రేబిస్ భయం..
మెట్పల్లిరూరల్: వేంపేట గ్రామస్తులకు రేబిస్ వ్యాధి భయం పట్టుకుంది. గ్రామంలోని ఓ గేదైపె కొద్ది రోజుల క్రితం వీధి కుక్క దాడి చేసింది. దీంతో అనారోగ్యానికి గురైన గేదెను యజమాని పశు వైద్యాధికారులకు చూపించగా.. రేబిస్ వ్యాధి సోకినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. గేదె పాలను గ్రామంలోని ఓ పాల కేంద్రానికి సరఫరా చేశారు. పలువురికి ఇంటింటికి వెళ్లి అందజేశారు. దీంతో ఆ గేదె పాలు తీసుకున్న వారందరిలో ఆందోళన నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 20 మందికి పైగా రేబిస్ నివారణ టీకాలు వేశారు. ఈ విషయంపై మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి క్రిములు ఏమైనా ఉంటే పాలను మరిగించే సమయంలో వేడి తీవ్రతకు చనిపోతాయని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.


