ధర్మపురి: మండలంలోని తీగలధర్మారం గీతాశ్రమంలో గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గీతాశ్రమ అధ్యక్షుడు వేముల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్, గంధం రమేశ్, ఎన్నం బాపురెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు
కథలాపూర్: మండలంలోని చింతకుంటలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోర్కెలు తీర్చే స్వామి అంటూ భక్తులు అగ్నిగుండంలో నడిచారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు.


