సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో, రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.