breaking news
Krishna District News
-
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆరోగ్య సంస్థలైన జీజీహెచ్, సీహెచ్సీలలో సిజేరియన్ డెలివరీల రేటును తగ్గించే దిశగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ (సీడీఆర్), మాతృ మరణాలపై (ఎండీఎస్ఆర్) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు ప్రోత్సహిస్తూనే ఎపిడ్యూరల్ అనస్థీషియాతో నొప్పిలేని ప్రసవాలను విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. ఆర్సీహెచ్ 2.0 అమలు విధానం, హెచ్పీఆర్ ఐడీ మ్యాపింగ్, డేటా కచ్చితత్వం, సేవల సమగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న జేఎస్వై చెల్లింపుల అంశాన్ని సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డీసీహెచ్ఎస్, అనస్థీషియా విభాగాధిపతి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆవకాయ్ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట
భవానీపురం(విజయవాడపశ్చిమ): రేపటి నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్న ఆవకాయ్ అమరావతి (సినిమ, సంస్కృతి, సాహిత్యం) ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట వేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఉత్సవాలకు సంబంధించి మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమన్వయ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాల నిర్వహణలో అనుభవం ఉన్న టీమ్వర్క్ సంస్థ భాగస్వామ్యంతో ఆవకాయ్ అమరావతి నిర్వహిస్తున్నామని తెలిపారు. పున్నమి ఘాట్తోపాటు భవానీ ద్వీపంలో కూడా వినూత్న కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 20 సెక్టార్లకు సంబంధించి ఒక్కో సెక్టార్కు జిల్లా అధికారితో పాటు రెవెన్యూ, పోలీస్, వీఎంసీలకు చెందిన అధికారులు, సిబ్బందితో బృందాలను నియమించామని వివరించారు. ఉత్సవాలకు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని, వేదికల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్కు వీలుకల్పించామని తెలిపారు. ఆధు నిక సాంకేతిక సహాయంతో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ రాజ శేఖరబాబు తెలిపారు. ఏపీటీఏ డెప్యూటీ సీఈఓ ఎ.శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, టీమ్వర్క్ సంస్థ ప్రతినిధి సయ్యద్ శ్యామ్, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, వీఎంసీ ఏడీసీ డాక్టర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి
సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ విని యోగదారులకు నాణ్యమైన సేవలు అందించా లని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సర్వీసులు త్వరితగతిన విడుదల చేయాలన్నారు. ప్రజలకు 24 గంటలూ నిరంతరా యంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. బిల్లింగ్ సకాలంలో పూర్తి చేయాలని, రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్ల బ్రేక్ డౌన్ లేకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టరు టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రు ప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – చర్లపల్లి (08513) ప్రత్యేక రైలు ఈనెల 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08514) ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నం చేరుతుంది. పలు రైళ్లు రద్దు ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. 13వ తేదీన నర్సాపూర్ – చర్లపల్లి (07254), 17న చర్లపల్లి – నర్సాపూర్ (07233), 19న వికా రాబాద్ – నర్సాపూర్ (07260), వికారాబాద్ – కాకినాడ టౌన్ (07287), 20న వికారాబాద్ – నర్సాపూర్ (07266), వికారాబాద్ – కాకి నాడ టౌన్ (07286) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు. శ్రీకాళహస్తి: విజయవాడ నగరానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని మనస్తపం చెంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులు తీర్చాలని రుణ దాతలు వత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు సాయి రాజేష్(17), సాయి దీక్షిత (13)తో కలిసి వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు మూడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పట్టణంలోని కొండమిట్టలో ఓ అద్దె ఇంటిలో ఉంటూ, ముక్కంటి ఆలయం సమీ పంలోని హోటల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. అప్పులు ఇచ్చిన వారు శ్రీకాళహస్తిలో వీరి ఆచూకీని గుర్తించారు. ఆదివారం వారి ఇంటి వద్దకు చేరుకుని డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ తమ ఇద్దరు పిల్లలతో కలిసి అదే రోజు అర్ధరాత్రి సమయంలో మందు తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వారిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే విచారిస్తున్నామని తెలిపారు. విజయవాడలీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని మంగళ వారం తీర్పునిచ్చారు. విజయవాడ అజిత్సింగ్నగర్లో నివసించే మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె చిన్న కుమార్తె (8)తో ఇంటిపక్కన నివసించే రావూరి వెంకటేశ్వరరావు (50) 2019 మే నెల 31న అసభ్యంగా ప్రవర్తించాడు. గతంలో కూడా ఆ బాలికపై వెంకటేశ్వరరావు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అజిత్సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గడ్డం రాజేశ్వరరావు, కృష్ణవేణి, ప్రస్తుత నార్త్ ఏసీపీ కె.స్రవంతిరాయ్తో పాటు సీఐల పర్యవేక్షణలో మొత్తం 12 మంది సాక్షు లను విచారించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని నిందితుడికి కఠిన శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షలు నష్ట పరిహారంగా అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. -
డబ్బులు ఊరికే రావు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో ఉంటూ లోకల్గా ఏజెంట్లను నియమించుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఒక నేరానికి.. మరో నేరానికి పొంతన లేకుండా కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాటిని నివారించడం పోలీసులకు సైతం పెనుసవాల్గా మారుతోంది. విదేశాల్లో ఉంటారు.. లోకల్ఫోన్ నంబర్తో మాట్లాడతారు. అకౌంట్స్ కూడా లోకల్ బ్యాంక్లవే చెబుతూ నమ్మిస్తుంటారు. ఈ తరుణంలో ప్రజలు అవగాహనతో మెలగడం.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే పరిష్కార మార్గంగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత వెంటనే సైబర్ కై మ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. డబ్బు ఆశ చూపి.. కుచ్చుటోపీ.. విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు లోకల్గా కొందరు ఏజెంట్లు పనిచేస్తుంటారు. వారి ద్వారా సామాన్యులకు డబ్బు ఆశ చూపి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు. అనంతరం ఆ అకౌంట్స్ వివరాలు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్వర్డ్ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. దీంతో వాళ్లు నేరాలకు పాల్పడినప్పుడు, ఆ నగదును స్థానికంగా ఉన్న ఈ అకౌంట్స్లో ఒకదాని తర్వాత మరొకటి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదారు అకౌంట్స్కు మళ్లిస్తుంటారు. ఇటీవల లబ్బీపేటకు చెందిన ఒక యువకుడు రూ.10 వేలకు ఆశపడి అకౌంట్స్ వివరాలు ఇస్తే రెండు రోజుల్లో రూ.2 కోట్ల మేర లావాదేవీలు చేయడంతో అతను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీ పురానికి చెందిన సైబర్ నేరగాళ్లకు సహకరించే మణికంఠ అనే నిందితుడి ద్వారా లబ్బీపేటకు చెందిన దంపతులు ఆ యువకుడికి రూ.10వేలు ఇచ్చి అకౌంట్ వివరాలు తీసుకున్నట్లు గుర్తించారు. దాదాపు సైబర్ నేరగాళ్లు నగదు లావాదేవీలు చేసే అకౌంట్లు అన్నీ ఇలానే ఉంటున్నాయి. రికవరీలు సవాలే.. సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీలు సవాల్గానే ఉంటోంది. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే రికవరీ వేగంగా చేయగలుగుతున్నారు. బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు ఎన్ని అకౌంట్లకు వెళ్లాయో తెలుసుకుని, ఏదైనా అకౌంట్లలో నగదు ఉన్నట్లు గుర్తిస్తే ఆ బ్యాంకర్లతో మాట్లాడి సీజ్ చేయిస్తున్నారు. అలా ఇటీవల కొందరికి ఊరట కలిగింది. అయితే నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాలతో పోలిస్తే రికవరీ నామమాత్రంగానే ఉంటోంది. చిన్న నేరాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. కరెంట్ ఖాతాల వెనుక సైబర్ కేటుగాళ్లు! డబ్బు ఆశ చూపి సామాన్యులతో కరెంట్ ఖాతాలు అదే తరహాలోనే ఫోన్ సిమ్ కార్డులు కూడా.. విదేశాల్లో ఉంటూ లోకల్ సిమ్లను వినియోగిస్తున్న నేరగాళ్లు పోలీసులకు సైతం పెనుసవాల్గా మారుతున్న సైబరాసురులు సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా ఉండే బ్యాంకు అధికారులు, సిబ్బందికి సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. సీబీఐ, ఈడీ అధికారులంటూ ఫోన్ చేస్తే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని అంటున్నారు.సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తారో తెలియడం లేదు. ప్రతి నేరం కొత్తగానే ఉంటోంది. ఒకరిని సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో బెదిరిస్తారు.. మరొకరిని ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నమోదైందని డిజిటల్ అరెస్టు అంటూ ఆందోళనకు గురి చేస్తారు.. ఇంకొకరిని పొలిటికల్ నేత పేరుతో ఫోన్ చేసి పదవులు ఇప్పిస్తాం.. బిల్లులు ఇప్పిస్తామంటూ ఆశల వల వేసి నగదును దోచేస్తారు. ఓఎల్ఎక్స్ పేరుతో కొందరు.. వాట్సాప్కు ఏపీకే ఫైల్స్ను పంపించడం ద్వారా వారి ఫోన్లను హ్యాక్ చేసి మరికొందరు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంటారు. ఇలా సరికొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఒక ఏడీఓతో పర్సనల్ లోన్ పెట్టించి మరీ దోచేసిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. అధిక వడ్డీలు ఆశ చూపి మొగల్రాజపురానికి చెందిన ఒకరి వద్ద రూ.25 లక్షలు దోపిడీ చేశారు. సైబర్ నేరగాళ్లు మయన్మార్, వియత్నం, కంబోడియా, దావోస్, థాయ్లాండ్, మలేషియా వంటి దేశాల్లో మకాం వేస్తుంటారు. కానీ వాళ్లు వాడే సిమ్లు అన్నీ లోకల్ నంబర్లు గానే ఉంటాయి. లోకల్గా ఉన్న ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున సిమ్స్ను సమీకరించి వాటిని నేరాలకు పాల్పడే సమయంలో మాట్లాడేందుకు వినియోగిస్తున్నారు. సిమ్బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చేందుకు ఈ సిమ్లను ఉపయోగిస్తుంటారు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు లోకల్ నంబర్లతో మాట్లాడుతుండటంతో బాధితులు నమ్మేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. -
నాడు మానవ మేధ.. నేడు కృత్రిమ మేధ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పుస్తకం.. నాడు మానవ మేధస్సును తీర్చిదిద్దితే, నేడు కృత్రిమ మేధస్సు రూపకల్పనలోనూ ప్రధాన భూమికను పోషిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్ర మంగళవారం సందడిగా సాగింది. పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల వద్ద యాత్రను ఆర్పీ సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పాదయాత్రకు నాయకత్వం వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – పుస్తకాలే ముద్దు’ అనే ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల పుస్తకాల తయారీ, ప్రచురణ, పంపిణీ, పఠనాల స్వరూప స్వభావాలే మారిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రియులంతా జ్ఞానాన్ని అందించడం, సమాజానికి వెలుగులు పంచడం అనే పుస్తకాల మౌలిక స్వభావం మారిపోకుండా చూడాలన్నారు. తరువాత తరాలకు పుస్తకాలను అందించాల్సిన బాధ్యతను స్వీకరించాలన్నారు. భాషా సేవల్లో సవ్యసాచి మండలి.. పాదయాత్ర అనంతర సభను మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి జీవితంపై ‘దివిసీమ గాంధీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకులు అని వివరించారు. నున్న(విజయవాడరూరల్): నున్న గ్రామంలో బుధవారం మామిడి రైతులకు మామిడి తోటల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు మామిడి పరిశోధన సంస్థ నుంచి శాస్త్రవేత్తలు డాక్టర్ కనకమహాలక్ష్మి, డాక్టర షాలిరాజు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులు పాల్గొనాలని కోరారు. -
ఫ్లైయాష్ ప్రశ్నార్థకం!
మూసివేత దిశగా ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలుఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ అధికారుల తీరుతో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే దశకు చేరుతున్నాయి. ఎన్టీటీపీఎస్ సంస్థలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలయ్యే మెత్తటి బూడిదను ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు రవాణా చేయాల్సి ఉంది. గతంలో 20శాతం బూడిద బ్రిక్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఉత్తర్వులు ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద కృత్రిమ కొరత సృష్టించి బ్రిక్స్ కంపెనీలకు రవాణా కాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయా కంపె నీల యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉచితం, ఆ తర్వాత రూ.50 చొప్పున కొనుగోలు చేసిన కంపెనీల యజమానులు ఇప్పుడు లారీ రూ.10వేలు చెల్లించి బూడిద లోడింగ్ చేసుకుంటున్నారు. గతంలో రోజుకు 100లారీలు బూడిద లోడింగ్ జరిగితే ఇప్పుడు నెలకు 100లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారింది. ఇదే మాదిరిగా కొనసాగితే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లోని సుమారు 2వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీకి బూడిద లోడింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఆ ప్రభావం బ్రిక్స్ కంపెనీలపై పడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్లైయాష్పైనే ఆధారం.. గ్రామాలు, పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు గృహ నిర్మాణాల కోసం ఫ్లైయాష్ బ్రిక్స్ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా బ్రిక్స్ కంపెనీలు అనేక ప్రాంతాల్లో నెలకొల్పారు. అపార్ట్మెంట్లు, గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్రిక్స్తో నిర్మాణం జరుపుతుంటారు. బ్రిక్స్ కంపె నీలు గతంలో బూడిద టన్ను రూ.30 చొప్పున కొనుగోలు చేసేవి. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో టన్ను రూ.50 చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఎన్టీటీపీఎస్ బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో అధికారులు కృత్రిమ కొరత సృష్టించి లారీ బూడిద రూ.10వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీలు యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో రోజుకు 100లారీలు లోడింగ్ అయ్యేవని, ఇప్పుడు కొరత సృష్టించడం వల్ల నెలకు 100 లారీలు లోడింగ్ అవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్.. 30ఏళ్ల క్రితం 1996లో ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు టన్ను రూ.30 చొప్పున ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి బూడిద సరఫరా జరిగేది. ఆ తరువాత 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీ ప్రతినిధులు కలిసి టన్ను బూడిద రూ.30చొప్పున కొనుగోలు చేయలేకపోతున్నామని, ఫ్లైయాష్ ఉచితంగా ఇప్పించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఆయన మంచి మనసుతో బ్రిక్స్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్ ఇవ్వాలని ఎన్టీటీపీఎస్ సంస్థకు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు టన్ను రూ.50 చొప్పున ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలకు బూడిద అమ్మాలని సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టన్ను రూ.50 చొప్పున ఇప్పటి వరకు కొనుగోలు చేసి కంపెనీలను నడపగలిగారు. 30ఏళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలు భరించి నిలబడిన ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఒడిదొడుకులకు గురవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఫ్లైయాష్ కంపెనీలకు యాష్ ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించడంతో సుమారు రెండు వేల ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. 2024 వరకు చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా ఏర్పడిన యాష్ బ్రిక్స్ కంపెనీలకు రోజుకి సుమారు వంద లారీల ఫ్లైయాష్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ నుంచి సరఫరా జరిగేది. దాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని సుమారుగా రెండు వేల కంపెనీలు నడిచేవి. ఒక్కొక్క బ్రిక్స్ కంపెనీ మీద ఆధారపడి యాభై మంది కార్మికులకు జీవనోపాధి లభించేది. ఇప్పుడు ఎన్టీటీపీఎస్కు చెందిన ఓ అధికారి ధన దాహానికి బ్రిక్స్ కంపెనీలు మూత పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ అధికారి లారీకి రూ.10వేలు చొప్పున వసూలు చేసి నగదులో స్థానిక టీడీపీ నాయకులు సైతం వాటాలు తీసుకుంటున్నారని బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీల ప్రతినిధులు 2018లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి రూ.15లక్షలు చెక్కు అందజేశారు. నేడు అదే ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీలు అదే టీడీపీ నాయకుల, అధికారుల ధన దాహానికి మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రత్యక్ష బ్రిక్స్ కంపెనీల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతామని ప్రకటించారు. -
పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు తొలగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పరిశ్ర మలు నెలకొల్పేందుకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. తన చాంబర్లో వివిధశాఖల అధికారులతో మంగళవారం సాయంత్రంసమావేశం నిర్వహించి పారిశ్రామిక యూనిట్ల పురోగతి, సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమలను నెలకొల్పటంలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా వ్యాపారం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో మంజూరైన 377 పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసేందుకు 20 మంది అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి, ఒక్కొక్కరికి 20 మంది పారిశ్రామికవేత్తలను కేటాయించామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికా రులు తమ పరిధిలోని ప్రతి పారిశ్రామికవేత్తను నేరుగా సంప్రదించి వారికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించి సరిహద్దు సమస్యలు లేకుండా సర్వే నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, బ్యాంకు రుణాలు అంశాలపై కూడా అధికారులు దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, డీఎఫ్ఓ సునీత, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి పోతురాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
రసవత్తరంగా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెండో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన ప్రారంభమైన ఈ పోటీలు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. త్వరలో జరగనున్న సౌత్జోన్ క్రికెట్ జట్టు సెలక్షన్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నాలుగు రేంజ్ల నుంచి 11 క్రికెట్ టీమ్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. రెండో రోజు మంగళవారం డీవీఆర్ గ్రౌండ్లో ఏపీఎస్పీ రేంజ్–2, ఇంటిలిజెన్స్ టీమ్లు తలపడగా, ఏపీఎస్పీ టీమ్ పది వికెట్లు కోల్పోయి 109 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం ఇంటిలిజెన్స్ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజేతగా నిలిచింది. చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో అనంత పూర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా, సీఐడీ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో అనంతపూర్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఏసీబీ జట్టుకు ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా మినిస్ట్రీరియల్ స్టాఫ్ జట్టు 84 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. మరో పోటీలో ఆపరేషన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఈగట్ జట్టు 107 పరుగులకు ఆలౌటై ఓటమి చెందింది. -
జోగి సోదరుల బెయిల్ పిటీషన్
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో విజయవాడ జిల్లాజైలులో రిమాండ్లో ఉన్న జోగి రమేష్, జోగి రాము ఎకై ్సజ్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. గతంలో వారు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోరుతూ పిటీషన్లు దాఖలు చేశారు. కంచికచర్ల: ఊకపొట్టును ట్రాక్టర్లో లోడు చేసి, ఆ వాహనంపై తిరుగు ప్రయాణమైన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నందిగామ శివారు అనాసాగరం గ్రామానికి చెందిన కె.నరసింహారావు(45) ట్రాక్టర్కు ఊకపొట్టు లోడ్ చేసేందుకు మండలంలోని కొత్తపేట గ్రామానికి వెళ్లాడు. లోడ్ చేసిన అనంతరం అదే ట్రాక్టర్పై డ్రైవర్ పక్కన కూర్చుని ఇంటికి వస్తుండగా పరిటాలలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనల నరసింహారావు తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ట్రాక్టర్ డ్రైవర్ నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతుండగా పరిస్థితి విష మించి నరసింహారావు మృతి చెందాడు. మృతుడి కుమారుడు తిరుపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చిన్నారిని చితకబాదిన టీచర్, ఆయా
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్, ఆయా తీవ్రంగా కొట్టిన ఘటన విజయవాడ చిట్టినగర్లో జరిగింది. చిట్టినగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కలరా హాస్పిటల్ ప్రాంతానికి ఐదేళ్ల చిన్నారి ఎల్కేజీ చదువుతోంది. కొద్ది రోజులుగా ఆ చిన్నారి స్కూల్కు వెళ్లనని మారం చేస్తోంది. చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపం సమీపంలో ఉన్న స్మార్ట్ క్యాంపస్కు ఆ చిన్నారిని తల్లిదండ్రులు సోమవారం తీసుకువెళ్లి ఆయాకు అప్పగించారు. అప్పటికే ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో పాపను ఆయా కొట్టింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీచర్ కూడా ఆ పాపను కర్రతో తీవ్రంగా కొట్టింది. పాప వంటిపై వాతలు తేలాయి. సాయంత్రం షాపు నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప వీపుపై చేతి అచ్చు కనిపించడం, తలపై గాయం, చేతులపైన కమిలిన గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే స్కూల్ నిర్వాహకులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం చిన్నారిని తీసు కుని స్కూల్కు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు ఆయా, టీచర్లను నిలదీశారు. ఈ క్రమంలో చిన్నారి బంధువులు స్కూల్ ఆయాపై చేయి చేసుకు న్నట్లు తెలిసింది. చిన్నారిని గాయపరిచిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావును వివరణ కోరగా.. ఆ ఘటనపై ఫిర్యాదు అందలేదన్నారు.చిన్నారి తల, చేతిపై గాయాలు -
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కార్యాలయానికి కొలతలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం కొలతలు వేశారు. మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వి.వి.ఎస్.బాపిరాజు పర్యవేక్షణలో కొలతలు వేశారు. కార్యాలయ కొలతల కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కొలతలు వేస్తున్నామని కమిషనర్ బాపిరాజు మీడియాకు తెలిపారు. అయితే హైకోర్టు పూర్తి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో మాత్రం చెప్పకుండా దాటవేశారు. కార్యాలయం బయటి కొలతలను సిబ్బంది తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏసీపీ హరి ప్రసాద్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలు అని చెప్పిన మునిసిపల్ కమిషనర్ -
తిరుపతమ్మకు నీరాజనాలు
● రంగుల మహోత్సవానికి తరలివచ్చిన అమ్మవారు ● గ్రామాల్లో ఎడ్ల బండ్లకు భక్తుల ప్రత్యేక పూజలు ● ఈ నెల 28న పెనుగంచిప్రోలుకు అమ్మవారి తిరుగు ప్రయాణం జగ్గయ్యపేట: ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకొనే రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతల విగ్రహాలు మంగళవారం పట్టణంలోని దస్తావేజుల సెంటరు లోని రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. సోమవారం పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రత్యేక పూజలనంతరం రంగుల మహోత్సవానికి బయలు దేరిన అమ్మవారు, సహదేవతల విగ్రహాలు మక్కపేట, చిల్లకల్లు మీదుగా పట్టణానికి చేరుకున్నాయి. డప్పు, కోలాట వాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తున్న ఎడ్ల బండ్లకు భక్తులు ఎదురేగి వార పోసి స్వాగతం పలికారు. చిల్లకల్లు గ్రామంలోని ఆల్సెయింట్స్ పాఠశాల నుంచి రామ్కో క్వార్టర్స్ వద్దకు వచ్చేందుకు ఆరు గంటల సమయం పట్టింది. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ వద్ద విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తోట సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ, సిబ్బంది అమ్మవారికి వార పోసి స్వాగతం పలికారు. కళాకారులతో కలిసి సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చిందేశారు. జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాల నుంచి రంగుల మండపం వరకు శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అమ్మవారికి పూజలు చేసి స్వాగతం పలికారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మండపంలో కొలువుదీరిన అమ్మవారు. సహదేవతలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దర్శించుకుని పూజలు చేశారు. రంగుల మహోత్సవాన్ని ముగించుకుని ఈ నెల 28వ తేదీన తిరిగి పెనుగంచి ప్రోలుకు అమ్మవారు పయనమవుతారు. రంగుల మండపం వద్ద ఆలయ సాంప్రదాయం ప్రకారం గాజర్ల వంశీయులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్, తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, రంగుల మండపం కమిటీ సభ్యులు ఆకుల బాజీ, పంతంగి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
9,10,11 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
రామవరప్పాడు(విజయవాడ రూరల్): విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 9,10,11 తేదీల్లో క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో జరుగుతుందని సంస్థ విజయవాడ చాప్టర్ చైర్మన్ సతీష్బాబు, అధ్యక్షుడు మోహన్రావు తెలిపారు. క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో సందర్భంగా రామవరప్పాడు రింగ్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. సొంత ఇంటిని సాకారం చేసుకోవడం మధ్య తరగతి వారి కలని, దానిని నెరవేర్చడంలో భాగంలోనే క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రాపర్టీ షోలు నిర్వహించి, అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోందని తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో 50 స్టాళ్లు ఉంటాయన్నారు. ఈ స్టాళ్లలో పోసమ్ ఇన్ఫ్రా, బీబీజీ, లచన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, పీవీఆర్ గ్రూప్, వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్ఆర్ ఇన్ఫ్రా, హిమజ కన్స్ట్రక్షన్స్, హరివిల్లు ప్రొమోటర్స్ వివిధ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వీరే కాకుండా ఐసీఐసీఐ, యూనియన్, హెచ్డీఎఫ్సీ, ఇండియన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర ప్రముఖ బిల్డర్లు, గృహోపకరణాల కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గృహోపకరణాలకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒకే సముదాయంలో లభించడం గృహ నిర్మాణదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో వినియోగదారులకు ప్లాట్ నచ్చితే వారికి అక్కడే బ్యాంక్ల ద్వారా రుణ సౌకర్యం కలిగించే సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ షోకు హాజరయ్యే వినియోగదారుకుల ప్రత్యేక కూపను ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి రఘరామ్, కోశాధి కారి సాయిరామ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్టాల్ హోల్డర్లు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026●క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ●కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు ●నిబంధనలను పట్టించుకోని వైనం ●ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి ●పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలోని పలు క్వారీల్లో అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలు తూచ్ అంటూ కొండలను పిండి చేస్తున్నారు. భారీ రిగ్గులతో పేలుళ్లు జరుపుతూ గుల్లగుల్ల చేస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా, భద్రతా చర్యలు పాటించ కుండా సాగిస్తున్న బ్లాస్టింగ్లతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బ్లాస్టింగ్లకు అనుభవం లేని కార్మికులను వినియోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లీజుకు తీసుకున్న కొండలను అనుమతికి మించి తవ్వేస్తున్న అక్రమార్కులు సమీపంలోని అటవీ భూములను కొల్లగొడుతున్నారు. ఆ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంప దను దోచేస్తున్నారు. క్వారీల్లో జరుగుతున్న తవ్వకా లను తక్కువగా చూపించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండిపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు క్వారీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. కొండలను తవ్వి రూ.కోట్లలో అక్రమ సంపాదనకు తెరదీశారు. కొంత మంది అధికారులకు ముడుపులు చెల్లించి వారి అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ సంపదను దోచేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ ప్రాంతంలో సర్వే నంబర్ 801లో 1,204 ఎకరాల్లో రాతి క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల సమీపంలో విస్తారంగా కొండ పోరంబోకు భూమి ఉంది. ఆ పక్కనే కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో పలు రకాల జంతువులు, పక్షులు, అటవీ సంపద ఉంది. ఈ కొండల్లో గత ప్రభుత్వాలు 74 మందికి లీజులు మంజూరు చేశాయి. అయితే కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. అయితే ఈ అక్రమాల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కొండరాళ్లను పిండి చేసేందుకు రెండో క్వాలిటీ జిలెటిన్స్టిక్స్తో బ్లాస్టింగ్లు చేస్తున్నారు. పేలుళ్ల సమయంలో భారీ శబ్దాల కారణంగా కొండ పల్లి రిజర్వు ఫారెస్ట్లో జంతువులు, పక్షులు ఆందోళనకు గురవుతున్నాయి. కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న సమయంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికా రులు అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంబందిత అధికారు లకు కాంట్రాక్టర్లు ముడుపులు అందించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. 7దొనబండ క్వారీల్లో తనిఖీలు చేస్తాం. ప్రభుత్వం ఎంత మేరకు ఏఏ యజమానులకు అనుమతులు ఇచ్చింది, అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? ప్రభుత్వం కేటాయించిన క్వారీల్లోనే తవ్వ కాలు జరుపుతున్నారా? లేదా? అన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. అనుమతులు లేని క్వారీలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అక్రమంగా తవ్వకాలు జరిపితే క్వారీలను సీజ్ చేయటం ఖాయం. – సీహెచ్ నరసింహారావు తహసీల్దార్, కంచికచర్ల మైలవరం: స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ పటమటకు చెందిన కోనేరు బాబూరావు, విజయకుమారి దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు.గన్నవరంరూరల్: మండలంలోని చినఅవుట పల్లిలో ఉన్న సిద్ధార్థ దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. -
‘దేశం’ తమ్ముళ్ల కుమ్ములాట
గుడివాడరూరల్: పాత కక్షల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని లింగవరం గ్రామ పంచాయతీ చేపల చెరువులను గతంలో వేలం పాట దక్కించుకున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుపై గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిని స్థానికులు అడ్డుకుని గాయపడిన శ్రీనివాసరావును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు చేశానని కక్ష.. వైద్య చికిత్స అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ లింగవరం గ్రామంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేశానని, దీన్ని మనసులో పెట్టుకున్న గ్రామంలోని టీడీపీ నాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవిరెడ్డి, మందపాలి గోపాలస్వామి, మందపాటి శివయ్య.. తాను హార్ట్ పెషేంట్ని అని కూడా చూడకుండా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాసరావు చెప్పారు. కాగా ఘర్షణ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం భూమాత పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడు తున్న 100 గ్రామ పంచాయతీలను గుర్తించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీసీఓ చంద్రశేఖరరెడ్డి, డీపీఎం కె.పార్థసారథి, మార్క్ ఫెడ్ డీఎం మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ ఎన్ మణిధర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి సీజన్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నెల ఏడు నుంచి 20వ తేదీ వరకు చర్లపల్లి రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ కల్పించినట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ సోమవారం ఒక ప్రకటకలో తెలిపారు. గూడూరు – సికింద్రాబాద్ (12709), కాకినాడపోర్టు–లింగంపల్లి (12737), తిరుపతి – సికింద్రాబాద్ (12763), కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775), విశాఖపట్నం – సికింద్రాబాద్ (12739), సికింద్రాబాద్ – భువనేశ్వర్ న్యూ (17016), హైదరాబాద్ – విశాఖపట్నం (12728), లింగంపల్లి – కాకినాడ టౌన్ (12776), సికింద్రాబాద్– విశాఖపట్నం (127 40), లింగంపల్లి – కాకినాడ పోర్టు (12738), సికింద్రాబాద్ – గూడూరు (12710) రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): వివిధ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఆయా కులాల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏపీ బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొ రేషన్ చైర్మన్గా నియమితులైన బొమ్మన్ శ్రీధర్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె తొలుత వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ పథకాన్ని ప్రారంభించి ఆధునిక పరికరాలను అందిస్తామని తెలిపారు. మత్స్యకా రుల వేట విరామ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు, ప్రమాద బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. బెస్త కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టిన బొమ్మన్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యటించి బెస్త సామాజికవర్గం సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లుగా పవన్ కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున, మనోహర్, చంద్రశేఖర్, కె. భాస్కరరావు, కె.శ్రీధర్, ఎం.వెంకట సుబ్బయ్య, పి.అమరావతి, పి.తిరుమగళ్, పళని బొమ్మన్, రామాంజనేయులు, సీహెచ్ సోమయ్య, టి.జి.రమేష్బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ల చైర్మన్లు కొల్లు పెద్ది రాజు, చిలకల పూడి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన జాతీయ ఆందోళనలో భాగంగా ఈ ధర్నాను నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆలిండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ మాట్లాడుతూ 12వ ద్వైపాక్షిక ఒప్పందం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం నేటి వరకు అమలు కాలేదన్నారు. ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించి మాట తప్పిందన్నారు. ఇప్పటికే ఎల్ఐసీ, జీఐసీ, ఆర్బీఐలో ఐదు రోజుల పని దినాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో మాత్రం అమలు చేయలేకపోవడం ఎంతో దురదృష్టకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయ శేఖర్, నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సంగీత సేవతో జీవితం సార్థకం విజయవాడ కల్చరల్: సంగీత సద్గురువుల సేవలో జీవితాలను సార్థకం చేసుకోవాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. సంగీత సన్మండలి ఆధ్వర్యంలో 31వ త్యాగరాజస్వామి ఆరాధన, సంగీతోత్సవాలు జీవీఆర్ సంగీత కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలను ప్రారంభించిన గంగరాజు మాట్లాడుతూ తెలుగు వాడైన త్యాగరాజస్వామి సంకీర్తనలకు తమిళ నాట గుడికట్టారన్నారు. కళాకారులు కోసమే జీవీఆర్ కళాశాలలో వేదిక నిర్మించామన్నారు. వేదిక నిర్మాణానికి గతంలోనే కొంతమంది రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టించినట్లు తెలిపారు. సంగీత సన్మండలి అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ సభకు అధ్యక్షత వహించారు. సంగీత విద్వాంసుడు మల్లాది శ్రీరాం ప్రసాద్ త్యాగరాజస్వామి సంకీర్తనలలోని భక్తితత్వం, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి, సంస్థ ఉపాధ్యక్షుడు జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి, సంగీత విధూషీమణి అంజనా సుధాకర్ పాల్గొన్నారు. సంగీత కార్యక్రమంలో భాగంగా ఎస్. సాత్విక, మల్లాది సోదరీమణులు, బెంగళూరు చెందిన అలేఖ్య, హైదరాబాద్కు చెందిన డీవీ మోహన కృష్ణ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు. -
పుస్తకాలకు సమాజాన్ని శాసించే శక్తి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సమాజాన్ని శాసించే శక్తి పుస్తకాలకు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో సోమవారం సాయంత్రం ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి రచించిన ‘ధర్మపురి’ నవలను కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంపై పుస్తకాల ప్రభావం ఉంటుందన్నారు. గుజ్జు చెన్నారెడ్డి నవలను తీసుకురావటం అభినందనీయమన్నారు. రచయిత చెన్నారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధుని చరిత్రతో ప్రభావితమై, దానిని ఆధునిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ నవల రాసినట్లు తెలిపారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు మాట్లాడుతూ.. మత్తు మందుల్లాంటి ప్రమాదకర వ్యసనాల నుంచి భావితరాలను రక్షించే శక్తి మంచి పుస్తకాలకు ఉందన్నారు. ప్రభుత్వ సహాయ కార్యదర్శి కృష్ణయ్య, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహర్ నాయుడు పాల్గొన్నారు. మినీ కవితా ఉద్యమ సారథి కొల్లూరి ఎక్స్రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి మినీ కవితా ఉద్యమ సారథి అని పలువురు వక్తలు కొనియాడారు. ఎక్స్రే పత్రిక, నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా మినీ కవితా ఉద్యమానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో కవి, ఎక్స్రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్ అధ్యక్షత వహించారు. సింగంపల్లి అశోక్ కుమార్, బి.ఆంజనేయరాజు, కందికొండ రవికిరణ్, ఉమామహేశ్వరి, శైలజ సామినేని ప్రసంగించారు. సమాజాన్ని ఆవిష్కరించే సాధనం కవిత్వం సమాజ వాస్తవ స్వరూపాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే సాధనం కవిత్వమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ‘పాతికేళ్ల కవిత’ అంశంపై చర్చాగోష్ఠిని బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై నిర్వహించారు. రచయిత ఖాదర్ మొహియుద్దీన్, కడలి సత్యనారాయణ, కవి అనిల్ డ్యానీ ప్రసంగించారు. సాహితీ స్రవంతి సత్యాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాధికారి మెరుపుల అజయ్కుమార్ పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో పడి వృద్ధుడి మృతి
తిరువూరు: స్థానిక 9వ వార్డుకు చెందిన బాణావతు మణిరాం (68) ప్రమాదవశాత్తూ ఎన్ఎస్పీ తిరువూరు మేజరు కాలువలో పడి ఆదివారం రాత్రి మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణిరాం మూర్ఛ వ్యాధిగ్రస్తుడై ఇంటివద్దే ఉంటున్నాడు. అతని భార్య మంగమ్మ టౌన్షిప్లోని ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వీరికి సంతానం లేదు. ఆదివారం భార్య పనిచేస్తున్న స్కూలు వద్దకు వెళుతూ ఫిట్స్ వచ్చి మేజరు కాలువలో పడి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. మణిరాం మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి వెలికితీశారు. గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గంధం విజయభాస్కరరావు(55), బసవ నాగమహాలక్ష్మి దంపతులకు టిడ్కో కాలనీలో సీ–76 ఎస్–4లో సొంత ప్లాటు కలిగి ఉన్నారు. అయితే గతకొంతకాలంగా ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. విజయభాస్కరరావు మద్యానికి బానిసై తరచూ చనిపోతానంటూ భార్యను బెదిరించేవాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు టిడ్కో కాలనీలో ఉన్న సొంత ప్లాటుకు వెళ్లి కుమార్తెకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. మద్యం తాగి గతంలో కూడా ఇలా మూడు, నాలుగుసార్లు చెప్పి ఉండటంతో అలా ఏమి జరగదనే అభిప్రాయంతో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉరికి వేలాడుతూ.. సోమవారం మధ్యాహ్నం అయినా ఇంటికి కుమార్తె టిడ్కో కాలనీలోని ప్లాటుకు వెళ్లి చూడగా తండ్రి విజయభాస్కరరావు ఉరివేసుకుని వేలాడుతున్నట్లు కన్పించాడు. ఈ క్రమంలో కుమార్తె, స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలుపగా ఎస్ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహాలయ్యాయి. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట కుమ్మరి వీధి 5వ లైన్లో బొట్టా రాజేంద్రకుమార్ తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అదే భవనంలో కింది అంతస్తులో రాజేంద్రకుమార్ తమ్ముడు నాగేంద్ర తేజత్కుమార్ తన భార్య శైలజకుమారితో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా రాజేంద్రకుమార్కు తన భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పిల్లలను తీసుకుని కృష్ణలంకలోని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం రాజేంద్రకుమార్ ఇంట్లో ఉండగా, తమ్ముడు నాగేంద్ర భోజనం తీసుకుని గదికి వెళ్లాడు. అయితే ఇంటి తలుపులు వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా, రాజేంద్రకుమార్ వేలాడుతూ కనిపించాడు. దీంతో నాగేంద్ర చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉయ్యాల కట్టే ప్లాస్టిక్ తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకుని మార్బుల్ కార్మికుడి ఆత్మహత్య మద్యానికి బానిసైన మార్బుల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వారి వీధిలో రాంపిళ్ల శ్రీలక్ష్మి, బాబి దంపతులు నివాసం ఉంటున్నారు. బాజీ మార్బుల్ పని చేస్తుంటాడు. గత కొంత కాలంగా మద్యం అతిగా తాగడమే కాకుండా భార్యను వేదింపులకు గురి చేయసాగాడు. 15 రోజుల కిందట బాగా మద్యం తాగి వచ్చిన బాబి భార్యను, తల్లిని వేదించడంతో వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల వారు శ్రీలక్ష్మికి ఫోన్ నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్కు బాబి ఉరి వేసుకుని శవమై కనిపించాడు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడి పందేలు నిర్వహిస్తే కేసులు తప్పవు
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కోడి పందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తుంటే సమాచారం అందించాలన్నారు. ముందుగానే కోడిపందేలు నిర్వహించే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఎఫ్వో సునీత, డీఈవో సుబ్బారావు, డీఎస్పీ సీహెచ్ రాజా, ఆర్టీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న యద్దల నవీన్కృష్ణ తరఫున న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ దాఖలు చేశారు. నవీన్కృష్ణ భార్య గర్భవతిగా ఉండటంతో ఆమెను చూసుకునేందుకు అందుబాటులో ఉండటానికి నెలరోజులపాటు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్కు నోటీసు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న అనిల్ చోక్రాకు ఆస్తమా ఉందని, ప్రస్తుతం చలికాలం కావడంతో వేడినీటిని తాగేందుకు జైలులో అనుమతించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిట్టల శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటీషన్పై జైలర్కు ప్రాసిక్యూషన్కు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. -
సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకపోయినా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని మండిపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యాన సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు జరిగే ఈ దీక్షల్లో తొలి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు బొలినేని రఘురాం, టి.వెంకటరామయ్య మాట్లాడుతూ.. తక్షణమే జీఓ 36ను అమలు చేయాలని, డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసి జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019, 2024 పీఆర్సీలు అమలు కాలేదని, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు పెంపు, రూ. 5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందన లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రిలే నిరాహార దీక్షలో ఎం.వెంకటేశ్వరరావు, ఎస్.ఖాజా మొహిద్దీన్, పి.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు -
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో వచ్చిన ప్రతి అర్జీపై విచారణ జరిపించి బాధితులకు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల సమస్యలను సావదానంగా ఆలకించి పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే న్యాయం కోసం వచ్చే బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో 30 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● పెనమలూరుకు చెందిన సావిత్రి అనే బాధితురాలు ఎస్పీని కలిసి ఐదేళ్ల కిందట తనకు వివాహం కాగా బాబు, పాప ఉన్నారని తెలిపారు. అయితే అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను మానసికంగా వేధిస్తున్నారని, తన భర్తకు మరో వివాహం చేసేందుకు సైతం పూనుకుంటున్నట్లు వివరించారు. వ్యసనాలకు బానిసైన భర్త తనపై భౌతికదాడికి పాల్పడుతూ హింసలు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ● బంటుమిల్లికి చెందిన ప్రసాద్ అనే రైతు ఎస్పీని కలిసి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లనీయకుండా ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపారు. అదేమంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడికి తెగబడుతున్నాడని వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ● అవనిగడ్డకు చెందిన నరసయ్య వ్యవసాయ పనుల కోసం బంధువుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నానని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అధిక వడ్డీ పేరుతో మరింత కట్టాలని వేధిస్తున్నాడంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
వివాహిత దారుణ హత్య
మైలవరం: మండల కేంద్రం రెడ్డిగూడెం శివారు రాఘవాపురంలో సంగెపు శ్రావణి(30)అనే వివాహిత ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగెపు శ్రావణి అనే వివాహిత విస్సన్నపేటలో ఒక వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. యథావిధిగా ఆదివారం తను విధులు ముగించుకుని రాత్రి పదకొండు గంటల సమయంలో మరో వ్యక్తి సాయంతో ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె భర్త నాగరాజు తన తండ్రి కోటేశ్వరరావుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నాడు. ఆమె అత్త కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వేరే గదిలో నిద్రపోయారు. అయితే అత్త ఉదయాన్నే నిద్ర లేచి చూసే సరికి శ్రావణి రక్తపు మడుగులో శవమై పడి ఉంది. ముమ్మర దర్యాప్తు.. సమాచారం అందుకున్న మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం ఎనిమిది బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే ఇప్పటికే అనుమానితుడైన ఓ వ్యక్తిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గుణదల(విజయవాడ తూర్పు): బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై మాచవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం కార్మికనగర్కు చెందిన ఇద్దరు బాలికలు(8) స్నేహితులు. ఈ నెల 26వ తేదీన ఇరువురూ ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఆ ఇంటి పక్కన అద్దెకు ఉంటూ.. తాపి పని చేసుకుని జీవనం సాగించే ఎం. రామకృష్ణ(26) మద్యం తాగి ఈ ఇద్దరు బాలికలను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికలు తమ తలిదండ్రులకు చెప్పడంతో.. నిలదీసేందుకు వచ్చిన సమయానికే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజుల తరువాత తిరిగి వచ్చిన అతడు మరలా బాలికలపై వేధింపులకు పాల్పడ్డాడు. విషయం స్థానిక పెద్దలకు తెలిసేలోపే మరలా పరారయ్యాడు. తరచూ మైనర్ బాలికలను వేధిస్తున్న కారణంగా తమ బిడ్డలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇరువురి బాలికల్లో ఓ బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వైభవంగా శ్రీతిరుపతమ్మ రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలు: ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వ హించే పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మ వారి రంగుల మహోత్సవం సోమవారం అంగ రంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.11 గంటలకు వేద పండితులు, ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య మహా నివేదన అనంతరం శ్రీగోపయ్యసమేత శ్రీతిరుపతమ్మ విగ్రహాలు, అమ్మ, స్వామివారి ఉత్సవమూర్తులు, సహదేవతలైన మల్లమ్మ, చంద్రయ్య, అంకమ్మ, పెద్దమ్మ, మద్దిరావమ్మ, ఉన్నవూరు అంకమ్మ, గుర్రం వాహనాలను ఆలయం నుంచి ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్బాబు, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, అధికారుల సమక్షంలో ఆలయం నుంచి వెలుపలకు తీసుకొచ్చారు. అనంతరం విగ్రహా లను సేవకులు(రజకులు)తలపై పెట్టుకొని గ్రామ వీధుల్లో మేళతాళాలు, డప్పు వాయుద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగించారు. బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, తెలంగాణకు చెందిన కొమ్ములవారి నృత్యాలతో పాటు కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ వద్ద నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎం.ఎస్.కె.అర్జున్ అమ్మ వార్ల విగ్రహాలకు స్వాగతం పలికి నీళ్లు వారు పోశారు. విగ్రహాలను తలపై మోసిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రానికి విగ్రహాలు రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేడీఈసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆలయ ఈఈ ఎల్.రమా, ఏఈ రాజు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, వాసిరెడ్డి బెనర్జీ, నూతలపాటి చెన్నకేశవరావు, లగడపాటి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
దేశభవిష్యత్లో యువత భాగస్వాములు కావాలి
కమలానందభారతి విజయవాడ కల్చరల్: ౖహెందవజాతిని జాగృత పరచాలని భువనేశ్వరి పిఠాధిపతి కమలానందభారతి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులోని శంకరామార్గ్లో ఆదివారం హైందవ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమలానంద భారతి మాట్లాడుతూ నేటి యువత దేశ భవిష్యత్లో భాగస్వాములు కావాలని సూచించారు. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం దేశ భవిష్యత్ రూపురేఖలను సమూలంగా మార్చివేసిందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆంధ్రప్రదేశ్ ప్రచారక్ విజయాదిత్య మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కలమతాలకు ఆతీతంగా పనిచేస్తోందన్నారు. హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజలతోమమేకమై పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన డాక్టర్ కుందా శ్రీధర్, ఉపదృష్ట అనూరాధ ప్రసంగించారు. తొలుత శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తగా నాగలింగం శివాజీ వ్యవహరించారు. -
పేదల బియ్యంతో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియాసాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదల బియ్యాన్ని బొక్కేస్తున్నారు. చౌక ధరల దుకాణాలు కేంద్రంగా భారీగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. లబ్ధిదారుడికి పదో పరకో ఆశచూపి.. రూ.కోట్లు దండుకుంటున్నారు. రేషన్ షాపులకు వెళ్లిన వారికి డీలర్ల ద్వారా నగదు బదిలీ చేసి, ఆ బియ్యాన్ని దర్జాగా షాపుల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. తనిఖీలు చేయాల్సిన పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎస్డీటీలు, ఆర్ఐలు ఏళ్ల తరబడి తిష్ట వేసి, రేషన్ మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కూడా నెలవారీ మామూళ్లు పెట్టుకొని, దందాకు పచ్చ జెండా ఊపుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికార పార్టీ నేతలే రేషన్ మాఫియాకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ వాహనాలు ద్వారా అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రచారం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం చాలాచోట్ల సంచులు విప్పకుండానే బియ్యాన్ని తరలించేస్తున్నా చోద్యం చూస్తోంది. నెలకు పది కోట్లకు పైనే సంపాదన.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకుని వినియోగిస్తున్నారు. నియోజకవర్గానికి నెలకు 500 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ చేసి, కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. మిగిలిన వారంతా డీలర్ల ద్వారా దళారులే అక్రమ రవాణా చేస్తున్నారు. లబ్ధిదారుడు నుంచి కిలో రూ.10 నుంచి రూ.14కు డీలర్ల నుంచి దళారులు కొనుగోలు చేస్తారు. అక్కడ నుంచి దళారులు ప్రధాన మాఫియా నేతలకు కిలో రూ.20 నుంచి రూ.24కు అమ్ముతారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేయించి కిలో రూ.50 నుంచి రూ.60కి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కొన్నిచోట్ల అయితే సంచులు కూడా మార్చకుండా నేరుగా ఈ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. వీటి ద్వారా జిల్లాలో రేషన్ మాఫియా ప్రతి నెలా రూ.10కోట్లకు పైగా సంపాదిస్తున్నట్టు సమాచారం. నెలకు రూ.35 లక్షలు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాని చూసీ చూడనట్టు వదిలేస్తున్నందుకు ప్రతినెలా నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు రూ.35 లక్షలు, పోలీసులకు ప్రతి నియోజకవర్గం నుంచి నెలకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు రేషన్ మాఫియా ముట్ట చెబుతున్నట్టు తెలిసింది. కొంతమంది డీలర్లు తాము అడిగినంత బియ్యం ఇవ్వకపోతే విజిలెన్స్ అధికారులతో లేదంటే స్థానిక అధికారులతో తనిఖీలు చేయించి బెదిరించి తమ దారికి తెచ్చుకుంటారు. అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం రవాణా చేస్తుండటంతో పోలీసులు, ఇతర అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఏజెంట్లు.. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా కోసం పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలతో అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధికే ఏకంగా నెలకు రూ.కోటికి పైగా ముడుపులు ముట్ట జెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న తన ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని విస్సన్నపేటకు తరలించి అక్కడ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. తెల్లవారుజామున రెండు గంటల నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ముందుగా ఒకరు మోటార్ సైకిల్పై వచ్చి ట్రయల్ వేస్తారు. తమకు అనుకూలమైన పోలీసులు ఉంటే దగ్గరలో లోడు చేసుకుని రెడీగా ఉన్న వాహన డ్రైవర్కు రమ్మని సమాచారం ఇస్తారు. ఈ వాహనానికి ముందు గానీ, వెనుక గానీ మాఫియా నేతలు మరో వాహనంలో వెళతారు. ప్రతిరోజూ ఒకే రూటులో కాకుండా రూట్లు మార్చి అక్రమ రవాణా చేస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి కూలీ డబ్బులిచ్చి ద్విచక్ర వాహనాలపై తమకు కావాల్సి ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా కాకినాడ ఓడరేవుకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుసార్లు పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ జరిపిన దాడుల్లో 200 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఏదో పట్టుకున్నట్టు చూపించాలని అనే ఉద్దేశంతో గుర్తొచ్చినపుడల్లా దాడులు చేస్తుంటారని, ఇవి కాకుండా రోజుకి టన్నుల కొద్దీ అక్రమ బియ్యం తరలి పోతూనే ఉంటుందని కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక్కడ కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాకు పామర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నడిపిస్తున్నట్టు సమాచారం. ఎవరైనా అధికారులు తనిఖీలకు వెళుతుంటే ముందుగానే వారికి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతం నుంచి వాటిని మార్చేస్తుంటారు. -
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ పీపీవీ మాల్ రోడ్డులో ఏర్పాటు చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూమ్ను శ్రీకమలానంద భారతిస్వామి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్యా రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజల విశేష ఆధారాభిమానాలతో విజయవాడ నగరంలో తమ నాలుగవ షోరూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంచీపురానికి చెందిన వెయ్యిమంది వీవర్స్ తమ కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా పట్టువస్త్రాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. వీవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. -
కేబుల్ సిబ్బందిపై దాడిచేసిన యువకుల అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మద్యం మత్తులో సిటీకేబుల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..స్థానిక బలరామునిపేటకు చెందిన వల్లెపు వెంకటేష్, వల్లెపు ఏసు, వల్లెపు సాయి అన్నదమ్ముల పిల్లలు. ఈ ముగ్గురు శనివారం రాత్రి మద్యం మత్తులో సిటీ కేబుల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వాచ్మన్గా పనిచేసే వృద్ధుడు చలపతిని చితకబాదారు. అడ్డువెళ్లిన మరో ఇద్దరు సిబ్బంది సాయి, సుబ్బారావుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఆగకుండా కార్యాలయంలోకి వెళ్లిన సిబ్బందిని వెంటాడి దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ఏసుబాబు ఆదివారం ముగ్గురు నిందితులను బలరామునిపేటలో అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వెంకటేష్, ఏసుపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఉత్సాహంగా సిప్ అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్
భవానీపురం(విజయవాడపశ్చిమ): సోషియబుల్ ఇంటలెక్చువల్ అండ్ ప్రోగ్రెసివ్ (సిప్) అకాడమీ రాష్ట్ర స్థాయి అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ సీజన్–10 కార్యక్రమం ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగాయి. ఈ పోటీలో వివిధ జిల్లాల్లోని పాఠశాలల నుంచి సుమారు 1050 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్లో గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 1న చైన్నెలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలకు హాజరవుతారు. ఈ సందర్భంగా సిప్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాకినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సిప్ అబాకస్ రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ పోటీలు పిల్లల్లో ఏకాగ్రత, దృశ్య జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయన్నారు. గత 22 ఏళ్లల్లో సిప్ అబాకస్ 10లక్షలకుపైగా పిల్లలకు శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఏరియా హెడ్స్ జమీర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రాంచైజీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకమని, ఆ దిశగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్తోపాటు బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునికీకరణ ద్వారా కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. ఆ ఘనత ఎన్టీఆర్దే.. మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారు అన్ని విధాలా ఎదిగేలా చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులని, వారి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రిమిలేయర్ తొలగింపు, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని కోరారు. బీసీ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి ఎస్.సత్యనారాయణ, బీసీ, ఓబీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి.కేదారేశ్వరరావు, జనరల్ సెక్రటరీలు పి.శ్రీధర్, పి.భూషణ్రావు, ట్రెజరర్ వై.శంకరరావు, 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘శ్రీభవిష్య’ బ్రోచర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ నగర విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ సూచించారు. శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ యాజమాన్యం నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీభవిష్య గ్లోబల్ స్కూల్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మహాత్మాగాంధీరోడ్డులోని శ్రీశేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. గతేడాది శ్రీభవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి ఐఐటీ, నీట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈసందర్భంగా శ్రీభవిష్య డైరెక్టర్లు మాట్లాడుతూ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్లో ప్రతి విద్యార్థిని ఐఐటీ, నీట్ లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలో విజయం సాధించేలా తీర్చిదిద్దుతుందని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లతోపాటు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంటుమిల్లి: మండల పరిధిలోని అర్తమూరు గ్రామం వద్ద 216 జాతీయ రహదారి మార్జిన్లోని వసంతరాయకోడు మైనర్ డ్రైయిన్లో పడి ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొర్లపాడు గ్రామానికి చెందిన వ్యయసాయ కూలీ బోడావుల నాగేంద్రం(45) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతను రెండురోజులుగా ఇంటికి రావడంలేదు. ఈ క్రమంలో నాగేంద్రం రహదారి మార్జిన్లోని మైనర్ డ్రైయిన్లో పడి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మద్యం తాగి రహదారి గోడపై పడుకుని ప్రమాదవశాత్తూ దొర్లి డ్రైయిన్లో పడి మృతిచెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఏ.గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం వన్టౌన్లోని సామారంగం చౌక్లోగల ది బెజవాడ కమర్షియల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ విజయసారధి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఓ.నాగేశ్వరరావు, సెక్రటరీ కోసూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి డార్విన్ అధ్యక్షత వహించారు. అశోక్జైన్, డాక్టర్ దుర్గా నాగరాజు, జిల్లా నాయకులు అల్తాఫ్, ఎన్.సురేష్, వి. కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: అమ్మవారి రంగుల మహోత్సవం విజయవంతానికి అందరూ సహకరించాలని పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి ఆదివారం కోరారు. రంగుల మహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం 6.11గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవతామూర్తులను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, మధ్యాహ్నానానికి గ్రామంలోని రంగుల మండపం వద్దకు చేరుస్తామన్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత విగ్రహాలు వత్సవాయి మండలం మక్కపేట చేరుతాయన్నారు. అక్కడి నుంచి చిల్లకల్లు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జగ్గయ్యపేటలోని రంగుల మండపానికి విగ్రహాలు చేరుతాయన్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు ఆధ్వర్యంలో విగ్రహాల ముందు బేతాళ వేషాలు, కోలాట నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బండ్లు వెంట అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఈవో కోరారు. -
అమెరికాది యుద్ధోన్మాదం: సీపీఎం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని అందరూ నిరసించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వెనిజులా దేశ అధ్యక్షుడు మదురో అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనిజులా ఆయిల్ నిక్షేపాలపై పెత్తనం కోసమే అమెరికా అక్రమ దాడులకు పాల్పడిందన్నారు. అమెరికా మూడో ప్రపంచదేశాలపై అమానుషంగా విరుచుకుపడుతుందన్నారు. తన పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికి ఎంతటి దుశ్చర్యలకైనా వెనుకాడడం లేదని విమర్శించారు. ఈ దాడులు, అరెస్ట్లను ప్రపంచం యావత్ ముక్తకంఠంతో ఖండిస్తున్నా, మనదేశ పాలకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ప్రపంచ ఆధిపత్య అహంకారంతో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం గర్హనీయమన్నారు. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డ్రగ్స్ సరఫరా చేసే దేశాల జాబితాలో వెనిజులా లేదని గుర్తుచేశారు. ప్రపంచ సహజ సంపదపై తనదేశ కంపెనీల పెత్తనానికే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మధురో, ఆయన భార్యను డ్రగ్స్ పేరుతో అక్రమ అరెస్టులకు పాల్పడడం అమెరికా ఒంటెత్తు పోకడలకు నిదర్శమన్నారు. అమెరికా పెత్తనాన్ని అందరూ ఖండించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి, ఆపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పూర్ణాహుతితో ముగిసిన ఆరుద్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆరుద్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం హోమగుండం వద్ద పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు జరిపించిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, మంటప పూజలను ఆలయ అర్చకులు జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. సాయంత్రం శ్రీశివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై ఉత్సవ మూర్తులు నగర పురవీధుల్లో విహరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ కేటగిరీలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో ఆడేందుకు క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలోని క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్లో ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటోలు–2, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో ఆ రోజు ఉదయం 8గంటలకు కాకినాడ క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలోని ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.వెంకటరమణను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆరుద్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి నుంచి శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉండగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, చైర్మన్లు కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల కోలాట నృత్యాలతో ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, దుర్గగుడి టోల్గేట్ మీదగా ఆలయానికి చేరుకుంది. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. -
నవజాత శిశువులకు ఆధునిక చికిత్సలపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నవజాత శిశువులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం, అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్సలపై అను మై బేబీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్తో కలిసి ఎనికేపాడులోని ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సును అను హాస్పటల్స్ గ్రూప్ ౖచైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 400మందికి పైగా వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ నవజాత శిశువుల వైద్యంలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ చికిత్సలతో శిశుమరణాల రేటును గణనీయంగా తగ్గిందన్నారు. సదస్సులో ఎన్ఆర్పీ, పిడియాట్రిక్ రీససిటేషన్ అండ్ ఎఫ్బి ఆస్పిరేషన్, ఇంటుబేషన్లతోపాటు, నియోనాటాలజీ ఎమర్జెన్సీస్, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్ ఎమర్జెన్సీస్లపై నిపుణులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో అను మైబేబీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీదేవి, డైరెక్టర్లు డాక్టర్ ఎస్.కిరణ్కుమార్, కె.రవికుమార్, పిడియాట్రిక్ టీమ్ డాక్టర్ బి.రేవంత్, డాక్టర్ ఎం.ఎన్.శ్వేత, డాక్టర్ గోవింద రాజులు, డాక్టర్ జోత్స్న ముత్యాల, డాక్టర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆపాదమస్తకం.. పుస్తకం
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సాహితీ సుగంధాలు వెదజల్లు తోంది. చల్లని సాయంత్రం వేళలో వేలాదిగా కొలువుదీరిన పుస్తకాలు ఆహ్వానం పలుకుతుండగా.. వేదికలపై ప్రముఖుల ప్రసంగాలు.. మ్యాజిక్షోలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకర్షిస్తున్నాయి. విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణం మూడో రోజు ఆదివారం జనసంద్రంగా మారింది. సెలవురోజు క ావడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తక ప్రియులు వివిధ స్టాళ్లను ఆసక్తిగా తిలకిస్తూ.. ఆయా వేదికలపై కార్యక్రమాలను ఆస్వాదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
బాధ్యతగా హెల్మెట్ ధరించాలి
జాయింట్ రవాణా కమిషనర్ మోహన్లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రమాదాల తీవ్రతను తగ్గించి ప్రాణాలను కాపాడుతుందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఆదివారం హెల్మెట్ ధరించని వాహనదారులపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎ. మోహన్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31 వరకూ రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వాహనదారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో సంవత్సరానికి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
వాలీబాల పోటీల విజేత సచివాలయం జట్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ప్రత్యే క రక్షణ దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్మీట్ వాలీ బాల్ పోటీ లు ఆదివా రం ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం ఆరు టీమ్లు పాల్గొన్నాయి. సచివాలయం, ఎయిర్పోర్టు జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీల్లో సచివాలయం టీమ్ విజేతగా నిలువగా, ఎయిర్పోర్టు జట్టు రన్నరప్గా నిలిచింది. ఈసందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందరరావు, ప్రభుత్వ ముద్రణాలయం ఇన్చార్జి జూనియర్ మేనేజర్ నాగవరపు శరత్ మాట్లాడుతూ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులను అభినందించారు. క్రీడలలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజున బహుమతి ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిస్టెంట్ కమాండెంట్ పీవీఎస్ఎన్ మల్లికార్జునరావు. ఇన్స్పెక్టర్లు సిహెచ్ విజయ్కుమార్, బి.ఫణికుమార్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. పెడన: బీసీలు రాజ్యాధికారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంఘటితంగా పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ రాష్ట్ర సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పెడన పట్టణంలోని తోటమాల ఫంక్షన్ హాల్లో కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బీసీల గౌరవసభను నిర్వహించారు. సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు గూడవల్లి కృష్ణార్జునరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 140పైగా ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ తదితరులు ప్రసంగించారు. హక్కులు, రిజర్వేషన్లు, సమాన అవకాశాల కోసం జరిగే సామాజిక, రాజకీయపోరాటమే బీసీ ఉద్యమ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, సంఘ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు బొర్రా కాశీ విశ్వేశ్వరరావు(కాశీ), బెల్లంకొండ లక్ష్మణ్, వీరంకి శ్రీనివాసరావు, మట్టా వెంకటేశ్వర రావు, పార్టీ వెంకటేశ్వరరావు, కాలేపు సూరిబాబు, వేముల ప్రసాద్, మురాల ఫణి, కట్టా సతీష్, కాగిత వాసు, బెజవాడ నాగరాజు, తాతా వీరబాబు, జంపాన ఫకీర్, బళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సమగ్ర క్రీడా పాలసీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు రాష్ట్రంతో సహా 17 రాష్ట్రాల క్రీడావిధానాలు, పనితీరును అధ్యయనం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూ.54 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టామన్నారు. శాశ్వత క్రీడా మౌలికవసతుల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, విశాఖపట్నం కొమ్మాదిలో రూ.25కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మాణం, విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, అరకు–పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులు, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియాన్ని ఆధునిక ప్రమాణాలతో అభివృద్థి చేసేందుకు శాప్ చర్యలు చేపడుతోందన్నారు. తిరుపతిలో స్టేడియం, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ప్రధాన క్రీడా కేంద్రంగా అభివృద్థి చేస్తామన్నారు. పలువురు కబడ్డీ క్రీడాకారుల సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కావడంతో వారి మీద చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు శాప్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొనాలని, రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలు ఈనెల 15వ తేదీలోపు క్రీడా యాప్లో తమకు సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో శాప్ డైరెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. – శాప్ చైర్మన్ రవినాయుడు -
నాట్య సౌరభం.. సంక్రాంతి సంబరం
విజయవాడ కల్చరల్: జేఎంఎస్ యోగభారతి అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో స్థానిక కేబీఎన్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు–2026 తెలుగు సంప్రదాయ సౌరభాన్ని చాటింది. నేటి యువతకు సంక్రాంతి పండుగలోని పరమార్థం వివరించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నాట్యాచార్యులు జంగం విజయకుమార్, నిర్వాహకుడు శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. జంగం స్టిస్టర్స్ మనీషా చక్రవర్తి, శ్రీనివాస చక్రవర్తి పర్యవేక్షణలో 90 పైగా చిన్నారులు నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారక ముందే రైతులు పొలాలకు వెళ్లడం, ఇంటి ముందు గొబ్బెమ్మలు, పల్లె జీవన సౌందర్యం, హరిదాసులు, గంగి రెద్దులు, పిట్టల దొరలు, చెక్కభజనలు, బుర్రకథలు, కోలాటం తదితర అంశాలతో కూడిన నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, కళాశాల ప్రిన్సిపాల్ జి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రెండుగంటలపాటు సాగిన నృత్య కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
జూడోలో ఒలింపిక్ మెడల్ సాధించాలి
అవనిగడ్డ: జూడో క్రీడల్లో దివిసీమ క్రీడాకారులు ఒలింపిక్ మెడల్ సాధించాలని బొండాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అవనిగడ్డలోని ఎస్విఎల్ క్రాంతి కళాశాలలో కృష్ణాజిల్లా జూడో అసోసియేషన్ వారిచే బొండాడ రాఘవేంద్రరావు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన జూడో శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ జూడో క్రీడలో శిక్షణ పొందితే ఆరోగ్యం, ఆత్మరక్షణతోపాటు ఈరంగం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్కానరు. ఒలింపిక్, ఏషియా గేమ్స్ పోటీల్లో స్థానం కలిగిన జూడో క్రీడల్లో ఆంతర్జాతీయ స్థాయి టోర్నమెంటును రాష్ట్రంలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి జల క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న దివిసీమ బాలిక నాగిడి గాయిత్రి స్ఫూర్తితో విద్యార్థులు జూడోలో పతకాలు సాధించాలని సూచించారు. ఈసందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన జూడో క్రీడాకారులు అద్భుతమైన జూడో విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎస్విఎల్ క్రాంతి విద్యాసంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు, జూడో అసొసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి నామిశెట్టి వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు ప్రసంగించారు. జూడో శిక్షణా కేంద్రం నిర్వహణకు అవసరమైన షీట్స్, దుస్తులను రాఘవేంద్రరావు అందజేశారు. -
దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు కుమార్తె రుద్రనవ్య తన తొలివేతనం నుంచి రూ.1,01,116 విరాళాన్ని అమ్మవారి బంగారు తాపడం పనులకు విరాళంగా అందజేశారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన ఎం.గోపాల్ కుటుంబం అమ్మవారి బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. విజయవాడ దుర్గా ఆగ్రహారంకు చెందిన ఎం.నాగలక్ష్మీసాయిసత్య కుటుంబసభ్యులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,010 విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలను ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. పెనమలూరు: ఈనెల 5వతేదీ నుంచి బెంగళూరులోని ఎస్–వ్యాసా యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సీటీ పోటీలకు కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీ యోగాసన మహిళల జట్టును ఎంపిక చేసినట్లు వర్సీటీ ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు శనివారం తెలిపారు. ఈ జట్టులో వి.నీలవేణి, ఎ.చైతన్య, టి.యోగిత, ఐ.చందన, వి.గాయత్రి, డి.హాసిని ఉన్నారన్నారు. మహిళల యోగాసన జట్టును ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ. రత్నప్రసాద్, కోచ్.జి.రామలింగేశ్వరరావు అభినందించారు. మోపిదేవి: శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్రం సందర్బంగా మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పెదకళ్లేపల్లి శ్రీదుర్గా నాగేశ్వరస్వామివార్లకు శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు బుద్దు పవన్కుమార్శర్మ, ప్రసాద్శర్మ బ్రహ్మత్వంలో స్వామివార్లకు రుద్రాభిషేకం చేశారు. శ్రీదుర్గా నాగేశ్వరస్వామిని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు దర్శించుకున్నారు. అనంతరం స్వామివార్లను శేషవాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరం వేళ డిసెంబరు 31 రాత్రి చర్చికి వెళ్లిన మేనత్త ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేసిన ఓ యువకుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, శనివారం అరెస్టు చేసి చోరీచేసిన రూ.23 లక్షల విలువైన 176 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు...గుంటూరుజిల్లా తాడేపల్లికి చెందిన గండికోట మనోజ్కుమార్ హెయిర్విగ్లు బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో వాంబేకాలనీలో ఉంటున్న తన మేనత్త అరుణ గత డిసెంబరు 31న రాత్రి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లగా, ఆమె ఇంట్లో నగలు, నగదు ఉంటాయని తెలిసిన మనోజ్కుమార్ వెనుక ఉన్న తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా తాళం తీసి అందులోని బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఏడీసీపీ యం రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐలు శ్రీనివాసరావులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈక్రమంలో శనివారం వన్టౌన్ శివాలయం వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మనోజ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ యం రాజారావు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు. -
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
భవానీపురం(విజయవాడపశ్చిమ): కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళా హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామా జిక విప్లవకారిణి సావిత్రిబాయిపూలే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్లో శనివారం తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి కార్య క్రమం జరిగింది. తొలుత ఆమె విగ్రహానికి మంత్రి సవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర విద్య కోసం కృషి చేయటమే కాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకించటం, వితంతు వివాహాలను ప్రోత్సహించటం వంటి అనేక చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖరరాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఫెడరేషన్ ప్రతినిధులు కె.శ్రీనివాసులు, ఎం. ప్రసాద్, చలం, వి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై యువకుడి హత్యాయత్నం
కంకిపాడు: ఓ యువకుడు వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కంకిపాడులో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు...పట్టణంలోని మురళీ ఆసుపత్రిరోడ్డులో ఉంటున్న వక్కలగడ్డ వకుళాదేవి(60) ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కట్టెపోగు కృపాకర్ అలియాస్ పెట్రోల్ అనేవ్యక్తి ప్రవేశించాడు. వంట గదిలోని కత్తెర తీసుకుని వకుళాదేవిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వృద్ధురాలి శరీరం, తల, ఛాతీ తదితరప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈక్రమంలో ఆమె పెద్దగా కేకలు వేయడంతో యువకుడు కృపాకర్ అక్కడ్నుంచి పారిపోయేందుకు యత్నించగా, ఇరుగుపొరుగు అప్రమత్తమై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే కృపాకర్ గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. గాయపడిన వకుళాదేవిని చికిత్సనిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని వెంటబెట్టుకుని సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డీ.సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు శనివారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
సర్కారీ ఆవకాయ్.. అడ్డొస్తే కూల్చేయ్!
ప్రైవేట్ స్థలాల్లోకి చొరబడి మరీ కూల్చివేతలు సర్కారీ ఆవకాయ్.. అడ్డొస్తే కూల్చేయ్! కూల్చివేసిన అప్కాస్ట్ సరిహద్దు ప్రహరీ పునాదులు భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడ కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్లో ‘ఆవకాయ్ అమరావతి’ పేరిట ఉత్సవాలు నిర్వహించనుంది. ఈ ఉత్సవాల కోసం అడ్డం వచ్చిన కట్టడాలను అధికారులు యథేచ్ఛగా కూల్చివేస్తున్నారు. అది ప్రభుత్వ స్థలమా? లేక ప్రైవేట్ స్థలమా అన్నది పట్టించుకోవడం లేదు. ప్రైవేటు స్థలాల్లో కట్టడాలను సైతం అడ్డం వస్తున్నాయన్న సాకుతో ధ్వంసం చేస్తున్నారు. పున్నమిఘాట్ వద్ద అత్యధిక స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవే. తమతో చెప్పకుండానే తమ స్థలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారంటూ ఇటీవల అక్కడే ప్రెస్మీట్ పెట్టి ఆయా స్థలాల ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆవకాయ్ అమరావతి ఉత్సవాన్ని ప్రభుత్వ స్థలంలోనే నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ స్థలాల్లోకి చొరబడిమరీ సరిహద్దుగా ఏర్పాటు చేసుకున్న రేకులను తొలగిస్తున్నారు. అక్కడితో సరిపెట్టుకోకుండా ఆవకాయ్ ఉత్సవానికి అవసరమంటూ ప్రైవేట్ స్థలమైన బబ్బూరి గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటున్న ఎగ్జిబిషన్కు సంబంధించి కట్టుకున్న స్టాళ్లను కూడా నిరాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. పున్నమిఘాట్లో సొంత స్థలం చుట్టూ నిర్మించుకుంటున్న సరిహద్దు గోడను సైతం కూల్చేశారు. అంతా తమ ఇష్టం అన్న చందంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్కాస్ట్ ప్రహరీ పునాది కూల్చివేత భవానీపురం కరకట్ట సౌత్ రోడ్డులోని పున్నమిఘాట్కు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అప్కాస్ట్) రీజనల్ సైన్స్ సెంటర్కు చెందిన సుమారు ఎకరానికిపైగా ఉన్న ఖాళీ స్థలాన్ని రెండేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని సరిహద్దుల ప్రకారం సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చు పెట్టి ప్రహరీ నిర్మించారు. 2024 అక్టోబర్లో చంద్రబాబు ప్రభుత్వం పున్నమిఘాట్లో నిర్వహించిన డ్రోన్ షో కార్యక్రమానికి అడ్డుగా ఉందని అప్ కాస్ట్ సరిహద్దు గోడను జేసీబీతో కూల్చివేశారు. ఆ ప్రహరీని పునర్నిర్మించే ఒప్పందంపైనే కూల్చివేశా రని, తిరిగి నిర్మిస్తారని అప్పట్లో అప్కాస్ట్ అధికారులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అటువంటిదేమీ జరగకపోగా ఇప్పుడు ఆవకాయ్ అమరావతి పేరుతో అదే స్థలంలో నిర్వహించనున్న కార్యక్రమాల కోసం గతంలో కూల్చేసిన ప్రహరీకి సంబంధించి సుమారు అడుగు ఎత్తులో ఉన్న గోడతోపాటు పునాదులను సైతం డ్రిల్లింగ్ యంత్రంతో ధ్వంసం చేశారు. అంటే అప్కాస్ట్ సరిహద్దు స్థలం మొత్తాన్ని నేలమట్టం చేసేశారు. అది ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా కావడం గమనార్హం. 2016వ సంవత్సరంలో కృష్ణాపుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్ ఫ్రంట్ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి పున్నమిఘాట్ నిర్మిం చింది. ఈ ఘాట్లో సింహభాగం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పరాధీనం అయ్యింది. పున్నమిఘాట్ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థలాన్ని వారికి స్వాధీనం చేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి తహసీల్దార్ పున్నమిఘాట్లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాధీనం చేశారు. ఆ తరువాత స్థల యజమానులు చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్ షో, సీ ప్లేన్ కార్యక్రమాలకు ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్) సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉండి ఉంటే ఈ రోజు ఆవకాయ్ అమరావతి కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రభుత్వ ముద్రణాలయంలో స్పోర్ట్స్మీట్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): క్రీడలతో మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతా యని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం ఇన్స్పెక్టర్ జనరల్ బి.వెంకటరామిరెడ్డి అన్నారు. ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో శనివారం ప్రత్యేక రక్షణ దళం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రత్యేక రక్షణ దళం ఆధ్వర్యాన స్పోర్ట్మీట్ ప్రారం భోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ డయాబెటిక్ వైద్య నిపుణుడు కె.వేణుగోపాలరెడ్డి, ప్రభుత్వ ముద్రణాలయం డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్కుమార్, కమాండెంట్ ఎం.శంకరరావు తదితరులతో కలిసి పావురాలు, గ్యాస్ బెలూన్లను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలన్నారు. పోటీల్లో ఉద్యోగులు పాల్గొని తమ లోని ప్రతిభను చాటాలని సూచించారు. డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. క్రీడల ద్వారానే చక్కని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అని తద్వారా డయాబెటిస్ ఇంకా ఇలాంటి తదితర రోగాల బారిన పడకుండా ఉండొచ్చన్నారు. ప్రభుత్వ ముద్రణాలయం డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్కుమార్ మాట్లాడుతూ.. ముద్రణాలయంలో ఇంత చక్కటి క్రీడా పోటీలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ సెల్ఫోన్లకు అంకితం కాకుండా క్రీడల్లో రాణించాలని సూచించారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు మాట్లాడుతూ.. ఇక్కడ రెండు రోజుల పాటు ఆరు టీమ్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముద్రణాలయం ఇన్చార్జి జూనియర్ మేనేజర్ నాగవరపు శరత్, అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందరరావు, ఇన్స్పెక్టర్లు సీహెచ్ విజయ్ కుమార్, బి.ఫణి కుమార్, బి.సన్యాసయ్య, రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి
పుస్తక మహోత్సవంలో వక్తలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): యువత ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. విజయవాడ పుస్తకమహోత్సవంలో భాగంగా ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్బాబు రచించిన ‘మీరు శ్రీలు కావచ్చు’ పుస్త కాన్ని మండలి బుద్ధప్రసాద్ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కీలకపాత్ర పోషించే యువత ఉన్నత వ్యక్తిత్వం కలవారుగా ఉండాలన్నారు. ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు శ్రీధర్బాబు రచన ఉపయోగపడుతుందన్నారు. సామాన్యులను అసామాన్యులుగా మార్చే శక్తి ఈ రచనకు ఉందని అభినందించారు. విద్యే సాధనంగా తమ జీవితాలను మార్చుకోవాలకునే యువతీయువకులు ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. పుస్తక సంపాదకుడు వల్లీశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలో తగిన గుర్తింపు పొందడం, నలుగురికీ తమ వంతు సహాయం చేయడం వంటి రెండు మంచి పనులు విద్య వల్ల సుసాధ్యమవుతాయని వివరించారు. రచయిత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిలోనూ ఉన్న అంతర్గత శక్తులను వెలికితీయడమే లక్ష్యంగా కథలతో కలగలిపి ఒక ప్రయత్నం చేశామన్నారు. 36 కథలుగా ఉన్న ఈ పుస్తకం యువ తకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రచురణకర్త దూపాటి విజయకుమార్ సభను నిర్వహించారు. ‘మను స్మృతిలో ఏముంది?’ పుస్తకావిష్కరణ మాకినేని బసవపున్నయ్య అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, మాజీ ఎంపీ పి.మధు రచించిన ‘మనుస్మృతిలో ఏముంది?’ పుస్తకాన్ని సాహితీ విమర్శకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైతన్యవంతమైన పౌరులు వివిధ విధానాలు, సిద్ధాంతాల వల్ల ప్రయోజనాల గురించే కాక, వాటి వల్ల రాబోయే ప్రమాదాలను సైతం చర్చించాలన్నారు. సామాన్య విద్యావంతులకు కూడా అర్థమయ్యే భాషలో ‘మను స్మృతిలో ఏముంది?’ పుస్తకం రాసిన రచయితను అభినందించారు. మను స్మృతి భావజాలం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం ప్రవ చిస్తున్న భావజాలాన్ని విశ్వసించి పాటించేవారే నిజమైన దేశభక్తులన్నారు. సభాధ్యక్షుడు పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ.. దేశ వెనకబాటుతనానికి గల కారణాల్లో మను స్మృతి భావజాలం కూడా ఒకటన్నారు. కులవివక్ష ప్రాచీన సమాజంలోని ఒక రుగ్మతని పేర్కొన్నారు. అది ఆధునిక యుగంలోనూ కొనసాగడం దురదృష్టకరమన్నారు. మానవులందరూ సమానమని, మహిళలను గౌర వించాలని మను స్మృతిలో ఉన్నప్పటికీ సానుకూల అంశాల కన్నా, వివక్షాపూరితమైన అంశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మను స్మృతిని ఖండించారని చెప్పారు. పాత్రికేయుడు వరప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంపై భగవద్గీత కన్నా మనుధర్మశాస్త్ర ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు. అక్షరాస్యత నామమాత్రంగా ఉన్నకాలంలో కొద్దిమంది అక్షరాస్యులు సృష్టించిన ఈ పుస్తకంలోని నియమాలు, కట్టుబాట్లు నేటికీ పాటించాలనుకోవడం విచారకరమన్నారు. కళాకారుడు గుండు నారాయణరావు సభకు స్వాగతం పలకగా ఎంబీ విజ్ఞానకేంద్రం బాధ్యుడు క్రాంతి వందన సమర్పణ చేశారు. -
భూవివాదాలు లేకుండా పాస్ పుస్తకాలు : జేసీ
జుఝవరం(పామర్రు): గ్రామాల్లో ప్రజల మధ్య భూవివాదాలు, రికార్డుల్లో తప్పులకు అవకాశం లేకుండా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. పామర్రు మండలం జుఝవరం గ్రామ సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ భూమియే ప్రాణంగా బ్రతికే రైతులకు భూసమస్యలు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు.నిర్దిష్ట సమయంలోగా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని, అందుకు మండల తహసీల్దార్ ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన పలువురు రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జన్ను శోభన్బాబు ,మండల తహసీల్దార్ జీ రవికాంత్, గ్రామ సర్పంచ్ పుట్టి పున్నమ్మ, ఆర్ఐ రాము, వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నిర్దిష్ట కార్యాచరణతో నూరుశాతం ఫలితాలు
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంఅర్బన్: పదోతరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమేనని, అందుకు నిర్దిష్ట కార్యాచరణతో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. పదో తరగతి పరీక్షల ఫలితాల మెరుగుదల లక్ష్యంగా శనివారం కృష్ణా యూనివర్సిటీలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో 100రోజుల కార్యాచరణ వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగ్జిస్టెన్స్ టు ఎక్సలెన్స్–రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ పేరుతో రూపొందించిన సవరించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను సంబంధిత ఉపాధ్యాయుల సహకారంతో గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. విద్యార్థులు కుటుంబపరిస్థితులు, మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, జిల్లా విద్యాశాఖాధికారి యువి.సుబ్బారావు, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం మేరకు..చిట్టినగర్ వీరయ్య వీధికి చెందిన కర్రి రవి(28) తాపీ పనిచేస్తూ తల్లి నాగమణితో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉన్న రవి శనివారం సాయంత్రం ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు రవిని కిందకు దింపి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ఇంద్ర గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మ వారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై శ్రీగంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి, దేవస్థాన ప్రచార రథానికి కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, చిన్నారుల కోలాట నృత్యాల మధ్య సాగిన ఊరేగింపులో ఆది దంపతుల వెంట పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు ఆదిదంపతులకు పూజాసామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం సైబర్ క్రైమ్ పెనుసవాల్గా మారిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీసు శాఖాపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నారని, వారి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమిషనరేట్లోని తనచాంబర్లో శనివారం ఆయన సైబర్ నేరాల నివారణపై బ్యాంకు ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతో సైబర్ సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తేనే సైబర్ క్రైంను నిరోధించగలమన్నారు. డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్టుల బారిన పడకుండా ముందుగా తెలుసుకునే విధానం, పోలీసులకు రిపోర్టుచేసేందుకు పాటించాల్సిన సూచనలను తెలియజేశారు. ఇందుకు వినియోగించే వెబ్సైట్పై బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. సైబర్ నేరాలను నిరోధించే కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న, ఏసీపీ రాజశేఖర్, ఇన్స్పెక్టర్లుశ్రీనివాస్, శివాజీ, వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన 120మంది సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ రహదారులు, మోర్త్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే) అధికారులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్ (చిన్ని), శాసనసభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం వీరిద్దరూ విలేకర్లతో మాట్లాడారు. మచిలీపట్నం పోర్టు పనులు మరో ఏడాదిలో పూర్తి కానున్నాయని కనెక్టివిటీ రహదారికి నెలాఖరులోగా అనుమతులు రానున్నట్లు తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం ఆరు లేన్ల రహదారి పనుల డీపీఆర్పై చర్చించామన్నారు. రహదారుల విస్తరణపై విజయవాడ నుంచి గోశాల వరకు రహదారి విస్తరణ, గుడివాడలో రహదారి నిర్మాణం తదితర అంశాలపై చర్చించామన్నారు. కత్తిపూడి – ఒంగోలు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించనున్న నేపథ్యంలో లోసరి బ్రిడ్జి నుంచి ఉల్లిపాలెం వరకు సముద్రతీరం వెంట గ్రామాలను కలిపేలా రోడ్డు పనులు చేపట్టడానికి మాట్లాడామని చెప్పారు. పామర్రు – చల్లపల్లి రోడ్డును జాతీయ రహదారిగా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కంకిపాడు – గుడివాడ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీపై చర్చించామని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.జాతీయ రహదారులు, మోర్త్ అధికారులతో మంత్రి, ఎంపీ, శాసనసభ్యుల సమావేశం -
అనుమానాస్పద స్థితిలో పసికందు మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెంకటాపురం(మోపిదేవి): మండలంలోని వెంకటాపురం గ్రామంలో 45 రోజుల పసికందు అనుమానాస్పదంగా నీటిగుంటలో శవమై కనిపించింది. మండలంలో సంచలనం కలిగించిన ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గౌతమ్కుమార్ తెలిపిన వివరాల మేరకు రావి ప్రభుకుమార్, సాయి చైతన్య దంపతులకు 40 రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ప్రభుకుమార్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. భార్య సాయి చైతన్య బిడ్డతో అత్తమామల ఇంటివద్ద వెంకటాపురంలో ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో చంటిపిల్ల కనిపించడం లేదని అత్త, కోడలు ఆందోళన చెందుతూ వెతికారు. చుట్టుపక్కల వారితో గాలించగా ఇంటి పక్కనే ఉన్న నీటి గుంటలో శవమై తేలడాన్ని గమనించారు. శుక్రవారం ఉదయం సాయి చైతన్య సోదరుడు వీరమాచనేని వితీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు. -
కప్పేసిన మంచు దుప్పటి
విజయవాడ నగరాన్ని శుక్రవారం మంచుదుప్పటి కప్పేసింది. మంచు.. దారులను చుట్టేసింది. వాహన చోదకులు పగలు కూడా లైట్ల వెలుగులో ప్రయాణించారు. ఎముకలు కొరికే చలికి పిన్న, పెద్ద అల్లాడుతున్నారు. రాత్రి వేళే కాకుండా పగలు కూడా శీతల గాలులు వీస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరాన్ని పొగ మంచు కమ్ముకుంది. ప్రజలు స్వెట్టర్లు, జర్కిన్లు, ఇతర రక్షణ పద్ధతులతో రోడ్లపైకి వచ్చారు. –కందుల చక్రపాణి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
నూతన సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
పెండ్యాల(కంచికచర్ల): ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో ప్రభుత్వం అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మండలం పరిధిలోని పెండ్యాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ గ్రామ సభలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పాల్గొన్నారు. భూయజమానులకు హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను ఈ–కేవైసీతో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునికీకరణ డేటా ద్వారా భూమి వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు వేగవంతమైన సేవలు రైతులకు అందుతాయన్నారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా, శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో పారదర్శకంగా పట్టాదారు పుస్తకాలు తయారు చేశామన్నారు. వరదలు వంటి విపత్తులు వచ్చినా భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పెండ్యాలను మరింత ప్రగతి దిశగా నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి వై.మోహన్రావు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, సర్పంచ్ షబ్బీర్ పాషా, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
క్రీడా పోటీలకు జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు బెంగళూరు లోని ఎస్–వైశ్యా యూనివర్సిటీ ఆవరణలో జరుగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యోగాసన (మహిళల) చాంపియన్ షిప్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతి నిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన కాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు చెందిన కె.హరిణి, టి.హేమకావ్య, కె.అంజని, కె.రక్షిత, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలకు చెందిన ఎం.వర్షిత, ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన ఎం. జ్యోతి కాళీప్రియా, టి.చందనతో పాటుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జె.రామును జట్టు మేనేజర్ గా ఎంపిక చేశామని తెలియజేశారు. సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఎంపిక నేటి నుంచి ఈనెల 6 వరకు కేఎల్యూడీమ్డ్ వర్సిటీ లో జరుగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (పురుషుల) టోర్నమెంట్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేశామని త్రిమూర్తి తెలియజేశారు. రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కళా శాలకు చెందిన పి.రవితేజ, ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన దర్ష జైన్, చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్కు చెందిన వి.కీర్తి వేషన్, విశాఖపట్నంలోని అనిల్ నిరుకొండ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీకు చెందిన ఎస్. నాయుడు, నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన ఎం.గురుసాగర్ రెడ్డి, గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలకు చెందిన జోసఫ్ ఆనంద్, నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన పి.సూర్యప్రకాష్, జట్టు మేనేజర్గా అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజికల్ డైరెక్టర్ కె.నాగరాజును ఎంపిక చేశామని తెలియజేశారు. జట్టులో ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సౌరబ్గౌర్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి అభినందించారు. సౌత్జోన్ షటిల్ పోటీలకు సిద్ధార్థ జట్టు ఎంపిక పెనమలూరు: సౌత్జోన్న్ ఇంటర్ యూని వర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశామని వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు తెలిపారు. ఆయన శుక్రవారం వివరాలు తెలుపుతూ సౌత్జోన్్ ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేఎల్ యూనివర్సిటీలో జరగనున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే జట్టుకు ఎండీ షోయబ్, సాయి పునీత్, టి.మనోజ్, పి.సోహిత్, టి.గణేష్లను ఎంపిక చేశా మన్నారు. ఈ సందర్భంగా జట్టుకు ఉప కులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులతో సౌరబ్ గౌర్, యూనివర్సిటీ ప్రతినిధులు; సిద్ధార్థ షటిల్ జట్టుతో వీసీ వెంకటేశ్వరరావు, ప్రో వీసీ రత్నప్రసాద్ -
పొంచి ఉన్న ఏఎంఆర్ ముప్పు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్).. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. మానవ తప్పిదాల కారణంగానే శరీరంలో ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చాలా కొద్దిమందిలో మాత్రమే జీన్స్ కారణంగా ఉంటుంది. ఇది వృద్ధి చెందితే యాంటీబయోటిక్స్ వాడినా పనిచేయని పరిస్థితి నెలకొంటోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలనే చూస్తే, ఇప్పుడు ఏఎంఆర్ వృద్ధి చెందిన రోగులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. విజయవాడ జీజీహెచ్లో ప్రసవం కోసం వచ్చిన మహిళలతో పాటు, పలువురు రోగుల్లో ఏఎంఆర్ ఉన్నట్లు గుర్తించారు. యాంటీ మైక్రోబియల్ అంటే... యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు, పరాన్నజీవులు వంటి సూక్ష్మజీవులు కాలక్రమేణా మార్పులు చెంది, వాటిని నాశనం చేయడానికి ఉపయోగించే ఔషధాలకు స్పందించకపోవడాన్ని సూచిస్తుంది. దీంతో సంక్రమణ వ్యాధుల చికిత్స కష్టంగా మారి, అనారోగ్య కాలం పెరగడం, వైద్య ఖర్చు అధికమవడం, మరణాల సంఖ్య పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సమస్య గుర్తించారు. శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ), అవయవ మార్పిడి వంటి సాధారణ వైద్య ప్రక్రియలు అధిక ప్రమాదకరంగా మారవచ్చు. ఎలా వృద్ధి చెందుతుందంటే.. దాని పరిణామాలు ఇలా ● చికిత్స విఫలమవడం ● అనారోగ్యం, మరణాల రేటు పెరగడం ● ప్రతిఘటక సంక్రమణలు వేగంగా వ్యాపించడం ● ఆరోగ్య వ్యవస్థలపై ఆర్థిక భారం పెరగడం ● స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ముప్పు కలుగుతుంది ఆరోగ్య సంరక్షణలో నిపుణుల పాత్ర ● బాధ్యతాయుతంగా యాంటీబయోటిక్స్ సూచించడం ● రోగులకు సరైన అవగాహన కల్పించడం ● సంక్రమణ నియంత్రణ పద్ధతులను కచ్చితంగా పాటించడం ● ప్రతిఘటక కేసులను నివేదించడం ఇవే నిదర్శనం ● జీజీహెచ్కు ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు రెండురోజులు ఓరల్ యాంటీబయోటిక్స్ ఇచ్చినా జ్వరం తగ్గలేదు. దీంతో ఆమెకు కల్చర్ పరీక్ష చేసి ఐవీ ఇవ్వడంతో చాలా రోజులకు కోలుకున్నారు. ● నగరానికి చెందిన ఓ 10 ఏళ్ల బాలుడికి అరుదైన ఇన్ఫెక్షన్ సోకింది. అతనికి యాంటీబయోటిక్స్ ఇస్తున్నా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు. డ్రగ్ కల్చర్ టెస్ట్ చేయగా ఏఎంఆర్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెనుముప్పుగా మారే ప్రమాదం పొంచిఉంది. యాంటీబయోటిక్స్ను సొంతంగా వాడటం, మందుల షాపుల్లో ఇచ్చినవి తీసుకోవడం, పూర్తిస్థాయిలో కోర్సు వాడకపోవడం వంటి కారణాలతో రెసిస్టెన్స్ పెరుగుతుంది. మందులకు లొంగని బ్యాక్టీరియా వైరస్, ఫంగస్లు వృద్ధి చెంది రోగికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడొద్దు. –ఆలపాటి ఏడుకొండలరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల -
పుస్తకాలపై యువత దృష్టి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యువత దృష్టి పుస్తకాలపై మరలుతోందని సీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన రామచంద్రమూర్తి ఇతర అతిథులతో కలిసి రచయిత బీవీ పట్టాభిరామ్కు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా తాను ప్రోత్సహించానన్నారు. ఆ తర్వాత ఆయన అనేక అద్భుత పుస్తకాలను తీసుకొచ్చారని వివరించారు. సాహితీవేత్త సాహిత్య అకాడమీ పురస్కార విజేత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. ఆత్మీయ అతిథి సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పుస్తక మహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో రెండు సార్లు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు అప్పరసు కృష్ణారావు మాట్లాడుతూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత పుస్తకాలదేనన్నారు. పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి కె.లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేయగా, ఎమెస్కో అధినేత డి.విజయకుమార్ సభను నిర్వహించారు. అధ్యక్షుడు టి. మనోహర్నాయుడు వందన సమర్పణ చేశారు. ‘నా నోరు కట్టేశారు’ సభకు అధ్యక్షత వహించిన ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తన నోరు కట్టేశారన్నారు. దానికి ముందు సీపీఐ నేత నారాయణ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. నారాయణ చెప్పినట్లు ఆయనకు తనకు నోరు కొంచెం జాస్తి అని కానీ తన నోరును కట్టేశారనడం నిజమేనన్నారు. బుక్ ఫెస్టివల్ సొసైటీకి అమరావతిలో స్థలాన్ని కేటాయించడానికి సహకారం అందిస్తానన్నారు. ఇక్కడ బుక్ ఫెస్టివల్ బాగుందన్నారు. -
బండారు అక్షరాలు సమాజంపై సంధించిన శస్త్రాలు
అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ విజయవాడ కల్చరల్: సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ బండారు రాధాకృష్ణ అక్షరాలు వర్తమాన సమాజ తీరుతెన్నులపై సంధించిన అస్త్రశస్త్రాలు అని అవనిగడ్డ శాసన సభ్యుడు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్టాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో బందరురోడ్డులోని సర్వోత్తమ భవన్లో శుక్రవారం బండారు రాధాకృష్ణ రచించిన వ్యాస సంపుటి సత్యాన్వేషణ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయునికి ప్రశ్నించే గుణం ఉండాలన్నారు. రాధాకృష్ణ సుదీర్ఘకాలం పాత్రికేయునిగా సమాజాన్ని పరిశీలించేవారని గుర్తుచేశారు. నేటి ప్రజాస్వామ్యం– ధనస్వామ్యంగా మారిపోయిందని, రాజకీయాలలో జవాబుదారీతనం లోపించిందని, అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు సత్యాన్వేషణ గ్రంథాన్ని సమీక్షించారు. 87 ఏళ్ల వయసులో కూడా రాధాకృష్ణ వ్యాసాలలో బిగువ తగ్గలేదన్నారు. ప్రతి వ్యాసం ఆలోచనాత్మకంగా ఉందన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు, ఆకాశవాణి ,దూరదర్శన్ విశ్రాంత సంచాలకుడు గుత్తికొండ కొండలరావు, మల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకుడు కలిమిశ్రీ , సీనియర్ పాత్రికేయుడు టీవీ సుబ్బయ్య, సర్వోత్తమ గ్రంథాలయం నిర్వాహకురాలు రావి శారద, సాహితీవేత్త రాళ్ళపల్లి భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం రచయిత రాధాకృష్ణను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, పలువురు ఘనంగా సత్కరించారు. తొలుత వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కవులు స్వీయ కవితా గానం చేశారు. నాదెళ్ళ ఉమాదేవి వీణా వాదన శ్రావ్యంగా సాగింది. -
స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రానికే తలమానికంగా విజయవాడలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంబేడ్కర్ స్మృతి వనంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం నీడ పడుతోంది. దీని నిర్వహణను వదిలేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా కాలం గడుపుతోంది. గతంలో సందర్శకులతో కళకళలాడిన స్మృతి వనం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో నామ మాత్రంగా ప్రభుత్వం ఎంట్రీకి రూ.5 టిక్కెట్ ధరను నిర్ణయించింది. దీంతో నెలకు సుమారు రూ. 3 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి ఉంది. నిర్వహణ ఏదీ మొదట్లో అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూసేది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే నిర్వహణను చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. పైగా ఓ ప్రైవేటు సంస్థ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆ ప్రాంగణంలో గ్రీనరి పూర్తిగా దెబ్బతింది. అక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వహణ భారం అంటూ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు యత్నించింది. వైఎస్సార్ సీపీతో పాటు, ప్రజా సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను కల్చరల్ డిపార్ట్మెంట్కు అప్ప జెప్పింది. కొంత మేర ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. నిర్వహణ బకాయిలు రూ.1.5కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. స్మృతివనం నిర్వహణతో పాటు, కొంతమేర పెండింగ్ పనులు చేయడానికి సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటున్నా నిధుల లేమి పట్టి పీడిస్తోంది. గత ప్రభుత్వంలో .. గత ప్రభుత్వ హయంలో నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచేలా అంబేడ్కర్ స్మృతి వనాన్ని తీర్చి దిద్దారు. మొదటి దశలో 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఆ ప్రాంగణాన్ని గ్రీనరీతో ముస్తాబు చేశారు. కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్పాత్, ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేశారు. ప్రత్యేక లైటింగ్ సిస్టం ఏర్పాటుతో పాటు అందంగా గార్డెన్ రూపొందించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి అద్భుతంగా రూపొందిండానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. అరుదైన భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం పనులు 2022 మార్చి 21న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 జనవరి 19 తేదీన ఆవిష్కరించారు. నాటి ప్రభుత్వంలో జనకళతో సందడిగా కనిపించిన ఆ ప్రాంగణం చంద్రబాబు పాలనలో కళావిహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అంబ్కేడర్ విగ్రహం ప్రాంగణంలో ఏసీలు పని చేయడం లేదు. పైన రెండవ గ్యాలరీ పనులు ప్రారంభం కాలేదు.అంబేడ్కర్ విగ్రహం వెనుక రాతిని అతికించే పనులను నిలిపివేశారు. ప్రాంగణంలో ఫౌంటెన్లు పని చేయడం లేదు. 70 మంది సామర్థ్యంతో నిర్మించిన మిని థియేటర్ వినియోగంలోకి తీసుకురావడం లేదు. రెండో దశలో పెండింగ్ పనులు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ప్రస్తుతం కేవలం 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 మంది సామర్థ్యంతో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. పుడ్కోర్టు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సింది. ఆడిటోరియం, మ్యూజియం, లిఫ్ట్లు బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, చిల్డ్రన్ పార్కు, మినీ ఽథియేటర్లు వంటి పనులు ప్రారంభమే కాలేదు. -
రంగుల మహోత్సవంపై సమీక్ష
పెనుగంచిప్రోలు: భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే అమ్మవారి రంగుల మహోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ సత్రంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పని చేసి తిరుపతమ్మ రంగుల మహోత్సవం, ఫిబ్రవరిలో కల్యాణ మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఆలయంలో పారిశుద్ధ్యం, ప్రసాదాలపై భక్తుల నుంచి అసంతృప్తులు వచ్చాయని, ఆలయ అధికారులు వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారులు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్బాబు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధింత ఏడీఈ రామకృష్ణను బాధ్యుడిని చేస్తూ ఏపీసీపీడీసీఎల్ యాజమాన్యం కార్పొరేట్ ఆఫీసుకు సరెండర్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. గవర్నర్పేట ఏడీఈ బసవరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారిని, ఉన్నతాధికారులు బలిపశువును చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఏడీఈ స్థాయి అధికారే నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నా, వారిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో, ఏడీఈ స్థాయి అధికారిపై చర్యలతో సరిపెట్టినట్లు ఆ శాఖ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. దీనిపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయసంస్థతో విచారణ చేస్తే నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మచిలీపట్నంఅర్బన్: తగ్గించిన వేతనాలను 104 ఉద్యోగులకు వెంటనే పూర్తిగా చెల్లించాలని ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జా మురళీకృష్ణ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బూర సుబ్రహ్మణ్యం, ఇతర నేతలు మాట్లాడుతూ తొలగించిన క్యాజువల్ లీవ్లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులను 104 ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలన్నారు. తొలగించిన బఫర్ సిబ్బందిని నియమించి పని ఒత్తిడిని తగ్గించాలన్నారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 108 కృష్ణా జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్ల వినయ్, ఎం.పోలినాయుడు, సీఐటీయూ నగర కార్యదర్శి జై రావు, ఏపీ ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి ఎం. పోలినాయుడు, 102 అధ్యక్షులు అయ్యప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. భక్తుల రద్దీ ఉదయం సాధారణంగా ఉండగా, 11 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెలుపుల ఉన్న వేద ఆశీర్వచనాన్ని గురువారం నుంచి ఆలయం లోపల మండపంలోకి మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఒక సారిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమ య్యారు. సర్వ దర్శనానికి రెండు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు రూ.100 టికెట్ క్యూలైన్లోకి ఉచి తంగా మళ్లించి రద్దీని నియంత్రించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పలువురు పుర ప్రముఖులు, వీఐపీలు సైతం మహా నివేదన అనంతరం అమ్మ వారి దర్శనానికి విచ్చేయడంతో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ నేపథ్యంలో ఏఈఓలతో పాటు పలువురు సూపరింటెండెంట్లకు, ఇతర సిబ్బందికి ఆలయంలో ప్రత్యేక విధులు కేటా యించారు. మరోవైపు ఆలయానికి చేరుకునే క్యూలైన్లతో పాటు గాలిగోపురం, వీఐపీ మార్గం, సింహద్వారాల వద్దకు భక్తులు చేరుకుని తమను అలయంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. -
పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో కృష్ణా సంకల్పం పేరుతో గురువారం వినూ త్నంగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు వివిధ రకాల ప్రయోజనాలు సమకూర్చేందుకు ముస్తాబు కిట్లను, ఉద్యోగులకు వివిధ రకాల ప్రయోజన పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. రెవెన్యూ, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, వ్యవసాయ, వైద్య – ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సర్వీసు క్రమబద్ధీకరణ, వార్షిక ఇంక్రిమెంట్లు, బకాయిలు, వేతన నిర్ధారణ మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.30 లక్షల విలువైన గల్ఫర్ వాహనాల మంజూరు పత్రాలను ముగ్గురు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, స్వీట్లు, పండ్లు కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్పుస్తకాలు, ఇతర పరికరాలను జిల్లా అధికారులు అందజేయటం శుభపరిణామమన్నారు. వసతి గృహాల విద్యార్థులకు ఉపయోగపడే బల్లలు, బాలికలకు శానిటరీ నాప్కిన్లు, ఇన్సినిరేటర్లు, ముస్తాబు కిట్లు అందజేసేందుకు ముందుకొచ్చిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి మంచి స్పందన వచ్చిందని, జిల్లాలోని 42 వసతి గృహాలకు వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని, మాద కద్రవ్యాల జోలికి పోకూడదని కష్టపడి చదివి స్తున్న తల్లిదండ్రులకు భారం కాకుండా వారికి సహాయంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్బాబు, జిల్లా బీసీ సంక్షేమాధికారి జి.రమేష్, డీఎంహెచ్ఓ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గత సంవత్సరపు విజయాలను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా సమ గ్రాభివృద్ధికి ఎన్టీఆర్ జిల్లా టీమ్ పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో పాటు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026లో జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని విధాలుగా ముందంజలో నిలిపేలా కృషి చేయాలన్నారు. ఎట్ హోం సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎట్ హోంలో చిన్నారుల నృత్య ప్రదర్శన పగుళ్లు ఇచ్చిన మెట్ల మార్గంలోనే భక్తుల రాకపోకలు పట్టించుకోని ఆలయ అధికారులు -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీని నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ బాలాజీ గురువారం కలిశారు. మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 40.6787 టీఎంసీలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డీజీపీ హరీష్కుమార్ గుప్తాను పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, ఇతర అధికారులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. –8లో7 -
ఆహార భద్రతకు అదనపు భరోసా
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్కార్డుదారులకు ప్రభుత్వం రూ.20కే కిలో చెక్కి గోధుమపిండి సరఫరా చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయ వాడ అర్బన్ మండలంలోని పటమట, ఏపీఐఐసీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో కార్డుదారులకు గురువారం చెక్కి గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లా డుతూ.. నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతినెలా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 1,850 టన్నుల గోధుమలను తీసుకొని గోధుమపిండి సరఫరాకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ పంపి ణీలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ, పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులకు వివిధ సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు నాణ్యమైన పోషక సహిత గోధుమపిండిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఏఎస్ఓ శ్రీనివాసులు నాయుడు, జిల్లా డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై అవగాహన కలిగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రమాదాలు నివారించేందుకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణాశాఖ ముద్రించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ భద్రత మాసోత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రజలు రహదారి భద్ర తపై అవగాహన కలిగి ఉండేందుకు రవాణా శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వ హించాలన్నారు. వాహనాల డీలర్లను, లారీ యజమానుల సంఘాలను, డ్రైవర్ల శిక్షణ కేంద్రాలను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణాధికారి వెంకటేశ్వర్లు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీకి కెనరా బ్యాంక్ సాయంలబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటుకు కెనరా బ్యాంక్ రూ.40 లక్షల సాయం అందించింది. ఆ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మొత్తాన్ని వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్కు బ్యాంక్ డీజీఎం ఎ.రత్నాకరరావు చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఈ సంద ర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా బ్యాంకులు నిధులను నూతన సంవత్సరం రోజు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో సోలార్ యూనిట్ ఏర్పాటు ద్వారా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమాజాన్ని అతలాకుతం చేసిన సమయంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ వంతు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి మాస్కులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, శానిటైజర్లు అందించాయని గుర్తుచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్కట్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్ఆర్టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య (నాని) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలకు వైఎస్సార్ టీచర్స్ అసో సియేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, వృత్తిపరమైన అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని సూచించారు. మంగళగిరి టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి దిగువ, ఎగువ సన్నిధి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నత్తనడకన ఆధునికీకరణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరు ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతోంది. ఈ నేపథ్యంలో వర్షం అంటేనే బుడమేరు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బుడమేరుకు వచ్చిన భారీ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బసచేశారు. బెజవాడ ముంపు నివారణ కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తానని హడావిడి చేశారు. అనంతరం బుడ మేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులో మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొదటి దశలో బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. కేవలం రెగ్యులేటర్ గేట్ల మరమ్మతులతో సరిపెట్టారు. గత ఏడాది కంటి తుడుపుగా బుడమేరు గండ్లు పూడ్చివేతకు రూ.43.25 కోట్లు మంజూరు చేశారు. కేవలం 18 పనులకు సంబంధించి ఆగస్టులో రూ.20 కోట్ల పనులకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో మైలవరం ప్రజాప్రతినిధికి ముందుగానే ముడుపులు మట్టజెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు టెండర్లు పిలవక ముందే కొన్ని పనులు చేశారు. టెండర్లు పిలిచాక వారికే కాంట్రాక్టు దక్కేలా పావులు కదిపారు. టెండర్లు పిలకవ ముందు జరిగిన పనులు మినహా మిగిలినవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండటం గమనార్హం. బుడమేరు వరద ముంపు నివారణ కోసం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మొదటి నుంచీ అలసత్వం ప్రదర్శిస్తోంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బెజవాడ మునిగింది. పది రోజులకు పైగా వరద ముంపులో చిక్కుకొని ప్రజలు విలవిల్లాడారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఆ పరిస్థితుల నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. వరద సమయంలో హడావిడి తప్ప, తరువాత దాని గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చేలోపు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి పూర్తిచే యకపోతే ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా నగరంతోపాటు, బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ప్రజలు హడలిపోయారు. కొత్త సంవత్సరంలో అయినా బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని విజయవాడ వాసులు కోరుకుంటున్నారు. విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించాలనే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నగరాన్ని ముంపు రహితంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు హడావిడి చేశారు. ప్రాథమికంగా మొదటి దశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని ఐదువేల నుంచి పది వేల క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. ఇందుకు రూ.500 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే నిధులు మాత్రమే విడుదల చేయలేదు. 13.25 కిలో మీటర్లు పొడవునా బుడమేరు ఆక్రమణలకు గుర్తెంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు నగరపాలక సంస్థ పరిధిలో 202 ఎకరాలకు 70 ఎకరాల మేర ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విస్తీ ర్ణంలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించేలా ప్రణాళిక రచించారు. దీంతో పాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని భావించారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర కాలువ గట్లను మరింత బలోపేతం చేయాల్సింది. ప్రస్తుతం ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం ఎటు వంటి చర్యలూ తీసుకోలేదు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు బుడమేరులో నామమాత్రంగా పూడిక తీసి చేతులు దులుపుకొంటున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి జనసేన నుంచి చేరిక
తిరువూరు: గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన నాయకులు కొంకి హరికృష్ణ, కొంకి గౌతమ్, మల్లివెల్లి రవీంద్ర, మల్లివెల్లి గోపాలకృష్ణల నాయకత్వంలో పలువురు కార్యకర్తలు తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి స్వామిదాసు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్లపాడు పార్టీ అధ్యక్షుడు తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు కూరాకుల ప్రసాద్, రామ కృష్ణ, గడ్డం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమలగిరిలోని వాల్మీకోద్భవ వెంకటేశ్వరస్వామి దత్తత దేవాలయం అయిన మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం ప్రమాదభరితంగా ఉంది. తిరుమల గిరి ఆలయానికి నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయానికి ఆదాయం ఉన్నా కూడా అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలగిరికి వచ్చే భక్తులు ముందుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండపైన గల శివాలయానికి చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అయితే కొండ పైకి వెళ్లే మెట్ల మార్గం అధ్వానంగా ఉంది. మెట్లు పగుళ్లు ఇచ్చి నడిచేందుకు ఇబ్బందికరంగా ఉండ టంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన మెట్లు కావడంతో పూర్తిగా పగుళ్లు ఇచ్చి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పరమశివుడిని దర్శించుకోవాలంటే భక్తులు పడరానిపాట్లు పడవలసిందే. దాదాపు 70కి పైగా మెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మరో పక్క మార్గంలో ఇరుపక్కల రైలింగ్ కూడా లేకపోవ డంతో చిన్నారులు, వృద్ధులు అష్టకష్టాలు పడా ల్సివస్తోంది. కొందరు భక్తులు అయితే గాయాలపాలవుతున్నారు. ఆలయ అధికారులు ఆలయానికి ఆదాయం పెంచుకునేందుకు కొండపైకి స్వామివారి దర్శనం టికెట్కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నప్పటికీ మెట్ల మార్గం అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా మార్గాన్ని శుభ్రం చేయడంలేదు. దీంతో మెట్ల మార్గంలో చెత్తచెదారం పేరుకుపోతోంది. కొండ కింద నుంచి వెళ్లే మెట్ల మార్గంలోని కొన్ని మెట్లు టైల్స్ పగిలి పోయి ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు స్పందించి మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా!
కోనేరుసెంటర్: ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్జనలో తాండవం ఆడుతుంది. మద్యం వ్యాపారులు ఇచ్చే మత్తులో అధికారులు కూరుకుపోయారనే ఆరోపణలొస్తున్నాయి. మచిలీపట్నంలో కొత్త లైసెన్స్లు పొందిన వ్యాపారులతో పాటు గతంలో మద్యం వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన వ్యాపారులు (కూటమి నాయకులు) ఎకై ్సజ్ నిబంధనలకు పాతర వేసి మద్యం ప్రియుల నుంచి కాసులు కాజేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతూ ఆదాయాన్ని గతంలో కంటే పది రెట్లుకుపైగా పెంచుకుంటున్నారు. బందరులో ఏడు రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి. మండలంలోని తాళ్ళపాలెం, చిన్నాపురం, సుల్తానగరంతో పాటు నగరంలో మరో ఏడు వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాలి. రెస్టారెంట్ అండ్ బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలి. రెస్టారెంట్లలో ఫుడ్ నిమిత్తం మరో గంట వరకు మందుబాబులకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఉంది. సొంత నియోజకవర్గంలోనే.... జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అధిక ధరలు వసూలు.... బందరులో క్వార్టర్ మద్యంకు రూ. 40 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తూ పేదల సొమ్మును మింగేస్తున్నారు. కొన్ని వైన్షాపుల్లో వ్యాపారులు తమ దుకాణాలకు కూతవేటు దూరంలోని బడ్డీకొట్టుల్లో బాటిళ్ళు పెట్టి క్వార్టర్కు రూ. 20 చొప్పున అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. నగరంలోని లక్ష్మీటాకీస్సెంటర్, రాజుపేట ప్రాంతాల్లో కొనసాగుతున్న బార్లలో అయితే రాత్రి తెల్లార్లు తాగేందుకు ఓపిక ఉండాలే గానీ బార్లో సిబ్బంది మందుబాబులకు బాటిళ్ళను రోడ్లపైకి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే రేవతిసెంటర్కు సమీపంలో ఉన్న బార్లో 24 గంటలూ విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ గల్లాలు నింపుకుంటున్నారు. వీటితో పాటు రాజాగారి సెంటర్లో ఉన్న మరో బార్, బస్టాండ్సెంటర్లోని బార్ పరిస్థితి అదే దారిలో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలోని ఓ వైన్షాపు యజమాని బడ్డీకొట్టులో బాటిళ్లు పెట్టి అమ్మిస్తున్నారు. 24 గంటలూ బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు వైన్ షాపులదీ అదే దారి బడ్డీ కొట్లలోనూ మద్యం అమ్మకాలు పట్టించుకోని ఎకై ్సజ్ శాఖాధికారులు -
మెడికల్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు):రపభుత్వ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ గురువారం కలెక్టర్ జి.లక్ష్మీశా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఉద్యోగులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని తెలిపారు. నూతన సంవత్సరంలో కూడా ఉద్యోగులు మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం యూనియన్ నాయకులు నూతన క్యాలెండర్ను ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావుకు, డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసినికి అందచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. శ్రీనివాసరావు, పి.నాగరాజు, సిటీ బ్రాంచ్ అధ్యక్షురాలు పి.సౌభాగ్యం, కోశాధికారి జి. పుణ్యకుమారి, యూనియన్ జిల్లా, సీటీ నాయకులు పాల్గొన్నారు. -
టెన్త్ ఫలితాల్లో టాప్ ఫైవ్లో ఉండాలి
– డీఈఓ యూవీ సుబ్బారావు మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో టాప్ ఫైవ్లో నిలిపేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర శాఖ రూపొందించిన స్టడీ మెటీరియల్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచేలా రూపొందించిన ఈ స్టడీ మెటీరియల్ పదవ తరగతి ఫలితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు మెటీరియల్ను సమర్థంగా వినియోగించి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా నడిపించాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. ఇమ్మానియేల్, యువి. కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ఏడాది తొలిసారిగా రూపొందించిన స్టడీ మెటీరియల్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులకు ఉపయోగంగా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా నాణ్యమైన స్టడీ మెటీరియల్ను రూపొందించామని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు ఎంవిఎస్ఎన్. ప్రసాద్, జిల్లా ఆర్థిక కార్యదర్శి కె. మాధవరావు, అర్బన్ అధ్యక్షులు ఎస్. కిరణ్ బాబు, కార్యదర్శి ఎం. వీర బాబు, సతీష్ బాబు, గంగ రాజు, పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
5 నుంచి త్యాగరాజస్వామి సంగీతోత్సవాలు
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధాన సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సన్మండలి అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహించే మహోత్సవాల్లో సంగీత ప్రముఖులతోపాటు యువ సంగీత విద్వాంసులు పాల్గొంటారని చెప్పారు. 5 వ తేది సాయంత్రం మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలు పలువురు విద్వాంసులు ఆలపిస్తారన్నారు. 7వ తేదీ బుధవారం ఉదయం త్యాగరాజ స్వామి, ఆంజనేయ విగ్రహాలతో నగర సంకీర్తన, 11వ తేదీ సద్గురు త్యాగరాజ స్వామి రచించిన పంచరత్న కృతుల గోష్టిగానం ఉంటుందని పేర్కొన్నారు. 200 మందికి పైగా విద్వాంసులు పాల్గొంటారని వెల్లడించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు
చల్లపల్లి:మద్యం తాగిన ఇద్దరు యువకులు దిచక్ర వాహనంపై వేగంగా వెళుతూ రోడ్డు ప్రమాదానికిగురై తీవ్ర గాయాలపాలైన ఘటన నడకుదురు రోడ్డులోని మేకారవారిపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పురిటిగడ్డకు చెందిన గంజి నాని, కనపర్తి కళ్యాణ్లు సాయంత్రంగం ఐదు సమయంలో మద్యం తాగి ద్విచక్ర వాహనంపై చల్లపల్లి నుంచి పురిటిగడ్డకు బయలుదేరారు. మద్యం తాగి ఉండటం దానికితోడు వేగంగా వెళుతుండటంతో మేకావారిపాలెం అడ్డరోడ్డు దాటగానే రోడ్డుపై పడిపోయి బండితోపాటు కొంతదూరం జారుకుంటూ పోయారు. గంజి నాని తలకు, ముఖంపై బలమైన నేలదెబ్బలు తగలటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇంతలోనే చెవిలో నుంచి రక్తం కారటం, యూరిన్కు వెళ్ళటంతో రోడ్డునపోయే వారు అగి కోమాలోకి వెళ్లకుండా నానికి పరిచర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రెండవ వ్యక్తి కనపర్తి కళ్యాణ్కు గాయాలతోపాటు కాలు విరిగింది. కొంతసేపటి తరువాత పురిటిగడ్డ గ్రామానికి కొందరు అక్కడి చేరుకుని కళ్యాణ్ను ద్విచక్ర వాహనంపై చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది ఈఎంటి రవీంద్ర, పైలెట్ షఫీలు గంజి నానిని కూడా చల్లపల్లి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇద్దరీని మచిలీపట్నంలోని జిల్లా ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. నాని తలకు బలమైన దెబ్బ తగలటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై బయులుదేరిన నాని, కళ్యాణ్ మార్గమద్యంలో ఎదురుగా వచ్చే పలు ద్విచక్ర వాహనాల మీదకు కూడా దగ్గరవరకూ దూసుకొచ్చి త్రుటిలో తప్పించి పక్కనుంచి వెళ్లిపోయారని పలువురు ద్విచక్ర వాహనదారులు చెబుతున్నారు. -
పేకాట శిబిరంపై దాడి
రూ.2,20,780 నగదు స్వాధీనం కోడూరు:స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్రారెడ్డిపాలెంలో బుధవారం రాత్రి జరిగిన పేకాట దాడిలో ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ చాణక్య తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.2,20,780 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాం అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫీక్, సైబర్ క్రైమ్, అడ్మినిస్ట్రేషన్ ఇలా విబాగాల వారీగా డీసీపీలు, ఇతర అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీపీకి పుష్పగుచ్ఛం అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీపీని కలిసిన వారిలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏబీటీఎస్ ఉదయరాణి, తిరుమలేశ్వర రెడ్డి, షిరీన్బేగం, కృష్ణప్రసన్న, యస్విడి ప్రసాద్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. -
జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి
చిలకలపూడి(మచిలీపట్నం):నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2026 లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కెఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు బైపాస్ రోడ్డు పనులు ప్రారంభం
గన్నవరం:మండలంలోని చిన్నఆవుటపల్లి వద్ద ఎన్హెచ్ 16 చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారికి కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డు అనుసంధాన పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బైపాస్ రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావస్తుండడంతో వాహనాల రాకపోకలకు వీలుగా అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. చిన్నఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం చేశారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డు ప్రారంభమయ్యే జీరో పాయింట్ వద్ద మాత్రం గత రెండేళ్లుగా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి నుంచి బైపాస్ రోడ్డులోకి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఇంజినీరింగ్ సంస్థ బైపాస్ అనుసంధాన పనులను పునఃప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండానే బైపాస్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు కొంత వరకు తీరనున్నాయి. -
డాక్టర్ మృదులకు గోల్డ్ మెడల్
లబ్బీపేట(విజయవాడతూర్పు):ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మృదుల బుద్ధానకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండరావు తెలిపారు. గువాహటీలో జరిగిన జాతీయ స్థాయి ఆర్ధోపెడిక్ సదస్సు 2025కు డాక్టర్ మృదుల సమర్పించిన పరిశోధనకు ప్రతిష్టాత్మక డాక్టర్ డి.పీ. బక్సీ గోల్డ్ మెడల్ అందుకున్నట్లు చెప్పారు. పునరావృతమయ్యే భుజం జారి పోవడం సమస్యపై, ముఖ్యంగా లాటార్జే శస్త్రచికిత్స విధానంపై డాక్టర్ మృదుల చేసిన శాసీ్త్రయ పరిశోధనకు ఈ గౌరవం లభించిందన్నారు. ఈ అధ్యయనంలో భుజం స్థిరత్వం మెరుగుదల, శస్త్రచికిత్స అనంతర ఫలితాలు, దీర్ఘకాలిక విజయ శాతం గురించి సమగ్ర విశ్లేషణను ఆమె వివరించినట్లు పేర్కొన్నారు. యువత, క్రీడాకారుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యకు లాటార్జే విధానం ఒక విశ్వసనీయ చికిత్సా మార్గమని ఆమె పరిశోధన ద్వారా నిరూపించినట్లు ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ మృదులను గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్లు డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నటరాజస్వామివారి కల్యాణోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీనటరాజస్వామి వారి కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, వధూవరుల అలంకరణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, బలిహరణ, ఔపాసన, మంటప పూజలు సాయంత్రం 6 గంటలకు శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి స్వామి వారి ఆరుద్రోత్సవం(అభిషేకం, అన్నాభిషేకం) జరుగుతాయి. 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం, 10 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. పెండింగ్ పనులపై నిర్లక్ష్యం తగదు – ఏపీ వక్ఫ్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్బోర్డ్ కార్యాలయంలో బుధవారం 11వ బోర్డ్ సమావేశం జరిగింది. వక్ఫ్బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేసి పలు మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలను నియమించారు. అనంతరం 23 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్లతో జిల్లాలవారీగా పెండింగ్లో ఉన్న పనులు, ఫిర్యాదులు, పాత ఉత్తర్వుల అమలుపై సమీక్ష నిర్వహించారు. మెమోలు క్లియర్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై చైర్మన్ అధికారులను వివరణ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఫేస్–1 ఉమిద్ పోర్టల్ నమోదును నూరు శాతం పూర్తి చేయటంపై అభినందించారు. అదే స్ఫూర్తితో ఫేస్–2 నమోదును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇకపై పెండింగ్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో బోర్డ్ సభ్యులు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముఖ్రం హుస్సేన్, జాకీర్ అహ్మద్, సీఈఓ మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జనవరి 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నారు. 14వ తేదీ తెల్లివారుజామున ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద భోగి మంటలు వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేదికపై రంగురంగుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాలను సాయంత్రం భోగి పండ్లు పోసే కార్యక్రమాలను ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతి నేపథ్యంలో ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ వైదిక కమిటీ సూచించింది. ఉత్సవాలలో మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణాన్ని మామిడి ఆకులు, అరటి చెట్లతో అలంకరించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్వీట్ మ్యాజిక్లో అగ్నిప్రమాదం భవానీపురం(విజయవాడపశ్చిమ): వన్టౌన్ కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద గల స్వీట్ మ్యాజిక్ షాపులో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీపీఆర్పై ఉద్యోగులకు శిక్షణ లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యవసర సమయంలో ప్రాణాలను నిలిపే కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్)పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. ఇండియన్ రీససిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్(ఐఆర్సీఎఫ్), హెల్త్ యూనివర్సిటీ సంయుక్తంగా బుధవారం హెల్త్ యూనివర్సిటీలోని 150 మంది ఉద్యోగులకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. ప్రతి పౌరుడు ప్రాణ రక్షకుడు – మీ రెండు చేతులు ప్రాణాన్ని కాపాడగలవు – మేక్ ఇన్ ఇండియా అనే ప్రేరణాత్మక థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు, సంస్థల సిబ్బందికి అవసరమైన ప్రాణరక్షణ నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. వైద్య వృత్తి నిపుణులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా జీవనాధార శిక్షణను విస్తరించాలనే విశ్వవిద్యాలయ సంకల్పాన్ని ఆయన తెలియజేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి మాట్లాడుతూ గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఐఆర్సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు, రిటైర్డ్ ఏడీఎంఈ డాక్టర్ టి. సూర్యశ్రీ, ప్రొఫెసర్ కె.సుశీల తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అమ్మవారికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్గా పని చేసే డుమావత్ రాజశేఖర్ నాయక్ బుధవారం విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. అనంతరం కుమ్మరిపాలెం సెంటర్లో టిఫిన్ చేసి తిరిగి గుడికి వెళ్తుండగా రోడ్డుకు కుడిపక్కన చనిపోయి ఉన్న సుమారు 65–70 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని చూశారు. ఆ వ్యక్తి ఆరెంజ్ కలర్ చెక్స్తో ఉన్న షర్ట్, తెలుపు, బ్లూ కలర్, వైట్ చెక్స్ కలిగిన టవల్ కలిగి, తెల్లని జుట్టు, మాసిపోయిన గడ్డంతో ఉన్నాడు. ఈ మేరకు ఆయన వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్కింగ్ చేసిన కారుల్లో చోరీ చేసే నిందితుడి అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవాలయాల వద్ద పార్కింగ్ చేసిన కార్ల డోర్లు చాకచక్యంగా తెరిచి లోపల ఉన్న ఆభరణాలు చోరీ చేసే అంతర్ జిల్లా నిందితుడిని బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.25 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు వివరాలు వెల్లడించారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లాకు చెందిన చింత గణేష్ ఏడో తరగతి వరకూ చదివి కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 15 ఏళ్లు ఖతార్ దేశంలో డ్రైవర్గా చేసి 2019లో తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇక్కడ డ్రైవర్గా చేస్తూ దురలవాట్లకు బానిస కావడంతో వచ్చే డబ్బులు చాలకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాలకు పాల్పడుతున్నారు. దేవాలయాల వద్ద పార్కింగ్ చేసిన కార్ల డోర్లు ఓపెన్ చేసి ఆభరణాలు చోరీ చేస్తాడు. తారాపేటలో అరెస్ట్.. 2025 ఏప్రిల్లో దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారు డోర్లు తెరిసి లోపల బ్యాక్ సీట్లో ఉన్న ఆభరణాలు చోరీచేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సేకరించిన ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వన్టౌన్ తారాపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు చింత గణేష్ను సీసీఎస్ సీఐ రామ్కుమార్ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. అతని నుంచి రూ.25 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఉత్తర్వులు, క్రైమ్ డీసీపీ కె.తిరుమలేశ్వరరెడ్డి సూచనలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేశామని ఏడీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రామ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం -
ఆన్లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీలు
● తొలుత అప్పులు చేసి పందేలు ● తర్వాత ఇళ్లలో దొంగతనాలు ● అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ నగరంపాలెం: ఆన్లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీల బాట పట్టిన అంతర్ రాష్ట్ర దొంగను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన మర్రి శివగోపి ఇంట్లో ఇటీవల రూ.2.35 లక్షల విలువైన బంగారం చోరీ అయినట్లు కేసు నమోదైంది. తెనాలి డీఎస్పీ జనార్దన్ పర్యవేక్షణలో తెనాలి రూరల్ పీఎస్ సీఐ షేక్ నాయబ్రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్లు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ ఫుటేజీలో బైక్పై వెళ్తూ ముఖానికి మాస్క్ ధరించిన యువకుడ్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామ వాసి పెనుగొండ మల్లికార్జునరెడ్డి అలియాస్ మల్లిగా గుర్తించారని ఎస్పీ చెప్పారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో తెనాలి రూరల్ పీఎస్ పరిధిలో రెండు, మేడికొండూరు పీఎస్ పరిధిలో ఒకటి, తెలంగాణలోని హుజూర్నగర్, చింతకాని, అనంతగిరి పోలీస్స్టేషన్లల్లో మూడు చోరీ కేసులు అతడిపై ఉన్నాయని తెలిపారు. 2024లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన నిందితుడు అప్పులు చేశాడని, తర్వాత చోరీలు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చోరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి డీఎస్పీ, తెనాలి రూరల్ పీఎస్ సీఐ, కొల్లిపర పీఎస్ ఎస్ఐతోపాటు ఏఎస్ఐ పోతురాజు, హెచ్సీ టి.రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.కూర్మారావు, ఎన్.పోతురాజులను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. -
సిద్ధార్థ వైద్య విద్యార్ధుల అద్భుత ప్రతిభ
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ కళాశాల విద్యార్థులు 2025లో విద్య, పరిశోధన, క్రీడలు తదితర రంగాల్లో విశేష పురోగతి సాధించారని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్లో తమ కళాశాల రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. యూజీ పరీక్షల్లో 98.2 శాతం, పీజీలో 152 మందికి 150 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కళాశాలకు 36 మందికి యూజీ రీసెర్చ్ స్కాలర్ షిప్స్, ఒక ఫ్యాకల్టీకి ఐసీఎంఆర్ స్కాలర్షిప్ లభించడం పరిశోధనా రంగంలో సాధించిన పురోగతికి నిదర్శనమన్నారు. పలు సదస్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, డిబేట్లలో గోల్డ్మెడల్స్ సాధించారని తెలిపారు. క్రీడల్లో సైతం అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్ మెడిక్స్ పోటీల్లో ఓవరాల్ రన్నర్స్గా నిలిచారన్నారు. ఇలా అన్ని రంగాల్లో తమ విద్యార్థులు రాణించడం గర్వకారణంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. డీసీఎంను ఢీకొన్న కారు.. విజయవాడ వాసి మృతి మరో ముగ్గురికి గాయాలు లింగాలఘణపురం: డీజే ప్రోగ్రామ్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కారు.. ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై వడిచర్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్(32), కారు డ్రైవర్ లవరాజ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రాంప్రసాద్, హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన శరత్కుమార్ డీజే ప్రోగ్రామ్ నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో వడిచర్ల కల్వర్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు విష్ణువర్ధన్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026వ సంవత్సర టేబుల్ క్యాలెండర్ను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆవిష్కరించారు. మంత్రి రవీంద్ర మాట్లా డుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఉద్యోగులందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పి.రాము, జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్, కోశాధికారి బి.సురేష్, నాయకులు పవన్, సలీం, శ్రీనివాసరావు, సముద్రేశ్వరరావు, ఎస్.వి.వి.రామారావు, కోటేశ్వరరావు, కె.లోకేష్, ప్రవీణ్, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, హుస్సేన్, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరా అధికారి(డీఎస్ఓ)గా ఏడా దిన్నరగా విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేసిన ఎ.పాపారావును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సత్కరించారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో పాపారావు సన్మాన కార్యక్రమం బుధవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పౌర సరఫరాల డీఎం టి.వి.సతీష్, పలువురు జిల్లా అధికారులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో వాజ్పేయి విగ్రహం మాయం !
మచిలీపట్నంటౌన్: స్థానిక హౌసింగ్బోర్డు కాలనీ రింగ్ సెంటర్లో గత నెల 16న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం మాయమైంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ–బీజేపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. అనంతరం అదే సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విగ్రహం ప్రతిష్ట జరిగిన 15 రోజుల్లోనే వాజ్పేయి విగ్రహం మాయంకావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. అప్పుడే మెరుగులు దిద్దాలా ? స్థానికుల కథనం ప్రకారం అజ్ఞాత వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బహిర్గతమైతే పరువు పోతుందనే ఉద్దేశంతో విగ్రహాన్ని తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి భిన్నంగా పార్టీ వర్గాలు మాత్రం ‘మెరుగులు దిద్దేందుకు’ తాత్కాలికంగా విగ్రహాన్ని కిందకు దించామని వివరణ ఇస్తున్నాయి. అయితే విగ్రహ ప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై కొందరు బీజేపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అసలు ఘటనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిజంగా విగ్రహం డ్యామేజ్ అయిందా? లేక ఆ విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నమా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. గత నెల 16న విగ్రహ ప్రతిష్ఠ -
ఆర్టీసీ బస్సు ఢీకొని కండక్టర్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విధుల్లో ఉన్న కండక్టర్ను అదే బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని వారధి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, గంగారం గ్రామానికి చెందిన వజ్జ అభిలాష్(40) కండక్టర్గాను, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలానికి చెందిన తప్పిట ప్రకాశం డ్రైవర్గా పనిచేస్తున్నారు. అభిలాష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం అభిలాష్, ప్రకాశం ఇద్దరూ భద్రాచలం బస్సుకు డ్యూటీ ఎక్కి భద్రాచలంలో ప్రయాణికులను ఎక్కించుకుని గుంటూరు వెళ్లారు. తిరిగి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని భద్రాచలం బయలుదేరారు. రాత్రి 10.15 గంటల సమయంలో వారధి దాటి వై.జంక్షన్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్లాల్సిన బస్సు వారధి ప్లైఓవర్పై 300 మీటర్లు ముందుకు వెళ్లింది. అది గమనించిన డ్రైవర్ బస్టాండ్కు వెళ్లేందుకు నిమిత్తం బస్సును రివర్స్ చేసే క్రమంలో కండక్టర్ బస్సు దిగి వెనుకకు వెళ్లి డ్రైవర్కు సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆ బస్సు కండక్టర్ను ఢీ కొట్టి తలపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు అవినాష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
కాచవరం(ఇబ్రహీంపట్నం): కాచవరం గ్రామ మాజీ సర్పంచ్ మొండితోక వెంకటరత్నం(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాచవరం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన వెంకటరత్నం తన వ్యక్తిగత పనులపై సమీపంలోని దొనబండ గ్రామానికి తన బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాచవరం చేరుకుని డివైడర్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో లారీ చక్రాలు వెంకటరత్నం మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 2006 – 2011 మధ్య కాలంలో గ్రామానికి సర్పంచ్గా వ్యవహరించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ కాలనీకి రూపరేఖలు తెచ్చారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నూతన ఆలోచనలతో సమగ్రాభివృద్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా అధికార బృందం 2026వ సంవత్సరంలో నూతన ఆలో చనలతో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, సాధించేందుకు సమష్టిగా శ్రమిస్తా మని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. 2025 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లా ఆదాయాన్ని పెంచేలా ప్రాథమిక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధశాఖల ద్వారా జీపీఏ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తామన్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 65,925 ఎకరాల్లో ఆక్వా జోన్ ఇప్పటికే ఉందని, ఇంకా వచ్చిన దరఖాస్తులను బట్టి ఈ విస్తీర్ణాన్నిపెంచే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. నందివాడ మండలంలో డిజిటల్ ట్రేసబులిటీ కోసం 102 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 5,42,609 టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలో ఇప్పటి వరకు 5,42,609 టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. గతేడాదితో నుంచి పోల్చు కుంటే 1.20 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేశామన్నారు. 106 ఉన్నత పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికాభి వృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించామన్నారు. బందరు మండలం చిన్నాపురంలో గుర్రపు డెక్కతో కళాకృతులు తయారుచేసి వాటి విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 377 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పంచాయతీల బలోపేతానికి చర్యలు జిల్లాలో పంచాయతీలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. గన్నవరం పంచాయతీలో క్రికెట్ నెట్, కేసరపల్లిలో కుంభకోణం కాఫీ షాప్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఆరు పంచాయతీలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించామని, ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. 17 మంది అనాథ పిల్లలను దత్తత ఇచ్చామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం 1,196 మందికి చెందిన 320 ఎకరాలను 22ఏ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో కలెక్టరేట్లో అమృత కృష్ణ పేరుతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శబ్ద, వాయు కాలుష్య నివారణకు ప్రతి శనివారం అధికారులు కాలినడకన లేదా సైకిళ్లపై విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాలో 5,318 గృహాలకు సోలార్ సిస్టమ్ను అందించి రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. కృష్ణసంకల్పం పేరుతో 42 బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో 2026వ సంవత్సరంలో నూతన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 2వ తేదీ నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. కట్టింగ్ అండ్ టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీకల్ టెక్నీషియన్ హెల్పర్, ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిజం, మెషిన్ ఎంబ్రాయిడరీ, డ్రస్ డిజైనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిర్రర్ వర్క్, హోమ్ క్రాప్ట్స్, జామ్ అండ్ జ్యూస్ మేకింగ్, స్మాకింగ్ మొదలైన అంశాల్లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ సమీపంలో ఉన్న తమ సంస్థ కార్యాలయంలో నేరుగా కాని 0866–2470420 నంబర్లో సంప్రదించాలని కోరారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు పమిడిముక్కల: నాటకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మేడూరు గ్రామంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన గ్రామ పెద్దలు గుళ్లపల్లి సురేష్బాబు, సుంకర వెంకటేశ్వరస్వామితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 200 నాటక సంఘాలు రిజిస్టర్ చేసుకొన్నారని, ఈ సంఘాలు నాటకాలు వేసినప్పుడు అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కళాకారులు ప్రొఫెషనల్స్ టీమ్గా ఏర్పడి ప్రదర్శనలు ఇచ్చి జీవనోసాధి పొందవచ్చన్నారు. నాటకాలు ప్రదర్శించేందుకు వీలుగా 50 టూరిజమ్ స్పాట్స్ను గుర్తించామని తెలిపారు. కళారంగం కళకళలాడుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మేడూరు గ్రామంలో హైస్కూల్, నాలుగు వైపులా ఉన్న ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. అకాడమీలో అన్ని రకాల నాటకాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. పీజీ వైద్య ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ అవనిగడ్డ: పీజీ వైద్య ఫలితాల్లో అవనిగడ్డకు చెందిన కూనపరెడ్డి లాస్యకృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్ధానం సాధించింది. మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ సర్జన్(ఈఎన్టీ) విభాగంలో 800 మార్కులకు 585 మార్కులు సాధించింది. 2014–20లో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన లాస్యకృష్ణ పీజీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు కూనపరెడ్డి బాలరమేష్బాబు, సరోజ చెప్పారు. తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాగా, తల్లి సరోజ ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. స్టేట్ఫస్ట్ సాధించిన లాస్యకృష్ణకు పలువురు అభినందనలు తెలిపారు. హిందీ కార్యశాల ప్రారంభం పాయకాపురం(విజయవాడరూరల్): ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ న్యూ రాజీవ్నగర్లో బుధవారం రాజభాష హిందీ కార్యశాల నిర్వహించారు. సంస్థ ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో నిర్వహిస్తున్న హిందీ కార్యక్రమాల గురించి, హిందీ భాషలో అవగాహన పెంచుటకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ప్రత్యేక అతిథి హేమంత్ వాడేకర్ మాట్లాడుతూ సంస్థ సిబ్బంది సమగ్రంగా హిందీ భాషపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పరిశోధనాధికారి డాక్టర్ సవిత పోశెట్టి గోపాడ్, డాక్టర్ సుజాత పి.డోకె(పరిశోధనాధికారి), పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణలో కృష్ణాకు ప్రథమస్థానం
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్ (మచిలీపట్నం): మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం ఓ తెలిపారు. సంవత్సరాంతపు నేరసమీక్ష వివరాలను ఆ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులను 2024 ఏడాదితో పోలిస్తే 2025లో 29 శాతం తగ్గించగలిగామని పేర్కొన్నారు. ముందస్తు నిఘా, విజువల్ పోలీసింగ్, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమాచార వ్యవస్థ ద్వారా 32 శాతం నేరాలను అరికట్టామని వివరించారు. 2024లో 101 సైబర్ నేరాలు నమోదవగా 2025లో వాటి సంఖ్య 79 మాత్రమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నియంత్రించామని పేర్కొన్నారు. మీ – కోసం కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి అడుగులు వేయగలిగామని తెలిపారు. నేరాల నియంత్ర ణలో భాగంగా జిల్లాలోని రౌడీషీటర్లపై నిరంతరం నిఘా పెట్టి ఉక్కు పాదం మోపామని పేర్కొన్నారు. 2026లో మరింత సమర్థంగా విధులు నిర్వహించి ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కృషి చేస్తా మని తెలిపారు. చోరీలకు సంబంధించి 2024లో 711 కేసులు నమోద వగా 2025లో వాటి సంఖ్య 606 మాత్రమేనని వివరించారు. పోక్సో కేసులకు సంబంధించి గత యేడాది 133 కేసులు నమోదవగా ఈ ఏడాది 77 కేసులకు పరిమితమయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2024లో 309 కేసులు నమోదగా 338 మంది చనిపోయారని, 2025లో 368 కేసులు నమోదువగా 394 మంది మరణించారని వివరించారు. గత యేడాది రూ.6.05.10.526 కోట్ల సొత్తు చోరీకి గురికాగా రూ.3,08,86,634లను రికవరీ చేశామని, 2025లో చోరీకి గురైన రూ.5,54,55,753 సొత్తులో రూ.2,86,64,257 రికవరీ చేశామని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి 2024లో 428.833 కిలోలు పట్టుకోగా 2025ల 475.261 కిలోలు పట్టుకున్నామని వివరించారు. ఈ కేసులకు సంబంధించి 150 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2024తో పోలిస్తే 2025లో గణనీయంగా కేసులు నమోదు తగ్గిందని పేర్కొన్నారు. -
ఏపీ ఎన్జీఓస్ కృష్ణాజిల్లా కమిటీ ఏకగ్రీవం
మచిలీపట్నంటౌన్: ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీ ఏకగ్రీంగా ఎన్నికై ంది. ఈడేప ల్లిలోని ఎన్జీఓ హోంలో మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆకూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా వి.సీతారామయ్య, కోశాధికారిగా పి.శోభన్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్.సునీల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పి.భాస్కర్, ఎం.ఎం.అలీ, ఎ.సునీల్ కుమార్, ఎ.భాస్కరరావు, కె.వి. వి.సురేష్బాబు, మహిళా ఉపాధ్యక్షురాలిగా జహీరున్నీసాబేగం, ఆర్గనైజింగ్సెక్రటరీగా ఆర్.హేమప్రకాష్, జాయింట్ సెక్రటరీలుగా ఎ.రమాదేవి, కె.వి.కోటేశ్వరరావు, ఎం.మధుబాబు, జి.చంటిబాబు, ఎస్.రమేష్, మహిళా జాయింట్ సెక్రటరీగా ఎం.రజిని, పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి పోటీగా నామినేషన్లు దాఖలవకపోవడంతో ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా రమేష్, రాష్ట్ర పరిశీలకుడిగా జానకి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నిక అనంతరం సంఘ నాయకులు, సభ్యులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. నూతన కమిటీ ప్రతినిధులను సంఘ సభ్యులు, ఉద్యోగులు పూలమాలలు, బొకేలతో సత్కరించారు. -
సమస్యల పరిష్కారం కోసం 104 ఉద్యోగుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 వాహనాల ఉద్యోగుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.ఫణికుమార్ మాట్లాడుతూ.. భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు అందించాల్సిన మందులను 104 వాహనాల్లో తగినంతగా సరఫరా చేయడం లేదని, దీని వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. డిసెంబర్ 19 నుంచి 23 వరకు ముందస్తు నోటీసులు జారీ చేసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించకపోతే జనవరి రెండో తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, ఆరో తేదీన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 104 ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం పూర్తి సంఘీభావం తెలుపుతోందన్నారు. భవ్య యాజమాన్యం తగ్గించిన వేతనాలను సవరించి పూర్తి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం కూడా జీతాల పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన క్యాజువల్ లీవ్లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులను 104 ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఎ.మురళీకృష్ణ, కార్యదర్శి డి.వినయ్, కోశాధికారి బి.సుబ్బారావు, ఎస్.వెంకట తేజ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు కృషి
పెనమలూరు: పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. కానూరులోని అన్నే కల్యాణ మండపంలో మంగళవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా లోని పారిశ్రామికవాడల్లో మౌలికవసతులు కల్పిస్తామన్నారు. పరిశ్రమల కోసం భూములు కేటాయించి అనుమతులు తీసుకున్న యూనిట్ల స్థాపనకు పారిశ్రామికవేత్తలు చొరవతో ముందుకు రావాలన్నారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యలను రాతపూర్వ కంగా తెలిపితే పరిష్కారం కోసం సంబంధిత అధికారులను పంపిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రతి 20 మంది పారిశ్రామికవేత్తలకు ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తానమన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. మల్లవల్లి, వీరపనేనివారి గూడెం పారిశ్రామికవాడల్లో మౌలికవసతులు కల్పించాలని పారిశ్రామికవేత్తలు కోరారు. సిబ్బంది గృహాలకు ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలన్నారు. పారిశ్రామి కవాడల్లో కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్లు నిర్మించా లని కోరారు. దీనిపై ఐలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాల మంజూరుపై బ్యాంకర్లతో మాట్లాడుతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తన పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన వాటిని ప్రభుత్వానికి పంపుతానని కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, మల్లవల్లి పారిశ్రామికవాడ చైర్మన్ జి.రవికుమార్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అఽధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
స్కానింగ్ పాయింట్లో ఇకపై ఉచిత లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రూ.500 టికెట్లపై ఉచితంగా ఇచ్చే లడ్డూలను ఇకపై స్కానింగ్ పాయింట్లో భక్తులకు అందజేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. శుక్రవారం అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా, వారికి ఉచిత లడ్డూలు ఇవ్వడం లేదని ఆలయ ఈఓకు ఫిర్యాదులు అందాయి. ఇదే అంశాన్ని సాక్షిలో ‘దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ప్రచురించింది. దీనిపై ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఘాట్రోడ్డులోని క్యూలైన్లతో పాటు మహా మండపం దిగువన టికెట్ల కౌంటర్లలో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో స్కానింగ్ పాయింట్లో టికెట్లను తనిఖీలు నిర్వహించిన అనంతరం టికెట్కు రెండు లడ్డూల చొప్పున అందజేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. -
ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి
విజయవాడ కల్చరల్: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాంఘిక నాటకాల ప్రసారాలను పునఃప్రారంభించాలని తపస్వి కల్చరల్ ఆర్ట్స్ కార్యదర్శి సూర్యదేవర జగన్నాథరావు అధికారులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. గతంలో ప్రసారమయ్యే ఈ నాటకాలను 12 సంవత్సరాలుగా నిలిపివేశారని పేర్కొన్నారు. నాటకాలను తిరిగి ప్రారంభించాలని ఆకాశవాణి ప్రోగ్రామ్ హెడ్ సుధాకర్ మోహన్కు వినతి పత్రం అందజేశారు. నాటక రంగాకిచెందిన నటులు, దర్శకులు గంగోత్రి సాయి, సినీ నటుడు పిళ్లా ప్రసాద్, అనంత హృదరాజ్, వీర్ల ప్రసాద్, వెనిగళ్ల భాస్కర్, డాక్టర్ బొక్కిన జయప్రకాష్ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. మద్యం వద్దు.. ప్రాణం ముద్దు లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగి వేగంగా వాహనాలు నడపొద్దంటూ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ఎంజీ రోడ్డులో వాక్థాన్ నిర్వహించారు. ఇందిరాగాంధీ ముని సిపిల్ కార్పొరేషన్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ నిర్వహించిన ఈ వాక్థాన్ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, డీసీపీ షిరీన్బేగం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. 2025 సంవత్సవత్సరంలో జిల్లా పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అకుంఠిత దీక్షతో పనిచేశారన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగారని అభినందించారు. రోడ్డు ప్రమాద మరణాలను ఇంకా తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. యూటీఎఫ్ డైరీ ఆవిష్కరణ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులు అందరూ విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ కోరారు. యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 డైరీని చంద్రకళ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధాయయులు 2026లో మెరుగైన ఫలితాలకు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి తమ సంఘం దిక్చూచిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు మహేశ్వర వెంకటేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, కోశాధికారి కె.గంగరాజు, ఆడిట్ కమిటీ కన్వీనర్ అనంతకుమార్, నాయకులు బి.రమణయ్య, పి.రామారావు, ఎం. లలిత, ఎస్.పి.ఆర్.ఎస్.దేవ్, డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, పూర్ణాచంద్రరావు, ఉన్నం ప్రసాదరావు, స్వామిరెడ్డి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈవెంట్లపై జీఎస్టీ కన్ను
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఈవెంట్ల నిర్వహ ణపై వాణిజ్య పన్నుల శాఖ కన్ను పడింది. ఇప్పటి వరకూ తమ పరిధిలోకి, దృష్టికి రాని పలు రంగాల వైపు దృష్టి సారించింది. రోజరోజుకు దిగజారుతున్న ఆదాయంతో చంద్రబాబు సర్కార్ తల పట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదాయ వనరుల వేటలో తలమునకలైంది. అందులో భాగంగా ఆదాయం పెంచుకోవటం కోసం చంద్రబాబు ప్రభుత్వం తమ అధికార యంత్రాంగంతో కుస్తీలు పడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన విజయవాడ పరిసరాల్లో ఈవెంట్లను నిర్వహించే సంస్థలపైనా, వ్యక్తులపై దృష్టి పెట్టింది. ఈవెంట్లపై వడ్డించాల్సిందే.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాపితంగా వివిధ సంస్థలు అధికారికంగా, అనధికారికంగా పలు సందర్భాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. దసరా, సంక్రాంతి, నూతన సంవత్సరం, దీపావళి పర్వదినాలకు నిర్వహించే ఈవెంట్ల వైపు అధికార యంత్రాంగా దృష్టి పెట్టింది. వాటి నుంచి వివిధ రూపాల్లో జీఎస్టీ వసూలు చేయటానికి కసరత్తు చేపట్టింది. తాజాగా త్వరలో నూతన సంవత్సరాది, సంక్రాంతి వేడుకలకు సంబంధించి వివిధ సంస్థలు ఈవెంట్లు నిర్వహించనున్నాయి. వాటి నుంచి ఎలా పన్ను రాబట్టాలనే అంశాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు దీనిపై తమ పరిధిలోని వివిధ సర్కిల్స్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లుగా సమాచారం. ఈవెంట్పై 18 శాతం జీఎస్టీ ఈవెంట్ మేనేజమెంట్కు సంబంధించి మొత్తం వ్యయంపై 18 శాతం జీఎస్టీని రాబట్టేందుకు నిబంధనలు వివరిస్తున్నాయి. ఆ మేర ఆలోచన చేసిన అధికారులు దీనిపై భారీగానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా. ఈ క్రమంలో ఇకపై జరిగే అన్ని ఈవెంట్లపైనా దృష్టి పెట్టి జీఎస్టీ వసూలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఒక ఈవెంట్కు సుమారుగా కోటి రూపాయాల వరకు ఖర్చయితే రూ.18 లక్షల మేర జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఈవెంట్ మేనేజర్లు బెంబేలెత్తుతున్నారు. ‘ఇదేమి పన్నురా బాబూ?’ అని నోరెళ్లబెడుతున్నారు. అనుబంధ విభాగాలపైనా.. ఈవెంట్ మేనేజమెంట్తో ముడిపడి ఉన్న అనుబంధ విభాగాలపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా స్టేజీ డెకరేషన్, విద్యుత్దీపాలు, క్యాటరింగ్ వంటి విభాగాలకు చెందిన నిర్వాహకులకు జీఎస్టీ ఇతర ప్రభుత్వ లైసెన్స్లు ఉన్నాయా? లేక అనధికారికంగా నిర్వహిస్తున్నారా? అనే విషయాలను సైతం సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఈవెంట్లలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరినీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీఎస్టీ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది.ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ స్టార్ హోటల్స్పై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెట్టినట్లుగా సమాచారం. హోటల్స్లో వివిధ సంస్థలు ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని పన్ను రాబట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రానున్న నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి ఎక్కడ వేడుకలు జరుగతాయో గమనిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆయా వేడుకలకు ఎంత మేర టిక్కెట్ను పెడుతున్నారు. ఎవరెవరో భాగస్వాములవుతున్నారనే అంశాల ఆధారంగా పన్నును రాబట్టేందుకు చర్యలు చేపడతారని సమాచారం. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలపై ఆరా తీస్తున్న జీఎస్టీ రూ.కోట్ల టర్నోవర్తో దసరా, నూతన సంవత్సరం, సంక్రాంతి ఈవెంట్లు వాటి నుంచి ఎటువంటి ఆదాయం లేదంటున్న జీఎస్టీ అధికారులు రానున్న రోజుల్లో లోతుగా దృష్టి పెడతామంటున్న ఉన్నతాధికారులు ఈవెంట్ మేనేజమెంట్ సంస్థలపై దృష్టి పెడుతున్నాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి ఉన్న అవకాశాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఏమి చెబుతున్నాయో వాటి ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆయా సంస్థలకు లైసెన్స్ ఉందా లేదా? అనేది చాలా ముఖ్యం. – ప్రశాంత్కుమార్, జాయింట్ కమిషనర్, విజయవాడ –1 డివిజన్ -
దుర్గమ్మ సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి
రామవరప్పాడు: తిరుమల తిరుపతి దేవస్థాన నిత్య అన్నదాన ట్రస్టుకు నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ యాజమాన్యం 10 టన్నుల కూరగాయలను మంగళవారం పంపించింది. డీపీఎస్ ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ సునంద జెండా ఊపి కూరగాయల లారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ కీర్తిశేషులు మండ వ కుటుంబరావు స్ఫూర్తితో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమాలకు తాము కూరగాయలు వితరణ చేస్తున్నామని తెలిపారు. పాఠశాల చైర్మన్ పరిమి పవన్ చందు, శ్వేత బింధు, డైరెక్టర్లు కడియాల ప్రవీణ్కుమార్, అకడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, ప్రిన్సిపాల్ భువనేశ్వరన్ పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. గవర్నర్ పేటలోని ఐఎంఏ హాలులో హైరిస్క్ గర్భిణుల ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సుహాసిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గర్భిణిని గుర్తించి నమోదు చేయడంతో పాటు, హైరిస్క్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం, డెలివరీ సమయంలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ, ప్రసవ సమయానికి ముందుగానే ఆస్పత్రికి తరలించడం వంటివి చేపట్టాలన్నారు. ఈ విషయంలో వైద్యాధికారులతో పాటు, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర మోనటరింగ్ ఎంతో అవసరం అన్నారు. శిక్షణ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగనుంది. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని షాబూఖారీ దర్గా 429వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్గాలో బాబా వారిని పలువురు భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. మతగురువు అల్తాఫ్ రజా బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు వంద స్టాళ్లు ఏర్పాటు చేసి భారీ అన్నదానం జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ఆర్డీఓ కావూరి చైతన్య, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, సీఐ చంద్రశేఖర్ ప్రారంభించారు. అతిథులను మేళతాళాలతో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. -
రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు
● రోడ్డు పక్కన నిలిపిన లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్న ముఠా ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ రైళ్ల నుంచి పెట్రోల్, డీజిల్ చోరీ బడ్డీ కొట్లలో యథేచ్ఛగా చోరీ చేసిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న ఆయిల్ చోరీ ముఠా ఈ నెల 15వ తేదీన రాత్రి పినపాక శివారు విద్యానగరం వద్ద 30వ నంబరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన గ్యాస్ బండల లోడు లారీలోని ట్యాంకర్ నుంచి 200లీటర్ల డీజిల్ను దొంగలు చోరీ చేశారు. దీనిపై సదరు వాహన డ్రైవర్ జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. ఇదేరోజు పక్కనే ఉన్న మరో లారీలో ఆయిల్ చోరీ జరిగినప్పటికీ సదరు వాహన డ్రైవర్ ఫిర్యాదు చేయలేదు. ఈ నెల మొదటి వారంలో గడ్డమణుగు లోయ నుంచి చెర్వుమాధవరం వైపు మోపెడ్ వాహనంపై 70లీటర్ల పెట్రోల్ను క్యాన్లలో తీసుకొని వస్తున్న వ్యక్తిని పైపులైన్ సేఫ్టీ వాకర్స్ పట్టుకొని జి.కొండూరు పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా.. ఆగి ఉన్న అయిల్ ట్యాంకరు రైలు నుంచి ఆయిల్ను సేకరించినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. -
పెరిగిన ఆర్థిక, నార్కోటిక్ నేరాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది కంటే 2025లో ఆర్థిక నేరాలతో పాటు, నార్కోటిక్ కేసులు కూడా పెరిగాయి. కాగా ఈ ఏడాది హత్యలు కొద్దిగా తగ్గగా, అదే రీతిలో హత్యాయత్నాలు పెరిగాయి. కిడ్నాప్లు, రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, దొంగతనాలు, సైబర్ నేరాలు కాస్త తగ్గినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. మొత్తంగా 2024లో 11,977 నేరాలు జరగ్గా, 2025లో 9,503 జరిగినట్లు చెప్పారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మంగళ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర నివేదిక–2025 వివరాలు వెల్లడించారు. ఆర్థిక నేరాలు పెరగ్గా, ఇతర నేరాలు తగ్గాయి.. జిల్లాలో ఆర్థిక నేరాలు 2024 కంటే 2025లో 12.68 శాతం పెరగ్గా, నార్కోటిక్స్ కేసులు 19.57 శాతం పెరిగాయి. కాగా ఆస్తి నేరాలు 39.83 శాతం, శారీరక నేరాలు(హత్యలు, హత్యాయత్నాలు) 12.53శాతం, మహిళా నేరాలు 15.11శాతం, పోక్సో కేసులు 23.64 శాతం, రోడ్డు ప్రమాదాలు 23.39 శాతం తగ్గినట్లు క్రైమ్ నివేదికలో వెల్లడించారు. కాగా సైబర్ క్రైమ్ కూడా 45.05 శాతం తగ్గినట్లు క్రైమ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇళ్ల తాళాలు పగలగొట్టిన నేరాలు స్వల్పస్థాయిలో తగ్గగా, సాధారణ నేరాలు బాగా తగ్గినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 366 మంది మృతి చెందగా, వారిలో ద్విచక్రవాహనదారులు 209 మంది, పాదచారులు 107 మంది ఉన్నారు. విజయవంతమైన కేసులు.. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మరణించిన, తీవ్రగాయాలైన వారికి హిట్ అండ్ రన్ నిధి ద్వారా రూ.2కోట్ల మేర కుటుంబ సభ్యులకు పరిహారం అందించామని సీపీ తెలిపారు. సైబర్ నేరస్తులు దోపిడీ చేసిన డబ్బును రూ.9.54కోట్లు సీజ్ చేసి, తిరిగి బాధితులకు అందించామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏబీసీడీ అవార్డును అందుకున్నా మని చెప్పారు. సెల్ఫోన్లు చోరీ కేసుల్లో వంద శాతం రికవరీ చేసి 271 ఐఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. అంతర్రాష్ట్ర శిశు విక్రయాలను ఛేదించి 10మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం, నక్సల్స్ను అదుపులోకి తీసుకోవడం వంటి అనేకం ఉన్నట్లు తెలిపారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, షిరీన్బేగం, కృష్ణప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, తిరుమలేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, ఎస్వీడీ ప్రసాద్తో పాటు ఏడీసీపీలు యం రాజారావు, గుణ్ణం రామకృష్ణ, కె కోటేశ్వరరావు,అన్ని డివిజన్ల ఏసీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్షిక క్రైమ్ రిపోర్టులు సీపీ రాజశేఖరబాబు ఆవిష్కరించారు. సైబర్ క్రైం కేసుల్లో నగదు వెనక్కి తీసుకొస్తున్నాం నేరాల నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులే అధికం నే ర నివేదిక–2025ను విడుదల చేసిన సీపీ రాజశేఖరబాబు సురక్ష 360 కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలోని కాలనీలతో పాటు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. దాదాపు 10వేల సీసీ కెమెరాల ద్వారా నిరంతరం మానిటరింగ్ చేస్తూ, క్రైం నియంత్రణ, నిందితుల గుర్తింపు వంటి వాటితో సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్స్ సర్వేలెన్స్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు, నేరాలు అదుపు చేస్తున్నామన్నారు. క్లౌడ్ పెట్రోలింగ్, అస్త్రం యాప్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరస్తులను గుర్తించేందుకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ వంటివి అమలు చేస్తున్నాం. ఇలా సాంకేతికత వినియోగంలో రాష్ట్రంలోనే ముందున్నట్లు తెలిపారు. -
రైల్వే లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో రైల్వే యార్డ్లు, ట్రాక్లు, సమీప ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరవేయడంపై నిషేధం ఉందని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గతంలో సంక్రాంతి సీజన్లో పలు రైల్వే జోన్లలో ఇలా అనేక కేసులు నమోదయ్యాని గుర్తుచేసింది. 25 కేవీ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ (ఓహెచ్ఈ) లైన్లలో చిక్కుకున్న గాలిపటాల దారాలను తాకిన వ్యక్తులు తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారని వెల్లడించింది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న గాలిపటాల దారాలను లోహం లేదా రసాయనాలతో తయారు చేయడం వల్ల అవి విద్యుత్ వాహకాలుగా పని చేస్తాయని వివరించింది. ప్రతి ఒక్కరూ పండుగను బాధ్యతగా జరుపుకోవా లని, జీవిత భద్రత, నిరంతర రైలు నిర్వహణకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. టెన్త్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం నున్న(విజయవాడరూరల్): రాబోయే ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు డీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఆదేశించారు. నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ను డీఈఓ చంద్రకళ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల హాజరు పత్రాలను పరిశీలించారు. అనంతరం ఇటీవల జరిగిన పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను సమీక్షించారు. పలు సబ్టెక్టుల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులతో సంబంధిత ఉపాధ్యాయుల సమక్షంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థుల తెలుగు భాషా ప్రావీణ్యాన్ని వ్యక్తిగతంగా అంచనా వేశారు. అనంతరం డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై అవసరమైన సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల హాజరు క్రమం తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. నిత్యం 30 నుంచి 50 మంది విద్యార్థులు గైర్హాజరవడంపై ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు మెరుగుపర్చడానికి ఎస్ఎంసీ కమిటీతో ఉపాధ్యాయులు సమన్వయంతో ఉండాలన్నారు. అవసరమైతే ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు స్కూల్కు వచ్చేలా చూడాలన్నారు. పాఠశాల అభివృద్ధికి ఉదారంగా విరా ళాలు అందించిన దాతలు, పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ సంద ర్భంగా పాఠశాల ప్రాంగణంలో డీఈఓ చంద్రకళ మొక్కనాటారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్.రవిప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆదాయ వృద్ధి లక్ష్యాలపై దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏడాది కాలంలో సమష్టి కృషితో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నామని.. ఈ ప్రగతి పథం స్ఫూర్తిగా జిల్లా సమగ్రాభివృద్ధికి ముందడుగు వేద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ కీలక ప్రగతి సూచికల(కేపీఐ)తో పాటు జిల్లా అభివృద్ధికి, ప్రజల క్షేమం, సంక్షేమానికి ఏడాది కాలంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వాటి స్ఫూర్తితో కొత్త ఏడాది కార్యాచరణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12 నెలల కాలంలో మైలురాళ్లను గుర్తుకు తెస్తూ వచ్చే ఏడాదిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేపీఐలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. కొత్త ఏడాదిలోనూ జీడీడీపీ, జీవీఏ, తలసరి ఆదాయం వంటి ఆర్థిక సూచికల్లోనూ లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. కీలక ప్రగతి సూచికల్లో ఏ+ లక్ష్యం.. ప్రతి కీలక ప్రగతి సూచికలో (కేపీఐ)లో ఏ+ గ్రేడ్ మన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. సాధించిన స్కోరు ప్రకారం నవంబర్ వరకు చూస్తే ఎ.కొండూరు మండలం 129 సూచికల్లో 92 స్కోరు, నందిగామ 136 సూచికల్లో 90, తిరువూరు 124 సూచికల్లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాయని తెలిపారు. ప్రతి మండలం, ప్రతి సూచికలోనూ ఏ ప్లస్ గ్రేడ్ను చేరుకునేందుకు మరింత కృషిచేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంప్ ‘గుడ్లవల్లేరు పాలిటెక్నిక్’
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారధి చెప్పారు. నగరంలోని రమేష్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సోమవారం మొదలైన రీజనల్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ రీజనల్ స్పోర్ట్స్ మీట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 23 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. విజయసారధితో పాటుగా స్థానిక కార్పొరేటర్ ఉషారాణి హాజరయ్యారు. ఓవరాల్ చాంపియన్ షిప్ను గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బాలుర, బాలికలు జట్లు సొంతం చేసుకున్నాయి. విజేతల వివరాలు.. ● బాలికల వాలీబాల్ పోటీల్లో విన్నర్గా గుడ్లవల్లే రులోని ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, రన్నర్స్గా నూజివీడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు. ● ఖోఖో పోటీల్లో గుడ్లవల్లేరులోని ఏఏఎన్ఎం అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల మొదటి, ఎంవీఆర్ పాలిటెక్నిక్ కళాశాల రన్నర్స్గా నిలిచారు. ● షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన జి.గౌరీ సాత్విక మొదటి బహుమతి సొంతం చేసుకుంది. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మొదటి బహుమతిని గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు సి.భానుశ్రీ, జి.బిందుశ్రీ సొంతం చేసుకున్నారు. ● టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో ఆర్.రష్మిత, డబుల్స్ విభాగంలో డి.దీనా రాణి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ● 400 మీటర్ల రిలే రన్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు మొదటి బహుమతిని పొందారు. ● పురుషుల వాలీబాల్ పోటీల్లో నూజీవీడుకు చెందిన విద్యార్థులు మొదటి బహుమతిని, గుడ్లవల్లేరు పాలి టెక్నిక్ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా, మూడో స్థానంలో వికాస్ కళాశాల విద్యార్థులు ఉన్నారు. ● కబడ్డీ పోటీల్లో మొదటి స్థానంలో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, రన్నర్స్గా ఆర్కే కళాశాల, మూడో స్థానంలో ఎంవీఆర్ కళాశాల విద్యార్థులు నిలిచారు. ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల రీజనల్ స్పోర్స్ మీట్ -
చౌకబారు దందా
పెడన: పేదలకు అందాల్సిన చౌక బియ్యం పక్క దారి పడుతోంది. అర్ధరాత్రి, వేకువజామున దర్జాగా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లాకు మారుమూలన ఉన్న పెడన నియోజకవర్గం నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం ప్రతి నెలా పక్కదారి పడుతున్నా నియంత్రణ చర్యలు చర్యలు కనిపించడం లేదు. కొద్ది నెలలుగా సివిల్ సప్లయీస్ అధికారులు అడపాదడపా దాడులు చేసి బియ్యాన్ని పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నెలకు 39,469 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వం ప్రతి నెలా ఉచితంగా కార్డుదారులకు సరఫరా చేస్తోంది. కొందరు రేషన్ డీలర్లు, బయట దళారులతో కలిసి బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెడన పట్టణంతో పాటు నాలుగు మండలాల్లో ఈ తరహా అక్రమాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. కార్డుదారుల వద్ద కిలో రూ.10 నుంచి రూ.12 వరకు బియ్యం మాఫియా నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. కొందరు డీలర్లు వినియోగదారుల వద్ద వేలిముద్రలు తీసుకుని బియ్యాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నార్న ఆరోపణలు ఉన్నాయి. బియ్యం రీసైక్లింగ్ పక్కదారి పడుతున్న బియ్యాన్ని దళారులు ట్రేడింగ్ మిల్లులకు కిలో రూ.18 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ట్రేడింగ్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేస్తూ తిరిగి సివిల్ సప్లయీస్, బహిరంగ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంలోనే కాకుండా ఇటీవల కాలంలో కూడా అధికారులు భారీగా బియ్యం నిల్వలను పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే. ఆ స్టాకు పాయింట్ల ద్వారా తరలింపు చిన్న చిన్న దళారులు లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ.10 చొప్పున కొనుగోలు చేసి మధ్య దళారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. వీరు ఏకంగా రూ.18 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. వీరి నుంచి అధికంగా ఫంగస్ చేపల పెంపకం దారులు, ఇతర వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఫంగస్ చేపలకు అన్నంగా వండి మేతగా వేస్తున్నారు. మధ్య దళారులు కొన్ని ప్రాంతాలను ప్రత్యేక పాయింట్లుగా ఏర్పాటు చేసు కుని మండలాల సరిహద్దులు దాటించేస్తున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వర్తించే వారి కంట్లో పెడితే వారికి ప్యాకేజీలు అందజేస్తున్నారు. ఆ తరువాత ఎవరైనా ఫిర్యాదులు చేసినా చూసి చూడనట్లు, తెలిసిన బండేనని వదిలేయడం, లేదా వాహనం వెళ్లిపోయిన తరువాత రావడం వంటివి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్లు, మినీ వ్యానుల్లో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సరిహద్దులు దాటిపోతున్న పీడీఎస్ బియ్యం అర్ధరాత్రి, వేకువ జామునే మండలాల నుంచి దాటింపు ఫిర్యాదుచేసినా.. అడ్డుకున్నా.. పట్టుకున్నా.. ప్యాకేజీలతో బురిడీ రేషన్ షాపులపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే పలు చోట్లు తనిఖీలు నిర్వహించాం. పట్టణంలోనే కాకుండా పలు మండలాల్లో కూడా తనిఖీలు నిర్వహించాం. అయితే రాత్రి సమయంలో తరలిస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. తప్పకుండా నిఘా పెడతాం. – నాగమల్లేశ్వరరావు, సివిల్ సప్లయీస్ డెప్యూటీ తహసీల్దార్ -
భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్లు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లో ఆయన రెవెన్యూ క్లినిక్ను సోమవారం ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెవెన్యూ క్లినిక్లో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుల పరిశీలన, సలహాలు, సూచనల విభాగం, 22ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్వోఆర్, పట్టాదారు పాస్పుస్తకాలు, సుమోటో, అడంగల్ కరెక్షన్ సమస్యలు, రీ–సర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం) తదితర సమస్యలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు ఉంటున్నాయని వాటన్నింటికీ ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుందని చెప్పారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుని భూసంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కెఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి సమస్య పరిష్కారానికే జలశక్తి హ్యాక్థాన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ వైఆర్ఎస్ రావుపెనమలూరు: జల సమస్యల పరిష్కారాలను కనుగొని, నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జలశక్తి హ్యాక్థాన్–2025 ముఖ్య ఉద్దేశమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు తెలిపారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జలశక్తి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సస్, రివర్ డెవల్మెంట్ శాఖల సహకారంతో జలశక్తి హ్యాకథాన్–2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఆర్ఎస్ రావు మాట్లాడుతూ నీటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పది లైన్లతో జలశక్తి మంత్రిత్వ శాఖ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికతతో అధిగమించగలం.. ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్జైన్ మాట్లాడుతూ దేశంలో వనరులు తక్కువగా ఉన్నా సాంకేతికతతో సమస్యను అధిగమించగలుగుతామని అన్నారు. విద్యార్థులు పరిశోధనలు చేసి వాస్తవ సమస్యలకు గుర్తించి పరిష్కారం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎన్.జ్యోతికుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఆకలి నుంచి హరిత విప్లవం పైపునకు సివిల్ ఇంజినీర్లు తీసుకు వెళ్లారన్నారు. జాతీయ నీటి నిపుణుడు ఎ.వరప్రసాదరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వీ విజయ్కుమార్, కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, వర్సిటీ సివిల్ హెడ్ డాక్టర్ వి.మల్లికార్జున, భూగర్భశాఖ నిపుణులు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణపై అవగాహన
గూడూరు: బాల్య వివాహాల నివారణకు అందరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ యు.ఉషశ్రీ అన్నారు. బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ముక్కొల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ పెళ్లి ఈడు రాకుండా వివాహం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పెళ్లి ఈడు వచ్చే వరకు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను రూపుమాపటానికి బాలబాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.శారద, జి.హేమలత, అరుణాదేవి, ఎంఎస్కే రీనా బేగం, ఏఎన్ఎం కాగిత కోమలి, భవాని, ఉదయలక్ష్మి, అర్చన, వరలక్ష్మి, పి.భాగ్య తదితరులు పాల్గొన్నారు. -
చట్టపరిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం
ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణకోనేరుసెంటర్: సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక ‘మీ కోసం’ అని ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ‘మీ కోసం’లో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 45 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
రాష్ట్ర క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సాహకాలను అందిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, త్రిపుల్ జంప్, షార్ట్పుట్, డిస్కస్త్రో, జావెలెన్త్రో అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి, బెలూన్లు, పావురాలను ఎగుర వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నగరంలో జరిగిన 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో నగరానికి చెందిన టి.సూర్య చరిష్మ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి నగరానికి పేరు తేవడమే కాకుండా ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జీవీ రామచంద్రరావు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు.. -
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించండి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగించుకుని మత్స్యసంపదను పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టిసారించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నిధులతో పీతలు, సముద్రనాచు, అలంకార చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని, అధిక ఆదాయం పొందే విధంగా మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు. పీతల పెంపకంపై దృష్టి.. జిల్లాలో 27 పీతల పెంపకం యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. ఒక్కొక్క యూనిట్కు రూ. 19,400 అవుతుందని, 64 మంది లబ్ధిదారులను గుర్తించామని కలెక్టర్ చెప్పారు. పీతల పిల్లల కోసం ఆర్జీసీఐకు ఇండెంట్ పెట్టాలన్నారు. రానున్న ఫిబ్రవరి రెండో వారంలో యూనిట్లు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కేటాయించిన రూ. 9 లక్షలకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసి పంపాలన్నారు. జిల్లాలో 25 సముద్రనాచు పెంపకం యూనిట్ల కోసం 80మంది సిద్ధంగా ఉన్నారని ఒక్కొక్క యూనిట్ విలువ రూ. 11,660 అని వీటికి జనవరి మొదటి వారంలో చెల్లింపులు చేయాలన్నారు. అలంకార చేపల యూనిట్ విలువ రూ. 45,948 కాగా 10 మంది కృత్తివెన్ను మండలంలో లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. జనవరి మొదటి వారంలో యూనిట్లు మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు. వచ్చే సంవత్సరం మరో 500 పీతల పిల్లల పెంపకం యూనిట్లు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 4వ తేదీన మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ ఎ. నాగరాజు, డీఎఫ్వో సునీత, గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రాజెక్టు మేనేజర్ ఉష, ప్రభాకరరావు పాల్గొన్నారు. -
గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు
గుడ్లవల్లేరు: లిపిడోమిక్స్ వినూత్న పరిశోధనలు అంశంపై వి.వి.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గుడ్లవల్లేరులోని ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మిచిగన్ వేన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ పి.గోవిందయ్య హాజరయ్యారు. సాంకేతికత ద్వారా ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైలింగ్లో జరుగుతున్న వినూత్న పరిశోధనలు అనే అంశంపై విలువైన ఉపన్యాసం అందించారు. లిపిడోమిక్స్ రంగంలో ఈ ఆధునిక విశ్లేషణ పద్ధతుల ప్రాముఖ్యతను, ఔషధ పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల్లో వాటి వినియోగాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందయ్యను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేసిన పరిశోధనా సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమం కో–ఆర్డినేటర్ డి.లావణ్యతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అవార్డు
పటమట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. లక్ష్మీకాంతం నేపాల్లోని ఖాట్మాండులో వరల్డ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ నుంచి ఎస్డీఈ చాంపియన్ బహుమతిని అందుకున్నారు. ఈ నెల 28వ జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్, మాజీ రాయబారి డాక్టర్ రాంభక్త ఠాకూర్, మాజీ పర్యాటక మంత్రి యాంకిల షెర్పా, మాజీ మహిళా, శిశు సంక్షేమ మంత్రి భగవతి చౌదరి, నేపాల్ మాజీ సంస్కృతి, పౌర విమానయాన మంత్రి ఆనంద ప్రసాద్ పోఖారెల్ సమక్షంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యూరియా అక్రమ రవాణా, నిల్వలు, పక్కదారి మళ్లింపులను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. జిల్లాలో యూరియా పంపిణీ ప్రణాళిక, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలు, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంపై కలెక్టర్ సోమవారం ఆర్డీవోలు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్స్ రద్దు.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ నుంచి మొత్తం 17,707 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. వచ్చే మూడు రోజులకు 339 టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రస్తుతం 5,236 టన్నుల యూరియా కోఆపరేటివ్ సొసైటీల్లో, మార్క్ఫెడ్ గోదాముల్లో, రిటైల్/హోల్సేల్ తదితరాల చోట్ల అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రైతులు ఎరువులను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా డీలరు నుంచి రసీదు పొందాలని సూచించారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, పక్కదారి పట్టించినా, ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జనవరి 5వ తేదీ సోమవారం నిర్వహించేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. బ్రాహ్మణవీధిలోని దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణ బోర్డు మీటింగ్ హాల్లో ఉదయం 11 గంటలకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ఈవో, ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు పాల్గొననున్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. కొత్త ఏడాదికి పూలబొకేలు, స్వీట్లు కాకుండా కృష్ణసంకల్పం పేరుతో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందించాలన్నారు. డిసెంబరు 31న పింఛన్ల పంపిణీ చేపట్టాలన్నారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 152 అర్జీలను స్వీకరించారు. అర్జీల్లో కొన్ని -
ఏపీ ఎన్జీఓ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన సంవత్సరంలో స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేద్దామని తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు అన్నారని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. సోమవారం ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్జీఓ సంఘ క్యాలెండర్ను, డైరీ 2026ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ సంఘం జనరల్ సెక్రటరీ డీవీ రమణ, ఏపీ యూటీఎఫ్ ప్రెసిడెంట్ నక్కా వెంకటేశ్వర్లు, ఏపీ ఎస్టీయూ ప్రెసిడెంట్ ఎం.రఘునాథరెడ్డి, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (257) ప్రెసిడెంట్ జి.హృదయరాజు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (1938) ప్రెసిడెంట్ మంజుల, ఏపీపీటీడీ (ఎన్ఎంయూ అసోసియేషన్) ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వెంకటేశ్వర్లు, ఏపీ సీపీఎస్ ప్రెసిడెంట్ సతీష్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ప్రెసిడెంట్ జానీ పాషా తదితరులు ఉన్నారు. -
కృష్ణా జిల్లా
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.2400 టీఎంసీలు. ముక్కోటి ఏకాదశికి ముస్తాబు లబ్బీపేట: ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యాన పున్నమ్మతోటలో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలోని వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. రీజనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. –8లో.. 7 -
నవలంకలో సందడి
నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ఎదుట నది మధ్యలో తారసపడే చిరుదీవి ‘నవలంక’. ఇక్కడ ఇసుక తెన్నెలపై తరచూ సందర్శకులు సందడి చేస్తున్నారు. నది మధ్య ప్రకృతి పరచిన సహజ సైకత పరదాల అందాలు ఆకట్టుకోవడంతో చల్లపల్లికి చెందిన వాకర్స్ ఆదివారం రాత్రి ఆటపాటలు, క్యాంప్ ఫైర్ నృత్యాలతో ఎంజాయ్ చేశారు. చల్లపల్లి వాకర్స్ ఇసుకలో తొలుత ఇక్కడి నుంచి సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదిస్తూ తర్వాత బీచ్ బాల్, టగ్ ఆఫ్ వార్, ట్రాక్ సాంగ్స్ అంత్యాక్షరి లాంటి క్రీడలు నిర్వహించారు. వయసు, హోదా పక్కనపెట్టి డాక్టర్లు, టీచర్లు, వ్యాపారులు, ఉద్యోగులతో కూడిన వాకర్స్ బృందం సభ్యులు క్యాంప్ఫైర్ చుట్టూ ఆట పాటలతో చేసిన నృత్యాలు అలరించాయి. దివిసీమ ప్రాంత వాసులకు నవలంక సేద తీర్చే విడిదిగా మారడంతో సాయంత్రానికి శ్రీరామపాదక్షేత్రం ఘాట్, నవలంక సందర్శనకు ఉత్సాహంగా వస్తున్నారు. సంక్రాంతి సెలవులకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో నావల ప్రయాణంలో రక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. –నాగాయలంక -
బరి తెగింపు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పందెంరాయుళ్లు కాలు దువ్వుతున్నారు. సంక్రాంతికి ముందే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల మామిడితోటల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ, పార్లమెంటు ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపడంతో నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సైతం మామూళ్లు అందుతుండటంతో వారు వీటిపై కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. ‘క్యాసినో’ నిపుణులు రంగంలోకి.. ఈ ఏడాది ప్రత్యేకంగా ఇప్పటికే క్యాసినో నిపుణులను నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా చర్చ సాగుతోంది. రాత్రీపగలు క్యాసినోకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో.. సంక్రాంతి వేళ సంప్రదాయం ముసుగులో కోట్లు దండుకునేందుకు అధికార టీడీపీ రెడీ అయ్యింది. పండుగ వేళ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బరుల స్థాయిని బట్టి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రేటు ఫిక్స్ చేశారు. వీటి నిర్వహణను పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు కొందరు ప్రజాప్రతినిధులు అప్పజెప్పారు. పండుగకు వారం ముందు నుంచే ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహిస్తూ సంప్రదాయం ముసుగు కప్పి బరులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రెడీ చేశారు.గుడ్లవల్లేరు: మండల కేంద్రంలో భారీగా కోడి కత్తులను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఎస్.ఐ సత్యనారాయణ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారంతో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ వద్ద కోడి కత్తులు కలిగి ఉన్నట్లు తెలిసి సిబ్బందితో కలిసి కుంభా రామకృష్ణ అనే దివ్యాంగుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 240 కోడి కత్తులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అతనిపై గుడ్లవల్లేరు పీఎస్లో కేసు నమోదు చేశామన్నారు. -
ఈ–ఆటోలతో చెత్త సేకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్త బుట్టలతో ఈ–ఆటోలు, తోపుడు బండ్లను ఏర్పాటు చేశామని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జిల్లా పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యాన చెత్తసేకరణ కోసం ఈ–ఆటోలు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఈ–ఆటోలను నడిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇందుకోసం జిల్లాలో ఎనిమిది ఈ–ఆటోలు, 171 తోపుడు బండ్లను గ్రామాలకు అందజేశామన్నారు. ఆటోలు, తోపుడుబండ్లలో వేర్వేరు రంగులతో చెత్తబుట్టలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో జె.అరుణ, డీఎల్పీవో రహ్మతుల్లా, ఏవో సీతారామయ్య, పలువురు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోడౌన్ పరిశీలన
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ను తెరిచి ఈవీఎంలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఈవీఎం నోడల్ అధికారి ఎం నిత్యానందం, మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, బూర సుబ్రహ్మణ్యం, పంతం గజేంద్ర, వీరంకి గురుమూర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎంవీ శ్యామ్నాధ్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ పీజీ గైనకాలజీలో యూనివర్సిటీ టాపర్ జాహ్నవి లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ నెల 28వ తేదీ విడుదల చేసిన పీజీ ఫలితాల్లో గైనకాలజీ విభాగంలో డాక్టర్ ఓ శ్రీజాహ్నవి యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ జాహ్నవి అత్యుత్తమ మార్కులతో గైనకాలజీ విభాగంలో మొదటి స్థానం పొందారు. భవిష్యత్లో గ్రామీణ మహిళలకు వైద్య సేవలు అందించడానికి కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె తండ్రి జయరాజు ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. జాహ్నవిని పలువురు అభినందించారు. బాడీబిల్డింగ్లో బందరు యువకుడికి స్వర్ణపతకం మచిలీపట్నంఅర్బన్: ఆంధ్ర బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో బందరుకు చెందిన యువకుడు స్వర్ణ పతకం సాధించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో స్థానిక మాచవరానికి చెందిన బీరం ప్రశాంత్ 65 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన పోటీల్లో ప్రశాంత్ ప్రతిభ కనబర్చాడు. విజేతలకు సంఘ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ విజయంతో బందరు ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చినందుకు క్రీడాభిమానులు, స్థానికులు అభినందించారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికలు భవానీపురం(విజయవాడపశ్చిమ): కరాటే ఇండియా ఆధ్వర్యాన జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించనున్న మొదటి జాతీయ స్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలకు విజయవాడలోని క్రీడా కేంద్రంలో ఆదివారం ఎంపికలు జరిగాయి. దీనిపై ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.హరనాఽథ్, ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికల్లో భాగంగా అండర్ 21 కేటగిరిలో బాలబాలికల మధ్య సబ్ జూనియర్స్, క్యాడెట్–జూనియర్స్కు పోటీలు జరిగాయని తెలిపారు. ఇందులో కటా బాలికల జట్టులో అక్షిత, చార్వీ అగర్వాల్, ఆఫ్రిన్ షహనాజ్, తేజశ్రీ సాయి, కుసుమ శ్రీచరిత, షఫియ, హరిచందన బంగారు పతకాలను గెలుచుకుని జాతీయ టోర్న్మెంట్కు ఎంపికయ్యారని వివరించారు. కటా బాలుర జట్టుకు లీలా ఉదయ్ రెడ్డి, భువన్ సాయి, అబ్దుల్ రెహన్, అజయ్ శర్వణ్, వెంకట అవినాష్ గోల్డ్ మెడల్స్ సాధించారని పేర్కొన్నారు. కుమితే బాలికల జట్టుకు స్నిగ్ధ, వసుధ, లక్ష్మీదివ్య, బాలుర జట్టుకు గ్రిఫిన్ జోయల్, యశ్విన్, సాత్విక్, సుహాన్, కృష్ణ, మోనిష్, ప్రియతమ్, నితీష్ నాగసాయి, విఘ్నేష్ బంగారు పతకాలను సాధించారని తెలిపారు. ఎంపికలకు జక్కుల దినేష్, సీహెచ్ మహేష్, టి.మధు, బి.నరసింహ, టీవీ సాయికుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలను ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అన్వర్ షేక్ అభినందించారు. -
దుర్గమ్మ భక్తుల తలనీలాలకు రికార్డు ధర
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన తలనీలాలకు రికార్డు ధర పలికాయి. ఏడాదికి రూ. 10.10 కోట్లకు తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ టెండర్ను దక్కించుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం టెండర్ ప్రక్రియను నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీకి చెందిన మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు ఒక్కొక్కరూ రూ.50 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రెండేళ్ల కాల పరిమితికి దేవస్థానం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్ మొదటి ఏడాది మొత్తంపై 10 శాతం పెంపుతో రెండో ఏడాది టెండర్ కొనసాగింపు జరుగుతుందని టెండర్ నిబంధనల్లో పొందుపరిచారు. గతంలో రూ. 8 కోట్ల పైబడి పలికిన టెండర్ రెండేళ్ల హెయిర్కు డిమాండ్ లేకపోవడంతో కేవలం రూ. 6.30 కోట్లకు కాంట్రాక్టర్కు దేవస్థానం అప్పగించింది. ఈ ఏడాది మళ్లీ హెయిర్కు డిమాండ్ రావడంతో అధిక ధర పలకడం గమనార్హం. మూడు విధానాల్లో.. బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ టెండర్ వంటి మూడు విధానాల ద్వారా దేవస్థానం టెండర్లు ఆహ్వానించారు. మూడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 19 మంది టెండర్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.30 కోట్లు పలికిన టెండర్కు 2026 జనవరితో కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి తలనీలాలు పొగు చేసుకునేలా నిర్ణయించిన ఆలయ అధికారులు పాటను రూ. 7 కోట్లుగా నిర్ణయించి బహిరంగ వేలం ప్రారంభించారు. మదర్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్, ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ టెండర్ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరకు ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ రూ. 10.10 కోట్లకు బహిరంగ వేలం ద్వారా టెండర్ను దక్కించుకుంది. సీల్డ్ టెండర్లో నలుగురు కాంట్రాక్టర్లుసీల్డ్ టెండర్లో నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, అందులో అత్యధికంగా రూ. 9.57 కోట్లకు కోట్ చేశారు. ఆన్లైన్లో ఈ టెండర్ ద్వారా రూ. 9.09 కోట్లకు టెండర్ దాఖలు చేయడంతో బహిరంగ వేలం ద్వారా అత్యధిక ధర పలకడంతో ఆ టెండర్ను ఆమోదిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియను ఈవో శీనానాయక్, ఎసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు, సూపరింటెం డెంట్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. కమిషనర్ అనుమతి అనంతరం టెండరు ఖరారు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. -
న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదంగా జరుపుకోండి
● ఆరోగ్యంగా, హాని రహితంగా చేసుకోవాలి ● ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరిస్తూ, వేడుకలను ఆహ్లాదంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పలు సూచనలు అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేవని, అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దని సీపీ హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్పై్ కఠిన చర్యలు ఉంటాయని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత) , కనక దుర్గా ఫ్లైఓవర్ లపై ట్రాఫిక్ను నిలిపివేస్తామన్నారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగవద్దని, హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరెత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుందని, అలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలకు లోనుకాకుండా, ఇతరులను గురిచేయకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. -
మాజీ ఎంపీ కంభంపాటిని పరామర్శించిన సీఎం
గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లిలో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్రావు నివాసానికి ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచ్చేశారు. ఇటీవల మాతృమూర్తి వెంకట నరసమ్మను కోల్పోయిన కంభంపాటిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి, సానుభూతి తెలిపారు. తొలుత వెంకట నరసమ్మ చిత్రపటానికి చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, అదనపు ఎస్పీ సత్యనారాయణ, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, ప్రత్యేక భద్రతాధికారి శాంతకుమారు తదితరులు పాల్గొన్నారు. -
త్రిముఖ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
పటమట(విజయవాడతూర్పు): త్రిముఖ ట్రైలర్కు పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ వచ్చిందని మూవీ యూనిట్ పేర్కొంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ విజయవాడ విచ్చేసింది. ఈ సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులోని ఓ హోటల్లో మూవీ యూనిట్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి అన్నారు. ఈ సినిమాలో ఏసీపీ శ్రీవాణి పాత్రలో సన్నీలియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. చిత్ర దర్శకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో తీశానని, చిత్రంలో అందరూ కొత్త వారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరిచారని చెప్పారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. జెమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని కోరారు. అకిరా డ్రిమ్ క్రియేషన్స్లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనవరి 2న విడుదల అవుతోందని తెలిపారు. పిచ్చికుక్క స్వైరవిహారం తొమ్మిది మందికి గాయాలు చల్లపల్లి: పిచ్చికుక్క స్వైరవిహారం చేయటంతో పలువురు గాయాలపాలైన ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక పిచ్చికుక్క శనివారం నుంచి లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో సంచరిస్తూ కనిపించినవారినల్లా కరిచి గాయపరిచింది. శనివారం ఐదుగురిని కరవగా ఆదివారం మరో నలుగురిని కరిచింది. దీంతో మొత్తం పిచ్చికుక్క కాట్లకు గురైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. విజయవాడకు చెందిన అంకినీడు ప్రసాద్ చుట్టపుచూపుగా లక్ష్మీపురం రాగా ఆదివారం అతనిని, లక్ష్మీపురం గ్రామానికి చెందిన జయంపాటి శ్రీదేవిని, చింతలమడకు చెందిన సుదాని విష్ణుమూర్తితో పాటు మరొకరిని కరిచింది. వీరమాచినేని అంకినీడు ప్రసాద్ కాలుకు తీవ్రగాయం కాగా తొలుత చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆదివారం అక్కడ సివిల్ సర్జన్ లేకపోవటంతో విజయవాడ వెళ్లిపోయాడు. జయంపాటి శ్రీదేవి, సుదాని విష్ణుమూర్తి ప్రస్తుతం చల్లపల్లి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కేబీఎన్ సేవలు అపూర్వం వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాభివృద్ధికి కేబీఎన్ కళాశాల గడిచిన 60 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలు అపూర్వమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేబీఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనం (కోసా) ఆదివారం ఆ కళాశాల ప్రాంగణంలో అత్యంత వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారుచేసిన బీఎన్రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. మరో మూడు నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ కేబీఎన్ కళాశాలలో తాను ఎనిమిదేళ్లు అధ్యాపకునిగా పని చేశానన్నారు. టాలీవుడ్ నటుడు, కాలేజీ పూర్వవిద్యార్థి సుహాస్ మాట్లాడుతూ కేబీఎన్ కాలేజీ నేర్పించిన క్రమశిక్షణ, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సినీ రంగంలో తాను నిలదొక్కుకోవటం సాధ్యమైందన్నారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేఎసీఎస్రావు, మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి, హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య తదితరులు మాట్లాడారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు ఉసిరిక ఉమామహేశ్వరరావు, తూనికుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి ఏవో డాక్టర్ వి.నారాయణరావు ఉపాధ్యక్షుడు చిట్టూరి నాగేంద్ర, పూర్వ విద్యార్థి ప్రముఖులు రమేష్ బాబు (సీఈఓ, సి ఛానెల్), డాక్టర్ ఆర్కే అయోధ్య (ప్రముఖ సైకాలజిస్ట్), నందిపాటి శ్రీనివాసరావు (ప్రముఖ న్యాయవాది) తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ముగిసిన బాలోత్సవ్ సంబరాలు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మహిళా కళాశాలలో గత రెండు రోజుల నుంచి విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాలోత్సవ్ సంబరాలు ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిశాయి. కార్యక్రమంలో ఉభయ జిల్లాలలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కల్చరల్, అకడమిక్ విభాగాల్లో విద్యార్థులను కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించారు. కల్చరల్లో క్లాసికల్, ఫోక్ డ్యాన్స్, కోలాటం, ఏకపాత్రాభినయం ప్రదర్శనలతో అదరగొట్టారు. అకడమిక్ ఈవెంట్లో చదువుకు దోహదపడే పలు ఆటలతో పాటు బంక మట్టితో బొమ్మల తయారీ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవుడి బొమ్మలు, జంతువులు, ప్రకృతి ప్రాధాన్యతను వివరిస్తూ మట్టితో మలిచిన కళాకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సృజనాత్మకతకు పదును పెట్టాలి విద్యార్థులు తమలో దాగిఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే తమలో ప్రతిభ గురించి నలుగురికి తెలుస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు విద్యతో పాటు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీసీఎస్టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు, కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యనమలకుదురు వృషభాలకు మొదటి బహుమతి
పెనమలూరు: యనమలకుదురు గ్రామానికి చెందిన శ్రీఅనంతనేని కావ్య, శ్రీమధులకు చెందిన వృషభాలు బండలాగుడు పోటీలో ప్రథమ బహుమతి గెలిచాయి. నరసరావుపేటలో శనివారం జరిగిన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు పోటీలో యనమలకుదురుకు చెందిన వృషభాలు ఆరు పళ్ల విభాగంలో 3765 అడుగులు బండలాగి ప్రథమస్థానం పొందాయి. మరో జత 3059 అడుగులు బండ లాగి నాల్గవ స్థానం వచ్చాయి. ఈ పోటీలో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ మేరకు బహుమతి యజమాని అనంతనేని అజాద్ తీసుకున్నారు. నేడు షాబుఖారి దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దర్గా ప్రాంగణం శుద్ధి చేశారు. దర్గాతో పాటు బీ కాలనీ సెంటర్ నుంచి దర్గా వరకు విద్యుద్దీపాలంకరణ చేశారు. సోమవారం రాత్రి గుసుల్ ఉత్సవం, మంగళవారం గంధం మహోత్సవం, బుధవారం దీపారాధన వైభవంగా జరుపుతారు. గంధం ఊరేగింపు ఉత్సవాలకు హైలెట్గా నిలవనుంది. ఈ సందర్భంగా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో మూడు రోజుల పాటు కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కృష్ణానదిలో పడి వృద్ధుడు దుర్మరణం కంచికచర్ల: కూలి పని కోసం వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన మాలాజీ నందియ్య(70) పొలం పని కోసం ఇంటి నుంచి వెళ్లగా ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కృష్ణానదిలో పడిపోయాడని తెలిపారు. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడని చెప్పారు. మృతునికి ముగ్గురు సంతానం ఉన్నారు. నందియ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. టిప్పర్ లారీ ఢీకొని వృద్ధురాలు దుర్మరణం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): టిప్పర్ లారీ ఢీకొని వృద్ధురాలు దుర్మరణం చెందిన ఘటన కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి ఖిల్లా రోడ్డుకు చెందిన కంపా సలోమి (66)వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. కొండపల్లికి చెందిన ఓ స్టోన్ క్రషర్ లారీ గ్రావెల్తో వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్న సలోమిని ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా లారీ డ్రైవర్ గమనించకుండా వృద్ధురాలి మీదుగా లారీని పోనిచ్చి ఆగకుండా వెళ్లిపోయాడు. సమీపంలో వాహనదారులు వెంబడించి లారీ డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సలోమికి గతంలోనే భర్త మృతి చెందగా, కుమారుడి వద్ద ఉంటోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్, లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్ గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు. -
ఊబకాయం
ఆయుష్షును హరించే ఇతర వ్యాధులివే... ● ఒబెసిటీ ఉన్న వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ● ఒబెసిటీ ఉన్న వారిలో పది శాతం మందిలో గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ● ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ● మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయస్సులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ● పటమటకు చెందిన వెంకట్ వయస్సు 35 సంవత్సరాలు. ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం లేకపోవడంతో బరువు 97 కేజీలకు చేరాడు. ఇటీవల నీరసంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మధుమేహం ఉన్నట్లు తేలింది. ఒబెసిటీ కారణంగానే మధుమేహం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ● వన్టౌన్కు చెందిన శ్రావణి వయస్సు 27 సంవత్సరాలు. ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వివాహమై మూడేళ్లు అవుతున్నా పిల్లలు లేక పోవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఒబెసిటీ కారణంగా ఓవరీస్లో బుడగలు వచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా హైపోథైరాయిడ్కు గురైంది. ఇలా అనేక మంది ఒబెసిటీ కారణంగా మధుమేహం, రక్తపోటులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు గుండె జబ్బులు, థైరాయిడ్ , కిడ్నీ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. అందుకు కదలిక లేని జీవన విధానం. ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ ఊబకాయులుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొన్నాళ్ల తర్వాత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. గుండె జబ్బులతో పాటు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల అనేక దుష్ఫలితాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్తపోటు, మధుమేహం వంటివి సోకుతున్నాయంటున్నారు. ఉమ్మడి కృష్ణాలో దాదాపు 10 లక్షల మంది అధిక బరువుతో ఉన్నట్లు అంచనాకు వచ్చారు. పెరుగుతున్న గుండె జబ్బులు గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులు ఎక్కువగా ఉంటున్నారు. గుండె జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే వారిలో వారిలో 20 శాతం మందికి ఒబెసిటీ కారణంగా ఉంటుంది. అలాంటి వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాక్స్ ఏర్పడటం, గుండైపె ఎఫెక్ట్తో దెబ్బతినడం, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్న వారికి యాంజియోప్లాస్టీ నిర్వహించి బ్లాక్స్ను తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. గుండె నరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై వత్తిడి పడుతుంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతాయని వైద్యులు చెపుతున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని కూడా చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు ప్రభుత్వాస్పత్రికి డయాలసిస్ కోసం వస్తున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, వారిలో సగం మంది ఒబెసిటీ కారణంగా తలెత్తిన దుష్ఫలితాల ప్రభావంగా కిడ్నీలు పాడైన వారు ఉంటున్నారు. నియంత్రణ ఇలా... మనదేశంలో బాడీ మాస్ ఇండెక్స్ 23.5 దాటిన వారందరినీ ఒబెసిటీగా భావిస్తారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల్య ఆహారం తీసుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు లాంగ్టర్మ్, షార్ట్ టర్మ్ రెండు విధానాలు ఉన్నాయి. లాంగ్టర్మ్లో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. షార్ట్ టర్మ్లో రోజుకు వెయ్యి క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ 27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు శరీర బరువు అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యదాయకం మధుమేహం, రక్తపోటుకు ప్రధాన కారణం గుండెపోటుకు దారి తీస్తున్న వైనం వత్తిడికి లోనై దెబ్బతింటున్న కిడ్నీ ఫిల్టర్లు వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న వైద్యులు జాతీయ ఎన్సీడీ–సీడీ సర్వేలో ఒబెసిటీతో వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తిస్తున్న వైనం రెగ్యులర్ చెకప్ అవసరం ఒబెసిటీ ఉన్న వారు రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ పరీక్షలతో పాటు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒబెసిటీని అధిగమించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్లతో పాటు, మెటబాలిజం దెబ్బతింటుంది. అదుపులో లేని మధుమేహం, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీమ్లు తినకుండా ఉండటం ఉత్తమం. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ మెడిసిన్ నిపుణుడు(ఫిజీషియన్), విజయవాడ -
గ్రామీణ వైద్యుల సేవలు ప్రజారోగ్యానికి కీలకం
మచిలీపట్నంఅర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామీణ వైద్యుల సేవలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (ఆర్ఎండబ్ల్యూపీఏపీ) వార్షిక సమావేశం వ్యవస్థాపక అధ్యక్షుడు బండి రామాంజనేయులు అధ్యక్షతన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎన్. కన్వెన్షన్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు పేద ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. డాక్టర్ పల్లెం ఆకాష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమానికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో కొనకళ్ల బుల్లయ్య, జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షుడు కొండిశెట్టి సురేష్, ఆర్ఎండబ్ల్యూపీఏపీ ఉపాధ్యక్షుడు ఎ.కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి.నందగోపాల్, కోశాధికారి ఎ.డేవిడ్ రాజు పాల్గొన్నారు. -
మంచి చేస్తారా? మళ్లిస్తారా?
● పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల ● ఎన్టీఆర్ జిల్లాకు రూ. 18.93కోట్లు ● ఫిబ్రవరితో సర్పంచ్ల పదవీకాలం ముగియనుండటంతో వినియోగంపై ఆందోళన జగ్గయ్యపేట: గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య, తాగునీటితో పాటు గ్రామాభివృద్ధికి 2025–26కు సంబంధించి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు సక్రమంగా ఖర్చవుతాయా లేదా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లో పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నిధులు ఏ మేరకు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. వేసవి కాలం కూడా రానుండటంతో తాగునీటి కొరత నెలకొంటుందని మరి నిధులు వెచ్చిస్తారో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాలకు రూ. 18.93 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు గ్రామాలలో పారిశుద్ధ్య, తాగునీటికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు గ్రామాభివృద్ధి, ఇతర అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నిధులు ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమయ్యాయి. అయితే పంచాయతీ కమినషర్ నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు రాలేదని సమాచారం. గ్రామాలలో అధ్వానంగా పారిశుద్ధ్యం.. ఒక పక్క ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకుంటూ హంగామా చేస్తున్నప్పటికీ గ్రామాలలో మాత్రం పారిశుద్ధ్యం అధ్వానంగానే కనిపిస్తోంది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు సైతం దారుణంగా ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. పన్నులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తున్నా గ్రామాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అంతే కాకుండా నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నెలకొన్నాయి. ముగుస్తున్న పదవీకాలం.. సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో కార్యదర్శులు, సర్పంచ్లు కుమ్మకై ్క బిల్లులు పెట్టి నిధులను పక్కదారి పట్టేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ కూడా కొరవటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిధులను సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్య చర్యలకు వినియోగించాలి. నిధులను ఇష్టానుసారం వినియోగించటానికి లేదు. కార్యదర్శులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు. – రాఘవన్, డీఎల్పీవో -
అన్నదాతల
● పండించిన ఏ ఒక్క పంటకూ దక్కని గిట్టుబాటు ధర ● అందని ప్రభుత్వ సాయం ● అప్పుల ఊబిలోకి రైతులు ● మూతపడిన ఎత్తిపోతల పథకాలు, జాడ లేని సాగర్ జలాలు ● నిండా ముంచిన తుపాన్లు ● ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతన్నలు తుపాను కారణంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో పడిపోయిన వరి పనలను చూపుతున్న రైతు(ఫైల్) గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకృతి వైపరీత్యాలు, చీడ పీడలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. పెట్టుబడులు పెరిగి.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతాంగం కన్నీరు పెడుతోంది. వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేసిన రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మెట్ట, డెల్టా ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఆపన్న హస్తం అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పథకాల పేరుతో అరకొర ఆర్థిక సహాయం అందించి వంచన చేస్తోంది. పంట ల గిట్టుబాటుపై మాయ మాటలు చెబుతోంది. గత ప్రభుత్వం ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తు నుంచి విత్తనం వరకు ఒకే చోట అందించింది. రైతు భరోసా పేరుతో ఆర్థిక సహాయం చేసింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేసింది. ఏ సంవత్సరం పంట నష్టపోతే ఆ సంవత్సరమే పరిహారం అందించి ఆదుకుంది. మిర్చి రూ. 22 వేలు, పత్తి రూ. 8వేలు, మొక్క జొన్న రూ. 2300కు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు పాతాళానికి పడిపోయాయి. మిర్చి రూ. 9వేలకు పడిపోయింది. మొక్క జొన్న రూ. 1,700కు కూడా కొనుగోలు చేసే నాథుడే లేడు. సీసీఐ కొనుగోళ్లు సక్రమంగా జరగక అరకొరగా పండిన పత్తిని రూ. 5వేలకే విక్రయించాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెట్టడం, అధికార పార్టీ నేతలే దళారులుగా మారి తక్కువ ధరకు అడుగుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తెగనమ్ముకుని నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు.సాగు వివరాలు (హెక్టార్లలో): ఎన్టీఆర్ జిల్లాలో.. పంట చేతికి వచ్చే సమయంలో సంభవించిన మొంథా తుపాను రైతుల ఆశలను ఊడ్చి పెట్టుకుపోయింది. పూర్తిగా పంట దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం పంట నష్టం అంచనాలు తక్కువగా చూపి పరిహారంలో కోత విధించింది. అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. అంతకు ముందు సంవత్సరం వచ్చిన తుపాను రెండు జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. తుపాన్లకు తోడు అధిక వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మిర్చి దిగుబడి 10 క్వింటాళ్లకు పడిపోగా పత్తి దిగుబడి ఎకరాకు కేవలం 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు, డెల్టా ప్రాంతంలో వరి ఇలా రైతులు ఆరుగాలం పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. అదే సమయంలో సాగు ఖర్చులు ఏటేటా రెట్టింపవుతున్నాయి. బ్యాంకులు రుణాలు, సహకార సంఘాలు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. ధరలు స్థిరీకరించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో కాలం వెళ్లదీస్తోంది. అన్నదాత సుఖీభవ కింద అరకొర సాయం చేసిన ప్రభుత్వం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ, పంటల బీమా వంటి పథకాలు అమలు చేయకపోవడంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడింది. -
విద్యార్థులకు కౌన్సెలింగ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక్ష దైవమైన సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపించగా, సూర్య నమస్కారాలు, వేద పండి తులు సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ మార్గంలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్యకర జీవితంతో పాటు కాలుష్య రహిత భవిష్యత్తుకు సైకిల్ సవారీ దోహదం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్ను అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ రన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ సైక్లింగ్ను జెండా ఊపి ప్రారంభించారు. 50 మందికిపైగా చిన్నారులతో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బెంజ్ సర్కిల్, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ కళాశాల, రెడ్ సర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో డీఎస్డీవో కాకర్ల కోటేశ్వరరావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సుగుణరావు, కోచ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కల్చరల్: లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం 26వ వార్షిక జయయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతం, తిరుప్పావై, కశల ఆవాహనం, అష్టోత్తరం, నక్షత్రమాల జపయజ్ఞం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరా గ్రూప్, విష్ణు సహస్రనామ జపయజ్ఞం, ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు.. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు. -
180 కేజీల గంజాయి పట్టివేత
ఆత్కూరు(గన్నవరం): వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని రూ.90 లక్షల విలువైన 180 కేజీల గంజాయిని ఆత్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు తెలిపారు. ఆత్కూరు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న పెద్దఆవుటపల్లిలోని ఈశాన్య గార్డెన్స్ ఖాళీ ప్లాట్లలో ఓ వ్యాన్తో పాటు కారు ఆగి ఉండి ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంపై ఈగల్ టీమ్ ద్వారా ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించింది. ఎస్ఐ ఎన్ఎల్ఎన్. మూర్తి నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకోవడం గమనించి సదరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా ఒడిశాలోని జనతాపై గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి బెంగళూరు తరలిస్తున్నట్లుగా సదరు వ్యక్తులు అంగీకరించారు. పైలెట్ వాహనంగా కారు.. థర్మకోల్ బాక్స్ల్లో ప్యాక్ చేసిన ఒక్కొక్కటి రెండు కేజీలు ఉన్న మొత్తం 90 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులకు కంట పడకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్కు ముందు పైలెట్ వాహనంగా కారుతో బెంగళూరు తరలిస్తున్నారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని చామరాజనగర్కు చెందిన సన్నప్ప మారెప్ప ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు విశాఖపట్నానికి చెందిన బంటు తాతారావు, బొమ్మినాయిని మోహన్రావు, గుండేపల్లి అభిరామ్సంపత్, పాయకరావుపేటకు చెందిన గరికన రాజేష్పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గంజాయిను పట్టుకున్న అధికారులను, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో హనుమాన్జంక్షన్ సీఐ ఎల్.రమేష్, ఎస్ఐ మూర్తి, ఈగల్ టీమ్ సీఐ ఎం.రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. తన ప్రదర్శన సమయంలో తన చేతుల్లో దీపాలను పట్టుకుని, హులా హూప్ చేస్తూ, తన తలపై కుండను నైపుణ్యంగా బ్యాలెన్స్ చేసింది. ఐదు నిమిషాల పాటూ ఆమె అద్భుతం చేసి చూపించింది. కేతన మూడేళ్ల వయస్సులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించి ఎన్నో మెడల్స్ అవార్డులు సాధించింది. గతంలో ఆమెను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకోవడం లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది. -
ఉసురు తీసిన దోమల చక్రం
కృష్ణలంక(విజయవాడతూర్పు): దోమల చక్రం బాలుడి ఉసురు తీసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, తారకరామనగర్కు చెందిన చిప్పల అనిల్కుమార్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతడికి భార్య అరుణకుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఓ కుమారుడు సమర్పణపాల్(9) ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం అనిల్కుమార్, తన కుమారుడు సమర్పణపాల్తో కలిసి ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయారు. దోమలు అధికంగా ఉండడంతో తెల్లవారుజామున దోమల చక్రం వెలిగించి మంచం కింద పెట్టుకున్నారు. ప్రమాదవశాత్తు అది దుప్పటికి అంటుకుని మంటల వ్యాపించాయి. ఆ మంటలు దుప్పటి కప్పుకుని నిద్రపోయిన పాల్కు కూడా అంటుకుని ముఖం, చేతులు, పొట్ట కాలిపోయి గాయాలయ్యాయి. ఆ పక్కన ఉన్న తండ్రి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారి సహాయంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం సాయంత్రం మృతిచెందాడు. బాలుడి తల్లి అరుణకుమారి శనివారం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రేటర్ విలీనంతో భవిష్యత్తు ప్రశ్నార్థకం
పెనమలూరు: గ్రేటర్ విలీనంతో తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు, కంకిపాడు మండలాల్లో గ్రామ పంచాయతీల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారింది. తాడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగక పోగా తాజాగా విలీనం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పలు గ్రామ పంచాయతీల్లో శనివారం అత్యవసర సమావేశాలు నిర్వహించి, గ్రేటర్ వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం శనివారం తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది. మున్సిపాలిటీ ఉంటుందా.. లేదా..? 2020లో యనమలకుదురు, కానూరు, తాడిగడప, పోరంకిలోని గ్రామాలతో తాడిగడప మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ జనాభా 2.30 లక్షల మంది ఉండగా డివిజన్లు 38 ఉన్నాయి. పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా తాడిగడప మున్సిపాలిటీని గ్రేటర్లో కలపాలా వద్దా అనే విషయం అనేక విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి పెనమలూరు ప్రాంతాన్ని విలీనం చేయటంపై స్థానికులు ఆహ్వానిస్తున్నారు. అయితే తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు మండలంలోని ఆరు గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనం చేయవద్దని గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. బతుకు భారమే.. గతంలో గ్రామ పంచాయతీలు తాడిగడప మున్సిపాలిటీలో విలీనం తరువాత ఇంటి పన్నులు 150 శాతం పెరిగాయి. అలాగే ఆస్తి బదలాయింపు(మ్యుటేషన్) బాదుడు కూడా అధికమైంది. ట్రేడ్ లైసెన్స్, ఖాళీస్థలాల పన్నులు, ఇంటిప్లాన్ల ఫీజులు ఇలా అనేక రకాలుగా పన్నులు ప్రజలపై ఆర్థిక భారం పడింది. ఇప్పుడు గ్రేటర్లోకి విలీనం చేస్తే ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమిటనే ప్రశ్నతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రేటర్లో కలపటం వలన తమకు వచ్చే ప్రయోజనం శూన్యమనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పొలాలను ఏమి చేస్తారు..? పెనమలూరు నియోజకవర్గంలో గ్రామాలు పాడి పంటలతో గ్రామీణ వాతావరణం ఉంటుంది. నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అర్బన్ చేయటం వలన పంట పొలాల భవిష్యత్తు మసకబారనుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు ప్రియమవుతాయి. వ్యవసాయం పైనే ఆధారపడిన రైతులు, రైతు కూలీలు కుటుంబాలు, పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఉన్న రాజధాని అమరావతి అభివృద్ధి పరిస్థితి అంతుపట్టకుండా ఉంది. ఈ పరిస్థితిలో గ్రేటర్ ప్రతిపాదనలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారుతుందన్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ అయితే గోడు వినేది ఎవరు ? పెనమలూరును గ్రేటర్లో విలీనం చేస్తే ప్రజల గోడు వినేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు ఉంటే అధికారులను నేరుగా కలవటానికి అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. గ్రేటర్ పరిధి ఎక్కవగా ఉంటే అనేక సమస్యలు ఉంటాయని, నిధులు తమ ప్రాంతాలకే వినియోగిస్తారనేది గ్యారెంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రజలు తెలుపుతున్నారు. గ్రేటర్ ప్రతిపాదన వాయిదా గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. మంత్రి నారాయణ శనివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిపారు. అయితే జనగణన ముందు గ్రేటర్లోకి విలీనానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం చెప్పారని, గ్రేటర్ ప్రతిపాదనను వాయిదా వేశామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రేటర్ ప్రతిపాదనలు హడావుడిగా తెరపైకి తీసుకువచ్చి రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలని ఆదేశించడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. -
ఉత్సాహంగా బాలోత్సవ్
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాల ప్రాంగణంలో బాలోత్సవ్ సంబరాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వీసీఎస్టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్, కల్చరల్, అకడమిక్ కేటగిరీల్లో గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే చదువు, క్రీడల్లో ఉన్నతంగా రాణించగలరని బాలోత్సవాల సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. బాలోత్సవ్లో భాగంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో పోటీత్వం అలవడుతుందన్నారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుఢ్యం సొంతమవుతుందని సూచించారు. మార్కులే కొలమానం కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలన్నారు. వీసీఎస్టీఎ బాలోత్సవం చైర్మన్ వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ.. 2011లో మొదలైన బాలోత్సవ్ సంబరాలు 11వ సంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాయన్నారు. రెండో రోజు కార్యక్రమాల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వీసీఎస్టీఏ కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, విజయ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, లిటిల్ బ్రెయిన్స్ హైస్కూల్ డైరెక్టర్ ఫణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హరిత గోపాలం.. పాడి రైతులకు వరం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మేత సాగు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం పాడి రైతుల పాలిట వరమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) పరిపాలనా భవనంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత చైర్మన్ చలసాని అధ్యక్షతన బోర్డు డైరెక్టర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో చైర్మన్తో పాటు ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు దాసరి బాలవర్ధనరావు, వేమూరి సాయిలతో పాటు ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. మేత కొరతను పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చైర్మన్ పేర్కొన్నారు. పథకానికి అవసరమైన పూర్తి విధి విధానాలను రూపొందించిన ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ పథకం వినియోగించుకోవడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు మామిడి, పామ్ ఆయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ స్థలాలు, దేవదాయ భూములలో గడ్డి పెంచుకునే వెసులబాటు ఉందని చెప్పారు. -
కిడ్నీ బాధితులకు తప్పని కష్టాలు
నీటి కాలుష్యం, ఇతర కారణాలతో ఎ.కొండూరు మండ లంతో అత్యధికంగా తండాల ప్రజలు కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఎ.కొండూరులోనే డయా లసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. అంతే కాదు వైద్యులు ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. ఏడాది కాలంలో అంతంత మాత్రంగా అందుతున్న వైద్య సేవలతో ఆరుగురు కిడ్నీ రోగులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది. -
ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామాల్లో కూలీల వలసలు నివారించి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాల్సిందేనని వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యథతథంగా కొన సాగించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాలు శనివారం చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టాయి. లెనిన్ సెంటర్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని ఆయా సంఘాలు, ఉపాధి కూలీలు సన్నద్ధమవగా, వారు లోక్ భవన్కు వెళ్ల కుండా పోలీసులు భారీగా మోహరించారు. అలంకార్ సెంటర్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత రైతు సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు ధర్నా చౌక్లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి. వెంకటేశ్వర్లు, ఆవుల శేఖర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చి 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే మార్పులు చేసిందని మండిపడ్డారు. కొత్త చట్టం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల వాటా పెంచడ మంటే కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం లోక్ భవన్కు బయలుదేరిన రైతు సంఘాలు, ఉపాధి కూలీలను ధర్నా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా లోక్ భవన్కు వెళ్లడానికి వీల్లేదని, రైతు సంఘాల ప్రతినిధులను పంపు తామని పోలీసులు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని లోక్ భవన్కు అనుమతించారు. ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్రం దిగివచ్చి కొత్తగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శులు కె.ప్రభాకర్రెడ్డి, కె.వి.వి.ప్రసాద్, కోటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, సీనియర్ రైతు సంఘం నాయకులు వై. కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, డి.హరినాథ్, వి.శివనాగరాణి, కోట కల్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, వి.అన్వేష్, పవన్, జమలయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేసిన రైతు సంఘాల ప్రతినిధులు -
తిరోగమనం
ప్రభుత్వ వైద్యం.. స్క్రబ్ టైఫస్తో ఆందోళన సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం వల్ల సోకే అరుదైన జ్వరం స్క్రబ్ టైఫస్. ఈ జ్వరం పదేళ్లుగా సోకుతున్నప్పటికీ ఈ ఏడాది ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడం, పలువురు మృతి చెందడంతో కొత్తరకం జ్వరంగా ప్రచారం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 20 మంది వరకూ స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారు. ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన ఒకరు మృతి చెందారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ప్రజలను ఆందోళన చెందేలా చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వైరస్ జ్వరాలు విజృంభించాయి. పనిచేయక ప్రభుత్వాస్పత్రిలో పక్కన పడేసిన వెంటిలేటర్లు (ఫైల్)లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య సేవలు 2025వ సంవత్సరంలో తిరోగమనంలో పయనించాయి. ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక, మందులు అందక అవస్తలు పడ్డారు. మరోవైపు సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు సైతం విజృంభించాయి. విజయవాడలో నగర పాలక సంస్థ సరఫరా చేసే కలుషిత నీరు తాగి ఈ ఏడాది సెప్టెంబర్లో దాదాపు 300 మందికిపైగా అతిసార బారిన పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అరుదైన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మరోవైపు ఎ.కొండూరు మండలంలోని తండాల్లో కిడ్నీ బాధితుల మరణాలు ఈ ఏడాది కూడా ఆగలేదు. ఇలా 2025వ సంవత్సరం ప్రభుత్వ వైద్యంలో అనేక లోపాలను ఎత్తిచూపింది. బెజవాడను వణికించిన అతిసార ఈ ఏడాది సెప్టెంబర్ పదో తేదీన విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రజలు అతిసార ప్రబలింది. తొలిరోజు దాదాపు వంద మంది వరకూ అతిసార బారిన పడటంతో అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది కాలనీలోకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత వినాయకచవితి నిమజ్జనంలో కలుషిత ఆహారం తినడంతో అతిసార సోకిందని అధికారులు కొట్టిపారేశారు. అయితే అతిసార కేసులు రోజు రోజుకు పెరిగి పదిరోజులు కొనసాగాయి. దీంతో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని పరీక్ష చేయించగా ఆ నీటితో పాటు, భూ గర్భ జలాలు సైతం కలుషితమైనట్లు తేలింది. దాదాపు 300 మంది వరకూ అతిసార బారిన పడగా, వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దిగజారిన ప్రభుత్వ సేవలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కల్పన తిరోగమనంలో పయనిస్తోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు పనిచేయక పోవడంతో వాటిని పక్కడ పడేశారు. కోవిడ్ సమయంలో 200 వరకూ వెంటిలేటర్లను గత ప్రభుత్వం అందించింది. వాటితోనే ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అవి పనిచేయక పోవడంతో మూడు నెలల కిందట వాటన్నింటినీ పక్కన పెట్టారు. కొత్త వెంటిలేటర్ల కొనుగోలు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సైతం సిబ్బంది, వైద్యుల కొరత, సౌకర్యాల లేమి వంటివి సేవలను దిగ జారేలా చేశాయి. అంతేకాదు ఒక్కొసమయంలో బీపీ మందులు, గ్యాస్ట్రబుల్కు వాడే పాంటాప్ మాత్రలు కూడా ఉండని పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు వైద్య సేవలు మరింత దూరం అయ్యాయి. వివాదాస్పదంగా పీపీపీ అంశంరాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం ఈ ఏడాది వివాదాస్పదంగా మారింది. వైద్య కళాశాలలు ప్రైవేటుకు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్య దూరం అవుతుందని పలువురు మేధావులు, సంఘాలు సైతం ఆందోళన వ్యక్తంచేశాయి. వైఎస్సార్ సీపీ ఒక అడుగు ముందకేసి అన్ని వర్గాల ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టింది. ఇలా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో దాదాపు తొమ్మిది లక్షల మంది నుంచి సంతకాలు సేకరించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన నూతన వైద్య కళాశాలలో చదువుతున్న పిల్లలు, అక్కడ అభివృద్ధి చెందిన ఆస్పత్రినే నిదర్శనంగా చూపుతున్నారు. ఈ ఏడాది గంపలగూడెం మండలం అనుమోలు లంకలో బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు మరణించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే మనుషులకు ఎవరికీ ఈ వ్యాధి సోకలేదు. -
యువత సేవా భావం అలవరచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత సేవాభావం, కలిసి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలని సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాశాల పూర్వ విద్యార్థుల్లో ఎంపికచేసిన 36 మందిని శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో సత్కరించారు. ముఖ్యఅతిథి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించడం అంటే నగదు ఆర్జించడం ఒక్కటే కాదని, నైతికత కూడా ముఖ్యమని అన్నారు. జీవితంలో డబ్బు అవసరమే కానీ సర్వస్వం కాదనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. ఐదు పదుల ప్రస్థానం ఏ విద్యాసంస్థకై నా మైలురాయేనని, అందుకు పాలకవర్గం అంకితభావం, ఐక్యత ప్రశంశనీయమని సిద్ధార్థ అకాడమీ సభ్యులను అభినందించారు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్రకుమార్, సినీ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, సైంటిస్ట్ డాక్టర్ వి.డి.వి.పద్మజ, చెరుకూరి విజయేశ్వరిదేవి, శామ్సంగ్ (ఆర్అండ్డీ) మేనేజింగ్ డైరెక్టర్ గోలి మోహనరావు, విజయ బ్యాంక్ పూర్వ జీఎం వై.నాగేశ్వరరావు, గీతమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ, ఐఐటీ (ముంబాయి) ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగుల లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్ సత్కరించారు. సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.వెంకటేశ్వర్లు, సిద్ధార్థ అకాడమీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తమిరి సూర్య చరిష్మ 21–18, 18–21, 21–9 స్కోర్తో తెలంగాణకు చెందిన రక్షితశ్రీపై విజయం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆదివారం ఫైనల్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. అనంతరం జరిగే ముగింపు సభలో విజేతలకు బహుమతులను అందజేస్తారు. సెమీ ఫైనల్స్ పోటీలను సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా తిలకించారు. -
గన్నవరం వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్!
సాక్షిప్రతినిధి, విజయవాడ: గన్నవరం వెటర్నరీ కళాశాలలో ర్యాగింగ్ శ్రుతిమించింది. కొత్త బ్యాచ్ (బీవీఎస్సీ) విద్యార్థులు నిద్ర లేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోంది. పరిచయం పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో జూనియర్లు హడలిపోతున్నారు. తల్లిదండ్రులకు చాటుగా ఫోన్ చేసి కష్టం చెప్పుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిర్యాదు చేస్తే ఎక్కువ వేధింపులు తప్పవని సీనియర్లు హెచ్చ రిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉన్నత విద్యలో ర్యాగింగ్ను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఆచరణలో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, వార్డెన్లు దృష్టి పెట్టకపోవడంతో కొత్త విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేసినా, వార ఎవరో సీనియర్లకు తెలిసిపోతోందని బాధితులు వాపోతున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు, సిబ్బందికి తెలిసినా ఇదంతా మామూలేనని, పట్టించుకోవద్దంటూ జూనియర్లకు సూచిస్తూ సీనియర్లకే వత్తాసు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు సీనియర్లు హాస్టల్ గదుల్లోకి వచ్చి, చిత్ర విచిత్ర పనులు చేయమంటున్నారని, ఒప్పుకోకపోతే బూతులు తిడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అమ్మాయిలు సైతం ర్యాగింగ్ దెబ్బకు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాగా చదువుకుందామని వస్తే ఇదేం అన్యాయం అని వాపోతున్నారు. ఇక్కడ జరిగేది ఎవరికై నా చెబితే.. ఈ కాలేజీలో ఎలా చదువుతారో చూస్తామని సీనియర్లు హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ర్యాగింగ్ నివారణ చర్యలు అనేవి కేవలం కాగితాలకే పరిమితం అయిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా సీనియర్లను కనీసం పిలిచి హెచ్చరించలేదని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. -
వనజా చంద్రశేఖర్కు నృత్య తపస్వి పురస్కారం
గన్నవరంరూరల్: విజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ(గన్నవరం) నాట్య గురువు వనజా చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక నృత్య తపస్వి పురస్కారం అందుకున్నారు. శుక్రవారం రాత్రి ఏలూరు అభినయ నృత్య భారతి 30వ వార్షికోత్సవంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రఖ్యాత నాట్యాచారుడు కోరాడ నరసింహారావు స్మారక–2025 అవార్డు నృత్య తపస్విని ఆమెకు అందించారు. కానాల గురుమూర్తి కళావేదికపై ముఖ్య అతిథులు ఆలపాటి నాగేశ్వరరావు, బి.వి.రమణమూర్తి, డాక్టర్ ఎం.ఎస్.చౌదరి, కమ్ములు ఆదినారాయణ, పిలగల కొండలరావు, చిర్లపల్లి రామ్మోహనరావు, డాక్టర్ కె.కృష్ణ చైతన్య స్వామి, కె.వి.సత్యనారాయణ పాల్గొని వనజా చంద్రశేఖర్ సేవలను ప్రశంసించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గన్నవరానికి చెందిన భక్తులు రూ.1.23 లక్షల విరాళం సమర్పించారు. చిట్టి శ్రీరామమూర్తి శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి ఉమామహేశ్వరి పేరిట రూ.1,23,456 విరాళం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. కంకిపాడు: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఉయ్యూరు డీవైఈఓ పద్మారాణి స్పష్టంచేశారు. ఈడుపుగల్లు నారాయణ విద్యాసంస్థల పాఠశాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనపై శనివారం శాఖాపరమైన విచారణ సాగించారు. విద్యార్థులపై పాఠశాల హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడటం, అనుచితంగా వ్యవహరించటంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు వార్డెన్, ఏఓలకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై డీవైఈఓ పద్మారాణి విచారణ సాగించారు. ప్రిన్సిపాల్ తిరుమలరావు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లా డారు. వార్డెన్తోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఓలను విధుల నుంచి తొలగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విచారణలో ఎంఈఓ –1 వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఆవరణలోని వైవీ రావు సిద్ధార్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శుక్రవారం ప్రారంభమైన జేఎన్టీయూ అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు) టోర్నీ శనివారం ముగిసింది. జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ కళాశాల నుంచి 22 పురుషుల, 11 మహిళల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. పురుషుల విభాగంలో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గుడ్లవల్లేరులోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, కానూరు సిద్ధార్థ కాలేజ్లీ, మహిళల విభాగంలో భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ, నర్సాపూర్లోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జట్లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సిద్ధార్థ వర్సిటీ వైస్ చాన్స్లర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎ.వి.రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.రవిచంద్, జేఎన్టీయూ కాకినాడ స్పోర్ట్స్ సెక్రటరీ ప్రొఫెసర్ జి.శ్యామ్కుమార్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
రంగా హత్య కేసులో టీడీపీనే తొలి ముద్దాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగాది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రంగా హత్య కేసులో ఆనాటి టీడీపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని పోలీసులు, నాయకులు అందరూ కలిసి ఆయన్ను హత్య చేశారన్నారు. అప్పటికీ, ఇప్పటీకీ రంగా హత్య కేసులో తొలి ముద్దాయి టీడీపీయేనన్నారు. శుక్రవారం దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37వ వర్థంతి కార్యక్రమం విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో, సీతన్నపేట గేటు వద్ద రంగా విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అనాటి టీడీపీ అప్రజ్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలు, దాష్టీకాలను రంగా ధైర్యంగా ఎదుర్కొని పోరాడారన్నారు. సమస్యలపై ప్రజా పోరాటాలు చేశారన్నారు. శిరోముండనం కేసులో అరెస్ట్లు చేసే వరకు, క్రీస్తు రాజుపురంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని రోడ్డుపై నిరాహార దీక్షలో కూర్చున్నారని గుర్తు చేశారు. ఆ దీక్షలోనే ఆయన్ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఆయన హత్యకు ఏపార్టీ కారణమో అదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగా విగ్రహాలకు డండలు వేస్తుంటే ఆశ్చర్యంగాను, వింతగాను ఉందన్నారు. ఇలా చేస్తే రంగా ఆత్మ క్షోభించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్రంగా మరణించే వరకు టీడీపీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారన్నారు. టీడీపీ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు చేస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ అనుక్షణం రంగాను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. రంగా ఆశయాలు, సిద్దాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. వంగవీటి రంగానే తమకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలే పుల్లారావు, ఒగ్గు విక్కీ, సుధాకర్, శ్రీరాములు, ఇసరపు రాజా, ఉద్దంటి సురేష్, మాంతి రమణరావు తాడి శివ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
టీడీపీ కార్యకర్తల్లా ఖాకీలు!
మైలవరం(జి.కొండూరు): టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు పాలనలో ఖాకీలు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా గాలికొదిలేసి పోలీసులు వ్యవహరిస్తున్న విభిన్న శైలి ప్రజలను, రాజకీయ నేతలను విస్మయానికి గురి చేస్తోంది. అధికార టీడీపీ నాయకులు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా కేసులు నమోదు చేయడానికి మనసొప్పని పోలీసులు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీలు తీరు ఇలా ఉండగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీసులు అందుకు రెండింతలుగా ఉండటం గమనార్హం. టీడీపీ నేతలపై కేసులు పెట్టరు.. గత నెల 4న మైలవరానికి చెందిన యువ టీడీపీ నాయకుడు లంకా లితీష్ పుట్టినరోజు సందర్భంగా ఆ రాత్రి మైలవరం గ్రామ పంచాయతీ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాలుగు గంటలపాటు గ్రామంలో డీజేలతో, బైకులతో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ట్రాఫిక్లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులపైకి ఎక్కి డ్యాన్సులు వేశారు. వాహనదారులు నరకయాతన పడినప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై వరుస కేసులు.. ప్రశ్నిస్తే కేసులే.. కూటమి ప్రభుత్వ తీరు, మైలవరం నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి, యథేచ్ఛగా జరుగుతున్న మట్టి మాఫియా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలమా రామారావుని మైలవరం పోలీసులు జూలై 8న అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం జి.కొండూరు స్టేషన్లో కేసు నమోదు చేయించారు. -
సమీక్ష శూన్యం.. తూతూ మంత్రం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ప్రధాన సమస్యలపై చర్చే లేకుండా.. జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి అర్ధమే మార్చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ ధ్వజమెత్తారు. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రతి ఒక్కరూ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో డీఆర్సీ సమావేశానికి అర్ధం లేకుండా చేశారన్నారు. రైతులు పడుతున్న బాధలు, వారి దుస్థితి గురించి అసలు చర్చించలేదని, కేవలం అంకెల గారడీ చేశారని దుయ్యబట్టారు. ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సాధారణంగానే అన్నీ గారడీ చేస్తుంటారని, అందులో భాగంగానే ఆదోని మెడికల్ కాలేజీలో కిమ్స్ వచ్చిందని చెప్పారని, ఈ రోజు ఆ విషయం అడిగితే కిమ్స్ కాదు వేరే వచ్చిందని మాట మార్చారన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్సీ సమావేశం ముగిసిన అనంతరం మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి సమస్యపై వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్కు జిల్లాపై అవగాహన లేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా వాటి గురించి డీఆర్సీలో చర్చించకుండా తూతూ మంత్రంగా ముగించారని మండిపడ్డారు. వారి మాటల్లో... ● ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన సమస్యలు, రైతులు పడుతున్న బాధలను చర్చించకుండానే సమావేశం ముగించేశారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న ధరలకు సంబంధించి ఒక్కొక్కటి మేం అడుగుతుంటే అధికారులు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వారి ప్రస్తావన లేకుండా డీఆర్సీ ముగిసింది. ● రాష్ట్రంలో, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా డయేరియా బాధితులు ఎక్కువగా ఉంటే వారి గురించి చర్చ లేకుండా పోయింది. ఎ.కొండూరులో అనేక మంది కిడ్నీ బాధితులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ ఆర్ఆర్ పేటలో డయేరియా బారిన పడడానికి అధికారులు చెప్పే కారణాలు వాస్తవ దూరంగా ఉన్నాయి. ● ఇసుక హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు అక్రమ రవాణా గురించిన చర్చ లేదు. అధికారులు, నాయకులు కుమ్మకై ్క ఎన్టీఆర్ జిల్లాను దోచుకుంటున్నారు. ● ఎంఎస్ఎంఈ కింద కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కేటాయించిన భూమి, కల్పించిన ఉద్యోగాలు, వచ్చిన ఇండస్ట్రియల్ పార్క్లు, భూమి ఎవరెవరికి కేటాయించారన్న సమాచారం అడిగితే కలెక్టర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు. ● ఎన్నెస్పీ కాలువలకు మరమ్మతులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, వ్యవసాయం, పండించిన పంటలు. పరిశ్రమలు, ఆరోగ్యం దేని గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల ఆత్మహత్యల ప్రస్తావనే లేదు డీఆర్సీ మీటింగ్ అర్ధం మార్చేశారు తప్పుడు సమాచారం, అంకెల గారడీతో గంటలోనే ముగించారు విజయవాడ డ్రగ్స్ హబ్గా మారింది అధికారులు, నాయకులు కుమ్మకై ్క దోచుకుంటున్నారు డీఆర్సీ సమావేశం జరిగిన తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, రుహుల్లా లా అండ్ ఆర్డర్ విషయంలో జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని డీఆర్సీలో గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వంలో విజయవాడ డ్రగ్స్ హబ్ గా మారింది. గంజాయికి విజయవాడ ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. యువత గంజాయి మత్తులో తూగుతుంటే అధికారులు మాత్రం గంజాయి లేకుండా చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది. గంజాయి, మత్తుపదార్ధాలు, నార్కొటిక్స్, ఎండీఎం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అధికార పార్టీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి. -
ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి (08583) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–విశాఖపట్నం (08534) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రతి మంగళవారం, విశాఖపట్నం–తిరుపతి (08547) జనవరి 7 నుంచి ఫిబ్రవరి 25 వరకు ప్రతి బుధవారం, తిరుపతి–విశాఖపట్నం (08548) జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం–చర్లపల్లి (08579) జనవరి 2 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి శుక్రవారం, చర్లపల్లి–విశాఖపట్నం (08580) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. రద్దీ దృష్ట్యా.. విజయవాడ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్– యశ్వంత్పూర్ (0811) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రతి శనివారం, యశ్వంత్పూర్– భువనేశ్వర్ (02812) జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు (08581) జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఎస్ఎంవీటీ బెంగళూరు –విశాఖపట్నం (08582) జనవరి 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, సంబల్పూర్– ఈరోడ్ (08311) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం, ఈరోడ్ – సంబల్పూర్ (08312) జనవరి 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, సంత్రగచ్చి– యలహంక (02863) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, యలహంక– సంత్రగచ్చి (02864) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం, షాలీమార్– చైన్నె సెంట్రల్ (02841) జనవరి 5 నుంచి 26 వరకు, చైన్నె సెంట్రల్– షాలీమార్ (02842) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. లక్ష్మీపురం(గుంటూరు): రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లు అని చెప్పి వైన్ షాప్, లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామని రూ.1.15 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై గుంటూరు అరండల్పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన నల్లూరి వెంకటేశ్వర్లుకు అన్నపూర్ణ నగర్ చెందిన వంకాయలపాటి రాంబాబు అనే వ్యక్తి సుమారు 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాంబాబు, శ్రీకంద సాయి కిరణ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇద్దరు కలిసి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు నమ్మించారు. బాధితుడు వెంకటేశ్వర్లుకు వైన్ షాపు, లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామని మాయ మాటలతో నమ్మబలికారు. ఈ రెండింటికి రూ.3 కోట్లు వరకు ఖర్చు అవుతుందని చెప్పకొచ్చారు.. ఇరువురి మాటలను నమ్మిన వెంకటేశ్వర్లు రెండు దఫాలుగా రూ.70 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా ఆన్లైన్ చేసి మళ్లీ రూ.45 లక్షలు నగదు ఇచ్చాడు. నగదు తీసుకుని రోజులు గడుస్తున్న ఎటువంటి షాపులు మంజూరు కాక పోవడంతో అనుమానం కలిగి బాధితుడు వెంకటేశ్వర్లు స్వయంగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేయగా ఇరువురు వ్యక్తులు మంత్రి కొల్లు రవీంద్రకు తెలియదని చెప్పారు. దీంతో నమ్మకంగా మోసం చేశారని బాధితుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం(గుంటూరు): పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా సీఇఐఆర్ వెబ్సైట్ లేదా జిల్లా సైబర్ సెల్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్ సీఐ నిషార్ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, ఇమామ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 87వ యునెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025లో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. నగరంలోని పటమటలో ఉన్న చెన్నుపాటిరామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో, గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఉమెన్స్ డబుల్స్లో తెలంగాణకు చెందిన వినీల, రష్మిక–21–16, 21–13తో విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో భార్గవ్ రామ్, విశ్వ తేజ–21–7, 21–13 స్కోర్తో చత్తీస్ఘడ్కు చెందిన అభిషేక్, సుజైన్పై గెలుపొందారు. ఉమెన్స్ సింగిల్స్లో ఏపీకి చెందిన సూర్య చరిష్మ 21–12, 21–15తో హర్యానాకు చెందిన ఉన్నతి హుడాపై గెలుపొందింది. తెలంగాణకు చెందిన రక్షితశ్రీ 16–21, 21–14, 21–18 స్కోర్తో పంజాబ్కు చెందిన తవ్వి శర్మపై విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు ఎం.తరుణ్ 21–13, 22–20 స్కోర్తో హర్యానాకు చెందిన మన్రాజ్ సింగ్పై విజయం సాధించాడు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో పీఎస్బీ క్రీడాకారుడు తరుణ్ విన్యాసం జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విజేత రైల్వే క్రీడాకారుల ఆటలో ఒక కీలక ఘట్టం -
కార్మికులను సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలి
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ సహజ సంపదను, వనరులను అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టి దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తున్న అభినవ దానకర్ణులు మోదీ, అమిత్ షా, చంద్రబాబు కూటమి ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా రైతులను, కార్మికులను కూడగట్టి సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెలువరించిన ‘శ్రామిక నేస్తం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వ్యయసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరించి వేస్తున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం ‘నూతన కార్మికచట్టాలు– భారత కార్మిక వర్గంపై వాటి దుష్ప్రబావం అనే అంశంపై ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ హక్కులు కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలన్నారు. కార్మిక, కర్షకుల సమస్యలు వాటి పరిష్కార మార్గాల కోసం శ్రామిక నేస్తం పత్రిక కృషి చేస్తుందన్నారు. శ్రామిక నేస్తం పత్రిక ఎడిటర్ అన్నపూర్ణ అధ్యక్షత వహించిన సభలో ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు బిర్రా రవి, మస్తాన్, కొండారెడ్డి పాల్గొన్నారు. -
మామ చేతిలో అల్లుడు హతం
తోట్లవల్లూరు: మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరుకు చెందిన చీకుర్తి శ్రీనివాసరావు కుమార్తె ఝాన్సీరాణికి ప్రకాశం జిల్లా గజ్జలకొండకు చెందిన ఆదిమూలపు సురే్ష్ (31) తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సురేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో ఉంటున్నాడు. ముగ్గురు పిల్లలు అత్త, మామల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రెండు నెలల క్రితం మూడేళ్ల వయసున్న సురేష్ కుమార్తె అత్త, మామల ఇంటి వద్ద అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నెల 24న సురేష్ భార్య ఝాన్సీరాణితో కలిసి రెండో కొడుకు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ తీసుకుని పెనమకూరు వచ్చాడు. క్రిస్మస్ రోజు సురేష్ మద్యం తాగి తన కుమార్తెను సరిగా చూడకపోవటం వలనే మృతి చెందిందంటూ మామ శ్రీనివాసరావుతో గొడవకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు అల్లుడు సురేష్ను కర్రతో బలంగా కొట్డాడు. తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సీఐ చిట్టిబాబు హత్య కేసు నమోదు చేశారు. -
దుర్గగుడికి కొనసాగుతున్న రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లో గంట సమయం, రూ. 500 వీఐపీ టికెట్ క్యూలైన్లో రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఘాట్రోడ్డులో ఓంటర్నింగ్ వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 60 వేల పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. టికెట్ల విక్రయాలపై గందరగోళం రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకుంటుంది. శుక్రవారం ఉదయం నుంచి రద్దీ ప్రారంభం కావడంతో టికెట్ల విక్రయాలను ఉదయం 11 గంటల కల్లా నిలిపివేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం కౌంటర్లలోని సిబ్బందికి తెలియకపోవడంతో వారు యథావిధిగా టికెట్లను విక్రయించారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అప్పటికే రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అంతరాలయ దర్శనం కొనసాగించారు. మొరాయించిన సర్వర్.. దేవస్థానంలో అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే అందిస్తుండగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు సర్వస్ మోరాయించింది. మహా మండపం దిగువన రూ.100, రూ.300 టికెట్ల కౌంటర్లతో పాటు రూ. 500 టికెట్ కౌంటర్లో టికెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. ఆయా కౌంటర్లలో సిబ్బంది టికెట్లను స్కానింగ్ పాయింట్లో కొనుగోలు చేయాలని చెబుతుండటంతో భక్తులందరూ గాలిగోపురం దిగువన ఉన్న స్కానింగ్ పాయింట్కు చేరుకున్నారు. అక్కడ కూడా కంప్యూటర్ పని చేయకపోవడంతో గందరగోళ పరిస్ధితులు నెలకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు లడ్డూలు ఇవ్వడం లేదని, వాటిని ప్రసాదాల విక్రయ కౌంటర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని కొద్ది రోజులుగా దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఇదే అంశంపై పలువురు భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025u8లో పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.5360 టీఎంసీలు. గ్రేటర్ విజయవాడ వైపు అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైంది. గతంలో ఈ ప్రతిపాదన వచ్చినా విలీన గ్రామాల పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడింది. తాజాగా పంచాయతీల గడువు ముగుస్తున్న తరుణంలో మళ్లీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపైన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్, కార్పొరేషన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే దాదాపు 25 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ రూపుదాల్చనుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 53 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసి, 15 లక్షల జనాభా, 469.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్లో తీర్మానం చేశారు. అప్పట్లో పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో కార్యం రూపం దాల్చలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పుడు ప్రతిపాదించిన 53 గ్రామాలతో పాటు మరో 21 గ్రామాలు అంటే మొత్తం 75 గ్రామాలను విలీనం చేసి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసే విధంగా అధికారులు అక్టోబరు నెలలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచా యతీ పాలకవర్గాలు ఉండటంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వస్తుందనే భావనతో ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చి, పంచాయతీల నుంచి తీర్మానాలు తెప్పించుకునే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 41 గ్రామాలకు సంబంధించి పంచాయతీలకు చెందిన పాలక వర్గాల తీర్మానాలు తీసుకున్నారు. మిగిలిన 34 పంచాయతీల నుంచి వీలైనంత త్వరగా తీర్మానాలను తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనకు కౌన్సిల్లో కూడా తీర్మానం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 10,34,350. ప్రస్తుతం మూడు నియోజక వర్గాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో 8 మండలాల్లోని 75 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేస్తే గ్రేటర్ విజయవాడ విస్తీర్ణం 661.79 చదరపు కిలో మీటర్లు అంటే..దాదాపు 10 రెట్లు నగర విస్తీర్ణం పెరగ నుంది. ఈ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలకు పైగా జనాభా ఉండగా, ప్రస్తుత జనాభా తీసుకుంటే 25 లక్షలకు పైగానే ఉంటుంది. గన్నవరం నియోజక వర్గంలో 31 గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలో 19 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. గన్నవరం నియోజక వర్గంలో ఆత్కూరు, సూరంపల్లి, మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి, పెనమలూరు నియోజక వర్గంలో ప్రొద్దుటూరు వరకు ఉన్న గ్రామాలు గ్రేటర్లో కలువనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,42,916 కుటుంబాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 2,79, 556 కుటుంబాలు ఉన్నాయి. కొండపల్లి. తాడిగడప మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశం ఉంది. కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశం గతంలో కొన్ని గ్రామ పంచాయతీలు వ్యతిరేకించిన వైనం 7మైలవరం నియోజక వర్గంలో 23 గ్రామాలు జి.కొండూరు మండలంలో రెండు గ్రామాలు కడింపోతవరం, కవులూరు, ఇబ్రహీంపట్నం మండలంలో 13 గ్రామాలు ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, కేతనకొండ, కొండపల్లి, మల్కాపురం, మూలపాడు, నవిపోతవరం, తుమ్మలపాలెం, త్రిలోచనాపురం, జమీ మాచవరం, విజయవాడ రూరల్ మండలంలో 8 గ్రామాలు గొల్లపూడి, జక్కంపూడి, కొత్తూరు, పైడూరుపాడు, రాయనపాడు, షాబాద, తాడేపల్లి, వేమవరం. పెనమలూరు నియోజక వర్గంలో 19 గ్రామాలు కంకిపాడు మండలంలో 11 గ్రామాలు దావులూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, గోసాల, కంకిపాడు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు, పునాదిపాడు, ఉప్పులూరు, వేల్పూరు, పెనమలూరు మండలంలో యనమలకుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప, వణుకూరు. గన్నవరం నియోజకవర్గంలో 31 గ్రామాలు గన్నవరం మండలంలో 19 గ్రామాలు అజంపూడి, అల్లాపురం, బీబీ గూడెం, బుద్దవరం, బూతుమిల్లిపాడు, చినఅవుటపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, కొండపావులూరు, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, సవరగూడెం, సూరంపల్లి, తెంపల్లి, వెదురుపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహాపురం(కేసరపల్లి శివారు), వెంకటనరసింహాపురం(పురుషోత్తపట్నం శివారు), ఉంగుటూరు మండలంలో రెండు గ్రామాలు ఆత్కూరు, పెదఅవుటపల్లి విజయవాడ రూరల్ మండలంలో 10 గ్రామాలు అంబాపురం, దోనే ఆత్కూరు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న, (కొంత భాగం) పాతపాడు, ఫిర్యాదినైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు. పది రెట్లు పెరగనున్న నగర విస్తీర్ణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు కుటుంబం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. గుడివాడటౌన్: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రకాశం జట్లు విజేతలుగా నిలిచాయి.


