తప్పటడుగులు... రక్తపుమడుగులు! | - | Sakshi
Sakshi News home page

తప్పటడుగులు... రక్తపుమడుగులు!

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

తప్పట

తప్పటడుగులు... రక్తపుమడుగులు!

● ‘జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన చెందిన అదరవేని సత్తవ్వను ఆమె భర్త అదరవేని మల్లయ్య అనుమానంతో ఈనెల 8వ తేదీన హత్య చేశాడు. తల్లి మృతిచెందగా, తండ్రి జైలుకెళ్లాడు. దీంతో ఇద్దరు పిల్లలు ఒంటరివారయ్యారు. ● ‘జగిత్యాల రూరల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ధర్మపురి మండలంలోని ఒక కూతురు ఉన్న వివాహితను ప్రేమపేరుతో తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చిన్నారి పాపను తండ్రికి అప్పగించి, వివాహితను ప్రియునితో పంపించారు. దీంతో ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఈనెల 18న అర్ధరాత్రి వివాహిత తండ్రి, బంధువులు ఆమెను తీసుకెళ్లేందుకు రాగా, వారిపై కత్తితో దాడిచేశాడు. దీంతో వారికి బలమైన గాయాలు కాగా.. పోలీసులు మాత్రం నామమాత్రపు కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు వివాహితను రెండు రోజుల క్రితమే వివాహం చేసుకున్నాడు. దీంతో చిన్నారి తల్లిలేకుండా బిక్కుబిక్కుమంటోంది.’

విచ్ఛిన్నమవుతున్న ‘బంధాలు’ దారితప్పుతున్న పోలీసులు కక్షలతో పోతున్న ప్రాణాలు జిల్లాలో వరుస ఘటనలతో ఆందోళన

‘ఈనెల 14న జగిత్యాలరూరల్‌ మండలం పొరండ్లకు చెందిన ఓ యువకుడు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ కుటుంబంలో గొడవ జరిగింది. ఆ వివాహిత భర్తను వదిలిపెట్టి ప్రియుని కోసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు మహిళకు ప్రియుడిని అప్పగించారు. కోపోద్రిక్తుడై ఆమె భర్త ఈనెల 14న జగిత్యాలలోని బైపాస్‌రోడ్‌లో ఆ యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో భర్త జైలుకు వెళ్లగా, పిల్లలిద్దరూ అభాగ్యులుగా మారారు.’

జగిత్యాలక్రైం: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఉంటామని చేసే బాసనే పెళ్లి. అయితే ఇటీవల బంధాలు బలహీనమవుతున్నాయి. ఆకర్షణకు లోనై శాశ్వతమైన బంధాలను తెంపేసుకుంటున్నారు. క్షణికావేశంలో చే స్తున్న పనులకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు ఒంటరివారిగా మిగిలిపోతున్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి సక్రమార్గంలో నడిపించాల్సిన పోలీసులు సై తం విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది.

పోలీసుల తీరు వివాదాస్పదం

కుటుంబ తదాగాదాలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్న బాధితులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాలను చక్కదిద్దాల్సి ఉండగా.. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో విడిపోతున్నారు. జిల్లా కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు సఖీ కేంద్రంతోపాటు భరోసా కేంద్రాలు ఉన్నా కలహాల కాపురాలుగానే మిగిలిపోతున్నాయి. ఠాణాలకు వచ్చిన వారిని కౌన్సెలింగ్‌ కోసం పోలీసులు ఈ కేంద్రాలకు పంపించడం లేదు.అయితే ఠాణాలను ఆశ్రయిస్తున్న వారిలో చాలా మంది కౌన్సెలింగ్‌కు ముందుకురావడం లేదని పలువురు పోలీసులు చెబుతున్నారు.

దూరమవుతున్న బంధాలు

జిల్లాలో చాలా కుటుంబాలు చిన్నచిన్న తదాగాలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరమవుతున్నారు. దీంతో వారే కాకుండా వారి పిల్లలు కూడా కుటుంబ తగాదాలతో మానసికంగా కుంగిపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేకపోవడంతో ఆ కుటుంబాలు తరచూ గొడవలతో విచ్ఛిన్నమవుతున్నాయి.

రోడ్లపైనే డంపు.. పట్టదా కంపు!

తప్పటడుగులు... రక్తపుమడుగులు!1
1/1

తప్పటడుగులు... రక్తపుమడుగులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement