సుపరిపాలన కోసం బీఆర్ఎస్కు మద్దతు తెలిపాలి
మెట్పల్లి: మున్సిపాలిటీల్లో సుపరిపాలన కోసం బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుతో కలిసి ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. తాగునీటితోపాటు ఇతర వసతులు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.


