సరిహద్దు పంచాయితీలు | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు పంచాయితీలు

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

● కొత్త గ్రామ పంచాయతీల్లోనే సమస్య ● వివాదాల్లో ‘వీడీసీ’ జోక్యం ● మరింత ముదురుతున్నాయని ఆరోపణలు ● ఇటీవల రాజేశ్వర్‌రావుపేట – చెర్లకొండాపూర్‌ గ్రామాల మధ్య మరోమారు సరిహద్దు వివాదం నెలకొంది. ● ఓ ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో తెరపైకి వచ్చిన సరిహద్దు వివాదం మరింత ముదిరింది. చెర్లకొండాపూర్‌వాసులు రాజేశ్వర్‌రావుపేటకు చెందిన పలువురిపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ● నాలుగురోజుల క్రితం ఏఎస్‌ఆర్‌ తండా–రామలచ్చక్కపేట గ్రామస్తులకు సరిహద్దు విషయంలో వివాదం ఏర్పడింది. ● ఇందుకు ఇసుక తవ్వకాలు, ఇతరత్రా ఆదాయ వనరులే ప్రధాన కారణమన్న ప్రచారం జరగుతోంది. ● తమ గ్రామ పరిధిలోని అటవీశాఖ భూములను ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని రామలచ్చక్కపేట గ్రామస్తులు ఏఎస్‌ఆర్‌తండావాసులపై ప్రజావాణిలో ఫిర్యాదు చేవారు. ● వరదకాలువ నుంచి ఇసుక తవ్వకాలు చేస్తూ తమ గ్రామం మీదుగా వాహనాలు వెళ్లడంతో రహదారులు పాడవుతున్నాయని, ఈ విషయంపై రామలచ్చక్కపేట వాసులతో చర్చించేందు కు వెళ్తే దాడికి యత్నించారని ఏఎస్‌ఆర్‌తండా వాసులు మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ● ఇవే కాకుండా గతంలో పెద్దాపూర్‌–రామారావుపల్లె గ్రామాల్లో భూముల విషయాల్లో వివాదం జరిగింది. ఇలా నూతన పంచాయతీల్లో సరిహ ద్దు పంచాయతీలు ఎటూ తేలక ఇబ్బందికరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మెట్‌పల్లి మండలంలో ఐదు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చెర్లకొండాపూర్‌, రామారావుపల్లె, పాటిమీదితండా, ఏఎస్‌ఆర్‌ తండా, కేసీఆర్‌తండా గ్రామాలను 2019లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో పాలనపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేనప్పటికీ సరిహద్దు విషయాల్లో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులపై ఫిర్యాదు

మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులు చెర్లకొండాపూర్‌ గ్రామస్తుల విషయంలో ఆంక్షలు విధించారని చెర్లకొండాపూర్‌ ప్రజలు మెట్‌పల్లి డీఎస్పీ రాములుకు ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లిలోని సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ కార్యాలయంలో బుధవారం డీఎస్పీని కలిసిన చెర్లకొండాపూర్‌ గ్రామస్తులు.. రాజేశ్వర్‌రావుపేట వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెర్లకొండాపూర్‌ ప్రజలకు రాజేశ్వర్‌రావుపేట గ్రామస్తులు పాలు పోయరాదని, కిరాణసరుకులు, చికెన్‌ విక్రయించరాదని, గేదెల కాపరిగా వెళ్లరాదని, చాయ్‌ పోయరాదని, ఏ విషయంలోనూ సహకరించరాదని, సహకరిస్తే రూ.5 వేలు జరిమానా విధించేలా తీర్మానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మెట్‌పల్లిరూరల్‌: కొత్త గ్రామ

పంచాయతీలను సరిహద్దు సమస్యలు

వెంటాడుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా గ్రామాలు అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నప్పటికీ.. కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. విలీనమైన, కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు సరిహద్దు విషయాల్లో వివాదాలు తలెత్తున్నాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదాలు ఏటూ తేలకపోవడం సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సరిహద్దు పంచాయతీల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు జోక్యం చేసుకోవడంతో మరింత ముదురుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement