నేడు మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. | AP Assembly Sessions 4th March 2026 Live Updates, Key Topics, Top News Headlines And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

AP Assembly: నేడు మండలిలో తిరుమల లడ్డుపై చర్చ..

Mar 4 2026 10:47 AM | Updated on Mar 4 2026 11:02 AM

AP Assembly Sessions 4th March 2026 Live Updates

అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

మండలి చైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల భేటీ..

  • శాసనమండలి చైర్మన్‌తో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • తిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతి
  • ప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చ
  • ముందుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్‌మెంట్ పాస్ చేసేలా నిర్ణయం
  • గతవారం లడ్డుపై చర్చ సందర్భంగా  ప్రభుత్వం ముందు స్టేట్‌మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • నేడు తిరుమల లడ్డుపై  చర్చకు ఆమోదం.

 

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..

  • అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
  • ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..
  • భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారు
  • గ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారు
  • భూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదు
  • గెజిట్‌లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారు
  • బఫర్ జోన్‌ను 500 మీటర్లు చేశారు
  • దేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదు
  • మార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలి
  • కానీ అలా ఫాలో అవ్వడం లేదు
  • సేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..
  • ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు
  • అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి
  • 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలి

మండలి సమావేశాలు ప్రారంభం..

  • ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు
  • ప్రశ్నోత్తరాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement