యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ
పెనమలూరు: కృష్ణా జిల్లా యనమలకుదురులో ఆదివారం జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ ప్రభ అదుపుతప్పి భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో భక్తురాలికి గాయాలయ్యాయి. యనమలకుదురు అంబేడ్కర్నగర్కు చెందిన నంబర్–29 ప్రభ ప్రదర్శనలో ఉండగా దానికి ఏర్పాటు చేసిన రథం చక్రాలు విరిగి పోయాయి. దీంతో ఒక్కసారిగా ప్రభ పక్కకు ఒరిగి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో బాపులపాడుకు చెందిన రేవతి తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


