breaking news
Krishna District News
-
●ఆలయ పరిసరాల్లోనూ ప్రచారార్భాటం
ఇంద్రకీలాద్రి సమీపంలో తూర్పు కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార కటౌట్లు దుర్గగుడి సమీపంలో తూర్పు కెనాల్ వద్ద ఈదురుగాలికి నేలకు ఒరిగిన ప్రచార కటౌట్ (ఫైల్)విజయవాడ దుర్గగుడి పరిసరాలలో ఎటువంటి రాజకీయ ప్రచార కటౌట్లు ఏర్పాటు చేయరాదనే నిబంధనను తోసిరాజని గుడి సమీపంలో, తూర్పు కెనాల్ వద్ద రాజకీయ నాయకుల చిత్రాలతో దసరా ఉత్సవాలు, ఇతర ప్రచార భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. నిత్యం వాహనాలు, భక్తులు తిరిగే ప్రధాన రోడ్డు ఇది. దసరా ఉత్పవాల భక్తుల క్యూలైన్లు కూడా ఈ కటౌట్స్ ఎదుటే ఉంటాయి. ఇటీవల భారీ వర్షం, ఈదురుగాలులకు సీఎం చంద్ర బాబు, మంత్రి లోకేష్ల కటౌట్ కూలిపోయింది. ఆ సమయంలో భక్తుల రద్దీ, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రదేశంలో నాయకుల ఫొటోలతో భారీ కటౌట్లు వెలిశాయి. అధికారులు వీటిని గుర్తించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. – నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
ఎంపీగా చిన్ని అన్ఫిట్
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఎంపీగా అన్ఫిట్ అని, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎంపీ అంటే దండుకోవడం, దాచుకోవడం అని ఆయన కొత్త నిర్వచనం చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడ చరిత్రలో ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు కానీ.. చిన్ని వంటి అవినీతి, అసమర్థ ఎంపీని తానెప్పుడూ చూడలేదన్నారు. విజయవాడ అజిత్సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనంలో గురువారం వైఎస్సార్ సీపీ నేతలతో కలసి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అయినా కూడా చిన్ని ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్లానే మాట్లాడుతున్నాడని, కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన భూములు పేర్ని నాని కొట్టేశాడంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2007 మార్చి 29వ తేదీన 5.30 ఎకరాలకు వేలం వేస్తే అందులో 135 మంది సభ్యులు మనిషికి రూ.2 లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారని, వారిలో 50 శాతానికి పైగా టీడీపీ వారే ఉన్నారని, ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర గుండెకాయగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఎండోమెంట్స్ చట్టం, హైకోర్టు వేలం ద్వారా మాత్రమే దేవస్థాన భూములను లీజుకు ఇవ్వాలని చెబుతుంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ దేవస్థాన భూముల్లో మట్టి తరలించా రని, అమ్మవారికి పోటీగా ఉత్సవాలు పెట్టడం వల్ల ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా అన్నయ్య కేశినేని నానిని చూసి ఎలా హుందాగా బతకాలో, ప్రజలకు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలని చిన్నికి హితవు పలికారు. పాపపు సొమ్ముతో ఉత్సవాలా? ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ చరిత్ర తెలి యకుండా విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలని చూడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. వ్యాపారుల వద్ద బలవంతంగా చందాలు వసూలు చేస్తూ.. ఆ పాపపు సొమ్ముతో ఉత్సవాలు చేయడం దుర్మార్గమన్నారు. దేవుడి స్థలాల్లో గోల్ఫ్లు పెడతారా అని ప్రశ్నించారు. అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ ఉత్సవాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన, నేడు కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని కోరిన ఎంపీ చిన్ని సవాల్ను తాము స్వీకరిస్తున్నామని విష్ణు ప్రకటించారు. అమ్మవారి ఖ్యాతిని తగ్గించొద్దు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవాల పేరుతో ఆధ్యాత్మికతను దెబ్బతీసి, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఖ్యాతిని తగ్గించే పనులు చేయవద్దని హితవు పలికారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ చిన్ని 15 నెలల్లోనే కనీవినీ ఎరుగనంత అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇసుక, మట్టి, బూడిద, స్థలాలతో పాటు ఇప్పుడు అమ్మవారి పేరుమీద కూడా అక్రమార్జన చేస్తున్నారని వివరించారు. అసలు ఈ సంఘం దేనికి పెట్టారు? 40 ఎకరాలకు కట్టిన రూ.45 లక్షలు ఎవరివి అని ప్రశ్నించారు. అక్కడ రూ.45 లక్షలు కట్టి ఇక్కడ ఒక్కో షాపునకు రూ.3.50 లక్షల చొప్పున రూ.కోట్లు దండుకుంటున్నారని వివరించారు. అసలు ఎండోమెంట్స్ భూములను ఇవ్వాలని కలెక్టర్ లెటర్ రాసివ్వడం ఎక్కడా చూడలేదని, దీనిపై కోర్టులకు వెళ్తామని, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ఖ్యాతిని దిగజార్చి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీస్లా మార్చారు..
గొల్లపూడి దేవస్థానం స్థలంతో తనకు సంబంధం లేదని, తాను కేవలం సభ్యుడినేనని ఎంపీ కేశినేని చిన్ని అబద్ధాలు ఆడుతున్నారని, సొసైటీ ఫర్ విజయవాడ వైబ్రెంట్కు అధ్యక్షుడిగా మొదటి పేరు ఆయనదే ఉందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. ఉత్సవాల పేరుతో డబ్బులు దండుకోవాలని ముందే పక్కా ప్రణాళికతో ఆ ప్రాంతంలో ఆరడుగుల ఎత్తున మట్టి పోశారని, ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తోలించారో చెప్పాలని నిలదీశారు. అమ్మవారి ఉత్సవాలను దెబ్బతీస్తున్నారనే బాధతో ఆర్ఎస్ఎస్ వాళ్లు కోర్టుకు వెళ్తే ఎంపీ చిన్ని వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తు న్నారని విమర్శించారు. ఎంతో ఖ్యాతి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ప్రతిష్టను దిగజార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అమ్మవారి ఉత్సవాలకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టని ఎంపీ విజయవాడ ఉత్సవాలకు పదిసార్లు రివ్యూ మీటింగ్లు ఎలా పెట్టారని ప్రశ్నించారు. తమ జేబులు నింపుకోవడం కోసం ఏటా పిన్నమనేని గ్రౌండ్లో జరిపే దసరా ఉత్సవాలను ఆపేయాలని అక్కడి నిర్వాహకులను ఎంపీ చిన్ని బెదిరించడం నిజం కాదా, విజయవాడ ఉత్సవాల కోసం మెడికల్ షాపు అసోసియేషన్ను రూ.2 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. -
హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్టు
మైలవరం(జి.కొండూరు): మైలవరంలో తన రెండో భార్య కూతురు గాయత్రిని హత్య చేసి వాగులో పడేసిన చిందే బాజీపై పోలీసులు పీడీ యాక్టును అమలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ హత్య చేసిన కేసులో బాజీ నేరం ఒప్పుకున్నప్పటికీ గాయత్రి శవం పోలీసులకు లభించకపోవడంతో ఇప్పటికే రిమాండ్లో ఉన్నాడు. అతనిపై గతంలో ఉన్న గంజాయి కేసులు, క్రిమినల్ కేసులు ఆధారంగా పోలీసులు పీడీ యాక్టును ప్రయోగించారు. గంజాయి విక్రయిస్తూ, రవాణా చేస్తూ పట్టుబడడంతో బాజీపై మైలవరం పోలీసుస్టేషన్లో మూడు గంజాయి కేసులు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో ఒక గంజాయి కేసు నమోదైంది. జి.కొండూరు పోలీసుస్టేషన్లో ఒకటి, మైలవరం పోలీసుస్టేషన్లో ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను పట్టుబడిన నాలుగు గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాజీ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ, యువతలో వ్యసనాన్ని పెంచుతూ, సమాజ శాంతికి ముప్పు కలిగిస్తున్నందున అతని నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటూ పీడీయాక్టును అమలు చేసినట్లు సీఐ దాడి చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వచ్చే జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీ నిర్వహిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. 2025–2026 సంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్ను ఖరారు చేయడానికి హెల్త్ వర్సిటీ పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం విజయవాడలోని వర్సిటీ ఆవరణలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయించిన వివరాలను చంద్రశేఖర్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ యూనివర్సిటీల సంఘం కేటాయించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీని జనవరిలో నిర్వ హించాలని నిర్ణయించారు. నెల్లూరులోని నారా యణ మెడికల్ కాలేజీలో పురుషుల గేమ్స్ మీట్, విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉమెన్స్ గేమ్స్ మీట్, శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాలలో పురుషుల క్రికెట్ టోర్నీ, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో అథ్లెటిక్ మీట్, విజయనగరంలోని మహారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సైన్సెస్లో పురుషులు–మహిళల కోసం గేమ్స్ మీట్, నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో నర్సింగ్ ఉమెన్ గేమ్స్ మీట్, రాజమండ్రి లోని మెడికల్ కాలేజీలో పీజీల కోసం పురుషుల క్రికెట్ టోర్నీ, గన్నవరం మండలం చిన్నఅవుటుపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పురుషులు–మహిళల పీజీలకు గేమ్స్–స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికరెడ్డి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం క్రీడా కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించినందుకు వీసీ చంద్రశేఖర్ను సత్కరించారు. -
మృతదేహానికి రీపోస్ట్మార్టం
నాగాయలంక: మండలంలోని నాలి గ్రామంలో గత నెల 28వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన యువకుడు నాయుడు దానియేలు(19) మృతదేహానికి గురువారం రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. రిపోర్టు సమయంలో ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. దానియేలు మృతిపై అతడి తల్లి అమ్మాయమ్మ, ఇతర బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్లీ శవపరీక్ష జరి పించి న్యాయం చేయాలని గత వారం నాగాయలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక ఎస్ఐ కలిదిండి రాజేష్ ఫోరెన్సిక్ నిపుణులను గురువారం రప్పించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, నాగాయలంక తహసీల్దార్ సీహెచ్.వి.ఆంజనేయ ప్రసాద్, అవనిగడ్డ సీఐ పి.యువకుమార్, మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని బయటకు తీయించారు. బందరు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం దానియేలు మృతదేహానికి రీ–పోస్ట్మార్టమ్ నిర్వహించింది. ఈ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో విజయవాడ మీదుగా ప్రయాణం సాగించే వారికి ఎటువంటి అవాంత రాలూ లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సావ్ జరగనున్న నేపథ్యంలో వాహనదారుల సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్ ఏరియాను కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్ను ఉపయోగించాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వాహనదారుల ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్తో పాటుగా ఏపీ ట్రాన్స్కో, వెస్ట్ బైపాస్ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులు వెస్ట్ బైపాస్ ఏరియాను పరిశీలించారు. వాహనదారుల ప్రయాణాలపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం పార్కింగ్ ఎరియాలను, కుమ్మరిపాలెం నుంచి దుర్గాఘాట్ వరకు క్యూలైన్లను, దుర్గాఘాట్ నుంచి మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయక టెంపుల్, సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్ఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు, రైల్వే స్టేషన్ల పరిశుభ్రతకు విజయవాడ డివిజన్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అనేక స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త హంగును తీర్చిదిద్దుతోందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. బ్రంచ్ అధికారులతో కలసి ఆయన విజయవాడ డివిజన్లోని మచిలీపట్నం–గుడివాడ, భీమవరం టౌన్–నర్సాపూర్ సెక్షన్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందుగా మచిలీపట్నం చేరుకుని అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రన్నింగ్ రూమ్, కోచింగ్ డిపోలను తనిఖీ చేశారు. స్వచ్చతా హీ కార్యక్రమంలో భాగంగా స్టేషన్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం గుడివాడ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. స్టేషన్లోని ప్రీమియం వెయిటింగ్ హాల్ ఆధునికీకరణ పనులు, మాడ్యులర్ టాయిలెట్ల ఏర్పాటు, స్టేషన్ ప్రవేశ ముఖద్వారం అభివృద్ధి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తనిఖీ చేశారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి భీమవరం టౌన్ స్టేషన్ చేరుకున్న డీఆర్ఎం దివ్యాంగ ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. వారి సౌలభ్యం కోసం ర్యాంపు నిర్మాణాలు, మాడ్యులర్ టాయిలెట్లు, 12 మీటర్ల ఎఫ్ఓబీ నిర్మాణ పనులను సమీక్షించారు. నర్సాపూర్ స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించిన అనంతరం నర్సాపూర్–నిడదవోలు సెక్షన్లో రియర్ విండో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. స్టేషన్లోకి అడుగుపెట్టే ప్రతి ప్రయాణికుడికి ప్రపంచస్థాయి సౌకర్యాలతో పాటు ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేయడమేనని పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైద్య కళాశాలలు పీపీపీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, అగ్రవర్ణ పేదలు కూడా వైద్య విద్య అందకుండా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాలను కలుపుకొని విజయవాడ ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. జీవోలు దగ్ధం మహాధర్నా ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడ్కు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను జడ శ్రావణ్కుమార్, ఇతర నేతలు కలిసి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు, సంఘాలివే... వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, వికలాంగుల విభాగం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్రాజ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో ఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు, వీసీకే పార్టీ నేత గంజి రామారావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, లోక్జనశక్తి నేత చింతా వెంకటేశ్వర్లు, సుమమాల అధ్యక్షుడు భాస్కరరావు, మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లీశ్వరి, ఐయూఎంఎల్ ఖాజావలి పాల్గొన్నారు. మున్సిపల్, రైల్వే ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. తెలంగాణకు చెందిన రాజేష్ ప్రసంగం, పాట అందరినీ ఆకట్టుకుంది.జార్ఖండ్ తరహాలో ఉద్యమిద్దాం జార్ఖండ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు తిరగబడి మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకు వచ్చేలా చేశారు. అదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పార్టీలల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుదాం. –శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అగ్రవర్ణ పేదలకు నష్టమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణ పేదలకు సైతం వైద్య విద్యను దూరం చేయడమే అవుతుంది. దీనిపై అందరినీ కలుపుకొని వచ్చే నెలలో ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తాం. –జడ శ్రావణ్కుమార్, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడుబాబు ఆలోచన కార్పొరేట్ల గురించే.. పేదల గురించి ఆలోచన చేసే నైజం చంద్రబాబుకు లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తన కార్పొరేట్లకు, బంధువులకు సంపద సృష్టించే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. –పేర్ని నాని, మాజీ మంత్రి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం –విడదల రజని, మాజీ మంత్రి చాలా దుర్మార్గం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే, వాటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తాననడం చాలా దుర్మార్గం. –దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్జిల్లా ప్రైవేటీ కరణ చేస్తే ఉద్యోగాలు కోల్పోతాం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేస్తే వైద్య సీట్లతో పాటు వైద్య కళాశాల, ఆస్పత్రుల్లో పారా మెడికల్, నర్సింగ్, మినిస్టీరియల్ సిబ్బంది వంటి వేలాది ఉద్యోగాలు కోల్పోతాం. –డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు -
కూచిపూడి అభివృద్ధికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామీణ స్వచ్ఛ అభియాన్ కింద కూచిపూడి అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, వీటికి ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు. పామర్రు నుంచి కూచిపూడి, కళాక్షేత్రం యూనివర్సి టీకి చేరుకునే ఐలూరు రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలోని డ్రెయినేజీకి మరమ్మతులు చేపట్టాలని, అందుకోసం ఉపాధి హామీ నిధులు మంజూరు చేస్తా మని సూచించారు. రెగ్యులర్ నృత్య కోర్సులతో పాటు సెలవు రోజుల్లో వారం, నెలల షార్ట్ కోర్సులు నిర్వహించేలా చూడాలని, దీని వల్ల ఎక్కువ మందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. గతంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను గుర్తించి కళాక్షేత్రం అభివృద్ధికి సహకారం కోరాలని అధికారులకు సూచించారు. కూచిపూడి గ్రామ మహిళలు తయారుచేసి నృత్య దుస్తులు, జడలు, గజ్జలు తదితర వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. కళాక్షేత్ర యూనివర్సిటీకి ఉపకులపతిని నియమించాలని ఫోన్ ద్వారా కలెక్టర్ ఉన్నతాధికారులను కోరారు. ఈ సమావేశంలో పర్యాటకశాఖ ఏడీ లజవంతినాయుడు, జిల్లా పర్యాటకశాఖాధికారి జి.రామలక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, మొవ్వ ఎంపీడీఓ డి.సుహాసిని, తహసీల్దార్ మస్తాన్ పాల్గొన్నారు. -
ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరించాలని వినతి
మోపిదేవి: రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని (రెగ్యులర్) కోరుతూ దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను మినిమమ్ టైమ్ స్కేల్ ఉద్యోగులు గురువారం వారి కార్యాలయాల్లో కలసి వినతిపత్రాలు అందజేశారు. మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించి వార్షిక ఇంక్రి మెంట్లు, హెచ్ఆర్ఏ, డీఏ, ఐఆర్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలపై మంత్రులు స్పందించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు నాగాయలంక: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నాగాయలంకలోని ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారి తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఏడీఏ వి.కిరణ్ కుమార్, స్థానిక ఏఓ ఎ.సంజీవ కుమార్ సిబ్బందితో కలసి కార్తికేయ ట్రేడర్స్, సస్యశ్యామల ఫెర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్, సాయివర్షిణి ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు జరిపారు. కార్తికేయ ట్రేడర్స్లో ఓ–ఫామ్ లైసెన్స్లో చేర్పించని కారణంగా మొత్తం రూ.11,37,070 విలువైన ఎరువుల విక్రయాలను నిలిపివేశారు. లైసెన్స్లో ఓ–ఫామ్ చేర్పించుకోవాలని ఆదే శించారు. ఎరువుల విక్రయదారులతో రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణం విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. రూ.1.45 లక్షలసిగరెట్లు స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నిషేధిత సిగరెట్లను అక్రమంగా నిల్వ చేసిన ఇంటిపై కొత్త పేట పోలీసులు గురువారం దాడి చేశారు. రూ.1.45 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సౌమ్య థియేటర్ సమీపంలోని రాజీవ్శర్మనగర్కు చెందిన కొత్తప్రసాద్ కొంత కాలంగా నిషేధిత సిగరెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ పద్మారావు గురువారం ప్రసాద్ ఇంటిపై దాడి చేసి 12 బాక్స్ల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.45 లక్షలు ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గవర్నర్కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్ గవర్నర్కు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు గవర్నర్ అబ్దుల్ నజీర్కు వేద ఆశీర్వచనం అందజేసి, పట్టువస్త్రాలు, పవిత్రాలను అందించారు. అదే విధంగా ప్రభుత్వంలోని పలువురికి కూడా ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు అందజేశారు. స్వర్ణాంధ్ర సాధనలో ఎన్ఎస్ఎస్ కీలకం కోనేరుసెంటర్: స్వర్ణాంధ్ర సాధనలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. బుధవారం సెనేట్ హాల్లో విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఎన్ఎస్ఎస్ యూనిట్లు గ్రామాల్లో చేపట్టవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థులకు డిజిటల్ లిటరసీ శిక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా గ్రామస్తులను భాగస్వాములను చేసి శుభ్రతా డ్రైవ్లు చేపట్టాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఘనంగా విశ్వకర్మ జయంతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. బుధవారం కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ కళలు, కళాకారుల క్షేమం, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా సాధికారిత కల్పించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతివృత్తుల కళాకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక నైపుణ్యాల సము పార్జన ద్వారా చేతివృత్తులకు కొత్త వైభవం వస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. -
సమాచార శాఖ ఏడీకి కలెక్టర్ అభినందనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందిన ఎన్టీఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.మోహన్రావుకు కలెక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ సహాయ సంచాలకుల కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగో న్నతి పొందిన మోహన్రావును బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అభినందనలు తెలిపి సత్కరించారు. 2008లో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్.వి.మోహన్రావు విజయవాడ డివి జనల్ పీఆర్వోగా, డీపీఆర్వోగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందారు. ఉద్యోగోన్నతి పొంది నప్పటికీ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా కవరేజ్ చేస్తూ మీడియా ప్రతినిధులు, అధికారులను మరింత సమన్వయం చేసుకోవాలని కోరారు. దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన వై.బాలకృష్ణ కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, ఇన్చార్జ్ డీపీఆర్వో వై.బాలకృష్ణ, డివిజనల్ పీఆర్వో కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్, సిబ్బంది కె.గంగా భవాని, వై.గౌరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అదే దౌర్జన్యం
ఇబ్రహీంపట్నంలో బూడిద దోపిడీపై వైఎస్సార్ సీపీ పోరుబాట భగ్నం ఇబ్రహీంపట్నం: బూడిద డంపింగ్లు, అక్రమ రవాణా, కాలుష్య నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాటను పోలీసులు భగ్నం చేశారు. మూలపాడు, జూపూడిలో టీడీపీ నేతలు అక్రమంగా డంపింగ్ చేసిన బూడిద నిల్వలు పరిశీలించి, లారీ ఓనర్లకు అప్పగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి బుధవారం ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అడ్డుకున్నారు. తమను వెళ్లనీయాలని జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి భర్త గరికపాటి రాంబాబు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని పోలీసులు జోగి రమేష్తో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి వాహనంలో భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జోగి రమేష్కు అండగా నిలిచి ప్లకార్డులు పట్టుకుని.. ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఏసీపీ దుర్గారావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 60మంది పోలీసు సిబ్బంది ర్యాలీని అడ్డుకోవడం గమనార్హం. సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించాలి.. అరెస్ట్కు ముందు జోగి రమేష్ మాట్లాడుతూ బూడిద కాలుష్యం, అక్రమ బూడిద రవాణాపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్కు బూడిద లోడింగ్ అప్పగించి లోకల్ లారీ ఓనర్ల పొట్టకొట్టిందన్నారు. సుమారు 500 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. కాలుష్యంతో నిండిపోయిన ఈ ప్రాంతంలో ఏపీ జెన్కో సంస్థ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించి పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాలుష్య నివారణకు మొక్కలు పెంచి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయ్యింది వీరే.. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, గుంజా శ్రీనివాస్, మిక్కిలి శరభయ్య, మండల, పట్టణ అధ్యక్షులు రెంటపల్లి నాగరాజు, పోరంకి శ్రీనివాసరాజు, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్ను అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. -
కక్ష సాధింపులో భాగమే..
సాక్షి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్గా నిలిచింది. పాలకుల అవినీతిని ఎత్తిచూపుతోంది. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ పత్రిక జర్నలిస్టులను అక్రమ కేసులతో వేధిస్తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డిపైనా కేసులు నమోదు చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఇది సరైన విధానం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.– అవుతు శ్రీశైలజారెడ్డి, డెప్యూటీ మేయర్, విజయవాడకూటమి ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ప్రశ్నిస్తున్న వారిపై కేసులకు తెగబడు తోంది. ప్రజలకు అలవికాని హామీలిచ్చి వాటిని విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పత్రికలపై, వాటి సంపాదకులపై కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రజల ముందు సాక్ష్యాలు ఉన్నప్పటికీ బుకాయించటం, ప్రశ్నించిన వారిపై కూటమి పాలకులు ఎదురు కేసులు పెట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పత్రికపైనా, దాని సంపాదకుడు, జర్నలిస్టులపై పెట్టిన దుర్మార్గపు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.– షేక్ ఆసిఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ -
కేసరపల్లిలో కేంద్ర బృందం పర్యటన
కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లి గ్రామాన్ని బుధవారం నేషనల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెప్యూటీ డైరెక్టర్ అదితి అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ పంచా యతీ పోర్టల్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో పన్నుల వసూళ్ల గురించి రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2021లో తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.45 లక్షలు ఉన్న గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం రూ.2 కోట్లకు పెంచినట్లు సర్పంచి చేబ్రోలు లక్ష్మీమౌనిక తెలిపారు. పెరిగిన ఆదాయంలో గ్రామంలో పలు సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కాఫీ స్టాల్ పరిశీలన అనంతరం ఈ బృందం దుర్గాపురం వద్ద గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కుంభకోణం కాఫీ స్టాల్ను పరిశీలించింది. ఈ స్టాల్ ద్వారా నెలకు రూ.70 వేలు వరకు పంచాయతీకి ఆదాయం సమకూరనున్నట్లు ఇన్చార్జ్ ఈఓపీఆర్డీ రాజబాబు తెలిపారు. పంచాయతీలు ఆదాయం పెంచుకోవాలి అనంతరం అదితి అగర్వాల్ మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీల స్వయం సమృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు కాఫీ స్టాల్, క్రికెట్ నెట్ వంటివి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉపసర్పంచ్ జాస్తి శ్రీధర్బాబు, ఎంపీటీసీ సభ్యులు శొంఠి కిషోర్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్లు చందన, హర్ష, చైతన్య, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా విశ్వకర్మ జయంతి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర పోలీసు అధికా రులతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతిని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు ఎంతో నిష్టతో జరుపుతారని, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకు ప్రసిద్ధి చెందిందని ఏఎస్పీలు తెలిపారు. ఇంజినీరింగ్ ఆర్కిటెక్చర్లే మాత్రమే కాకుండా వివిధ రకాల చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, మెకానిక్లు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, మొదలైన వారు కూడా ఎంతో నియమ నిష్టలతో జరుపుకుంటారని వివరించారు. పట్టుదల, నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఎంత కష్టమైనా పనినైనా తేలికగా సాధించవచ్చు అని తెలియచెప్పే విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ ఎస్పీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
బందరు టీడీపీలో ముసలం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాలకు సంబంధించిన తాజా పరిణామాలపై మచిలీపట్నం టీడీపీ ముఖ్య నేతల మధ్య ముసలం ముసురుకుంది. మచిలీపట్నం ముఖ్య నాయకులు విజయవాడకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులతో కుమ్మక్కై దేవస్థానం భూముల విషయంలో సహకరించారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లి దేవస్థానం భూములను కాపాడుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడాన్ని బట్టి నాయకుల తీరు తేటతెల్లమవుతోందని పార్టీలు, వర్గాలకు అతీతంగా బందరు వాసులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక ఎత్తుగడతో.. దసరా ఉత్సవాల సమయంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వినోద, ఆహ్లాద కార్యక్రమాల కోసం ‘విజయవాడ ఉత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక దీర్ఘకాలిక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గొడుగుపేట ఆలయానికి చెందిన 35 ఎకరాల్లో విజయవాడ ఉత్సవ్ పేరిట శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, అయిదు ఎకరాల్లో గోల్ఫ్కోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నట్లు బందరు వాసుల దృష్టికి పదిరోజుల కిందటే వెళ్లింది. విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత, విజయవాడకు చెందిన రాష్టస్థాయి కార్పొరేషన్ చైర్మన్, బందరు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్ యజమాని, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ పేరిట ఆలయ భూములను శాశ్వత ప్రాతిపదికన పొందేలా గూడు పుఠాణి చేస్తున్నారని అక్కడి ప్రజలు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ముందుగానే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది కూడా. అఖిలపక్షం సమావేశంలో చర్చించి.. ఆలయ భూముల విషయంలో ఏదో తేడా జరుగుతోందని భావించిన బందరులోని ధార్మిక సంస్థలు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలతో పాటు పలు సంఘాలు సమావేశమయ్యాయి. తమకు గాని, తమ పార్టీ నాయకులకు గాని ఏమీ తెలియదని టీడీపీ వారు తెల్లముఖం వేశారు. సమావేశం నుంచే జనసేన నాయకుడు ఎం.రాము మంత్రి కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి ఆలయ భూములకు సంబంధించి ఏం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను స్థానికంగా అందు బాటులో లేనని, గొడుగుపేట ఆలయ భూముల విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడతానని నమ్మబలికారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైఎస్సాఆర్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆలయానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది వివరించారు. దేవస్థానానికి విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ సరైన ఆలనాపాలనా లేదని, వర్షం వస్తే స్వామి విగ్రహంపై చినుకులు పడుతుండటాన్ని గమనించి రూ.2 కోట్లతో త్రిదండి చినజీయర్ స్వామి ద్వారా ఆలయ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించి పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరుసటి రోజే కొల్లు మాట మారింది.. సమావేశం మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం వద్దకు వచ్చి ఎవరికీ, ఏ సొసైటీకి, ఏ అవసరాలకు భూములు ఇవ్వడంలేదని, కలెక్టర్కు చెప్పి ఆపించేస్తామని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర మాట 24 గంటల్లోగా మారిందని సమావేశంలో పాల్గొన్న వారు గుర్తుచేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కొమ్మారెడ్డి పట్టాభి తదితరులను వెంటబెట్టుకుని మంత్రి రవీంద్ర రూ.45లక్షల చెక్కును దేవస్థానం వారికి అందజేశారని సుజయ్ కుమార్, రాజశేఖర్, అయోధ్యరామయ్య తదితరులు వివరించారు. తాము పరిస్థితులను అంచనా వేసుకున్నందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. విదేశీ టూర్కు కొనకళ్ల.. స్థానికంగా టీడీపీలోని తాజా పరిస్థితులను అంచనా వేసుకున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖం చాటేస్తూ బుధవారం విదేశాలకు పయనమయ్యారు. అమెరికాతో పాటు టర్కీ, మక్కా తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. బంధువుల వద్దకు అంటూ బయలుదేరిన ఆయన దసరా ఉత్సవాల తరువాతే తిరిగి రానున్నారు. గొడుగుపేట ఆలయ భూములే కాదు రాష్ట్రంలోని ఏ ఆలయం, మరే ధార్మిక సంస్థకు చెందిన సెంటు భూమి కూడా పరులకు దక్కనీయకుండా అడ్డుకుంటా మని బందరుకు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు బూరగడ్డ సుజయ్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. స్వామి భూమిని కాపాడుకోవడానికి తనతో పాటు వీహెచ్పీ, బీజేవైఎం నాయకులు రాజశేఖర్, అయోధ్యరామయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా సుజయ్కుమార్ పెడన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ బాబాయ్ కుమారుడు. స్థానిక టీడీపీ నాయకులు సైతం ఆలయ భూముల విషయంలో మంత్రి కొల్లు తీరును తప్పుపడుతుండటం గమనార్హం. -
మైనార్టీల ద్రోహి గద్దే
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముస్లింల చిరకాల ఆకాంక్ష అయిన షాదీఖానా నిర్మాణ పనులను నిలిపివేసి, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పిచ్చయ్యవీధి చివర బందరు కాల్వ ఒడ్డున గత ప్రభుత్వంలో ప్రారంభించిన షాదీ ఖానా పనులు నేటికీ పూర్తి కాకుండా, మధ్యలో నిలిపివేయడంతో దానిని వైఎస్సార్ సీపీ నేతలు బుధవారం పరిశీలించారు. తొలుత వైవీరావు ఆస్పత్రి రోడ్డులోని కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం కార్యాలయం నుంచి పార్టీ నేతలు, ముస్లిం మైనార్టీలు షాదీఖానా వరకూ ర్యాలీగా వెళ్లారు. అబద్దాలు చెబుతూనే ఉన్నారు.. దేవినేని అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామన్నారు. మైనార్టీల కోసం నాడు వైఎస్ జగన్ ఆర్అండ్బీ స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారన్నారు. ఆయన 2014 నుంచి షాదీఖానా విషయంలో అబద్దాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మైనార్టీ నేతలు పాల్గొన్నారు. -
డీఎస్సీలో రాణించిన 17 మందికి సత్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొందిన 17 మంది అభ్యర్థులను గ్రంథాలయాధికారులు సత్కరించారు. బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, కార్యదర్శి వి. రవికుమార్ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మరింత మంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వసతి లేని విద్యార్థులు గ్రంథాలయాల్లో చదువుకోవాలన్నారు. ఉద్యోగాలు సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ గ్రంథాలయ అధికారి కె.రమాదేవి, గ్రేడ్ 3 గ్రంథ పాలకురాలు వై.ధనలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.డిజిటల్ అరెస్టు పేరుతో రూ.42.20 లక్షలకు టోపీలబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని బెదిరించి రూ.42.20 లక్షలు స్వాహాచేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. 76 ఏళ్ల నరపరెడ్డి సత్యనారాయణమూర్తి నంద మూరినగర్ ఆరో లైన్లో నివశిస్తున్నారు. అతనికి ఈ నెల 11న ఎస్కే చౌదరి డేటా ప్రొటెక్టింగ్ బోర్డు ఆఫీసర్ పేరుతో కాల్ చేశారు. అతని ఆధార్ కార్డు చెల్లనిదిగా మారిందని, సేఫ్టీ కోసం మరో అకౌంట్ తెరవాలని నమ్మబలికారు. అనంతరం క్రైమ్ పోలీసుల మంటూ మరో రెండు నంబర్ల నుంచి వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వృద్ధుడిపై అరెస్టు వారెంట్ ఉందంటూ బెదిరించారు. పదే పదే ఫోన్లు చేసి డిజిట్ అరెస్టు అంటూ వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక వృద్ధుడు ఈ నెల 15న ఆర్టీజీఎస్ ద్వారా రూ.42,20,280 వారు చెప్పిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్ క్రైమ్ స్టేషన్లో సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.యువకుడిపై పోక్సో కేసు నమోదుమైలవరం(జి.కొండూరు): మైలవరం మండలంలోని పోరాటనగర్ గ్రామానికి చెందిన యువకుడు అజ్మీరా రమేష్నాయక్పై పోలీసులు బుధవారం పోక్సో కేసు న మోదు చేశారు. మైలవరం పోలీసుల కథనం మేరకు.. పోరాటనగర్ గ్రామానికి చెందిన అజ్మీరా రమేష్నాయక్ అదే గ్రామానికి చెందిన 17 బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం ఆమైపె లైంగికదాడి చేశాడు. రమేష్నాయక్ వేధింపులు తాళలేక ఆ బాలిక ఈ నెల 9వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సఅనంతరం కోలుకున్న బాలిక అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తల్లి మైలవరం పోలీసులకు బుధవారం పిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్నాయక్ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
విమానాశ్రయంలో ఘనంగా యాత్రి సేవ దివస్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో బుధవారం యాత్రి సేవ దివస్ను ఘనంగా నిర్వహించారు. తొలుత విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, భద్రత దళాలను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ట్యాక్సి, క్యాబ్స్ డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ప్రయాణికులకు సాధరణ హెల్త్ చెకప్లు నిర్వహించారు. వంద మంది జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకు విమానాశ్రయ సందర్శనకు అవకాశం కల్పించారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. యాత్రి సేవ దివస్ను పురస్కరించుకుని విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు ప్రత్యేకంగా తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు విమానాశ్రయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సమాజాభివృద్ధికి దోహదపడే రచనలు చేశా
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష, సాహిత్యంపై ఉన్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజానికి దోహపడే అనేక నవలలు, కథలు, నాటకాలు రచించానని తెలుగు, సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ (శరత్చంద్ర) పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం సంపాదకులు, రచయితలు, భాషాభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష సౌందర్యం మాట్లాడటంలో, సాహిత్యం చదవడంలో ఇమిడి ఉందన్నారు. కులానికి, మతానికి భాషను ఆపాదించవద్దని కోరారు. తెలుగు, సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం శరత్చంద్రను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పే జానపద గేయాలు, తెలుగు సాహిత్య పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు, సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ -
వెంకన్న సేవలో ఇస్రో శాస్త్రవేత్త
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బెంగ ళూరు ఇస్రో సైంటిస్ట్ రాజా వీఎల్ఎన్ శ్రీధర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించి స్వామివారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాలను అందించారు. తొలుత ఆయన కుటుంబం పేరిట స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలను చేశారు. -
సంస్కరణల పేరుతో విద్యారంగం నిర్వీర్యం
గన్నవరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్థిక, విద్యారంగ సమస్యలపై మంగళవారం యూటీఎఫ్ చేపట్టిన రణభేరి జిల్లా బైక్ ర్యాలీని గన్నవరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. విద్యాహక్కు చట్టం, ప్రపంచ బ్యాంక్ సాల్ట్ పథకం అమలు వల్ల మూడో వంతు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్గా మారా యని చెప్పారు. ఉపాధ్యాయులను చదువులకు కాకుండా బోధనేతర పనులకు ఉపయోగించడం వల్ల విద్యా రంగం కుంటుపడుతుందన్నారు. కనీసం ఉపాధ్యాయ, ఉద్యోగ నేతలతో మాట్లాడే తీరిక కూడా సీఎం చంద్రబాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగ సంస్కరణల వల్ల విద్యార్థులకు జరిగిన మేలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 25న బహిరంగ సభ.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి పదిహేను నెలలు గడిచినప్పటికీ కొత్త కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదన్నారు. కనీసం ఒక డీఏ కూడా ఇవ్వలేదని, పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్ర భు త్వం తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 25న వేలాది మంది ఉపాధ్యాయులతో బహిరంగ సభ జరుగుతుందన్నారు. సంస్కరణలపేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మరో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ధ్వజ మెత్తారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సౌకత్ హుస్సేన్, కార్యదర్శి బి. కనకరావు, కోశాధికారి మరీదు వరప్రసాద్, గౌరవాధ్యక్షుడు లెనిన్బాబు, నాయకులు పాల్గొన్నారు. సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమించాల్సిందే యూటీఎఫ్ రణభేరిలో వక్తలు -
చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలి
చల్లపల్లి: ఇంట్లో చెత్తను నిల్వ ఉంచుకోకుండా దానిని ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తలుగా వేరుచేసి పంచాయతీ వారికి అప్పగించటం ద్వారా ఇంటిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు ఆదాయ వనరుల్ని కూడా సృష్టించుకోవచ్చని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పేర్కొన్నారు. స్థానిక తరిగోపుల ప్రాంగణంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద మంగళవారం చెత్త సేకరణపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)లకు ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. కృష్ణాజిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి ఏడు మండలాలకు చెందిన 65 మంది సీఆర్పీలు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు అంశాలపై సీఆర్పీలకు చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, పెదకరగ్రహారం కార్యదర్శి కె.నరసింహారావులు శిక్షణ ఇచ్చారు. డివిజినల్ పంచాయతీ అధికారి ఎండీ రాజావుల్లా, ఇన్చార్జి ఎంపీడీవో అతావుల్లా, ఇన్చార్జి డెప్యూటీ ఎంపీడీవో సీహెచ్ ఉమామహేశ్వరరావు శిక్షణ తరగతులను పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి అరుణ -
పునరావాసం పొందిన వారితో సహనంగా ఉండాలి
నున్న(విజయవాడరూరల్): మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలను మానుకునేందుకు చికిత్స అనంతరం, పునరావాసం పొందిన వ్యక్తుల పట్ల కుటుంబ సభ్యులు కరుణ, సహనంతో వ్యహరించాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు. వారు పిల్లల మాదిరిగానే ఉంటారని, సమాజంలో సజావుగా తిరిగి కలిసిపోవడానికి వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని ఇండ్లాస్ శాంతివన్ ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శాంతివన్ను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం సందర్శించారు. తొలిసారిగా నున్న గ్రామం విచ్చేసిన ఆయనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మానసిక ఆరోగ్యం, వ్యసనంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ మానసికంగా బాధపడుతున్న, వ్యసనానికి గురైన రోగులకు పునరావాసం కల్పించడంలో డాక్టర్ విశాల్ రెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసించారు. మచిలీపట్నంఅర్బన్: మహిళల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వ్యాప్తంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. వెంకట్రావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాలపాటు జిల్లాలోని 357 ఎంఎల్హెచ్పీసీ కేంద్రా లు, 49 పీహెచ్సీలు, 14 యూపీహెచ్సీలు, 7 సీహెచ్సీలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 54 వైద్య శిబిరాల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు, మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. తొలుత ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారని, ఆయన ప్రసంగాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి -
కృష్ణా వర్సిటీలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
కోనేరుసెంటర్: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్సీసీ కేడెట్లు జాగృతి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో క్యాడెట్లు ఓజోన్ పరిరక్షణ, వాయు కాలుష్యం నివారణ, ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బోర్డింగ్ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ డి.రామశేఖర్రెడ్డి మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడేది ఓజోన్ పొర, దానిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కాలుష్య నియంత్రణ, జీవనశైలి మార్పులు, ప్రకృతి వనరుల సంరక్షణ ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించగలమని ఆయన చెప్పారు. ఎన్సీసీ యూనిట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడినట్లు ప్రతిజ్ఞ చేశారు. -
డిగ్రీతో దాగుడుమూతలు!
అగమ్యగోచరంగా విద్యార్థుల భవిత వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై నేటికి ఐదు మాసాలు కావొస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ఆలస్యం జరగటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ముగిసిన డిగ్రీ అడ్మిషన్లు.. ఏటా జూలై మాసం లేదా ఆగస్టులో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా తరగతులను సైతం ప్రారంభిస్తారు. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయలేదు. దాంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. పక్క రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోయినట్లయితే వాటి పరీక్షలు సైతం తీవ్రంగా ఆలస్యం జరిగే అవకాశముంటుంది. తత్ఫలితంగా పీజీ అడ్మిషన్లతో పాటుగా ఇతర పోటీ పరీక్షలు తదితర అంశాల్లో అవకాశం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాలపైన వాయిదాలు.. సెప్టెంబర్ ఒకటో తేదీన డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామని అధికారులు నోటిఫికేషన్లో ప్రకటించారు. దానిని సాంకేతిక లోపాలంటూ సెప్టెంబర్ మొదటి వారం అని ప్రకటించారు. దానిని సైతం వాయిదా వేసి ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులతో పాటుగా విద్యారంగ నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా తరగతులు ప్రారంభం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రైవేట్ కళాశాలలు డిగ్రీ అడ్మిషన్లు అధికారికంగా ఖరారు కాకపోయినా తరగతులను ప్రారంభించేశారు. అయితే సీట్ల కేటాయింపు జరగకుండా తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీట్లు ఆయా కళాశాలలో రాకపోయినట్లయితే వారి పరిస్థితి ఏమిటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారుగా 140 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 90 కళాశాలల వరకూ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. సుమారుగా 30వేల నుంచి 35వేల సీట్లు ఆయా కళాశాలలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట సింగిల్, డబుల్ మేజర్ విధానంలో మార్పులు తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావుడి చేశారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యాక గత నెలలో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు ప్రక్రటించారు. అయితే దానిని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆగస్టు 20న ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి తేదీన తరగతులు ప్రారంభిస్తామని చెప్పి దానిని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఆందోళనలో 30వేల మంది.. విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గందరగోళంగా ఉన్నాయి. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చేశారు. సెప్టెంబర్ గడచిపోతున్నా ఇప్పటి వరకూ సీట్లు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఇంటర్ ఫలితాలు వచ్చి ఐదు మాసాలు దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాకపోవటం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్లో విద్యార్థుల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుంది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కోడూరు: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. ఎస్ఐ చాణిక్య కథనం ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు(28) ఈ నెల 14న ఉల్లిపాలెం వారధి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నదిలో పడి గల్లంతయ్యాడు. శ్రీనివాసరావు తండ్రి నాగబసవయ్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక మత్స్యకారుల సహకారంతో రెండు రోజుల పాటు నదిలో ప్రత్యేక బోట్లపై గాలింపు చేపట్టగా, మంగళవారం ఉదయం శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. హంసలదీవి–ఉల్లిపాలెం గ్రామాల సమీపంలో మడ అడవుల్లో చిక్కుకొని శ్రీనివాసరావు మృతదేహం ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి నందివాడ: విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలైన ఘటన నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పెదవేగి మండలం గార్లమడుగు గ్రామనికి చెందిన 10మంది వ్యక్తులు దేవీశరన్నవరాత్రులు సందర్భంగా ఇనుప పందిరి వేస్తుండగా అందులో పోతురాజు పవన్ కుమార్(25), అర్జున్(22) పందిరి పైన ఉండి పైపులు తగిలిస్తున్నారు. ఈ క్రమంలో పైన ఉన్న కరెంట్ వైర్లు ప్రమాదవశాత్తూ పవన్ చేతికి తగలటం వల్ల షాక్ తగిలి కిందకి పడిపోయాడు. తలకి గాయం కాగా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే పైపు పట్టుకొని అర్జున్కి కూడా కరెంట్ షాక్ తగలడంతో తను కూడా కిందపడిపోయాడు. దీంతో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అతడిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుని బాబాయి అయిన పోతురాజు వెంకటేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. శ్రీనివాస్ తెలిపారు. 18న జిల్లా స్థాయి పోటీలు గూడూరు: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలలో జిల్లా స్థాయి షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలు మత్తి అరుణ, గంపా రాంబాబు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలను విజయవాడ భవానీపురంలోని గ్లోరియస్ షూటింగ్ అకాడమీలో ఏర్పాటు చేశామన్నారు. ● అండర్–17 బాలురు, బాలికల విభాగం వెయిట్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి ఎంపికలు చిల్లకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, అండర్–14, 17 బాలురు, బాలికల విభాగం స్విమ్మింగ్ పోటీలను ఈడుపుగల్లులోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతాయని వెల్లడించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్స్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. -
ఆటో కార్మికులతో చెలగాటం
ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఆటో కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అన్నారు. విజయ వాడ అజిత్సింగ్నగర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్కు చెందిన ఆటో కార్మి కులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ రుహుల్లాను కలిశారు. తమకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమాన్ని అందించినది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుతం చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందని, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలపై త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలలో ప్రస్తావిస్తామన్నారు. పలువురు ఆటో కార్మికుల మాట్లాడుతూ తమకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లోనే సంతోషంగా ఉందని, ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నాల్గో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకరావు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారికి కూడా ఐటీఐలో ప్రవేశానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో చేరాలనుకునే వారికి ఈ నెల 29వ తేదీ, ప్రైవేటు ఐటీఐలో జాయిన్ కావాలనుకునే వారికి ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. మరో ముగ్గురికి డయేరియా లక్షణాలు అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): న్యూరాజరాజేశ్వరీపేటలో డయేరియా నిలకడగా ఉంది. మంగళవారం నలభై మంది వరకూ అనారోగ్యాలతో వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో ఇద్దరికి వాంతులు, మరో ముగ్గురికి విరేచనాలతో బాధపడుతుండగా.. ముగ్గురికి మాత్రమే డయేరియా లక్షణాలు కనిపించాయి. ఆరోగ్య శాఖ అధికారులు బాధితులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇంకా తెలియని కారణం.. న్యూఆర్ఆర్పేటలో ‘డయేరియా’కు గత కారణాలు ఇంకా తెలియకపోవడంతో అధికారులు సింగ్నగర్, న్యూఆర్ఆర్పేటలోని మాంసం దుకాణాలు, బిర్యానీ హోటళ్లు, టీ సెంటర్లు, బేకరీలు, తినుబండరాల వ్యాపారాలతో పాటు బార్లు, వైన్ షాపులను మూసి వేయించారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
పెడన: మండలంలోని పలు గ్రామాలు, పెడన పట్టణంలో విషజ్వరాలు విజృంభించాయి. పెడన పీహెచ్సీలో మంగళవారం ఓపీ వందకు పైగా ఉంది. ఓపీకి జ్వరపీడితులే అధికం వచ్చారు. రోగులకు సైలెన్ పెట్టడానికి బెడ్లు ఖాళీ కరువైంది. దీంతో ఆవరణలో కొత్తగా వచ్చిన బెడ్లపై రోగులకు సైలెన్లు పెట్టారు. ఒకరికి ఒక బాటిల్ పెట్టి రేపు రావాలని వైద్యాధికారులు సూచించడంతో మరొకరిని ఆ బెడ్పై పడుకోబెట్టి సైలెన్ పెడుతున్నారు. వైద్యాధికారిణి మీనాదేవి మాట్లాడుతూ పట్టణంతో పాటు మండలంలోని పలు చోట్ల నుంచి వైరల్ ఫీవర్స్తో వస్తున్నారని, వారిని పరీక్షించి మందులు ఇస్తున్నామని తెలిపారు. కొందరికి సైలెన్ బాటిళ్లు పెట్టినట్లు పేర్కొన్నారు. -
రెగ్యులర్ చెకప్ అవసరం
ఒబెసిటీ ఉన్న వారు రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ పరీక్షలతో పాటు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒబెసిటీని అధిగమించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వస్తాయి. వారిలో మెటబాలిజం దెబ్బతింటుంది. అదుపులో లేని మధుమేహం, రక్తపోటు సమస్యలకు తారి తీస్తుంది. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీమ్లు తినకుండా ఉండటం ఉత్తమం – డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు, విజయవాడ ● -
ఎన్టీఆర్ జిల్లాలో 32 మలేరియా కేసులు
