వృథాగా.. భగీరథ నీరు
మెట్పల్లి: పట్టణ పరిధిలోని వెంకట్రావ్పేటలో జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ నుంచి వృథాగా పోతున్న నీరు ఇది. ఐదు రోజుల క్రితం పైపులైన్కు లీకేజీలు ఏర్పడడంతో అక్కడి నుంచి భారీగా నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీలకు సోమవారం నుంచి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు.. 25 తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆరు నెలల్లో వెంకట్రావ్పేటలోనే మూడు, నాలుగు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. తరచుగా ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతుండడం.. వాటికి మరమ్మతులు చేపట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు లీకేజీలతో కలుషిత నీరు సరఫరా కావడం, రోజుల తరబడి సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.


