భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన పోచంపల్లి చేనేత కార్మికులు పట్టు వస్త్రాలను ప్రతి ఏడాది సమర్పిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా భద్రాచలంలోనే ఈ వస్త్రాలను నేచి, స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం రోజున అందజేస్తున్నారు. చేనేత పనులను రంగనాయకుల గుట్టపైన ఉన్న భక్తరామదాసు మందిరంలో చేపట్టగా ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
చేనేత వస్త్రాల తయారీని
ప్రారంభించిన ఈఓ


