ఉద్యోగులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు క్రీడల్లో రాణించాలి

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

పాల్వంచ: నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కేటీపీఎస్‌ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌ రావు అన్నారు. గురువారం స్థానిక కేటీపీఎస్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడా మైదానంలో టీజీ జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్‌ టేబుల్‌ టెన్నిస్‌, బాల్‌ బ్యాడ్మింటర్‌ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు కేటీపీఎస్‌ 5, 6, 7 దశలతో పాటు బీటీపీఎస్‌, శ్రీశైలం, పులిచింతల, కేటీపీపీ, విద్యుత్‌సౌధ, వైటీపీఎస్‌లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఈ మాట్లాడుతూ.. క్రీడలతో ఉద్యోగుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు ఎస్‌.యుగపతి, జి.రాజ్‌కుమార్‌, డివైసీసీఏ నాగరాజు, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ లోహిత్‌ ఆనంద్‌, సెక్రటరీలు టి.మహేష్‌, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement