-
హర్యానాలో బీజేపీ గట్టెక్కెనా?.. కాంగ్రెస్కు ఛాన్స్ ఎంత?
ఛండీగఢ్: లోక్సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో హర్యానా సీఎం సైనీ మాట్లాడుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేల మద్దుతు లేకున్నా తన ప్రభుత్వానికి ముప్పు లేదన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. కానీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. తమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. కానీ, వారి వ్యక్తిగత ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్ ధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. VIDEO | "I have received this information. Some MLAs have their desires... Congress is fulfilling the desires, but people know everything. Congress is not concerned about the desires of people, but only about itself," says Haryana CM Nayab Singh Saini (@NayabSainiBJP) as three… pic.twitter.com/pmWwmF5oz1— Press Trust of India (@PTI_News) May 7, 2024 ఇక, వీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ పొలిటికల్ ట్విస్ట్ అనంతరం.. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మైనారిటీలో పడిన హర్యానా ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వారికి ధన్యవాదాలు. అయితే, హర్యానాలో ప్రస్తుతం బీజేపీకి జేజేపీ, స్వతంత్ర అభ్యర్థుల సపోర్టు కూడా లేదు. ప్రభుత్వం కొనసాగించే అర్హత లేదన్నారు.సమీకరణాలు ఇలా.. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మనోహర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా, రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందువల్ల మిగిలి ఉన్న సభ్యుల సంఖ్య 88. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు 45. ఇక, ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ 1 సీటు, 2 స్వతంత్రులను కలుపుకుంటే, ఎన్డీఏలో మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీజేపీ మెజారిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంది.మరోవైపు.. కాంగ్రెస్కు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. దీంతో, కాంగ్రెస్ మద్దతు సంఖ్య 33కు చేరుకుంది. ఇక, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఇటీవేల పలువురు జేజేపీ ఎమ్మెల్యేలు బీజేపీకి బైబై చెప్పారు. దీంతో, వారి నిర్ణయం కీలకంగా మారనుంది. అలాగే, మరో నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కీలకంగా మారనుంది. -
AP: నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 653 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు బుధవారం నామినేషన్లు వేసినవారిలో బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజుల్లో.. 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగోరోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదోరోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరోరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరోరోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు -
ఒడిశాలో బీజేపీ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు తిప్పేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారంలో 40 మంది స్టార్క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వారిలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు ఈ జాబితాలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఒడియా నటులు అనుభవ్ మొహంతి, శ్రీతమ్ దాస్, హరిహర్ మహపాత్ర, పింకీ ప్రధాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటా
భోపాల్ : మీకో దండం!!.. మీ పార్టీకో దండం.. నేను నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటానంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మహిళా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ కలెక్టర్ హోదాను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తనని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ సీటును నిరాకరించి పార్టీ తనకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నిషా బాంగ్రే ఇప్పుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలని కోరుతున్నట్లు తెలిపారు. నిషా బాంగ్రే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అయితే డిప్యూటీ కలెక్టర్గా హోదాలో ఉన్నతమైన సేవలందించినందుకు ప్రజలు తనని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాంగ్రేను సంప్రదించింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా సముచితం స్థానం కల్పిస్తామని ఆశచూపించింది. అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు ‘కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనే అనుకున్నాను. నాకు రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థికంగా బలమైన కుటుంబం కూడా కాదు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరాను. చివరకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. బీజేపీ కావాలంటే నాకు టికెట్ ఇచ్చేది. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఇవ్వలేదు. చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ బెతుల్ జిల్లా నాయకత్వం భయపడింది’ అని బాంగ్రే అన్నారు . ఫలితాలతో పరిస్థితులు తారుమారు అసెంబ్లీ ఫలితాల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అన్నీ కమిటీలను రద్దు చేసింది. బాధ్యతలు అప్పగించలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా విలువైనా ఉండేది. లోక్సభ సీటు ఇవ్వలేదు. అందుకే నన్ను తిరిగి ఉద్యోగంలో చేరాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. నా రాజీనామాను కేంద్రం అంగీకరించలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు వీలుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి.. డిప్యూటీ కలెక్టర్గా బాద్యతులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. నిషా బాంగ్రే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తులు ఎమ్మెల్యే,లోక్సభ టికెట్లు పొందొచ్చు. ఇందుకోసం వారు కష్టపడి పనిచేయాలి. నిషా బాంగ్రేకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించాం. రాజకీయాల్లో కెరీర్ను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. ఆమె పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ రెబల్కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన (ఫొటోలు)
-
ఎన్నికల షెడ్యూల్ 2024
-
విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ
చండీగఢ్: ఖట్టర్ రాజీనామాతో హరియాణా సీఎం కుర్చీపై కూర్చున్న నాయబ్ సింగ్ సైనీ బుధవారం అసెంబ్లీ చేపట్టిన విశ్వాస పరీక్షలో గెలిచారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనే స్వయంగా విశ్వాస పరీక్షకు గవర్నర్ను అభ్యరి్ధంచి శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగేలా చేశారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక సంకీర్ణ ప్రభుత్వం నుంచి జననాయక్ జనతాపారీ్ట(జేజేపీ) వైదొలగడం, సీఎంగా ఖట్టర్ రాజీనామా చేయడం, నూతన సీఎంగా సైనీ ప్రమాణం చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షలో పాల్గొనకుండా 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేజేపీ విప్ జారీచేసింది. అయినాసరే ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ తీరా బలపరీక్షపై ఓటింగ్ జరిగే సమయానికి బయటకు వెళ్లిపోయారు. విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. రెండుగంటల చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్ను స్పీకర్ అనుమతించారు. మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గింది. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది సొంత ఎమ్మెల్యేల బలముంది. మరో ఏడుగురు మద్దతు పలికారు. బుధవారం 12 మంది సభకు రాకపోవడంతో సభలో సభ్యుల సంఖ్య 78కి, మెజారిటీ మార్కు 40కి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ బలపరీక్షలో నెగ్గడం లాంఛనమైంది. -
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు.. ఒంటరిపోరే’ : బీజేపీ
భువనేశ్వర్ : ‘మేం ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు. 147 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఒడిశా రాష్ట్ర బీజేపీ అధికారంగా ప్రకటించింది. త్వరలో జరగనున్న పార్లమెంట్, అంసెబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పలు పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. సీట్లను పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్ - బీజేపీల మధ్య పొత్తు ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆ ప్రచారంపై ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం, రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల గురించి మాట్లాడారు. కేంద్రం పెద్దలతో జరిగిన సమావేశంలో ఒడిసా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా చర్చించామే తప్పా అలయన్స్ గురించి, లేదంటే సీట్ల పంపకం గురించి ప్రస్తావించ లేదని అన్నారు. #BJP will fight alone in both #LokSabha and #Odisha assembly polls: State BJP president Manmohan Samal Does that mean talks derailed ? pic.twitter.com/4N7qxH4jDA — Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2024 అంతేకాదు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా గెలిచి సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు. కుదరని సయోధ్య పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీజేపీ-బీజేడీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదలేదని తెలిపాయి. ఎన్నికలకు ముందు పొత్తుకు ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినప్పటికీ సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అందులో 100 సీట్లకు పైగా పోటీ చేయాలని అధికార పార్టీ బీజేడీ ప్రయత్నించగా, అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. రాష్ట్ర బీజేపీకే తీవ్ర నష్టం ప్రస్తుతం అధికార బీజేడీ 114 అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్య వహిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు అంగీకరించిన బీజేడీ మొత్తం 112 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అందుకు కమలం నేతలు అంగీకరించలేదు. ‘బీజేడీ మాకు ఆమోదయోగ్యం కాని విధంగా 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ నిర్ణయం మా పార్టీ భవిష్యత్పై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతుందని’ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతిపాదన తిరస్కరించిన బీజేడీ మరోవైపు, పొత్తులో భాగంగా ఒడిశాలోని 21 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ.. బీజేడీతో చర్చలు జరిపింది. అందుకు బీజేడీ తిరస్కరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఢిల్లీలో మూడు రోజుల మకాం ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ఒడిశా బీజేపీ నేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయ్ పాల్ సింగ్ తోమర్ నివాసంలో పలువురు కేంద్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్, తోమర్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత, బీజేడీతో పొత్తుపై చర్చ జరిగిందని, అయితే ఏమీ ఖరారు కాలేదని తేలింది. మోదీ పర్యటనతో మారిన రాజకీయం ఒడిశా బీజేపీ నాయకులు బీజేడీతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ మార్చి 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారిపోయింది. మోదీ పర్యటన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేడీ సూచించింది. 11ఏళ్ల పొత్తులో గతంలో ఒడిశాలో బీజేపీ-బీజేడీలు (1998 - 2009) సుమారు 11 ఏళ్ల పాటు పొత్తులో ఉన్నాయి. మూడు లోక్సభ, రెండు అసెంబ్లీ ఎన్నికలలో కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. 1998లో జనతాదళ్ విడిపోయినప్పుడు, పట్నాయక్ తన సొంత పార్టీని స్థాపించి, ఉక్కు, గనుల మంత్రిగా వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరారు. 2000లో తొలిసారి 2000లో తొలిసారి, 2004లో రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అంతకుముందు బీజేడీ, బీజేపీల మధ్య సీట్ల షేరింగ్ రేషియో 4:3గా ఉంది. బీజేడీ 84 అసెంబ్లీ, 12 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 63 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో 48.7 శాతం ఓట్లతో 21 సీట్లలో 17 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి మళ్లీ 1999లో 19 స్థానాలకు మెరుగైంది. ఇది 2004లో 18కి కొద్దిగా తగ్గింది. మళ్లీ ఇప్పుడు బీజేడీ- బీజేపీల మధ్య పొత్తు అంశం తెరపైకి వచ్చింది. -
మరాఠాల రిజర్వేషన్కు ఓకే
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్య, సామాజిక వెనుకబాటు బిల్లు–2024ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే ప్రవేశపెట్టారు. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10 శాతం రిజర్వేషన్ను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. ‘‘రాష్ట్రంలో భిన్న కులాలు, వర్గాలకు ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులోనే ఓబీసీలకు19 శాతం రిజర్వేషన్ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50 శాతం మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని బిల్లులో పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్లో 64 శాతం, బిహార్లో 69 శాతం, గుజరాత్లో 59 శాతం, పశ్చిమబెంగాల్లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్ ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంబీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్తసంబందీలకు మాత్రమే కుంబీ కుల ధ్రుజీవీకరణ పత్రమిస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. విడిగా కోటా వద్దు: జరాంగే మరాఠాలకు విడిగా కాకుండా ఓబీసీ రిజర్వేషన్లలోనే కోటా కావాలని ఉద్యమనేత మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్పేపర్: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ
-
నేడు ప్రాజెక్టులపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల, నీటిపారుదల రంగంపై ప్రజెంటేషన్ శనివారానికి వాయిదా పడ్డాయి. వీటిపై శాసనసభలో శుక్రవారమే చర్చ జరగాల్సి ఉన్నా ఇతర అంశాలపై చర్చతో జాప్యమవడం, మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ సభ్యు ల నిరసనతో చాలా సేపు గందరగోళం నెలకొంది. నీటిపారుదల అంశం చాలా కీలకం కావడంతో.. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనేందుకు వీ లుగా వాయిదా వేయాలని అధికార పక్షం కోరడం.. దీనికి ఎంఐఎం, సీపీఐ మద్దతివ్వడంతో స్పీకర్ శ నివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కి.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభలో కులగణనపై తీర్మానం ఆమోదం పొందాక స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తేనీటి విరామం ప్రకటించారు. తిరిగి సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమైంది. తొలుత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య లేచి.. శ్వేతపత్రంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్ను కోరారు. దీనితో వాయిదా వద్దని, వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు లేచి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు హెలికాప్టర్లో వెళతారు. ఐదు నిమిషాల్లో రాగల సభకు రాకపోవడం ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డి, ప్రశాంత్రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. వాయిదాపై చర్చ తర్వాత బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్వేతపత్రంపై చర్చించడానికి గంటల తరబడి వేచి ఉన్నాం. రాత్రి 11 గంటల వరకు కూర్చోవడానికి సిద్ధం. శనివారం పార్టీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. మీరు ఎజెండాలో పెట్టి ఎందుకు చర్చ చేపట్టడం లేదు. వెంటనే చర్చ మొదలుపెట్టండి..’’ అని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు కల్పించుకుంటూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. సభ వాయిదాకు అభ్యంతరం లేదని ఎంఐఎం, సీపీఐ సభ్యులు తెలిపారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులపై స్పల్పకాలిక చర్చ శుక్రవారం ఉంటుందని, సమావేశాలు అదేరోజు ముగుస్తాయని బీఏసీలో నిర్ణయించారు. మధ్యాహ్నం కలసినప్పుడు మంత్రి శ్రీధర్బాబు కూడా స్పల్పకాలిక చర్చ ఉంటుందన్నారు. కానీ ఇలా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా చర్చ లేకుండా వాయిదా వేస్తామనడం సరికాదు. ఎంతరాత్రయినా చర్చకు మేం సిద్ధం. ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తాం. ఇష్టానుసారం నిర్వహిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ.. బీఏసీలో నిర్ణయించని ఇతర అంశాలను స్పీకర్ అనుమతితో చర్చిద్దామనుకున్నామని చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమని, అన్ని పారీ్టల ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనేందుకు వీలుగా శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహిద్దామని, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాగా.. కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. మీరంటే.. మీరు.. క్షమాపణల కోసం డిమాండ్ సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు కల్పించుని.. శ్వేతపత్రంపై స్పల్పకాలిక చర్చకు సంబంధించి అన్నిపక్షాల సలహాలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు అవకాశం ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేత గురించి మంత్రి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి’’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకట్రెడ్డి స్పందిస్తూ.. ‘‘నల్లగొండ సభలో ప్రతిపక్ష నేత సీఎంను, నన్ను దున్నపోతులంటూ వ్యాఖ్యానించారు. ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. హరీశ్రావు ప్రతిస్పందిస్తూ.. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నాటి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కాల్చేయాలి, ఉరితీయాలి అని మాట్లాడలేదా? బాధ్యతయుత పదవిలో ఉన్నందున సభలో అలా మాట్లాడవద్దు’’ అని కౌంటర్ ఇచ్చారు. -
Delhi Assembly: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. శనివారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజా నోటీసుల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరపడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈడీ వరుసగా పంపిన సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించడంతో కోర్టు ద్వారా తాజాగా ఈడీ ఆయనకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీంతో 19న ఈడీ ముందు విచారణకు కేజ్రీవాల్ హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి.. కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్రెడ్డి
-
Ts: ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కుల గణనపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. ‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్కు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని, తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్లో ఉన్నారు: బండి సంజయ్ -
2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’నివేదికలో పేర్కొంది. మార్కెట్ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది. బడ్జెట్లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్ బడ్జెట్) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికలోని అంశాలివీ.. ► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. ►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. ► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. ► బడ్జెట్ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. ► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. ► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే. అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి ఇసుక వెలికితీతలో టీఎస్ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్’పేర్కొంది. టీఎస్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్ లీజ్కు అప్పగించడంతో.. థర్డ్ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది. -
మాకు కొట్లాట కొత్తేం కాదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. పరస్పర ఆరోపణల మొదలు.. అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలు వాడే భాష దాకా.. విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాటి పరిణామాలు మరింత నాటకీయంగా సాగాయి. పదేళ్లపాటు అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. తొలిసారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు. Yesterday’s protest in Assembly brought back memories of Telangana Agitation Days మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై… pic.twitter.com/Zn1IidXhQS — KTR (@KTRBRS) February 15, 2024 -
ఇది కంచెల రాజ్యం
సాక్షి, హైదరాబాద్: సభలో మాట్లాడన్విరు.. అసెంబ్లీ బయట కూడా మాట్లాడన్వివరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీలో వాకౌట్ చేసిన అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త నెలకొంది. ఆ ప్రాంతం భారీ ఎత్తున పోలీసులు, మార్షల్తో నిండిపోయింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీడియా పాయింట్లో మాట్లాడొద్దని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం.. పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. మీడియా పాయింట్కు వెళ్లే దారి మధ్యలో నేలపై కూర్చొని నినాదాలు చేశారు. చివరిగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు చెప్పినా ఒక్కటే.. గోడకు చెప్పినా అక్కటే అంటూ’’ అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. రేవంత్ చెప్పేదొకటి.. చేసేదొకటి: కడియం, పల్లా, వేముల అంతకుముందు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కంచెలు తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కంచెలెందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి బయట ఒకటి చెబుతున్నారని, అసెంబ్లీలో ఒకటి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు అనీ, అలాంటి ప్రాంతంలో నియంత్రణ ఎలా పెడతారని నిలదీశారు. రాజగోపాల్రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాష గా చెప్పుకుంటున్నాడని, తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని విమర్శించారు. రెండు నెలల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని, అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదని, ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సచ్చిన పామును మళ్లీ చంపుతారా?
