మీదే పురతర బాధ్యత!
● బల్దియాల్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఏళ్లకాలంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు
● పరిష్కారానికి నగర, పట్టణ ప్రజల ఎదురుచూపులు ● నూతన పాలకవర్గంపై కొండంత ఆశలు
పట్టణాలు, నగరాలుగా మారుతున్నా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మట్టిరోడ్లు. ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పూర్తికాని డ్రైనేజీలు.. కంపుకొడుతున్న ఖాళీ ప్రదేశాలు.. రహదారులపై పారుతున్న మురుగునీరు.. వెంబడిస్తున్న కుక్కలు.. ఇళ్లలోకి చేరి రచ్చ చేస్తున్న కోతులు.. రోగాలు తెచ్చిపెడుతున్న డంపింగ్ యార్డులు.. ఇలా వందలాది సమస్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరాలు, పట్టణాల ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. పరిష్కరించాల్సిన పాలకులు ఇన్నాళ్లూ పట్టించుకోకపోగా.. నూతన పాలకవర్గాలు, మేయర్లు, చైర్మన్లపైనే ఆయా ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. – వివరాలు IIలోu
ఇది జిల్లా కేంద్రంలోని యావర్రోడ్డు. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు మారినా ఈ రోడ్డు దుస్థితి మారడం లేదు.
మీదే పురతర బాధ్యత!


