Krishna District News
-
పేద బిడ్డల
కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచీ పేదలంటే చిన్నచూపు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ కోచింగ్ సహా ఇంటర్మీడియెట్ విద్య నేర్పే గురుకుల కళాశాల భవనానికి అద్దె కట్టడం ఎందుకు దండగ అన్న దృక్పథంతో ఈడుపుగల్లులో ఉన్న కళాశాలను మూసేసింది. ఆ కళాశాలను ప్రస్తుతం జి.కొండూరు మండలం కుంటముక్కలలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనంలోకి తరలిస్తోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనం... వరద ఎలా ముంచుకొస్తుందోనన్న భయం మధ్య చదువులు సాగేదెలా అని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జి.కొండూరు: రాష్ట్రంలోనే ఏకై క బాలికల ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీని కూటమి ప్రభుత్వం అర్థంతరంగా మూసేసింది. దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ఆ గురుకులానికి అద్దె భారమైందని కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు అకాడమీని మూసేయడంతో 280 మంది పిల్లల చదువుల భవితవ్యం రోడ్డున పడింది. ముందస్తు ప్రణాళిక లేకుండా వేసవి సెలవుల్లో కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు హడావుడిగా కుంటముక్కలలో ఉన్న పాత భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. పాత భవనానికి మరమ్మతులు... కుంటముక్కల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు 640 మంది విద్యార్థులు ఏటా చదువుతుంటారు. ఈ విద్యార్థులు ఉండే వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనంలోకి మార్చారు. వీరికి విద్యాబోధనతో పాటు వసతి గృహం సైతం ఇదే భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈడుపుగల్లు ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థినులకు సైతం ఇక్కడ వసతి కల్పించాల్సి రావడంతో గత ఎనిమిదేళ్లుగా వినియోగంలో లేని పాత భవనానికి హడావుడిగా మెరుగులు దిద్దుతున్నారు. ఈ భవనాన్ని 1984లో నిర్మించారు. ఇది దాదాపు శిథిలావస్థకు చేరి ఇప్పటికే స్లాబు పెచ్చులు ఊడి పడుతోంది. ఈ భవనంలో కొంత భాగం కూలే ప్రమాదం ఉందని తెలిసి దానిని తొలగించారు. పెచ్చులూడుతున్న చోట కెమికల్ ట్రీట్మెంట్ చేసి సరిపెడుతున్నారు. ఈ శిథిల భవనానికి రూ.33 లక్షలతో మరమ్మతులు చేసి ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీ విద్యార్థినులకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులకు రక్షణ కరువు.. కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఇప్పుడు ఉన్న విద్యార్థినులే నరకయాతన పడుతున్నారు. వసతి గృహం లేక తరగతి గదుల కోసం నిర్మించిన భవనంలోనే ఉంటున్నారు. పాఠశాలకు మూడొంతులు ప్రహరీ లేక విద్యార్థినులు బిక్కుబిక్కు మంటూ ఉండాల్సి వస్తోంది. సరిపడా టాయిలెట్లు లేవు. అంతర్గత రహదారులు లేవు. తాగునీటి వసతి అంతంతమాత్రం. ఉపాధ్యాయులు నివాసం ఉండే భవనాలు కూడా శిథిలావస్థకు చేరడంతో పాఠశాలలోనే ఉండాల్సిన ఉపాధ్యాయులు పరిసర ప్రాంతాలలో ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీ విద్యార్థినులను ఇక్కడకు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయివేటు భవనానికి అద్దె కట్టలేమంటూ ఈడుపుగల్లులో ఐఐటీ, నీట్ అకాడమీ మూసివేత కుంటముక్కలలో శిథిల భవనంలోకి తరలింపు యత్నం హడావుడిగా పాత భవనానికి మరమ్మతులు ప్రహరీ లేని భవనంలో విద్యార్థినులకు రక్షణ ప్రశ్నార్థకం పక్కనే వాగు ఉండడంతో వరద ముంపు ప్రమాదం పెచ్చులు ఊడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్న శ్లాబు -
రైతులకు సులభంగా విత్తనాలు అందించటమే లక్ష్యం
వ్యవసాయం, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ భవానీపురం(విజయవాడపశ్చిమ): విత్తన పంపిణీ విధానాన్ని మెరుగుపరిచి, రైతులకు సులభంగా విత్తనాలను అందించడమే లక్ష్యంగా రైతు సేవా కేంద్రాలను సందర్శిస్తున్నామని వ్యవసాయం, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు ఢిల్లీరావుతో కలిసి శుక్రవారం ఆయన గొల్లపూడి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత విత్తన పంపిణీలో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని (ఎస్ఓపీ) పరిశీలించడంతోపాటు పంపిణీలో పరిపాలన, సాంకేతిక విభాగాల సమన్వయాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు సంచాలకుడు (విత్తనాలు) వినయ్ చంద్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, విజయవాడ సహాయ సంచాలకుడు బీవీ రావు, ఏపీ సీడ్స్ విజయవాడ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వరి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరిగింది. విమాన ప్రమాద మృతులకు వైద్య ఉద్యోగుల నివాళి లబ్బీపేట(విజయవాడతూర్పు): అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖ ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తో పాటు వైద్య ఉద్యోగులు శుక్రవారం సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ఈ ఘటనలో వైద్య విద్యార్థులు కూడా మృతి చెందడం మరింత బాధాకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ విభాగాలు ఎయిడ్స్ అండ్ లెప్రసీ, టీబి, ఎన్.హెచ్.ఎం, ఎస్టాబ్లిష్మెంట్ ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. కొనసాగుతున్న మెగా డీఎస్సీ పరీక్షలు మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం కొనసాగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1030 అభ్యర్థులకు గాను 963 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,433 మందికి గాను 1,403 మంది హాజరయ్యారు. సచివాలయాల్లో తల్లికి వందనం జాబితాల ప్రదర్శన ఈ నెల 20 వరకు అభ్యంతరాలు, అర్జీల స్వీకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తల్లికి వందనం పథకానికి 2,13,846 మంది విద్యార్థులు, 1,41,999 మంది తల్లులు అర్హత సాధించారని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులతోపాటు అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. వీటిపై ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలు, అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు అర్జీలను పరిశీలించి, అనుబంధ అర్హుల జాబితాను రూపొందిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన పథకానికి అర్హులైన మొదటి తరగతి, జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కొత్తగా అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 5న నిధులు జమవుతాయని వివరించారు. విద్యుత్ వినియోగం, రైస్ కార్డు, కుటుంబ ఆదాయం, కుటుంబానికి ఉన్న భూమి, మునిసిపల్ ప్రాపర్టీ, ఫోర్ వీలర్, ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్, ఆదాయ పన్ను చెల్లింపు పరిమితుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చివరి మైలు లబ్ధిదారునికి పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
చేపల వేటకు వేళాయె!
మచిలీపట్నంఅర్బన్: మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వేళయింది. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధం శనివారంతో ముగియనుంది. దాంతో శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లు, వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన సముద్ర తీరం మళ్లీ సందడిగా మారనుంది. గతేడాది మత్స్యకారులకు సముద్రం వేట కలిసిరాలేదు. 2024 జూన్లో వేట మొదలు పెట్టిన వెంటనే వరుసగా తుపానులు, అల్పపీడనాలతో సముద్రంలోకి వెళ్లిన బోట్లు పట్టుమని ఒకటి, రెండు రోజులు కూడా వేట సాగించకుండా తీరానికి చేరాల్సి వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా నష్టాలు చవిచూశారు. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత ఏడాది వేట నిషేధ సాయం అందించలేదు. దాంతో మత్స్యకారులు అప్పులపాలయ్యారు. నిషేధం అనంతరం రెండు నెలల పాటు సముద్రంలో అపారంగా మత్స్య సంపద దొరుకుతుందని మత్స్యకారులు నమ్ముతారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని గంగపుత్రులు వేడుకుంటున్నారు. 61 రోజుల పాటు వేట నిషేధం సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో చేపలు, రొయ్యలు సంతాన ఉత్పత్తి, మత్స్యసంపద అభివృద్ధి కోసం నిషేధం విధించింది. తూర్పు తీరంలో అత్యధిక చేప జాతులు సంతానోత్పత్తి ఈ సమయంలోనే చేస్తాయి. అందుకే మరబోట్లు మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లతో సముద్రంలోకి వెళ్లడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2025–26 వేట నిషేధ భృతి ఇలా... జిల్లాలో 111 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. నాలుగు మండలాలలోని 64 మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,50,106 మంది మత్స్యకారులు చేపల వేట వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేందుకు ఉపయోగించే మెకనైజ్డ్ బోట్లు 66కు గాను 500 మంది మత్స్యకారులు, మోటరైజ్డ్ బోట్లు 2,126కు గాను 12,365 మంది, నాన్ మోటరైజ్డ్ బోట్లు 71కు గాను 206 మంది మత్స్యకారులను వేట నిషేధ భృతికి అర్హులుగా ఎంపిక చేశారు. డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గతేడాది బకాయిలకు ఎగనామం నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట ప్రారంభం బోట్లను సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు గత ఏడాది వేట నిషేధ భృతి బకాయిలు తీర్చని కూటమి సర్కార్ జిల్లాలో 12,809 మందికి రూ.12.89 కోట్లు ఎగనామం ఈ ఏడాది 13,077 మందికి రూ.26.15 కోట్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది వేట నిషేధ భృతి బకాయిలు ఎగనామం పెట్టింది. 2023–24లో వేట నిషేధ భృతి కింద కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం, కోడూరు తీరప్రాంతాల్లో 12,748 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రతిపాదించారు. వేట నిషేధ భృతి కింద 12,151 మంది బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్సార్ సీపీ హయాంలో రూ.10 వేలు చొప్పున నేరుగా రూ.12.15 కోట్లు జమ చేశారు. 2024–25 వేట నిషేధ భృతి కింద 12,809 మంది మత్స్యకారులను గుర్తించారు. సుమారు 12.89 కోట్లు ఇవ్వాల్సి ఉంది. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో భృతి అందలేదు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధభృతి రూ.20 వేలు ఇస్తామంటూ వాగ్దానాలు చేసింది. అయితే గతేడాది ఇవ్వవలసిన బకాయిలకు మొండిచేయి చూపింది. -
కృష్ణాజిల్లా
కలెక్టర్ను కలిసిన కమిషనర్ పెడన: పెడన మున్సిపల్ నూతన కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు.దుర్గమ్మ సేవలో సతీష్చంద్ర ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను విశ్రాంత ఐఏఎస్ అధికారి సతీష్చంద్ర శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ఇంద్రకీలాద్రి: ఈనెల 26 నుంచి జూలై 24 వరకు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. జూలై 8 నుంచి 10 వరకు శాకంబరీ ఉత్సవాలు జరుగుతాయి. శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025u8లో 7 -
విజయవాడకు మెట్రో మరో మణిహారం
● భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర రవాణా ప్రణాళిక ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకు మరో మణిహారం కానుందని, భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలకు కూడా ప్రాధాన్యమిస్తూ విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపీ)కు తుది రూపు ఇవ్వనున్నామని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టు సహా విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఏపీఎంఆర్సీఎల్ డెప్యూటీ సీజీఎం పి.రంగారావు హాజరైన ఈ సమావేశంలో తొలుత సిస్ట్రా ఎంవీఏ కన్సల్టింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అంకుశ్ మల్హోత్రా సీఎంపీ ముసాయిదాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వచ్చే 25–30 సంవత్సరాల నగర అవసరాలను సైతం పరిగణనలోకి తీసుకుని రూపొందించే దార్శనిక ప్రణాళికను సీఎంపీగా పేర్కొంటామని, విజయవాడ ప్రణాళికకు సంబంధించి ట్రాఫిక్, కుటుంబ సర్వేను పూర్తిచేశామన్నారు. భౌగోళిక స్థితిగతులు, ట్రాఫిక్, రవాణా పరిస్థితులు, రవాణా మౌలిక వసతులు, భవిష్యత్తు జనాభా, ట్రావెల్ డిమాండ్ తదితరాల ఆధారంగా సీఎంపీ ముసాయిదాకు రూపకల్పన చేశామన్నారు. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించి రహదారుల నెట్వర్క్, ప్రజా రవాణా, మార్గాలు, రిజిస్టర్డ్ వాహనాలు తదితర అంశాలతో పాటు రహదారి ప్రమాదాలను సైతం విశ్లేషించినట్లు వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నవ రాజధాని అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ సమగ్రాభివృద్ధిలో భాగంగా జనాభా అవసరాలకు అనుగుణంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పన తుదిదశకు చేరు కుందని తెలిపారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పోలీస్, ఆర్టీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, నగరపాలక సంస్థ తదితర భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్లు వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ నగరానికి గొప్ప ఆస్తి అని, ఫేజ్–1 కారిడార్ 1ఏ (గన్నవరం–పీఎన్బీ ఎస్), కారిడార్ 1బీ (పీఎన్బీఎస్–పెనమలూరు) భూ సేకరణ ప్రక్రియకు నిబంధనలకు అను గుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కృష్ణాజిల్లా పరిధిలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సమావేశంలో గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం ఎల్కే రెడ్డి, డీసీపీ ఎం.కృష్ణమూర్తి నాయుడు పాల్గొన్నారు. -
సారా తయారీ నిలిపివేయాలి
వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): భావితరం భవిష్యత్తు కోసం నాటు సారా తయారీ, విక్రయం, రవాణా మానివేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని వేమిరెడ్డిపల్లి తండాలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిలో భాగంగా శుక్రవారం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గతంలో సారా అమ్మేవారు, కాచే వారు తాము స్వచ్ఛందంగా మానేసినట్లు తన ముందు తెలపటంతో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. గ్రామంలో సారా కాయటం మానేసినవారు కొందరు కలెక్టర్తో మాట్లాడుతూ గతంలో తాము సారా కాచే వాళ్లమని, అది ఆపివేసి ఉపాధి హామీ పనులకు వెళుతున్నామని, తమకు గేదెలకు లోను, మేకల లోను, చిల్లరకొట్టు పెట్టుకునేందుకు లోను ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. చిన్నారులతో, వృద్ధులతో మాటాడారు. ప్రతి ఒక్కరూ మానసిక వత్తిడి తగ్గించుకోవటానికి, ఆరోగ్యం బాగుండటానికి ప్రతి రోజూ యోగా చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్డీఓ మాధురి, తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చినరాట్నాలు, గ్రామసర్పంచ్ విజయకుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ముగిసిన ఎస్జీటీల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బదిలీలకు సీనియారిటీ జాబితాల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లా లోని 53 మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 2780 ఎస్జీటీలకు మూడు రోజుల పాటు విద్యాశాఖాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందులో 54 మంది మునిసిపల్ పాఠశాలల్లో, 429 మంది మునిసిపల్ కార్పొరేషన్, 2297 మంది జెడ్పీ/ఎంపీపీ పాఠశాలల్లో ఎస్జీటీలుగా బదిలీ ఉత్తర్వులు పొందారు. -
పచ్చ బంగారం సాగుకు శ్రీకారం
కంకిపాడు: పచ్చబంగారం (పసుపు పంట) సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. తొలకరి పలకరింపులో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పసుపు విత్తనం కొమ్ములు విరిచి, పొలంలో నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈ ప్రాంతానికి అనువైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవటంపై రైతులు దృష్టి పెడుతున్నారు. వాణిజ్య పంటల్లో పసుపు పంట కూడా ముఖ్యమైంది. కృష్ణాజిల్లాలో 5031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లో పసుపు సాగుకు అనువైన భూములు ఉన్నాయి. సాధారణంగా కడప, మైదుకూరు, ప్రగతి, శీలం, ఎర్రశీలం, స్థానిక రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకుంటారు. మేలైన దిగుబడులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉండే విత్తన రకాలకు రైతులు ప్రాధాన్యం ఇస్తారు. ముందుగానే పలకరించిన తొలకరి ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరించింది. అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురవటంతో భూములు అదునుకు వచ్చాయి. దీంతో రైతులు పొలాల్లో పూర్వ పంట తాలూకూ వ్యర్థాలను ఏరివేసి, రెండు దఫాలుగా దుక్కి దున్ని పసుపు విత్తనం నాటేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలతో పాటుగా దివిసీమ పరిధిలోని లంక భూముల్లో పసుపు సాగు చేపట్టేందుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో అనువైన విత్తనాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎకరం కౌలు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ ఒప్పందాలు చేసుకుని భూములను మాట్లాడుకుని సాగుపై దృష్టి పెడుతున్నారు. పుట్టు రూ.5500–రూ 6500 రెండేళ్ల కిందటి వరకు పుట్టు(225 కిలోలు) ధర రూ.3500 మించి పలికేది కాదు. ఈ ఏడాది రూ.5500 నుంచి రూ.6500 పలుకుతోంది. పసుపు పంట చేతికి వచ్చే నాటికి ఫిబ్రవరి, మార్చి మాసంలో పచ్చి పసుపు కొమ్ములు పుట్టు రూ.3 వేల నుంచి రూ.4 వేల లోపే మార్కెట్లో ధర పలికింది. అలాంటిది ప్రస్తుతం రైతులు విత్తనం కోసం కొనుగోలు చేసే నాటికి ఆ ధర పెరుగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి అన్న చందంగా తయారవుతోందంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అయినా చేసేదేమీ లేక సాగుకు అవసరమైన విత్తనం కొమ్ము ధర పెచ్చు అయినా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండుకొమ్ములు ధర రూ.9,500 నుంచి రూ.11500 మధ్య నడుస్తోంది. గతేడాదితో పోలిస్తే రూ.14 వేలు మార్కు దాటుతుందని రైతులు ఆశించారు. అయినా ఆశించిన మేరకు ధర పెరగలేదు. అయితే ఈ దఫా రేటు పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు. దీంతో విత్తనం కొమ్ము సేకరించి సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరో పది రోజులు దాటితే విత్తనం కొమ్ముకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ధర పెరిగే చాన్స్ ఉండటంతో ముందస్తుగానే విత్తనం సేకరించి నిల్వ చేసుకుని సాగుకు ఉపక్రమించేలా సన్నద్ధమవుతున్నారు. ధర ఇంకా పెరిగే అవకాశం పొలాలు అదునుకు రావటంతో సాగు పనులు చేపట్టిన రైతులు విత్తనం కొమ్ము సేకరణపై దృష్టి తొలకరి పలకరింపుతో సాగులో నిమగ్నం -
సమస్యల మధ్యే ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బడి గంటలు గణగణ మోగాయి. సుమారు 50 రోజుల వేసవి సెలవుల అనంతరం బాలబాలికలు ఉత్సాహంగా బడిబాట పట్టారు. నిన్నటి వరకూ బోసిపోయిన పాఠశాల ప్రాంగణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు పాడ్యమి తిథి రావడంతో తల్లిదండ్రులు మంచి రోజుగానే భావించి తమ పిల్లలను పాఠశాలలకు పంపించారు. సమస్యల స్వాగతం.. తొలి రోజు విద్యార్థులకు ఆయా పాఠశాల్లోని సమస్యలు స్వాగతం పలికాయి. పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు ఇంకా పూర్తి కాకపోవటంతో చాలా మంది మచిలీపట్నంలో ఉన్నారు. బుధవారం బదిలీలు పొందిన ఉపాధ్యాయులు గురువారం ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. అదేవిధంగా బదిలీపై కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు సైతం గురువారం రోజునే ఆయా పాఠశాల్లో రిపోర్ట్ చేశారు. దాంతో కొన్ని విద్యాసంస్థల్లో సగం కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు బదిలీపై ఉండటంతో ఆయా ప్రాంగణాల్లో అంతా గందరగోళం నెలకొంది. అరకొరగానే కిట్లు పంపిణీ.. సాధారణంగా పాఠశాలలు తెరిచిన తొలి రోజే పుస్తకాలు ఇతర సామగ్రిని అందించేందుకు గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేది. ప్రభుత్వం మారటంతో పంపిణీ కార్యక్రమంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైన విషయాన్ని తొలిరోజే మరోసారి స్పష్టమైంది. పుస్తకాలు ఇతర కిట్ల పంపి ణీకి సంబంధించి నిర్ధిష్టమైన ఉపాధ్యాయులు కేటాయింపు జరగకపోవటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తొలి రోజు కనిపించాయి. కేవలం పుస్తకాలు మాత్రమే పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. అది సైతం కేవలం కొన్ని పాఠశాలల్లోనే జరిగింది. స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, సాక్సులు, బూట్లు ఇలా చాలా వస్తువులు విద్యార్థులకు అందలేదు. విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో పాఠశాలలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభమయ్యాయని, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాల కిట్ను సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. తొలి రోజు అంతా గందరగోళం పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందజేత యూనిఫామ్, బ్యాగులు, ఇతర సామగ్రి ఇవ్వని వైనం -
ఎస్ఎంసీకి కొత్త ప్రిన్సిపాల్
డాక్టర్ ఏవైరావు బాధ్యతలు స్వీకరణలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా అడిషనల్ డైరెక్టర్ హోదాలో డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్గా వ్యవహరించిన డాక్టర్ పి. అశోక్కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ.. సమయపాలన.. ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ కళాశాలలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించేలా చూస్తామన్నారు. నిత్యం కళాశాల, విద్యార్థులు హాస్టల్స్లో రౌండ్స్ వేస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎప్పుడైనా నేరుగా తనను కలవచ్చని, వెయిటింగ్ లేకుండా ఎప్పుడూ తలుపులు చెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వైద్యులు సిబ్బందితో సమన్వయం సమష్టి కృషితో ముందుకెళ్దామని పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావును అభినందించిన వారిలో పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్కుమార్, ఏడీ శ్రీకాంత్, ఇతర ప్రొఫెసర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మికులను రక్షించటం, సంరక్షించటం, బాలల హక్కుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా గురువారం కార్మిక శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రాఫిట్ షూ కంపెనీ సంయుక్త సహకారంతో సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, బాల కార్మికులు లేని సమాజాన్ని అందరూ కలిసి నిర్మించాలన్నారు. బాలల హక్కులు, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ఆపదలో ఉన్న బాలలను రక్షించడంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘మా సంస్థలో బాల కార్మికులు లేరు’’ అనే ప్రత్యేకమైన స్టిక్కర్లను జేసీ ఆవిష్కరించారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఆశారాణి మాట్లాడుతూ బడి బయట ఉన్న బాలలను గుర్తించటం, వీధి బాలలుగా, బాల కార్మికులుగా ఉన్న బాలలను రక్షించడంలో సమాజం కీలకపాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎ.ధనలక్ష్మి, కార్మిక శాఖ అధికారులు టి.రాజేష్, డి.రత్నకుమారి, పి.రామ్ కుమార్, జి.విజయ సారథి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ రాజేశ్వరరావు, సోషల్ వర్కర్లు శారద, లత, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కోటే ప్రకాష్ కుమార్, నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబి జోసెఫ్, అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ జి.శేఖర్ బాబు, కోఆర్డినేటర్ కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
కొనసాగుతున్న ఎస్జీటీల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల నిమిత్తం ప్రభుత్వం నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. గత రెండు రోజుల్లో 1,130 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సీనియారిటీ జాబితాలోని 701 నుంచి 1,150 వరకు ఉదయం సెషన్, 1,151 నుంచి 1,450 వరకు ఎస్జీటీలు మధ్యాహ్నం సెషన్లో హాజరై బదిలీ ఉత్తర్వులు పొందారు. బదిలీల ప్రక్రియ ఆర్జేడీ జి.నాగమణి పర్యవేక్షించారు. ఉపాధ్యాయుల అర్హతలు, ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి జంగారెడ్డిగూడెం: విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణా న్ని బలిగొంది. ఈ ఘటన గురువారం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా భీమవరప్పాడుకు చెందిన కొమ్మి మన్మథశేఖర్ అనే కాంట్రాక్టర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన మధిరి నవీన్ (26) పనిచేస్తున్నాడు. మండలంలోని మైసన్నగూడెంలో విద్యుత్ లైన్ల పనుల నిమిత్తం గురువారం ఇద్దరు యువకులతో కలిసి నవీన్ వెళ్లాడు. పనులు ముగిసిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో లైన్మన్ సురేష్ లైన్ మరమ్మతు పని ఉందని చెప్పి నవీన్ను రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కించాడు. మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ ప్రవహించడంతో నవీన్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న డీఈ సుబ్బారావు, ఎస్ఐ జబీర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డీఈ సుబ్బారావు మాట్లాడుతూ మరమ్మతుల నిమిత్తం ఎల్సీ తీసుకున్నారని, సమీప ఇళ్లల్లోని ఇండక్షన్ సప్లై రావడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు. -
కార్పొరేట్లే ‘షైనింగ్ స్టార్స్’!
ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు ప్రభుత్వ సత్కారాలు ఎన్టీఆర్ జిల్లాలో షైనింగ్ స్టార్స్ ఇలా.. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్స్ పేరుతో పది, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అందించిన పురస్కారాలు దానిని రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అడుగడుగునా ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి అండగా నిలిచింది. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేదిగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 174 మందికి సత్కారాలు.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియెట్లలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో షైనింగ్ స్టార్స్ పేరుతో పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మండలాల్లో కులాల ప్రతిపాదికన విద్యార్థులను ఎంపిక చేసింది. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు పురస్కారాన్ని సైతం అందించాలని నిర్ణయించింది. పదో తరగతికి సంబంధించి 131 మందికి, ఇంట ర్మీడియెట్ కోర్సులకు చెందిన 43 మందికి ఈ అవార్డుల కోసం ఎంపిక చేసి ప్రదానం చేశారు. సర్వత్రా విమర్శలు.. ప్రభుత్వం తానిచ్చే పురస్కారాలు, అవార్డులు తొలుత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇవ్వటం పరిపాటి. పేద, మధ్య తరగతి అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించటం ద్వారా మరింత మంది ఆ విధమైన స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారు. మరిన్ని విజయాలను సాధించేందుకు అది ఆదర్శంగా నిలుస్తుంది. కానీ జిల్లాలో సోమవారం అందించిన అవార్డులు దాదాపుగా 90 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకే అందించింది. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించినా ప్రైవేట్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వటం ఏమిటని విద్యారంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి.. ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలకు చెందిన విద్యార్థులను విద్యాశాఖ కులాల ప్రతిపాదికన ఎంపిక చేసింది. అందులో భాగంగా కేవలం ఎనిమిది మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అందులో ఎంపిక చేయటం వివాదాస్పదమవుతోంది. 12 మండలాలకు చెందిన ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ విద్యార్థికి ఈ పురస్కారాల్లో అవకాశం లభించలేదు. మిగిలిన ఎనిమిది మండలాలకు సంబంధించి నాలుగు మండలాలకు ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన మండలాలకు చెందిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించినా, ఆ మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులను దూరం పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో 131 మందిని పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయగా అందులో 19 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 112మంది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు చెందిన విద్యార్థులే. అలాగే ఇంటర్మీడియెట్కు సంబంధించి 43 మందిని ఎంపిక చేయగా అందులో కేవలం పది మంది మాత్రమే ఎయిడెడ్, ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 33 మంది పూర్తిగా కార్పొరేట్ విద్యార్థులే.విజయవాడ నుంచి ఒక్కరూ లేరు.. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ ఉత్తరం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ మండలాలు చాలా ప్రధానమైనవి. విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో నగరపాలకసంస్థ, ఎయిడెడ్ విద్యాసంస్థలు వంద వరకూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఈ విద్యా సంస్థల నుంచి ఒక్క విద్యార్థిని కూడా విద్యాశాఖ ఎంపిక చేయలేదు. ఎయిడెడ్, నగరపాలకసంస్థ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన పదో తరగతి విద్యార్థులు అవార్డులు సాధించిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కు లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికీ విద్యాశాఖ అమలు చేసిన నిర్ణయం తీవ్రమైన అన్యాయం చేసిందంటూ ఉపాధ్యాయులు సైతం విమర్శిస్తున్నారు. -
గత ప్రభుత్వమే మేలు..
పండించిన పంట విక్రయించేందుకు ఖాళీ సంచుల కోసం రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యం విక్రయాలకు ఖాళీ సంచులను రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిల్లర్లమీద ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికై నా పాత పద్ధతి ద్వారా సేవలందిస్తే బాగుంటుంది. రైతులకు గత ప్రభుత్వంలోనే మేలు జరిగింది. – షేక్ చాన్బహుదూర్, రైతు, పెండ్యాల, కంచికచర్ల మండలం -
చాలీ చాలని జీతాలతో బతికేదెలా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాలీచాలని జీతాలతో బతుకీడ్చేదెలా అంటూ మునిసిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో వారు గత నెలరోజులుగా ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు పిట్టా మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు దఫాలు చర్చల పేరుతో పిలిచి ఎటువంటి హామీ గానీ, ఉత్తర్వులు గాని ఇవ్వలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు వేముల జైపాల్, పరసా బుచ్చిబాబు, బి.నాగరాజు, సీహెచ్ సాంబశివరావు, పి.కృష్ణ, ఎండీ గౌస్, కార్మికులు పాల్గొన్నారు. నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించని ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ధర్నా -
డాక్టర్ సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం
ఘంటసాల: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు లాంఫామ్లో నిర్వహించిన సభలో గురువారం ఆమె వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. చెరకు పంటలో పీక పురుగు, పొలుసు పురుగు ఉధృతి, యాజమాన్యం, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చెరకు పంటలను ఆశించే వివిధ పురుగుల యాజమాన్యం గురించి నిర్వహించిన పరిశోధనలు, బిందు సేద్యం పద్ధతిలో ఎరువులు అందించే విధానంపై పరిశోధనలకు సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం దక్కింది. ఆమె బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీ దేవి, వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ అవార్డు లభించినందుకు కేవీకే ఘంటసాల, వ్యవసాయశాఖ సిబ్బంది, కృష్ణాజిల్లాలోని పలువురు శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. డ్రగ్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్ పటమట(విజయవాడతూర్పు): రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాల తనిఖీలో భాగంగా పట్టుబడిన ఎండీఎంఏ(మిథలిన్ డయాక్సి మిథపేటామిన్) కేసులో నిందితుడిగా ఉన్న పామర్రుకు చెందిన వల్లభనేని మనోహర్ను పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా తాజాగా గురువారం మనోహర్ను చాకచక్యంగా రామవరప్పాడు వద్ద అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన మరో వ్యక్తిని, యూపీకి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. గంజాయి సరఫరా చేస్తున్న ఇరువురు అరెస్ట్ 9 కిలోల గంజాయి స్వాధీనం పటమట(విజయవాడతూర్పు): పటమట ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్న ఇరువురు వ్యక్తులను పటమట పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పటమటలంక చేపల మార్కెట్ వద్ద గంజాయి విక్రయం జరుగుతోందని బుధవారం రాత్రి సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గంజాయి సరఫరాదారులపై దాడి చేశారు. ఈ దాడిలో పున్నమితోటకు చెందిన గుడిగంట వంశీకుమార్ అలియాస్ సిద్ధా, పటమట పుట్టరోడ్డుకు చెందిన గుంజి సాయితరుణ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారివద్ద ఉన్న 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిరువురిపై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్డులో అమరావతి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అమరావతి వెళ్లే రోడ్డుకు ఎడమవైపున రోడ్డుకు, పొలాలకు మధ్య కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతుని వయసు సుమారు 50 – 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. బాగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుని ఒంటిపై ఆకుపచ్చ లుంగీ, ఫుల్ హ్యాండ్స్ బనీను ఉన్నాయి. వివరాలకు భవానిపురం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
నిత్య యోగాచరణతో రోగాలు దూరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం యోగాచరణ ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో గురువారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర 23వ రోజు కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్స్ థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వైద్య ప్రముఖులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాలు రక్షణ కవచంగా ఉపయోగపడతాయని, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ ఉషారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనుమయ్య, ఫాగ్సీ ప్రతినిధి డాక్టర్ త్రిపుర, రమేష్ హాస్పిటల్ వైద్యులు పి.రమేష్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి వి.రాణి, ఆయుష్ అధికారి రామత్లేహి, వైద్యులు జె.సుమన్, రత్నప్రియదర్శిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యులు సింగరి ప్రభాకర్, కోడె ప్రభాదేవి, రమేష్(ఆయుష్ హాస్పిటల్), అనిల్ (అనిల్ న్యూరో హాస్పిటల్), సుబ్బారావు(అమెరికన్ ఆంకాలజీ), శివప్రసాద్(హృదయాలయ హాస్పిటల్స్), సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
మాజీ సైనికుల కార్పొరేషన్ నెలకొల్పాలి
మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు నగరంపాలెం(గుంటూరు): మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించాలని అన్నారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తించి, మిలటరీ నుంచి బయటకు వచ్చిన కొందరు సైనికులు అనారోగ్యాలతో మరణించారన్నారు. తద్వారా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కొందరి సైనికుల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. మాజీ సైనికుడు వాకా ఆదినారాయణ, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ గుణదల(విజయవాడ తూర్పు): ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోగా లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిందని, నిరుద్యోగ భృతి హామీ అటకెక్కించిందని మండిపడ్డారు. ఆచరణకు యోగ్యం కాని పథకాలను అమలు చేస్తామంటూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్సిక్స్ పేరుతో పేదలను మభ్యపెట్టిన కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కోమల్ సాయి, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు. -
పత్తా లేని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు
కంచికచర్ల: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే తలుపుతట్టాయి. వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ తరుణంలో రైతులకు సలహాలిచ్చేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రాల్లో కనిపించటంలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. పేరు మార్చితే మార్చారు... రైతులకు అందించవలసిన సేవలను పూర్తిగా దూరం చేసింది. దాంతో అవి ఉండీ నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూలనపడ్డ కియోస్క్లుగత ప్రభుత్వంలో ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుమందులు బుక్ చేసుకునే అవకాశం లభించింది. వాతావరణంలో మార్పులు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ సూచనలు, సలహాలు, పంట ఉత్పత్తులు, మద్దతు ధర కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునేవారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలను ఉపయోగించకుండా మూలన పడేశారు.ఇప్పటికీ అదే నిర్లక్ష్యం..జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 270 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రూ.59 కోట్లు మంజూరు చేసి సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని పలు గ్రామాల్లో 120 పక్కా భవనాలు నిర్మించింది. మరో 150 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులను నిలిపివేసింది. రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది కాని సేవలను దూరం చేసింది. కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ఆయా భవనాల్లో కొన్నింటిని వినియోగిస్తోంది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని సర్వేలు, పింఛన్ల పంపిణీ అంటూ బయటకు పంపిస్తోంది. దీంతో రైతులకు సేవలు అందడం లేదు.మొక్కజొన్న వైపు మొగ్గు...ఈ ఏడాది రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. చీడపీడలు తట్టుకోవటంతో పాటు తక్కువ పెట్టుబడి అవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న పంటకు సకాలంలో మద్దతు ధర ప్రకటించకపోయినా లేదా కొనుగోలుచేయకపోయినా సరే ఈ ప్రాంతంలో ఇథనాల్ కర్మాగారాలు ఉండటంతో మొక్కజొన్న పంటకు మంచి ధర లభిస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదైనా..రానున్న ఖరీఫ్ సీజన్లో అయినా ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేసుకునేందుకు కియోస్క్ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల నుంచి వాతావరణం గురించి తెలియకపోవటంతో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట ఉత్పత్తులు తడిసి ముద్దవుతున్నాయి. అదే కియోస్క్లు పనిచేస్తుంటే వాతావరణం గురించి తెలుసుకుని ముందుగా పంట ఉత్పత్తులను కాపాడుకునేవారమని పలు మండలాల రైతులు అంటున్నారు.ఈ ఏడాది పత్తి సాగు కష్టమే...రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు పత్తి సాగు చేసేందుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది పత్తి పంటకు ఆశించిన మేర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. చీడపీడలు పత్తిని నాశనం చేశాయి. అకాల వర్షాల వల్ల పత్తి పంట చాలా దెబ్బతింది. పత్తి పంట సాగుకు పెట్టుబడి కూడా ఎక్కువ అయిందని రైతులు అంటున్నారు.గ్రీన్ ట్యాక్స్పై జీవోను విడుదల చేయాలని వినతివిజయవాడస్పోర్ట్స్: ఏడేళ్లు దాటిన సరుకు రవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు అన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డిని ఈశ్వరరావు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ట్యాక్స్ తగ్గింపునకు జీవోను వెంటనే విడుదల చేయాలని మంత్రిని ఆయన కోరారు. దీనిపై మంత్రి రామ్ప్రసాద్రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ వారంలోనే ట్యాక్స్ తగ్గింపుపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, కార్యదర్శి సీహెచ్ వినయ్ ఉన్నారు.తైక్వాండోలో జిల్లాకు 68 పతకాలువిజయవాడస్పోర్ట్స్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మూడు రోజుల పాటు జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు 68 పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, కోచ్లు పి.విక్టర్ ఆదిత్య, కె.కృష్ణవంశీ, బి.దినేష్, బి.కాశీనాథ్రెడ్డి, పి.గౌరిశంకర్, ఎం.బాలచందర్ అభినందించారు.దరఖాస్తులు ఆహ్వానంఘంటసాల: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్య ప్రియలలిత గురువారం తెలిపారు. పదో తరగతి, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం కల్పిస్తున్న అవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాన్నారు. మరిన్ని వివరాలకు 08671 – 254499 సంప్రదించాలని కోరారు. -
యోగాంధ్ర ప్రత్యేక గీతం టీజర్ విడుదల
విజయవాడస్పోర్ట్స్: వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ నేతృత్వంలో యోగాంధ్రపై రూపొందించిన ప్రత్యేక గీతానికి సంబంధించిన వీడియో టీజర్ను శాప్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఈనెల 21న 5 లక్షల మందితో విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. వోల్గా ఆర్చరీ అకాడమీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రత్యేక గీతాన్ని రూపొందించడం ప్రశంసనీయమన్నారు. వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ప్రపంచంలోనే యోగాపై తొలిసారిగా ప్రత్యేక గీతాన్ని రూపొందించా మన్నారు. ఈ గీతానికి తానే స్క్రిప్ట్ సిద్ధం చేశానని, రచయిత సుద్దాల అశోక్తేజ పాటను రచించారని, శ్రీకృష్ణ పాడారని వివరించారు. రెండురోజుల్లో పూర్తి పాట విడుదల చేస్తామని తెలిపారు. శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, శాప్ ఏఓ వెంకటరమణ నాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్లు, ఏడీలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల వద్ద మోకాళ్లపై ధర్నా
పాఠశాలలో తరగతులు తొలగించడంపై ఆందోళన ధర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): తమ పాఠశాలను తమ వద్దే ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్మవరప్పాడుతండ గ్రామ సర్పంచ్ గుగులోతు మణి ఆధ్వర్యంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాలలో ఈ ఏడాది ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు నిలుపుదల చేసి సమీప గ్రామంలోని జయంతిపురం పాఠశాలలో కలిపారన్నారు. ఇలా తరగతులను తొలగించటం వల్ల గ్రామంలోని విద్యార్థులు ఐదు కిలోమీమీటర్ల మేర వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. బస్సు సౌకర్యం కూడా లేదు.. జయంతిపురం వెళ్లాలంటే ఆటో, బస్సు సౌకర్యం లేదని దీని వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఫోన్లో ఎంఈవో చిట్టిబాబు మాట్లాడారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చాల్సి వస్తుందని తానేమి చేసేది లేదని చెప్పడంతో వారు వెనుదిరాగారు. గ్రామస్తులు మంగ్యానాయక్, సైదా నాయక్, జ్వాలా నాయక్, నారాయణ, గోపి, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
లారీ, కారు ఢీకొని ఒకరి దుర్మరణం
కృత్తివెన్ను: అప్పటి వరకు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు దూసుకువచ్చి కుటుంబ యజమానిని కబళించివేసింది. కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంపట్ల రాంగోపాల్ (41) ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాంగోపాల్ తన భార్య రీతూ, కుమారుడు, కుమార్తెతో కలసి హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వారు తమ కారులో తిరిగి పాలకొల్లుకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సంగమూడి చినగట్టు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రాంగోపాల్ అక్కడికక్కడే మరణించగా, భార్య రీతూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కుమారుడికు సైతం తలకు బలమైన గాయాలవగా, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాంగోపాల్ పాలకొల్లులో రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి అధ్యక్షుడిగా పనిచేశారని, అందరితో కలివిడిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ప్రమాదంలో ఇలా ఛిద్రమైపోవడం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని వారి బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య పరిస్థితి విషమం, కుమారునికి తీవ్ర గాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన కుమార్తె ఆ కుటుంబంలో పెను విషాదం నింపిన ప్రమాదం -
కృష్ణా జిల్లాలో 54.8 మి.మీ. వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో బుధవారం 54.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 122.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కృత్తివెన్ను మండలంలో 12.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా గుడివాడ మండలంలో 107.2 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 87.2, నందివాడ 84.6, ఉయ్యూరు 74.6, మొవ్వ 69.4, పెదపారుపూడి 41.8, పెనమలూరు 61.6, కంకిపాడు 61.4, పమిడిముక్కల, నాగాయలంక మండలాల్లో 58.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెడన మండలంలో 57.6 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 54.2, చల్లపల్లి 53.8, బంటుమిల్లి 52.6, తోట్లవల్లూరు 50.4, ఘంటసాల 48.6, అవనిగడ్డ 45.4, మోపిదేవి 39.6, కోడూరు 38.4, పామర్రు 37.4, బాపులపాడు 32.8, గన్నవరం 29.2, గూడూరు మండలంలో 27.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గాలిగోపురంపై పిడుగుపాటు పెడన: పట్టణంలోని ప్రధాన ఆలయమైన శ్రీ గంగ, పార్వతి సమేత అగస్తేశ్వరస్వామి ఆలయ గాలిగోపురంపై బుధవారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల సమయంలో పిడుగు పడింది. గోపురంపై సింహం బొమ్మపై పిడుగు పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది. గోపురంపై ఉన్న దేవతామూర్తుల బొమ్మలు కొన్ని దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భాగాలు గోపురం కింద చెల్లచెదురుగా పడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకుడు గూడూరు అగస్తయ్య పిడుగుపాటు సమాచారాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ, దేవదాయ శాఖ అధికారులకు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ భళ్ల ప్రసాద్ తదితరులు ఆలయానికి చేరుకుని గాలిగోపురాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి సహకారంతో గాలిగోపురానికి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిమాండ్స్ డే పాటిస్తూ ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు బుధవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సమస్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉందని, కూటమి నాయకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో అర్హులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిన నేపథ్యంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అక్రెడిటేషన్ కమిటీలో జేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ కమిటీ ఏర్పాటు చేయాలని, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, అధ్యక్షుడు పి.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కె.సాంబశివరావు, కార్యదర్శి ఎం.బి.నాథన్ తదితరులు ఉన్నారు. బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గవర్నర్పేట పాత బస్టాండ్ వద్ద జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఏలూరు రోడ్డులో బస్టాండ్ వైపు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతనిపై బస్సు చక్రం ఎక్కింది, దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ వ్యక్తి వివరాలు తెలిపే ఆధారాలు లభ్యంకాలేదు. మృతుడి వివ రాలు తెలిసిన వారు గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో లేదా 94406 27079, 0866 –2576023 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న మట్టి దోపిడీ
గన్నవరం: మండలంలోని ముస్తాబాద పెద చెరువులో యథేచ్ఛగా సాగుతున్న మట్టి దోపిడీ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. సూరంపల్లి గ్రామానికి చెందిన గజ్జల వెంకటేశ్వరరావు(55)ను మంగళవారం సాయంత్రం ముస్తాబాద గ్రామంలోని స్కూల్ సెంటర్లో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టర్ ఢీకొంది. అతని ఛాతీ భాగం, చేతులపై ట్రాక్టర్ టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, సూరంపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బుధవారం గన్నవరం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం తరఫున కొందరు రంగంలోకి దిగి మట్టి తవ్వకందారులైన టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నాలను ప్రారంభించారు. పోలీస్స్టేషన్లోనే మృతుడి కుటుంబ సభ్యులు, ఆ గ్రామ పెద్దలతో చెరువు తవ్వకందారులు చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ఇచ్చేందుకు చెరువు తవ్వకందారులు అంగీకరించారు. సూరంపల్లి గ్రామ వైఎస్సార్ సీపీ కమిటీ మృతుని కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఆ పార్టీ నేత కందిమళ్ల శ్రీనివాసరావు తెలిపారు. -
నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పరిధిలో అక్టోబర్ 15వ తేదీ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలను నిషేధించామని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ఇసుక తవ్వకాలు, అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. నైరుతి రుతుపవనాల కాలంలో నదుల్లో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించిందని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అక్టోబరు 15వ తేదీ వరకు నదుల్లో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్పష్టంచేశారు. నదీ తీర ప్రాంతాల వద్ద రాత్రిపూట నిఘా ఉంచి పోలీస్ గస్తీలు సజావుగా నిర్వహించాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. నదులకు చేరే రహదారి మార్గంలో కందకాలను తవ్వించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు నిత్యం పర్యవేక్షించేలా చూడాలన్నారు. ఆర్డీఓలు, డీఎస్పీలు తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఉన్న నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభల్లో తీర్మానాల ప్రతిని సంతకాలతో జిల్లా కమిటీకి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని శ్రీకాకుళం, నార్త్ వల్లూరు, రొయ్యూరు, మద్దూరు, చోడవరం, పడమటలంక, రొయ్యూరు సెమీ మెకనైజ్డ్ స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 7.50 లక్షల టన్నుల ఇసుక అందు బాటులో తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలించినా స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన ఏడు స్టాక్యార్డుల నుంచి మాత్రమే ఇసుకను తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సత్యనారాయణ, గనుల శాఖ డీడీ శ్రీనివాసకుమార్, భూగర్భజలశాఖ డీడీ విజయవర్ధనరావు, వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ రవికిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఆర్టీవో శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబరు 15వ తేదీ వరకు ఆంక్షలు తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కఠిన చర్యలు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
నేరాల నియంత్రణకు కృషి చేయండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కృషి చేయాలని ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించేలా చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. మహిళల రక్షణకు మరింత కృషి మహిళలు, యువతులు, చిన్నారుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. వారి నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, తక్షణం విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఆడబిడ్డల జోలికి వెళ్లాలంటే ఉన్మాదులు భయపడేలా పోలీసు చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. శక్తి బృందాల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఒక్కరు తమ సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేసేలా భరోసా ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రదేశాలను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయా లని సూచించారు. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం ట్రాఫిక్ సిబ్బందితో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల సందర్శన.. పల్లెనిద్ర పోలీస్ అధికారులు అందరూ తమ తమ పరిధిలో కమ్యూనల్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ ఉన్న గ్రామాలను సందర్శించి అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గంగాధరరావు సూచించారు. ప్రతి పోలీసు అధికారి తమ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి పల్లెనిద్ర కార్యక్రమాలను చేట్టాలని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై సమీక్షించి కేసుల దర్యాప్తు వివరాలు, చార్జ్ షీట్ దాఖలు వంటి వివ రాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టులో స్పీడ్ ట్రయల్ ద్వారా కేసులోని నిందితులకు శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హత్య, రేప్ కేసులు, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తుపై ఆరా తీశారు. సిబ్బందికి అభినందనలు మసుల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. బందో బస్తును సమర్థంగా నిర్వహించటంలో అందరూ సఫలీకృతులయ్యారని కొనియాడారు. బందో బస్తులో సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీని జిల్లాలోని అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై నిఘా పెట్టండి గ్రామాల సందర్శన తప్పనిసరి నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ గంగాధరరావుగంజాయిపై ఉక్కుపాదం జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గంజాయి కేసులకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఎన్డీపీఎస్ కేసుల్లో విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చోరీల నివారణకు నైట్ బీట్ సంఖ్యను, సీసీఎస్ టీమ్స్ను కూడా నైట్ బీట్లకు పెంచాలని సూచించారు. బీట్ తిరిగే కానిస్టేబుళ్లు తమ పరిధిలో సస్పెక్ట్ షీట్ హోల్డర్లు, డీసీ షీట్, కేడీషీట్ హోల్డర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హనుమాన్జంక్షన్కు చెందిన దాసరి ఫణివిక్రమ్ తన కారును మరమ్మతుల నిమిత్తం విజయవాడలోని మెకానిక్ నూతక్కి శ్రీనివాస్(37) వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకువెళ్లారు. అయితే పాత కారు కావడంతో తన స్నేహితుడైన ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన మరో మెకానిక్ సర్పరాజ్ (30)ని పిలిపించాడు. ఇరువురు కలిసి అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేశారు. అనంతరం తెల్లవారుజాము వరకు కారులోనే విశ్రాంతి తీసుకుని ఉదయం ఫణివిక్రమ్తో కలిసి సర్పరాజ్, శ్రీనివాస్ కారులో హనుమాన్జంక్షన్ బయలుదేరారు. మార్గ మధ్యలో ఆత్కూరు ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ అందులో చిక్కుకుపోయారు. కారు నడుపుతున్న సర్పరాజ్, వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఎడమ వైపు కూర్చున్న ఫణివిక్రమ్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు క్రేన్ సాయంతో కారు డోర్లను తెరచి గాయపడిన ఫణివిక్రమ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. సర్పరాజ్, శ్రీనివాస్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, ఒక కుమారుడు ఉండగా, సర్పరాజ్ మాత్రం అవివాహితుడిగా పోలీసులు పేర్కొన్నారు.వలస కూలీల అనుమానాస్పద మృతినందివాడ: వలస కూలీలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెన్ననపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అసోంకు చెందిన బిశాల్ బసుమత్రి (25), జహర్లల్ దోయిమరి (36) వెన్ననపూడి గ్రామంలో ఓ ఆక్వా చెరువు వద్ద కాపలాదారులుగా ఉంటూ అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం చెరువు వద్ద ఉన్న షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. పొగ బాగా కమ్ముకోవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి శరీరం కూడా సగం వరకూ కాలిపోయింది. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని బట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల శరీర భాగాలతో పాటు ఘటనా స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మంగళగిరి ఆర్ఎఫ్ఎస్ ల్యాబ్కి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారుకృష్ణాజిల్లా ఆత్కూరు వద్ద ఘటన -
అంతులేని అఘాయిత్యాలపై ఆందోళన
మచిలీపట్నంటౌన్: కూటమి పాలనలో రాష్ట్రంలోని బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని.. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయించి.. మహిళల మాన, ప్రాణాలను కాపాడేలా చూడాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్– సేవ్ ఆంధ్రా’ అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, బాలికలకు బాబు పాలనలో భద్రత కరువు అనే నినాదంతో కూడిన బ్యానర్, ఫ్లకార్డులతో ప్రధాన రహదారిలో నిరసన ర్యాలీ చేస్తూ స్థానిక లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ సర్కిల్కు చేరుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ● గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి మాట్లాడుతూ కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ ఏదోక చోట బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినంగా శిక్షించకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకే పాలకులు చొరవ చూపుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా రక్షణను గాలికొదిలేసి కేవలం కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు. ● బందరు మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధికారులకు వినతులు ఇచ్చి చేతులు నొప్పులు పుట్టటం తప్ప ప్రయోజనం ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిలుపుదల చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అయ్యేలా చూడండని ఆయన విగ్రహానికే వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర మాజీ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, కార్పొరేటర్లు షేక్ షాహినా, రాసంశెట్టి వాణిశ్రీ, పడమట రేవతి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. కూటమి పాలనపై వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నిరసన అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ -
అరాచకాలు చూపిస్తే బ్యాన్ చేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూపిస్తున్న చానళ్లు ప్రసారం కాకుండా బ్యాన్ చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వారిని బెదిరించి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉందని, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేక పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, మహిళా హోం మంత్రి అయి ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియడంలేదని విమర్శించారు. క్రిమినల్ని ట్రీట్ చేసినట్లు కొమ్మినేనిని చూడటం దుర్మార్గమన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్కు బ్రేక్
ప్రారంభమైన ఎస్జీటీల మాన్యువల్ బదిలీలు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ విధానానికి బ్రేక్ వేసింది. టీచర్ల బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, 53 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 2,800 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) బదిలీ ప్రక్రియ మంగళవారం సాయంత్రం విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు. సర్వర్ సమస్యలతో ఆలస్యం.. స్థానిక జిల్లా పరిషత్ (జెడ్పీ) సమావేశ మంది రంలో నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్కు ఎస్జీటీలు మధ్యాహ్నం రెండు గంటలకే జెడ్పీకి చేరుకున్నప్పటికీ, అవసరమైన ఆన్లైన్ అనుమతులు ఆలస్యం కావడంతో అదే ప్రాంగణంలో గంటల తరబడి ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు చెట్ల కింద కూర్చొని అసహనానికి గురయ్యారు. కనీస వసతులు కల్పించలేదని పెదవి విరిచారు. కౌన్సెలింగ్ మొదటి రోజున 200 మంది ఎస్జీటీల బదిలీలను చేపట్టారు. టెక్నికల్ సమస్యలు ఎదురవడం, సర్వర్ మొరాయించటంతో ప్రక్రియలో జాప్యం జరిగింది. మొత్తం బదిలీల ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల అర్హతలు, ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. శాప్ పాలకవర్గ సభ్యులు వీరే.. విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పాలకవర్గ సభ్యుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఒలింపిక్ క్రీడాకారులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, క్రీడలకు ప్రోత్సాహం అందించే వ్యక్తులకు పాలకవర్గంలో చోటు కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.వినయ్చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒలింపిక్ హాకీ క్రీడాకారిణి ఇ.రజిని(చిత్తూరు), అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు ఎ.రమణరావు(విజయ వాడ), ఎం.డి.రమేష్కుమార్(విజయనగరం), వ్యాయామ విద్యా అధ్యాపకుడు ప్రేమ్రవీంద్రనాథ్(పశ్చిమగోదావరి), క్రికెట్ క్రీడాకారుడు ఎస్.సంతోష్కుమార్(విజయవాడ), కె.జగదీశ్వరి(ఎన్జీవో), క్రీడలకు ప్రోత్సాహం అందించే బి.శివ(అనంతపురం), పి.బి.వి.ఎస్.ఎన్.రాజు(అనకాపల్లి) సభ్యుల జాబితాలో ఉన్నారు. -
డైవర్షన్ పాలిటిక్స్..
వెన్నుపోటు దినం సక్సెస్ అయ్యేసరికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని ప్రజలను నమ్మించి వంచించారన్నారు. మహిళలను దారుణంగా మోసం చేసి ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మఒడి, చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా లక్షల మంది మహిళలకు వైఎస్ జగన్ అండగా నిలిచారన్నారు. శాంతిభద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నామని, మీడియా సంస్థపై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. -
సమిధలవుతున్న వనితలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజుకో ప్రాంతంలో వారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి మంగళవారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఇచ్చిన హామీల అమలు శూన్యమన్నారు. తాము వెన్నుపోటు దినం ద్వారా నిరసన తెలిపితే కూటమి పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దారుణ రాజకీయాలు.. ఒక జర్నలిస్ట్ చానల్లో మాట్లాడితే దానిని వైఎస్ జగన్ కుటుంబానికి అంటగడుతూ విమర్శలు చేస్తున్నారన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించామని, మహిళల పేరుతో అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళలు అంటే గౌరవంతో వైఎస్ జగన్ పాలన సాగించారన్నారు. అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు సొంతింటి కలను జగన్ నెరవేర్చారన్నారు. జగన్ చేసిన మంచి పనులను దమ్ముగా, ధైర్యంగా చెప్పగలమని, ఆయన గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జాగ్రత్త అని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని, ఒక చానల్లో వచ్చిన దానికి కొమ్మినేని అప్పుడే క్షమాపణ చెప్పారని, ఆ మీడియా ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు వరుస దారుణ ఘటనలతో బెంబేలు డైవర్షన్ కోసమే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ మీడియాతో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
నిత్య యోగాతో జీవితంలో నూతనోత్తేజం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా జీవితంలో నూతనోత్తేజం కలుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ యోగాను చేరువచేసేందుకు థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికులు, విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకం శ్రామికులతో పాటు విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి యోగాసనాల అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పి.హరికృష్ణ, కోశాధికారి డి.రాజారావు, లయన్స్ క్లబ్, సిద్ధార్థ కళాశాల యోగా శిక్షణ కేంద్రం సభ్యులు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం. సుహాసిని, ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చల్లా లింగయ్య మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సరికి తలుపులు తీసి ఉండటంతోపాటు బీరువాలోని రూ. 2.70 లక్షల నగదు కనిపించకపోవడంతో చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ తోట సూర్యశ్రీనివాస్ వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
నేడు కృష్ణానదిలో ఫ్లోటింగ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణా నదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కై వసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రపంచ రికార్డుగా నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య తదితర శాఖలతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ), స్విమ్మర్ల అసోసియేషన్, యోగా శిక్షణ సంస్థలు వంటివి కూడా భాగస్వాములవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు.. ఫ్లోటింగ్ యోగా నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆపరేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారన్నారు. సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి, డీపీఆర్వో ఎస్వీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఫ్లోటింగ్ యోగా కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం పరిశీలించారు. ప్రపంచ రికార్డ్ను సొంతం చేసుకునేలా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో యోగా ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా భద్రత, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బారికేడింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చూడాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ప్రాంగణ అలంకరణ తదితరాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఆయుష్ అధికారులు, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
యథేచ్ఛగా లైంగిక దాడులు
కూటమి పాలనలో ● బాధితుల్లో ఆర్నెల్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధులు ● నేరాలకు పాల్పడుతున్న వారంతా టీడీపీ వారే ● మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాది కూటమి పాలనలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయని, రాష్ట్రంలో మహిళలు బతకాలంటే భయపడుతున్నారని, బాలికల తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడిన వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరస నగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు బయ టకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్నా, బడిలో, కళాశాలలో ఉన్నా, చివరికి పని ప్రదేశంలో ఉన్నా అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హిందూపురం, అనంతపురంలో చిన్నారి తన్మయి. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు కూటమి పెద్దలు పనికిమాలిన విషయాలపై దృష్టి పెడుతున్నారని, మహిళలపై ఇన్ని ఘటనలు జరి గినా సీఎం, డెప్యూటీ సీఎం, హోం మంత్రి ఎక్క డైనా స్పందించారా అని వరుదు కల్యాణి ప్రశ్నించారు. కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య చేశారని, ఉండి నియోజకవర్గంలో, భీమిలిలో ఇలా ఎక్కడా చూసినా ఇలాంటి ఘటనలు వినని రోజు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని, నమోదు కానివి ఇంకా ఎన్నో ఉన్నాయని, గంటకు మూడు, నాలుగు లైంగికదాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న ఒక్క రివ్యూ చేయకపోవడం సిగ్గుచేటని, అవసరం లేని విషయాలపై, కక్షపూరిత రాజకీయాలపై ప్రెస్మీట్లు పెట్టే హోం మంత్రి ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏరులై పారుతున్న మద్యం కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కల్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి రూపుమాపుతామని గొప్పలు చెప్పారని, హోం మంత్రి నివసిస్తున్న విశాఖలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతోందని, ఆమె నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతోందని వివరించారు. -
కృష్ణాజిల్లా
తమ పాలనలో విద్యుత్ చార్జీల భారం ఉండదని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. స్మార్ట్ మీటర్లు వద్దంటూ ఆందోళన చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు బాదుడే బాదుడు అన్నట్లు పాలన సాగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లకు పచ్చజెండా ఊపారు. ట్రూ అప్, ఎఫ్పీపీసీఏ చార్జీల పేరుతో పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యుత్ బిల్లులతో షాకులు కొడుతున్నారు. ఎన్నికల హామీలను విస్మరించి చార్జీల వడ్డనే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. నేడు పెనుభారం 7 -
ఉర్వేళమ్మ ఉత్సవం.. సకల జనుల సంబరం
● మూడేళ్ల కోసారి గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర ● నూరు వసంతాలుగా వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● ఉర్వేళమ్మ జాతరలో తొలి పూజలు ముస్లిం సాహెబ్కే ● హిందూ భక్తులతో మదార్ సాహెబ్ సంబరం భావదేవరపల్లి(నాగాయలంక): నూరేళ్లుగా అచ్చమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ గ్రామదేవత సంబరం. నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలో మూడేళ్లకు ఒకసారి నిర్వహించే గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. జాతరకు ముందుగా పూర్వీకుల సంప్రదాయం రీత్యా మదార్ సాహెబ్ సంబరం జరపడం తప్పనిసరి. గ్రామంలో గుడారం, మదరా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. వందేళ్ల క్రితం అప్పటి ఆలయ ధర్మకర్తలు భోగాది అప్పారాయుడు, మండలి వెంకటప్పయ్య, గ్రామపెద్దలు రాసిన ఇలియా (శాసనం) ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉర్వేళమ్మతో పాటు మదార్సాహెబ్ సంబరం మందుగా నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ గ్రామంలో ముస్లిం కుటుంబాలు లేవు. అయినా అందుబాటులో ఉండే మస్లిం పెద్దలు వచ్చి మదార్ సాహెబ్ సంబరం జరుపుతారు. తొలుత సాహెబ్ జెండా పట్టుకుని గ్రామ వీధుల్లో తిరిగి భక్తుల నుంచి కొబ్బరికాయలు, అగరొత్తులు, చిల్లర నాణేలు స్వీకరిస్తారు. అదే రాత్రికి మదార్ సాహెబ్ గుడారానికి చేరిన భక్తులు ఆ మత సంప్రదాయం మేరకు మూడు చొప్పున రొట్టెలు, గంధపు ఉండలు, జెండాలు, చిల్లర నాణేలు సమర్పంచి పూజలో పాల్గొంటారు. హిందూ–ముస్లిం సమైక్యతతో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు ముగిసిన వెంటనే మద్ది రావమ్మ స్థావరానికి భక్తులు చేరుకుని వేడి నైవేద్యాలను సమర్పిస్తారు. 13వ తేదీ నుంచి ఉత్సవాలు ఎంతో వైవిద్యంతో కూడిన ఉర్వేళమ్మ జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 13న పోతురాజుస్వామి పోత తదుపరి మద్ది రావమ్మ, మదారా సాహెబ్ సంబరం జరుగుతాయి. 14న గ్రామంలో గుడారం, మదారా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో సాహెబ్ జెండా పట్టుకుని భక్తులు నడుస్తారు. చివరి రోజు 15వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఉర్వేళమ్మవారికి పూజ, రాత్రి ఏడు గంటలకు ఉర్వేళమ్మ దేవతకు వేడి నైవేద్యాలతో గ్రామస్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు ఆలయానికి చేరుకుని గ్రామంలోని 20 ముఠాల నేతృత్వంలో సంయుక్తంగా అమ్మవారి సంబరాన్ని అట్టహాసంగా జరుపుతారు. -
విద్యుత్ బిల్లు.. జేబుకు చిల్లు
● కూటమి పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విద్యుత్ బిల్లులు ● హామీలను విస్మరించి సామాన్యులపై విద్యుత్ చార్జీల భారం ● అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం ● రకరకాల చార్జీల పేరుతో చూస్తేనే షాక్ కొట్టేలా విద్యుత్ బిల్లులు ● చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయామంటున్న సామాన్య జనం బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ – కై లా అశోక్, రైతు, గుడివాడ గుడివాడరూరల్: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు భారంగా మారాయంటూ చంద్రబాబు సహా కూటమి నాయకులు గగ్గోలు పెట్టారు.. బాదుడే బాదుడు అంటూ ఊరూవాడా అసత్యాల దరువేశారు.. స్మార్ట్ మీటర్లు వద్దంటూ రాద్ధాంతం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ చార్జీలను పెంచబోమని హామీలు గుప్పించారు.. అవసరమైతే ఆ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు.. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడత పెట్టేశారు.. విద్యుత్ చార్జీలను అమాంతం పెంచేశారు.. పట్టుకుంటే కాదు.. చూస్తేనే షాక్ కొట్టేలా విద్యుత్ బిల్లులతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ.. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు.. భారాల ప్రభుత్వం అని ప్రజలు అనుకునేలా పాలన సాగిస్తున్నారు. కృష్ణాజిల్లాలో మొత్తం 7,53,295 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 38 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ అధికమవుతోంది. మరోవైపు జిల్లాలో వ్యవసాయ బోర్లు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో విద్యుత్ బిల్లులు ఏసీ గదుల్లోనూ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. బిల్లులతో బాదుడే బాదుడు విద్యుత్ వినియోగానికి విరుద్ధంగా బిల్లులు పెరుగు తుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాల గుండెలు గుభేలుమంటున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరో వైపు పెరిగిన విద్యుత్ బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు ప్రభుత్వం విస్మరిం చింది. ప్రస్తుతం జిల్లాలోని గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు విద్యుత్ డివిజన్లకు రోజుకు 7.294 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. వేసవి మరికొద్ది రోజుల్లో ముగిస్తే 20 శాతం విద్యుత్ వాడకం తగ్గే అవకాశం ఉంది. ఎండలు మరి కొద్ది రోజులు ఇలానే కొనసాగితే మరో 20 శాతం విద్యుత్ వాడకం పెరగనుందని అధికారుల అంచనా. ఈ డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్ని చర్యలను తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్ బిల్లులను మాత్రం మోతెక్కిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులకు రెట్టింపు మొత్తంలో జారీ చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేదల సంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం వైఎస్సార్ సీపీ హయాంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాలన సాగింది. విద్యుత్ వినియోగం పెరిగినా, ప్రభుత్వంపై భారం పడుతున్నా ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీ పెరగకుండా పేద, మధ్యతరగతి వర్గాలతో పాటుగా ఎంఎస్ ఎంఈల అభ్యున్నతి దిశగా యోచన చేసింది. ప్రభుత్వం నుంచి అవసరమైన రుణాలు అందించి యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించింది. పగటి వేళలో తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా విద్యుత్ను సరఫరా చేసి వ్యవసాయానికి తోడ్పడింది. స్మార్ట్ మీటర్లతో తీవ్ర ఇబ్బందులు చల్లపల్లిలో వాటర్ ప్లాంట్ను నడుపుతున్నా. గతంలో ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. గత ఏడాది డిసెంబర్లో కూడా రూ.26,754 బిల్లు వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలకు రూ.72,619 బిల్లు రావడంతో విద్యుత్ ఏఈని సంప్రదించా. ఈ బిల్లు చెల్లించాల్సిందేనని ఏఈ స్పష్టంచేశారు. పాత మీటర్లు ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు రాలేదు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. మా ప్లాంట్కు వచ్చిన వచ్చిన విద్యుత్ రీడింగ్పై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. 76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16 టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు వచ్చింది. అన్నే యూనిట్లకు 2018–19లో రూ.197.60 బిల్లు వచ్చింది. ప్రస్తుతం 76 యూనిట్లకు రూ.397 చొప్పున బిల్లులు జారీ చేస్తున్నారు. దీనికి ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ చార్జీలు అదనంగా విధిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలో తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చొప్పునే చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49లకే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అయ్యింది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లు వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ సర్వీసుల వివరాలు ఇలా.. కేటగిరీ సర్వీసులు గృహాలు 6,21,578 షాపులు 66,025 పరిశ్రమలు 2,619 ఆలయాలు,కార్యాలయాలు 14,606 వ్యవసాయం 38,179 ఆక్వా 10,288 మొత్తం 7,53,295 టీడీపీ అంటేనే షాకులు – దాసరి భాస్కరరావు, చల్లపల్లి -
భారత కాయక్, కెనోయింగ్ పోటీల్లో వర్షితరెడ్డి సత్తా
విజయవాడస్పోర్ట్స్: ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత రెడ్డి ఐదు పతకాలు సాధించి సత్తా చాటింది. మచిలీపట్నంలో జరిగిన మసూల బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్(ఐకేసీఏ) నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్షితరెడ్డి అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శించి సికాయక్ అండ్ స్టాండప్ పెడలింగ్ విభాగంలో రెండు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకొని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. క్రీడాకారిణి వర్షితరెడ్డి విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్ప రెడ్డి, కోచ్లు ఎం.శ్రీనివాస్, తేజ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాయకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.బలరాంనాయుడు, ఐకేసీఏ డైరెక్టర్ ఆర్.ప్రదీప్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాయకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ సెక్రటరీ శివారెడ్డి వర్షితను అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా వేదికపై రాణించి రాష్ట్ర ఖ్యాతిని చాటాలని వారు ఆకాంక్షించారు. -
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల అందజేత
చిలకలపూడి(మచిలీపట్నం): కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు శ్రమించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మిడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో షైనింగ్ స్టార్స్ అవార్డులను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో మంది కృషి, పట్టుదలతో గొప్ప విజయాలను అందుకున్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించాలన్నారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి వారిని ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా ప్రోత్సాహం అందించటమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రుల నిర్ణయాలు కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అవకాశాలను పరిశీలించుకుని సొంత నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 201 మంది విద్యార్థులకు అవార్డులు అందజేశారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఈవో పీవీజే రామారావు, ఆర్ఐవో సాల్మన్రాజు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సాగునీటి విడుదలపై సందిగ్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో సాగునీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. నీటిని విడుదల చేస్తే వరి పంట సాగు చేసేందుకుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ నిర్వాకం రైతుల శాపంగా మారుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితులు, నీటి ఇబ్బందులు ఉన్నా, పులిచింతలలో నీటిని నిల్వచేసి, జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. దీని ద్వారా పంట కోత సమయంలో తుఫాన్ల బారిన పడకుండా గట్టెక్కే పరిస్థితి ఉండేది. దీనికితోడు ముందుగా రెండో పంటగా మినుము సాగు చేయడంతో అధిక దిగుబడులు వచ్చేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గతేడాది జూలై నెలలో నీటిని విడుదల చేయడంతో పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ల బారిన పడి తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తుగా రుతుపవనాలు రావడం, ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటిని జూన్ మొదటి వారంలో విడుదల చేసే వెసులు బాటు ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన నీటి పారుదల సలహామండలి సమావేశంలో జూన్ 10వ తేదీన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనిపైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరచడంతో కృష్ణాడెల్టాకు నీటి విడుదలపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ముందుచూపు లేకపోవడంతోనే.. జూన్ మొదటి వారంలో నీటిని విడుదల చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సాగునీటి కాలువల్లో పూడిక తీత, గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు, గండ్లు పూడ్చడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10 లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులు కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షటర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, మార్చి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేసింది. మే నెలలో పనులను మంజూరు చేసింది. కాలువలకు నీటిని విడుదల చేస్తే పనులు చేసేందుకు అవకాశం ఉండదు. పనులు చేయకుండా మమ అనిపించి నిధులు స్వాహా చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఇప్పటికి 40 శాతం పనులు కూడా ప్రారంభం కాలేదు. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల పెదవి విరుపు.. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే సాగునీటి కాలువల్లో పూడిక తీయకుండా, గండ్లు పూడ్చకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతులే గండ్లు పూడ్చుకోవాల్సిన దుస్థితి ఉందని పామర్రు ఎమ్మెల్యే పేర్కొనడం ప్రభుత్వ డొల్లతనానికి అద్దం పడుతోంది. బుడమేరు కాలువలో పూడిక తీయకలేదని, మురుగునీరు కాలువల్లోనూ పూడిక తీయలేదని ఎమ్మెల్యేలు నీటి సలహా మండలి సమావేశంలో పేర్కొన్నారు. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగుతున్నాయి. గుర్రపుడెక్క, తూడుతో మేట వేసుకుపోయి నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు కాలువలకు గండ్లు పూడ్చని వైనం తూటికాడ, గుర్రపుడెక్కతో పేరుకుపోయిన కాలువలు, డ్రెయిన్లు నిధులు మంజూరైనా.. నత్తనడకన పనులు గత ప్రభుత్వ హయాంలో జూన్ మొదటి వారంలోనే నీటి విడుదల కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాలు లక్షల్లో) కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51 లక్షలు – కేఈబీ 1.38 లక్షలు – ఏలూరు 0.56 లక్షలు 1,332 రైవస్ 2.17 లక్షలు 425 మొత్తం 5.62 1,757 ఈ ఏడాది కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు.. డివిజన్ పనుల విలువ సంఖ్య రూ.కోట్లలో కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజీవిభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 650 26.03 అధ్వానంగా కాలువలు ప్రధాన కాలువలన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా తూడు, గుర్రపుడెక్క, జమ్మితో మేట వేసుకుపోయాయి. ఖరీఫ్ సీజన్ వచ్చినా కాలువల్లో తూడు తొలగింపు పనులు చేపట్టలేదు. హడావిడిగా చేపట్టే పనులు వల్ల కళ్లనీళ్లు తుడవటమే తప్ప రైతులకు ఒరిగిందేమీ ఉండదు. కాలువ చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమే. – చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు -
సత్వర పరిష్కారమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో కె. స్వాతి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను కిందిస్థాయి సిబ్బందితో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. మీకోసంలో అధికారులు 105 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● బందరు మండలం సుల్తానగరం గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కుళాయిలపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మురాల దేవి అర్జీ ఇచ్చారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారని, వాటి మార్జిన్లు ఏర్పాటు చేయలేదని దీని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అర్జీలో వివరించారు. ● బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సర్వే నంబరు 101 నుంచి 104 నంబర్లు గల భూమిలో టీడీపీ నాయకులు 23 ఎకరాల పంచాయతీ చెరువును రొయ్యల చెరువుగా మార్చేసి లీజుకు ఇచ్చి ఆ డబ్బులను పంచాయతీకి చెల్లించటం లేదు. ఇప్పటి వరకు సుమారుగా రూ. 1.50 కోట్లు పంచాయతీకి జమ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. అలాగే గ్రామంలో రామాలయం, చర్చి ఉన్న ప్రాంతంలో బ్రాందీషాపును ఏర్పాటు చేసి ఆ బ్రాందీషాపునకు రూ. 20 లక్షల ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించారు. వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైకం కోటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 105 అర్జీలు స్వీకరణ -
’మాకు న్యాయం జరిగేలా చూడండి’
దేవినేని అవినాష్కు ఎండీయూ ఆపరేటర్ల వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎండీయూ ఆపరేటర్లు సోమవారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను కలిసి విన్నవించారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అవినాష్ను కలిసిన ఎండీయూ ఆపరేటర్లు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. వినతిపత్రంలో మిడ్ డే మీల్స్, అంగన్వాడీల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, వెంటనే చెల్లించేలా ప్రశ్నించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం చేసిన వర్క్కు రావాల్సిన డబ్బులు తక్షణమే రిలీజ్ చేయించాలని, వాహనాల బీమా బకాయిల డబ్బులు రిలీజ్ చేయాలని, మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్స్ని గూడ్స్ వెహికల్స్గా మార్చి క్లియరెన్స్ ఇప్పించాలన్నారు. వీటితో పాటు గత ప్రభుత్వంలో 90 శాతం రాయితీ, 10 శాతం మేము కట్టేలా ఒప్పందం జరిగిందని, కానీ ఇప్పుడు 30 శాతం డబ్బులు తమతో కట్టించుకున్నట్లు వారు తెలిపారు. తాము చేసే న్యాయ పోరాటని సహకారం అందించాలని కోరారు. బాధితులకు అండగా ఉంటాం.. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని దేవినేని అవినాష్ అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. అంతేకాకుండా వలంటీర్లను తొలగించారని, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తొలగించి ఉపాధి కోల్పోయేలా చేశారన్నారు. ప్రతి బాధితునికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అవినాష్ను కలిసిన వారిలో విజయవాడలోని పలు ప్రాంతాలకు చెందిన ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్ నందు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం కార్మికులను తొలగించే యత్నాలను చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మోదీ సేవ ఆపి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమస్యలను పరిష్కరించాలి.. జీతాల కోసం, క్రమబద్ధీకరణ కోసం కాకుండా ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తున్నారని నేతలు చెప్పారు. కార్మికులు జీవన్మరణ సమస్యగా భావించి పోరాటం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులను 3వేల మందిని తొలగించారని, మరికొన్ని వేలమంది కార్మికులను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి తీసుకురావడం, కొత్త బాయిలర్లను, ఫర్నిస్లను ఏర్పాటు చేయటం, ఉన్న ఉద్యోగులను తొలగించకుండా లాభాల్లో నడిపే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటిని ప్రైవేటుకు కారు చౌకగా అప్పగించాలని దురుద్దేశంతో ఈ రకమైన చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెను విరమింపచేసే చర్యలు చేపట్టాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, ఏసీసీటీయూ నాయకులు లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, జిల్లా నాయకులు ఏం.సోమేశ్వరరావు, ఇఫ్టూ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ లోపభూయిష్టం
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో ఫైనల్ సీనియారిటీ జాబితాలు రాకుండానే పీఎస్ హెచ్ఎంలకు పాఠశాలల కేటాయింపు అనేది సరికాదని, ఇది వెబ్ కౌన్సెలింగ్లోని లోపభూయిష్ట విధానమని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. సోమవారం వెబ్ కౌన్సెలింగ్పై ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా రెండో రోజు స్థానిక ధర్నాచౌక్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రీవెన్స్ పరిష్కారం కాకుండానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అధికారులు ఒత్తిడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. లోపభూయిష్టమైన వెబ్ కౌన్సిలింగ్ వల్లే జూనియర్లకు పోస్టులు కేటాయింపు జరిగి సీనియర్ల అన్యాయం జరిగిందన్నారు. విద్యాశాఖ రోజుకు 500 మందితో జరపాలనుకునే కొత్త వెబ్ కౌన్సెలింగ్ అంతేమందితో మాన్యూవల్గా జరపటానికి అభ్యంతరం ఏమిటో అర్థం కావట్లేదన్నారు. మంత్రి లోకేష్ స్పందించాలి.. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి మాన్యూవల్ కౌన్సిలింగ్ కు హామీ ఇచ్చిన విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ ఉపాధ్యాయ ఉద్యమం, ఆందోళనను ఉద్దేశించి స్పందించాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు టీచర్లు చేస్తున్న ఆందోళనకు సానుకూల ప్రకటన విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో మంగళవారం భారీ ఎత్తున ఉపాధ్యాయులతో విద్యా భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్ఆర్టీఎఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు ఆందోళనలో ఉపాధ్యాయులు -
విద్యార్థులతో బంతాట
తాడేపల్లి రూరల్(గుంటూరు): కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ (గురుకుల పాఠశాల)ని మైలవరానికి తరలించవద్దని విద్యార్థులు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ 2017లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నీట్, ఐఐటీ శిక్షణకు అద్దె భవనాలలో అకాడమీని స్థాపించారని తెలిపారు. దీనిలో ఇంటర్మీడియెట్తో పాటు లాంగ్ టర్మ్ మెడికల్, ఐఐటీలకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏటా ఏడాది లాంగ్ టర్మ్తో కలిపి 220 మంది ఐఐటీకి, మరో 220 మంది విద్యార్థినులు నీట్ పరీక్షలకు హాజరు అవుతున్నారని చెప్పారు. అయితే అధికారులు అలసత్వం వహించి ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను తగ్గించారని, నిర్ణీత సమయానికి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆశయం పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ఇప్పుడు అకాడమీని వేరే చోటుకు మారిస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని వాపోయారు. ఈ క్లిష్ట స్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, భావితరాల వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఈడుపుగల్లు భవనాల నుంచి విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లు నుంచి కుంటముక్కలకు ఐఐటీ నీట్ మహిళా అకాడమీ తరలింపు -
