● అదనపు కలెక్టర్ బీఎస్.లత
మల్యాల: జాతీయ రహదారి 563 విస్తరణలో భూములు కోల్పోతున్న మండలంలోని రాజారం గ్రామస్తులతో అదనపు కలెక్టర్ బీఎస్.లత గ్రామసభ నిర్వహించారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారి సందేహాలు నివృత్తి చేశారు. బాధితుల జాబితా తయారు చేశామని, భూ విస్తీర్ణాన్ని బట్టి పరిహారం చెల్లిస్తామని, బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం విజయ్, తహసీల్దార్ వసంత, ఆర్ఐ తిరుపతి, కార్యదర్శి ఉపేంద్ర, ప్రజలు పాల్గొన్నారు.


