సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారం

Feb 10 2026 8:14 AM | Updated on Feb 10 2026 8:14 AM

సమస్యలకు సత్వర పరిష్కారం

సమస్యలకు సత్వర పరిష్కారం

‘మీ కోసం’లో అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు

కోనేరుసెంటర్‌: ‘మీ కోసం’లో అందిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది చొరవ చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మీ కోసం’లో మొత్తం 40 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

● కూచిపూడి నుంచి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమిని సరిహద్దుదారుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని, అదేమని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నాడంటూ వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని అర్జీ సమర్పించారు.

● కంకిపాడు నుంచి కవిత అనే వివాహిత.. తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోందని, అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని వినతి పత్రం సమర్పించారు.

● ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం నిమిత్తం ఇచ్చిన డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని గుడివాడకు చెందిన నాని అనే యువకుడు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement