కొనసాగుతున్న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరంలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. శనివారం లీగ్ పోటీలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖ వీడియం చైన్నె పీజీ పీసీ తిరువాత్తూరు చైన్నె, వెస్ట్రన్ ముంబై, ఐపీఎఫ్ చైన్నె, తమిళనాడు పోస్టల్ స్పోర్ట్స్ బోర్డు చైన్నె, ఎస్ఆర్ఎం ఐఎస్టీ వెందలూరు, శ్రీరామా బాల్ బ్యామిటన్ క్లబ్ నునపర్తి జట్టులు క్వార్టర్ ఫైనల్స్కి వచ్చాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తి శివశంకర్ తెలిపారు. ఈ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందిన జట్లు సూపర్లీగ్కు అర్హత సాధిస్తాయన్నారు. ప్రతిభ చూపిన వారిని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ అభినందించారు.