కరోనాలో ముందుగానే వాహనమిత్ర
నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దపాప ఇంటర్. రెండో పాప పది పూర్తి చేసింది. చిన్నపాప టెన్త్ చదువుతోంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా ఏటా రూ. 10 వేలు లబ్ధి చేకూరింది. కరోనా లాక్డౌన్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. బతకడం కష్టమైంది. ఆ సమయంలో ఆర్నెలలు ముందుగానే వాహనమిత్ర ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. అమ్మఒడి పథకంలో నాలుగేళ్లు లబ్ధి పొందాం. కూటమి ప్రభుత్వం బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్కు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. ఏడాది నుంచి ఏ పథకం లేదు. తల్లికి వందనం కూడా ఇవ్వలేదు. పిల్లల చదువులు భారంగా మారాయి. – ఈశ్వర్, ఆటోడ్రైవర్ గొల్లపూడి ● -
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. నేడు ఏపీసీబీఈఏ రాష్ట్ర మహాసభలు చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోపీనాథ్ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు. రైల్వేస్టేషన్లో ఆహార భద్రతపై శిక్షణ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్లోని స్టేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఆహార భద్రతపై రైల్వే ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎఫ్బీఓ (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్)లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథి రైల్వే హాస్పటల్ సీఎంఎస్ డాక్టర్ శ్రీనివాసులు ఆహార భద్రతపై పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. నిబంధనలకు అనుగుణంగా ఆహారం తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహారాన్ని సక్రమంగా నిల్వచేయడం వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ‘ఈట్ రైట్ ఉద్యమం’ ఆరోగ్యకరమైన ఆహార వాతావరణానికి బలమైన పునాది వేసిందని, ఆ దిశగా విజయవాడ రైల్వేస్టేషన్ ఆహార భద్రతపై నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రైల్వే హాస్పటల్ ఏసీఎంఎస్ డాక్టర్ ఎం.జైదీప్, రైల్వే ఫుడ్ సేప్టీ ఆఫీసర్ ఎస్.కె. రెహ్మతుల్లా, స్టేషన్ డైరెక్టర్ శైలజ, స్టేషన్ మాస్టర్ సాంబశివరావు, ఐఆర్సీటీసీ ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శోభాయాత్ర విజయవాడ కల్చరల్: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీటీపీఎస్లో ఏపీఎస్పీఎఫ్ డీజీ ఇబ్రహీంపట్నం: ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ వర్మ శనివారం ఎన్టీటీపీఎస్ను సందర్శించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ప్లాంట్లో స్టేజి 1 నుంచి 4 వరకు సందర్శించారు. కోల్ప్లాంట్లో వ్యాగన్ టిప్లర్ గురించి ఏడీఈ హేమానంద్ వివరించారు. ఎస్ఈ అనురాధ కోల్తో విద్యుత్ తయారీ విధానం.. యూనిట్ కంట్రోల్ బోర్డు ద్వారా వివరించారు. ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడ శంకరరావు, అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణమాచారి పాల్గొన్నారు. -
అపార్టుమెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో నిర్మాణంలో వున్న ఒక అపార్టుమెంట్ పై నుంచి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పట్టణ సీఐ కల్యాణ్రాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు విద్యానగర్కు చెందిన గండు జగదీష్ (35) గుర్తించారు. ఇతను తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వచ్చి ఐదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకాడని, తలకు తీవ్రమైన గాయం ఏర్పడిందని, కొన ఊపిరితో ఉండడంతో భవనంలో పనిచేస్తున్న పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా జగదీష్ మృతి చెందినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. జగదీష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ బంధువులు మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి జగదీష్తో సన్నిహితంగా ఉండే బంధువులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కారణం చేతే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగదీష్ తమ్ముడిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఇప్పడు ఏమీ చెప్పలేనని, అన్నయ్యది ముమ్మాటికీ హత్యేనని, పోలీస్స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చనిపోయేటట్లు ప్రేరేపించారని ఆరోపిస్తున్న బంధువులు -
మచిలీపట్నం బీచ్కు జాతీయస్థాయిలో పేరుకు కృషిచేస్తా
మచిలీపట్నంటౌన్: మంగినపూడి బీచ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా తీర్చిదిద్దుతామని గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసులా బీచ్ ఫెస్ట్–2025 వేడుకల్లో భాగంగా మూడవరోజు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. తొలుత మంత్రి రవీంద్ర పారా గ్లైడింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ మసులా ఫెస్ట్ –2025 కు సందర్శకులు విశేషంగా తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. వాటర్ స్పోర్ట్స్, పారా గ్లైడింగ్, హెలీ రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిగా తిలకిస్తున్నారన్నారు. బీచ్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు బాగున్నాయన్నారు. అనంతరం సీ కయాకింగ్ పోటీలను మంత్రి రవీంద్ర తిలకించారు. ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, కయా కింగ్ కోచ్ జయంత కుమార్ను అభినందించారు. కయా కింగ్ క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా జెర్సీలను అందజేశారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ పేరు దేశమంతా మార్మోగేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ కిరణ్పాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
యోగాభ్యాసంతో మానసిక వికాసం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాంధ్ర మహోత్సవంలో భాగంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం 18వ రోజు యోగాసనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. యోగా ఔత్సాహికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, అర్బన్ పీహెచ్సీల వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లాలో కనీసం పది లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 8వ తేదీ బెరంపార్కులో... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని యోగాసనాలు సాధన చేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం కృష్ణానదీ తీరంలోని బెరం పార్కులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ఎం.సుహాసిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త జె.సుమన్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, ఆయుష్ అధికారి రామత్లేహి, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8న హరిత బెరం పార్కులో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
చల్లపల్లి వీధుల్లో అంకినీడు అంతిమ యాత్ర
చల్లపల్లి: శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్(చల్లపల్లి రాజా)వారి కుమారుడు అంకినీడు ప్రసాద్(86) భౌతిక కాయం శనివారం సాయంత్రానికి చల్లపల్లికి చేరుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని స్వగృహంలో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. చల్లపల్లి ప్రధాన రహదారులపై పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంకినీడు ప్రసాద్ భౌతిక కాయాన్ని ఊరేగించారు. ఆటోనగర్ వద్ద తరిగోపుల ప్రాంగణం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ప్రధాన రహదారి వెంబడి అవనిగడ్డ వైపు ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద వరకు వెళ్లి అక్కడ నుంచి వెనుదిరిగి మచిలీపట్నం రోడ్డులోని శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్(ఎస్ఆర్వైఎస్పీ) కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం రెండు గంటల పాటు అక్కడ ఉంచారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి నివాళులు అర్పించారు. అనంతరం అదే వాహనంలో ఆయన భౌతికకాయాన్ని మచిలీపట్నంలోని శివగంగ ప్రాంగణానికి తరలించారు. అంకినీడు ప్రసాద్ భౌతికకాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి సింహాద్రి రమేష్బాబు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కడసారి వీక్షించేందుకు బారులు తీరిన ప్రజలు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మండలి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల -
జూలై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్కుమార్ కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగుల, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ిసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక రాణిగారితోటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికవర్గ హక్కులను కాలరాసేందుకే లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కార్మికులకు రక్షణ లేని ఉద్యోగాల్లో నియమించి శ్రమ దోపిడీ చేసేందుకు ఈ పద్ధతి తీసుకొచ్చారని మండిపడ్డారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి నరసింహారావు, డి.కాశీనాథ్, కె.దుర్గారావు, ఎన్.సి.హెచ్.సుప్రజ, కార్యదర్శులు ఎం.మహేష్ సుధాకర్, ఈ.వి. నారాయణ, ఎ.కమల, గోపాల్ బి.వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
మచిలీపట్నం టౌన్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వ దినాన్ని నగరంలోని ముస్లింలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు బక్రీద్ పర్వదినం విశిష్టతను వివరించారు. బక్రీద్ రోజున ముస్లింలు పేదలకు మాంసాన్ని దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత మరో ప్రధానమైన పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటి వారికి సాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని కోరారు. ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగ నాయకుడు ఎండీ సద్రుద్దీన్, టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు ఇలియాస్పాషా, సయ్యద్ఖాజా తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): త్యాగనిరతిని, దాన గుణాన్ని పెంపొందించేదే బక్రీద్ పండుగ అని జమాతే ఇస్తామీ హింద్(జేఐహెచ్) మహమ్మద్ రఫీక్ అహ్మద్ అన్నారు. లబ్బీపేట ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం బక్రీద్ సామూహిక నమాజు జరిగింది. వేలాది మంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగలో బీదలు, బంధువులను, ఇరుగుపొరుగువారిని భాగస్వాములుగా చేసుకుని, మీకున్నంతలో దానమివ్వాలని ఇస్లాం చెబుతోందన్నారు. బందరులో మసీదులు, ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శనివారం పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేసి, క్యూలైన్లో వచ్చే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో క్యూలైన్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు.సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. -
ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేశఖండనశాలలో సిబ్బంది పని తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తే క్షమార్హం కాదు.. సేవా దృక్పథం ఉండాలి...లేనప్పుడు బయట వేరే పనులు చూసుకోండి.. భక్తుల నుంచి ఫిర్యాదులోస్తే అదే రోజు ఉద్యోగం నుంచి బయటకు పంపడమే కాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తాం...ఉద్యోగం లేని రోజు.. ఎలా ఉంటుందో ఊహించుకోండని దుర్గగుడి ఈవో శీనానాయక్ హెచ్చరించారు. మహా మండపం ఆరో అంతస్తులో దుర్గగుడి కేశ ఖండనశాల సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శనివారం రెండు వీడియో ఫిర్యాదులు తన వద్దకు వచ్చాయని, దేవదాయ చట్టం ప్రకారం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, భక్తులను ఇబ్బంది పెట్టే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కేశఖండనశాలలో సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు, వేతనాల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదులపై అన్ని కోణాల్లో విచారిస్తామని, సిబ్బంది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవని స్పష్టం చేశారు. భక్తులను గౌరవిస్తే ఆలయానికి మంచిపేరు ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రతిచోట భక్తులను గౌరవించాలని, ఆప్యాయతను చూపిస్తే ఆలయానికి మంచి పేరు వస్తుందని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈవో సూచించారు. దాదాపు నెల రోజుల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని గమనిస్తున్నానని, యాంత్రికంగానే ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. దుర్గాఘాట్లో విచ్చలవిడిగా షాంపులు, సబ్బులు వాడుతూ నది పవిత్రతను దెబ్బతీస్తున్నా సెక్యూరిటీ సిబ్బందిగాని, శానిటేషన్ సిబ్బంది గాని అడ్డు చెప్పడం లేదన్నారు. భక్తులు ఎన్నో బాధలతో వస్తుంటారని, వారితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడి దర్శనం, ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం అందేలా చూస్తే వారు ఎంతో సంతోషిస్తారన్నారు. కొండపై సెల్ఫోన్లతో భక్తులు ఇష్టానుసారం ఫొటోలు దిగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది ఉన్న ఆలయంలో భక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొంతమంది తీరుతో దేవస్థానం చెడ్డ పేరు వస్తుందన్నారు. ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
పైసలిస్తేనే పర్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి పరిపాలనాపరమైన అన్ని కార్యకలాపాలు నిర్వహించే మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అక్కడ నుంచి ఏ ఫైల్ కదలాలన్నా పైసలు చెల్లించాల్సిందేనని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ఏదైనా పర్మిషన్ల కోసం వెళితే ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఆ కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెపుతున్నారు. అంతేకాదు ఇటీవల ఏఎన్ఎంలకు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఉద్యోగోన్నతులు ఇచ్చారు. వారికి ఇచ్చిన ఆర్డర్లు అసంపూర్తిగా ఉండటంతో వాటిని తీసుకుని రెండు మూడు రోజులు ఏఎన్ఎంల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం ఉద్యోగోన్నతుల సమయంలో ముడుపులు అడిగితే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే అని అంటున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ప్రతి పనికీ ఓ రేటు... ● కృష్ణాజిల్లాలోని ఓ టీచింగ్ హాస్పిటల్లో మత్తు వైద్యుల సదస్సు జరగనుంది. ఆ సదస్సులో ఆల్ట్రాసౌండ్ స్కానర్ను ఉపయోగించి మత్తు ఇవ్వడంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆల్ట్రాసౌండ్ మిషన్ వినియోగించేందుకు డీఎంహెచ్ఓను అనుమతి కోరారు. అందుకు రూ.25 వేలు లంచం ఇస్తేనే అనుమతి ఇస్తామని కార్యాలయంలో తేల్చి చెప్పినట్లు తెలిసింది. ● గుడివాడలోని ఓ ట్రస్టు ఆధ్వర్యంలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ హాస్పిటల్కు అనుమతి కోసం అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి అనుమతి కోసం డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ఫైల్ పంపారు. అనుమతి ఇవ్వాలంటే రూ.25 వేలు అధికారులు, రూ.5 వేలు కన్సల్టెంట్ గుమస్తాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబ్బుల కోసం ఫైల్ పక్కన పడేశారు. ఈ రెండే కాదు జిల్లాలోని వైద్యశాఖ ఉద్యోగులకు సంబంధించి ఏ పనిచేయాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే పని చేయకుండా పక్కన పడేస్తున్నట్లు చెపుతున్నారు. ఇలా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఎన్ఎం ఉద్యోగోన్నతుల్లోనూ... ఇటీవల సచివాలయాల్లో పనిచేస్తున్న 258 మందికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. వాటి సచివాలయాల నుంచి వైద్యశాఖలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారికి ఉద్యోగోన్నత ఉత్తర్వుల్లో రిలీవ్ ఎవరు చేయాలనే అంశం పేర్కొనక పోవడంతో గ్రామాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ రెండు రోజులు రిలీవ్ చేయలేదు. అసంపూర్తిగా ఆర్డర్లు ఇవ్వడం వలనే అలా జరిగిందని ఏఎన్ఎంలు మండి పడుతున్నారు. ఏప్రిల్ 26న ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించారని ఆ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనే అక్కసుతోనే తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఏప్రిల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఉద్యోగోన్నతులు పొందిన 15 మందికి ప్రస్తుతం కౌన్సెలింగ్లో రాలేదు. దీంతో వారు కూడా ఆందోళనకు దిగడంతో పాటు, కృష్ణా కలెక్టర్కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం ఏఎన్ఎంల ఉద్యోగోన్నతుల్లోనూ అసంపూర్తిగా ఆర్డర్లు మూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏఎన్ఎంలు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్ఓనా దృష్టికి రాలేదు తమ కార్యాలయంలో డబ్బులు అడుగుతున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అనుమతుల కోసం ఎవరినీ డబ్బులు అడగడం లేదు. – డాక్టర్ శర్మిష్ట, డీఎంహెచ్ఓ, కృష్ణా -
సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్
చిలకలపూడి (మచిలీపట్నం): సీఎం నారా చంద్రబాబునాయుడును కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురామ్ వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా రఘురామ్ను ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మద్యం మత్తులో డ్రెయిన్లో పడి వ్యక్తి మృతి పెనమలూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి డ్రెయిన్లో పడి మృతి చెందిన ఘటనపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి బందరు రోడ్డులో నడుస్తూ పీవీఆర్ ఐకాన్ వద్ద డ్రెయిన్లో పడిపోయాడు. ఈ మార్గంలో వెళ్తున్నవారు అతడిని గుర్తించి బయటకు తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సకు చేర్చారు. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రిలో రాత్రి మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు తెలిసిన వారు 99517 46017 ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని పోలీసులు కోరారు. -
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏది?
జగన్మోహన్రెడ్డి హయాంలో నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందజేశారు. ఆర్థికంగా నేతన్నలు కోలుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం నేతన్నలు ఎదుర్కొని నిలబడ్డారంటే జగన్ పుణ్యమే. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేత కార్మికుడు రూ.1.20లక్షల చొప్పున పొందారు. ఈ ప్రభుత్వంలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అంటూ పేర్కొంది. 200యూనిట్లు వరకు ఉచితమంది. దీనికి సంబంధించి ఎటువంటి విధివిధానాలు విడుదల చేయకుండా నేతన్నలను దగా చేస్తోంది. – యర్రా టార్జన్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు -
కుటుంబాలు కుదేలు!
సంక్షేమ వెలుగులు లేక సంక్షోభ చీకట్లుపెడన: ప్రస్తుతం కూటమి సర్కారు ఏడాది పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రిక్తహస్తమే మిగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ అంతా ప్రచార ఆర్భాటమేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు లేవని, అప్పులు చేస్తున్నామని దాటవేస్తూ కూటమి నేతలు చెబుతున్న మాటలకు విసుగెత్తిపోతున్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలు నెలకు రూ.15 వేలు చొప్పున ఒక్కొక్కరూ ఆర్థికంగా చాలా నష్టపోయారు. మహిళలు ఉచిత బస్సు కనీసం కంటికి కనిపించక ఇదెక్కడి ప్రచారం తల్లో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాదిలో సాగుకు అవసరమైన పెట్టుబడులు, విద్యార్థులు చదువులు పూర్తి చేయటానికి అందినకాడికి అప్పులు తెచ్చి కట్టుకోవాల్సి వచ్చిందంటూ వాపోతున్నారు. నేతన్నలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి నెలలు గడుస్తున్నా విధి విధానాలు ఏమీ విడుదల చేయకపోవడంతో నేతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పూట గడవటమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో విద్యుత్ భారంతో మగ్గాలు కదలటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ట్రూ అప్, సర్వీసు చార్జీలు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ఎన్డీయే కూటమి సర్కారు పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఆదరణ కరువైంది. మరీ ముఖ్యంగా రోడ్ల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవించే వాళ్లు, చిరు వ్యాపారులు, ఆటో వాలాలు కూటమి తీరుతో బతుకు భారంగా ఈడుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా ఆయా వర్గాలకు వ్యాపార వృద్ధికి, వాహనాల మరమ్మతులకు అవసరమైన సొమ్మును రూ.10 వేలు ఆపైన నేరుగా వారి బ్యాంకు ఖాతాకే చేరేలా చేసింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చే రుణాల యూనిట్ల కేటాయింపు అంతా ‘పచ్చ’పక్షంగా సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో అర్జీలు వస్తే కేవలం 200 యూనిట్లు కూడా మించకుండా కేటాయింపులు చేసి మొక్కుబడిగా చేతులు దులుపుకున్నారు. ఇందులో కూడా కేవలం ఎమ్మెల్యేల సిఫారసులు ఉన్న టీడీపీ వర్గీయులకే రుణాలు మంజూరయ్యేలా చేశారు. దీంతో కోటి ఆశలతో వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధి చేసుకుందామని ఆశించిన ఎందరో నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు నిరాశ మిగిలింది. బీసీ కార్పొరేషన్ల ద్వారా పేద మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని చెప్పి చివరకు రిక్తహస్తమే చూపారు. దగా పడ్డ పేద, మధ్య తరగతి వర్గాలు ‘పచ్చ’పాతం.. వెన్నుపోటు.. -
జెడ్పీ హైస్కూలుకు 50సెంట్ల భూమి వితరణ
కంకిపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య అందాలని జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు అన్నారు. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన దాత అన్నే పద్మనాభరావు, ఉషారాణి దంపతులు రూ. 10 కోట్ల విలువైన 50సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లిదండ్రులు అన్నే రామలింగయ్య, రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉప్పలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు వితరణగా అందించారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడుకి స్థల దస్తావేజులను శుక్రవారం అందజేశారు. తొలుత ఉప్పలూరు–వేల్పూరు రోడ్డు వెంబడి ఉన్న స్థలాన్ని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి సందర్శించారు. అనంతరం దాత పద్మనాభరావు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఈఓ కన్నమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటుగా దాతలు ముందుకు వచ్చి వసతుల కల్పనకు తోడ్పాటునందిస్తే పాఠశాలలు నూతన సొబగులు దిద్దుకుంటాయన్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం.. దాత అన్నే పద్మనాభరావు మాట్లాడుతూ ఉప్పలూరు, వేల్పూరు గ్రామాల విద్యార్థులు ఉన్నత పాఠశాల చదువు కోసం దూరంగా ఉన్న పునాదిపాడు, మంతెన గ్రామాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంటే అన్ని వర్గాల ప్రజలకు పాఠశాల అందుబాటులోకి వస్తుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండల విద్యాశాఖ రూపొందించిన కరపత్రాన్ని సీఈఓ ఆవిష్కరించారు. జెడ్పీటీసీ బాకీ బాబు, ఏఎంసీ చైర్మన్ అన్నే ధనరామకోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు మద్దాలి రామచంద్రరావు, కొణతం సుబ్రమణ్యం, ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తొలి రోజు డీఎస్సీ ప్రశాంతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008(87.65 శాతం) మంది హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (పీఎస్సీఎంఆర్)లోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే డీఎస్సీ పరీక్షలు రాసేందుకు దాదాపు 30 వేల మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని పది పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ -
నాడు
కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి తారుమారైంది. సామాజిక పింఛన్లు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. సూపర్సిక్స్ హామీలను విశ్వసించిన పేద, మధ్యతరగతి వర్గాలు భంగపాటుకు గురయ్యాయి. హామీల పేరుతో గద్దెనెక్కి వాటిని అటకెక్కించారంటూ ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. నయవంచన పాలనపైపెదవి విరుస్తూ, గత ప్రభుత్వ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటి గడపనూ సంక్షేమం పలకరించింది. ఏడాది పొడవునా అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న చేదోడు, ఆసరా అంటూ అనేక పథకాలను అందరికీ అందించింది. పేద, మధ్యతరగతి వర్గాలు ఆ ఫలాలతో ఆనందంగా జీవించాయి. పిల్లల చదువుల దగ్గర నుంచి కుటుంబ జీవనం వరకూ ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోయింది. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. నేడు కూటమి ఏడాది పాలనలో బతుకులు ఛిద్రం సూపర్ సిక్స్ పథకాల ఊసే ఎత్తని ప్రభుత్వం నమ్మి మోసపోయామంటూ ఆవేదన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోప్రతి కుటుంబానికి లబ్ధి నాటి సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి వారికి ఆర్థిక దన్ను -
ముగిసిన చెస్ క్రీడా సంబరాలు
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్ పైన్ స్కూల్లో ఐదు రోజులుగా జరుగుతున్న చదరంగం క్రీడా సంబరాలు శుక్రవారం ముగిశాయి. ఆంధ్రా చెస్ అసోసియేషన్, స్కాట్స్ పైన్ స్కూల్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, గ్రాండ్మాస్టర్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇండియన్ 11వ గ్రాండ్మాస్టర్ తేజస్బక్రి(గుజరాత్) ద్వారా రాష్ట్రంలోని 100 మంది జాతీయ స్థాయి చెస్ క్రీడాకారులకు గ్రాండ్ మాస్టర్ కోచింగ్ ఇప్పించారు. ఈ కోచింగ్కు హాజరైన క్రీడాకారులకు సర్టిఫికెట్లను, మెమెంటోలను అందజేశారు. ముగింపు కార్యక్రమంలో స్కూల్ సీఈవో కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరక్టర్ పి.రేణుక, గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రి పాల్గొన్నారు.దొనబండ వద్ద లారీ బీభత్సందొనబండ(ఇబ్రహీంపట్నం): మండలంలో దొనబండ గ్రామ సచివాలయం సమీపంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న లారీ దొనబండ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ముందుగా రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం నేలకూలింది. అంతటితో ఆగక ముగ్గురమ్మల ఆలయం స్వాగత ద్వారం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సింహం విగ్రహంతో పాటు దిమ్మె పాక్షికంగా ధ్వసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పరిణామాలు చూసిన సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సీ కయాకింగ్ పోటీలు ప్రారంభంమచిలీపట్నంటౌన్: మంగినపూడి బీచ్ వద్ద శుక్రవారం నెలకొన్న ఆహ్లాదకర వాతావరణంలో, సందర్శకుల మధ్య 3వ జాతీయ సీ కయాకింగ్, స్టాండప్ పెడలింగ్ చాంపియన్ షిప్ –2025 పోటీలు వేడుకగా ప్రారంభమయ్యాయి. జాతీయ కయాకింగ్ పోటీలను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ నిర్వాహకులు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొదట 14 ఏళ్ల బాలుర 500 మీటర్ల కయాకింగ్ విభాగంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సౌరబ్ సాహు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన రియాజ్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ వరుసగా తొలి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. బాలికల 14ఏళ్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన చరిత శ్రీ, మహారాష్ట్రకు చెందిన సాయి, ఆంధ్రప్రదేశ్కు చెందిన వర్షిత తొలి మూడు స్థానాల్లో నిలిచారు.యుద్ధప్రాతిపదికన పనులుకొండపల్లి(ఇబ్రహీంపట్నం): రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బుడమేరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్, పులివాగు, బుడమేరు డైవర్షన్ చానల్, శాంతినగర్ వద్ద అభివృద్ధి పనుల ప్రాంతంలో అధికారులతో కలసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఇప్పటికే చేపట్టిన పనులు, వాటిలో పురోగతి, గండ్లు పడిన ప్రాంతాల మ్యాపులు పరిశీలించారు. చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ వెంట ఆర్డీవో కావూరి చైతన్య, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్ మోహనరావు, విజయవాడ డివిజన్ ఈఈ గంగయ్య తదితరులు ఉన్నారు. -
విస్మరించొద్దు!
విస్తరిస్తోంది..క్రమంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులులబ్బీపేట(విజయవాడతూర్పు): ఐదేళ్ల కిందట గడగడలాడించిన కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. నగరంలోనూ పలువురు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రి కోవిడ్ వార్డులో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతుండగా, నిర్ధారణ కాకుండా ఇంకా ఎక్కువ మందే ఉంటున్నట్లు భావిస్తున్నారు. అంతేకాక వేర్వేరు వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలిసింది. వారి మృతికి కోవిడ్ కారణం కాదని వైద్యులు అంటున్నారు. కోవిడ్పై ప్రజలు అప్రమత్తం కాకుంటే మరోసారి దాని ప్రతాపం చూపుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు మృతి.. ● అదుపులో లేని మధుమేహం, రక్తపోటుతో తీవ్రంగా నీరసించిన 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను అడ్మిట్ చేసిన వైద్యులు కోవిడ్ పరీక్ష కూడా చేశారు. ఆ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. కాగా ఆమె పరిస్థితి విషమించి వారం రోజుల కిందట మృత్యువాత పడింది. ● న్యూరో సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం జ్వరం రావడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చింది. అంతేకాక ఐదు రోజుల కిందట అతనూ మృత్యువాత పడ్డాడు. ● గిరిపురానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాస సమస్యతో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అతనిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 7 గంటల సమయంలో మృత్యువాత పడ్డాడు. పెరుగుతున్న బాధితులు.. కోవిడ్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ వార్డులో నలుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. సాధారణ వ్యాధులతో వచ్చిన వారికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. అలా చేస్తున్న వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వస్తోంది. అలాంటి వారిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్కు వస్తున్న రోగులు ఇప్పటికే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ముగ్గురు మృతి ఇతర వ్యాధులతో వచ్చిన వారికి పరీక్ష చేస్తే కోవిడ్ పాజిటివ్ ఏ మాత్రం అప్రమత్తం చేయని ప్రభుత్వం దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం అప్రమత్తత ఏదీ? ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ప్రజలను ఏమాత్రం అప్రమత్తం చేయడం లేదు. అవగాహన కల్పించడం లేదు. దీంతో ప్రజల రద్దీ ప్రాంతాల్లో సైతం మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకరి నుంచి మరొకరికి సోకి తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేక పోలేదని ఒక సీనియర్ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ రక్షణ అవసరం.. ప్రజలు అవకాశం ఉన్నంత వరకూ రద్దీ ప్రాంతాల్లో తిరగడం మానుకోవాలని.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకూ ఎవరితోనూ కరచాలనం చేయవద్దంటున్నారు. ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఎవరిలో అయిన కనిపిస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు ఇంట్లోనే క్వారంటైన్ అవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు. -
రూ.13,500 కోట్ల టర్నోవర్ కేడీసీసీబీ లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. చైర్మన్గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం కేంద్ర కార్యాలయానికి శుక్రవారం ఆయన విచ్చేశారు. బ్యాంకులో ఉన్న వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆయా విభాగాలు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా ఉమ్మడి జిల్లాలో 7,500 డ్వాక్రా సంఘాలకు రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. పదివేల డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతాంగానికి ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు పంట రుణాలను అందజేస్తున్నామని, దీనిని రెండు వేల కోట్లు రూపాయాల వరకు పెంచేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయేతర రుణాలు ఈ ఏడాదిలో రూ.200 కోట్లు వరకు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బంగారు ఆభరణాలపై రూ.900 కోట్లు వరకు రుణాలు ఇచ్చామని, దీనిని రూ.1500 కోట్లు వరకు పెంచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.3,200 కోట్లు వరకు డిపాజిట్లు సేకరించామని పేర్కొన్నారు. దీనిని మరో రూ.500 కోట్లుకు పెంచేలా ఆలోచన చేస్తున్నామని వివరించారు. నెలాఖరులోగా జనరల్బాడీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేడీసీసీ బ్యాంకు సీఈవో ఎ.శ్యామ్మనోహార్, జనరల్ మేనేజర్లు బీఎల్ చంద్రశేఖర్, టి.వీరబాబు, జగ్గయ్యపేట టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు పాల్గొన్నారు. చైర్మన్ నెట్టెం రఘురాం -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ చాంబర్లో కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (సిఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై రూపొందించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా ఈ నెల 30వ తేదీ వరకు కార్మిక, పోలీస్, స్వచ్ఛంద సంస్థలు ,రెవెన్యూ, శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాలని సూచించారు. బాల, కౌమార కార్మిక నిషేధం, నియంత్రణ చట్టం మేరకు 14 సంవత్సరాల లోపు బాలలను, 14 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారిని ప్రమాదకర పనుల్లో పెట్టడం నేరమని స్పష్టం చేశారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో ఉప కార్మిక కమిషనర్ సి.హెచ్.ఆశారాణి, ఐసీడీఎస్ పీడీ డి. శ్రీలక్ష్మీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ యం.రాజేశ్వరరావు, వాసవ్య మహిళామండలి డాక్టర్ వి.కీర్తి, సీఆర్ఏఎఫ్ ప్రతినిధి ప్రభాకర్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సభ్యులు ఎ.రమేష్, సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
దుర్గాఘాట్లో పనులు పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గాఘాట్ శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్ను శుక్రవారం ఈవో శీనానాయక్ తనిఖీ చేశారు. దుర్గాఘాట్ను చూసి భక్తులు కొండపై పరిశుభ్రతను అంచనా వేస్తున్నారని, ఘాట్ ఎంత శుభ్రంగా ఉంటే ఆలయమంత పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఘాట్ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్, సూచిక బోర్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నదిలో భక్తులు సబ్బులు, షాంపులు వినియోగించకుండా చూడాలని తెలిపారు. సబ్బులు, షాంపులు వినియోగించడం వల్ల నదీ జలాలు కలుషితం కావడమే కాకుండా నదిలో జీవరాశులు చనిపోతాయని తెలిపారు. దుర్గాఘాట్లో మైక్ ప్రచార కేంద్రం ఏర్పాటు చేసి, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాకర్లు తమ పరిధి దాటి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టాయిలెట్స్తో పాటు భక్తులు మరుగుదొడ్ల వద్ద కాళ్లు కడిగిన నీళ్లు తిరిగి స్నానఘాట్లోకి చేరకుండా చేపట్టిన పనులను ఏఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈవో శీనానాయక్కు వివరించారు. కృష్ణానది పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కాచవరం(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో కలకలం సృష్టించింది. గురువారం రాత్రి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డులో జరిగిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మృతుడు పడిఉన్న పరిస్థితిని బట్టి హత్య చేసినట్లు స్థానికులు భావించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన నడకుదిటి ఏసుబాబు(28)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమేరాల పుటేజీ పరిశీలించారు. ఏసుబాబు అద్దె గూడ్స్ ఆటో నడుపుతూ జీవిస్తాడు. రాత్రి 11గంటల తర్వాత ఇందిరమ్మ కాలనీ రోడ్డులో ఏసుబాబు నడుచుకుంటూ వెళుతున్నట్లు పోలీసులు సేకరించిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. అ సమయంలో ఏసుబాబును దాటుకుంటూ నలుపు రంగు కారు రోడ్డుపై దూసుకెళ్లింది. కొద్ది నిమిషాల వ్యవధిలో వెనుకకు మళ్లిన నలుపు రంగకారు రోడ్డుపై లైట్లు ఆర్పేసి కొద్దిసేపు ఆగింది. తర్వాత కారు వేగంగా దూసుకుని హైవే వైపు వెళ్లిపోయింది. కారు లైట్లు తీసేసి ఆగిన ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని బట్టి హత్య చేశారనే అనుమానం కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం ఏసుబాబుకు మరో కుటుంబానికి గొడవలు జరిగాయి. పాతకక్షల నేపథ్యంలో హత్యచేసి ఉంటారని చెబుతున్నారు. అయితే పోలీసులు కారు ప్రమాదంలో ఏసుబాబు మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటకు వస్తాయని ప్రజలు, మృతుడి బంధువులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత
పెనమలూరు:యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. క్వారీలోకి ఇసుక మాఫియా ప్రవేశించి విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడంపై వివాదం తలెత్తింది. దీంతో లంక భూముల సొసైటీ సభ్యులకు ఇసుక తవ్వకాలు చేసే మాఫియాకు గురువారం రాత్రి గొడవ జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళాలు వేశారు. యనమలకుదురులో ఇసుక క్వారీని గత 20 సంవత్సరాల క్రితమే నిషేధించారు. ఈ క్వారీ కనకదుర్గ వారధికి కేవలం 2 కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉంది. ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలు చేస్తే వారధికి ప్రమాదం ఉంటుందని ఇసుక తవ్వకాలు అధికారికంగా నిలిపివేశారు. దీంతో యనమలకుదురు ఇసుక క్వారీకి వేలంపాటలు పెట్టలేదు. ఇసుక మాఫియానే అక్రమంగా నదిలోకి ప్రవేశించి తవ్వకాలు చేస్తున్నారు. నిషేధ యనమలకుదురు క్వారీలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు విపరీతంగా చేస్తున్నారు. ఇసుక మాఫియా నదిలోకి చొచ్చుకు పోయి ఇసుక తవ్వకాలు చేయటం పై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద వస్తే నిర్మించిన వాల్కు కూడా ప్రమాదం ఏర్పడే సరిస్థితి ఉంది. అలాగే కనకదుర్గ వారధికి సైతం రక్షణ ఉండదు. ఇక్కడ ఇంత తంతు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాతో అధికారులు చేతులు కలిపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెదపులిపాక ఇసుక క్వారీని మూసివేయటంతో ఇసుక ట్రాక్టర్లు ఒక్కసారిగా యనమలకుదురు క్వారీలోకి వచ్చాయి. సొసైటీ సభ్యులకు ఇసుక మాఫియాకు గొడవలు జరగటంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదం ముదురుతుందని గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళం వేశారు. అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి యనమలకుదురులో ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
యోగా సాధనతో రుగ్మతలు దూరం
పెదపూడి(మొవ్వ):యోగా సాధనతో రుగ్మతలకు దూరంగా ఉండటంతో పాటు మానసిక ఉల్లాసం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. యోగాంధ్ర–2025లో భాగంగా శుక్రవారం ఉదయం మొవ్వ మండలం పెదపూడి గ్రామంలోని జిమ్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కుటుంబసభ్యులతో పాటు స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో పాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ఆసనాలు వేసే విధానాన్ని చూపుతూ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వారి చేత యోగాసనాలు వేయించి యోగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలను కూచిపూడి నృత్య ఆకృతిలో కూర్చోబెట్టి ఆసనాలు నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. తాను నిత్యం యోగా సాధన చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకున్నానని వెల్లడించారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ యోగా విశిష్టతను గ్రహించానని, ఇక నుంచి ప్రతిరోజు సాధన చేస్తానన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగ అతి ప్రాచీనమైన విద్య అని వివరించారు. రోజూ యోగా సాధన కోసం కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అనంతరం యోగా శిక్షకులు, కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు, నాట్య గురువు డాక్టర్ వేదాంత రాదే శ్యామ్ తదితరులను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు. స్టాల్ ప్రారంభం... కూచిపూడి గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించడంలో భాగంగా, గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు కూచిపూడి నాట్యకళకు అవసరమైన నాట్య వస్త్రాలు, గజ్జెలు, జడలు, గిల్టు నగలు తదితర వస్తువులను తయారు చేసి జిమ్ ప్రాంగణంలో ప్రదర్శనగా ఉంచిన స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి వారితో ముచ్చటించారు. తయారు చేసిన వస్తువులను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ను కోరారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏపీ పర్యాటక శాఖ ఏడీ లజ్వంతి నాయుడు, ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేలా షారోన్, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి.రామలక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో విమాదేవి, ఆయుష్ తదితర శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
ముండ్లపాడు క్రాస్రోడ్స్(పెనుగంచిప్రోలు):రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్రోడ్స్ వద్ద చోటు చేసుకుంది. గొల్లపూడి నుంచి పెళ్లి సరుకులతో వెళ్తున్న ట్రాలీ ఆటో జాతీయ రహదారిపై నుంచి పెనుగంచిప్రోలు వెళ్లేందుకు సర్వీసు రోడ్డులోకి తిరుగుతుండగా వెనుక నుంచి తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆటో పల్టీ కొట్టగా కారు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మంగళగిరికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ జానీ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్, కూకట్పల్లికి చెందిన విష్ణుబొట్ల శంకర్ భార్య ఇద్దరు పిల్లలకు ఎటువంటి గాయాలు కాలేదు. కారులో వారు సీటు బెల్టు పెట్టుకోవటంతో పాటు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. -
కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి
కంచికచర్ల: అనుమానాస్పదస్థితిలో లారీ యజమాని కృష్ణానది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్లకు చెందిన దేవిరెడ్డి నాగరాజు (41)లారీలు నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఇతరుల వద్ద కొంత అప్పుగా తీసుకుని లారీలు కొనుగోలు చేశాడు. చేసిన అప్పులు తీరతాయోలేదోనని మనస్తాపం చెంది సూసైడ్ నోటు రాసుకుని మరీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో గురువారం దూకాడు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను పిలిపించి కృష్ణానదిలో నాగరాజు కోసం వెతుకులాట ప్రారంభించారు. రాత్రి సమయం కావటంతో తిరిగి శుక్రవారం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సేపటి తర్వాత నాగరాజు మృతదేహం లభ్యమయింది. ఆ మృతదేహాన్ని కంచికచర్ల స్వగృహానికి తీసుకువచ్చారు. కంచికచర్ల పోలీస్స్టేషన్లో సూసైడ్ నోట్ ప్రకారం నాగరాజు తమ్ముడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నాగరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్బాబు, దేవరకొండ గురవయ్య, కాలవ పెదబాబు తదితరులు ఉన్నారు. బీటెక్ ఎనిమిదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించిన బీటెక్ ఎనిమిదో సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. 204 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీవీ బ్రహ్మచారి పాల్గొని ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను ( www.kru.ac.in) వెబ్సైట్లో పొందుపరచినట్లు తెలిపారు. -
హైడ్రా తరహాలో బుడమేరు ఆపరేషన్ నిర్వహించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ౖహెదరాబాద్ హైడ్రా తరహాలో నగరంలో బుడమేరు ఆపరేషన్ చేపట్టాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని కోరుతూ ఈ నెల 14న నిరసన దీక్ష చేపట్టాలని సమావేశం తీర్మానించింది. గాంధీనగర్ రామా ఫంక్షన్ హాల్లో శుక్రవారం సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ బుడమేరును అమలు పరచాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గతేడాది బుడమేరు వరదల వల్ల విజయవాడ పట్టణంతో సహా పలు గ్రామాలు, పంట పొలాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని నిర్ణయించిందని, కానీ ఏడాది కావస్తున్నా ఆచరణకు నోచుకోలేదన్నారు. బుడమేరు డైవర్షన్ కాల్వ మరమ్మతులు అరకొరగా చేపట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరారు. విశ్రాంత ఇరిగేషన్ అధికారి కంభంపాటి పాపారావు మాట్లాడుతూ బుడమేరు వరద నివారణకు శాశ్వతమైన పరిష్కారాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పైభాగాన అవసరమైన జలాశయాలు నిర్మించి వరద ముంపును కొంతమేరకు తగ్గించే వీలుంటుందని చెప్పారు. రాయనపాడు నుంచి గుంటుపల్లి మీదుగా కృష్ణానదికి మరొక డైవర్షన్ చానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇఫ్టూ నాయకులు ప్రసాధ్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య,విద్యార్థి, యువజన, మహిళా, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
ప్లేస్మెంట్స్లో సత్తా చాటిన కేఎల్ విద్యార్థులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో 100 శాతం ప్లేస్మెంట్స్ రికార్డు సాధించామని చెప్పారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155 కు పైగా కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారని పేర్కొన్నారు. 450 కి పైగా జాతీయ కంపెనీలు, 50 కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎంహెచ్ ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి పాల్గొన్నారు. -
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపునిచ్చారు. ప్రంపచ పర్యవవరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం విజయవాడ డివిజన్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేట్టారు. ఈ సందర్భంగా అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వచ్చంద సంస్ధల వలంటీర్లతో కలసి డీఆర్ఎం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా బ్యానర్లు, ప్లాకార్డులతో క్లాక్ టవర్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫాం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ వెయిటింగ్ హాల్ వద్ద పర్యావరణ హానికర ప్రభావాలను కళ్లకు కట్టినట్టుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ప్రదర్శన ఆలోచింపజేసింది. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు. అనంతరం కృష్ణా కెనాల్లోని శిక్షణ కేంద్రంలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిషోర్, సీనియర్ డీఈ ఎస్.వరుణ్బాబులను ఆయన అభినందించారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ -
రసవత్తరం... చదరంగ సమరం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా చెస్ అసోసియేషన్, స్కాట్స్ పైన్ స్కూల్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చదరంగం క్రీడా సంబరాలు గురువారం రసవత్తంగా సాగాయి. రాష్ట్రంలోని 100 క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్లుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన ఉచిత గ్రాండ్ మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఈ నెల రెండో తేదీన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఇండియా 11వ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రి (గుజరాత్) ఒకే సారి 100 మంది క్రీడాకారులతో చదరంగం క్రీడలో పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వరామంగా ఈ పోటీ కొనసాగింది. టాప్ రేటింగ్ క్రీడాకారులు కొల్ల భావన్(ఎన్టీఆర్ జిల్లా), కె.సందీప్ (కృష్ణా జిల్లా), సి.హెచ్.అనయ్య (రాజమండ్రి), వి.హర్షవర్ధన్ (నంద్యాల)తో పాటు 1600 నుంచి 1800 లోపు రేటింగ్ ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనటంతో పోటీ హోరాహోరీగా సాగింది. చదరంగ క్రీడాకారులను తయారు చేసేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న ఆంధ్రా చెస్ అసోసియేషన్ను, సహకరిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని బక్రి అభినందించారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి సాయిపావని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ పాల్గొన్నారు. -
కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెల్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కిలేశపురం వద్ద నందిగామ నుంచి మచిలీపట్నం వెళ్తున్న కారును ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని కారు ఢీకొట్టడంతో రెండు వాహనాల మద్య కారు ఇరుక్కు పోయింది. కారులో ఉన్న నందిగామకు చెందిన ఆదిశేషు, పుష్పావతి వారి కుమారుడు సాయి శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమార్తె హర్షిత, డ్రైవర్ రాంబాబుకు పెద్దగా గాయాలు కాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. బస్సును పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన మూడు బైకులను బస్సు డ్రైవర్ ఢీకొట్టి మరో ప్రమాదానికి కారణమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘హద్దులు’ దాటుతున్న దందా..
ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్లకు అనుమతులున్నారు. అయితే పార్లమెంటు ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కాసరబాద, కంచికచర్ల మండలం వేములపల్లి రీచ్ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలంలో ఆలూరుపాడులో ఇసుక రీచ్ సైతం ఈయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఈ ఇసుక రీచ్లను తన కనుసన్నల్లో ఉంచుకొని, లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. భారీగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ‘చినబాబు’ అండదండలు ఉండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. పేరుకే ప్రభుత్వం ఉచిత ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యునికి అందుబాటులో లేదని, ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కంకిపాడు లాకులను పరిశీలించిన ఇంజనీర్ల బృందం
కంకిపాడు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజనీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్ను సందర్శించింది. ఇరువురు ఈఈల నేత్వత్వంలో పది మంది ఇంజనీర్ల బృందం కంకిపాడు లాకులు, అనుబంధ కాలువల లాకులు, గేట్లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించారు. లాకులు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నట్లు బృందం నిర్ధారించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాకులు నమూనాలను రూపొందించి పంపుతామని వెల్లడించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కాలువల పరిస్థితి, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పరిశీలనలో ఇరిగేషన్ శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, మచిలీపట్నం డీఈ అపర్ణ, కంకిపాడు ఏఈ టీ.నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేడీసీసీబీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ (కేడీసీసీ) బ్యాంక్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన నెట్టెం రఘురామ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన కేశినేని శివనాధ్ మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ పదవి ఆయనకు అలంకారం మాత్రమేనని, ఎందుకంటే గతంలోనే ఎన్నో పదవులు నిర్వర్తించి వివాద రహిత వ్యక్తిగా నిలిచారని అన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో బ్యాంక్ను మరింత వృద్ధిలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్రావు, శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు, నాగుల్మీరా తదితరులు పాల్గొని నెట్టెం రఘురామ్ను అభినందించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘరామ్ మాట్లాడతూ బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ -
తవ్వుకో తమ్ముడూ!
● ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆగని ఇసుక దందా ● లారీకి రూ.10వేలు కడితేనే లోడింగ్ ● నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దోపిడీ ● తెలంగాణకు అక్రమంగా తరలింపు ● పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరుల అండతోనే అంతా ● పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు ● ఇసుక దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత ఇసుక పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఇసుక రీచ్లను గుప్పెట్లో పెట్టుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇసుక రీచ్లో లారీకి రూ.7 నుంచి రూ.10 వేలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తున్నారు. లారీకి 40 టన్నుల చొప్పున ఇసుకను ఓవర్ లోడ్ చేసి తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రోజుకు వందల లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ జిల్లా సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీకి మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు దగ్గరుండి పచ్చ జెండా ఊపుతున్నారు. రీచ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని, టోల్గేట్ల వద్ద నిఘా పెట్టామని అధికారులు గొప్పలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే, ఇవన్నీ బూటకపు మాటలేనని స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్లు ఉన్నా ప్రాంతాల ప్రజలను ఎవ్వరినీ కదిపినా అక్కడ జరిగే దందాను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. పేరుకు ఉచిత ఇసుక అని చెప్పడం తప్ప, రీచ్ వద్ద మాత్రం వారి చెప్పినంతా డబ్బు కట్టాల్సిందేనని వివరిస్తున్నారు. లేకపోతే వారికి ఇసుక లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు వాపోతున్నారు. కొంత మంది ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కదారిలో పక్క రాష్ట్రానికి.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంత ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం తదితర ప్రాంతాల్లో రూ. 75వేలు ఉండగా హైదరాబాద్లో రూ. లక్ష వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.. ఆపేదెవరూ.. అడ్డొచ్చేదెవరు?కృష్ణా జిల్లాలో అడ్డూ అదుపూ లేకుండా.. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇక్కడ ఉన్న రీచ్లను కూటమి ప్రజా ప్రతినిధులు పంచుకున్నారు. పెనమలూరులోని చోడవరం రీచ్ నుంచి అనధికారికంగా నియోజక వర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. లారీ లోడింగ్కు రూ.8వేలకు పైగా వసూలు చేస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధి, రోజుకు వందల లారీలను పోర్టు పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకోవడం గమనార్హం. పామర్రు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్ వచ్చింది. ఈ రీచ్ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 300కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్లన్నింటినీ పచ్చనేతలు తమ కనుసన్నల్లో ఉంచుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీంతో పాటు చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను తరలిస్తున్నారు. -
జిల్లాలో 2.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవం సందర్భంగా 2.60 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతో కళకళలాడుతూ జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు కారణం వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని సూచించారు. భూమిపైనే కాక భవనాలపై మిద్దెతోటలను పెంచితే నగరాన్ని కాలుష్యం కోరలు నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. మొక్కలు నాటి సంరక్షించేందుకు ముందుకు వచ్చే ప్రతిఒక్కరికీ అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. ర్యాలీలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, సేఫ్ ఎన్విరాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధి ఏలూరి లీలా కుమారి, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
వక్ఫ్ భూములకు న్యాయం జరిగేనా..?
పెనమలూరు: కొండపల్లి ఖాజీకి చెందిన వక్ఫ్ భూములకు మోక్షం లభిస్తుందనే ఆశతో ముస్లిం మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. గత 25 ఏళ్లుగా వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేసిన ఆక్రమణదారులు నయాపైసా కౌలు చెల్లించక పోవటంతో పేద ముస్లింల సఃక్షేమం జరగలేదు. సుదీర్ణ పోరాటం తరువాత ఈ నెల 11వ తేదీన వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయనున్నారు. కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇనామ్ భూములు వక్ఫ్ పరిధిలో ఉన్నాయి. పెదపులిపాక గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 12.59 ఎకరాలు, తాడిగడప గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 79లో 13.41 ఎకరాలు, 173లో 4.08 ఎకరాలు, 176లో 12.92 ఎకరాలు కలిపి మొత్తం 43 ఎకరాలు భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో భూముల ధర రూ.300 కోట్లకు పై మాటే. 43 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారు ఖాజీకి గాని, వక్ఫ్ బోర్డుకు గాని నయాపైసా కౌలు చెల్లించలేదు. దీంతో పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. దీనిపై వక్ఫ్ బోర్డు, కొండపల్లి ఖాజీ పోరాట బాట పట్టారు. హైకోర్టు కూడా వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయాలని ఆదేశించింది. వేలం నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులు జాప్యం చేశారు. చివరకు ప్రభుత్వం కూడా ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించే యత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూములకు కౌలు వేలంపాట నిర్వహించనున్నారు. వేలం నగదు రూపంలో ముందుగానే చెల్లించాలి. పాటదారులు రూ 50 వేలు డిపాజిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్రమణదారుల చెరలో భూములు న్యాయం కోసం ఎదురు చూస్తున్న పేద ముస్లింలు ఈ నెల 11వ వేలం పాట -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జే.జ్యోతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సిహెచ్.వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.బాస్కెట్బాల్ పోటీల విజేత కృష్ణా బాలికలుచిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు. బాలురు విభాగంలో అనంతపురం జట్టు విన్నర్గా, చిత్తూరు రన్నర్గా నిలవగా మూడవ స్థానంలో తూర్పుగోదావరి జట్టు నిలిచింది. అదే విధంగా బాలికల విభాగంలో కృష్ణా విన్నర్స్గా, తూర్పు గోదావరి రన్నర్స్గా, మూడవ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఏపీ బాస్కెట్బాల్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, తదితరులు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. -
ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం మండప పూజలు, మూలమంత్ర హవనం, అధివాసాలు వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం నవగ్రహ ప్రతిష్ట నిమ్తితం అవసరమైన యంత్రాలను ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మల్లేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు రాగా, కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో 7–52 గంటలకు నవగ్రహ పునఃప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట జరిగింది. అనంతరం నూతన యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ. ప్రసాద్, కోట ప్రసాద్ , మల్లేశ్వర శాస్త్రిలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణ జరిగాయి. శుక్రవారం నుంచి నవగ్రహ మండపంలోని భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. -
జీవనోపాధి అవకాశాల మెరుగునకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యాచరణపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్ర శక్తి, సీఐఎఫ్, ముద్ర, పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్లి అర్హులు తగిన వ్యాపారాలు చేసుకునేలా బ్యాంక్ లింక్డ్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఆయా పథకాలకు గుర్తించిన లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు వ్యాపార మెలకువలపై శిక్షణ ఇవ్వాలని, ఉత్పత్తుల విక్రయానికి మార్గాలు చూపాలని, ఆన్లైన్ వ్యాపారంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో మహిళ తరఫున ఆమె భర్త లేదా కుమారుడు వ్యాపారం చేసుకునేందుకు ముందుకొచ్చినా పరిగణనలోకి తీసుకొని సహకారం అందించాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు అవగాహన కల్పించాలని, వారి ఎదుగుదలతో ఇతరులకు ఉపాధి కల్పించిన వారవుతారని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారి చిననరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్ బాబు, మత్స్యశాఖ అధికారి నాగరాజు, పలువురు ఏపీ ఎంలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
బందోబస్తును పకడ్బందీగా నిర్వర్తించండి
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కోనేరుసెంటర్: మసూల బీచ్ ఫెస్టివల్ బందోబస్తును సమర్థంగా, పకడ్బందీగా నిర్వర్తించి పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి బుధవారం ఆయన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బీచ్ అవుట్ పోస్టు పోలీస్స్టేషన్ వద్ద బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ ముగింపు వరకు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జనం భారీగా తరలివస్తారని ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రీడా పోటీలకు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు హాజరవుతారని, వారి రాకపోకలకు, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఆ దిశగా బందోబస్తును నిర్వర్తించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పాయింట్లలో ఉంటూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో ఉన్న సిబ్బంది వచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసేలా చూడాలని, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. మద్యం దందాలో ఆరితేరిన వ్యాపారులు కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని పెద్దఎత్తున మచిలీపట్నంకు దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని బార్లు, వైన్షాపుల్లో బహిరంగంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మచిలీపట్నంలో నాన్డ్యూటీ పెయిడ్ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని బ్రాండ్లకు సంబంధించి మద్యం ధరలు మన రాష్ట్రంలో కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన సీసాలు దింపుకొని విచ్చలవిడిగా విక్రయాలు జరిపేస్తూ ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు బందరు నియోజకవర్గంలో 9 రెస్టారెంట్ అండ్ బార్లు, తొమ్మిది వైన్షాపులు ఉన్నాయి. ఇటీవల బందరు మండలం సుల్తానగరంలోని ఓ వైన్షాపుపై ఎకై ్సజ్ అధికారులు దాడి చేసి ఎన్పీడీ బాటిళ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. కానీ అధికారులు అధికార పార్టీ నేతలకు భయపడి అవి వైన్షాపునకు సమీపంలోని ఓ బెల్టుషాపులో దొరికినట్టు చిత్రీకరించి కేసు నమోదు చేసి చూపించారు. అందుకు షాపు యజమాని నుంచి ఎకై ్సజ్ అధికారులకు భారీగా మామూళ్లు అందినట్లు సమాచారం. మరో ఘటనలో నగరంలోని ఓ జనసేన నాయకుడికి సంబంధించిన బార్లో అర్ధరాత్రి అమ్మకాలు జరుగుతుండగా నైట్రౌండ్స్లో ఉన్న ఓ పోలీసు అధికారి రైడ్ చేసి దాదాపు 250కి పైగా సీసాలను పట్టుకున్నట్లు సమాచారం. అయితే సదరు బార్ యజమాని సంబంధిత పోలీసుస్టేషన్కు ఇచ్చే నెలవారీ మామూళ్లను అందరి ఎదుట ఎండగట్టటంతో పాటు జనసేన పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడితో ఫోన్ చేయించి బాటిళ్లు పట్టుకున్న అధికారిని గజగజలాడించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక ఆ అధికారి అర్ధరాత్రి అమ్మకాలు జరుపుతున్నట్లు కేసు నమోదుచేసి పట్టుకున్న బాటిళ్లు మొత్తం బార్లోకి పంపినట్లు మద్యం వ్యాపారులు చెప్పుకుంటున్నారు. ఈ కేసుకు సంబంఽధించి సంబంధిత అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం లేకపోలేదు. గత సోమవారం విజయవాడకు చెందిన స్పెషల్ టీంలు మచిలీపట్నంలోని బస్టాండ్ సెంటర్, విజయవాడ రోడ్డులోని బార్లపై దాడులు చేసి చివరికి ఏమీ లేవని తేల్చి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే సదరు షాపుల్లోనూ ఎన్పీడీ బా టిళ్లను గుర్తించిన అధికారులు పెద్ద మొత్తంలో సంచులు అందుకుని ఆ రెండు బార్లకు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి నట్లు తెలుస్తోంది. 300కు పైగా బెల్టు షాపులు బందరు నియోజకవర్గంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బార్, వైన్షాపులతో పాటు దాదాపు 300కు పైగా బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం. సదరు బెల్టుషాపులకు ఎన్పీడీ బాటిళ్లను సరఫరా చేసి బెల్టుషాపు నిర్వాహకుల ద్వారా వ్యాపారులు అమ్మిస్తున్నారు. అలా పట్టణంతో పాటు పల్లెల్లోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఏరులై పారుతోంది. ఇదంతా ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి నెలా లక్షల్లో ముడుపులు మచిలీపట్నంలోని మద్యం దుకాణాల్లో జరి గే అక్రమ మద్యం అమ్మకాల వైపు చూడకుండా ఉండేందుకు బందరు సిండి‘‘కేటు’’లు సంబంధిత అధికారులకు లక్షల్లో పారితోషికాలు అందజేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఎన్పీడీ అమ్మకాలతో పాటు సమయ పాల నతో సంబంధం లేకుండా చేసుకునే వ్యాపారానికి అడ్డురాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఎకై ్సజ్ శాఖకు ఒక్కో దుకాణం తరఫున రూ.20,000 చొప్పున అన్ని షాపులకు సంబంధించి నెలకు రూ. 3,60,000, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఒక్కో దుకాణం తరపున రూ.8,000 చొప్పున రూ.1,44, 000, ఇతర సిబ్బందికి రూ.6,000 చొప్పున రూ.1,06,000 ముట్టజెబుతున్నట్లు సిండికేట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అడ్డగోలు అమ్మకాలతో జనం ధనం దోపిడీ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు దిగుమతి బార్లు, వైన్షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ విక్రయాలు మామూళ్ల మత్తులో జోగుతున్న ఎకై ్సజ్ అధికారులు మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో మద్యంమాఫియా పేట్రేగిపోతోంది. మన రాష్ట్రం నుంచి అందుతున్న మద్యం చాలదన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుని మరీ అమ్ముకుంటోంది. సామాన్యుడిని మద్యం మత్తులో ముంచి మద్యం మాఫియా, ఎకై ్సజ్ అధికారులు కలసి కోట్లు కొల్లగొడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. -
ఇంతకూ బీచ్ ఫెస్ట్ నేటి నుంచా..రేపటి నుంచా?
మంగినపూడి బీచ్ ఫెస్ట్ ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండు విధాలుగా ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్లో బీచ్రోడ్లో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి బీచ్ఫెస్ట్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విడుదల చేస్తున్న ప్రకటనలు, కరపత్రాల్లో ఈ నెల 5వ తేదీ గురువారం నుంచే ప్రారంభమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుదాం అనుకునే వారు ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండుగా పేర్కొంటుండటంతో గందరగోళ పడుతున్నారు. –మచిలీపట్నంటౌన్ -
విరివిగా మొక్కలు నాటాలి
చిలకలపూడిమచిలీపట్నం): విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా 2.92 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఇరువురు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న నర్సరీల నుంచి వివిధ రకాల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నర్సరీ నుంచి 7 వేల మొక్కలు, పెడన మండలంలోని నందమూరు నర్సరీ నుంచి 40 వేలు, సరుగుడు మొక్కలు 1.5 లక్షలు, గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం నర్సరీ నుంచి 50 వేలు, గూడూరు మండలం గూడూరు నర్సరీ నుంచి 10 వేల మొక్కలు అందిస్తామన్నారు. జూన్ 5వ తేదీ నుంచి జరగనున్న మసుల బీచ్ ఫెస్టివల్ ఉత్సవాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా గుడ్డతో తయారు చేసిన సంచులను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ షాహిద్ బాబు, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, పశుసంవర్థక శాఖ అధికారి చిన నరసింహులు, మచిలీపట్నం, గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జి.కొండూరు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లికి చెందిన వీసా రాజేష్(26) గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన రాజేష్, తిరుగు ప్రయాణంలో మైలవరం వైపు వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జి.కొండూరు శివారులోకి రాగానే 30వ నంబరు జాతీయ రహదారిపై గేదెను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ని జి.కొండూరు పోలీసులు 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ బుధవారం ఉదయం మృతి చెందాడు. చీకట్లో గేదె కనిపించక... రహదారిపై గేదెను భారీ వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి చెంది రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో అటుగా బైకుపై వస్తున్న రాజేష్కు రోడ్డుపై మృతి చెందిన గేదె చీకట్లో కనిపించక ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి వీసా భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
ఎన్డీయే కూటమి మార్కేది
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించారు. ప్రజా సంక్షేమాన్ని గాడిలో పెట్టి అనేక సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఫీజులు అందించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. కాని నేడు ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రజా సంక్షేమ మార్కు అనేది కనిపించడం లేదు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితి. – ఎండీ ఖాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ పెడన -
పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ
పామర్రు: బీసీ సంక్షేమ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోరల్ అధికారి జి.రమేష్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీఓను అనుసరించి వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల బదిలీలకు అర్హత గల వారి వివరాలను గత నెల 30న జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. వార్డెన్లు బదిలీలపై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అదే విధంగా కొందరు మహిళా వార్డెన్ల్పై బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమాచారం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని పేర్కొన్నారు. -
అంకితబావంతో పని చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఆమె చాంబర్లో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో విధి నిర్వహణలో పని చేస్తూ అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వాటిని భర్తీ చేశామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులను పారదర్శకంగా ఇచ్చి, వారు కోరిన ప్రాంతాలకు బదిలీ చేశామని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా ఏడుగురికి, సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఏవోలుగా ఇద్దరికి నియామక పత్రాలు అందజేశామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జెడ్పీ సీఈవో ఎ.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్.సి. ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో పనిచేయాలి.. చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ నియామక పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం రాత్రి అందజేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖలలో 8 మందికి జూనియర్ అసిస్టెంట్లుగాను, ఇరువురికి ఆఫీసు సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంకితభావంతో అప్పగించిన విధులను నిర్వర్తించి పనిచేస్తున్న శాఖలలో అధికారుల మన్ననలను పొందాలని వారికి కలెక్టర్ సూచించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవీఓ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -
ఎగనామం
సూపర్ సిక్స్కు సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో ఇళ్ల స్థలాల సాధన కోసం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారం దక్కిన తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారన్నారు. సొంత అజెండాతో పాలన సాగిస్తూ పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. మాట మార్చడం చంద్ర బాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. – గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) -
వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి అరాచకాలతో సాగింది. ఎటు చూసినా మోసం.. కుడి ఎడమల దగా అన్నట్లుగా పాలకుల తీరు నడిచింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలతో ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఏ విద్యార్థి కనిపించినా తల్లికి వందనం కింద...‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ వేలు పెట్టి మరీ చూపించి ఆశలు రేపారు. ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైన తీరు, ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ బుధవారాన్ని ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించి.. నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. సిగ్గులేని ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగేసేందుకు సమాయత్తమైంది. –8లోuచిలకలపూడి(మచిలీపట్నం)/అవనిగడ్డ:జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక దోపిడీకి కూటమి నాయకులు తెరలేపారు. దీంతో పాటు మట్టి తవ్వకాలపై దృష్టి సారించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ వనరులను అక్రమంగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మరో పక్క జిల్లాలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. మద్యం దుకాణాల ఏర్పాటులో కూటమి నాయకులకు పెట్టుబడులు లేకుండా వాటాలు తీసుకోవటం.. ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. హామీలపై గాలి మాటలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు తేవటంతో పాటు నిధులు కేటాయించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన బందరు పోర్టు నిర్మాణాన్ని కూడా వారి ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2026 నాటికి పోర్టు పనులు మేమే పూర్తి చేస్తామని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. దీంతో పాటు మచిలీపట్నం నగరంలోని డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పిన నాయకులు నేడు ఆ హామీని మరచి సంబరాలు చేసుకునేందుకే ప్రాధాన్యత నిస్తున్నారు. మసులా బీచ్ ఫెస్టివల్ పేరుతో దోచుకునేందుకు తెరలేపారు. 22ఏ నిషేధిత భూముల సమస్య మళ్ల్లీ మొదటికి.. గతంలో ఆనాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు చొరవతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిష్కరించిన 22ఏ నిషేధిత భూముల సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. గతంలో చంద్రబాబు హయాంలో తలెత్తిన ఈ సమస్యను జగన్మోహన్రెడ్డి పరిష్కరించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లా చుక్కెట్టారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో 17వేల మంది రైతు కుటుంబాలు చేతిలో లక్షల ఖరీదు చేసే పొలాలున్నా అవసరాలకు అక్కరకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను దున్నేస్తున్నా పట్టించుకోలేదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోపిదేవి మండలంలోని పలు ప్రాంతాల్లో పండించిన పంటను కొనే నాథుడు లేక క్యాబేజీ పంటను రైతులు దున్నేశారు. బజ్జీ మిర్చి, టమాటాను కోసి రహదారుల పక్కన పారబోశారు. గత ఖరీఫ్లో పండించిన ధాన్యంను కొనే దిక్కులేక రహదారుల వెంట రోజుల తరబడి పడిగాపులు పడ్డారు. మంత్రి నాదెళ్ళ మనోహర్ హామీ ఇచ్చినా లంకపల్లిలో నెలరోజులకు ధాన్యం కొనుగోలు చేయక కొంతమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుమొండి వారధి ఊసేలేదు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ వారఽధి కోసం రూ.108 కోట్లు నాబార్డు నిధులు మంజూరవ్వగా అప్పటికే పార్టీ మారే ఉద్దేశం ఉన్న బాలశౌరి ఎక్కడ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు పేరొస్తుందని దానిని అడ్డుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎదురుమొండి వారధి నిర్మాణం వెంటనే చేపడతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఈ వారధి ఊసే ఎత్తకపోవడం పట్ల దీవుల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే గత ఏడాది వచ్చిన వరదలకు నాలుగు సార్లు ఎడ్లంక కాజ్వే రహదారి కొట్టుకుపోయినా పట్టించుకున్న పాపాన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. న్యూస్రీల్సూపర్సిక్స్ అంటూ అరచేతిలో వైకుంఠం ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఓటు వేసిన ప్రజానీకానికి వెన్నుపోటు కూటమి మోసాలను ఎండగడుతూ నేడు వైఎస్సార్సీపీ నిరసన జిల్లా వ్యాప్తంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహణకు ఏర్పాట్లుఎడతెగని వంచనఏడాది పాలన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పర్యవేక్షణలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వ నయవంచన పాలనపై వినతి పత్రాలు అందజేయనున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పార్టీ కన్వీనర్ పేర్నికిట్టు నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన పట్టణంలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకూ తరలి వెళ్లనున్నారు. నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కన్వీనర్ సింహాద్రి రమేష్ నేతృత్వంలో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో గడివాడ పట్టణంలోని ఎన్జీవో హోం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. పామర్రు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ కన్వీనర్ కై లే అనిల్కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లనున్నారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడులో కల్యాణ మండపం నుంచి పార్టీ కన్వీనర్ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. -
11న వక్ఫ్ భూములకు కౌలు వేలం
పెనమలూరు: మండల పరిధిలోని వక్ఫ్ భూములకు ఈ నెల 11వ తేదీన కౌలు వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వక్ఫ్ భూములపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో కొండపల్లి ఖాజీ సర్వీసుకు చెందిన వక్ఫ్ భూములు వివిధ సర్వే నంబర్లలో 43.23 ఎకరాల సాగు భూమి ఉంది. చాలా కాలంగా ఈ భూములకు కౌలు వేలం నిర్వహించలేదు. కొందరి కబంధ హస్తాల్లో ఈ భూములు చిక్కుకుపోయాయి. అదేవిధంగా కౌలు సొమ్ము కూడా వక్ఫ్ బోర్డుకు చెల్లించలేదు. హైకోర్టు ఆదేశించినా కౌలు వేలం నిర్వహించడానికి అధికారులు జాప్యం చేశారు. చివరకు ఈనెల 11న తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలకు వక్ఫ్ భూముల కౌలు వేలం నిర్వహిస్తామని తహసీల్దార్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాత ఇనుప సామగ్రి దగ్ధం
నందిగామ టౌన్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో పాత ఇనుప సామగ్రితోపాటు ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నందిగామలో మంగళవారం జరిగింది. పట్టణంలోని యాదవ బజార్లో తమ్మిశెట్టి యలమందయ్య తన ఇంటి వద్దే పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్ మీటరు బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా విద్యుత్ తీగలు దగ్ధమవటంతో భవనం మొదటి అంతస్తులో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, దట్టంగా పొగలు కమ్మి, మంటలు ఎగసిపడటాన్ని గమనించారు. వెంటనే కిందకు వచ్చి అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కంచికచర్ల అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది నరసింహారావు తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం దేవస్థానం రూ.8 లక్షలతో గాలిగోపురం వద్ద స్టేర్ లిఫ్ట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆలయ ఇంజినీరింగ్ అధికారుల అల సత్వం కారణంగా నాణ్యత లేని స్టేర్ లిఫ్ట్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. 15 రోజుల కిందట అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామంటూ టెక్నికల్ సిబ్బంది స్టేర్ లిఫ్ట్ను తీసుకెళ్లారు. అయితే ఇంత వరకు ఆ లిఫ్ట్ సంగతిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగుడి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆ దివ్యాంగ భక్తుడిని వీల్చైర్పై అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు. ఆలయంలోకి వెళ్లాలంటే గాలి గోపురం వద్ద మెట్లు దిగాల్సిందే. అక్కడ స్టేర్ లిఫ్ట్ లేకపోవడంతో వీల్చైర్పై వచ్చిన ఆ దివ్యాంగుడిని ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది, సేవా సిబ్బంది నలుగురు కలిసి మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. కనీసం ఇటువంటి వారిని చూసేనా ఆలయ అధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో మునిసిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాల ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం గోవధ నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీపీఓ పి.లావణ్యకుమారి, గో సంరక్షణ సమితి ఐకాస సభ్యులు తోట సురేష్, నాగలింగం శివాజి, పోతురాజు వినోద్రాజ్ పురోహిత్, గోవిందసాబు, మిరి యాల శ్రీనివాసరావు, బాలకృష్ణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
యోగాతో శ్రామికుల్లో నూతనోత్సాహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం శారీరక శ్రమ చేసే కార్మికుల్లో యోగా సాధన నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, కార్మిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల థీమ్ యోగాసనాల కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆశారాణి, వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ కార్మికులతో కలిసి యోగ సాధన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రోగాలబారిన పడకుండా ఉండటంతో పాటు మానసికంగా నూతన ఉత్తేజాన్ని పొందేందుకు యోగాను మించి దివ్య ఔషధం మరొకటి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు యోగాసనాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్య నారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు. -
దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేమని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కల్పించేందుకు కర్నాటకలో వీర రత్న ఫౌండేషన్ను స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీర నారీమణులను చైతన్యవంతులను చేసే అవగాహన కార్యక్రమాన్ని విజయవావడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు కావాల్సిన వనరులను అందించి, వారి కుటుంబాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు వీర రత్న ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. సైనికుల పిల్లల చదువు, ఆరోగ్యం, ఇతర విషయాల్లో సహాయ, సహాకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ అర్చన చక్రవర్తి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి -
4.5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
అవనిగడ్డ: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో పలుసార్లు అక్రమ రవాణాదారులను పట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దందా యథాతథంగా సాగుతోంది. అవనిగడ్డలో మంగళవారం తెల్లవారు జామున 4.5 టన్నులు రేషన్ బియ్యాన్ని ఎస్ఐ శ్రీనివాస్ పట్టుకున్నారు. తెల్లవారు జాము 4.30 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా, రాజీవ్ గాంధీ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో నివసించే కూతాడి వెంకన్నకు చెందిన వాహనంలో 2.50 టన్నులు, అవనిగడ్డలో నివసించే కోసూరు రాజారావుకు చెందిన వాహనంలో రెండు టన్నులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం వచ్చిన సంచులను వచ్చినట్టుగానే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. కనీసం సంచులు కూడా మార్చకుంగా రవాణా చేస్తున్నారంటే అక్రమ దారులు ఎంత ధీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. -
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. బాపట్ల జిల్లా, బాపట్ల మండలం గుడిపూడికి చెందిన వెంపరాల ఆంజనేయులు (45), వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు(డ్రైవర్) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు కిలేశపురం వద్ద అదుపుతప్పి ముదువెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ముందుసీటులో కూర్చున్న వెంపరాల ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రెండు 108 అంబులెన్సులు, ఒక హైవే టోల్గేట్ అంబులెన్స్లో విజయ వాడ వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకరు మృతి, మరో నలుగురికితీవ్ర గాయాలు తిరుపతమ్మ దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం -
ఏసీబీకి చిక్కిన డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
చిలకలపూడి(మచిలీపట్నం): డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంగళవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు కథనం మేరకు.. మచిలీపట్నం నగరానికి చెందిన శ్రీజ టింబరు డిపో యాజమాని వి.రవీంద్రనాథ్ టింబరు డిపో రెవెన్యూవల్ కోసం రెండు నెలల కిందట ఆటవీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించి రెన్యూవల్ చేయాలంటే రూ.25 వేల లంచంగా ఇవ్వాలని ఆటవి శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.జయప్రకాష్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం రెన్యూవల్కు దర ఖాస్తు చేశానని, రూ.25 వేలు ఇవ్వలేనని రవీంద్ర నాథ్ తేల్చిచెప్పాడు. దీంతో రెన్యూవల్ చేసేందుకు జయప్రకాష్ ససేమీరా అన్నారు. చివరకు రూ.18 వేల లంచం ఇచ్చేలా రవీంద్రనాథ్ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం జయప్రకాష్ తనను లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులను రవీంద్రనాథ్ ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రవీంద్రనాథ్ రూ.18 వేలను నగరంలోని ఆనందపేటలో ఉన్న ఆటవీశాఖ కార్యాలయంలో జయప్రకాష్కు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న ఏసీబీ అధికారులు జయ ప్రకాష్ చేతిలో నగదు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయప్రకాష్ చేతి వేలిముద్రలు, నగదు నోట్లుపై ఉన్న వేలిముద్రలు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. జయప్రకాష్పై 2017లో ఆటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్న సమయంలో ఏలూరులో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని, ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. టింబరు డిపో రెన్యూవల్ కోసం రూ.18 వేల లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
గుడివాడటౌన్: ప్రతి రోజు యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారన్నారు. ఎంతో విశిష్ఠత కలిగిన యోగాపై నేటి యువతకు అవగాహన కల్పించాలని చెప్పా. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాల సుబ్రహ్మణ్యం, డీఎస్పీ ధీరజ్ వినీల్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
శాతవాహన కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ శాతవాహన కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా)ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. గతంలో చేసిన ప్రయత్నాలను ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాల వల్ల వెనక్కు తగ్గాడన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆలపాటి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందువల్ల శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఆలపాటిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ.. విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎమ్మెల్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడం సిగ్గుచేటు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించినా పోలీసులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజాపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి ఆలపాటి రాజాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆలపాటి రాజాపై చర్యలు తీసుకోకపోతే శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తామని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. ఐద్వా నగర కార్యదర్శి సరోజ, నగర కమిటీ సభ్యులు షకీలా, ఆశ, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార స్వామి, కార్యదర్శి మాధవ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సభ్యురాలు ఇజ్ఞాడ లక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి విద్యార్థి, మహిళా సంఘాల డిమాండ్ -
ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ
మీ కోసంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని, ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను సామరస్యంగా ఆలకించిన ఆయన పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. 38 అర్జీలు అందజేత.. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కోసంకు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉంటారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని బాధితులు సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లలోనూ తమ సమస్యలను వివరించి, న్యాయం పొందవచ్చని చెప్పారు. అలాగే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. తన దృష్టికి అవినీతి ఆరోపణలు వస్తే తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవనిగడ్డకు చెందిన ఓ వివాహిత వివాహ సమయంలో తల్లిదండ్రులు తనకు కొంత వ్యవసాయ భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా అన్నదమ్ములు ఇప్పుడు ఆ భూమి తమదంటూ అడ్డు పడుతున్నారంటూ వాపోయింది. అదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయింది. న్యాయం చేయాలని కోరింది. అలాగే మచిలీపట్నంకు చెందిన మరో వ్యక్తి తన పొలం సరిహద్దుదారుడు తరుచూ తనతో గొడవలు పడుతూ మానసికంగా హింసిస్తున్నాడని, చెప్పలేని పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నాడని అతనిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాని కోరాడు. మొత్తం 38 అర్జీలు మీ కోసంలో అందాయి. -
బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా సీ్త్ర, పురుషుల జట్లను నూజివీడులోని వీటీహెచ్ మైదానంలో సోమవారం ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ తెలిపారు. పురుషుల జట్టుకు జి.నాగబాబు, ఎస్కే యాసిన్, ఎ.తేజ, బి.సంజయ్శ్రీనివాస్, మహిళల జట్టుకు బి.ప్రభుదీపిక, షేక్ అస్రా, బి.ప్రణవి, బి.కుసుమ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. ‘ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారా ?’ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్ఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి, ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందన్నారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరిపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, భవనాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నొవేషన్ హబ్ పనులను త్వరగా పూర్తి చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రామవరప్పాడు: స్టార్టప్లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇందుకు సంబంధించి స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టాటా ఇన్నొవేషన్ హబ్– స్పొక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులో భవనాన్ని సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హబ్కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి. సుగుణ, ఆర్ అండ్బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
పమిడిముక్కల: మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు ధ్వంసమైంది. కొడాలి నాగేంద్రబాబు అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తుండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని నాగేంద్రబాబు తెలిపాడు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పార్టీ నాయకులతో కలిసి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటంబాన్ని పరామర్శించి, నష్టం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అధైర్యపడవద్దని ఆదుకొంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పారదర్శకంగా క్రీడా కోటా అమలు శాప్ చైర్మన్ రవినాయుడు విజయవాడస్పోర్ట్స్: మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు శాప్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఉద్యోగానికి అర్హత కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు నష్టపోకుండా నిష్పక్షపాతంగా, అవినీతికి తావులేకుండా ఎంపిక జరగాలన్నారు. మెగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఫేక్ సర్టిఫికెట్లు ఎరవేసి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కల్పిస్తూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసి క్రీడా సంఘాల ప్రతినిధులు లక్షలు కాజేస్తున్నారని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నా, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాప్ ఏవో ఆర్.వెంకటరమణ, టీఎస్వో ఎస్.వి.రమణ, స్పోర్ట్స్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీలు వేణు, మల్లేశ్వరిభాయ్ పాల్గొన్నారు. స్పైసెస్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కొరిటెపాడు(గుంటూరు): ఎగుమతులు, విలువ జోడింపు – రైతు సాధికారతను పెంచడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్పైసెస్ బోర్డు స్పైసెస్డ్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోందని స్పైసెస్ బోర్డు డీడీ ఆనంద్ దేవ్ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పైసెస్ బోర్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ‘ఎగుమతి అభివృద్ధి కోసం ప్రగతిశీల, వినూత్న, సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో స్థిరత్వం’ అనే ప్రధాన పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. స్థిరత్వం, ఆవిష్కరణ, ఎగుమతి అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భారతీయ సుగంధ ద్రవ్యాల రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మే 26వ తేదీ నుంచి ప్రారంభమైందని, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారుల కోసం స్పైస్డ్ పథకం యొక్క ఎగుమతి అభివృద్ధి, ప్రమోషన్ భాగాల కింద దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వాటాదారులు www.indianspices. com ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు. -
ఎస్ఎన్ పురం మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మించడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ జీఎస్ రాజు రోడ్డులో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ను సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణ.. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ అన్ని వసతులు, ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడల్ పోలీస్స్టేషన్ను తన చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీసులు ముందున్నారని, టెక్నాలజీ ద్వారా నేరాలకు ఏపీలో అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. హాట్ స్పాట్లు ఎక్కువగా ఉన్న విజయవాడ లాంటి చోట పటిష్టమైన భద్రత అవసరమని, ఎన్టీఆర్ జిల్లా డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో జిమ్, యోగా రూమ్ కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. గంజాయి నిర్మూలనలో ఈగల్ టీమ్ పనితీరు బాగుందని.. శాంతిభద్రతలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటేనే నేరాలు అదుపులో ఉంటాయని చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సత్యనారాయణపురాన్ని మోడల్ పోలీస్స్టేషన్గా నిర్మించి ప్రారంభించామన్నారు. ఆధునిక టెక్నా లజీ పరిజ్ఞానంతో నేరం జరిగిన 24 గంటలలోపే నేరస్తుడిని పట్టుకునేలా కమిషనరేట్ పని చేస్తోందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు వేలాది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, ఇందుకు సహకరిస్తున్న ప్రజలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మె ల్యే బొండా ఉమా, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట హోం శాఖ మంత్రి అనిత -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల 11వ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. రన్నర్స్ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఈ పోటీలలో పురుషుల వ్యక్తిగత చాంపియన్షిప్ను ఎం.శరత్ (ఎన్టీఆర్ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్ జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఓబుల్రెడ్డి, వెంకట్రామ్మోహన్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్చాంప్ ఎన్టీఆర్ జిల్లా రన్నర్స్గా కర్నూలు జిల్లా -
రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
మోపర్రు(పెదపారుపూడి): రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధైర్యపడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. మండలంలోని మోపర్రులో బుడమేరు వరదలకు వన్నేరు డ్రెయిన్కు పడిన గండ్లను ఆయన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి సోమవారం పరిశీలించారు. కొన్ని నెలల కితం వచ్చిన బుడమేరు వరదలకు మురుగునీరు సరిగా ముందుకు పారక వన్నేరు డ్రెయిన్ కట్టలు తెగిపోవటంతో పంటలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయామన్నారు. మరలా అలాంటి నష్టం వాటిల్లకుండా కాలువ కట్టలను బలోపేతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన డ్రెయిన్ మరమ్మతుల కోసం ఏఏ నిధులు అందుబాటులో ఉన్నాయో జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి, గండ్లను పూడ్చడంతో పాటు గండ్ల బలోపేతానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు లేవు.. ప్రభుత్వ రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ బాలాజీకి ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ఈఈ కిరణ్, తహసీల్దార్ వై.రంగారావు, రైతులు పాల్గొన్నారు. -
బదిలీల్లో గందరగోళ పరిస్థితులు తొలగించాలి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్ప్లస్ ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు ఇప్పుడే సర్దుబాటు చేసి, క్రమబద్దీకరించిన ఖాళీల జాబితాను విడుదల చేయాలని కోరామన్నారు. పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి సర్ప్లస్ టీచర్లను అధికారులు ఫోన్లు చేసి దరఖాస్తుకు ఒత్తిడి చేయటం సరికాదన్నారు. పీఎస్ హెచ్ఎంకు వెళ్లాల్సిన టీచర్ల జాబితాను సబ్జెక్ట్ పరంగా విడుదల చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫర్స్ సీనియారిటీ జాబితాలు పుట్టిన తేదీ ఆధారంగా తయారు చేశారని, బదిలీల జీఓ ప్రకారం సీనియారిటీ ఆధారంగా తయారు చేయాలని కోరామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పీఎస్ హెచ్ఎం(ఉర్దూ) పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందుగానే గ్రోవియన్స్ పరిష్కరించి ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జయ ప్రకాష్, జైగం అబ్బాస్ పాల్గొన్నారు. -
నేలతల్లికి గర్భశోకం
ఆదాయ వనరుగా ఇసుక గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక కావా ల్సినంత దొరికేది. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద లారీలతో ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. – షేక్ పీర్సామియా, పండ్ల వ్యాపారి, పెండ్యాల, కంచికచర్ల మండలం రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువులు, కుంటల మట్టిని కూటమి నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో లోతుగా మట్టిని తవ్వి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. గతంలో ఇటువంటి గోతులు తీయటం వల్ల ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టడంలేదు. – కందుల అశోక్కుమార్, రైతు, పేరకలపాడు, కంచికచర్ల మండలం అధికారులకు పట్టడంలేదు క్వారీల్లో బిహార్, తమిళనాడు, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలు అధికంగా వాడటం వల్ల బ్లాసింగ్ సమయంలో కార్మికులు మృతి చెందుతున్నారు. వారి కుటుంబాలకు క్వారీ నిర్వాహకులు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. – కోట కల్యాణ్, వ్యవసాయ, కార్మిక సంఘ ఎన్టీఆర్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శికంచికచర్ల: అధికారం అండతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రకృతి సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక మాటున మాఫియాను నడిపిస్తున్నారు. ఒక్క ఇసుకే కాదు, మట్టి, కంకర ఇలా ఏ ఒక్క దానినీ వదలకుండా యథేచ్ఛగా దోచేస్తూ నేల తల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. ఎక్కడ ప్రకృతి సంపద కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి దోపిడీ పర్వానికి బాటలు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ పర్వం కొనసాగుతుండటంతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. కళ్లముందే అక్రమాలు జరుగు తున్నా దృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. అధికారుల నుంచి కనీస చర్యలు కూడా కనిపించకపోవడంతో ప్రజాప్రతినిధుల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు సైతం పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక దందా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఎంత కావాలన్నా లభించేది. ఇసుక ధరలు సైతం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేవి. దీంతో ప్రతి ఒక్కరూ సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించటంలేదు. పేరుకు ఉచిత ఇసుక అయితే పేదలకు మాత్రం దొరకడంలేదు. ఇసుక రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిపోతోంది. నో చలానా.. ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచ రులు ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని బహిరంగంగా చెబుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆ ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ల నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీలను యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. కంచికచర్ల మండలం దొనబండక్వారీ నుంచి కంకరను తరలిస్తున్న లారీ ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు తెగబడుతున్న ‘పచ్చ’ మాఫియా సహజ సంపదను నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్న వైనం ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా దోపిడీ పర్వం ఈ అక్రమాలను పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందుబాటులో ఇసుక ప్రకృతి సంపదను దోచేస్తున్న కూటమి గద్దలు -
నాలుగు నియోజకవర్గాల్లో మట్టి మాఫియా
ప్రకృతి సంపదలో ఒకటైన మట్టిపై కొంతమంది టీడీపీ నేతల కన్నుపడింది. చెరువులు, కుంటలను ఎంచుకుని రాత్రి వేళల్లో పొక్లెయిన్లతో లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు ఆ మట్టిని ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్ల మెర కకు తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పొలాలను మెరక చేసుకునేందుకు రైతుల నుంచి వసూలు చేసి మట్టిని అమ్ముతున్నారు. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పేరకలపాడు, గండేపల్లి, పరిటాల, గొట్టుముక్కల చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు, జయంతి, చట్టన్న వరం తదితర గ్రామాలు, మైలవరం నియోజక వర్గంలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్మహ్మద్పేట, పెనుగంచిప్రోలు మండలం, వత్సవాయి మండలం, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
క్వారీల్లో కంకర స్వాహా
ఎన్టీఆర్ జిల్లాలో రాతి క్వారీల్లో విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో దాదాపు 154 రాతి క్వారీలు, 97 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని కొండల్లో అక్రమంగా కంకరను తవ్వుతు న్నారు. క్వారీల సమీపంలో సాగర్ కాలువలను సైతం కబ్జా చేసి రోడ్లు వేసుకుని రాతి క్వారీల గుత్తేదారులు రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమంటే అమరావతి నిర్మాణానికి కంకర ఎంతో అవసరం కాబట్టే తామంతా వ్యాపారం చేస్తున్నామని బహిరంగంగా చెప్పుకొంటున్నారు. కంకర తీసే సమయంలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు కనీసం ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించటంలేదు. అధిక మొత్తంలో పేలుడు పదార్థాలు ఉపయోగించటం ద్వారా క్వారీల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటు న్నారు. కార్మికుల ప్రాణాలు పోగొ ట్టుకుంటున్న సమయంలో వారి కుటుంబాలకు క్వారీల నిర్వాహకులు ఎంతో కొంత ముట్టజెప్పి పోలీసు కేసులు కాకుండా చూసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు రాతి క్వారీల నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని అక్రమ తవ్వకాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. -
ట్రాఫిక్ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్ సోమవారం స్పోర్ట్స్ షూ, మాస్క్లు, హ్యాండ్ గ్లౌజులను అందజేశారు. సీ్త్ర శక్తిని ప్రోత్సహించే సదుద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఏడీసీపీ తెలిపారు. 33 మంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ వస్తువులను అందజేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి నలు గురి ప్రాణాలు కాపాడిన నలుగురు కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి.రామ చంద్రరావు, సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జేసీగా ఇలక్కియ బాధ్యతల స్వీకారంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎస్.ఇలక్కియ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానన్నారు. తాను గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్కు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎస్ఓ ఎ.పాపారావు, గ్రామ/వార్డు సచివా లయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎస్.శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలి చిలకలపూడి(మచిలీపట్నం): తమకు కేటాయించిన విధులను అధికారులు బాధ్యతతో నిర్వహించి మసూల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జేసీ గీతాంజలిశర్మతో కలిసి అధికారులతో మంగినపూడి బీచ్ ఫెస్టివల్పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. మెప్మా పీడీ పి.సాయిబాబు నోడల్ అధికారిగా, వేదిక వద్ద డ్వామా పీడీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లా పంచాయతీ అధికారి, బందరు మునిసిపల్ కమిషనర్ సమన్వయం చేసుకో వాలని సూచించారు. ఆహారపు స్టాళ్లు ఏర్పాటు చేసేవారు అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేశారు. బీచ్ ఫెస్టివల్ వద్ద అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్ వద్ద వీఐపీలకు గ్రీన్రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూంను బందరు ఆర్డీఓ పర్యవేక్షించాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరం నుంచి మంగినపూడి బీచ్ వరకు ఉచిత బస్సులను నడిపాలని, అవి బయలుదేరే వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ కె.స్వాతి, మెప్మా పీడీ పి.సాయిబాబు పాల్గొన్నారు. -
ప్రలోభాలు, బెదిరింపులతో గట్టెక్కిన టీడీపీ
తిరువూరు: ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో ఫ్యాను గుర్తుపై గెలిచిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్న తిరువూరు నగర పంచాయతీలో 17 మంది వైఎస్సార్ సీపీ సభ్యులే. చైర్ పర్సన్ కస్తూరిబాయి పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్కు చైర్పర్సన్గా అవకాశం కల్పించడానికి కౌన్సిలర్లు ఏకగ్రీ వంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే నెల 19న చైర్పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తదనుగుణంగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు ప్రలోభా లకు గురిచేసి ముగ్గురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పారు. అప్పటికీ వారికి బలం సరిపోకపోవడంతో ఎన్నిక ప్రక్రియకు విఘాతం కలిగించారు. ఎన్నికను సైతం వాయిదా వేయించగలిగారు. మర్నాడు మే 20వ తేదీన జరగాల్సిన చైర్పర్సన్ ఎన్నికను సైతం టీడీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌన్సిలర్లకు రక్షణ కల్పించి వారిని చైర్పర్సన్ ఎన్నికకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. రెండో రోజు కూడా చైర్పర్సన్ ఎన్నిక జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో తిరువూరు చైర్పర్సన్ ఎన్నిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల కొనుగోలుతో నెగ్గిన కూటమి పంతండబ్బు ఎరచూపి... వాయిదా పడిన చైర్పర్సన్ ఎన్నికను సోమవారం నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత వారం రోజులుగా టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మళ్లీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకోగలిగారు. అతి బలవంతం మీద వైఎస్సార్ సీపీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ కౌన్సిలర్లతో కలిపి 10 మంది, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకోగలిగారు. -
ఉచిత ఇసుక పేరుతో చోటా నాయకుల దందా
కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. అధికార పార్టీ చోటా నాయకులకు ఈ పథకం మంచి ఆదాయ వనరుగా మారింది. కృష్ణానది, మున్నేరు, ఇతర ఉపనదుల్లో ఉచిత ఇసుక పేరుతో పగలు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇసుకను కూటమి నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నందిగామ మండలం కంచలవద్ద వర్షాకాలం కోసం నిల్వచేసిన ఇసుక -
జీవితంలో యోగా భాగం కావాలి
ఏపీ జెన్కో ఎండీ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం: యోగా మన భారతదేశ పౌరుల వారసత్వ సంపదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఆయుష్, పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా ఔత్సాహికులు యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్బాబు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారాలు చేసినట్లు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ.. డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లా లక్ష్యంగా ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఈగల్ ఎస్పీ ఎన్.నగేష్బాబు, ఇతర అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు (1972 టోల్ ఫ్రీ నంబర్) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివరామాంజనే యులు, యోగాంధ్ర నోడల్ అధికారులు ఎం.సుహాసిని, శిల్ప, వి.రాణి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణ జరిగాయి. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు, ఉభయదాతలు భుజం పట్టారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హోరాహోరీగా తైక్వాండో పోటీలు విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నగరంలోని ఆంధ్రా లయోల కాలేజీలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కాలేజీ వ్యాయామ విద్యా అధ్యాపకులు మహ్మద్ ఇబ్రహీం ప్రారంభించారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ సీ్త్ర, పురుషు విభాగాల్లో ఈ పోటీలు అత్యంత రసవత్తరంగా జరిగాయి. వయసు విభాగాల వారీగా జరిగిన ఈ పోటీల్లో 94 మంది విజేతలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని, ఈ జట్లు ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం కార్యదర్శి ఎం.అంకమ్మరావు తెలిపారు. నేడు చైర్పర్సన్ ఎన్నిక తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం జరగనుంది. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి ఎన్నిక జరుపుతారు. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో జరగనున్న ఎన్నికలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యాలయ పరిసరాల్లో జన సంచా రం నిషేధించడంతో పాటు అన్ని మార్గాల్లో బారికేడ్లు కట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఏసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో సీఐ గిరిబాబు, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడస్పోర్ట్స్: కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జ్యోతిప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిగోపాల్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సంఘ ఎన్నికలు సంఘం కార్యదర్శి సైకం రామ్ప్రసాద్ పర్యవేక్షణలో జరిగాయి. టెన్నిస్బాల్ క్రికెట్ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆర్.డి.ప్రసాద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బి.మెహర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.జగదీశ్వరరావు, ఎస్.కె.నబి, ఆర్.అప్పలస్వామి, సీనియర్ సహాయ కార్యదర్శులుగా ఎస్.కృష్ణప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా ఎ.శివగణేష్బాబు, జి.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.కోటేశ్వరరావు, వి.రాజు, ఆర్.శివయ్య, పి.చంద్రమణిని సభ్యులు ఎన్నుకున్నారు. -
స్వావలంబనకు ‘ఆర్థిక’ ఆయుధం..
వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా కృష్ణాజిల్లాలో 90,057 మంది లబ్ధిదారులకు రూ. 135.09 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 31,906 మంది లబ్ధిదారులకు రూ. 47.85 కోట్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 58,095 మంది లబ్ధిదారులకు రూ. 87.14 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 56,898 మంది లబ్ధిదారులకు రూ. 85.35 కోట్లు నగదు జమ చేశారు. కనిపించని స్వావలంబన.. స్వలాభమే అంతా.. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం లేదు. ప్రతి మహిళకు రూ.1500 నెలకు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ఉచిత బస్సు ప్రయాణం హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను అందజేసే విధంగా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాలో సరిగా జమ కావటం లేదని వారే వాపోతున్నారు. -
బాధ్యతగా మొక్కలు నాటుదాం
చల్లపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకువచ్చి పర్యావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా వ్యవహరించాలని విజయవాడకు చెందిన వైద్యుల బృందం పేర్కొంది. 30 మందితో కూడిన ఎన్విరాన్మెంటల్ హెల్త్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(ఫాగ్సి) బృందం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొంది. 216 జాతీయ రహదారికి ఇరువైపుల, జంక్షన్ పాయింట్లో మొక్కలు నాటారు. వైద్యులు మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను స్వచ్ఛ రథసారఽథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు వివరించారు. -
ఉపాధ్యాయులకు బలవంతపు బదిలీలు!
పీఎస్ హెచ్ఎంలుగా దరఖాస్తు చేయాలని ఎస్ఏలకు ఒత్తిడి మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు చేసేందుకు సిద్ధమైంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పీహెచ్సీ, విడోవర్స్, డైవోర్స్ టీచర్ల పట్ల అన్యాయం జరుగుతోంది. తాజాగా 2023లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందిన టీచర్లను బలవంతంగా బదిలీకి దరఖాస్తు చేయమని జాబితా విడుదల చేసింది. ఈ టీచర్లను సర్ప్లస్, రీ–అపార్షన్లో చూపించలేదు. వీరికి బదిలీలతో సంబంధమే లేదు. అయినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం మేరకు స్కూల్ అసిస్టెంట్లను హఠాత్తుగా ప్రైమరీ స్కూల్(పీఎస్) హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి చేయాలన్న యత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బదిలీల ప్రక్రియ సంబంధించి స్పష్టమైన విధానం లేదని, బలవంతపు నిర్ణయాలు తీసుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. దరఖాస్తు చేయాల్సిందే.. తప్పనిసరిగా పీఎస్ హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కోసం దరఖాస్తులు చేయాలని స్కూల్ అసిస్టెంట్లను ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి కష్ణాజిల్లాలో పీఎస్ హెచ్ఎం పోస్టులకు సబ్జెక్టుల వారీగా 65 ఎస్ఏ తెలుగు, 01 ఎస్ఏ ఉర్దూ, 44 ఎస్ఏ ఇంగ్లిష్, 52 ఎస్ఏ గణితం, 13 ఎస్ఏ పీఎస్, 18 ఎస్ఏ బీఎస్, 37 ఎస్ఏ ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్లు పీఎస్ హెచ్ఎం పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు జిల్లాలో మొత్తం 19 ఖాళీలు గుర్తించారు. అందులో జెడ్పీ/ఎంపీ పాఠశాలల్లో 06 ఎస్ఏ గణితం, 10 ఎస్ఏ సోషల్, మునిసిపల్ పాఠశాలల్లో 01 ఎస్ఏ గణితం, 01 ఎస్ఏ సోషల్, ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో 01 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. పీఎస్ హెచ్ఎం వెబ్ ఆప్షన్స్ ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా.. ఉమ్మడి కృష్ణాలో స్కూల్ అసిట్టెంట్లకు.. లోకల్ బాడీస్ పాఠశాలల్లో 270 బయోలాజికల్ సైన్స్, 293 సోషల్, 521 గణితం, 8 స్పెషల్ ఏడు ఎడ్యుకేషన్, 153 ఫిజికల్ ఎడ్యుకేషన్, 317 ఫిజికల్ సైన్స్, 348 తెలుగు, 299 హిందీ, 387 ఇంగ్ల్లిష్, 4 సంస్కృతం పోస్టులు గుర్తించారు. మునిసిపల్ పాఠశాలల్లో 6 బయోలాజికల్ సైన్స్, 5 సోషల్, 10 గణితం, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్, 6 ఫిజికల్ సైన్స్, 5 తెలుగు, 7 హిందీ, 8 ఇంగ్ల్లిష్, 01 నో సబ్జెక్ట్ పోస్టులు.. మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 37 బయోలాజికల్ సైన్స్, 35 సోషల్, 57 గణితం, 17 ఫిజికల్ ఎడ్యుకేషన్, 42 ఫిజికల్ సైన్స్, 20 తెలుగు, 35 హిందీ, 51 ఇంగ్ల్లిష్, 2 సంస్కతం, 38 నో సబ్జెక్ట్ పోస్టులు గవర్నమెంట్ పాఠశాలల్లో 10 బయోలాజికల్ సైన్స్, 13 సోషల్, 19 గణితం, 1 స్పెషల్ ఎడ్యుకేషన్, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్, 16 ఫిజికల్ సైన్స్, 7 తెలుగు, 3 హిందీ, 10 ఇంగ్ల్లిష్, 1 సంస్కృతం, 1 ఉర్దూ పోస్టులకు ప్రొవిజషనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. వెబ్ ఆప్షన్స్ను పీఎస్ హెచ్ఎం బదిలీల ప్రక్రియ అనంతరం ప్రారంభించనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)కు.. సంబంధించి లోకల్ బాడీస్ పాఠశాలల్లో 2,433, ప్రభుత్వ 11, మునిసిపల్ పాఠశాలల్లో 55 పోస్టులకు ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. -
‘డ్వాక్రా’కు భరోసా..
డ్వాక్రా సభ్యులకు ఆర్థిక చేయూతను అందించాలని వారు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీతో పాటు రుణమాఫీ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత సున్నా వడ్డీ, జగనన్న తోడు పథకాల ద్వారా వారికి ఆర్థ్ధిక చేయూతను అందించారు. ఈ మూడు పథకాల ద్వారా కృష్ణాజిల్లాలో 1,35,745 మందికి గత ఐదేళ్లలో రూ. 135.75కోట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,45,685 మంది లబ్ధిదారులకు రూ. 464.16కోట్లు అందజేశారు. అన్నింటా మొండిచెయ్యి.. డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పి ఇంత వరకు వారికి ఎటువంటి ఆర్థిక ఆసరాలు ప్రకటించలేదు. గతంలో డ్వాక్రా గ్రూపులను తామే ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు డ్వాక్రా మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు. -
సొంతింటి కల సాకారం..
మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో కృష్ణాజిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో 90,504 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,14,969 మందికి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. వీరికి ప్రత్యేకంగా కాలనీలను ఏర్పాటు చేసి వారికి అన్నిమౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అప్రోచ్రోడ్డులతో పాటు అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. అంతా మాయ.. తాను అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లపట్టాలు అందజేస్తామని ప్రతి ఒక్కరికీ మూడు సెంట్లు భూమిని ఇస్తామని చెప్పి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏడాది పాలన దగ్గరకావస్తున్నా చెప్పిన హామీని అమలు చేయకుండా వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే పాలన ఇప్పటి దాకా కొనసాగించారు. -
5న పెడనలో జాబ్మేళా
పెడన: ఈనెల 5వ తేదీన పెడన బొడ్డునాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. జాబ్మేళా గోడపత్రికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.కార్పొరేషన్ కో ఆర్డినేటర్ వంగా బాబు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, బిఫార్మసీ పూర్తి చేసినవారు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్నంబర్లు 8897772488, 9966489796, 9989519495 సంప్రదించాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభంమచిలీపట్నంటౌన్: మచిలీపట్నంలోని 37వ డివిజన్ రాజుపేట చెక్కలమేడ సెంటర్లో ఉన్న 7వ నంబర్ చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీని మంత్రి రవీంద్ర ఆదివారం పునఃప్రారంభించారు. కార్డుదారులకు ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అదేప్రాంతానికి చెందిన వృద్ధులు బోయిన సుశీల, గొడవర్తి మహాలక్ష్మి ఇళ్లకు వెళ్లి వారికి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. డిఎస్ఓ పార్వతి, డీఎం శిరీష, ఆర్డిఓ కే స్వాతి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ కౌన్సిలర్ రాయపూడి చిన్ని, తహసిల్దారు పి.మధుసూదన్రావు, డీలర్ సైకం సాంబమూర్తి పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియనుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూతన వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతోపాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉదయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి భక్తుల తాకిడి కొంత కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అంతరాలయ దర్శనం రద్దు -
క్రీడాకారుల్లో శక్తి, యుక్తికి యోగా సరైన మార్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రీడాకారులు పోటీల్లో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన శక్తితోపాటు యుక్తికి యోగా దోహదపడుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారుల థీమ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, జూడో, కబడ్డీ, నెట్బాల్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, హాకీ, టేబుల్ టెన్నిస్, హ్యాండ్బాల్, రెజ్లింగ్ విభాగాల క్రీడాకారులు, జిమ్ ట్రైనర్లు, యోగా ఔత్సాహికులు కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈసందర్భంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ యోగాసనాలను ప్రతి ఒక్కరూ నేర్చుకొని జీవితాంతం ఆచరించడం ద్వారా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్లోనూ ప్రతిరోజూ ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా క్రీడాకారులతో యోగాసనాలు సాధన చేయడం ఆనందంగా ఉందన్నారు. యోగా సాధనను ఏదో ఒక రోజుకు పరిమితం చేయకుండా తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు వీలుంటుందని ఽకమిషనర్ వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర -
మట్టి కోసం బరి తెగింపు!
జి.కొండూరు: ప్రకృతి కరుణించినా టీడీపీ నాయకుల దుర్మార్గపు చర్యల కారణంగా సాగునీరు అందడం కష్టమేనన్నట్లు తయారైంది మైలవరం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి. అధికార టీడీపీ నేతల ధనదాహం రైతుల పాలిట శాపంగా మారింది. పొలాలకు మెరక పేరుతో రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు రావుల చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్న టీడీపీ నాయకులు..చివరికి చెరువులోకి నీరు రాకుండా లాకులను సైతం ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాల కోసం చెరువులోని కొద్దిపాటి నీటిని సైతం తూముల నుంచి బయటకు పంపించడంతో వారి ధనార్జన పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సాగు కష్టమే జూన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో మరో వారంరోజుల్లో నారుమళ్లను సిద్ధం చేసేందుకు రైతులు సన్నాహలు చేస్తున్నారు. ఈ క్రమంలో రావుల చెరువులో నీరు లేకపోగా చెరువులోకి వచ్చే నీటిని కూడా అక్రమార్కులు అడ్డుకున్న వైనం తెలిసి, నీరు లేకపోతే నార్లు పోయడం కూడా దండగేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాఫ్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. చెరువును నింపేందుకు తాము లాకులను దించినప్పటికీ అక్రమార్కులు వాటిని పదే పదే తొలగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టకపోతే ఆయకట్టు పరిధిలోని 650 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జువ్వి చెరువును గుల్లచేశారు.. ఇదే గ్రామంలో ఉన్న జువ్వి చెరువును టీడీపీ నాయకులు గుల్ల చేశారు. ముగ్గురు రైతులకు పొలాల మెరకపేరుతో 3,100 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలింపునకు అనుమతులు పొంది పదివేల క్యూబిక్ మీటర్ల మట్టిని బట్టీలకు తరలించారు. ఈసారి ఏకంగా రైతుల ముసుగులో బట్టీలను నిర్వహిస్తున్న వ్యక్తుల పేరుతో అనుమతులు పొంది రావుల చెరువు నుంచి భారీస్థాయిలో మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యారు. అనుమతులు తీసుకొచ్చి మట్టి అక్రమరవాణాకు అండగా నిలిచినందుకుగానూ ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టికి రూ.200 కమిషన్ రూపంలో బట్టీల నిర్వహకుల నుంచి టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే చర్చ సాగుతోంది. అక్రమార్కుల చేస్తున్న మట్టి దందాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి రావుల చెరువు నుంచి అక్రమంగా సాగుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నాగులూరు రావుల చెరువులోకి నీరు రాకుండా అడ్డుకున్న టీడీపీ నాయకులు లాకులు సైతం ధ్వంసం పొలాల మెరక పేరుతో అనుమతులు.. ఇటుక బట్టీలకు మట్టి తరలింపు నిద్రనటిస్తున్న అధికారులు ఖరీఫ్ సాగు కష్టమేనంటున్న రైతులు టీడీపీ నేతల అరాచకం.. రెడ్డిగూడెం మండలం నాగులూరులోని రావుల చెరువు 111ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద నాగులూరు, మైలవరం మండల పరిధిలోని కీర్తిరాయినిగూడెం, తోలుకోడు గ్రామాలకు చెందిన 650 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈ చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్థానిక టీడీపీ నాయకులు పథకం రచించారు. అందులోభాగంగా గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు పొలాల మెరక పేరుతో 11,600 క్యూబిక్ మీటర్ల మట్టి అంటే 4,640 ట్రాక్టరు ట్రక్కుల మట్టిని తరలించేందుకు ఇరిగేషన్శాఖ నుంచి అనుమతులు పొందారు. ఈ క్రమంలో రెండురోజులపాటు మట్టిని తరలించిన అనంతరం వర్షం పడటంతో ప్రస్తుతం మట్టి రవాణాను నిలిపివేశారు. అయితే వర్షం కారణంగా ఎగువన చెరువులు నిండి కోతుల వాగు నుంచి ఊట వస్తోంది. ఈ ఊట రావుల చెరువులోకి వెళ్లేందుకు చెరువు సమీపంలో లాకులు ఉన్నాయి. చెరువులోకి కోతులవాగు నుంచి నీరు వస్తే మట్టి తవ్వకాలకు అడ్డంకిగా మారుతుందని భావించిన టీడీపీ నాయకులు, లాకులను వారే ధ్వంసం చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎన్టీఆర్ జిల్లాకు ఓవరాల్ చాంపియన్ షిప్
విజయవాడస్పోర్ట్స్: 11వ జాతీయ అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 16గోల్డ్, 10 సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్తో అత్యధికంగా 116 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫిని కై వసం చేసుకున్నారు. విజయవాడ క్రీడాకారులు ఎం.శరత్, కె.సాన్వి, యు.ప్రేమామృత వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను ఏపీ అమెచ్యూర్ అక్వాటిక్ సంఘం చైర్మన్ కె.రవికాంత్, అధ్యక్షులు ఎం.ఓబుల్రెడ్డి, కార్యదర్శి ఎ.మోహన్వెంకట్రామ్, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రమేష్, కృష్ణాజిల్లా సంఘం అధ్యక్షకార్యదర్శులు డి.భాస్కర్, వి.వినోద్ అభినందించారు. -
అల్యూమినియం తీగ అపహరణ
తోట్లవల్లూరు: విద్యుత్ తీగల దొంగలు చెలరేగిపోతున్నారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసే అల్యూమినియం తీగలను సైతం చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత నెలలో చాగంటిపాడు వద్ద రూ.4.50 లక్షల అల్యూమినియం తీగల దొంగతనాన్ని మరువక ముందే మళ్లీ బొడ్డపాడు, వల్లూరుపాలెం లైన్లో తీగల చోరీ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వల్లూరుపాలెం సబ్స్టేషన్ నుంచి బొడ్డపాడు, చినపులిపాక గ్రామాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కో అధికారులు కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతనెల 28రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 స్తంభాల మధ్యలో వేసిన నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన అల్యూమినియం తీగను అపహరించారు. దీని విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అల్యూమినియం తీగల చోరీ ఘటనపై కాంట్రాక్టర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసింది. -
బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీ చైతన్య వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పెండ్యాల నారాయణ, మదుగురి సూర్యనారాయణ, మట్టపర్తి సూర్యచంద్రరావు, బొక్కా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా లుక్కా వెంకటేష్, కార్యదర్శులుగా నందవరుపు శ్రీనివాసులు, పాల సత్యనారాయణ, పితాని శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బండి ఆదికృష్ణ, రాయుడు లక్ష్మణరావు, మహిళా అధ్యక్షురాలిగా వడ్డి నాగమల్లేశ్వరియాదవ్, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా దుర్గముపాటి పద్మజ, మహిళా ప్రధానకార్యదర్శిగా మార్గని సుశీల, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా రాయుడు దుర్గ, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిగా డోలా రాజేశ్వరీదేవి, బీసీ చైత్య వేదిక రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా మరిశెట్టి సూరిబాబు ఎన్నికయ్యారు. వీరికి వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ నియామకపత్రాలు అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మండల కమిషన్ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగణనతోపాటు కులగణన చేపట్టి వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
బీడీసీ రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి అసంతృప్తి
– కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో రూ.23 కోట్లుతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద జరుగుతున్న సిమెంట్ కాంక్రీట్ పనులను అధికారులతో కలసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. పనులు నత్తనడకన జరగడంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మందకొడిగా పనులు సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 10వ తేదీనాటికి ప్రధాన పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పందించక పోవడంపై మండిపడ్డారు. తక్షణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్మికులను సొంత జిల్లాలకు పంపండి చిలకలపూడి(మచిలీపట్నం): తెలంగాణ నుంచి వచ్చిన తొమ్మిది మంది ఏపీకి చెందిన వెట్టి చాకిరి కార్మికులను వారి సొంత జిల్లాలకు సురక్షితంగా పంపించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పెంట్లవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఫిషింగ్ యూనిట్లో తొమ్మిది మంది వెట్టిచాకిరి చేస్తున్న (బాండెడ్) కార్మికులను ఏపీకి చెందినవారుగా గుర్తించారు. వారిని శ్రీకాకుళం, కృష్ణ, విజయ నగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారని తెలియజేస్తూ సర్టిఫికెట్లను జారీ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకొనివచ్చి అప్పగించారు. వారు శుక్రవారం ఉదయం కలెక్టర్ డీకే బాలాజీని కలిశారు. కలెక్టర్ వారందరితో మాట్లాడి కార్మికులను సొంత జిల్లాలకు పంపారు. కల్తీ ఇంజిన్ ఆయిల్ వ్యాపారి అరెస్ట్ సూర్యాపేటటౌన్: కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సీసీఎస్, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారరణ చేయగా ఏపీలోని విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశాడు. ఇంజిన్ ఆయిల్ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్ రూ.200 చొప్పున బైక్ మెకానిక్లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజిన్ ఆయిల్ను బాటిల్స్లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్ చేశారు. మళ్లీ కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్ బాటిల్స్ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్ మెకానిక్లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజిన్ ఆయిల్ బాటిల్స్తో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
కేటుగాళ్లు రూటు మార్చారు
విజయవాడ స్పోర్ట్స్: గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మార్గంలో అది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చేరుతూనే ఉంది. సరుకు, ప్రజా రవాణాపైనే నిఘా నేత్రం దృష్టి సారిస్తున్న ప్రస్తుత తరుణంలో గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. ఈ ప్రాంతాలే టార్గెట్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు ముందుగా బైక్లను చోరీ చేస్తున్నారు. విజయవాడలోని రద్దీ ప్రాంతాలు, రాత్రి సమయంలో రోడ్లపైనే పార్కింగ్ చేసి ఉండే ప్రాంతాల్లో, ఆస్పత్రుల వద్ద బైక్లను చోరీ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వే స్టేషన్, కొత్త, పాత ప్రభుత్వాస్పత్రి, కొండ సమీపంలోని నివాసాల వద్ద ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, మాచవరం, సత్యనారాయణపురం, పోలీస్ స్టేషన్ల్లో ఈ దొంగతనాలు అధికంగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గడచిన ఏడాదిలో 185 బైక్ చోరీ కేసులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. సిండికేట్గా మారి.. చోరీ ముఠా మొత్తం సిండికేట్గా మారి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా విజయవాడకు చెందిన కట్టా శ్రీను ఇక్కడ బైక్లను చోరీ చేసే ముఠాకు నాయకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బైక్ చోరీ చేసిన వ్యకి..ఒడిశాకు చేరుకునే మార్గాన్ని ఇతనే దిశానిర్దేశం చేస్తాడు. ఒడిశాకు చేరుకున్న తర్వాత చోరీ చేసిన బైక్ను నరసింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసి నగదు ముట్టజెబుతాడు. ఆ తర్వాత రమేశ్ అనే వ్యక్తి నేరగాళ్లకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో రమేష్ గంజాయి విక్రయించడంతో పాటు విజయవాడలోనూ తన ముఠాతో యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు బైక్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఏడాదిలో 185 బైక్లు చోరీకి గురవ్వగా 130 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితులు కట్టా శ్రీను, నరసింహులు, రమేశ్తో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్(ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్స్) యాక్ట్ను ప్రయోగిస్తున్నాం. ఈ కేసులో అరెస్ట్ అయితే ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బైక్కు జీపీఎస్ ట్రాకర్ను అమర్చుకోవాలి. దీంతో బైక్ చోరీకి గురైన వెంటనే ట్రాకర్ సాయంతో గుర్తించడానికి వీలుంటుంది. – రాజశేఖరబాబు పోలీస్ కమిషనర్, విజయవాడ ఒడిశాలో అమ్మేస్తున్నారు విజయవాడతో పాటు నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో చోరీ చేసిన బైక్లపై నేరగాళ్లు నేరుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)కి చేరుకుంటున్నారు. విజయవాడలోనే సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒడిశాలోకి ప్రవేశించి, అక్కడ వాహనాన్ని అమ్మేస్తున్నారు. వచ్చిన నగదులో కొంత జల్సాలు చేసి మిగిలిన నగదుతో అక్కడే గంజాయిని కొనుగోలు చేసి, పలు రవాణా మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఒక్కో నిందితుడు గరిష్టంగా 5 కేజీల గంజాయిని తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తీసుకువచ్చిన గంజాయిని ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్నారు. బైక్లతో పాటుగానే మొబైల్ ఫోన్లనూ ఈ ముఠా చోరీ చేసి ఒడిశాలో విక్రయించి, ఆ సొమ్ముతో గంజాయి కొని తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బైక్లు చోరీ ఆ నగదుతో ఏవోబీలో గంజాయి కొనుగోలు పాత నేరస్తుల ఆధ్వర్యంలో దందా -
నెప్పల్లి భూములు అన్నసత్రం కమిటీవే
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖదిగా చెబుతున్న కృషా ్ణజిల్లా నెప్పల్లి గ్రామంలో ఆర్ఎస్ నెం 101లోని 4.41 ఎకరాల భూమి విజయవాడలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీకి చెందిన భూమిగా ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటలక్ష్మీ వరప్రసాద్, బి. రాజేష్ చెప్పారు. ఈ సందర్భంగా అన్నసత్రం కమిటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 150 ఏళ్ల క్రితం విజయవాడలో ఆర్యవైశ్య యాత్రికుల వసతి, భోజన సదుపాయాల కోసం శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ పేరుతో సంస్థను తమ పూర్వీకులు ఏర్పాటు చేశారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆర్యవైశ్య సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. ఆర్యవైశ్యులు భూములు ఇచ్చారు తమ సంస్థ కొనసాగించేందుకు అనేక మంది ఆర్యవైశ్యులు కొంత భూములను సంస్థకు అందించారన్నారు. ఆ క్రమంలో నెప్పల్లిలో తమకు 4.41 ఎకరాల భూమి ఉందన్నారు. 150 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోనే అది కొనసాగుతోందని చెప్పారు. దాని పన్నులు తమ సంస్థే చెల్లిస్తోందన్నారు. సుమారు వంద ఏళ్లకు పూర్వం నుంచి ఒకే కుటుంబం మూడు తరాలుగా (ప్రస్తుతం దేవినేని దుర్గాప్రసాద్) దానిని తమ సంస్థ నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తోందన్నారు. దానికి సంబంధించి సుమారు 75 ఏళ్లుగా ఆ రశీదులు, రిజిస్టర్ అగ్రిమెంట్లు, పాస్బుక్లు తమ వద్ద ఉన్నాయన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వసతి, ఉచిత భోజన సదుపాయాలే కాకుండా శివరాత్రికి ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు, శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం (పాతశివాలయం) స్వామి వార్ల రథోత్సవాన్ని సుమారుగా 155 ఏళ్లగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం వరకూ దుర్గమ్మ సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలను సైతం తమ సంస్థ ఆధ్వర్యంలో పూర్వీకులు నిర్వహించే వారని గుర్తు చేశారు. ఇప్పటికీ పాతశివాలయం శివరాత్రి ఉత్సవాలను తమ సంస్థే నిర్వహిస్తుందన్నారు. పూర్తి ధార్మిక సంస్థగా ఈ సంస్థ వ్యక్తిగతమైనది కాదని, పూర్తిగా ధార్మిక సంస్థగా కొనసాగుతుందన్నారు. ఆ భూమిని ఎవరికీ తమ సంస్థ అమ్మలేదన్నారు. ముఖ్యంగా ఆ భూమి వివరాలను దేవదాయ శాఖ 43 రిజిస్ట్రార్లో కొత్తగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు తమ కమిటీని ఆశ్చర్యానికి లోను చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలకు తాము వివరాలను అందిస్తామన్నారు. సమావేశంలో కమిటీ ప్రముఖులు వల్లంకొండ ప్రసాద్, వీరమునిబ్రహ్మానందరావు, జగన్మోహనరావుగుప్తా, డొగిపర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 150 ఏళ్లగా శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధీనంలోనే -
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
చిలకపూడి(మచిలీపట్నం): ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నారు. ప్రతిరోజూ ఉదయమే యోగాతో దైనందిన కార్యక్రమాలను సజావుగా చేసుకోవచ్చన్నారు. గ్రామాలు, మండలాల్లో ఆ మేరకు యోగా ట్రైనర్లు నిరంతరం యోగ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్రలో పేర్ల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాధారణ యాప్తో పాటు వాట్సాప్ ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా పేర్ల నమోదు కార్యక్రమం చేయడానికి అవకాశం లభించిందన్నారు. జిల్లాలో 17.39 లక్షల మంది ఉండగా ఇందులో ఇప్పటివరకు 7.59 లక్షల మంది సర్వే పూర్తైందన్నారు. అందులో 3.38 లక్షల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. గ్రామస్థాయిలో జరిగే యోగా పోటీలు పూర్తవుతాయన్నారు. వాటిని అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం రెండు రోజులపాటు మండల స్థాయిలో యోగా పోటీలు జరగనున్నాయన్నారు. వీటిని ప్రణాళిక బద్ధంగా నిర్వహించడానికి అందరూ సంసిద్ధం కావాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు గుడివాడ మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మనోహర్, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమారు, డీటీడబ్ల్యూవో ఫణి ధూర్జటి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ఉపాధి కూలీలపై ‘తమ్ముళ్ల’ దాడి
మైలవరం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం రోజు రోజుకూ శ్రుతి మించుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అధికారమే అండగా దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి కూలీలను కులం పేరుతో దూషిస్తూ మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన పొందుగలలో జరిగింది. మైలవరం మండలం పొందుగల గ్రామం దళితవాడకు చెందిన ఉపాధి హామీ కూలీలు స్థానికంగా ఉన్న చెక్ డ్యామ్ వద్ద ఉపాధి పనులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడి అనుచరులు ఆరేపల్లి సత్యనారాయణ, నాగరాజు, గోపాలరావు వచ్చి ‘ఇక్కడ పనిచేయవద్దు మేము చెప్పిన చోట పనులు చేయాలని’ వారిపై ఒత్తిడి చేశారు. ‘మేము చెప్పిన చోట పనులు చేయకపోతే కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తా మంటూ’ బెదిరించారు. మేము ఫీల్డ్ అధికారి చెప్పిన చోట పనిచేస్తామని ఉపాధి కూలీలు తేల్చి చెప్పడంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ వివాదాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళ వద్ద ఫోన్ లాక్కుని మరీ దాడి చేశారు. దాడిలో ఉపాధి కూలీలు సుష్మ, కమలమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనలో నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో బాధిత ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తాము చెప్పిన చోటే పని చెయ్యాలంటూ దౌర్జన్యం కులం పేరుతో దూషిస్తూ దాడి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని పోలీసులు -
జగన్ సంక్షేమ సంతకం.. అన్నదాతల్లో ఆనందం
కంకిపాడులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిల్యాబ్ కాలువలకు మరమ్మతులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జూన్ మొదటి, రెండు వారాల్లో సాగునీటిని ప్రధాన కాలువలకు విడుదల చేశారు. కాలువలు, బోర్ల సదుపాయంతో భూములను దుక్కి, దమ్ములు చేయించి నారుమడులు, ఇతర ఖరీఫ్ సాగు పనులు రైతులు చేసుకున్నారు. రైతు భరోసా పథకం.. పెట్టుబడి సాయంగా ఖరీఫ్లోనే కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.13,500 విడతల వారీగా అందించి రైతులకు భరోసా ఇచ్చింది. 2019–24 వరకూ రూ.979.29 కోట్లు రైతు భరోసా కింద లబ్ధి చేకూరింది. మేమున్నామన్న ధైర్యం.. మిచాంగ్ తుపానుతో పంట నష్టం వాటిల్లితే నిబంధనలను పక్కన పెట్టి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేసింది. 1,64,849 మంది రైతులకు ఇన్పుట్సబ్సిడీగా రూ. 126.03 కోట్లు అందించింది. అంతే కాకుండా వివిధ విపత్తులతో జరిగిన నష్టానికి ఐదేళ్ల కాలంలో రూ 47.77 కోట్లు రైతులకు అందించిన పరిస్థితి. రుణ సాయం.. సున్నావడ్డీ కింద రూ లక్ష లోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు కృష్ణాజిల్లాలో 1.66 లక్షల మందికి రూ 30.23 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 30,405 మందికి రూ 7.72 కోట్లు లబ్ధి చేకూర్చింది. చెంతకే సేవలు.. రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచం యావత్తూ రైతు సేవల గురించి చర్చించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా విధానాన్ని అమలు చేసింది. గ్రామ స్థాయిలో భరోసా కల్పించిందంటూ రైతులు గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. జలకళ సాకారం.. వైఎస్సార్ జలకళతో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకీ సబ్సిడీతో కూడిన బోరు సదుపాయం కల్పించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల్లో జలకళ కింద బోర్లు ఏర్పాటయ్యాయి. పక్కాగా పరీక్షలు.. నియోజకవర్గానికి ఒక అగ్రిల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మట్టి నమూనాతో పాటుగా విత్తన నాణ్యత, ఎరువుల, పురుగు మందుల నాణ్యత, చేపల మేత నాణ్యత పరిశీలన వంటి అనేక పరీక్షలు అందించింది. ఒక్కో ల్యాబ్ ద్వారా నెల నెలా 100 పరీక్షలకు తగ్గకుండా జరిగాయంటే వాటిని ఎంత సమర్థంగా అందుబాటులోకి తెచ్చిందో, రైతుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుందో అర్థమవుతుంది. -
పురోగతి లేకుంటే ఉపేక్షించం
చిలకలపూడి(మచిలీపట్నం): గృహ నిర్మాణాల్లో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ నెల 13న సమీక్షించినప్పుడు 910 గృహాలను లక్ష్యంగా నిర్ణయించగా.. కేవలం 412 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మచిలీపట్నం నగరం, అవనిగడ్డ, కోడూరు, గన్నవరం, చల్లపల్లి, పెదపారుపూడి, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ నాగాయలంక మండలాలు పురోగతిలో చాలా వెనుకబడ్డాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో లెంటల్ స్థాయిలో 8,108, పైకప్పు స్థాయిలో 2,148, రూఫ్ కాస్టింగ్ స్థాయిలో 588 ఇళ్లు ఉన్నాయన్నారు. జూన్ నెల 13వ తేదీన నిర్వహించే సమావేశానికి పనితీరు మార్చుకోకపోతే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు బాధ్యులైన వారిని అందర్నీ సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ నిర్మాణంపై మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో పాటు వెల్ఫేర్ సెక్రటరీ, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నేడు పింఛన్ల పంపిణీ.. జూన్ ఒకటో తేదీన సెలవు కావటంతో ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాల్లో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయి అధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష -
దుర్గగుడి భూముల పరిరక్షణకు చర్యలు
ఆలయ ఈవోతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ, దుర్గగుడి దేవస్థాన భూములు అన్యాక్రాంతం అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం దుర్గగుడి ఈవో శీనానాయక్తో సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబ ర్లో సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో దేవ దాయ శాఖ, దుర్గగుడికి చెందిన భూములు, పొలాలు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం కావడంపై దాతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నిర్ణయాలు.. ఈ నేపథ్యంలో దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్, ఈవోలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆలయ భూములు ఉన్న మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో మాట్లాడారు. దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారుల వద్ద ఉన్న రికార్డుల మేరకు వెంటనే ఆలయ భూములను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. వివాదాలలో ఉన్న ఆలయ భూములు, పొలాల వివరాలను దుర్గగుడి లీజెస్ విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చైతన్య, దేవదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని వినతి
గరికపాడు(జగ్గయ్యపేట): తమను వ్యవసాయశాఖలో విలీనం చేయాలంటూ జగ్గయ్యపేట మండలంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ)లు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఢిల్లీరావును కోరారు. ఢిల్లీరావు గురువారం గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు. ఈ సందర్భంగా వీఏఏలు ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి మాతృశాఖ వ్యవసాయ శాఖలోకి విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ/వార్డు సర్వేలకు తమను వినియోగిస్తుండటంతో రైతులకు సలహాలు, సూచనలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కమిషనర్ ఢిల్లీరావు మాట్లాడుతూ వీఏఏల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.హెచ్ఎంల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళంమచిలీపట్నంఅర్బన్: ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్లో గందరగోళ పరి స్థితి ఎదురైంది. గురువారం ఉదయం ఎని మిది గంటలకు కౌన్సెలింగ్కు హెచ్ఎంలను పిలిచిన విద్యాశాఖ అధికారులు సాయంత్రం ఆరు గంటలకు సైతం ప్రక్రియను ప్రారంభించలేదు. కౌన్సెలింగ్ కోసం వచ్చిన ఉపాధ్యాయులు అప్పటి వరకు పడిగాపులు పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జెడ్పీ, మునిసిపల్ హై స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ అధికారులు కౌన్సెలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో కౌన్సెలింగ్ను ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం 6.30 గంటలకు మాన్యువల్ పద్ధతిలో అధికారులు కౌన్సెలింగ్ను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 95 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీలకు 1:3 నిష్పత్తితో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేశారు.ఎలక్షన్ గోదాముకు పటిష్ట భద్రతభవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ గోదాము వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచే జిల్లా ఎలక్షన్ గోదామును ఆయన గురువారం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గోదాములోని సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీచేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోదామును ఎప్పటికప్పుడు నిశితంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీమ్ పాల్గొన్నారు.పర్యావరణ దినోత్సవంలో భాగస్వామ్యం కావాలిసాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యంకా వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. విజయవాడలోని మండలి ప్రధాన కార్యాలయంలో గురువారం సర్కులర్ ఎకానమీపై తదుపరి కార్యచరణ సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రధానంగా ఏపీఎస్ ఆర్టీసీ, రైల్వే, నేషనల్ హైవే విభాగాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్లాస్టిక్ను అంతం చేద్దామనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 30 విభాగాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్మూలనకు ఎటువంటి పద్ధతులు వినియోగిస్తున్నారనే దానిపై చర్చించారు. -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్న గరికపాడు(జగ్గయ్యపేట): ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ.. జూన్ 12వ తేదీ వరకు రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేసేలా వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో భూమి, భూసార పరీక్ష, నీరు–నీటి పరీక్షల ప్రాముఖ్యత, సాగు మెలకువలు, పంటల ఎంపిక, అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలు, యాంత్రీకరణ సౌలభ్యం, పంటల యాజమాన్యం, సస్యరక్షణ, పాడి పశువుల యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాలపై గ్రామ స్థాయిలో రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగులో రైతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు, ఆహార ధాన్యాల సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులకు శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో వివరించాలన్నారు. గ్రామాల్లో పశుపోషణకు రైతులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడుకు చెందిన రైతులు సతీష్, వెంకటేశ్వర్లు జింకు సకాలంలో పంపిణీ చేయటం లేదని, పంట నష్టపరిహారం సక్రమంగా అందించలేదని, వరిలో ఎలుకల నివార ణకు అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఢిల్లీరావు రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేవీకేలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, డీఆర్ఎస్ మాధవిలత, కేవీకే కోఆర్డినేటర్ అచ్యుతరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణంరాజు, జగ్గయ్యపేట, నందిగామ ఏడీఏలు భవానీ, శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం వలంటీర్లు, ఏఓలు, వీఏఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు -
ఏడుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆర్పేట పోలీస్స్టేషన్లో ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంలోని ఓగీసుపేటకు చెందిన భూపతి వినూతన్సాయి, యర్రంశెట్టి కేశవనాగకుమార్, ఈడేపల్లికి చెందిన జోగి సాయిశ్రీనివాస్, రుస్తుంబాదకు చెందిన మల్లిపూడి వినయ్, పుప్పాల స్వామి, వెన్న అనిల్కుమార్, సుకర్లాబాదకు చెందిన చిట్టిబొమ్మ గీతకృష్ణ అనే యువకులు ఈ నెల 28వ తేదీన ఇటుకబట్టీల వద్ద గంజాయి తాగుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్పార్టీ పోలీసులు రైడ్ చేసి పై ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభించింది. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నగరంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారికి సరఫరా చేస్తున్న పలువురు పేర్లను పోలీసులకు చెప్పారు. దీంతో పట్టుబడిన ఏడుగురిపై గంజాయి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పట్టుబడిన వారికి సరుకు సరఫరా చేస్తున్న మరికొంత మందిని తర్వలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఇనగుదురుపేట, ఆర్పేట పోలీసులు, స్పెషల్పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్
ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్కుమార్ కోనేరుసెంటర్: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి జిల్లాలో నేరాల నియంత్రణ చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత డిస్ట్రిక్ క్రైం రికార్డ్ బ్యూరో (డీసీఆర్డీ)ని సందర్శించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం స్పెషల్బ్రాంచ్ను సందర్శించారు. అక్కడి నుంచి ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, హోంగార్డ్స్, డాగ్స్క్వాడ్ విభాగాలలో తనిఖీలు చేశారు. ఆయా విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీతో కలిసి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పనితీరు సంతృప్తికరం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలు విశిష్ట కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాటి వినియోగం ద్వారా నేరాలను చాలా వరకు తగ్గించగలుగుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి, స్థానికుల సహకారంతో నాలుగు వేలకు పైగా సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగలిగామన్నారు. వాటి ద్వారా అనేక కేసులకు సంబంధించిన దర్యాప్తును మరింత వేగవంతం చేయగలుగుతున్నామని చెప్పారు గంజాయిపై ఉక్కుపాదం.. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు, బారికేడ్లు, రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రదేశంలో నిఘాను ఏర్పాటు చేసి గంజాయి విక్రేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గంజాయి వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించేలా చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు. అలాగే మత కల్లోలాలు రెచ్చగొట్టేలా, మత సామరస్యానికి భంగం వాటిల్లేలా వ్యవహరించే వ్యక్తుల చర్యలను అరికట్టేందుకు స్పెషల్ బ్రాంచ్ విభాగం ద్వారా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి మతపరమైన గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజ తదితరులు పాల్గొన్నారు. -
‘వేగ’కు ఎలాంటి సంబంధం లేదు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ‘బంగారం స్కీమ్ పేరుతో జరిగిన మోసం’ కేసుకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ సంస్థలో ఎటువంటి చిట్టీలు కానీ, ఏజెంట్లు కానీ లేనే లేరని వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా పేర్కొన్నారు. గుణదల సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తన సోదరుడు సుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి.. నవీన్కుమార్ మాట్లాడుతూ బంగారం స్కీమ్, చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడైన ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తికి.. తమ సంస్థకు సంబంధం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముచ్చర్ల శ్రీనివాసరావు తమ ఏజెంట్ అంటూ.. వేగ జ్యూవెలరీకి వారు మాకు హామీ ఇచ్చారంటూ కొంతమంది బాధితులు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. తమను ఏ బాధితుడు వచ్చి కలవలేదని, తాము ఎవరికీ ఎటువంటి హామీలు కానీ, వివరణలు కానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కావాలంటే విజయవాడలోని తమ బ్రాంచి సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. నిజాయితీతో నడుచుకుంటూ ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తున్న తమ సంస్థ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సంస్థలో ఉన్న బంగారం స్కీములు కేవలం 11 నెలలు మాత్రమే ఉంటాయని, వాటికి కూడా తమ సంస్థ తరఫున అన్ని రశీదులు, ఆన్లైన్ లావాదేవీలు ఉంటాయని వివరించారు. తమకు ఎటువంటి ఏజెంట్లు కూడా లేరని ఈ విషయాన్ని గమనించి, ప్రజలు ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును ఛేదించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సంస్థకు ఎటువంటి ఏజెంట్లు లేరు నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా -
మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం
11, 12 తేదీల్లో నిర్వహణకు దుర్గగుడి అధికారుల ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా మండపం 5వ అంతస్తులో పూజా సామగ్రి, ప్లాస్టిక్ ఆట వస్తువులను విక్రయించే 19 షాపులకు బహిరంగ వేలం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన పనులను దేవస్థాన లీజెస్ విభాగం అధికారులు సిద్ధం చేశారు. జూన్ 11, 12వ తేదీన మహా మండపం ఆరో అంతస్తులో వేలం నిర్వహించనున్నారు. 2022లో అప్పటి ఈవో భ్రమరాంబ మహామండపంలో పూజా సామగ్రిని విక్రయించేందుకు షాపులకు బహిరంగం వేలం నిర్వహించారు. అయితే భక్తులు కొండపైకి ఘాట్రోడ్డు, లిఫ్టు మార్గంతో పాటు మెట్ల మార్గం ద్వారా చేరుకుంటున్నారు. కేవలం మహా మండపం మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే 5వ అంతస్తులోకి మళ్లించడంతో వారికే పూజా సామగ్రి విక్రయించే అవకాశం ఉండేది. వేలాది రూపాయలు అద్దెలు చెల్లించినా వ్యాపారాలు అంతగా లేకపోవడంతో తమ దుకాణాలను కొండ దిగువకు మార్చాలని దుకాణదారులు ఈవోకు మొర పెట్టుకున్నారు. దీంతో కనకదుర్గనగర్లో దేవస్థానం షాపులను నిర్మించి అద్దె బకాయిలు చెల్లించిన వారికి కేటాయింపు చేస్తామని ప్రకటించింది. దీంతో పలువురు వ్యాపారులు బకాయిలు చెల్లించి కనకదుర్గనగర్లో షాపులను దక్కించుకున్నారు. గతేడాది గోశాల వద్దకు.. గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు కనకదుర్గనగర్లోని షాపులను తిరిగి తొలగించి గోశాల ఎదుట కేటాయింపు చేశారు. అయితే ఇటీవల దుర్గగుడి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గోశాల వద్ద ఉన్న దుకాణాలను తొలగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలతో పాటు మహా మండపం 5వ అంతస్తులో ఉన్న దుకాణాలకు టెండర్ నిబంధనల ప్రకారం మూడేళ్ల కాల పరిమితి పూర్తి కానుంది. దీంతో వ్యాపారులు తమ దుకాణాలను తిరిగి రెన్యూవల్ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోసారి ఐదో అంతస్తుకు.. మహా మండపం 5వ అంతస్తుకు తిరిగి దుకాణాలను తరలిస్తున్నట్లు లీజెస్ విభాగం అధికారులు వ్యాపారులకు సూచించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. గతంలో వ్యాపారాలు సరిగా లేకనే కొండ కిందకు దిగామని, తిరిగి మహా మండపంలోకి పంపడం సరికాదని బహిరంగంగానే పేర్కొంటున్నారు. మరో వైపున గోశాల వద్ద షాపులను కేటాయింపులకు దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులతో పాటు కీలక అధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కొంత మంది కూటమి నేతలు తమ దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా ఉండేందుకు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.