మం‍డలిలో డయేరియాపై చర్చ.. ప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ ప్రశ్న | AP Assembly Session Updates On Feb 25th | Sakshi
Sakshi News home page

మం‍డలిలో డయేరియాపై చర్చ.. ప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ ప్రశ్న

Feb 25 2026 10:25 AM | Updated on Feb 25 2026 11:27 AM

AP Assembly Session Updates On Feb 25th

ఏపీ శాసన మండలి అప్‌డేట్స్‌..

వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్స

  • శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి.  
  • ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.

 

బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు.. 

  • ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్‌..
  • భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు
  • 377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు  
  • కోర్టు కేసులు క్లియర్ చేయలేదు
  • ఎన్ఓసీ తీసుకురాలేదు
  • వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారు
  • అన్ని అనుమతులు తెచ్చింది జగన్
  • కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారు
  • ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు. 

నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలు

  • ప్రశ్నోత్తరాలు ప్రారంభం
  • నేడు వ్యవసాయంపై లఘు చర్చ

శాసనమండలి..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు
  • గతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించింది
  • తురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు
  • డయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement