నిర్మాణ దశలోనే కూలిన సన్సైడ్లు
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల గ్రామ పంచాయతీ కట్టంవారిగూడెం గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం భవనం సన్సైడ్లు నిర్మాణదశలోనే కూలిపోయాయి. నాసిరకంగా అంగన్వాడీ భవన నిర్మాణం చేపడుతున్నారని ఈ నెల 26న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. గురువారం అంగన్వాడీ భవనం సన్సైడ్ కూలిపోయింది. నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నాసిరకంగా అంగన్వాడీ భవన నిర్మాణం


