ప్రజలను మోసం చేసే బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేది తప్ప ప్రజలకు మేలు చేసేది కాదు. బడ్జెట్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా సాగింది. చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పేర్లను ప్రస్తావించడం తప్ప పస లేదు. గతేడాది బడ్జెట్కు ప్రస్తుతం ఇచ్చిన దానికి ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, విద్యా రంగాలను పూర్తిగా విస్మరించింది. ముఖ్యంగా విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. గత బకాయిల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీని తలపించింది.
ప్రజలను మోసం చేసే బడ్జెట్


