దేవ్జీ, సంగ్రామ్, మరో పాతిక మంది
మధ్యవర్తుల సంప్రదింపులు
కోరుట్ల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మరో పాతికమంది కీలక మావోయిస్టు నేతలు రెండు రోజుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక నేత సమక్షంలో లొంగిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జైళ్లలో ఉన్న మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం ఇచి్చ...మొదటగా ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టు నేతలు ఇతరత్రా పెద్దగా షరతులు పెట్టకుండా, జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు తమ భద్రతా సమస్యలపై భరోసా విషయంలో సంపూర్ణమైన హామీ కోసం ప్రయతి్నస్తున్నట్టు సమాచారం.
మధ్యవర్తులెవరు..!?
దేవ్జీ, సంగ్రామ్లకు, ఎస్ఐబీ స్పెషల్ టీంకు మధ్యవర్తులుగా తెలంగాణలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌరహక్కుల నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరితో రాష్ట్రానికి చెందిన ఓ కీలకనేత టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని ఓ సేఫ్జోన్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కర్రె గుట్టల్లో మళ్లీ ఆపరేషన్ మొదలు కావడం కలవరం రేపుతోంది. ఈ లెక్కన అజ్ఞాతంలో ఉన్న కీలక మావోయిస్టు నేతలపై ఓ వైపు ఒత్తిడి పెంచుతూ.. మరోవైపు సంప్రదింపుల ప్రక్రియ సాగించే వ్యూహం కొనసాగుతున్నట్టు తెలిసింది.
వారం రోజులుగా సంప్రదింపులు సాగుతున్నట్టు తెలుస్తుండగా ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. కాగా, లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్న పాతికమంది మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నారా? లేదా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. మొత్తం మీద మరో రెండు మూడు రోజుల్లో పాతికమంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో లొంగిపోవడం ఖాయమని..వారు ఎవరెవరు అన్న విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


