వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు చేశారు. ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 8న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. 9న అవబృత స్నానం, ఏకాదశ ఆవరణాలతో శివకళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. యాగశాలలో అర్చకులు, వేద పండితులకు వర్ని సమర్పించారు.
రాజన్నకు ఏకాంత సేవలు
ప్రచారరథం ముందు ప్రత్యేక పూజలు
రాజగోపురం ముందు హోమాలు