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 32 మలేరియా కేసులు ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి మోతీలాల్ తెలిపారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని తుఫాన్ కాలనీలో ఆయన మంగళవారం పర్యటించారు. డెంగీ లక్షణాలతో ఆదివారం మృతి చెందిన యువతి పెద్ది రూప కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇచ్చిన రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం మలేరియా కేసులు 32, డెంగీ కేసులు ఏడు ఉన్నాయని తెలిపారు. టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నా యని పేర్కొన్నారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. పెద్ది రూప మెడికల్ రిపోర్టుల్లో టైఫాయిడ్తో పాటు కిడ్నీ సమస్యలతో మృతి చెందినట్లు ఉందన్నారు. తుఫాన్ కాలనీతో పాటు మోడల్ కాలనీలో ఐదు వైద్య బృందాలు ఇంటింటి సర్వేతో పాటు రక్త నమూనాలు సేకరిస్తున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారంతో దోమ లార్వా నాశనం చేసేందుకు అబేట్తో పాటు ఫాగింగ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, వైద్యాధికారి నాగలక్ష్మి, జగ్గయ్యపేట డివిజన్ సబ్యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సీహెచ్ఓ వెరోనిక, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలకు దుర్గగుడి ముస్తాబు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి, అయ్య వార్ల ఆలయాలను ఇప్పటికే రంగులతో అందంగా అలంకరించారు. దుర్గగుడి ప్రాంగణంలోని ఉపాలయాలు, ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న కారిడార్ను ముస్తాబు చేస్తున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు ఆలయానికి రంగులు వేయకపోవడంతో భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను రంగులు వేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఈఓ శీనానాయక్ మంగళవారం పరిశీలించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసే ఇతర ఆలయాల సిబ్బందికి కేటాయించే వసతి గృహాలను తనిఖీచేశారు. సీతానగరంలోని దత్తత ఆలయంలో సిబ్బంది గదులు, భోజన వసతిపై ఆరా తీశారు. అనంతరం ఆలయానికి చేరుకుని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద వివిధ ప్రభుత్వ శాఖలకు కేటా యించే పోడియాలు, టికెట్ స్కానింగ్ పాయింట్లు, మీడియా పాయింట్లు, చెప్పుల స్టాండ్, ఓం టర్నింగ్ నుంచి క్యూలైన్లను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మాస్టర్ ట్రైనర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్థానిక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధ్యక్షతన మంగళవారం జీరో పావర్టీ 94 పాలసీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీల నుంచి మొత్తం 315 మంది మాస్టర్ ట్రైనర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అర్థగణాంక శాఖ డెప్యూటీ డైరెక్టర్ కె.సౌజన్య, ప్లానింగ్ విభాగం పీఎం యూనిట్ నుంచి హారిక పాల్గొని శిక్షణ ఇచ్చారు. జీరో పావర్టీ, పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల దత్తత అనంతర చర్యల కోసం ప్రామాణిక విధానాన్ని రూపొందించారని సౌజన్య, హారిక తెలిపారు. పీ–4కు దాతలు అందించే విరాళాలకు ప్రస్తుత చట్టాల ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. కొత్త కుటుంబాల చేర్పు, డూప్లికేట్, తప్పుల తొలగింపు, సవరణలు, మార్పులు సీఈఓ అండ్ ఎస్ఏపీఎప్ ఆమోదంతోనే అమలవుతాయని వివరించారు. మార్గదర్శుల ప్రామాణీకరణ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారని తెలిపారు. నిజమైన దాతలు, మెంటార్లు మాత్రమే బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి అనుమతి లభిస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి సీపీఓ వై.శ్రీలత, ఎస్ఓడీ వి.ఎస్.ఆర్.ప్రసాద్, డెప్యూటీ కలెక్టర్లు ఎ.రవీంద్ర, కె.పోసిబాబు, జిల్లాలోని డీవైఎస్ఓ, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
కోడూరు: అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన రాజబోయిన సోమేశ్వరరావు(35) గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల కడుపులో పేగు పూసి ఆహారం తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నాడు. తరచూ కడుపు నొప్పి రావడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం సాయంత్రం పందికొక్కులకు పెట్టే మందు బిళ్లలను తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు సోమేశ్వరరావును హుటాహుటినా అవనిగడ్డలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం విజయవాడ తరలిస్తుండగా సోమేశ్వరరావు మృతి చెందినట్లు ఎస్ఐ చెప్పారు. మృతుడు తల్లి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 86 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 86 అర్జీలు అందగా వాటిలో భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 40, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించినవి 2, వివిధ మోసాలకు సంబంధించినవి 5, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 9, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 20 ఫిర్యాదులు అందాయి. -
ఆటో కార్మికులను ఆదుకోండి
రవాణా శాఖ మంత్రి ఇంటి వద్ద నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): సీ్త్ర శక్తి పథకం వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బృందావన కాలనీ నందమూరి రోడ్డులోని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి నివాసం వద్ద సోమవారం ఉదయం ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత పలువురు ఆటో కార్మికులు మంత్రి రాంప్రసాద్రెడ్డిని కలిసి సీ్త్ర శక్తి పథకం అమలు చేసిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఇంటి ముందు బ్యానర్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. సజావుగా సాగుతున్న వారి జీవితాలు, ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రతి కార్మికునికి నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీఓ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. -
అప్పుల బాధతో బలవన్మరణం
తాడేపల్లిరూరల్: పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ పండ్ల వ్యాపారి మద్యానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన వెంకన్న (45) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చి సాంబమూర్తిరోడ్లోని బావాజీపేట 1వ లైన్లో నివసిస్తున్నాడు. అతను పండ్ల వ్యాపారి. వెంకన్న మద్యానికి బానిసై అందినచోటల్లా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో అప్పులు తీర్చలేక తాడేపల్లి రూర ల్ కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసుల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో తాడుతో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మహిళల ఆరోగ్య రక్షణకు స్వస్థనారి స్వశక్తి పరివార్
మచిలీపట్నంఅర్బన్: మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సోమవారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాలపాటు నిర్వహించే వైద్యశిబిరాల్లో 429 కేంద్రాల్లో వివిధ పరీక్షలు, వైద్యసేవలు అందిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖాధికారులు, హెల్త్ వెల్నెస్ సెంటర్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.వెంకట్రావు మాట్లాడుతూ మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. థైరాయిడ్, బీపీ, సుగర్ వంటి సమస్యలపై కూడా వైద్యులు పరిశీలన చేస్తారన్నారు. యాన్ఎన్సీ స్క్రీనింగ్, కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య పరీక్షలు, పాప్స్మియర్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు, మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెఆర్ఆర్సీ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారి కుముదిని సింగ్, డీసీహెచ్ ఎస్.శేషుకుమార్, డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఓ చంద్రశేఖర్ -
వికటించిన ఇంజెక్షన్.. చిన్నారి మృతి
మచిలీపట్నం అర్బన్: స్థానిక రామానాయుడుపేట సెంటర్లోని ఒక ప్రైవేట్ పిల్లల ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం మచిలీపట్నంలో కలకలం రేపింది. చింత చెట్టు సెంటర్కు చెందిన ఫాతిమా అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించటంతో చిన్నారి విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వెలుగులోకి రాకుండా డాక్టర్, ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. దీనిపై నగరంలోని నాయకులు పంచాయతీ నిర్వహించి, చిన్నారి ప్రాణాలకు విలువ కట్టడం మరింత వివాదాస్పదమైంది. చిన్నారి మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వైద్యుడు అధికార పార్టీ నేతలను ఆశ్రయించినా, తల్లిదండ్రులు, బంధువులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి స్థానిక టీడీపీ, బీజేపీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి పంచాయతీ పేరుతో చిన్నారి ప్రాణానికి రూ.లక్షలు వెలకట్టినట్లు సమాచారం. వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా ఆస్పత్రి వైద్యుడు, పంచాయతీ పెద్దలు తీవ్రంగా ప్రయ త్నించినా, విషయం బయటకు రావడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
మహిళ మృతదేహంతో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు. అసలేం జరిగిందంటే.. గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్తో పాటు, తండ్రి కుమార్బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య.. హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
సకాలంలో అర్జీలు పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సకాలంలో పరిష్క రించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత డీఆర్వో మాట్లాడుతూ అర్జీలు పరిష్కరించే అధికారి తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి అతని సమస్య పరిష్కారమైందో, లేదో విచారించాలన్నారు. ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో ఉందని అందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువగా అర్జీలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాల్సెంటర్ ఫీడ్ బ్యాక్లో 1100 లో సంతృప్తిస్థాయిలో కృష్ణాజిల్లా వెనుకబడి ఉందని అసంతృప్తి మరలా ఏ ప్రభుత్వశాఖలో కనపడుతుందో ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మీకోసంలో అధికారులు మొత్తం 166 అర్జీలను స్వీకరించారు. ప్రధానమైన అర్జీలు ఇవే : ● తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామానికి చెందిన కె.వరలక్ష్మి తన కుమారుడు నరేష్ గరిక పర్రు హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడని, తనకు రావాల్సిన తల్లికి వందనం డబ్బులు ఆవుల స్వప్న అనే మహిళ ఖాతాకు జమ అయ్యాయని, తనకు తల్లికి వందనం డబ్బులు వచ్చేలా చేయాలని కోరారు. ● మచిలీపట్నం 29వ డివిజన్లో 29/346–1 డోర్ నంబరు గల గృహ యజమాని రహదారిని ఆక్రమించారని, ఈ స్థలాన్ని రీ–సర్వే చేయించి మునిసిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.మురళీకృష్ణ అర్జీ ఇచ్చారు. -
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోడూరు: బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు (28) ఆదివారం సాయంత్రం తన భార్యను కోడూరులోని ఓ ప్రైవేట ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాసరావు ఉల్లిపాలెం సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్తున్నట్లు తన తండ్రి నాగబసవయ్యకు చెప్పి వెళ్లాడు. అయితే రెండు గంటలు దాటినా కూడా శ్రీనివాసరావు రాకపోవడంతో తండ్రి నాగబసవయ్య బంధువులతో కలిసి ఉల్లిపాలెం వారధి వద్దకు వెళ్లాడు. శ్రీనివాసరావు బైక్, చెప్పులు ఉల్లిపాలెం వారధిపై ఉండడాన్ని గమనించారు. కిందకి చూడగా.. నదిలో పడి కొట్టుకుపోతున్నట్లు గమనించి, కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.. ఉల్లిపాలెం వద్ద కృష్ణానదిలో గల్లంతైన శ్రీనివాసరావు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో నదిలో బోట్లపై గాలింపు జరిపారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఉల్లిపాలెం నుంచి హంసలదీవి వరకు నదిని జల్లెడ పట్టారు. సముద్ర పోటుతో పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో శ్రీనివాసరావు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా దొరకలేదని ఎస్ఐ చెప్పారు. మంగళవారం గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. -
కారులో నగదు చోరీ
తిరువూరు: స్థానిక బైపాస్రోడ్డులో సోమవారం సాయంత్రం ఆగి ఉన్న కారులో నగదు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తిరువూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో రూ.లక్ష నగదు ఉపసంహరించిన అనంతరం కారు డ్యాష్బోర్డులో ఉంచిన మొగిలి సురేష్ బైపాస్రోడ్డుకు వెళ్లి మంచినీటి బాటిల్ కొనుగోలు చేయడానికి కారు రోడ్డు పక్కన నిలిపాడు. క్షణాల్లో కారులో నగదును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరిన సీఐ గిరిబాబు, ఎస్ఐ సత్యనారాయణలు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి నందివాడ: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కె. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలపర్రు గ్రామానికి చెందిన కూర్మ వెంకటేశ్వరరావు(26) తన ఇంటి వద్ద నుంచి గేదెలను మేతకు తోలుకొని ఇలపర్రు గ్రామ శివారులో ఉన్న చెరువు మీదకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ చెరువు మీద ఉన్న కరెంటు వైర్లు అతనికి తాకడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ విషయం చెరువు మీద వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మృతుని అన్నయ్య కూర్మ నాగరాజుకు తెలియపరిచాడు. అతను వచ్చేసరికి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. -
కృష్ణా జేసీ గీతాంజలిశర్మ బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలిశర్మను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. గీతాంజలిశర్మ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ముంబై ఐఐటీలో డేటా ఎనలటిక్స్పై శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ప్రస్తుతం ఇన్చార్జ్ బాధ్యతలను డీఆర్వో చంద్రశేఖరరావు నిర్వర్తిస్తున్నారు. జాయింట్ కలెక్టర్గా గీతాంజలిశర్మ 2024 జనవరి 5వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 20 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. -
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కృష్ణాజిల్లా నూతన ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కృష్ణాజిల్లాకు ఎస్పీగా రావటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి విధి నిర్వహణ కనపరుస్తానన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని, రాజకీయ నాయకులు, అధికారుల మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేయటం, ప్రచురించటం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలుత నూతన ఎస్పీ విద్యాసాగర్నాయుడుకు జిల్లా పోలీసు అధికారులు సకల లాంఛనాలతో ఘనస్వాగతం పలికారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీలు వి.వి.నాయుడు, బి.సత్యనారాయణలతో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.నూతన ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్నాయుడువిద్యాసాగర్నాయుడు ప్రస్థానం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్నాయుడు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. తండ్రి రైల్వేలో ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. తల్లి గృహిణి. 2016లో పోలీస్ శాఖలోకి అడుగుపెట్టారు. ఆయన ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే 24 ఏళ్లకే సివిల్స్లో 101వ ర్యాంకు సాధించారు. అనంతరం అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, ఏఎస్పీ చింతపల్లి, డీసీపీ లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం, ఎస్పీ గ్రేహౌండ్స్తో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కృష్ణాజిల్లా ఎస్పీగా వచ్చారు. -
నగరాలు సంఘం ఆధ్వర్యంలో పలువురికి సత్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): శ్రీనగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ప్రముఖులను సత్కరించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీ.రావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, పోతిన వెంకటమహేష్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరాలు రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరని చెప్పారు. ఉత్తరాంధ్రలోని పదికిపైగా నియోజకవర్గాలు, పిఠాపురం, పాలకొల్లు, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. సామాజిక నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేశ్వరరావు, డైరెక్టర్లతో పాటు బుద్దా వారి దేవస్థాన కమిటీ చైర్మన్ పిళ్లా సుదర్శనరావు, ఏపీసీఎస్ చైర్మన్ పోతిన ప్రసాద్, గొల్లపూడి మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ అడ్డూరి లక్ష్మీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంటింటికీ పరిశుభ్రత’ కిట్ పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): అజిత్సింగ్నగర్లోని న్యూ ఆర్ఆర్పేటలో ఆదివారం వీఎంసీ సిబ్బంది ఇంటింటికీ హౌస్ హోల్డ్ హైజిన్ కిట్ (ఇంటి పరిశుభ్రత కిట్ )ను పంపిణీ చేశారు. అతిసారా నివారణకు ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో అందజేసిన ఇంటి పరిశుభ్రత కిట్లో.. లిక్విడ్ హ్యాండ్ వాష్, సబ్బులు, నాప్ కిన్స్, ఫినాయిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా ఆహారం తినక ముందు తినిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని, క్రిములు సోకకుండా ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేయాలని, ఇంటిని, మరుగుదొడ్లను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ డిహైడ్రేషన్ అయితే ఓఆర్ఎస్ నీరు తాగాలని వీఎంసీ సిబ్బంది స్థానికులకు సూచించారు. స్వామివారికి నిత్యాన్నదాన ట్రాలీలు సమర్పణ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి భక్తుల సౌకర్యార్థం దాత లు ఆదివారం ట్రాలీలు బహూకరించారు. ఉద యం ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం సుమారు రూ. 1.20 లక్షలతో తయారు చేయించిన ట్రాలీలను ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్కు అందజేశారు. దాతలు మచిలీపట్నంకు చెందిన యర్రంశెట్టి వినయ్బాబు మిత్రబృందం, కొరియర్ శ్రీను, కురిచేటి అప్పారావు, రాయలపాటి రాజేష్, యడ్ల శివశంకర్ కలసి అన్నదానంలో వినియోగించే ట్రాలీలను అందించినట్లు ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు తెలిపారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆదివారం కావడంతో పలు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్వనార్థం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. బుడమేరుకు వరద ప్రవాహం జి.కొండూరు:ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో శనివారం భారీ వర్షం పడడంతో ఆదివారం ఉదయం నుంచి బుడమేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మద్య బుడమేరుపై ఉన్న లోలెవెల్ చఫ్టాపై వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలు నిలిపివేశారు. వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద బుడమేరు వరద ప్రవాహం ఆదివారం సాయంత్రానికి 2.4 అడుగులకు చేరగా 1700 క్యూసెక్కుల వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తుంది. అదే విధంగా రెడ్డిగూడెం మండల పరిధి నరుకుళ్లపాడు, ఓబులాపురం గ్రామాల మద్య ఉన్న కళింగవాగు ఆదివారం పొంగి పొర్లడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
దసరా ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం విడుదల చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్లో ఆదివారం ఆలయ వైదిక కమిటీ, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈవో శీనానాయక్ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ఈ టికెట్లను దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్, దేవస్థాన వైబ్సైట్తో పాటు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఽదరలు ఇలా.. ప్రత్యేక ఖడ్గమాలార్చన టికెట్ రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ రూ.3వేలు, మూలా నక్షత్రం రోజున రూ. 5వేలు, ప్రత్యేక శ్రీచక్రనవార్చన రూ.3వేలు, ప్రత్యేక చండీయాగం రూ.4వేలుగా నిర్ణయించామన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను ప్రత్యేక క్యూలైన్ ద్వారా సేవలు జరిగే ప్రాంతానికి అనుమతిస్తామని తెలిపారు. సేవలో పాల్గొనే వారు ముందుగానే ఆయా వేదికల వద్దకు చేరుకోవాలని సూచించారు. భక్తులు ఉదయం 3.30 గంటల నుంచి 10–30 గంటల వరకు వన్టౌన్ గాంధీ మున్సిపల్ హైస్కూల్, భవానీఘాట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని సూచించారు. వైదిక కమిటీ సభ్యులు కోటప్రసాద్, శ్రీధర్, శంకర శాండిల్య, ఏఈవోలు ఎన్.రమేష్బాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీ బస్సులో మహిళల డిష్యుం..డిష్యుం!
కంచికచర్ల (నందిగామ): ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు. సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. -
దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనం, రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఘాట్రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులతో ఓం టర్నింగ్ మొదలు, లక్ష్మీ గణపతి విగ్రహం, చిన్న గాలిగోపురం పాయింట్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో వైపున మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం దర్శనాలు తిరిగి ప్రారంభం కాగా రెండు గంటల వరకు భక్తులతో క్యూలైన్లు రద్దీ కనిపించాయి. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి వారిని, ఉపాలయాల్లో దేవతా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ జరిగింది. మొదటి అంతస్తులో బఫే పద్దతిలో భక్తులకు అన్న ప్రసాదం అందించారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అణిచి వేస్తే తమను ప్రశ్నించేవాళ్లు ఉండరని కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన అలోచన చేస్తుంది. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు బనాయించి కొత్త సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. పత్రికా స్వేచ్ఛని హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా తమ తప్పును తెలుసుకొని అక్రమ కేసులపై దృష్టి వీడి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి. – నల్లగట్ల స్వామిదాస్, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ -
కక్ష సాధింపు మానుకోవాలి
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధ్యక్షుడు -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను, హోల్డింగ్ ఏరియాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివా రం పరిశీలించారు. వినాయ టెంపుల్ నుంచి ఏర్పా టు చేసిన క్యూలైన్స్ను స్వయంగా నడుచుకుంటూ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అదే విధంగా వాహనాల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్స్ లలో స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. భక్తులు లోనికి వెళ్లడానికి బయటకు రావడానికి ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్ కోసం భవానీపురం, పున్నమిఘాట్ మొదలగు ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సౌత్ ఏసీపీ పవన్కుమార్, ట్రాఫీక్ ఏసీపీ జె. రామచంద్రరావు, వన్టౌన్ సీపీ గురుప్రకాష్ పాల్గొన్నారు. -
ఏటిపాయకు మళ్లీ వరద
కంకిపాడు: ఏటిపాయకు మళ్లీ వరద వచ్చి చేరింది. వరదనీటితో ఏటిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరవళ్లు తొక్కుతూ వరదనీరు సముద్రం వైపు పరుగులు పెడుతోంది. ఏటిపాయ రహదారి మార్గం మరలా ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయించి లంక పొలాల్లో పనులకు వెళ్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేయటంతో ఏటిపాయ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధి గుండా ప్రవహించే కృష్ణానది ఏటిపాయ రెండు రోజులుగా నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఏటిపాయ అంచులు తాకుతూ నీరు దిగువకు ప్రవహిస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ గుండా లంక పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి మార్గం ఉంది. మొన్నటి వరకూ ఏటిపాయలో నీటి ఉధృతి సాధారణ స్థితికి చేరింది. రాకపోకలు సాధారణ స్థితికి చేరుతాయని భావించారు. అయితే మరలా వరద వచ్చి చేరటంతో లంకపొలాల్లోకి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అయ్యాయి. రహదారి ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవల సాయంతో లంక భూముల్లోకి వెళ్లి పొలం పనులు చూసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఏటిపాయలో వరదనీటి చేరికతో రాకపోకలు సాగటం లేదు. దీంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తుండటంతో పడవలకు డిమాండ్ పెరిగింది. -
ఎరువుల దుకాణం పరిశీలన
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో ఒక ఎరువుల దుకాణాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం పరిశీలించారు. స్థానికంగా రైతులకు కావలసిన యూరియా అవసరాలతో పాటు యూరియా నిల్వలను వీఆర్వో శాయన ప్రకాష్ను అడిగి తెలుసుకున్నారు. యూరియాను కొరత లేకుండా అందజేస్తామని స్థానిక రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుటుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పుట్టిన ఆడశిశువు మొదలు, మహిళలందరి ఆరోగ్య సంరక్షణకు స్వస్థనారి శసక్త్ పరివార్ అభియాన్ అనే పథకాన్ని ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు జిల్లాలోనూ ప్రారంభం అవుతుందన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 2 వరకూ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై స్పెషలిస్టు వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం, సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారం, కుటుంబాలను శక్తివంతం చేయడమని ఆమె తెలిపారు. ప్రత్యేక శిబిరాల ద్వారా మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భస్థ క్యాన్సర్, రక్తహీనత వంటి పరీక్షల చేస్తామన్నారు. కిశోర బాలికల్లో హిమోగ్లోబిన్ పరీక్షలు, గర్భిణులకు పోషకాహారంపై జాగ్రత్తను వివరించనున్నట్లు తెలిపారు. -
గాలికొదిలేశారు!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరి పేటలో పరిస్థితులు ఏమీ మారలేదు. నాలుగు రోజుల తర్వాత కూడా రంగు మారిన నీటినే తాగేందుకు సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో డాక్టర్ల నిజ నిర్ధాణ కమిటీ పర్యటించింది. వైఎస్సార్ సీపీకి చెందిన డాక్టర్ మొండితోక జగన్న్మోహనరావు, డాక్టర్ సుధీర్ భార్గవ్రెడ్డి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. డయేరియా బాధిత కుటుంబాలు, క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల ఆర్తనాదాలు విన్న కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. -
వేడుక ఏదైనా చందా చెల్లించాల్సిందే!
ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో.. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘పశ్చిమ నియోజకవర్గంలో ఏమైనా సరే ఏ పార్టీ వారైనా, దేనికై నా సరే, ఏ సమావేశాలకై నా, ఏ ఫంక్షన్ కై నా, ఉత్సవాకైనా కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు. ఇది మన సిద్ధాంతం. మొదటి నుంచి చెబుతున్నాం, మీ వద్దకు ఎవరైనా ఆ విధంగా చందాల వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీసుకు తెలియజేయండి. ఎవరికీ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.’ ఇటీవల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం సంద ర్భంగా విలేకరులతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పిన మాటలివి. దీనిని బట్టే చందాల దందా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.కోట్లు దండుకొనే ప్రణాళిక రచించినట్లు టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గొల్లపూడిలో మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి 39.99ఎకరాల మాన్యం ఉంది. ఆ మాన్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ఆ భూమిలో మట్టి తోలి చదును చేశారు. ఈ విషయం సీఎంఓ దృష్టికి వెళ్లటంతో, వెంటనే ఆ ప్రాంతంలో పనులు నిలిపి వేయాలని ఆదేశించినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉత్సవాల మాటున రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించిన పార్లమెంటు ముఖ్యనేతతోపాటు, మరికొందరు పట్టు వదలకుండా తమ పరువు పోతోందని, ఉత్సవాల నిర్వహణకు తాత్కాలికంగా లీజు ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే ఇప్పటికే ఈ భూమిని గొల్లపూడిలోని ఆరు మంది రైతులకు ఈ ఏడాది మే నెలలో బహిరంగా వేలం నిర్వహించి, జూన్లో ఏడాది పాటు లీజుకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వారి నుంచి సబ్ లీజు తీసుకొని అక్కడ ఉత్సవాలు నిర్వహించే వీల్లేదు. దీంతో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి రెండు రోజుల క్రితం గొల్లపూడిలో ఆ రైతులను పిలిపించి, మాట్లాడి, వారు కట్టిన లీజు మొత్తాని కంటే ఎక్కువగా ఇచ్చి, వారే స్వయంగా లీజు రద్దు చేసుకొంటామనేలా ఒప్పించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నారు. ఈ విధంగా ఎగ్జిబిషన్ సొసైటీ తాత్కాలిక లీజు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతోపాటు మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని, కొనకళ్ల నారాయణలు వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. 56 రోజుల లీజుకోసం రూ.45లక్షల చెక్కును ఆ ఆలయ ఈవోకు అందించారు. మొన్న వినాయక చవితికి భారీగా వ్యాపారుల నుంచి వసూలు ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ పేరుతో మరోసారి చందాల దందా ఎవరికీ రూపాయి ఇవ్వొద్దంటూ ఆదేశాలిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఇతర కూటమి నేతలు ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కొంత మంది నేతలు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారింది. పండుగలు వస్తే అక్కడ వ్యాపారులు హడలిపోతున్నారు. షాపుల వ్యాపారాన్ని బట్టి ‘పచ్చ’ట్యాక్స్ వేస్తున్నారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నా టీడీపీ నేత ‘ధూం ధాం’గా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వ్యాపారవర్గాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా వస్త్ర, ఎలక్ట్రికల్, బంగారు, గొల్లపూడి మార్కెట్, ప్రముఖ వ్యాపార సంస్థలు, హోటళ్లు ఇలా అన్ని వ్యాపార వర్గాల నుంచి టార్గెట్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలు వస్తుండటం, విజయవాడ ఉత్సవ్ అని హడావుడి చేస్తూ, చందాల వసూళ్లకు ప్రణాళిక రచించిన విషయం వ్యాపారుల దృష్టికి రావడంతో హడలి పోయి, కొంత మంది వ్యాపారులు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బహిరంగంగానే పత్రికా సమావేశంలో నో చందా.. నో దందా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాత్కాలిక లీజు పేరుతో భూమిని స్వాధీనం చేసుకొని, శాశ్వతంగా తమ వద్దే ఉంచుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో శాశ్వతంగా రిక్రియేషన్ క్లబ్, మల్టీకాంప్లెక్స్, థియేటర్లు, స్టార్ హోటళ్లు నిర్మించేందుకు తాత్కాలిక లీజును పునాదిగా చేసుకొంటున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఉత్సవ్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ మాటున కోట్లు కొల్లగొట్టే కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి 100 మంది సభ్యులను ఏర్పాటు చేసుకొని వారి నుంచి సభ్యత్వ రుసుం కింద ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు అంటే రూ.10కోట్లు వసూలు చేసేందుకు తెరలేపినట్లు చర్చ సాగుతోంది. ఇందులో 1000 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో 200 వీఐపీ, 300 మధ్యరకం, 500 చిన్నస్టాల్స్ ఏర్పా టు చేసేలా ప్రణాళిక రచించారని తెలు స్తోంది. వీటికి రేటు పెట్టి వీఐపీ స్టాల్కు రూ.10లక్షల చొప్పున మొత్తం స్టాళ్లకు రూ.20కోట్లు, మధ్య రకం స్టాల్కు రూ.5 లక్షలు చొప్పున రూ.15కోట్లు, చిన్న స్టాల్కు రూ.లక్ష చొప్పున రూ. 5కోట్లు వసూలు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. దీంతో పాటు గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ, ఓ హోట ల్ యజమానితోపాటు, మరికొంత మంది నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసేందుకు కుట్రకు తెరలేపారని, దీనికి ఎగ్జిబిషన్ సొసైటీ ముసుగు వేశారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. -
సింగ్నగర్కు పాకిన ‘డయేరియా’ ఎఫెక్ట్..!
