతున్న పూత.. మసిబారుతున్న చెట్లు ఇల్లెందురూరల్ : ఉమ్మడి జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటల్లో ముఖ్యమైనది మామిడి. ఫలరాజుగా గుర్తింపు పొందిన ఈ పంట కొంతకాలంగా ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. ప్రస్తుత సీజన్లోనూ రైతులకు నిరాశ తప్పేలా లేదు. ఇప్పుడు పూత బాగానే వచ్చినా అది నిలవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 57వేల ఎకరాల్లో.. ఉమ్మడి జిల్లాలో సుమారు 57 వేల ఎకరాల్లో మామిడితోటలు విస్తరించి ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, పాల్వంచ, టేకులపల్లి, జూలూరుపాడు మండలాల్లో, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల పరిధిలో మామిడి సాగు అధికంగా ఉంది. బంగినపల్లి, దశేరి, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపూరి, చిన్న రసాలు, పెద్దరసాలు తదితర రకాలు సాగు చేస్తున్నారు. ఆశాజనకంగా పూత.. మామిడిలో కొన్నేళ్లుగా నిర్దేశిత సమయానికి ముందుగా లేదంటే ఆలస్యంగా పూత వస్తోంది. సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైతేనే పూత సక్రమంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, మామిడి రకాలను బట్టి డిసెంబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు పూత ఉధృతి పెరుగుతుంది. ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు మామిడికి అనుకూలంగా ఉండడంతో చెట్లకు విపరీతమైన పూత రావడంతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు ఆశగా ఉన్నారు. మంచు ప్రభావంతో తెగుళ్లు.. మామిడి పూత అధికంగానే ఉన్నప్పటికీ.. మంచు ప్రభావంతో చెట్లను తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో తోటల్లో ఎక్కువగా తేనె మంచు, మసి, బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి ప్రభావంతో పూత చాలా వరకు రాలిపోతోంది. కొన్ని చెట్ల ఆకులు నలుపు రంగులోకి మారాయి. తెగుళ్ల నివారణకు రైతులు మూడు, నాలుగు సార్లు మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించక ఆందోళన చెందుతున్నారు. చలికాలంలోనే పూత నిలబడి బటానీ గింజ సైజులో కాయలు ఏర్పడితే ఎండలు ముదిరేకొద్దీ కాయ సైజు పెరిగి అధిక దిగుబడి వస్తుంది. కానీ ఈ దశలోనే తెగుళ్లు ఆశించగా కాయ పక్వానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంత ఆలస్యమైనా ఆశాజనకంగా పూత రావడంతో సంతోషించాం. కానీ పది రోజులుగా మామిడిని తెగుళ్లు ఆశిస్తుండగా పూత రాలిపోతోంది. చెట్లు మసిబారుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. – మంచె కృష్ణయ్య, కొమరారం ఈ సీజన్లో మామిడి పూత ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంది. పూత పిందెగా మారుతున్న దశలో రాత్రి వేళ చలి ప్రభావంతో తెగుళ్లు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పూత నిలిచేలా మందులు పిచికారీ చేయాలి. – కిషోర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు
ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాలాచారిపాల్వంచ: విద్యుత్ వినియోగదారుల అవసరాలు గుర్తించి, అవసరమైన సేవలందిస్తామని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎన్.వి.వేణుగోపాలా చారి అన్నారు. పాల్వంచలోని సబ్ డివిజన్ కార్యాలయంలో పాల్వంచ, ములకలపల్లి మండల విద్యుత్ వినియోగదారుల పరిష్కార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగాపురంలో ఇళ్ల ఎదుట ఉన్న స్తంభాలను పక్కకు జరపాలని, పాండురంగాపురం, సూరారంలో ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని తదితర 22 సమస్యలపై వినియోగదారులు వినతిపత్రాలు అందించారు. అనంతరం వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరించేందుకు తమ సిబ్బంది పనిచేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు కె.రమేష్, ఎన్.దేవేందర్, ఎం.రామారావు, నందయ్య, రెహమూల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
మేయర్ పీఠంపై సీపీఐ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ – కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెందిన మొదటి పాలవర్గం కొలువుదీరింది. దీంతో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లలో గెలిచి అతి పెద్ద పార్టీలుగా అవతరించిన సీపీఐ, కాంగ్రెస్ చెరి రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించాయి. ఆ మేరకు సీపీఐ తరఫున 20వ డివిజన్ నుంచి గెలుపొందిన మూడ్ గణేశ్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తరఫున 8వ డివిజన్ నుంచి గెలుపొందిన సిరిపురం లలితకుమారికి దక్కింది. సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీతో పాటు స్వతంత్రులుగా గెలిచిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది కొత్తగూడెంలోనే ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులతో కలిసి జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లికి వందనం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశారు. సాఫీగా సాగిపోయింది తెలంగాణలో తొలిసారిగా క్యమూనిస్టు పార్టీ నేతృత్వాన కార్పొరేషన్లో పాలకవర్గం ఏర్పాటైంది. అంతకు మూడు రోజుల ముందు దీనిపై రాష్ట్ర స్థాయిలో హైడ్రామా చోటుచేసుకుంది. కార్పొరేషన్ ఎన్నిక ల ఫలితాలు వెలువడిన తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడంతో సీపీఐ – కాంగ్రెస్ పార్టీల నుంచి ‘పవర్ షేరింగ్’ ప్రకటన వచ్చింది. అయితే, అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల నుంచి సంయుక్త ప్రకటన, సమావేశాల వంటివి జరగలేదు. పైగా ఎవరికి వారే అన్నట్టుగా తమ శిబిరాలను కొనసాగించారు. దీంతో ప్రమాణ స్వీకారం రోజున ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.అయితే, నాటకీయ పరిణామాలకు ఇరు పక్షా లు తావివ్వలేదు. పవర్ షేరింగ్ ఒప్పందంలో కీలక భూమిక పోషించిన సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కొత్తగూడెం చేరుకున్నారు. వీరితోపాటు సీపీఐజిల్లా కార్య దర్శి సాబీర్పాషా, డీసీసీ అధ్యక్షురాలు తోటి దేవీప్రసన్న కలిసి సీపీఐ, కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్లతో ఉదయం 11: 30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత మరికొందరు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కూనంనేని కూడా వచ్చారు. అప్పటికే ఇరు పక్షాలు చర్చించుకోవడంతో మేయర్ పదవి సుజాతనగర్ ప్రాంతానికి దక్కగా, డిప్యూటీ మేయర్ పాల్వంచకు వెళ్లింది. కూనంనేని అభినందనలు.. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేశ్ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందిచారు. ఆయనతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా తదితరులు గణేశ్ను మేయర్ సీటులో కూర్చోబెట్టారు. కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రమాణస్వీకారానికి 26వ డివిజన్ నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దుంపల రాజేష్ నల్లబ్యాడ్జీతో హాజరై నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు 22 సీట్లు రావడంతో పాటు ఐదుగురు ఇండిపెండెంట్లు పార్టీలో చేరారని, ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయని తెలిపారు. అవసరమైతే ప్రతిపక్షంగా కూర్చోవాలి తప్ప సీపీఐకి కూడా 22 సీట్లే ఉన్నప్పటికీ పొత్తు ఎందుకుని ప్రశ్నించారు. ఫలితాలు వచ్చే వరకు కూడా వారితో గొడవలు జరిగాయని, ఆతర్వాత ప్రభుత్వం ఏం ఆలోచించిందో కానీ ఎవరిని అడిగినా అధిష్టానం పేరు చెబుతున్నారని తెలిపా రు. అధిష్టానం ఎవరినీ బొంద పెట్టమని చెప్పదని పేర్కొన్నారు. ఈనేపథ్యాన తనను గెలిపించిన ప్రజల కాళ్లు మొక్కి అయినా పనులు మెల్లగా చేయించుకుంటానే తప్ప ఎవరికీ బానిసలుగా పని చేయనని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న మేయర్ గణేశ్ కొత్తగూడెంలో సాఫీగా సాగిన ‘మిత్రపక్షం’ప్రమాణ స్వీకారం -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లో న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్యకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు గేట్ బయట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హన్మంతరావు, చిరంజీవిరావు, పి నాగేశ్వరరావు, కే పుల్లయ్య, మన్మోహన్, ఎర్రపాటి కృష్ణ, శ్రీధర్, మహమ్మద్ సాధిక్ పాషా, మారపాక రమేష్, మహేష్, చిన్నికృష్ణ, విజయ్, రమేష్, ఎర్రా శ్రీను, మధన్మోహన్, కేపి తదితరులు పాల్గొన్నారు. -
●కలిసికట్టుగా ముందుకు సాగుతాం
కొత్తగూడెంఅర్బన్: కార్పొరేషన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న బేదాభిప్రాయాల కారణంగా సీపీఐ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ ఎంతగానో అభివృద్ధి చెందనుందని, హైదరాబాద్ తర్వాత అంతటి విశిష్టత ఇక్కడ ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుందని, బడా కంపెనీలు ఇక్కడికి రావడంతో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో విమానాశ్రయం కూడా రానుందని తెలిపారు. సుపరిపాలన దిశగా ముందుకు సాగాలని నూతన పాలకవర్గానికి సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్, కార్పొరేటర్ల పనితీరు ఉంటుందని, ఈ మేరకు పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పారు. అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా కృషి చేయాలని పాలకవర్గాన్ని కోరారు. -
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళ కూడా చలి ప్రభావం తగ్గుతుంది. కల్లూరు చైర్మన్ : వయసు : 45 సంశ్రీశ్రీ విద్యార్హత : 7వ తరగతి భార్య : గృహిణి, ఇద్దరు పిల్లలు రాజకీయ నేపథ్యం : సామాన్య రైతు కుటుంబానికి చెందిన మోహన్నాయక్ గతంలో హనుమతండా సర్పంచ్గా గెలిచారు. ఈ గ్రామం కల్లూరు మున్సిపాలిటీలో విలీనం కాగా కౌన్సిలర్గా గెలవడంతో చైర్మన్ పదవి దక్కింది. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలంటౌన్: సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇచ్చే గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏపీఓ బి.రాహుల్ అధికా రులకు సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయ న ఆర్జీలు స్వీకరించాక మాట్లాడుతూ.. ప్రతీదరఖా స్తును ఆన్లైన్ చేయడంతో పాటు ప్రత్యేకరిజిస్టర్లో నమోదుచేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పోడు భూములకు విద్యుత్, ట్రైకార్ రుణాలు, రోడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, వైద్య సాయం వంటి అంశాలపై వినతులు వచ్చాయని వివరించారు. పూసుకుంటకు చెందిన వారు ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం, బొజ్జా తండా వారు విద్యుత్ సమస్య, లక్ష్మీపురానికి చెందిన వారు పోడు పట్టాల కోసం వినతులు ఇచ్చారని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశామని చెప్పారు. అధికారులు సమయపాలన పాటించాలి ఐటీడీఏకార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బం ది సమయపాలన పాటించాలని పీఓ రాహుల్ ఆదేశించారు.నూతనంగా ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ హాజ రు నమోదుయంత్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అధి కారులు, సిబ్బంది ఉదయం, సాయంత్రం తప్పనిసరి గా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని, యాప్లో తమపేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విధుల్లోనిర్లక్ష్యం వహిస్తేచర్యలు తప్పవని హె చ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్రాజ్, ఏఓ రాంబాబు, ఈఈశంకరాచార్యులు, వేణు, ఆది నారాయణ, రాజేష్,రామ్కుమార్ పాల్గొన్నారు.గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ రాహుల్ -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వా త స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ పాలనలో వార్డు సభ్యులే కీలకంబూర్గంపాడు: గ్రామపంచాయతీల పాలనలో సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా కీలకమని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ విద్యాలత అన్నారు. బూర్గంపాడులోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల కేటాయింపునకు వార్డు సభ్యుల తీర్మానాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. పాలకవర్గ సమావేశాలకు, గ్రామసభలకు వార్డు సభ్యులు వెళ్లి సమస్యలను తెలియజేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్కుమార్, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య పాల్గొన్నారు. 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని: జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,917.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొ త్తగూడెం జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించినట్లుఏఓ(టెక్నికల్)పవన్కుమార్తెలిపారు. అలా గే, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. -
ఎన్హెచ్లో కోల్పోతున్న 3,400 చెట్లు
టేకులపల్లి: జాతీయ రహదారి 930పీ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలోని చెట్లు కనుమరుగు కానున్నాయి. సోమవారం ఫారెస్టు అధికారులు వృక్షాల లెక్కలు పరిశీలించారు. ఇల్లెందు మండలం నెహ్రూనగర్, టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్ నుంచి సాయనపేట వరకు అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన సుమారు పది హెక్టార్ల మేరకు 3,400 వృక్షాలు జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. గుర్తించిన చెట్లకు మార్కింగ్లు చేశారు. ఎస్డీఓ కరుణాకరాచారి, ఎఫ్ఆర్వో చలపతిరావు, డీఆర్వో వీరబాబు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక
గుండాల: ఈ నెల 23 రాజస్థాన్లో జరిగే ఖేలో ఇండియా ట్రైబల్ మీట్ ఫుట్బాల్ క్రీడలకు గుండాల మండలానికి చెందిన నలుగురు యువకులు ఎంపికయ్యారు. ఈ నెల 7,8 తేదీల్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఫుట్బాల్ క్రీడలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన వంశీ, సాయినపల్లి గ్రామానికి చెందిన తాటి మోహన్, పోలేబోయిన హర్షిత్, చింతలపాడు గ్రామానికి చెందిన ఊకె శ్రావణ్ కుమార్ ప్రతిభ కనబర్చారు. ఐదు రోజులపాటు నిర్వహించే పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నారు. జేఈఈ మెయిన్స్లో ప్రతిభఇల్లెందు: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన జేఈఈ (మెయిన్) పేపర్–1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామానికి చెందిన రవి – విజేతల కుమార్తె గంగాధరణి శ్రీజ ఉత్తమ పర్సంటైల్ సాధించింది. హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని టీజీఆర్జేసీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఆమె అక్కడే జేఈఈ మెయిన్స్కు సిద్ధమవుతోంది. ఈ మేరకు పేపర్–1లో 82.65 శాతం పర్సంటైల్ సాధించిన శ్రీజను పలువురు అభినందించారు. కాగా, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆమె 470కి 465 మార్కులతో రాష్ట్ర స్థాయి 4 ర్యాంకు సాధించింది. -
అంతర్రాష్ట్ర ఇసుకాసురులు..
సరిహద్దు మండలాలకు టిప్పర్ల ద్వారా.. అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, సత్తుపల్లి, కందుకూరు తదితర మండలాలకు వ్యాపారులు ఇసుక రవాణా చేస్తుండగా, ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు బడాబాబులతో కూడా మాఫియా ముఠా రవాణా చేస్తున్నట్లు సమాచారం. రవాణాకు సరిహద్దు మండలాలకై తే టిప్పర్ లారీలు, దూర ప్రాంతాలకు లాంగ్ చాసిస్ ఉన్న లారీలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక, ఏపీలోని ఇసుక వ్యాపారులు కుమ్మకై ్క అనుమతులు లేకుండా ఇసుక విక్రయాలు చేపడుతున్నారు. ఏపీ ఇసుక టన్ను ధర రూ. 1,100 ధర ఉండటంతోపాటు నాణ్యత ఉందని స్థానికులు చెబుతున్నారు. అదే తెలంగాణ ఇసుక రీచ్ల నుంచి టన్ను తెచ్చుకోవాలంటే రూ.1300 చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తెలంగాణ ఇసుక రీచ్ల నుంచి టిప్పర్లో 24 టన్నులే వస్తుండగా, ఏపీ నుంచి వచ్చే టిప్పర్లో 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు కాసులు వర్షం కురుస్తోంది. ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేసుకుని.. అశ్వారావుపేట సరిహద్దులోనున్న ఏపీలోని గ్రామాల నుంచి సత్తుపల్లి మండలంలోని మేడిశెట్టివారిపాలెం, గంగారం గ్రామాలకు చేరుకుని అక్కడి నుంచి యథేచ్ఛగా హైదరాబాదు వైపు వెళుతున్నాయి. కాన్ఫరెన్స్ కాల్లో ఉంటూ ఎస్కార్ట్ వాహనం లైన్ అంతా క్లియర్ అని తెలుకుని అశ్వారావుపేట నుంచి ప్రధాన రహదారి ఎక్కి వెళుతున్నాయి. గతంలో కొద్దిరోజులు ఇంకా పూర్తికాని గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా వయా ఖమ్మం ద్వారా వెళ/్లనట్టు సమాచారం. హైదరాబాద్లో టన్ను ఇసుక ధర రూ.3 వేల వరకు పలుకుతుండటంతో ఇసుకాసురులు రూ. లక్షల కొద్దీ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా దాడులు.. తెలంగాణ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత నాలుగు నెలల కాలంలో సీజ్ చేసిన ఇసుక లారీల్లో ఎక్కువ శాతం సరిహద్దు మండలాలకు వచ్చినవే ఉన్నాయి. ఖమ్మం, హైదరాబాద్ వెళ్లే లారీల ను అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టుకున్న లారీలను మైనింగ్ శాఖకు అప్పగిస్తున్నామని, ఆ శాఖ అధికారులే జరిమానా విధిస్తున్నారని స్థానిక పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇసుక లారీలను సీజ్ చేసి జరిమానా విఽధిస్తున్నారు. వీరితో పాటు మైనింగ్, రెవెన్యూ, రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక దందా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. స్పందించని మైనింగ్ ఏడీ ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ శాఖ ఏడీ దినేష్ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. దమ్మపేట ఎస్ఐ సాయికిషోర్ రెడ్డిని వివరణ కోరగా.. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న లారీలపై నిఘా ఉంచామని తెలిపారు. పట్టుకున్న లారీలను సీజ్ చేసి, ఉన్నతాధికారుల ఆదేశాలతో మైనింగ్ శాఖకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.ఏపీలోని కొవ్వూరు నుంచి తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు లాంగ్ చాసిస్ ఉన్న లారీలను వినియోగిస్తున్నారు. ఒక్కో లారీలో 40 టన్నులకు మించి తరలిస్తున్నారు. తొలుత కొవ్వూరులోని రీచ్లో ఇసుక లోడ్ చేశాక.. ఇసుకలో ఉన్న నీరు కారిపోయే వరకు 24 గంటలపాటు లారీని పార్కింగ్లో ఉంచుతున్నారు. ఆ తర్వాత తరలించుకుపోతున్నారు. ఇసుక మాఫియా మూడు నుంచి ఐదు లారీలకు ఎస్కార్ట్గా ఆ కారును ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లారీలు వెళ్లే మార్గంలో కొందరు వ్యక్తులు ముందుగా కారులో వెళ్లి ఆ మార్గంలో పోలీసు, రవాణా, మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులెవరైన ఉంటే లారీల్లో ఉన్న వ్యక్తులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు లేరనే సమాచారం వచ్చాక అతివేగంతో ఖమ్మం, హైదరాబాద్ వైపు దూసుకెళ్తున్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులు ఇసుక రవాణా ఆపిన మఫియా, మళ్లీ తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సరిహద్దు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తోంది. ఏపీలోని కొవ్వూరులో ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి సరిహద్దు మండలాలతోపాటు ఖమ్మం, హైదరాబాద్ వంటి నగరాలకు లారీల కొద్దీ తరలిస్తోంది. రూ.లక్షల ఆదాయం సొమ్ము చేసుకుంటోంది. తెలంగాణలోని అధికారులు అడపాదడపా ఇసుక లారీలను సీజ్ చేస్తున్నా దూర ప్రాంతాలకు వెళ్లే లారీలను నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. –దమ్మపేటటన్నుల కొద్దీ ఇసుక.. రూ.లక్షల కొద్దీ ఆదాయం ములకలపల్లి: మండలంలోని పలు ప్రాంతాల నుంచి కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా ఇసుక, మట్టి తోలకాలు సాగిస్తున్నారు. ఇటీవల ఇసుక వ్యాపారులు, మట్టి వ్యాపారుల మధ్య వివాదం ఏర్పడి పోలీస్, రెవెన్యూ శాఖకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ఒకరినొకరు దూషించుకున్నట్లు తెలిసింది. జిల్లా స్థాయి అధికారులకు సైతం ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా, రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సీతారాంపురం, గుర్రాలకుంట సమీప ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కందకాలు తవ్వించి, అక్రమ రవాణాను నిలువరించేలా చర్యలు మొదలుపెట్టారు. మండలకేంద్రంలోనూ అక్రమ రవాణాను అరికట్టారు. ఈ నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదు చేసుకోవద్దని ఇరువర్గాలు ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనుమతిలేకుండా ఇసుక, మట్టి తరలింపుపై ఇన్చార్జి తహసీల్దార్ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా.. ఇసుక, మట్టి తోలకాలకు అనుమతి లేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మోసం చేశాడని యువతి ఆందోళన
కూసుమంచి: మండలంలోని ముత్యాలగూడెం గ్రామానికి చెందిన యువకుడు మనోజ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. గ్రామంలోని మనోజ్ ఇంటి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన ఆమె వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాకకు చెందిన తనతో మనోజ్కు పరిచయం ఏర్పడగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువుగా ఉన్నాడని తెలిపింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడంటూ తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి బైఠాయించింది. కాగా, ఎవరి నుంచీ స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగించింది. ఈ విషయమై ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అక్రమ డీజిల్ సీజ్దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న డీజిల్ క్యాన్లను పోలీసులు సోమవారం సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని వేగవరం నుంచి 600 లీటర్ల పరిమాణం కలిగిన డీజిల్ క్యాన్లతో వస్తున్న కారును మండలంలోని మందలపల్లి క్రాస్రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. డీజిల్కు సంబంధించి, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా కారును పోలీస్ స్టేషన్కు తరలించి, డీజిల్ను సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అప్పగించామని ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టుల స్మారక స్తూపాలు ధ్వంసందుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మరియాపారా గ్రామంలో మావోయిస్టుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు సోమవారం ధ్వంసం చేశాయి. కిష్టారం ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా నిలుస్తుండగా, గతంలో వివిధ ఘటనల్లో మృతి చెందిన మావోయిస్టులు వంజం హిద్మా, బల్దేవ్ సమర్, ధన్ సమర్ స్మారక స్తూపాలను నిర్మించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా దూకుడు పెంచిన భద్రతా బలగాలు పలుచోట్ల మావోల గుర్తులను కూడా చెరిపేస్తున్నాయి. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ 217 బెటాలియన్, 212 బెటాలియన్ సిబ్బంది ఇక్కడి స్మారక స్థూపాలను జేసీబీలతో తొలగించారు. ఆర్మీ జవాన్ కేశవరెడ్డి మృతిబూర్గంపాడు: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి(36) కేరళలోని ఎర్నాకుళంలో మృతిచెందాడు. జమ్మూ కశ్మీర్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్న అతను మూడు నెలలుగా సెలవులో ఉన్నాడు. అయ్యప్ప మాలధారణ చేసిన కేశవరెడ్డి శబరిమలైకు వెళ్లి ఇరుముడి సమర్పించుకున్నారు. తిరుగుపయనంలో ఎర్నాకుళం చేరుకున్నాడు. అక్కడ ప్రమాదవశాత్తు ఓ బిల్డింగ్ పైనుంచి కిందపడి మృతిచెందినట్లు అక్కడి పోలీసులు సోమవారం కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే కేశవరెడ్డి మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. డివైడర్ను ఢీకొట్టిన లారీములకలపల్లి: భారీయంత్రంతో వస్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టగా, డ్రైవర్, క్లీనర్లకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. భారీ లారీ జేసీబీతో చైన్నె నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తోంది. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పి మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ను ఢీకొట్టింది. లారీ కేబిన్ ప్రమాదానికి గురైంది. కాగా సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా డివైడర్ నిర్మిస్తున్న క్రమంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
పోస్టల్ బీమాతోనే కుటుంబానికి భరోసా
భద్రాచలంటౌన్: పోస్టల్ జీవిత బీమా పాలసీ తీసుకుంటే కుటుంబాలకు భరోసా ఉంటుందని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ పర్యవేక్షకుడు వీరభద్ర స్వామి మాట్లాడుతూ పోస్టల్ బీమాలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఈ పాలసీలకు అర్హులని, ఐదేళ్ల తర్వాత రుణ సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. ఏఓ రాంబాబు, పోస్టల్ అధికారులు సూర్యప్రకాష్ రావు, రామ్మోహన్, శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పదవిని అధిష్టానమే నిర్ణయించి సీల్డ్ కవర్లో పంపిస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఇల్లెందుకు వచ్చిన కౌన్సిలర్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, అధిష్టానం ప్రకటించిన చైర్మన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని సూచించారు. ఈ సందర్భంగా 1వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సైదామియా, 22వ వార్డు నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కొర్లపాటి శివకిరణ్ కాంగ్రెస్లో చేరగా ఆయన ఆహ్వానించారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 21కి చేరింది. -
తల్లిపాలతోనే ఆరోగ్యం
సూపర్బజార్(కొత్తగూడెం): తల్లిపాలలో అనేక పోషక విలువలు ఉంటాయని, అవే పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మదర్ ఫీడింగ్ రూమ్ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం చంటి పిల్లలతో వచ్చే తల్లులకు ఈ గది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనాకు సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించాలని, శిశువుకు మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు ఇస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. పోషణ అభియాన్ అద్భుత పథకం పోషణ అభియాన్ అద్భుత పథకమని ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను పోషణ లోపం, తక్కువ బరువు గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ రీహాబిటేషన్ సెంటర్లకు పంపించాలని, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కిశోర బాలికల కోసం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు క్రింద ‘ఇందిరమ్మ అమృతం‘ పేరుతో 14 – 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్తో కూడిన చిక్కీలు ప్రతీ నెల అందజేస్తామని, తద్వారా రక్తహీనత లోపాల నుంచి బయటపడతారని తెలిపారు. పౌష్టికాహారం నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు పెరటి తోట పెంపకాలు నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీడీపీఓలు ప్రసన్నలక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమసత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, హసీనా, భార్గవి, డీసీపీఓ హరికుమారి, సందీప్, సంతోషరూప, రాజమణి, సునీత పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి


