ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈనెల 25 నుంచి ప్రారంభం విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల వరకే చేరుకోవాలి ప్రత్యేక కారణాలుంటేనే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి జిల్లావ్యాప్తంగా 30 కేంద్రాల్లో పరీక్షలు సీసీ కెమెరాలతో నిఘా ‘సాక్షి’తో ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ
జగిత్యాల: ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈసారి 30కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాలు నిఘా వేయనున్నాయి. విద్యార్థులందరూ ఉదయం 8.45గంటలకే కేంద్రాలకు చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే మాత్రం 9.05గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు


