9వ వార్డులో అమృత్ 2.0 పథకం కోసం కాంట్రాక్టర్ రోడ్లను తవ్వాడు. రోడ్లపై ఉన్న మట్టిని తొలగించలేదు. పైప్లైన్కు మరమ్మతు చేయలేదు. కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కాలనీవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్లు, కూలీల సహకారంతో సీసీరోడ్లపై ఉన్న మట్టిని తొలగించాం.
– బత్తిని మహేశ్వరి, 9వ వార్డు కౌన్సిలర్
చర్యలు తీసుకుంటాం
పట్టణంలో అమృత్ 2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి పనులు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. అలాగే రాయికల్ పట్టణంలో 20 గుంటల స్థలం ఇవ్వడానికి రైతులు విముఖత చూపడం కూడా మా దృష్టికి వచ్చింది.
– నాగరాజు, మున్సిపల్ కమిషనర్


