సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జీవన్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