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం దోపిడీ బయటపడు తుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కేసీఆర్ను చంపుతారా అంటూ మాట్లాడుతున్నారని, ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘ఇప్పటికే సచ్చిన పామును మళ్లీ ఎవరైనా చంపుతారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆ పామును చేతితో కాదు కట్టెతో కొట్టారు. ఆల్రెడీ చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేం ఉంది?’ అని వ్యాఖ్యానించారు. సానుభూతి కోసం కేసీఆర్ వీల్చైర్, వీధినాటకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సభలో చ ర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడాలన్నారు. బుధవారం అసెంబ్లీలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య బడ్జెట్పై వాదోపవాదాలు జరుగుతుండగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. కేసీఆర్ను సభకు రమ్మనండి ‘సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్ర వేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ పారిపోయి ఫామ్హౌస్లో పడుకుని, అక్కడెక్కడి కో పోయి ప్రగల్భాలు ఎందుకు? సభకు రమ్మనండి..వాస్తవాలపై చర్చిద్దాం..అన్ని అంశాలపై మాట్లా డదాం. అలా కాదు కాళేశ్వరంపైనే చర్చిద్దామంటే అందుకు కూడా స్పీకర్ విడిగా సమయం కేటాయి స్తే చర్చకు సిద్ధం. మేడిగడ్డ మేడిపండు మాదిరిగా కుంగిపోతే, అక్కడ నీళ్లు నింపే అవకాశముందా? కేసీఆర్, హరీశ్రావు సాగునీటి శాఖ మంత్రులుగా పనిచేశారు కదా.. వారికే బాధ్యతలు అప్పగిస్తాం..వారే ఎలా మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లలో పోస్తారో బాధ్యత తీసుకోవాలి..’ అని రేవంత్ అన్నారు. నేటి సాయంత్రం దాకా చర్చకు సిద్ధం ‘బీఆర్ఎస్ఎల్పీ నేత అసెంబ్లీకి వస్తే..గురువారం సాయంత్రం దాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులపై, తెలంగాణ ప్రజలపై గౌరవంతో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నిస్తే.. అందరం కలిసి వెళ్లి ప్రాజెక్టులను పరిశీలించి వద్దామని అనుకున్నాం. అలా వెళితే అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. కానీ ఈ పర్యటనకు బీఆర్ఎస్ రాకపోగా, మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, వైఫల్యాలకు తామే బాధ్యత వహించాలి అన్నట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతు న్నారు. పదే పదే భాష గురించి మాట్లాడుతున్నారు. మంగళవారం నల్లగొండలో కేసీఆర్ మాట్లాడిన భాషపై సభలో చర్చిద్దామా? సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏమి పీకడానికి మేడిగడ్డ వెళ్లారంటూ మాట్లాడతారా? కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, ఎమ్మె ల్యేగా, ఎంపీగా, పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి నాలు గు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఓ సీఎంపై అలాంటి భాషను ఉపయోగిస్తారా? ఉద్యమకారు డిని అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏమి పీకడానికి వెళ్లారని నిలదీస్తారా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? గౌరవం? అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ను తెలంగాణ ప్రజలు ఊడ బెరికారు. మళ్లీ వస్తానంటే ఉన్న అంగీ కూడా ఊడబెరుకుతారు. బొక్క బోర్లాపడి బొక్కలు విరిగినా ఇంకా బుద్ధి మారలేదు..’ అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరినీ ఒకేవిధంగా చూడండి: కేటీఆర్ రెండురోజుల క్రితం రాజ్గోపాల్రెడ్డి మాట్లాడుతు న్నపుడు కడియం శ్రీహరి ఏవో వ్యాఖ్యలు చేశారని, వాటిపై రాజ్గోపాల్రెడ్డి బుధవారం స్పందించి ఉంటారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు చెప్పారు. దీంతో కడియం శ్రీహరిపై రాజ్గోపాల్రెడ్డి ఏదైనా అన్పార్లమెంటరీ భాష ఉపయోగించి ఉంటే వాటిని పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే తనపైనే కడియం అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజ్గోపాల్రెడ్డి అన్నారు. స్పీకర్పై తమకు అపార గౌరముందని, తాము ఏదైనా తప్పు మాట్లాడితే దానిని సవరించే అధికారం వారికుందని కేటీఆర్ చెప్పారు. అయితే అధికారపక్ష సభ్యులు తమను వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా సభాపతి ఏమీ అనడం లేదని అన్నారు. సభ్యులందర్నీ ఒకేవిధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం సత్యదూరమైన మాటలు చెబుతుంటే బాధతో ‘కూర్చో’ అన్నామే తప్ప ఆయన్ను అవమానించాలని కాదన్నారు. ‘కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు గాను ఒక్క బ్యారేజీలో ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. రైతులపై మాత్రం కోపం పెంచుకోకండి. కేసీఆర్పై కోపం ఉంటే ఆ ప్రాంత రైతాంగంపై కక్ష కట్టొద్దు. మేడిగడ్డ నింపండి. కాళేశ్వరంలో పంపింగ్ మొదలుపెట్టండి..’ అని కేటీఆర్ సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్పై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి పిలుపు -
Telangana Assembly: కేసీఆర్ ఎందుకు రాలేదంటే..
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన వచ్చి మాట్లాడినా, ఆయన స్థానంలో బీఆర్ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చకు బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు. కేసీఆర్ హాజరు కాలేకపోయినా, పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు. హరీశ్కు కేటీఆర్ అభినందన కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా అభినందించారు. అంశంపై పట్టులేని ముఖ్యమంత్రి రేవంత్, ఆయన సహచర మంత్రివర్గాన్ని హరీశ్రావు అద్భుతంగా ఒంటిచేత్తో ఎదుర్కొన్నారన్నారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అసత్య ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టి అపోహలు తొలగించారన్నారు. మంగళవారం జరిగే ‘చలో నల్లగొండ’సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను తిప్పి కొడతారని కేటీఆర్ పేర్కొన్నారు. -
నితీష్కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారని.. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి తమ బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లుగా పెడితే వాస్తవంగా వ చ్చినది రూ.2.20 లక్షల కోట్లేనని చెప్పారు. నీటిపారుదల శాఖ చేసిన అప్పులపై రూ.16 వేల కోట్లను వడ్డీ కింద కట్టాల్సి వస్తోందన్నారు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. శనివారం శాసనసభ వాయిదాపడ్డాక అసెంబ్లీలోని తన చాంబర్లో రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. ‘‘ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మొదట్లో నిషూ్టరంగా అనిపించినా.. మిగతా ఏడాదంతా వాస్తవాలు చెప్పవచ్చన్నదే మా ఉద్దేశం. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించేందుకు ఉన్న కాస్త సమయంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రయతి్నంచారు..’’అని వివరించారు. మేడిగడ్డకు అందరినీ ఆహ్వానిస్తున్నాం.. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శన కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను తీసుకెళతామని రేవంత్ చె ప్పారు. ‘‘బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ వస్తారా, ఇతరులను పంపుతారా అనేది వారి ఇష్టం. 13న నల్ల గొండలో బీఆర్ఎస్ సభ ఉన్నందున.. మరో తేదీన వస్తామని బీఆర్ఎస్ వాళ్లు చెప్పినా తీసుకెళ్లేందుకు మేం సిద్ధం. కాళేశ్వరంపై కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతాం. విజిలెన్స్ ప్రాథమిక విచారణ ఆధారంగా అధికారులపై చర్యలు చేపట్టాం. సాంకేతిక నిపుణుల బృందం నివేదిక, జ్యుడీషియల్ విచారణలో తేలే అంశాల ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపడతాం. ఇతర శాఖలపైనా సమీక్షించి మోతాదుకు మించి తప్పిదాలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం..’’అని రేవంత్ పేర్కొన్నారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై 12న వివరంగా చర్చిస్తామని తెలిపారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని, అవసరం లేకున్నా కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ‘అమరుల జ్యోతి’పైనా విచారణ! హుస్సేన్సాగర్ తీరాన నిర్మించిన అమరుల జ్యోతి, అంబేడ్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంచనాలు, చెల్లింపులు, నాణ్యతా లోపం మీద విచారణకు ఆదేశిస్తున్నామని రేవంత్ చెప్పారు. ‘‘అమరుల జ్యోతి దేనికోసం కట్టారో, అందులో ఏముందో తెలియదు. అద్భుతాల పేరిట తక్కువ ఖర్చులో పూర్తయ్యే పనికి ఎక్కువ ఖర్చు చేయడం సరికాదు. ఫార్ములా–ఈ రేసింగ్పై సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు అక్రమంగా భూములు కొనుగోలు చేసిన అంశంపై ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం..’’అన్నారు. గతంలో జాతీయ రహదారులు, గుట్టలు, సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని.. తాము సాగుచేసే రైతులు, కౌలుదారులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నామన్నారు. మహిళలకు లబ్ధి చేకూరే పథకాలను ముందుగా చేపడుతున్నట్టు వివరించారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఆరోగ్యభద్రత కార్డుకు రేషన్కార్డు లింక్ను వేరుచేస్తామని తెలిపారు. అసెంబ్లీ బీఏసీ భేటీకి హరీశ్రావును అనుమతించడం స్పీకర్ విచక్షణకు సంబంధించినదన్నారు. 2014లో టీడీపీ తనను బీఏసీకి నామినేట్ చేసినా ఎర్రబెల్లికి ఒక్కరికే అవకాశమిచ్చి తనను బయటికి పంపారని గుర్తు చేశారు. నేను మాట్లాడేది తెలంగాణ భాష విపక్ష నేతలను దూషిస్తున్నట్టుగా వస్తున్న విమర్శలపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఆ మాటల విషయానికి వస్తే.. నేను మాట్లాడుతున్నది తెలంగాణ భాషే కదా..’’అని వ్యాఖ్యానించారు. తనను కలసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనుమానించడం సరికాదన్నారు. తమ నేత జగ్గారెడ్డి చెప్పినట్టుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలనుకుంటే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement