ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ఇల్లెందు: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎన్నికల పరిశీలకులు అమయ్కుమార్ సూచించారు. ఇల్లెందు 24 ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంను, జేకే ఏరియా సింగరేణి స్కూల్ గ్రౌండ్ను బుధవారం వారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్, మేనేజర్ అంకుషావళి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, సీఐ టి.సురేష్ పాల్గొన్నారు.


