అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

అగ్ని

అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం

హొసపేటె: తాలూకాలోని మలపనగుడి తండాలో శనివారం ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌ నాయక్‌కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గుడిసెలో ఉన్న టీవీ, సోఫా, వార్డ్‌రోబ్‌లోని బట్టలు, పిల్లల వెండి బ్రాస్‌లెట్లు, గొలుసులు, 20 గ్రాముల బంగారం, పిల్లల పుస్తకాలు, ఒక ద్విచక్ర వాహనంతో సహా ఇంట్లోని వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. లక్ష్మణ్‌ నాయక్‌, తులసీ బాయి దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. స్థానికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం 1
1/1

అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement