స్వచ్ఛ సంకల్పం.. యువత శ్రమదానం
రాయచూరు రూరల్: పురాతన కాలం నాటి బావులను సంరక్షించాలనే సదాశయంతో యువకులు కళ్యాణిని శుభ్రం చేసిన ఘటన చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా హుణిసిగిలో పాడుబడిన బావిలో పెరిగిన ముళ్ల కంపచెట్లు, ఆకు పచ్చని మొక్కలు ఇతరత్ర పేరుకున్న చెత్తాచెదారాన్ని యాదగిరి యువ బ్రిగేడ్ ఆధ్వర్యంలో హుణిసిగిలోని దేవర దాసిమయ్య తీర్థ క్షేత్రం స్వచ్ఛతకు మంజునాథ్ ముందుకు వచ్చారు. ఆదివారం 15 మందితో కూడిన యువ బ్రిగేడ్ సభ్యులు కలసి కళ్యాణిలో ఉన్న వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. పురాతన కాలం నాటి దేవర దాసిమయ్య తీర్థ కళ్యాణి పుష్కరిణిని చూడచక్కగా తీర్చిదిద్దారు.
హుణిసిగిలో పాడుబడిన బావిని శుభ్రపరిచిన వైనం
స్వచ్ఛ సంకల్పం.. యువత శ్రమదానం