హోటళ్లు మూయించడంపై ఆగ్రహం అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాపించి నాలుగు రోజులైన తరువాత శనివారం సాయంత్రం సింగ్నగర్కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హడావుడిగా బార్లు, వైనన్ షాపులతో పాటు బిర్యానీ హోటళ్లను సైతం మూయించి వేశారు. ఆయా హోటళ్ల యజమానులు అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా వస్తే సింగ్నగర్లో హోటళ్లు మూయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము అన్నీ వండుకొని సిద్ధం చేసిన తరువాత హడావుడిగా వచ్చి ఇలా షాపులను మూసేయించారని, ఇప్పుడు వండిన ఆహారం అంతా ఏం చేయాలని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. సింగ్నగర్ డాబాకొట్లు సెంటర్ నుంచి ఎంబీ స్టేడియంకు వెళ్లే దారిలో 20కి పైగా బిర్యానీ హోటళ్లు ఉన్నాయి. కొందరు హోటళ్ల యజమానులు అధికార పార్టీ నాయకులతో ఫోన్లు చేయించుకొని తాము ప్రభుత్వ నిబంధనలకు అతీతులమన్నట్లుగా యథావిధిగా వ్యాపారాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల మద్దతున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా అంటూ పలువురు వ్యాపారులు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్స్టేషన్ (జీఆర్పీ) సిబ్బంది కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రామవరప్పాడు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తల, వంటిపై తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరారు. -
ఆలయాల్లో జరిగే వివాహాలపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో జరిగే వివాహాలపై ఆయా ఆలయాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం ఆయన వాసవ్య మహిళా మండలి, జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మత పెద్దల పేరిట ప్రత్యేక సమావేశం జరిగింది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని వివిధ దేవాలయాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బాల్య వివాహ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరగకుండా కలిసికట్టుగా కృషిచేయాల్సి ఉందన్నారు. ప్రతి దేవాలయంలో వివాహానికి అర్హత వయసు, వయసు ధ్రువీకరణ పత్రాలు, చట్ట నియమ నిబంధనలు తెలియజేసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలపై ఫిర్యాదు చేసేందుకు 112 నంబరుతో పాటు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయాల్లో ప్రదర్శించాల్సిన వివరాలతో కూడిన నమూనా పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయాల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ఎండోమెంట్ ఏసీ షణ్ముఖ నటరాజన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రతినిధులు పాల్గొన్నారు. టైమ్ బ్యాంక్ ఓ వినూత్న కార్యక్రమం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో టైమ్ బ్యాంక్ – మేము సైతం(టైం బ్యాంక్– వియ్ టూ) పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని పైలట్ ప్రాతిపదికన అమలుచేయనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం టైమ్ బ్యాంక్ కార్యక్రమంపై యువ వలంటీర్లకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువ వలంటీర్లు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తే వారు ఎంత సమయం పాటు సేవ చేశారనే దాని ఆధారంగా ఆ సమయం టైమ్ బ్యాంక్లో కాయిన్ల రూపంలో జమవుతాయన్నారు. వారు సంపాదించిన టైమ్ కాయిన్లను వలంటీర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చని వివరించారు. విశేష సేవలందించిన వలంటీర్లకు డిజిటల్ సర్టిఫికెట్లు, మెరిట్ బ్యాడ్జీలు కూడా ప్రదానం చేయనున్నట్లు వివరించారు. టైమ్ బ్యాంకు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ రైల్వే స్టేషన్, పీఎన్ బస్స్టేషన్, ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలుచేయనున్నట్లు తెలిపారు. నాలుగు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత వలంటీర్ల అభిప్రాయాలను సేకరించి, అనంతరం మొత్తం జిల్లా మొత్తానికి ఈ వినూత్న విధానాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు, బంగారు భవిష్యత్తుకు నిర్మాతలుగా తీర్చిదిద్దేందుకు ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ బి.కీర్తి టైమ్ బ్యాంక్ విధివిధానాలు, డిజిటల్ మానిటరింగ్, డ్యాష్బోర్డు, ఈ–సర్టిఫికెట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆగిరిపల్లి)కి చెందిన 45 మంది విద్యార్థులతో పాటు డాక్టర్ నాగసుధారాణి, డాక్టర్ శ్రీలత, వాసవ్య మహిళా మండలి వలంటీర్లు పాల్గొన్నారు. -
యువ న్యాయవాదులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
పెనమలూరు: న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించనున్న యువ న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుని వృత్తిలో రాణించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్కుమార్ అన్నారు. కానూరు వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజీలో శనివారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సహకారంతో విద్యార్థులకు ఏఐబీఈ మాక్టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టే వారికి నైపుణ్యం పెంపొందించటానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏఐబీఈ మాక్ పరీక్ష నిర్వహించామన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను విశ్లేషించుకుని నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాక్టెస్ట్లో 273 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండలంలోని కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ కొక్కిలిగడ్డ జక్రయ్య(54) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా జువ్వలపాలెంకు చెందిన జక్రయ్యబాబు తన అత్తగారి ఊరు అయిన చల్లపల్లి మండలం పాగోలుకు పనిమీద వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతుండగా మార్గంమధ్యలో కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న కారుని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో జక్రయ్యబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలంకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య మహాలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పోరంకిలో అరకొరగా యూరియా పంపిణీ
పోలీసుల బందోబస్తు పెనమలూరు: పోరంకి గ్రామంలో శనివారం అధికారులు అరకొరగా యూరియాను రైతులకు పంపిణీ చేశారు. గ్రామంలో రైతులు గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 10 టన్నుల యూరియా రావటంతో సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో రైతుసేవా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో ఏవో శైలజ యూరియా 10 టన్నులు వచ్చిందని, అరకట్ట నుంచి గరిష్టంగా 3 కట్టల యూరియా ఇస్తామని తెలిపారు. అయితే రైతులు యూరియా అవసరం చాలా ఉందని, అరకొరగా ఇస్తే సాగు ఎలా చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. దశలవారీగా యూరియా పంపిణీ చేస్తామని ఏవో రైతులకు తెలిపారు. రైతు సేవా కేంద్రాల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. గుడివాడటౌన్: ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన క్రీడాకారులకు జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్టేడియం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్టేడియం క్రీడా క్యాలెండర్ను అనుసరించి ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు పురుషులు, సీ్త్రలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో విజేతలకు పతకాలతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనవలసినదిగా ఆయన కోరారు. పూర్తి వివరాలకు 85220 99995ను సంప్రదించవలసిందిగా కోరారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
దసరా ఏర్పాట్లలో అలసత్వం వద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఏర్పాట్లు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, ఎటువంటి అలసత్వం ఉన్నా, భక్తులకు అసౌ కర్యం కలిగినా ఇంజినీరింగ్ అధికారులదే బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించు కుని చేపట్టిన ఏర్పాట్లను పోలీసు, దేవస్థానం అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరిశీలించారు. నాలుగు గంటల పాటు ఆలయ పరిసరాల్లో కలియ తిరిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. తను గుర్తించిన పలు లోపాలను ఆలయ ఈఓ శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులకు తెలిపి వెంటనే సరి చేయా లని ఆదేశించారు. తొలుత ఘాట్రోడ్డు నుంచి ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వరకు క్యూ లైన్లలో నడిచి వెళ్లిన కలెక్టర్ లక్ష్మీశ తాగునీరు, క్యూ లైన్లలో ఫ్యాన్లను సరి చేయాలని సూచించారు. కొండ దిగువన, క్యూలైన్ల మధ్యలో కార్పొరేషన్ సహకారంతో టాయి లెట్లు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లను పంపిణీ చేయాలని సూచించారు. లక్ష్మీగణపతి విగ్రహం వద్ద గతంలో కొండ రాళ్లు విరిగి పడిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. మళ్లీ రాళ్లు విరిగిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్నాయుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కొత్త ఎస్పీగా వాసన విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గంగాధరరావును రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎస్పీల బదిలీల్లో భాగంగా సాగర్నాయుడు జిల్లా ఎస్పీగా రానున్నారు. సాగర్నాయుడు 24 సంవత్సరాలకే సివిల్స్లో 101 ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్వస్థలం భీమవరం. సాగర్నాయుడు ఎస్పీగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. దసరా ఉత్సవాల్లో పరోక్ష సేవా టికెట్ల విక్రయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే భక్తులకు దుర్గగుడి టికెట్లను విక్రయిస్తుంది. అయితే ప్రత్యక్ష టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలయ అధికారులు తెలపకపోవడం గమనార్హం. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన సేవల్లో పరోక్షంగా పాల్గొనేందుకు టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆన్లైన్ లింక్ ద్వారా సేవలు వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఈ టికెట్లపై అమ్మవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆలయ అధికారులు తేల్చి చెప్పేశారు. ఒక్కొక్క సేవలో పాల్గొనే వారు రూ.1500 చొప్పున, 11 రోజులకు రూ.11,116 చెల్లించాలని ప్రకటించారు. లోక్అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్అదాలత్ ద్వారా సత్వరమే కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్లో లోక్అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడదగిన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 16,599 కేసులు పరిష్కారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోని 42 బెంచ్లలో 16,599 కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. 15,111 క్రిమినల్ కేసులు, 169 సివిల్ కేసులు, 1001 చెక్ బౌన్స్లను పరిష్కరించగా, 100 మోటారు వాహన ప్రమాద క్లయిమ్లకు రూ.5.2 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయని న్యాయమూర్తి గోపీ తెలిపారు. 218 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలో కోర్టులో 2,527 కేసులు, విజయవాడ కోర్టుల్లో 7,321, గుడివాడలో 2,619, నందిగామ కోర్టు 494, నూజివీడు 446, మైలవరం 201, జగ్గయ్యపేట 245, బంటుమిల్లి 91, కై కలూరు 263, తిరువూరు 403, గన్నవరం 826, అవనిగడ్డ 435, మొవ్వ 456, ఉయ్యూరు కోర్టులో 272 కేసులను పరిష్కరించామని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా విస్సన్నపేటలో 57.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా జి.కొండూరులో 44.1 మిల్లీమీటర్లు, రెడ్డిగూడెం 41.3, మైలవరం 31.0, ఇబ్రహీంపట్నం 30.0, ఎ.కొండూరు 27.8, తిరువూరు 25.3, గంపలగూడెం 22.6, వత్సవాయిలో 17.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. విజయవాడ ఈస్ట్లో 14.5 మిల్లీమీటర్లు, వీరులపాడులో 14.0, విజయవాడ సెంట్రల్, వెస్ట్ 13.3, విజయవాడ రూరల్ 13.2, నందిగామ 9.5, పెనుగంచిప్రోలు 8.1, జగ్గయ్యపేట 6.3, చందర్లపాడు 5.6, కంచికచర్ల 4.8, విజయవాడ నార్త్లో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పోర్టు పనులు మరింత వేగవంతం
ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కోనేరుసెంటర్(మచిలీపట్నం): బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ కల్లా రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన అధికారులతో కలిసి పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని, గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్ను శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తులు, రహదారులు, పరిపాలన భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై కృష్ణబాబు సమీక్షించారు. వర్కర్లు, యంత్రాలను పెంచి నిర్దేశించిన సమయానికి పోర్టు పనులను పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్టుతో రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరతాయన్నారు. మొత్తం 16 బెర్తుల్లో మొదటి దశలో నాలుగు పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మేర పనులు పూర్తయినట్లు తెలిపారు. గిలకలదిండి పనుల పురోగతిపై ఆరా.. త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ మార్గంతో పాటు పోర్టుకు సమీపంలోని జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలను అభివృద్ధి చేయనున్నట్టు కృష్ణబాబు తెలిపారు. అందుకు సంబంధించిన డీపీఆర్లను (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. హార్బర్ పనులు నెమ్మదించాయని, ఈ నెలాఖరుకు పనుల్లో పురోగతి కనిపించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని కృష్ణబాబు హెచ్చరించారు. ఈ పర్యటనలో మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, జాయింట్ సీఎఫ్ఓ సతీష్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈ రాఘవరావు, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఇన్చార్జి డీఆర్ఓ శ్రీదేవి, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టీం లీడర్ చేతన్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు నాగభూషణం, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
మూడు చెక్డ్యామ్లకు గండ్లు
బుడమేరులో కలిసే ప్రధాన వాగుల్లో పులివాగు ఒకటి. జి.కొండూరు మండలంలోని గంగినేని శివారు కొండల్లో పుట్టిన ఈ వాగు తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల మీదుగా 18 కిలోమీటర్ల మేర ప్రవహించి వెలగలేరు శివారులోని నరసాయిగూడెం వద్ద బుడమేరులో కలుస్తుంది. రైతులకు సాగునీటిని అందించేందుకు దశాబ్దాల క్రితం ఈ వాగుపై పదికి పైగా చెక్డ్యామ్లు నిర్మించారు. వరద వచ్చినప్పుడు చెరువులు నింపడానికి, భూగర్భజలాల పెంపు, నిల్వ ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా చెక్డ్యామ్లు నిర్మించారు. వీటిలో తెల్లదేవరపాడు, మునగపాడు, చెర్వుమాధవరం చెక్డ్యామ్లకు గత ఏడాది వచ్చిన వరదలకు గండ్లు పడ్డాయి. చెక్ డ్యామ్ల వద్ద రెండు వైపులా అంచులు కోతకు గురై భారీ గండ్లు పడటంతో వరద జలాలు నిల్వ ఉండకుండా, దిగువకు వెళ్లిపోతున్నాయి. -
ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఎ.శాస్త్రి అధ్యక్షతన శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా గోపిమూర్తి మాట్లాడుతూ.. ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.మోహనన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెన్షనర్లు పీఆర్సీ లబ్ధి పొందకుండా పెన్షన్ రీవాల్యుడేషన్–2025 బిల్లు తీసుకురావడం అన్యాయమన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసో సియేషన్ నాయకుడు ఎం.జనార్దన్రెడ్డి మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తీర్మానాలను ప్రవేశపట్టి భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్లు తరపున ఎమ్మెల్సీ గోపిమూర్తికి వినతి పత్రం అందజేశారు. బ్యాంకు పెన్షనర్స్ సంఘం నాయకుడు ఎం.రామారావు, రైల్వే పెన్షన్ సంఘం నాయకుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు
పత్రికా స్వేచ్ఛను భంగపరచడమే కక్ష సాధింపు మానుకోవాలి సాక్షి మీడియా ప్రజల గొంతుకై నిలిచింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే సంకల్పంతో పని చేస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ఏదైనా వార్తా కథనంపై అభ్యంతరాలు ఉంటే ఖండించ వచ్చు. వివరణ కోరవచ్చు. అలా కాకుండా పాత్రికేయులపై, ఏకంగా ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సహేతుకం కాదు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర కాలంలో సాక్షి మీడియాపై అనేక అక్రమ కేసులు బనాయించింది. ప్రజల గొంతుకగా మారిన సాక్షి గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఖండిస్తున్నా. మీడియాపై కక్ష సాధింపు మానుకోవాలి – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్చార్జి నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం బాధాకరం. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. వాస్తవాలు రాసే సాక్షి అంటే కూటమి నాయకులకు అక్కసు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాలో నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపో తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. – డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జిప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండే పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం సబబు కాదు. వాస్త వాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షకట్టింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోనికి తెచ్చి ఎండగట్టడం తప్పు ఎలా అవుతుంది. సాక్షి గొంతు నొక్కే విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం ఆక్షేపణీయం. పాత్రికేయుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఉప్పాల హారిక, జిల్లా పరిషత్ చైర్పర్సన్ -
అదుపులోకి రాని అతిసార!
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ రాజరాజేశ్వరీపేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. నాలుగో రోజు సైతం అతిసార కేసులు నమోద య్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం రాత్రికి 194 కేసులు ఉండగా, శనివారానికి వాటి సంఖ్య 273కి పెరిగింది. అధికారులు మాత్రం అతిసార అదుపులోనే ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాస్పత్రితో పాటు, న్యూరాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొనసాగుతున్న సర్వే డయేరియా బాధితులను గుర్తించేందుకు న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన సర్వే కొనసాగుతోంది. వైద్య సిబ్బంది ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడుగుతుంటే, రెండు, మూడు ఇళ్లకు ఒక డయేరియా కేసుతో పాటు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా బయట పడుతున్నారు. ఆ ప్రాంతంలో డయేరియా, సీజనల్ జ్వరాలు ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. కలుషిత నీరే కారణం? అతిసారకు వందశాతం కలుషిత నీరే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం, ఇతర కల్తీ అయితే నాలుగు రోజుల పాటు డయేరియా కేసులు వచ్చే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం నీటి సర ఫరా పూర్తిగా నిలిపివేసినందున, ఎక్కడ కలుషిత మైందో గుర్తించి సత్వరమే అక్కడ మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు మాత్రం నీటి శాంపిళ్లు ల్యాబ్కి పంపించామని, రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. బాధితులకు పరామర్శ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను మంత్రి పి.నారాయణ, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి అధికారులకు సూచించారు. -
ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, రెండో శనివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్ల వారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపు అమ్మవారికి నిర్వహించిన పలు విశేష పూజల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంతో పాటు హోమాల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్ల భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆశల సాగుకు కడగండ్లు
జి.కొండూరు: పులివాగులో వరద ఉధృతికి చెక్ డ్యామ్ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడ్డాయి. గండ్లను పూడ్చే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టలేదు. వరద వచ్చినప్పుడల్లా అంచులు కొద్దికొద్దిగా కోతకు గురై సాగు భూములు పులివాగులో కలిసిపోతున్నాయి. చెక్డ్యాముల్లో నిల్వ ఉండాల్సిన నీరు దిగువకు వెళ్లిపోతోంది. చెక్డ్యామ్ల వల్ల రైతులకు మేలు జరగకపోగా వాటికి పడుతున్న గండ్లతో నష్టం వాటిల్లుతోందని రైతులు పేర్కొంటున్నారు. గండ్లు పడి ఏడాదైనా పూడ్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు చెక్డ్యామ్ల నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇరిగేషన్శాఖ నిపుణులు చెబుతున్నారు. వాగు వెడల్పును బట్టి కాకుండా నిర్ణయించిన కొలతలతో డ్యామ్లను నిర్మించి అంచుల్లో మట్టి పోసి వదిలేయడం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని పేర్కొంటున్నారు. పులివాగు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా రెండు వైపులా వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఆక్రమించి, పూడ్చి సాగు చేయడం వల్ల వాగు వెడల్పు తగ్గిపోయింది. దీంతో వాగులో వరద ఉధృతి పెరిగినప్పుడు చెక్డ్యామ్ల వద్ద నీటి ప్రవాహం దిశ మార్చుకొని ప్రవహించి అంచులు కోతకు గురవుతున్నాయని వివరిస్తున్నారు. వాగులో కలిసిపోతున్న సాగు భూములు చెక్డ్యామ్ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడి నెలలు గడుస్తున్నా గండ్లను పూడ్చకపోవడంతో పక్కనే ఉన్న సాగు భూములు కోతకు గురవుతున్నాయి. అధికారులు ఈ గండ్లను అలానే వదిలేస్తే కొద్ది రోజులకి పక్కనే ఉన్న సాగు భూములు వాగులో కలిసిపోతాయని రైతులు ఆందోళన చెందు తున్నారు. చుక్కనీరు కూడా నిల్వకుండా కిందకు పోతోందని, చెక్డ్యామ్లు ఉండి కూడా ప్రయోజనం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాలకు లబ్ధి పులివాగులో వరద ప్రవాహాన్ని చెక్డ్యామ్లు, ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం వల్ల సుమారు 3,500 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. పులి వాగుపై సున్నంపాడు గ్రామం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా మునగపాడు కొత్త చెరువుకు సరఫరా కావడం వల్ల 384 ఎకరాలు సాగువుతోంది. చెర్వుమాధవరం వద్ద ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా జి.కొండూరు పంట చెరువు, ఆత్కూరు ఊర చెరువులకు నీరు సరఫరా చేస్తే 718.80 ఎకరాలకు, పినపాక ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా పినపాక గంగాదేవి చెరువుకు నీరు సరఫరా చేస్తే 487.09 ఎకరాలు, నరసాయిగూడెం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా నరసాయిగూడెం కొత్తచెరువుకు నీరు మళ్లిస్తే 439.41 ఎకరాలకు మేలు జరుగు తంది. చెక్డ్యామ్ల పరిధిలో మోటార్లు, ఇంజిన్ల సాయంతో రైతులు 1500 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు మా పొలాల వద్ద చెక్డ్యామ్కు ఒకవైపు అంచు కోతకు గురై భారీ గండి పడింది. ఇప్పటి వరకు గండిని పూడ్చలేదు. ఆ గండి వల్ల వరద వచ్చినప్పుడల్లా సమీప పొలాలు కోతకు గురై వాగులో కలిసిపోతున్నాయి. చెక్డ్యామ్ వద్ద చుక్క నీరు నిల్వడంలేదు. – కోన పాండురంగారావు(బుజ్జి), రైతు, మునగపాడు గ్రామం మా గ్రామం వద్ద పులివాగు చెక్డ్యామ్కు గండి పడింది. గండిని పూడ్చకపోవడం వల్లన వరద ప్రవాహం వచ్చినప్పుడు నీరంతా దిగువకు వెళ్లిపోతోంది. గండి పూడ్చితే చెక్డ్యామ్ వద్ద పూర్తిస్థాయిలో నీరు నిలిచి రైతులకు ఉపయోగపడుతుంది. చెక్ డ్యామ్లో నీరు నిలిస్తేనే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయి. – ఉమ్మడి ప్రసాద్, సర్పంచ్, తెల్లదేవరపాడు గ్రామం పులివాగుపై చెర్వుమాధవరం, మునగపాడు, తెల్లదేవరపాడు వద్ద ఉన్న చెక్డ్యామ్కు పడిన గండ్లను ఇప్పటికే పరిశీలించాం. వాటి మరమ్మతులకు సంబంధించి ప్రాథమిక అంచనాలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మరోసారి పరిశీలించి తుది అంచనాలు రూపొందిస్తాం. అనుమతి రాగానే గండ్ల మరమ్మతులు ప్రారంభిస్తాం. – టి.రాజేష్, ఇరిగేషన్ ఏఈఈ, జి.కొండూరు -
సర్కారు బడుల సత్తా
కృష్ణా జిల్లాలో ఐదు స్కూళ్లకు బెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్లెన్సీ అవార్డులుకంకిపాడు: విద్యార్థుల వికాసానికి చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చదువు, తద్వారా వచ్చే మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల జీవితం తరగతి గదుల్లోనే మగ్గుతోంది. రానురాను విద్యార్థులు శారీరక వికాసానికి దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు పాఠశాలలు విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలు, అథ్లెటిక్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో తలపడుతూ పతకాలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఎక్స్లెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో కృష్ణాజిల్లాకు చెందిన ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్స్లెన్స్ అవార్డులను అందుకుని ఆదర్శంగా నిలిచాయి. సత్తా చాటుతున్న విద్యార్థులు.. క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆట స్థలంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు అందించే ప్రోత్సాహం, తర్ఫీదుతో మెరికల్లా మారుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పతకాలు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులను జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు తమ సొంతం చేసుకున్నాయి. జెడ్పీ పమిడిముక్కల, జెడ్పీ గూడూరు, సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం, జెడ్పీ (బాలికలు) గన్నవరం, జెడ్పీ గొడవర్రు పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎక్స్లెన్స్ అవార్డులను దక్కించుకున్నాయి. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ప్రధానంగా హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. వారికి అవసరమైన పోషకాహారాన్ని అదనంగా అందజేస్తూ శారీరకంగా దృఢంగా ఉండేలా తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్త్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో 25 నుంచి 40 మంది విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెస్తున్నారు. పాఠశాల పేరు లభించిన లభించిన పాయింట్లు స్థానం జెడ్పీ పమిడిముక్కల 192 ప్రథమస్థానం జెడ్పీ గూడూరు 107 ద్వితీయ స్థానం సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం 100 తృతీయ స్థానం జెడ్పీ (బాలికలు) గన్నవరం 93 నాలుగో స్థానం జెడ్పీ గొడవర్రు 44 ఐదో స్థానం విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తోంది. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తూ తర్ఫీదు ఇస్తూ వారికి మెలకువలు నేర్పుతున్నారు. ఏటా వివిధ స్థాయి లో విద్యార్థులు పతకాలు దక్కించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. – కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, హెచ్ఎం, జెడ్పీ గొడవర్రు మైదానాన్ని సిద్ధం చేసుకోవటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కీలకమైన అంశం. ఇందుకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూత కూడా మరువలేనిది. విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభ చాటేలా మెలకువలు నేర్పుతున్నాం. – కె.టాన్యాగిరి, పీడీ, జెడ్పీ గన్నవరం(బాలికలు) -
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
పెనమలూరు: పెనమలూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని సీఐ వెంకటరమణ తెలిపారు. గంగూరు గోడౌన్ వద్ద టీ అమ్ముకొని జీవించే భర్త లేని పి.రమాదేవి (40)తో కంకిపాడుకు చెందిన ముప్పిడి శ్రీనివాసరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటిల్లో వివాదం రావటంతో 2021, మే 31న శ్రీనివాసరావు రోకలిబండతో రమాదేవిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పటి సీఐ ముత్యాల సత్యనారాయణ హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే ఏడాది జూన్ 3వ తేదీన అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు. ఆ తరువాత అతని పై రౌడీషీట్ కూడా తెరిచారు. ఈ కేసు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ చేశారు. మహిళా సెషన్స్ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి 13 మంది సాక్షులను విచారించి ముద్దాయిపై నేరం రుజువు కావటంతో గురువారం తీర్పు ఇచ్చారు. ముద్దాయి శ్రీనివాసరావుకు జీవిత ఖైదు విధించి రూ. 5 వేలు జరిమానా విధించారు. ప్రశ్నిస్తే శిక్షిస్తారా? చల్లపల్లి: పిల్లలు తినే అన్నంలో పురుగులు వచ్చాయని ప్రశ్నించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభా లక్ష్మీ దుర్గాభవానీని పదవి నుంచి తొలగిస్తారా అంటూ జాతీయ గిరిజన ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంభా లక్ష్మయ్య, దేవరకొండ వసంత్ ప్రశ్నించారు. శుక్రవారం నేతలు భవాని ఇంటికి వెళ్లి మండల పరిధిలోని పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన విషయంపై లక్ష్మీదుర్గాభవాని స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువతో సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అన్నంలో పురుగులు వచ్చాయన్న విషయాన్ని దాచిపెట్టకుండా ఎందుకు బహిర్గతం చేశావని తహసీల్దార్ డి.వనజాక్షి దుర్గాభవానీపై చేసిన వ్యాఖ్య లు గర్హనీయమన్నారు. పదవి నుంచి తొలగించాలని అవమానకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. -
హెచ్ఐవీపై అవగాహన అవసరం
మచిలీపట్నంఅర్బన్: హెచ్ఐవీ/ఎయిడ్స్తో పాటు ఇతర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్చార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయం, దిశ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవీ/ ఎయిడ్స్ ప్రచార రథాన్ని శుక్రవారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు హెచ్ఐవీ/ ఎయిడ్స్, క్షయ, సుఖ వ్యాధులపై చిత్ర ప్రదర్శనలతో అవగాహన కల్పించడం, ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం ఈ ప్రచార రథం ముఖ్య ఉద్దేశమన్నారు. దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎల్. మధుసూదనరావు, క్లస్టర్ ప్రివెన్షన్ అధికారి కె. రవికుమార్, గైడ్ ప్రోగ్రాం మేనేజర్ వై. శశికళ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖాధికారి వెంకట్రావు -
జనసేన రౌడీల దుశ్చర్య
మచిలీపట్నంటౌన్: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త మద్దాల సతీష్ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు. అందుకే కక్షకట్టారు.. ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ బాబు తదితర వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్ వాయిస్ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్ వీడియోలో సతీష్ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పెనమలూరు: పెదపులిపాకలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామం శ్రీనగర్ కాలనీ 6వ రోడ్డుకు చెందిన పుట్టపు గోవిందమ్మ కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఆమె భర్త వ్యవసాయ పనులు చేస్తారు. ఆమెకు ఇద్దరు కుమారులు. గురువారం చిన్నకుమారుడు పుట్టపు పవన్కుమార్(18) వడ్డేశ్వరంలో పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లగా.. పెద్ద కుమారుడు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాడు. కాగా గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు ఇంటికి రాగా.. తలుపులు లోన గడి పెట్టి ఉన్నాయి. అతను కిటికీలో నుంచి చూడగా పవన్కుమార్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు తెరిచి కుటుంబ సభ్యులు పవన్కుమార్ను విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తల్లి గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దళితుడైన సతీష్బాబు దుకాణం ధ్వంసం -
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నేతన్న భరోసా ఇవ్వాలి
చల్లపల్లి: మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా రూ.36వేలు ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేటు, యారన్ సబ్సిడీ వంటి ఇంటెన్సివ్స్ రూ.127.87 కోట్లు వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుబాట సాగిద్దాం.. చేనేత పరిశ్రమను రక్షించుకుందాం.. అనే నినాదంతో చేనేత సహకార సంఘాల, సహకారేతర కార్మికుల ఉపాధికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత అధ్యయన యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన పెడనలో ప్రారంభించిన ఈ యాత్ర పోలవరం, కప్పలదొడ్డి, కాజ, ఘంటసాల, చల్లపల్లి ప్రాంతాల మీదుగా సాగి ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ముగిసిందన్నారు. యాత్రలో చేనే త కార్మికుల నుంచి వచ్చిన సమస్యలను, పాత సమస్యలను రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని, వాటిని పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొగిడే మాధవస్వామి, ఉపాధ్యక్షుడు జక్కల పీతాంబరరావు, జిల్లా అధ్యక్షుడు కోదాటి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు -
సుస్వరాల కోయిలకు కీర్తి కిరీటం
విజయవాడ కల్చరల్: ఆమె గాత్రంలోని మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.. వయోలిన్పై ఆమె చేసే స్వర విన్యాసం సంగీత ప్రియులకు పరవశించేలా చేస్తుంది. ఆమె వేదికపై ఉందంటే సంగీత అభిమానులకు పండుగే. ఆమే విజయ వాడకు చెందిన వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గాభవాని. విఖ్యాత హరికథా భాగవతార్ కుమార్తెగా ఆమె సంగీత రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానానికి ఇప్పుడు కీర్తి కిరీటం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. సంగీత ప్రస్థానం సాగిందిలా.. బీవీ దుర్గాభవాని బహుముఖ ప్రతిభాశాలి. అటువాయిలీనం, ఇటు గాత్రం.. రెంటినీ సమర్థంగా పోషించగల సంగీత సవ్యసాచి. ఆమె 1965లో విజయవాడలో జన్మించారు. తండ్రి విశ్వనాథ భాగవతార్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అటు గాత్రంలోనూ ఇటు వయోలిన్లోను ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ విద్వాంసురాలిగా పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరేళ్లపాటు వయోలిన్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను సార్థకం చేసుకున్నారు. ప్రముఖుల సరసన.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, టీఎన్ శేషగోపాలన్, ప్రపంచం సీతారాం, టీఎం కృష్ణ, బోంబే సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్తోపాటు పలువురు విద్వాంసులకు వాద్య సహకారమందించారు. అందుకున్న అవార్డులు.. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, మద్రాస్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రసిక రంజని, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలు ఆమెకు పురస్కారాలను అందజేశాయి. కాగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగా ల్లోని ప్రతిభావంతులకు అందించే కీర్తి పురస్కారానికి దుర్గా భవానీ ఎంపికై ంది. ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సభల్లో రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు అందజేయనుంది. వయోలిన్ విద్వాంసురాలు దుర్గాభవానీకి తెలుగు వర్సిటీ పురస్కారం -
అంతుచిక్కని అతిసార
లబ్బీపేట/అజిత్సింగ్నగర్: న్యూరాజరాజేశ్వరి పేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మృతుల సంఖ్య కూడా మూడుకు చేరింది. ప్రజలు అతిసార బారినపడటానికి ఖచ్చితమైన కారణాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. పూటపూటకీ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారగా, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తుండటం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ దాదాపు 194 మంది డయేరియా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అధికారుల దృష్టికి రానివారు మరో 20 మంది వరకూ ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే అతిసారతో ఇద్దరు మృతిచెందగా, వాంతులు విరచేనాలతో బాధపడుతూ తాజాగా శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతిచెందారు. జీజీహెచ్లో 106మంది రోగులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి డయేరియా రోగులు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం 106మంది అతిసార బాధితులు చికిత్స పొందుతుండగా, 88మంది డిశార్జి అయ్యారు. బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారణాన్ని గుర్తించని వైనం.. అతిసారకు గల కారణాన్ని అధికారులు సైతం ఇప్పటివరకూ ప్రకటించలేదు. వినాయకుని వేడుకల్లో భోజనాలు చేశారని కొందరు, వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే వాంతులు అయ్యాయని మరికొందరు చెబుతున్నారు. మంత్రులు సైతం ఇదే విషయాలను చెప్పుకొస్తున్నారు. భారీసంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారంటే నీటి కలుషితమే కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ సరఫరా చేసే నీటితోపాటు భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితమైనట్లు సమాచారం. నీటికి సంబంధించి ప్రాథమిక పరీక్షలో నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నీటిసరఫరాను సైతం పూర్తిగా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాను కూడా నిలిపివేసి, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ క్యాన్లను అందిస్తున్నారు. బ్లీచింగ్తో కంటితుడుపు చర్యలు.. న్యూరాజరాజేశ్వరీపేటలో ప్రజలు ప్రాణాలు పోతున్నా... ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారుల తీరు మాడరం లేదు. కేవలం ప్రజల కళ్లకు కనబడేలా ప్రధాన రహదారులపై బ్లీచింగ్ చల్లి.. ౖపైపెన కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప.. వాస్తవంగా నివాస ప్రాంతాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదు. అధ్వానంగా పారిశుద్ధ్య పరిస్థితి.. డయేరియా వెలుగు చూసి 72 గంటల సమయం గడిచినా కూడా నేటికి న్యూరాజరాజేశ్వరీపేట అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నడిరోడ్లపైనే పదుల సంఖ్యలో పందులు సంచరిస్తూ ఉన్నాయి. కాలువలన్నీ చెత్తతో నిండిపోగా.. అపార్ట్మెంట్ల మధ్య స్థలాలు మురుగునీటితో తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక అపార్ట్మెంట్ల డ్రెయినేజీ పైపులన్నీ గతేడాది బుడమేరు వరదలో పగిలిపోగా నేటికి వాటి పరిస్థితి అలానే ఉండడంతో ఆ మురుగు, వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి నివాసాల ముందు పారుతుండటం గమనార్హం. ఇక మంచినీటి పైపులైన్లు కూడా పగిలిపోవడంతో పక్కనే ఉన్న మురుగునీరు పైపుల్లో చేరుతూ కలుషితనీరే సరఫరా అవుతోందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాది 17వ నంబర్ బ్లాకు.. ఈ ఇళ్ల మధ్య మురుగు, చెత్త తొలగించకపోతుండటంతో దుర్వాసనకు ఇళ్లల్లో అస్సలు ఉండలేకపోతున్నాము. తరచూ జ్వరాలు, వాంతులు, విరేచనాల సమస్యలతో అల్లాడిపోతున్నాం. శశిరేఖ, 17వ బ్లాకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో న్యూరాజరాజేశ్వరపేటలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో దాదాపు నగరంలోని వైద్యసిబ్బంది అంతా అక్కడే పనిచేస్తున్నారు. అంతేకాకుండా నగర సమీపంలోని పీహెచ్సీలు, వెల్నెస్ సెంటర్ల నుంచి సీహెచ్ఓలకు కూడా డ్యూటీలు వేశారు. ఇప్పటివరకూ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటిని రెండు, మూడుసార్లు సర్వేచేసి జల్లెడ పట్టారు. అయినప్పటికీ అతిసారకు కారణం మాత్రం కనుగొనలేకపోవడం గమనార్హం. వాంతులు, విరోచనాలు అవుతున్న వారికి మాత్రం సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర పరిధిలో ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో అతిసార వ్యాధితో కొందరు బాధపడుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను తనిఖీ చేశారు. నగర పరిధిలో మొత్తం 216 ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా, తాజాగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్లేని 51 దుకాణాలను సీజ్ చేశారు. 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట పరిధిలోని తొమ్మిది చికెన్ షాపులు, ఒక బీఫ్ షాపును వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్రెడ్డి మూసి వేయించారు. అదే ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేసి 24 ఆహార దుకాణాలను సైతం మూసివేయించారు. -
డబ్బులు దండుకునేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవీ శరన్నవరాత్రుల సమయంలో నగరంలో ఆధ్మాతిక శోభ వెల్లివిరుస్తుంది.. అలాంటి సమయంలో ఈ వేడుకలకు పోటీగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అంటే దసరా ప్రాధాన్యతను తగ్గించడం కాదా అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు దండుకునేందుకే స్థానిక ఎంపీ విజయవాడ ఉత్సవ్ను తెరపైకి తెచ్చారని అవినాష్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు దీనిని ఖండించాలన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ చూపడం మానేసి.. విజయవాడ ఉత్సవ్ మీద దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలందరినీ కలుపుకుని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. దసరా ఉత్సవాలకు పోటీగా మరొకటి నిర్వహించే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో నిరోధిస్తామని హెచ్చరించారు. 40 ఎకరాలు కబ్జా.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయని అవినాష్ ఆరోపించారు. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలోని దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు గానీ దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు దేవాలయాల భూముల్లో కట్టడం ఏమి టని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. రూ.450 కోట్లు విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తున్నారని, కూటమి నేతలు ఏమి చెబితే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారన్నారు. -
వారంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ
ఇరుగ్రామాల ప్రజలతో అధికారులు సమావేశం నాగాయలంక: మండలం శివారులో సముద్రం తీరాన ఉన్న ఈలచెట్లదిబ్బ వాసుల తాగు, సాగునీటి సమస్యలకు వారంరోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపనున్నట్లు కృష్ణా, బాపట్ల జిల్లాల ఉన్నతాధికారులు ప్రకటించారు. కొద్దికాలంగా ఈలచెట్లదిబ్బ(నాగాయలంక మండలం), లంకెవానిదిబ్బ(బాపట్ల జిల్లా రేపల్లె మండలం) గ్రామాల నడుమ నీటివివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు ఆయా గ్రామాల పెద్దలు, ప్రతినిధులతో కలసి శుక్రవారం లంకెవానిదిబ్బలో సమావేశమయ్యారు. లంకెవానిదిబ్బ వాసులను ఈలచెట్లదిబ్బ వాసులు తమవైపు నదిలోకి చేపల వేటకు రానీయకుండా అడ్డుకోవడంతోనే వారి గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి దిబ్బకు వచ్చే సాగు,తాగు నీటి పైపులైన్లను అడ్డుకోవడంతో ఇరు జిల్లాల గ్రామాల నడుమ వివాదానికి దారితీసింది. కాగా అధికారులు ప్రధానంగా నీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించిన నేపధ్యంలో నీటి సమస్య పరిష్కారంపై బందరు ఇంచార్జి ఆర్డీఓ బి.శ్రీదేవి, బాపట్ల ఆర్డీఓ రేపల్లె రామలక్ష్మి నేతృత్వంలో లంకెవానిదిబ్బ లిప్ట్ ఇరిగేషన్ పరిశీలించి అక్కడే ఇరుగ్రామాల వారితో సమావేశమై చర్చించారు. వారం రోజుల్లో తాత్కాలిక పైపులు ఏర్పాటు చేసి ఈలచెట్లదిబ్బ వాసులకు తాగు, సాగునీరు అందించేందుకు లంకెవానిదిబ్బ వాసులను అధికారులు ఒప్పించారు. వచ్చే ఏడాది జూన్నాటికి లిఫ్ట్ ఇరిగేషన్కు లెవెల్ మెయింటెన్ చేసి లాకులు ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగం వివరించారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తహసీల్దార్లు సిహెచ్వి ఆంజనేయప్రసాద్, టి.శ్రీనివాస్ కృష్ణా ఇరిగేషన్ అధికారులు మోహన్రావు(ఎస్ఈ), రవికిరణ్(ఈఈ), లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ చెన్నారెడ్డి, డీఈఈ గణపతి, అవనిగడ్డ సీఐ యువకుమార్, నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్, బాపట్ల జిల్లా ఇరిగేషన్ అధికారులు, రెండు గ్రామాల పెద్దలు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులనే కాలరాస్తారా? ...
దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడుతున్న పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం విచారకరం. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన హక్కును ప్రభుత్వం కాల్ రాస్తోంది. ఇటీవల సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోగా కక్ష సాధింపులకు దిగుతుండటం సరైన పద్ధతి కాదు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపులకు పాల్పడటం ఎంతవరకు సబబు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలి. వడ్డి జితేంద్ర, న్యాయవాది పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి -
కృష్ణా మిల్క్ యూనియన్కు ఎన్డీడీబీ పురస్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సహకార సమితిని సమర్ధంగా నడిపించడమే కాకుండా పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు గురువారం పురస్కారాన్ని అందజేసినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు(ఎన్డీడీబీ) ఆరు దశాబ్దాలు పూర్తి కావడంతో గురువారం పుదుచ్చేరిలో వజ్రోత్సవం నిర్వహించింది. ఈ వేడుకలలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాష్నాఽథన్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి సీడీజే కౌమర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు హాజరయ్యారు.సెపక్ తక్రా పోటీలకు కృష్ణాజిల్లా జట్ల ఎంపికమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్లను గురువారం ఎంపిక చేసినట్లు ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. పవన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 13,14 తేదీలలో అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు మావులూరి పవన్ కుమార్, దేవవరపు నరేష్ బాబు, బండి నరేష్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారని తెలిలియజేశారు. బాలుర విభాగంలో ఎండి.జకీర్, ఎస్.కార్తీక్, వై.సుభాష్, వై.అనిల్, ఎండి.ముజాకీర్, బాలికల విభాగంలో వి.కావ్య, ఎండి.రహీమా, కె.లావణ్య, ఆర్.అమృత, ఎస్డి.కరిష్మా ఎంపికయ్యారని తెలియజేశారు. జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం మోపిదేవి: మండల కేంద్రం మోపిదేవి ఎస్ విహార్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గొరిపర్తి సుబ్రహ్మణ్యం(32) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం తన అత్తగారి ఊరు అయిన మచిలీపట్నం వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో ఎదురుగా రొయ్యల లోడ్తో వస్తున్న లారీని మోపిదేవి వద్ద బలంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతునికి భార్య అంజలి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పోలీసు కుటుంబాలకు అండగా పోలీసుశాఖ
జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ తరఫున మంజూరైన బీమా చెక్కులను గురువారం జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అకాల మరణాలు పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకోవడం సర్వసాధారణం అని, అలా తీసుకున్న రుణాలను బీమా ద్వారా మాఫీ చేస్తామన్నారు. సిబ్బంది సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.దాసు కుటుంబానికి రూ.5,32,495, హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.2,08,700, కె.వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ. 1,80,143 బీమా చెక్కులను అందజేసినట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రాఘవయ్య, కృష్ణాజిల్లా పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు జీవీ శేషగిరిరావు, కార్యదర్శి సీహెచ్ చెన్నకేశవులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
సన్న బియ్యం కాదు.. పురుగుల బియ్యం
● విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా ● నిల్వ బియ్యాన్ని పాఠశాలలకు అంటగట్టిన వైనం నందివాడ: మండలంలోని వెన్ననపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే, అంతకంటే నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవానికి పురుగులతో నిండి ముక్కి పోయిన బియ్యాన్ని వండి పెడుతున్నారు. ఆ పురుగులతో తయారు చేసిన భోజనాన్ని తినలేక విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరచి చూస్తే పురుగులే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సన్న బియ్యం కాకపోయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
దూసుకొస్తున్న మృత్యువాహనాలు
జి.కొండూరు: అక్రమ మైనింగ్ క్వారీల నుంచి మెటల్, కంకర, గ్రావెల్, బూడిద చెరువు నుంచి బూడిద రవాణా చేసే వెయ్యికి పైగా టిప్పర్ లారీలు ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. లారీలు బోల్తా పడడం, ఓవర్టేక్ చేస్తూ ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి జీవనోపాధిని కోల్పోతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న టిప్పర్ల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడింగ్తో ప్రమాదం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో నిర్వహిస్తున్న రాతి క్వారీలలో కంకర, భారీ బండరాళ్లు, గ్రావెల్ను తరలించేందుకు రోజుకి 500 టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడిదను తరలించేందుకు రోజూ 400 లారీల వరకు తిరుగుతుంటాయి. ఈ క్వారీలు, బూడిద చెరువు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలు, రహదారులకు నిత్యం వందలాది లారీలతో మెటల్, గ్రావెల్, బూడిద తరలిస్తుంటారు. టిప్పర్ లారీకి సైజును బట్టి 25 నుంచి 30 టన్నులకు మించి రవాణా చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఎక్కువ కిరాయి కోసం 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు కూడా లోడు చేసి రవాణా చేస్తున్నారు. డ్రైవర్లు గ్రామాల్లో చిన్న రోడ్లలో సైతం మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలను నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2న మునగపాడు చెరువు వద్ద కంకర లోడుతో వెళ్తూ బోల్తాపడి దగ్ధమైన టిప్పర్ లారీ జూన్ 6న ఇబ్రహీంపట్నం ట్రక్కు టర్మినల్ వద్ద బోల్తాపడిన బూడిద లోడుతో ఉన్న టిప్పర్ లారీ టిప్పర్ మే సవాల్ గ్రావెల్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి టిప్పర్ లారీలను చూస్తే భయమేస్తోంది గ్రావెల్, కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కువ ట్రక్కులు రవాణా చేస్తే కమీషన్ ఎక్కువ వస్తుందని డ్రైవర్లు వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి. –పెయ్యల ప్రతాప్, గ్రామస్తుడు, వెలగలేరు జి.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని గ్రావెల్ లారీ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... జి.కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన తొర్లికొండ శివయ్య(60) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య గురువారం ఉదయం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పని కోసం కవులూరు వెళ్తున్నాడు. కవులూరు గ్రామ శివారులోకి రాగానే వెనక నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్ రోడ్డు మార్జిన్ వైపు పడిపోగా వెనక కూర్చున్న శివయ్య లారీ కింద పడిపోయాడు. శివయ్యపైకి లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివమ్మ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ‘హెల్త్ ఫస్ట్–1991’
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్ను గురువారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్లో 14 వేల మందికిపైగా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన సభ్యులు అనుసంధానమై ఉంటారని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుల వైద్య సేవల కోసం ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ, అన్ని రకాల సేవలు దానిలో కవర్ కావడం లేదని, దీంతో చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి, 1991 బ్యాచ్ పోలీసు అధికారులు చొరవ చూపినట్లు తెలిపారు. 29 ప్రత్యేక విభాగాల్లో.. జిల్లాలోని 26 ప్రముఖ హాస్పిటల్స్తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్తో పాటు, వైద్య ఖర్చులో 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగా 29 ప్రత్యేక విభాగాల్లో 106 మంది డాక్టర్లు స్పందించి పోలీసులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ కేజీవీ సరిత, 1991 అధికారులు పాల్గొన్నారు. పెడన: మండలంలోని బలిపర్రు గ్రామంలో ఉన్న లిల్లి స్వయం సహాయక సంఘం(ఎస్హెచ్జీ) సభ్యురాలు కొణతం వినీత కలంకారి యూనిట్ను గురువారం సెర్ప్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మోర్డ్, ఎన్ఆర్ఎల్ఎం జాతీయ స్థాయి మేనేజరు లక్ష్మీకాంత్ పరసర్, జిల్లా ఏడీ శ్రీధరరావు కలంకారీ తయారీదారులతో మాట్లాడి ఎంటర్ప్రెన్యూర్గా వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు వాల్మీకి, సత్యభామ, శోభారాణి పాల్గొన్నారు.యాప్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
అతిసార పాపం ఎవరి పుణ్యం?
అధికారిక లెక్కలు ఇలా... లబ్బీపేట(విజయవాడతూర్పు): అతిసారకు కారణం ఏమిటంటే.. ఉత్సవాల్లో వడ్డించిన భోజనాలే అని అధికారులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు పగలు వండిన వంటకాలు రాత్రి తిన్నారని అందుకే ఇలా...అని అంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం పైప్లైన్ల నుంచి రంగు మారిన నీరు, దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. పెరుగుతున్న బాధితులు అతిసార బాధితులు గురువారం సాయంత్రం వరకూ ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారిని ప్రత్యేక వార్డుల్లో అడ్మిట్ చేసి జనరల్ మెడిసిన్ నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు అవడానికి కలుషిత ఆహారం కారణమని అధికారులు చెబుతున్నారు. వంద మందికి పైగా ఎఫెక్ట్ కావడంతో నీరు కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తూ ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. వైద్య సేవల పర్యవేక్షణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను గురువారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కూడా ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అతిపెద్ద ఎపిడమిక్ సమస్య కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల క్లినిక్స్(ఆర్ఎంపీ)లను మూసివేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 మంది డయేరియా బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 61 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇంకా 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వారిలో పెద్దవాళ్లు కొత్తాస్పత్రిలో, చిన్నారులు పాత ఆస్పత్రిలోని పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. -
సర్కారు తమాషా
ఎరువుల గోస..14 నెలలుగా ‘గౌరవం’ లేదుమచిలీపట్నంటౌన్: జిల్లాలో యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. జిల్లా వ్యాప్తంగా సరిపడినంత యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా యూరియా కొరత అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పోడియంను ముట్టడించారు. ఈ చర్చ జరిగే సమయంలో సభలో సభ్యుల వద్దకు పోలీసులు రావటాన్ని సభ్యులు తప్పుపట్టారు. కొరతే లేదంటూ వితండవాదం.. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి జిల్లాలో యూరియా కొరత లేదంటూ పేర్కొనటంతో పెదపారుపూడి ఎంపీపీ గోదం సురేష్తో పాటు జెడ్పీ వైస్చైర్మన్ గుదిమళ్ల కృష్ణంరాజు, గన్నవరం, కృత్తివెన్ను, కంచికచర్ల జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి, మైలా రత్నకుమారి, వేల్పుల ప్రశాంతి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని పేర్కొనడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంత మేర వరి సాగవుతోంది? దీనికి ఎంత మేర యూరియా అవసరమవుతుందో లెక్కకట్టి, ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించలేదన్నారు. పీఏసీఎస్లకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటంతో చైర్మన్ కనుసన్నల్లో యూరియా వారి పార్టీకి చెందిన వారికి, పెద్ద రైతులకు దొడ్డిదారిన ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పంట పొట్టదశకు చేరిందని ఇప్పటికీ యూరియా పూర్తిస్థాయిలో అందకపోవటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బదులిస్తూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే తొలి పంట వర్షాలకు దెబ్బతినటంతో మళ్లీ నాట్లు వేశారని, ముంపు బారిన పడిన పొలాలు మళ్లీ ఊడ్చారని దీంతో యూరియా మళ్లీ అవసరం కావటంతో కొరత ఏర్పడినట్లు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్కు అనుగుణంగా యూరియాను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొంత చేరిందని, మరికొంత రానున్న రోజుల్లో చేరుతుందన్నారు. ● 2024 ఆగస్టులో తువ్వకాలువకు వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వరకు 20 గండ్లు పడి దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు కావటం లేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీతో పాటు పలువురు జెడ్పీటీసీలు పేర్కొ న్నారు. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.1.60 కోట్లను మంజూరు చేసినా, పనులు చేపట్టకపోవటంతో ఇప్పటికీ మూడు పంటలను రైతులు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. గండ్లకు సంబంధించిన ఫొటోలతో మేట వేసిన పొలాల ఫొటోలను వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ వారికి హామీ ఇచ్చారు. ● జెడ్పీటీసీ, ఎంపీపీలకు కూటమి ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రొటోకాల్ ప్రాధాన్యం ఇవ్వటం లేదని సభ్యులు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకాలపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు ప్రొటోకాల్కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు ఫొటోలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ బాలాజీలకు చూపించారు. ఇకపై నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ● భోజన విరామం జరిగిన అనంతరం సభలో పంచాయతీరాజ్ డీఈ నగేష్ తాము జిల్లా కలెక్టర్కు శిలాఫలకం ప్రొటోకాల్ను పంపుతామని ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాటిని పెడుతున్నామని పేర్కొన్నారు. జేసీ గీతాంజలిశర్మ కలుగజేసుకుని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇకపై ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ● రెండు నెలల కిందట గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రథమ మహిళకే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కలెక్టర్ బాలాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ.. ఎస్పీ గంగాధరరావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తాను కూడా పర్సనల్గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు.జిల్లాలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ సమస్యలను లేవనెత్తేందుకు నిర్వహించే ప్రధాన సమావేశమైన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం పట్ల తాము అధికారులకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న జెడ్పీ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరుకాకపోవటం గమనార్హం.14 నెలలుగా గౌరవవేతనం రావటం లేదని, ఇది త్వరితగతిన ఇప్పించాలని జెడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్ను కోరారు. గౌరవవేతనం రాకపోవటంతో మండల పరిషత్ సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు హాజరుకామని చెబుతున్నారని, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీలకు జెడ్పీ నిధుల నుంచి గౌరవ వేతనం చెల్లించేలా సమావేశంలో తీర్మానించారు. నందిగామ మండలం రాఘవాపురంలో అక్రమ మట్టి తోలే క్రమంలో ఆపరేటర్, లారీ డ్రైవర్ మట్టి కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేయించాలని కంచికచర్ల, నందిగామ జెడ్పీటీసీలు వేల్పుల ప్రశాంతి, జి. వెంకటేశ్వరరావు తదితరులు అధికారులను కోరారు. విద్యపై జరిగిన చర్చలో తల్లికి వందనం పథకం ద్వారా చాలా మండలాల్లో తల్లులకు రూ. 6వేలు, 7వేలు మాత్రమే పడ్డాయని కొంత మందికి అసలు పడలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డీఈవో రామారావును కోరారు. సమావేశంలో నూజివీడు సబ్కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పనులన్నీ పూర్తి చేయండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లు, సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ పాయింట్లు, కేశఖండనశాలను పరిశీలించారు. హోల్డింగ్ పాయింట్లు పెంచాలి.. ఈ ఏడాది భక్తులను హోల్డింగ్ పాయింట్ ద్వారా క్యూలైన్లోకి అనుమతించాలని, అదే విధంగా రద్దీకి అనుగుణంగా పాయింట్లను పెంచాలని నిర్ణయించారు. క్యూలైన్లలో భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారు ఏ విధంగా బయటకు రావాలనే అంశాల గురించి ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదోడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై భక్తులకు సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో దుర్గగుడి ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ అన్నారు. రాజీ పడదగిన కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్లు, అన్ని రకాల సివిల్ కేసులు ఈ లోక్అదాలత్లో రాజీ చేసుకోవచ్చన్నారు.ఉత్సాహంగా కళా ఉత్సవ్ పోటీలుగుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఘనంగా జరిగాయి. డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కళా ఉత్సవానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 55మండలాల నుంచి 242మంది జిల్లా పరిషత్, గవర్నమెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. గాత్రం, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, సంప్రదాయ కథల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని డైట్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాల రూపంలో అందించారు.మహిళలు స్వయం సమృద్ధి సాధించాలిగన్నవరం: స్థానిక మండల మహిళా సమైక్య వెలుగు కార్యాలయాన్ని గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ పరస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన మండల సమైక్య ఈసీ సమావేశంలో పాల్గొన్న ఆయన స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్ష జరిపారు. మండల సమైక్య విజన్ బిల్డింగ్ నిర్దేశాలు, లక్ష్యాలు, వాటిని సాధించడానికి సభ్యుల ప్రణాళికలు, సబ్ కమిటీల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసరపల్లిలోని చరిత గ్రామెక్య సంఘం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫర్నీచర్ వ్యాపారం, బోటిక్ డిజైనింగ్ వర్క్స్, వన్ గ్రామ్ గోల్డ్, పిండి మర నిర్వహిస్తూ ఆదాయం సాధిస్తున్న మహిళలను ఆయన అభినందించారు. మిగిలిన సభ్యులు కూడా సంఘం ద్వారా పొందిన రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మండల సమైక్య అధ్యక్షురాలు కె. రమా, కార్యదర్శి డి. సుశీల, కోశాధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–అనకాపల్లి ప్రత్యేక రైలు (07035) ఈ నెల 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడవనుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07036) ఈ నెల 14 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారాల్లో నడపనున్నారు. రెండు మార్గాలలో ఈ రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్లు, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది. -
కన్న తండ్రే కడతేర్చాడు!
మైలవరం: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు. రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు. ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు. చంపేసి.. విసిరి పారేసి.. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
డయేరియాపై వదంతులు నమ్మవద్దు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వదంతులు నమ్మవద్దని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం మంత్రి పొంగూరు నారాయణ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించి, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో మంత్రి నారాయణ.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పురపాలక శాఖ డైరెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డయేరియా ప్రబలకుండా ఇప్పటికే తీసుకున్న చర్యలపై చర్చించారు.నీటి సరఫరా నిలిపేయండి..మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేటలో ముందుజాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి ట్యాంకర్ల ద్వారా, వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించామని.. కాచి వడపోసిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్య శిబిరం, న్యూ జీజీహెచ్లో బాధితులకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒకసారి నీటి నమూనాలను పరీక్షించామని తెలిపారు. లోపాలు కనిపించలేదని, మరిన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యకు అసలు కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాధితులున్న కేర్ అండ్ షేర్ స్కూల్కి ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి వెళ్లి పరామర్శించారు. -
లాఠీలతో కలాన్ని అణచలేరు..
లాఠీలతో కలాన్ని అణచలేరు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీస్స్టేషన్కు పిలవగలరేమోగాని, పత్రికను నిజాలు రాయకుండా ఆపటం ఎవరివల్లా కాదు. అది ప్రపంచ నియంతల వల్లే కాలేదు. మూడు సంవత్సరాల్లో కూలిపోయే ఈ ప్రభుత్వం నిజాలు వార్తగా రాసే కలాన్ని అదిరించలేదు, బెదిరించలేదు. పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్రపు హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. – పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు -
ఏఎన్యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఆ విషయం బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు చేపట్టాలని, ఓవర్హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సేపక్ తక్రా సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సబ్ జూనియర్స్ బాల బాలికల జిల్లా జట్లను ఎంపికలను గురువారం నిర్వహిస్తున్నామని ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.పవన్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో అనంతపురం ఉరవకొండలోని జెడ్పీహెచ్ స్కూల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 1–1– 2011 తర్వాత పుట్టిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఉదయం 7 గంటలకు 4 పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. తిరువూరు: విస్సన్నపేట మండలం చండ్రుపట్లకు చెందిన యువతి(23)పై అదే మండలంలోని తాతకుంట్లకు చెందిన వడిత్యా శ్రీనివాస్(25) మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏడాది కాలంగా తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ శారీరకంగా వాడుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో యువతి తల్లిదండ్రులు, యువకుడి కుటుంబ సభ్యులతో కొందరు పెద్దలు రాజీ కోసం మంతనాలు చేసినా.. బాధితురాలు తనకు న్యాయం చేయాలని చెప్పడంతో శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. కప్తానుపాలెం(మోపిదేవి): కుమార్తె బాధను చూడలేక తన వయస్సును, వృద్ధాప్యాన్ని లక్ష్యపెట్టక తండ్రి కిడ్నీదానం చేసిన ఘటన మండలంలోని కప్తానుపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్బాబు వారి ఇంటి వద్ద పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్బాబు మాట్లాడుతూ రెండు కిడ్నీలు కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు కిడ్నీ దానం చేసి ఆమెకు పునర్జన్మ ఇచ్చిన విశ్రాంత టీచర్, మాజీ రాష్ట్ర పీఆర్టీయూ నేత అడవి శ్రీరామమూర్తి అన్నారు. భార్య మరణించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ధైర్యంగా కుమార్తెకు కిడ్నీని దానం చేసిన ఆయన త్యాగానికి ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తిని సత్కరించారు. -
బెజవాడలో మృత్యుఘోష
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో డయేరియా పడగవిప్పింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా బాధితులు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజరాజేశ్వరి పేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆ ప్రాంతంలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం మంగళవారం రాత్రి తీసుకున్న కలుషిత ఆహారం కారణమని చెప్పుకొస్తున్నారు. బుధవారం మరికొందరు స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కొందరు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసారతో ఎంత మంది బాధపడతున్నారనేది అధికారులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. వంద మంది వరకూ వేర్వేరు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఉరుకులు పరుగులున్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అతిసారతో బాధితులు ఆస్పత్రుల దారి పట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సైతం బాధితులు రాగా ప్రాథమిక వైద్యం అందించి పంపించేశారు. అదే సమయంలో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బుధవారం ఉదయానికి పరిస్థితి తీవ్రమైంది. వాంతులు, విరేచనాలతో బాధపడే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. కొందరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరి కొందరికి సింగ్నగర్ యూపీహెచ్సీలో వైద్యం అందించారు. అయితే ఎంత మంది అతిసారకు గురయ్యారనే విషయం లెక్కతేలడం లేదు. మరో వైపు అతిసారకు తాగునీరు కారణమా అనే విషయం తేల్చేందుకు గురువారం వాటర్ ఎనలిస్ట్స్ ఆ ప్రాంతంలో పర్యటించి శాంపి ల్స్ను పరీక్షించనున్నారు.జీజీహెచ్లో 25 మందిఅతిసార బాధితులు ప్రస్తుతం 25 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరొక చిన్నారి పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారికంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ప్రకటించారు. మరో ముగ్గురు మంగళవారం రాత్రి చికిత్స కోసం రాగా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పంపించివేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ జి.లక్ష్మీశ పరామర్శించారు. బాధితులకు మెరుగైన, వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.28 మందిని నిర్ధారించాంఅతిసారకు గురైన వారు 28 మంది వేర్వేరు ప్రాంతాల్లో చికిత్స పొందినట్లు నిర్ధారించామని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. మరో ఆరుగురు ఓపీలో పరీక్షలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికే 735 గృహాలను సర్వేచేశామని, గురువారం మరిన్ని గృహాలను సర్వే చేస్తా మని పేర్కొన్నారు. ఎక్కువ మంది సమీపంలోని ఆర్ఎంపీల వద్దకు వెళ్లారని, వారి వివరాలు తీసు కున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్లారనే సమాచారం సర్వేలో రాలేదన్నారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, వాటి ఫలితాలు వచ్చేందుకు మూడు రోజుల సమయం పడుతుందన్నారు.బాధితులకు మల్లాది విష్ణు పరామర్శప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూఆర్ ఆర్పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపో వడం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో నాలుగు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూరాజరాజేశ్వరీపేటలో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యా రని ఆందోళన వ్యక్తంచేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్ నజీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ ‘కట్ట’కట?
కంకిపాడు: యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. యూరియా కట్ట కోసం రైతులు క్యూ కడుతున్నారు. పీఏసీఎస్ల వద్ద కట్టల కోసం తోపులాటలు, గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది. యూరియా అందు బాటులో ఉందని అధికారులు చెబుతున్నా, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారంటే కూటమి ప్రభుత్వ ప్రచారంలో వాస్తవం ఎంతో అర్థం చేసుకోవచ్చు. సొసైటీల వద్ద పడిగాపులు.. పీఏసీఎస్లకు యూరియా స్టాకు రావటంతో అధికారులు వచ్చి, స్లిప్పులు పంపిణీ చేసే వరకూ యూరియా సరఫరా జరగకపోవటంతో రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అధికారులు వచ్చిన తర్వాత ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్ట చొప్పున గరిష్టంగా మూడు కట్టలు చొప్పున మాత్రమే పంపిణీ చేస్తూ స్లిప్పులు అందజేశారు. బుధవారం మండలంలోని ఉప్పలూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, ప్రొద్దుటూరు, నెప్పల్లి సొసైటీలకు 15 టన్నులు చొప్పున, గొడవర్రు, మద్దూరుకు 10 టన్నులు యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఆయా సొసైటీలకు చేరుకోవటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. పంట పొలాలు చిరుపొట్ట దశకు చేరుకోవటంతో ఈ దశలో యూరియా అందించాలని, అదును తప్పితే దిగుబడులుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. సమస్యను అధిగమించేందుకు రైతాంగం యూరియా కోసం సొసైటీల వద్ద క్యూలు కట్టారు. ఉప్పలూరు, గొడవర్రు సొసైటీల వద్ద స్లిప్పులు కోసం రైతులు పోటీ పడటంతో ఒకానొక దశలో రైతుల మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. సొసైటీలకు యూరియా నిల్వలు వచ్చినా అది కూడా అరకొరగానే పంపిణీ జరిగిందని, పూర్తి స్థాయిలో యూరియా అందలేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు అరకట్ట యూరియా సరిపోదని, కట్ట సరఫరా చేస్తే మేలు జరుగుతుందని కోరుతున్నారు. అధికారుల పర్యటన.. మండలంలోని సొసైటీల్లో జరుగుతున్న యూరియా పంపిణీ తీరును జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, విజిలెన్స్ డీఎస్పీ బంగార్రాజు పరిశీలించారు. కోలవెన్ను, ఉప్పలూరు, గొడవర్రు, పునాదిపాడు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎకరాకు కట్ట చొప్పున యూరియా పంపిణీ చేయాలని కోరారు. అదును పోక ముందే పంటకు యూరియా, కాంప్లెక్సు ఎరువులు అందించాలని, రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు అందించాలని విన్నవించారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి మాట్లాడుతూ రైతుల అసరాల మేరకు ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పర్యటనలో మండల వ్యవసాయాధికారి వెలివెల ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యే లేదంటున్న ప్రభుత్వం అన్నదాతలకు తప్పని పడిగాపులు అరకట్ట కోసం క్యూలు కడుతున్న వైనం పీఏసీఎస్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు -
ఫ్లెక్సీ వ్యాపారులు నిబంధనలు పాటించాలి
కోనేరుసెంటర్: శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీ వ్యాపారులు ప్రింట్లు వేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మచిలీపట్నంలోని ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిన సందర్భాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఫ్లెక్సీల కారణంగా అనేక ప్రాంతాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగిన సంఘటలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వ్యాపారులు మతాలను, కులాలను, ప్రాంతాలను, వర్గాలను, వ్యక్తులను కించపరిచే విధంగా ఎవరైనా ఫ్లెక్సీలు ప్రింట్ వేయమని అడిగితే వెంటనే నిరాకరించాలని తెలిపారు. ఒకవేళ అలాంటి ఫ్లెక్సీలు ప్రింటింగ్ వేయాలని ఎవరైనా వచ్చి అడిగినట్లయితే తక్షణమే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే ప్రింటింగ్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
రైళ్లలో స్నాచింగ్లు.. పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస దొంగతనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్తో కలసి జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ వివరాలు వెల్లడించారు. పద్మావతి ఎక్స్ప్రెస్లో.. తిరుపతికి చెందిన బండి రాజ్యలక్ష్మి ఆగస్టు 23న తిరుపతి నుంచి వరంగల్లుకు పద్మావతి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడలో ఆగి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు నానుతాడును తెంచుకుని కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించి రెండు రోజుల తరువాత విజయవాడ చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తుడి కోసం గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించడం, పాత నేరస్తులను విచారించడం ద్వారా చోరీకి పాల్పడింది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్నగర్కు చెందిన తండ్రికంటి రమేష్గా గుర్తించారు. ఇతనిపై గతేడాది విజయవాడ స్టేషన్లో స్నాచింగ్ కేసులోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ముమ్మర గాలింపు.. పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం హైదరాబాద్, వరంగల్లు, ఖమ్మంలో గాలింపు చేపట్టినా పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిందితుడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తిరుగుతుండగా.. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్నాచింగ్కు పాల్పడిన లక్షరూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారు నానుతాడుతో పాటుగా గతంలో చోరీ చేసిన నాలుగు లక్షల విలువైన రెండు సూత్రాలతో కూడిన 40 గ్రాముల బంగారు నానుతాడును కూడా పోలీసులు రికవరీ చేశారు. రూ. 5లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
సరిపడా యూరియా ఇవ్వడం లేదు
చల్లపల్లి: యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ యూరియా సరఫరా చేసేందుకు సరిపడా నిల్వలు ఉన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ రైతులతో అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం పీఏసీఎస్లో బుధవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. కలెక్టర్ బాలాజీ వచ్చి పంపిణీని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరి సాగుపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇస్తున్న యూరియా సరిపోవటం లేదని పూర్తిస్థాయిలో అందించాలని రైతులు కోరారు. ఘంటసాల మండలం మల్లంపల్లి, లంకపల్లి గ్రామాల్లో ఇంకా యూరియా అవసరం ఉందని లంకపల్లికి 50 టన్నులు, మల్లంపల్లికి 30 టన్నుల యూరియా అవసరం ఉందని దాలిపర్రుకు చెందిన రైతు వీరమాచినేని భవానీప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆందోళన వద్దు.. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత యూరియాను తెప్పిస్తున్నామని యూరియా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఎక్కువగా యూరియా వాడటం వల్ల పంట నాణ్యత దెబ్బతింటుందన్నారు. కాబట్టి రైతులు ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కలెక్టర్ వెంట మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, ఏడీఏ ఎస్.శ్యామల, వ్యసాయ, రెవెన్యూ మండల అధికారులు తదితరులు ఉన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీకి వివరించిన రైతులు -
విశ్వనాథ సాహిత్యం అజరామరం
విజయవాడ కల్చరల్: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్యం వెలకట్టలేనిదన్నారు. ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వేముల చారిటీస్ కన్వీనర్ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారుడు యలమంద, శ్రీనివాసరావు, రవికుమార్, పైడేటి భాను పాల్గొన్నారు. ● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశ్వనాథ చేపట్టని సాహిత్య ప్రక్రియలేదన్నారు. సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, బోడి ఆంజనేయరాజు, రాంకుమార్, రూపాశ్రీ, సంస్కార భారతి నగర అధ్యక్షుడు పి. భాస్కర శర్మ, డూండీ పాల్గొన్నారు. ● భారతీయ జనతా పార్టీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. -
గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల గ్రంథాలయ పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండు లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియే షన్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ – ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, నెట్, సెట్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఏపీపీఎస్సీ దగ్గర నిలిచిపోయిన జూనియర్, డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీ లెబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కె.జగదీశ్, డీవైఎఫ్ఐ నాయకులు పి.కృష్ణ, పిచ్చయ్య, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడకు కూత వేటు దూరంలోని గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఈ మాన్యం భూముల్లో అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో మట్టి తోలి చదును చేసే పనులు నిలిచిపోయాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసి, దేవదాయ శాఖ పొలాల్లో ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. విజయవాడ ఉత్సవాలకు వేరే ప్రైవేటు స్థలాన్ని చూసుకోవాలని చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవుడి మాన్యం చదునుపై అనుమానాలు దేవుడి మాన్యం భూమిని చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ అనేది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అనే స్పష్టత ఇప్పటికీ లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చును ఏవిధంగా సమకూర్చుతున్నారనే అంశంపైనా చర్చ సాగుతోంది. ప్రముఖులు, వ్యాపార సంస్థల నుంచి చందాల వసూళ్లకు ప్రణాళిక రచించారనే ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విజయవాడ ఉత్సవ్ వెనుక భారీ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలో గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ మల్టీ కాంప్లెక్స్లు, మల్టీ థియేటర్లు నిర్మిస్తుందని, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత రిక్రియేషన్ క్లబ్, ఓ ప్రముఖ హోటల్ సంస్థ యజ మాని స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతారని, మరో టీడీపీ నాయకుడు క్యాంటీన్లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం జరిగిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థలంపై కన్నేసిన వారిలో కొంత మంది ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల కోసం పెట్టుబడులు పెట్టడంతోపాటు, పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసేందుకు రూప కల్పన జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి చేరాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. పెద్దలకు విన్నపాలు విజయవాడ ఉత్సవ్ జరుపుతామని ప్రచారం చేశామని, ఎలాగైనా అక్కడే ఉత్సవాలు జరపా లని టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా అయినా ఉత్సవాలకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే లీజు ఉండటంతో, వారి నుంచి సబ్ లీజుకు తీసుకొనే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ లీజుదారులను ఒప్పించి వారి లీజు రద్దు చేసి, గుడికి ఆదాయం ఎక్కువగా వస్తుందని చూపి, తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరికై నా అనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలు పండే పొలంలో కోట్ల రూపా యల మట్టిని ఆ ప్రదేశంలో నింపారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులూ తీసుకో లేదు. ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులు నిలిపి వేసినా మూడు అడుగుల మేర నింపిన మట్టి తొలగింపు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మొత్తం మీద గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందనే విషయం చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే గుడి కమిటీ, విశ్వ హిందు పరిషత్ సంస్థ సభ్యులు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో సమావేశమై ఆ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు. దేవుడి మాన్యంపై కూటమి నేతల కన్ను గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యంపై విజయవాడ పార్లమెంట్ ముఖ్యనేతతో పాటు, మరికొంత మంది టీడీపీ నేతల కన్ను పడింది. విజయవాడ ఉత్సవ్ ముసుగులో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ.400 కోట్ల విలువైన ఈ 39.99 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షో, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు శాశ్వత వేదిక నిర్మాణం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి పనులూ మాన్యం భూమిలో చేపట్టరాదని దేవదాయశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి అధికారికంగా తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. -
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ విభాగాల కీలక ప్రగతి సూచికల (కేపీఐ) పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నాలుగు సూచికలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం వేసే ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాదికి జిల్లా మొత్తంమీద 4వేల ఎకరాలను, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 20 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు 3,741 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా మునగ సాగుకు 894 ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. మండలాల వారీగా లేబర్ మొబిలైజేషన్, సీసీ రహదారుల నిర్మాణం, పశువుల షెడ్లు, జీవాల షెడ్ల నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలపైనా సమావేశంలో సమీక్షించారు. డ్వామా పీడీ ఎ.రాము పాల్గొన్నారు. -
ఐటీఆర్లో నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు
22మంది వైద్య, ఆరోగ్యశాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు మచిలీపట్నంఅర్బన్: ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం నకిలీ బ్యాంకు హౌసింగ్ లోన్ స్టేట్మెంట్లు సమర్పించిన ఆరోపణలపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలోని ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గతంలో జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో పనిచేసిన మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి (ఎంపీహెచ్ఈఓ) వీవీ సర్వారాయుడు సహా మొత్తం 42 మంది ఉద్యోగులపై విచారణ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు 2016లో వచ్చిన పోస్టుకార్డు పిటిషన్ ఆధారంగా అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో ఉద్యోగులు ఆదాయపు పన్ను సమర్పణలో మినహాయింపులు పొందేందుకు నకిలీ హౌసింగ్ లోన్ స్టేట్మెంట్లు సమర్పించారని తేలింది. దీనిపై 42 మంది ఉద్యోగులపై శాఖ చర్యలు చేపట్టాలని నివేదికలో సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుల మేరకు అప్పటి ఎంపీహెచ్ఈఓ వీవీ సర్వారాయుడుతో సహా 21 మందికి ఆరోపణల పత్రాలు జారీ అయ్యాయి. వారు ప్రారంభంలో ఆరోపణలను ఖండిస్తూ రాతపూర్వక సమాధానాలు సమర్పించారు. తప్పును ఒప్పుకుంటూ.. అనంతరం సర్వారాయుడు సహా 33 మంది ఒక సార్వత్రిక ప్రతినిధి పత్రం సమర్పించారు. అందులో ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పణలో అనుభవం లేకపోవడంతో ఆడిటర్ సూచనల ప్రకారం నకిలీ పత్రాలు జత చేశామని, విజిలెన్స్ శాఖ వాస్తవాలు వెల్లడించిన వెంటనే రివైజ్డ్ ఐటీ రిటర్న్ దాఖలు చేశామని పేర్కొన్నారు. తమ తప్పును మానవతా ధృక్పథంలో మన్నించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, తప్పుడు చర్యలకు పాల్పడినందుకు ప్రస్తుత సేవలో ఉన్న సర్వారాయుడుతో సహా మరో 21 మందిపై రెండు వార్షిక వేతన పెరుగుదలలు నిలిపివేత (క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ లేకుండా) శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మెదడులో మాంసం తినే పరాన్నజీవి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగి మెదడులో మాంసం తింటున్న అరుదైన పరాన్నజీవిని విజయవాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు శస్త్ర చికిత్సతో తొలగించారు. అనంతరం దానిని నిర్ధారించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కోల్కత్తాలోని జీవశాస్త్ర నిపుణులకు పంపించారు. మాంసం తినే స్క్రూవార్మ్ పరాన్నజీవిగా వారు నిర్ధారించినట్లు జీజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్కుమార్ తెలిపారు. ఈ పరాన్నజీవిని తొలిసారిగా అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కేసు వివరాలు ఇలా... తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో ఉన్న 50 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు విజయవాడ జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, తలనుంచి చీము కారుతోందని గుర్తించారు. స్కాన్ చేసి ఆమె మెదడులో చీము గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మానని లోతైన గాయంలో కదులుతున్న క్రిములను మాగ్గోట్లుగా గుర్తించారు. ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసేందుకు నిర్ణయించి తొలుత తలలోని పుండు నుంచి మాగ్గోట్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం తలపై గాయాన్ని తొలగించి శుభ్రపరచడంతో పాటు, శస్త్ర చికిత్స చేసి మెదడులోని చీము గడ్డను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎ.ఆర్.సి.హెచ్.మోహన్ సారథ్యంలో ఫ్లాప్ సర్జరీ చేసి తలపై ఉన్న గాయాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నిర్ధారణ ఇలా... మెదడు నుంచి తొలగించిన మాగ్గోట్లను, క్రిమి గురించి ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర నిపుణులు డాక్టర్ జ్ఞాణమణి, గుంటూరు లామ్ నిపుణులు రత్నంను సంప్రదించగా వారు స్క్రూ వార్మ్లుగా గుర్తించారు. అనంతరం కోల్కత్తాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించి స్క్రూవార్మ్లుగా నిర్ధారణ చేశారు. సాధారణంగా ఈగల నుంచి జనించే మాగ్గోట్లు జంతువులు, మనుషుల శరీరంలో చెడిపోయిన, కుళ్లిన నిర్జీవ కణజాలాలపై మాత్రమే ఆధారపడి జీవిస్తాయి. కానీ స్క్రూవార్మ్ సజీవ కణజాతాలను సైతం తినే పరాన్నజీవులుగా జీవిస్తాయని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీచేసిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. రోగి మెదడులో నుంచి తీసిన అరుదైన పరాన్నజీవి స్క్రూవార్మ్ -
తాగునీటి కోసం రాస్తారోకో
కొమరవోలు(మొవ్వ): మూడు రోజులుగా తాగునీరు అందక అల్లాడుతున్నామంటూ ప్రజలు రోడ్డెక్కిన ఘటన పామర్రు మండల పరిధిలోని కొమరవోలు పంచా యతీ పరిధిలోని గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. తమకు తాగునీరు రావడం లేదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. మూడురోజులుగా తాగునీరు లేని కారణంగా తాము రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుడివాడ–పామర్రు జాతీయ రహదారిపై మండుటెండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపైన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారనే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
రోగులకు మెరుగైన వైద్య సహాయం అందాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ ఎప్పటి కప్పుడు పరీక్షించాలన్నారు. చర్యలు తప్పవు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనన మరణ నివేదికలు, అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, డీఐఓ శరత్ కుమార్, డీసీహెచ్ఎస్ మాధవి దేవి పాల్గొన్నారు. -
లోకల్ లారీ ఓనర్ల పొట్టకొట్టొద్దు
ఇబ్రహీంపట్నం: ఏపీ జెన్కో సంస్థ లోకల్ లారీ యజమానుల పొట్టకొట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బూడిద చెరువు అప్పజెప్పడం అన్యాయమని లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ వ్యవస్థను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకుని లారీలు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు బూడిద కాంట్రాక్ట్ కట్టబెట్టి తమకు అన్యాయం చేస్తే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. ఉచిత బూడిదను అమ్మకానికి పెట్టి స్థానికుల పొట్టకొట్టొద్దన్నారు. ఏపీ జెన్కో, ఎన్టీటీపీఎస్ నిరంకుశ వైఖరిని ఖండించారు.కంచికచర్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని, నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అన్నారు. మంగళవారం కంచికచర్లలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని చందర్లపాడు మండలం కోనాయిపాలెం ప్రాథ మిక సహకార పరపతి సంఘాన్ని పరిశీలించారు. ముందుగా ఎరువుల దుకాణానికి వచ్చిన రైతులతో జేసీ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 4,003 టన్నుల యూరియా అందు బాటులో ఉందని, మరికొంత యూరియా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. వరి నాటు వేసినప్పుడు ఎకరానికి 30 కేజీల యూరియా, నాటు వేసిన 30రోజులకు రెండో విడతగా మరో 30 కేజీలు, అంతేకాకుండా నాటు వేసిన మూడో విడత ఎకరానికి 30కేజీల యూరియాను వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జేసీ అన్నారు. తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, ఆర్ఐ వెంకటరెడ్డి, ఏఓ కె. విజయకుమార్, రైతులు పాల్గొన్నారు.జగ్గయ్యపేట అర్బన్: ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం జగ్గయ్యపేటలో ఎన్నుకున్నారు. స్థానిక పోస్టాఫీసు ఎదురుగా ఉన్న సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ అబ్బాస్ ఆలీ, కొత్తపల్లి కోటేశ్వరరావు, కోశాధికారిగా కర్లపాటి కొండలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిశీలకుడు విష్ణువర్థన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ వైద్యాధికారి నోముల అనిల్కుమార్ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్అండ్వీ రెజిమెంట్ ఎన్సీసీ యూనిట్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హార్స్ షో ఆకట్టుకుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే సమ్మిళిత వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా క్యాడెట్లు వివిధ విన్యాసాలను ప్రదర్శించారు. ఉదయం ఆక్టోపస్ పోలీస్ల ఆధ్వర్యంలో డాగ్ షో జరిగింది. స్నైపర్ డాగ్లు పేలుడు పదార్థాలను ఎలా గుర్తిస్తాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సాయంత్రం హార్స్ షోలో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లు గుర్రపు స్వారీ చేస్తూ అబ్బురపరిచే విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ విజయంత్ శ్రీవాస్తవ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరానికి నాలుగు ఎన్సీసీ యూనిట్లకు చెందిన 260 మంది క్యాడెట్లు హాజరయ్యారని తెలిపారు. వారికి శారీరక దారుఢ్య, డ్రిల్, స్సోర్ట్స్ అండ్ గేమ్స్, ఫైరింగ్ ప్రాక్టీస్, వ్యక్తిత్వ వికాసం, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్కు ఎంపిక చేస్తామన్నారు. -
తీరని యూరియా కష్టాలు
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): యూరియా కష్టాలు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. యూరియా కోసం మంగళవారం రైతులు రుకులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజనం ఉండదు. దీంతో యూరియా కట్టల కోసం ఉదయం నుంచే సొసైటీల వద్ద పాస్పుస్తకం, ఆధార్ జిరాక్స్లు చేత పట్టుకుని రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. పనులు వదిలేసి యూరియా కోసం నిలబడితే ఒకటి లేదా రెండు బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు సొసైటీలో 25 టన్నులు, పెనుగంచిప్రోలులో గ్రోమోర్లో 25 టన్నులు చొప్పున యూరియా పంపిణీ చేసినట్లు ఏవో రామసుబ్బారెడ్డి తెలిపారు. అయితే సొసైటీల వద్ద పంటలకు అవసరమైన మేర యూరియాను పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. -
ఆర్జిత సేవ భాగ్యం దక్కేనా?
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. మరో 12 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నా ఇంత వరకు సేవా టికెట్ల ఊసే లేకుండా పోయింది. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన, ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. గతంలో సేవా టికెట్లను దేవస్థాన కౌంటర్ల విక్రయించడంతోపాటు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచేవారు. అయితే ఈ ఏడాది ఆర్జిత సేవలపై మొదటి నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆర్జిత సేవల టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. అన్ని సేవలకు కలిపి రోజుకు 300 చొప్పున 11 రోజులకు 3,300 టికెట్లు విక్రయించేలా దేవస్థానం చర్యలు తీసుకుంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు తమ వరకు వస్తాయో రావోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీహోమానికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ ఆర్జిత సేవలకు షిఫ్టునకు 75 టికెట్లు చొప్పున విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ప్రముఖులు, వీఐపీలు, సిఫార్సు ఉన్న వారికే ఈ సేవ టికెట్లు దక్కుతాయనే భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవస్థాన టోల్ఫ్రీ నంబర్కు రోజూ వస్తున్న ఫోన్ కాల్స్లో అత్యధికంగా సేవా టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనే కావడం గమనార్హం. రెండు విడతలుగా ఆర్జిత సేవలు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3 వేలు, మూలా నక్షత్రం రోజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్ర నవార్చనకు రూ.3 వేలు, ప్రత్యేక చండీహోమానికి రూ.4 వేలుగా టికెట్ల ధరలు ఖరారు చేశారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన తెల్లవారుజాము ఐదు నుంచి ఆరు గంటల వరకు, ప్రత్యేక కుంకుమార్చన మహామండపం ఆరో అంతస్తులో మొదటి విడత ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు, రెండో విడత ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాల నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రత్యేక కుంకుమార్చన ఉదయం పది నుంచి 12 గంటల వరకు ఒక విడత మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో పొందే అవకాశం ఉందన్నారు. పరోక్ష సేవకు రూ.1,500 ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒక రోజు పరోక్ష సేవ టికెట్ ధరను రూ.1,500గా, 11 రోజుల పాటు సేవకు రూ.11,116గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా భక్తులు తెలిపిన చిరునామాకు పంపిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. -
డ్రోన్లతో నానో యూరియా పిచికారీ
జి.కొండూరు: డ్రోన్లతో నానో యూరియా పిచికారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జి.కొండూరు మన గ్రోమోర్ సెంటర్లో యూరియా పంపిణీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. యూరియా స్టాకు, పంపిణీ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో డ్రోన్తో నానో యూరియా పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 32 డ్రోన్లతో నానో యూరియా పిచికారీపై డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో అవసరం మేరకే యూరియాని వినియోగించాలన్నారు. కొరత లేకుండా ఉండేలా ఎరువుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, ఏఓ సూరిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
కర్షకుడి కోసం కదంతొక్కిన వైఎస్సార్ సీపీ
కంకిపాడు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ ఆర్డీఓ కార్యాలయాల వద్ద శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్, పంట నష్టపరిహారం అందజేత తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆయా ఆర్డీఓ కార్యాలయాల వద్దకు పార్టీ శ్రేణులు, రైతులు పాదయాత్రగా వెళ్లకుండా పోలీసులు అడ్డుతగిలారు. అన్నదాతలు సైతం తమ గళం విప్పారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, దిగుబడులుపై ఆందోళన చెందాల్సి వస్తోందని వాపోయారు. యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతులు కన్నెర్ర చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘అన్నదాత పోరు’లో తమ నిరసన గళం వినిపించారు. యూరియా అందించకుండా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దల తీరును ఎండగట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమాన్ని పోలీసులు నీరుగార్చేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. శాంతియుతంగా తమ సమస్యను విన్నవించుకునేందుకు సైతం ఆస్కారం లేదనేలా నిస్సిగ్గుగా వ్యవహరించారు. అయినా వైఎస్సార్ సీపీ మద్దతుతో రైతులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద అధికారులకు వినతులు అందించి తమ సమస్యలను చెప్పుకున్నారు. -
ముహూర్తం కోసం వెళ్లి..
కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వెళ్లి ఆనందంతో తిరిగి వస్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తెను తమ గ్రామానికే చెందిన సాయికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు చంద్రశేఖర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. కుమారుడి వివాహం చేసే ముందుగా తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు తెలంగాణ రాష్ట్రం, ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న ఓ పూజారి వద్దకు వెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆనందంగా బైక్పై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన వారిని ఎర్రుపాలెం, తక్కెళ్లపాడు మధ్యలో ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతుల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసరావు దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరు గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయాలను సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.లారీ ఢీకొని మృతిచెందిన దంపతులు -
జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి రక్షించాలి
మంగళగిరి టౌన్: జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి ప్రత్యేకంగా రక్షించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ రక్షణకు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన పెడనలో చేనేత అధ్యయన యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రిబేట్, యార్న్ సబ్సిడీ, ట్రిప్ట్ ఫండ్, పావలా వడ్డీ, మార్కెటింగ్ ఇన్సెటివ్లు కలిపి రూ.127.87 కోట్ల బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని తక్షణమే విడుదల చేసిన సహకార సంఘాలు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి నేతన్న భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని పేర్కొన్నారనీ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి మోహనరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆటిజం నుంచి బాలలను రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆటిజం తల్లి గర్భం నంచే మొదలవుతుందని, ఈ వ్యాధి పిల్లల జీవితంలోకి ప్రవేశించడానికి ముందే అడ్డుకోవా లని రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి తల్లిదండ్రులకు సూచించారు. రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిబిరం 14వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందన్నారు. ఆటిజం సమస్య పరిష్కారంలో వాడే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం 91000 65552 నంబర్కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పిల్లలు పుట్టకముందే ఆటిజం సమస్యను నివారించేందుకు ప్రత్యేక చికిత్స ఉందని వివరించారు. ఆటిజం సమస్యకు సంబంధించి మరింత సమాచారం కోసం 98215 29653 సెల్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఉద్యాన పంటల ఎగుమతితో అధిక లాభాలు
హనుమాన్జంక్షన్ రూరల్: నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించొచ్చని ఏపీఈడీఏ రీజనల్ బిజిసెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్కుమార్ సూచించారు. బాపులపాడు మండలం మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లోని అగ్రిక ల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈ డీఏ), ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి అవకాశాలపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికంగా పండించే మామిడి, కూరగాయలు, ఆకుకూరలను ఎగుమతి చేసే అవకాశాలను ఏపీఈడీఏ కల్పిస్తోందని అశోక్కుమార్ తెలిపారు. పంట ఎగుమతి విధానం రైతులకు అర్థమయ్యేలా పవర్పాయింట్ ప్రజెంటెషన్ ప్రదర్శించారు. కృష్ణా జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ.. పంటల ఎగుమతి కోసం ఎఫ్ఈఓలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, రాయితీలను వివరించారు. మామిడి పరిశోధన కేంద్రం (నూజివీడు) సినీయర్ శాస్త్రవేత్త బి. కనకమహాలక్ష్మి మాట్లాడుతూ.. మామిడిలో తరుచుగా కనిపించే చీడపీడల నివారణ చర్యలు, నాణ్యమైన దిగు బడికి పాటించాల్సిన సన్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ‘సూక్ష్మ గామా’ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ వివేక్ మాట్లాడుతూ.. ఐక్యూఎఫ్ పద్ధతి ద్వారా తాజా కూరగాయలను ఫ్రోజెన్ కూరగాయలుగా మార్చి ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బాపులపాడు, అవనిగడ్డ, ఉయ్యూరు, కంకిపాడు మండలాల ఉద్యాన శాఖ అధికారులు, పలువురు ఉద్యాన రైతులు పాల్గొన్నారు. -
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ తన కార్యకలాపాలను సాగిస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం సోమవారం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. అనంతరం చలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హనుమాన్ జంక్షన్లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1210 కోట్లు టర్నోవర్ సాధించామని, 29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కృష్ణామిల్క్ యూనియన్లో రూ.230 కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయన్నారు. బుడమేరు ముంపు యూనియన్ను తీవ్రంగా నష్టపరిచినా పాడి రైతులకు రూ.46 కోట్లు బోనస్గా చెల్లించామని, అదే సమయంలో రూ.16 కోట్ల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. గడిచిన ఆరేళ్లలో పాల దిగుబడిని పెంచేలా యూనియన్ నాణ్యమైన పశుదాణాను సబ్సిడీపై అందిస్తోందన్నారు. విజయ పార్లర్ ద్వారా డ్వాక్రా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు చలసాని చక్రపాణి, నెలకుదిటి నాగేశ్వరరావు, వేమూరి వెంకట సాయిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టిన దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు నిర్మించిన బీటీరోడ్డును పరిశీలించారు. క్యూకాంప్లెక్స్ను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మహా మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న లడ్డూ పోటును పరిశీలించి భవన డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణంలో ఎటువంటి అలసత్వం వద్దని, భవష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజగోపురం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని పరిశీలించారు. కొండపై నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని, యాగశాలను పరిశీలించి మిగిలిన పనులు ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. -
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి. ఏడాది గడిచినా ఈ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసేందుకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్న విలువైన మోటార్లు, స్టార్టర్ బోర్డులు, పైపులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచలేదు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఎత్తిపోతల పథకాన్ని చూస్తే అర్ధమైపోతుంది. నిర్మాణం ఇలా... వర్షాకాలంలో పులివాగులో ప్రవహించే వరద ప్రవాహం బుడమేరులో కలిసి వృథాగా పోతుంది. ఈ క్రమంలో ఎటువంటి నీటి వనరులేని చెర్వుమాధవరం గ్రంథివాని చెరువుకు నీటిని సరఫరా చేసేందుకు గడ్డమణుగు గ్రామ శివారులో పులివాగుపై ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1.30 కోట్లతో 2014–19 మధ్య కాలంలో నిర్మించారు. ఈ పథకం నిర్మించిన ప్రదేశంలో చెక్ డ్యామ్ కూడా ఉండడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ఎత్తి పోసేందుకు వీలుంటుందని భావించి నిర్మించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో నీటి సదుపాయం ఉండని పులివాగు మీద ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం చెరువును నింపకపోయినప్పటికీ పులివాగులో నీరున్న సమయంలో నీళ్లను చెరువులోకి సరఫరా చేయడం ద్వారా ఆయకట్టు భూముల్లోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేది. ఏడాదిగా నిర్లక్ష్యం ఈ ఎత్తిపోతల పథకం గత ఏడాది ఆగస్టులో పులివాగుకు వచ్చిన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో నేటికీ అలాగే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.1.30 కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలాలను తొలగించి, మోటార్లను మరమ్మతులు చేసి, ఎత్తిపోతల పథకాన్ని పునఃనిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న క్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద వర్షం నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా చేస్తే ప్రయోజనం చెర్వుమాధవరం పక్కనే ఉన్న గడ్డమణుగు గ్రామ శివారు వరకు ఉన్న తారకరామా ఎత్తిపోతల పథకంలోని నాల్గవ పంపు హౌస్ నుంచి నీటిని పులివాగులోకి తరలించాలి. పులివాగు వద్ద ధ్వంసమైన ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకొస్తే గ్రంథివాని చెరువుకు పుష్కలంగా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఈ చెరువు కింద ఉన్న కాల్వలు సైతం ఇప్పటికే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కాల్వలను ఏర్పాటు చేస్తే రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ చెరువుకు నీటి వసతి కల్పించి రిజర్వాయర్గా మార్చగలిగితే చెరువుకింద ఆయకట్టుగా ఉన్న 160 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. అంతే కాకుండా సమీప గ్రామాలైన సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బెట్ట సమయంలో బోర్లలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: మీకోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం కార్యక్రమమని, న్యాయం కోరే బాధితులు ధైర్యంగా తమ సమస్యను విన్నవించుకోవచ్చని అన్నారు. మీకోసం దృష్టికి వచ్చిన ప్రతి అర్జీని చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 42 అర్జీలు అందినట్లు తెలిపారు. మీకోసంలో ప్రధానంగా వచ్చిన అర్జీలు బంటుమిల్లి నుంచి వెంకట్రావు అనే వృద్ధుడు ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నాడు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, ఇటీవల తన భార్య కూడా మరణించిందని చెప్పాడు. అయితే మిగిలిన తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కలిసి తన వద్ద ఉన్న బంగారం, డబ్బును బలవంతంగా లాక్కోవటమే కాకుండా తన ఆస్తిని కూడా వారికి రాయాలని శారీరకంగా హింసించినట్లు వాపోయాడు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. కోడూరుకు చెందిన కల్పన అనే వివాహిత ఎస్పీని కలిసి తన గోడు విన్నవించుకుంది. తనకు వివాహం జరిగి ఆరేళ్లయిందని, భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. కుటుంబ పెద్దలతో మాట్లాడించినా ప్రయోజనం లేదని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ప్రాధేయపడింది. అవనిగడ్డకు చెందిన వీరయ్య అనే బాధితుడు ఎస్పీని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. తన సమీప బంధువునికి కుటుంబ అవసరాల నిమిత్తం కొంత నగదు అప్పుగా ఇచ్చానని, సంవత్సరం గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకపోగా ఇచ్చిన అప్పు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరాడు. కంకిపాడుకు చెందిన రామారావు తన సమీప బంధువులు తనను మోసం చేశారని వాపోయాడు. తన ఆస్తికి సంబంధించిన పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేసి తమ సమీప బంధువులు వారి పేర రాయించుకున్నారని, జరిగిన మోసాన్ని నిలదీస్తుంటే తనను దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరాడు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. -
సింహాద్రికి జీవిత సాఫల్య పురస్కారం
నాగాయలంక: గత 40 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్గా, పాత్రికేయుడిగా సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న నాగాయలంకకు చెందిన సింహాద్రి కృష్ణప్రసాద్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం జరిగిన యూనియన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో యూనియన్ జాతీయ అధ్యక్షుడు సురేష్శర్మ, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఆభా నిఘమ్, ఐ అండ్ పీఆర్ ఆర్జేడీ (ఒంగోలు) టి.కస్తూరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో స్వచ్ఛంద సేవా కార్యకర్తగా, అధ్యక్షుడిగా ఐదేళ్లకు పైగా ఆయన గ్రామానికి సేవలు అందించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్కు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, అంబటి శ్రీహరిప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. -
యూరియాపై ఎలాంటి ఆందోళన చెందొద్దు
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అవసరానికి తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెప్టెంబరు 1 నుంచి నేటి వరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, సోమవారం రాత్రికి 1371 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంకొక 1200 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. యూరియా కష్టాలపై అధ్యయనం చేసేందుకు ఆదివారం వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశీలన చేసి రైతులతో మాట్లాడారని చెప్పారు. అనంతరం తాను జిల్లాకు అదనంగా 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని కోరానని, అందుకు ఆయన అవసరమైన యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించారన్నారు. రానున్న పదిరోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు. -
ఈ–క్రాప్ వర్రీ!
కంకిపాడు: ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోంది. గడువు ముగింపు సమయం దగ్గర పడుతున్నా, లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. సాంకేతిక సమస్యలు, వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో పంట పొలాల్లోకి వెళ్లటానికి ఆస్కారం లేకపోవటంతో ఈ–క్రాప్ నమోదు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. దీనికి తోడు వ్యవసాయ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయం కొరవడటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 4,14,305 ఎకరాల్లో సాగుభూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ వ్యవసాయ పంటలు 3,49,660 ఎకరాల్లో సాగు పూర్తి కాగా, ఉద్యాన పంటలు 27,888 ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. ప్రధానంగా వరి, చెరకు, పసుపు, కంద, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ప్రయోజనాలు ఇవే.. ఈ–క్రాప్ నమోదు పూర్తికావటం వల్ల ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు రైతులకు లబ్ధి చేకూరుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత రైతాంగాన్ని తక్షణమే గుర్తించి పరిహారం అందించటంలో ఇబ్బందులు తొలగుతాయి. పంట ఉత్పత్తులు చేతికి అందిన తర్వాత మార్కెట్లో విక్రయించుకోవటానికి, మద్దతు ధర పొందటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్యాన్ని చేరని నమోదు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. అయినా నేటికీ ఈ–క్రాప్ నమోదు పూర్తి కాలేదు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3,77,549 ఎకరాల్లో పంటలు సాగు జరుగుతుండగా, 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ–క్రాప్ పూర్తయ్యింది. ఇంకా 65 శాతానికి పైగా భూములకు ఈ–క్రాప్ నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం.. ఈ–క్రాప్ నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి పూర్తిగా ధ్రువీకరణ చేసిన తరువాతే ఈ–క్రాప్ పూర్తి చేయాలి. కానీ ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ శాఖ ఈ–క్రాప్ నమోదుకు పూర్తిగా దూరంగా ఉంటోంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మాత్రమే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. దీని వల్ల ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా అవరోధాలు.. ఈ–క్రాప్ నమోదులో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో పంట పొలాల్లోకి సిబ్బంది వెళ్లలేని పరిస్థితి. దీనికి తోడు కృష్ణానది ఏటిపాయలకు వరదనీరు చేరటంతో లంక భూముల్లోకి రాకపోకలు లేవు. దీంతో ఏటిపాయలోని లంక గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్లి ఈ–క్రాప్ నమోదు పూర్తి చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు కూడా వెంటాడు తున్నాయి. సర్వర్ పనిచేయక ఈ–క్రాప్ నమోదులో జాప్యం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. తాజాగా నెలకొన్న యూరియా కొరత, పంపిణీలో తలెత్తుతున్న సమస్యలతో ఎక్కువ భాగం సిబ్బంది యూరియా పంపిణీపై దృష్టి సారించటంతో ఈ–క్రాప్ ముందుకు సాగటం లేదు. వేగవంతం చేస్తాం.. ఈ–క్రాప్ నమోదు వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ–క్రాప్ నమోదును పూర్తి చేస్తున్నారు. ఇటీవల వర్షాలు వల్ల పంట పొలాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం యూరియా సమస్య పరిష్కారంపై దృష్టి సారించాం. సమస్య తీరగానే ఈ– క్రాప్పై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుతాం. – ఎన్.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి -
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధి చేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
కాలుష్య రహిత జిల్లా కోసం కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో భవిష్యత్తులో మానవ మనుగడే ప్రశ్నార్థకం కానుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ప్లాస్టిక్తో చేసిన ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, ట్రేలు, ఆహ్వాన కార్డులు, పీవీసీ బ్యానర్లుపై ఉన్న నిషేధాన్ని సమర్థంగా అమలు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల విక్రేతలు, వినియోగదారులపై జరిమానాలు విధించాలన్నా రు. ప్లాస్టిక్ వస్తువులకు బదులు నార, గుడ్డ, పేపర్తో తయారు చేసిన వస్తువులను వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. ఒక్క విజయవాడలోనే సంవత్సరానికి 700 టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పడేస్తున్నారని వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
యూరియాపై ఇంత నిర్లక్ష్యమా?
చిలకలపూడి(మచిలీపట్నం): పత్రికల్లో యూరియాపై నిత్యం వార్తలు వస్తున్నాయని.. వాటిపై స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయాధికారి ఎన్. పద్మావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధ్యత ఉండాలి కదా? తొలుత కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు పడుతున్న ఇబ్బందులపై నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై స్పందించి జిల్లాలో యూరియా అవసరం ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు మనకు ఎంత వచ్చింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే వివరాలు సమాచారశాఖ ద్వారా పత్రికా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సి ఉందా? లేదా అని ఆయన వ్యవసాయాధికారిని ప్రశ్నించారు. కలెక్టర్ విస్మయం.. ప్రజల నుంచి అందుకున్న మీ కోసం అర్జీలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి సజావుగా పరిష్కరించాలని ఆదేశించారు. కొంత మంది అధికారులు ఇంకా 70 అర్జీలను ఇప్పటి వరకు చూడకపోవటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. మీ కోసంలో మొత్తం 152 అర్జీలను అధికారులు స్వీకరించారు.వచ్చిన అర్జీల్లో కొన్ని.. సముద్రం, కొత్తకాలువ, పాత ఉప్పుటేరు వల్ల కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెందీవి విపరీతంగా కోతకు గురవుతోందని దీవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాసాబత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సానా వీరవెంకటసత్యనారాయణ తెలిపారు. కొన్ని ఎకరాల భూమి సముద్రం, ఉప్పుటేరులో కలిసిపోతోందని వివరించారు. ఈ దీవికి సంబంధించి సముద్ర ముఖ ద్వారం వద్ద నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలని, అలాగే కొత్త ఇన్టేక్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్కు అర్జీ సమర్పించారు. పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్న ఎండీయూ వాహనాలను ట్రాన్స్పోర్టు వెహికల్స్గా మార్పు చేయాలని వైఎస్సార్ కృష్ణాజిల్లా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. శ్యామ్బాబు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక నిలుపుదల చేసిందని.. అయితే ఈ వాహనాలను ప్రస్తుతం దేనికీ ఉపయోగించలేక ఆర్థిక భారం పడుతున్నామని వివరించారు. ఆ వాహనాన్ని మొబైల్ క్యాంటీన్గా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. -
పీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు
పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో ఎన్ని రకాల మందులు ఉన్నాయి అని అడిగి, రిజిస్టర్లు తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవల్లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. ఆర్డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు గౌరవవేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశీం డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్, కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనాలను చెల్లించడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. జిల్లాలో 153 మంది మౌజన్లు, 153 మంది ఇమామ్లకు గౌరవ వేతనం బకాయి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు మీర్అస్గర్అలీ, మైనార్టీ సెల్ నాయకులు అషరఫ్, మొహమ్మద్ ఖాజా, అన్వర్, మొహమ్మద్ ఖలీద్ పాల్గొన్నారు.అక్షరాస్యత సాధనకు ఉల్లాస్మచిలీపట్నం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఉల్లాస్ కార్యక్రమం కీలక భూమిక వహిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, వయోజన విద్యా ఉపసంచాలకులు ఎండి. హాజీబేగ్ అక్షరాస్యతా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 73,237 మంది నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని అక్షరాస్యత సాధనకు చర్యలు చేపట్టామన్నారు. విశేషంగా కృషి చేసిన 14 మంది వలంటీర్ టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించగా, వయోజన విద్యా సిబ్బంది, ఉల్లాస్ వలంటీర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.కూచిపూడిలో అభివృద్ధి పనులపై సర్వేకూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిని వారసత్వ సంపద గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు సర్వే నిర్వహించినట్లు డెప్యూటీ ఎంపీడీవో ఎంఎస్కే పరమాత్మ తెలిపారు. నాట్యపుష్కరిణి, మ్యూజియం, నాట్య లెజెండ్ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్మృతి సదనం, శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ రహదారికి ఇరువైపులా పాత్వే, పంచాయతీ వద్ద ఆర్చీ, సుందరీకరణ తదితర పనులను మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆయా పనులకు సంబంధించిన మెజర్మెంట్స్(కొలతలు) తీసుకున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ కన్సల్టెంట్ సాహితి, టూరిజం శాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈ టి. కుమార్, మేనేజర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
కట్టకటపై ఆగ్రహ జ్వాల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అదనుకొచ్చిన పంటకు బలం ఇవ్వకుంటే దిగుబడులు దిగజారుతాయన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. మార్కెట్లో యూరియా దొరకడంలేదు. వచ్చిన కొద్ది సరుకును కొన్ని ప్రాంతాల్లో కూటమి పెద్దలు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్ బోర్డు’లు దర్శనం ఇస్తున్నాయి. రైతులు తిండీతిప్పలు మానుకుని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులు, రైతుసంఘాల నాయకులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేయనుంది. యూరియా కోసం రైతుల అవస్థలు పైర్లను రక్షించుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ల వద్ద బారులు తీరులు తీరి కనిసిస్తున్నారు. రాత్రిళ్లు సైతం నిద్ర మానుకుని మరీ ప్రాథమిక సహకార సంఘాల వద్దే కాపు కాస్తున్నారు. యూరియా తీవ్రంగా కొరత ఉండటంతో రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకొని, అందులో ఉన్న సరుకును తమకు పంచా లని ఆందోళనకు దిగుతున్నారు. గంపలగూడెం మండలంలో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక లైన్లలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్ల కింద తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం కొత్తమాజేరు గ్రామంలో రైతులు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోయారు. అయినా ‘కట్ట’ యూరియా దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే పిలకలు రావని, దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా కూటమి పెద్దల తీరులో మార్పు రావడంలేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు రైతులకు అండగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. పంటలకు యూరియా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించొద్దని, అవి వాడిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం పట్టణ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ జి.రాజు మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన నేరస్తుడిని, దోపిడీ చేసిన బంగారు, వెండి నగలను మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ జి.రాజు, ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు, నందిగామ, జగ్గయ్యపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశారన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు శీలంశెట్టి వెంకటరమణను హైదరాబాద్లో శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ జనగాం జిల్లా రాజీవ్నగర్ కాలనీకి చెందిన నేరస్తుడిపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇతని నుంచి రూ.6 లక్షల విలువైన సుమారు 85 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కంచికచర్ల: వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వర్గం ఫిర్యాదే తీసుకుంటారా అని దళితులు పోలీసులను ప్రశ్నించారు. తమ వర్గం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆదివారం రాత్రి కంచికచర్ల పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పరిటాల దళితవాడలో శనివారం నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు ఒక వర్గం వారిపై కేసు నమోదు చేశారు. తమ వర్గంలో ఉన్నవారికి కూడా దెబ్బలు తగిలాయని వారిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్స్టేషన్ వద్ద దళితులు ఆందోళన చేశారు. ఆందోళనకారుల వద్దకు సీఐ చవాన్దేవ్, ఎస్ఐ విశ్వనాఽథ్ వెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రెండో వర్గంపై కూడా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. -
యువత క్రీడలు, ధ్యానంపై దృష్టి పెట్టాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత క్రీడలు, ధ్యానం మీద దృష్టి పెట్టి ప్రకృతితో మమేకం అవ్వాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ఎస్వీ రమణ సూచించారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవమైన గ్రామోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. గౌరవ అతిథి కేఎల్ విశ్వవిద్యాలయం క్రీడల సంచాలకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ యువతకు నూతన ప్రోత్సాహం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వాలీబాల్ (పురుషులు) రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు) రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆటల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్న మహిళలు -
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్
భవానీపురానికి చెందిన 48 ఏళ్ల మహిళ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్తో, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండేది. ఆమె నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లగా సర్జరీ చేయాలన్నారు. ఆమెకు సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేదు. తెలిసిన వారి ద్వారా ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయగా సాధారణ స్థితికి వచ్చింది. వీరిద్దరే కాదు అనేక మంది ఫిజియోథెరఫీతో ఉపశమనం పొందుతున్నారు. పుట్టుకతో వచ్చిన లోపాల నుంచి వృద్ధాప్యం వచ్చే కండరాల బలహీనత, పక్షవాతం వంటి వ్యాధులకు సమర్థంగా చికిత్సలు అందిస్తున్నారు. పటమటకు చెందిన 15 ఏళ్ల బాలిక గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీఎస్)కు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందినా కండరాలు సాధారణ స్థితికి రాలేదు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఫిజియోథెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ థెరపీలతో ఆమె సాధారణ స్థితికి వచ్చింది. -
గండిగుంట సొసైటీలో విజిలెన్స్ సీఐ తనిఖీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని గండిగుంట గ్రామ కోపరేటివ్ సొసైటీలో విజిలెన్స్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలోని అధికారులతో ఎరువుల పంపిణీ జరుగుతున్న విషయంపై ఆరా తీశారు. అనంతరం పక్కన ఉన్న గోదాంలో ఎరువుల స్టాకును పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారులు నిస్సీ గ్రేస్తో ఎరువుల పంపిణీపై తీసుకుంటున్న జాగ్రత్తల వివరాలు అడిగారు. ఎరువులు రైతులకు అప్పులు ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కాగా స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువులపై మండల తహసీల్దార్ సురేష్ కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో ఎల్. శివశంకర్, ఎంఏవో నిస్సీ గ్రేస్, ఉయ్యూరు పట్టణ సీఐ టీవీ రామారావు, సొసైటీ అధ్యక్షుడు దండమూడి నాగేశ్వరావు అన్నదాతలకు అందిస్తున్న ఎరువులపై ఆరా తీశారు. ఉయ్యూరు రెవెన్యూ, గండిగుంట గ్రామ పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందని, ఆ పరిధిలో ఉన్న రైతులందరికీ యూరియా ఇతర ఎరువులను నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సురేష్ కుమార్ హెచ్చరించారు. -
అరకొరగానే యూరియా
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. రైతులు యూరియా పూర్తి స్థాయిలో అందుతుందని ఎదురు చూడగా అధికారులు కేవలం అరకొర యూరియా మాత్రమే రైతులకు అందజేశారు. దీంతో రైతులు అధికారుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వణుకూరులో వాగ్వాదం.. రైతులు చాలా కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం వణుకూరు గ్రామానికి కేవలం 10 టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతుండగా కేవలం 10టున్నుల యూరియా మాత్రమే రైతులకు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి వచ్చి యూరియా పంపిణీని పరిశీలించారు. యూరియా చాలినంత ఇవ్వక పోవటంపై రైతులు ఆమెను ప్రశ్నించారు. ప్రభుత్వం త్వరలో యూరియా సరఫరా చేస్తుందని ఆమె రైతులను నచ్చ చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కట్టల కోసం పడిగాపులు కాశారు. రైతుకు గరిష్టంగా 3 బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. రైతులకు తాగటానికి నీరు కూడా ఇవ్వలేదు. ● పెదపులిపాక సొసైటీలో కూడా 15 టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా రైతులు యూరియా కోసం రాగా రైతులకు 3 బస్తాల యూరియా సీలింగ్ పెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి కనకమేడల శైలజ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి పాల్గొన్నారు. అవసరం మేరకు సరఫరా చేయండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరం మేరకు ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహీర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12 వేల టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, ఆర్డీవో స్వాతి, ఏవో శాంతి పాల్గొన్నారు. పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటన.. గూడూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదివారం కృష్ణాజిల్లా పామర్రు మండలం జుఝ్జవరం, గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి యూరియా పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో రాజశేఖర్ ముఖాముఖీ మాట్లాడారు. పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ -
11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్లో ఈ నెల 11వ తేదీన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, అమెరికాతో చర్యలు జరపాలని, తక్కువ సుంకాలున్న అవసరమైన దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలు తిప్పి కొట్టాలని, అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఆక్వా రైతులు ఇతర పంటల రైతుల సహకారంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంట్) జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. విజయవాడ నగరానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డికి నందిగామ, పెనమలూరు నియోజకవర్గాలను కేటాయిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలను తంగిరాల రామిరెడ్డికి, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలను ఆళ్ల చెల్లారావుకు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. అలాగే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు షేక్ సలార్దాదా, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు మాదు శివరామకృష్ణ, పెడన, పామర్రు నియోజకవర్గాలకు అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి (చిట్టిబాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఘాట్రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ భక్తజనుల అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షించారు. కోడూరు: ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని ఎరువుల, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను అధికారులు గుర్తించారు. బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈ–పోస్ మిషన్లను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న స్టాక్కు దుకాణంలో ఉన్న ఎరువుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. దుకాణంలో రూ.2లక్షల విలువైన 13 టన్నుల ఎరువులకు ఏ విధమైన పత్రాలు లేనట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒమర్ తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు నెల వ్యవధిలో మూడు సార్లు ఎరువులు దుకాణాలపై దాడులు జరపడం గమనార్హం. కోడూరు: హంసలదీవి సాగర తీరంలో పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రంలో గుంతలు ఏర్పడడంతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు తీరానికి తరలివచ్చారు. వీరంతా సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మైరెన్ పోలీసులు లౌడ్స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు గస్తీ చేపట్టారు. ఎస్ఐలు పూర్ణమాధురి, ఉజ్వల్కుమార్ పర్యవేక్షించారు. -
ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలను ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు, ఇమామ్లకు, పాస్టర్లకు గౌరవ వేతనాలను ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యేడాది కాలంలో ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి ముస్లింలకు ఇవ్వవలసిన గౌరవ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడు ముందడుగేస్తుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు గౌరవ వేతనాలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా శోభాయాత్ర
ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి నూతన కార్యవర్గం విజయవాడ కల్చరల్: శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రం జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి, విదుశేఖర భారతిస్వామి చారుర్మాస్య దీక్షను శృంగేరీ పీఠంలో విరమించిన సందర్భంగా పీఠ సంప్రదాయాన్ని అనుసరించి దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి మహారుద్రాభిషేకం, మహాన్యాసం వేదోక్తంగా నిర్వహించారు. ఆదిశంకరుల చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంతో నగర వీధుల్లో శోభాయాత్ర జరిగింది. ధర్మాధికారి హనుమత్ ప్రసాద్, పలువురు భక్తులు పాల్గొన్నారు. -
దేవాలయాల ద్వారాలు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల తలుపులను ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఈవో శీనానాయక్ సమక్షంలో ఆలయ తలుపులు మూసివేశారు. అమ్మవారి ప్రధాన నివేదన శాలతో పాటు అన్నదానం, లడ్డూ పోటులోని ఆహార పదార్థాలు, సరుకులపై దర్భలను ఉంచామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కామథేను అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఘాట్రోడ్డులోని ప్రధాన ద్వారాలను కూడా సెక్యూరిటీ సిబ్బంది మూసివేసి భక్తులెవరినీ కొండపైకి అనుమతించలేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పరిసరాలు గ్రహణం నేపథ్యంలో వెలవెలబోయాయి. సంప్రోక్షణతో.. గ్రహణ అనంతరం సోమవారంతెల్లవారుజామున నదీ తీరం నుంచి జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సుబ్బారాయుడి ఆలయంలో.. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేసేన సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మద్యాహ్నం 12.30 గంటల నుంచి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతమ్మ ఆలయం.. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 11 గంటలకు కవాటుబంధనం చేసి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో అర్చకుల చర్యలు -
యూరియా నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టండి
టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో యూరియా నిరంతర సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి యూరియా సరఫరాపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనగ్రోమోర్ కేంద్రం నుంచి వీలైనంత వరకు యూరియాను గ్రామాలకు తీసుకువెళ్లి అక్కడి రైతులకు పంపిణీ చేయాలన్నారు. యూరియా ఒకే చోటే ఎక్కువగా పంపిణీ చేయవద్దని, సహకార సంఘాల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలన్నారు. ఐఎఫ్ఎంఎస్లో యూరియా పొందిన రైతులకు వెంటనే బయోమెట్రిక్ వేయించాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రైతులను ఎక్కువసేపు క్యూలో ఉండకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శనివారం 1300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు దీనిని పంపిణీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో యూరియా సరఫరాలో రైతులకు కలిగే ఇబ్బందులను తెలియజేస్తే వారి వద్ద ఉన్న సమాచారం తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు. రూ.1.70 లక్షల ఎరువులు సీజ్ మొవ్వ: మండల కేంద్రం మొవ్వ గ్రామంలో శనివారం రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో భౌతిక విలువలకు రిజిస్టర్ విలువలకు తేడాలు కలిగిన 1,70,240 రూపాయల విలువ గలిగిన ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్లు ఏవో బి.సురేష్ బాబు నాయక్ విలేకరులకు తెలిపారు. మొవ్వలోని శ్రీ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని విజిలెన్స్ సీఐ ఎండి ఉమర్, సిబ్బందితో ఈ తనిఖీలలో పాల్గొన్నారని వెల్లడించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వత్సవాయి: వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరి (24) అదే మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒకరు అనారోగ్యంగా ఉన్నట్టు ఫోన్ రావడంతో గౌరవరం నుంచి అనుమంచిపల్లి వెళ్లే క్రమంలో రహదారి పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. దస్తగిరికి అవివాహితుడు. తల్లి జాన్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిల్లకల్లు – వైరా రహదారిలో పెద్ద కాలువ వద్ద జరిగిన మరో ప్రమాదంలో మక్కపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు(25) మరణించాడు. వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం మక్కపేట నుంచి చిల్లకల్లు వెళ్తుండగా పెద్ద కాలువ సమీపంలో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించి చికిత్స చేస్తుండగా శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఏడాది వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతుని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఇకపై వలంటీర్ విధులను చేయం
మచిలీపట్నంటౌన్: నగరంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు కార్యదర్శులు శనివారం వలంటీర్ విధులను బహిష్కరించారు. ఒకరి కంటే ఎక్కువ మంది వలంటీర్లు చేయాల్సిన పనిని తాము చేస్తున్నామని ఇకపై ఈ పనులు చేయమని వారు స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల జేఏసీ ఆధ్వర్యంలో కమిషనర్ బాపిరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. తమపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని వలంటీర్ల పనిని చేయబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నగరంలోని పలు సచివాలయాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు. చల్లపల్లి: సచివాలయ ఉద్యోగుల శక్తిని నిర్వీర్యం చేసేలా అధికార వర్గాలు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా చల్లపల్లి మండల సచివాలయ ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ విలేజ్ వార్డు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తమ నిరసనను వినతి పత్రం రూపంలో ఎంపీడీఓ అనగాని వెంకట రమణకు అంద జేశారు. పి.శ్రవణ్కుమార్, పద్మారావు, పి.విష్ణు, కృష్ణకాంత్, శరణ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సచివాలయ కార్యదర్శులు -
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఏడీ వీరాస్వామి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 120లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు డీడీ శ్రీనివాస్కు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ట్రాక్టర్ను, జేసీబీను స్వాధీనం చేసుకుని వీఆర్వో శ్రీనివాస్కు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
ఏఐ ఫర్ ష్యూర్ శిక్షణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్(ఏఐ–4 ఎస్యూఆర్ఈ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం డీఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త – ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. నిట్ – వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ రెండు సెషన్లలో ఆరుగంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, గ్రామీణ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.కల్పన, అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ ఏర్పాట్లు, పనుల ఆకస్మిక తనిఖీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం మహా మండపం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం, మల్లేశ్వరాలయం నుంచి కొండ దిగువకు జరుగుతున్న ర్యాంప్, మెట్ల నిర్మాణంతో పాటు ప్రసాదాల పోటు భవనాల పనులను ఆయన పరిశీలించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఆయా భవనాల్లో అన్ని పనులు పూర్తి కావాలని, అదే సమయంలో పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కనకదుర్గనగర్, రథం సెంటర్లో జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నూతన అన్నదానం, ప్రసాదాల పోటులో పూజలు మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులో శనివారం కమిషనర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారథ్యంలో అర్చకులు అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాల్లో పాలు పొంగించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు నిరంతరం ప్రసాదాలను అందించేందుకు ఈ రెండు భవనాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదం, ఉచిత లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.